Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్‌ | DGCA Serious On Air India Serial Incidents Latest News | Sakshi
Sakshi News home page

Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్‌

Jun 17 2025 3:49 PM | Updated on Jun 17 2025 4:13 PM

DGCA Serious On Air India Serial Incidents Latest News

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది.

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. 

ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. బోయింగ్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్‌ చీఫ్‌కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్‌-లండన్‌ సర్వీస్‌ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్‌ సర్వీస్‌ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అదే రూట్‌.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement