breaking news
DGCA
-
ఇండిగో సంక్షోభం నలుగురు అధికారులు సస్పెండ్
-
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
విమానయన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. గడిచిన పది రోజుల్లో ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి అంతటికీ బాధ్యులను చేస్తూ నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను (ఎఫ్ఐఓ) ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం సస్పెండ్ చేసింది.సస్పెండ్ అయిన ఈ నలుగురు అధికారులు విమానయాన భద్రత, పైలట్ శిక్షణ, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు ఏవియేషన్ రెగ్యులేటర్ ముందు హాజరవుతున్న తరుణంలోనే అధికారుల సస్పెన్షన్ జరగడం గమనార్హం.విమానాల అనూహ్య రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వేల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శుక్రవారం రోజున అత్యధికంగా 1,600కి పైగా విమానాలు రద్దు కావడం అత్యవసర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. -
ఇండిగోకు DGCA షాక్
-
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఇండిగోపై కేంద్రం తొలి వేటు!
ఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో ఐదు శాతం కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకూ తగ్గనున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు మరిన్ని విమాన సర్వీసుల రద్దుకు దారితీయడం గమనార్హం.నిన్న మొన్నటి వరకు ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 2200 సర్వీసులను నడిపేది. ఎయిర్పోర్టుల్లో ఇండిగో, తదితర సంస్థలు ఎన్నిసార్లు టేకాఫ్/ల్యాండింగ్లు జరిపేందుకు ఉన్న అనుమతుల సంఖ్యనే స్లాట్లు అంటాం. ఉదాహరణకు హైదరాబాద్ విమానాశ్రయంలో 24 గంటల సమయంలో ఇండిగోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుంటే.. ఆ సంస్థ ఈ సమయంలో యాభై చోట్లకు సర్వీసులు నడపవచ్చు. డీజీసీఏ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐదు శాతం స్లాట్లు తగ్గుతాయి కాబట్టి ఇకపై ఇండిగో హైదరాబాద్ నుంచి సుమారు 47 చోట్లకు మాత్రమే సర్వీసులను నడపగలదన్నమాట.Negative for Indigo DGCA orders Indigo to reduce flights by 5%. pic.twitter.com/BNxDFOcJZh— Yatin Mota (@yatinmota) December 9, 2025తగ్గించిన ఐదు శాతం స్లాట్లు ఏమవుతాయి?డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం వీటిని ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్జెట్ వంటి ఇతర సంస్థలకు కేటాయిస్తారు. స్లాట్ల తగ్గింపు నేపథ్యంలో ఇండిగో మంగళవారం చెన్నైలో అత్యధికంగా 41 విమానాలను రద్దు చేసింది. వీటిల్లో 23 ల్యాండింగ్స్ ఉన్నాయి. 18 టేకాఫ్లు ఉన్నాయి. తిరువనంతపురం, ఢిల్లీ, ముంబైలలోనూ ఒకటి అర సర్వీసుల రద్దు ఉన్నాయి. ‘‘స్లాట్ల తగ్గింపు చర్యల వల్ల వైమానిక సంస్థల బాధ్యత మరింత పెరుగుతుంది. షెడ్యూల్స్ నిర్వహణ మరింత మెరుగవుతుంది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం తగ్గుతంది.’’ అని డీజీసీఏ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.ఇతర సంస్థలకు లాభం.. ఇండిగో స్లాట్లలో కోత ఇతర సంస్థలకు లాభదాయకంగా మరనుంది. చాలా బిజీగా ఉన్న ఎయిర్పోర్టుల్లోనూ తమ సర్వీసులను నడిపేందుకు అవకాశం కల్పిస్తుండటం ఇందుకు కారణం. అదే సమయంలో దేశీయంగా సుమారు 60 శాతం వాటా కలిగిన ఇండిగోకు స్లాట్ల కోతతో పడే ప్రభావం కూడా నామమాత్రమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించబోమన్న సందేశం మాత్రం ఇండిగోకు అందుతుందని అంచనా. స్లాట్ల కోతపై ఇండిగో ఇప్పటివరకూ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాకపోతే మరిన్ని క్రమశిక్షణ చర్యల నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఒక అదనుగా తీసుకుంటుందని, షెడ్యూళ్ల సమీక్ష, గ్రౌండ్ సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్లాట్ల కోత కారణంగా కొన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణీకులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
తప్పని తిప్పలు
న్యూఢిల్లీ/ముంబై: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సైతం 562 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్టులో ఇండిగో విమానాల రద్దు పర్వం ఏడోరోజూ కొనసాగింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో 250కిపైగా విమానాలు, బెంగళూరులో 150 ఇండిగో విమానసర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్లో 112, ముంబైలో దాదాపు 100, చెన్నైలో 56 విమానాలు రద్దయ్యాయి. వందల విమానాల రద్దుతో కీలక నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో అప్పటికే చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కీలకమైన శస్త్ర చికిత్సలు, పెళ్లిళ్లు, బిజినెస్ మీటింగ్లు, విహార యాత్రల కోసం టికెట్ బుక్చేసుకుని పిల్లాపాపలతో వచ్చిన వందలాది మంది ప్రయా ణికులు సోమవారం సైతం విమానాశ్రయాల్లో చేదు అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో హడావుడిగా వేరే కంపెనీల విమానాల కోసం రెట్టింపు ధరలకు టికెట్లు కొనాల్సిన దురవస్థను ఏడో రోజూ విమానప్రయాణికులు ఎదుర్కొన్నారు.అస్పష్ట వివరణ ఇచ్చిన ఇండిగోవందల విమానాల రద్దుకు కారణాలను సోమవారం సాయంత్రంకల్లా చెప్పాలంటూ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఓఓ ఇసిడర్ పోర్వెరస్లకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి స్పందనగా పీటర్, ఇసిడర్లు సోమవారం ఒక వివరణను ఇచ్చారు. అస్పష్టంగా చేతులు దులిపేసుకునే ధోరణిలోనే ఆ వివరణ ఉండటం గమనార్హం. ‘‘ చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్యకు అంకురార్పణ జరిగింది. శీతాకాలపు ప్రయాణికుల రద్దీతో మేం మార్చేసిన షెడ్యూల్, విపత్కర వాతావరణ పరిస్థితులు, రెండో దశవిమాన విధుల కాల పరిమితి(ఎఫ్డీటీఎల్) నిబంధనల అమలుతో పైలట్ల రోస్టర్ విధానం సమగ్ర అమలులో వైఫల్యాలు.. ఇవన్నీ జత కలిసి డిసెంబర్ తొలి వారంలో మా విమానరాకపోకల రేటింగ్ను కిందకు దిగజార్చాయి. మొత్తం ఉదంతానికి సంబంధించిన అసలు కారణాలను ఇప్పుడే చెప్పలేం. అయినా డీజీసీఏ సూచించిన ఎఫ్డీటీఎల్ నిబంధనలు మాకు పెద్ద సవాల్గా నిలిచాయి. దీంతో గతిలేక డిసెంబర్ ఐదో తేదీన అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాం. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీబూట్ చేశాం. దీంతో వందలాది విమానాలను రద్దుచేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నాం. మా కంపెనీ కార్యకలాపాలు ఎంతో సంక్లిష్టమైన, విస్తృతమైన స్థాయిలో ఉంటాయి. అందుకే సమగ్ర స్థాయిలో మూల కారణాల విశ్లేషణ(రూట్ కాజ్ అనాలసిస్) చేయడానికి మాకు మరికొంత సమయం కావాలి. డీజీసీఏ జారీచేసిన షోకాజ్ నోటీస్ ప్రకారం చూసినా మేం ప్రతిస్పందన తెలియజేసేందుకు 15 రోజుల గడువు ఇంకా ఉంది.’’ అని పీటర్, ఇసిడర్ వివరణ ఇచ్చారు. ఈ పొడిపొడి వివరణతో డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తగు చర్యలు తీసుకుంటాం: డీజీసీఏ‘‘షోకాజ్ నోటీస్కు స్పందనగా ఇండిగో ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నాం. తలబిరుసుతనంతో చేయాల్సిందంతా చేసేసి మొసలి కన్నీరు కార్చినట్లుగా ఈ వివరణ ఉంది. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు కారణాలు తెలిశాక కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇండిగో వివరణను కూలంకషంగా పరిశీలిస్తున్నామని డీజీసీఏ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరణతో అసంతృప్తిగా ఉన్న డీజీసీఏ నలుగురు సభ్యుల ప్యానెల్.. ఇండిగో సీఈఓ, సీఓఓలను బుధవారం నేరుగా తమ ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని కోరాలని భావిస్తోంది.సగం బ్యాగులు వెనక్కిచెకిన్ సందర్భంగా ప్రయాణికుల నుంచి అందుకున్న వేలాది బ్యాగులను తిరిగి అప్పగించే పనిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసున్నట్లు ఇండిగో ప్రకటించింది. 9,000 బ్యాగులను తీసుకున్నాం. వీటిలో ఇప్పటికే 4,500 లగేజీ బ్యాగులను తిరిగి ఇచ్చేశాం. వచ్చే 36 గంటల్లోపు మిగతా బ్యాగులనూ ముట్టచెప్తాం. ఇప్పటిదాకా టికెట్ల బుకింగ్కు సంబంధించి రూ.827 కోట్ల నగదును రీఫండ్ చేశాం. నవంబర్ 21–డిసెంబర్ 7 తేదీల మధ్య 9,55,591 టికెట్లను రద్దుచేశాం ’’అని ఇండిగో సోమవారంపేర్కొంది. -
ఆరో రోజు 650 విమానాలు
ముంబై: ఇండిగో సంక్షోభం ఆరో రోజు సైతం కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే మరో 650 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 118, ముంబైలో 121 విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం, శనివారంతో పోలిస్తే పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చినట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. అయితే ఆరో రోజు ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. విమానాల సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపించాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మొత్తం 2,300 విమానాలకుగాను ఆదివారం 1,650 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 10వ తేదీ కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి. ప్రయాణికులతోపాటు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇండిగో యాజమాన్యం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి నడుం బిగించింది. ఇండిగో సిబ్బందిని ఉద్దేశించి సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కో అడుగు వేసుకుంటూ సాధారణ స్థితికి చేరుకుంటున్నామని తెలిపారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్(సీఎంజీ)ను ఏర్పాటు చేసింది. ఇండిగో విమానాల రాకపోకలకు సంబంధించి తాజా పరిణామాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. త్వరలో పార్లమెంటరీ కమిటీ విచారణ! ఇండిగో సంక్షోభంపై ఆ సంస్థ ప్రతినిధులతోపాటు డీజీసీఏ అధికారులను, విమానయాన శాఖ అధికారులను పిలిపించి విచారించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయించింది. త్వరలో వారికి సమన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని పట్ల సంజయ్ ఝా నేతృత్వంలో రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయా అధికారులను పిలిపించి ప్రశ్నించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభానికి మూల కారణాలపై విశ్లేషణ ప్రారంభించినట్లు ఇండిగో వర్గాలు పేర్కొన్నాయి. రాజస్తాన్ పర్యాటకానికి ఎదురుదెబ్బ రాజస్తాన్కు ప్రతిఏటా డిసెంబర్లో పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఇండిగో సంక్షోభం వల్ల గత ఆరు రోజులుగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విమానాలు అందుబాటులో లేక పర్యాటకులు రావడం లేదు. చాలామంది తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. కొందరు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పర్యాటకులు రాకపోవడంతో చాలా నష్టపోతున్నాయని రాజస్తాన్లోని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాలు, రవాణా రంగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులే జీవనాధారం. ఇండిగో విమానంలో పావురం కలకలం ఇండిగో విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో అందులో పావురం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి వడోదరకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిగ్గా టేకాఫ్కు ముందు పావురం విమానంలో ఎగరడం చూసి ప్రయాణికులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. వారి చేతికి చిక్కకుండా చాలాసేపు అటుఇటూ ఎగురుతూ కనిపించింది. బయటపడేందుకు ప్రయత్నించింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి, ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. దీనిపై నెటిజట్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండిగోకు బ్యాడ్టైమ్ కొనసాగుతోందని కొందరు పేర్కొన్నారు. పావురానికి ‘బర్డింగ్ పాసు’ ఉంది కాబోలు, అందుకే లోపలికి వచ్చిందని ఒకరు చమత్కరించారు. ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ రద్దయిన, ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం శనివారం నాటికి రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే బ్యాగేజీని కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. ప్రయాణికులకు టిక్కెట్ల సొమ్మును ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా చెల్లించాలని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించి సంగతి తెలిసిందే. అలాగే బ్యాగేజీని 48 గంటల్లోగా అందజేయాలని పేర్కొంది. సంక్షోభంపై వివరణ ఇవ్వడానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కిరస్కు మరికొంత సమయం ఇవ్వాలని డీజీసీఏ ఆదివారం నిర్ణయించింది. సోమవారం సాయంత్రంకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
పైలట్ల నియామక చర్యలు షురూ..
భారతదేశపు అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.పైలట్ల నియామకానికి ప్రణాళికలుకొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.విశ్లేషకుల హెచ్చరికఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్డీటీఎల్ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్లైన్స్లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్పై పూర్తి వేవర్లను ప్రకటించింది.డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశంనవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
Flight Cancellations: నిన్న శంషాబాద్.. నేడు విశాఖ అసలేం జరుగుతోంది?
-
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ : ఉన్నత స్థాయి విచారణ
ఇండిగో సంక్షోభం కేంద్రం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదనకమిటీ విచారణఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. -
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా.. -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికుల కొరకు కంట్రోల్ రూమ్ నంబర్ 011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలురద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.ఏమి జరిగింది?గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది. -
ఇండిగోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గగనతల ప్రయాణాలపై గందరగోళం కొనసాగుతున్న వేళ.. ఇండిగోకు భారీ ఊరట దక్కింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి ఇచ్చే ఏవియేషన్ న్యూ రూల్స్ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడి ప్రయాణాలు సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(FDTL) పేరిట.. పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసింది డీజీసీఏ. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్లైన్స్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే పైలట్ల కొరతలో ఉన్న ఇండిగోకు ఇది మరింత చిక్కుల్ని తెచ్చి పెట్టింది. పైలట్ల కొరత కారణంగా గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో..డీజీసీఏ ఇండిగో నుంచి వివరణ కోరింది. అయితే పరిస్థితుల ప్రభావం, ఇండిగో నుంచి వివరణ.. రూల్స్ విషయంలో మినహాయింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.నాలుగు రోజుల్లో..నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనల్లో.. పైలట్లు రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని డీజీసీఏ ఆదేశించింది. రోజులో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. రాత్రి పూట ఫ్లైయింగ్, ల్యాండింగ్ విషయంలోనూ కఠిన నిబంధనలు తెచ్చింది. వీటితో పాటు ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కానీ, రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో ఎయిర్లైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రూల్స్ను తక్షణమే ఉపసంహరించుకుంది.డీజీసీఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం విమాన పైలెట్లకు వారంలో కనీసం 48 గంటల విశ్రాంతినివ్వాలి. దీన్ని సెలవులకు ప్రత్యామ్నాయంగా వాడటం కుదరదు. అయితే ఇండిగో విమానాల మూకుమ్మడి కేన్సిలేషన్ నేపథ్యంలో డీజీసీఏ ఈ నిబంధనను సడలించింది. కాకపోతే నెల రోజుల్లో ఒక పైలెట్ గరిష్టంగా విమానం నడపగల గంటలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విమాన సిబ్బందిపై పని ఒత్తిడిని అంచనా వేసేందుకు విమానయాన సంస్థలు తగిన పద్ధతులను అభివృద్ధి చేయాలని కూడా డీజీసీఏ తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది.వరుస నైట్డ్యూటీలను తప్పించేలా రోస్టర్లను తయారు చేయాలని సూచించింది. పైలెట్ల విషయానికి వస్తే వీరి ఒత్తిడిని గుర్తించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు ఇండియో విమానాలు రద్దయ్యాయి. లేదంటే వాయిదా పడ్డాయి. చౌక విమానయాన సంస్థ కావడంతో సిబ్బందిని అతి తక్కువగా ఉంచుకుందీ సంస్థ. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్గుఆ తాము కొత్త నిబంధనలను రూపొందించినట్లు డీజీసీఏ చెబుతూండగా.. అకస్మాత్తుగా వీటిని అమలు చేయాల్సి రావడం సమస్యలకు దారితీసిందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. -
ఇండిగో చరిత్రలో చెత్త రికార్డు.. ఒక్కరోజే 550 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు. సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. సమయానికి రాకపోకలను సూచించే ఆన్టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.ఫిబ్రవరి 10దాకా ఇంతేసమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది. -
కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది.బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యం అని ఇండిగో ప్రకటించింది.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే..నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ/FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించినట్లు వివరించారు. -
IndiGo: భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. ఏంటా కొత్త రూల్స్.. ?FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్లైన్స్ తమ షెడ్యూల్లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది. ఇలాగే ఇంకొన్ని గంటలురెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
200 ఇండిగో విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, అననుకూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇండిగో సంస్థ దేశంలో 2,200 విమానాలను నడిపిస్తోంది. మంగళవారం 1,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం 200 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు, ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలతో చెక్–ఇన్ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారు. మరో 48 గంటలు ఇదే పరిస్థితి! రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. మరో 48 గంటలపాటు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. డీజీసీఏ దర్యాప్తు ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోర చెప్పాలని సూచించినట్లు వివరించారు. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్బస్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్బస్ ఏ320 విమానాల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.అప్గ్రేడ్ వివరాలుఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్గ్రేడ్ పూర్తి చేసింది.ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: 25 విమానాల్లో 23 అప్గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్ చేయనున్నారు.సమస్య ఏమిటి?ఎయిర్బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్లైన్స్కు తక్షణ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా? -
ఇండియాకు బూడిద మేఘాలు : డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.DGCA కీలక ఆదేశాలువిమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది. -
విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..
ఒకప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించి.. అప్పులపాలైపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అతి తక్కువ కాలంలో ప్రపంచ స్థాయి సేవలను అందించిన ఈ సంస్థ ఎందుకు కుప్పకూపీలిపోయింది?, విజయ్ మాల్యా ఎందుకు విదేశాలకు పారిపోయారు అనే విషయాలు చాలామందికి తెలుసుండక పోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు..కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్యూబీ గ్రూప్ బాస్ అయిన విజయ్ మాల్యా.. కింగ్ఫిషర్ బీర్, మెక్డోవెల్స్ అనే ప్రముఖ మద్యం బ్రాండ్స్ కూడా నిర్వహిస్తూ, రాజభోగాలు అనుభవించేవారు. 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో విమానయాన సేవలు ప్రారంభించారు. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. విమానాల్లో లగ్జరీ సౌకర్యాలు, గ్లామర్ ప్రమోషన్స్, మోడల్-హోస్టెస్లతో.. ఎయిర్లైన్స్ గ్లామర్ బ్రాండ్గా నిలిచింది.డెక్కన్ ఎయిర్లైన్స్ కొనుగోలులగ్జరీ సౌకర్యాలు అందించడం వల్ల.. ఆపరేటింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడం.. జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్జెట్ వంటి సంస్థలు తక్కువ ధరలకే టికెట్స్ విక్రయించడం వల్ల కింగ్ఫిషర్ నష్టాలను చూడాల్సి వచ్చింది. 2008లో డెక్కన్ ఎయిర్లైన్స్ కొనుగోలు చేయడం కూడా కంపెనీ(కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్)పై పెద్ద భారాన్ని మోపింది. దీంతో సంస్థలు ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయాయి.పెరిగిన అప్పు2012 నాటికి విజయ్ మాల్యా సారథ్యంలో ఉన్న ఎయిర్లైన్ అప్పు ఏకంగా రూ. 9000 కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేకపోయారు. ఆదాయ మార్గాలు కనిపించలేదు. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. ఆ తరువాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడటంతో.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును చెప్పించలేకపోయారు. దీంతో విజయ్ మాల్యాపై బ్యాంక్ మోసం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక చేసేదేమీ లేక 2016లో భారతదేశం వదిలి యూకే వెళ్లిపోయారు. అయితే భారత ప్రభుత్వం ఈయనను మళ్లీ దేశానికి రప్పించడానికి ఎక్స్ట్రడిషన్ కేసు వేసింది.ఇదీ చదవండి: 2019లో భర్తకు విడాకులు.. ఆరేళ్లుగా లక్షల కోట్లు విరాళం -
48 గంటల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే..
ఫ్లైట్ టికెట్లకు సంబంధించిన రీఫండ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్లు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటలోపు అదనపు చార్జీలు లేకుండానే రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పులు చేసుకోవచ్చు. రీఫండ్ కూడా వేగవంతంగా పూర్తవుతుందని డీజీసిఏ ప్రకటించింది.టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు విమానయాన సంస్థలు "లుక్-ఇన్ ఆప్షన్" అందించాలి. ఈ కాలంలో అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణీకులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి లేదా మార్చడానికి అనుమతించాలని డీజీసిఏ పేర్కొంది. దేశీయ విమానాలకు ఐదు రోజుల్లోపు.. అంతర్జాతీయ విమానాలకు 15 రోజుల్లోపు ఎయిర్లైన్ వెబ్సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకుంటే ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు.క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపిన సందర్భంలో.. విమానయాన సంస్థలు టికెట్ రద్దు చేసిన ఏడు రోజుల్లోపు తిరిగి చెల్లిస్తుంది. నగదు చెల్లింపుపు ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే.. మీరు రద్దు చేసుకున్న వెంటనే డబ్బు అందుతుంది. అయితే ట్రావెల్ ఏజెంట్లు లేదా పోర్టల్స్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని.. 48 గంటల్లో రద్దు చేసుకుంటే.. డబ్బు వాపసు అనేది 21 పని దినాలలో మీకు జమ అవుతుంది. రీఫండ్లను ప్రాసెస్ చేయడానికి ఏ విమానయాన సంస్థ కూడా అదనపు రుసుము వసూలు చేయదు.ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్! -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
20 ఏళ్ల పాత విమానాల దిగుమతికి డీజీసీఏ పరిశీలన
అంతర్జాతీయంగా సరఫరా సమస్యల వల్ల విమానాల డెలివరీలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో 20 ఏళ్ల పాత విమానాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించే అంశాన్ని ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. ఇందుకోసం సంబంధిత నిబంధనలను సడలించడంపై దృష్టి సారిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ప్రస్తుతం ప్రెజరైజ్డ్ తరహా విమానాల దిగుమతికి 18 ఏళ్ల వరకు, అన్–ప్రెజరైజ్డ్ విమానాలకు 20 ఏళ్ల వరకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను వరుసగా 20 ఏళ్లు, 25 ఏళ్లకు పెంచాలని ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు అధికారి వివరించారు. 10,000 అడుగుల పైన అత్యధిక ఎత్తులో ప్రయాణించగలిగే విమానాలను ప్రెజరైజ్డ్ విమానాలుగా, అంతకన్నా దిగువన ప్రయాణించే విమానాలను అన్ప్రెజరైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్గా వ్యవహరిస్తారు. దేశీయంగా షెడ్యుల్డ్, నాన్–షెడ్యూల్డ్ కార్యకలాపాల కోసం విమానయాన సంస్థలు లీజుకు తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 800 పైచిలుకు ఉన్నాయి.ఇటీవలి కాలంలో దేశీ విమానయాన సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు 1,400పైగా విమానాలకు ఆర్డర్లిచ్చాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ అయిన భారత్లో 2030 నాటికల్లా ప్యాసింజర్ల రద్దీ రెట్టింపై 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం -
అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్పీఏఎస్’ సబ్కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబనడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్వాయిస్లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి. -
ఎగరకముందే.. చెక్ పెట్టేస్తారు!
మనం వాడే బండిని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాం. బ్రేకులు సరిగా పడుతున్నాయా, టైర్లలో గాలి ఉందా, సరిపడా ఇంధనం ఉందా అని రోజూ చెక్ చేస్తాం. అలాంటిది గాల్లో ఎగిరే విమానం అయితే? మనం మన వాహనాన్ని చెక్ చేసినట్టే విమానాన్ని ఒక్క పైలట్ చెక్ చేస్తే సరిపోతుందా? అస్సలు కాదు.. కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విమానయాన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీల నిఘా కళ్లు ప్రతి క్షణం పర్యవేక్షిస్తుంటాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం విమానాలు, విమానాశ్రయాలు, సర్వీసింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడమేకాదు.. ఆకస్మిక తనిఖీలూ చేసి ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఈ ఏడాది జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తాలూకా చేదు జ్ఞాపకాలు భారతీయుల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 275 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన నేపథ్యంలో దేశంలో అమలవుతున్న విమానయాన నిబంధనలు, భద్రత అంశం చర్చకు వచ్చింది. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, సాంకేతిక సమస్యనా అన్నది పక్కన పెడితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వంటి ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇందుకు ఈ సంస్థలు చేపట్టిన తనిఖీలే నిదర్శనం. 2023 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు 9,423 తనిఖీలు చేపట్టాలన్నది ప్రణాళిక కాగా రికార్డు స్థాయిలో 13,753 తనిఖీలు చేపట్టడం గమనార్హం. రెక్కలు కట్టేస్తారు..: డీజీసీఏ బృందం అన్ని విమాన సంస్థలకు చెందిన విమానాల తనిఖీ చేపడుతుంది. విమానం సురక్షితంగా ప్రయాణం సాగించే స్థాయిలో ఫిట్గా ఉందా లేదా అని పరీక్షిస్తారు. లోపాలు, ఉల్లంఘనలు బయటపడితే డీజీసీఏ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర లోపాలు, ఉల్లంఘనలైతే విమానాలకు భద్రతా ధ్రువీకరణను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అంటే విమానం ఎగరకుండా నిరోధిస్తారు. ఫిట్గా ఉందని తేలాకే సస్పెన్షన్ ఎత్తేస్తారు. అంతేకాదు, నిబంధనలను పాటించకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు. 2023 నుంచి 2025 జూలై 20 వరకు 597 విమానాలు సస్పెన్షన్ కు గురయ్యాయంటే ఏ స్థాయిలో తనిఖీలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. ఆకస్మిక తనిఖీలు..: విమానం, సిబ్బంది, ఆపరేటర్లు భూమిపై ఉన్నప్పుడు విమానయాన నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి డీజీసీఏ అధికారులు అప్రకటిత (ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స) తనిఖీలు నిర్వహిస్తారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తారు. ఇలా భారత్లోని విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న దేశ, విదేశీ విమానాలకు సంబంధించి 2023 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 1,188 ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స జరిగాయి. ఈ తనిఖీల్లో 338 లెవెల్–2 స్థాయి లోపాలను గుర్తించారు. ప్రతి ప్రయాణానికి ముందు విమానానికి తనిఖీలు తప్పనిసరి. విమానం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి పైలట్స్, నిర్వహణ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. అంతా బాగుంది అని నిర్ధారించుకున్నాకే విమానం గాల్లోకి లేస్తుంది. లేదంటే సర్వీస్ రద్దు అవుతుంది. విమానం వెలుపల: విమానం నిర్మాణం, బాహ్య, నియంత్రణ ఉపరితలాలపై ఏదైనా నష్టం, లీకేజీ, అరిగిపోయాయా అని చూస్తారు.అంతర్గత తనిఖీలు: కాక్పిట్లోని పరికరాలు, రేడియోలు, విద్యుత్ పరికరాలు, ఇతర ముఖ్యమైన భాగాల పనితీరును ధ్రువీకరిస్తారు.పత్రాల ధ్రువీకరణ: లైసెన్సులు, రిజిస్ట్రేషన్, బీమా వంటి అన్ని అవసర పత్రాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు.ఇంధనం స్థాయిలు: తగినంత ఇంధనం, చమురు, తగు పాళ్లలో, నాణ్యంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు.నియంత్రణ వ్యవస్థలు: విమాన నియంత్రణలు, బ్రేక్స్, ఇతర క్లిష్ట వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, కార్యకలాపాలను పరీక్షిస్తారు.వాతావరణ పరిశీలన: విమానం ఎగరడానికి, దిగడానికి అనుకూల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు. వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం వెళ్తుంది. -
అందమైన శత్రువు..
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి.. పాదరసం కలిసిన సౌందర్య సాధనాల ఉత్పత్తులపై నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని జూన్17న జరిగిన సమావేశం మినిట్స్లో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ధ్రువీకరించింది. చట్టప్రకారం కాస్మెటిక్స్లో పాదరసం నిర్దేశిత మోతాదుపై ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. సౌందర్య సాధనాల తయారీపై నిఘాను కఠినతరం చేయనుంది. అసలింతకీ ప్రమాదకర లక్షణాలు పాదరసంలో ఏమున్నాయి.. ఇంతకూ దాన్ని సౌందర్య సంబంధ ఉత్పత్తుల్లో ఎందుకు వాడతారు? – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో కాస్మెటిక్స్ అన్నది సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం. అమ్మకాల పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ మనది. చాలా సౌందర్య సాధనాల్లో స్వల్ప స్థాయుల్లో పాదరసం వినియోగిస్తారు. అయితే పాదరసం మానవ ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ రెండింటినీ ప్రభావితం చేసే విషపూరిత మూలకం. అందుకే కాస్మెటిక్స్ తయారీలో ఈ లోహం వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.2013 ‘మినామాటా కన్వెన్షన్ ’..: పాదరసం, పాదరస సమ్మేళనాల హానికర ప్రభావాల నుండి మానవాళిని, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో 2013లో జపాన్ వేదికగా ‘మినామాటా కన్వెన్షన్ ’ (మినామాటా అంతర్జాతీయ ఒప్పందం) కుదిరింది. దాని ప్రకారం సౌందర్య సాధనాలలో 1 పీపీఎం (ఒక పార్ట్స్ పర్ మిలియన్ – అంటే 0.0001 శాతం) కంటే ఎక్కువ పాదరసం ఉండకూడదు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పరిమితి దాటి పాదరసం ఉన్న కాస్మెటిక్స్ ఎగుమతులను, దిగుమతులను, తయారీని, ఇంకా ఇతర లోపాలను గుర్తించేందుకు డీసీజీఐ 2024లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. మనదేశంలోని ప్రస్తుత కాస్మెటిక్స్ చట్టం.. ‘మినామాటా కన్వెన్షన్ ’ ఒప్పందానికి లోబడే ఉందని ఆ ఉపసంఘం నివేదిక పరిశీలించిన డీసీసీ స్పష్టం చేసింది.దిగుమతులే ఆధారంమనదేశం పాదరసం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశం 32.77 లక్షల డాలర్ల విలువైన 73,085 కిలోల పాదరసం దిగుమతి చేసుకుంది. మనకు ఎగుమతి చేసే ప్రధాన దేశాలు పెరు, థాయ్లాండ్, జపాన్, జర్మనీ, యూకే. మనదేశ నిబంధనల ప్రకారం కంటి ప్రాంతంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో కలిపే పాదరసం స్థాయి 70 పీపీఎంలకు (అంటే 0.007 శాతం) మించకూడదు. ఇతర సౌందర్య సాధనాలలో ఇది 1 పీపీఎంను దాటకూడదు.అన్ని రంగాల నిపుణులతో..‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేసిన సిఫారసుల కమిటీకి చైర్మన్గా – ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎన్. భట్టాచార్య, సభ్యులుగా ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగాల వైద్య నిపుణులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు. ‘అందానికి’ పాదరసం ఎందుకు?పాదరసాన్ని సాధారణంగా చర్మాన్ని తెల్లగా చేసే ఉత్పత్తుల్లో వాడతారు. చర్మాన్ని కాంతిమంతం చేసే క్రీములు; చర్మంపై చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను పోగొట్టే సౌందర్య సాధనాలు; వయసును కనపడనీయని యాంటీ–ఏజింగ్ సొల్యూషన్ లు, ఇంకా కొన్ని రకాలైన మేకప్ పదార్థాలు.. పాదరసాన్ని కాస్తయినా కలపకుండా తయారు కావు. చర్మం రంగు నల్లగా ఉండటానికి చర్మంలోని ‘మెలనిన్’ కారణం. పాదరసం ఆ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నల్లదనం తగ్గుతుంది. అలాగే పాదరసం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్లను చంపగలదు. కొన్ని సౌందర్య సాధనాలలో సంరక్షణకారిగానూ ఉపయోగపడుతుంది.చాలా ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ పాదరసాన్ని అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 రసాయనాల జాబితాలో చేర్చింది. పాదరసం కలిసి ఉన్న కాస్మెటిక్స్ను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాదరసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదరసం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. » ఒంటిమీద దద్దుర్లు, రంగు పోవడం» జీర్ణ సంబంధమైనవి» వ్యాధి నిరోధక శక్తి తగ్గడం» ఆందోళన, ఒత్తిడి» నాడీ సంబంధమైనవి» జ్ఞాపకశక్తి సమస్యలు» భావోద్వేగాల్లో అనూహ్యమైన మార్పులుభారీగా పెరిగిన కాలుష్యంపాదరస ఉద్గారాలు 1960తో పోలిస్తే 2021లో 3.3 రెట్లు పెరిగాయి. మొత్తం ఉద్గారాల్లో చైనా, భారత్, ఇండోనేషియా, పెరు, బ్రెజిల్ల వాటా దాదాపు 50 శాతం. – ప్రపంచంలో అత్యధిక పాదరస కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఆ తరవాతి స్థానంలో మనదేశం ఉంది.» బంగారు ఆభరణాల తయారీలో, బంగారం తవ్వకాలు వంటి వాటిలో పాదరసాన్ని విరివిగా వినియోగిస్తారు.» కొన్ని రకాల పరిశ్రమలు, సిమెంటు తయారీ, ఈ–వేస్ట్ వంటి చెత్తను కాల్చడం, బొగ్గును కాల్చడం.. ఇలా పాదరసం అనేక కారణాల వల్ల వాతావరణంలోకి చేరుతోంది.ఇలా చూసుకోవచ్చు|మనం కొనే ఉత్పత్తుల్లో మెర్క్యురస్ క్లోరైడ్, క్యాలొమెల్, మెర్క్యురిక్ అయోడైడ్ అనే పేర్లు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇవన్నీ పాదరస సంబంధమైనవే. -
1.41 కోట్ల మంది విమానమెక్కారు..
దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్జెట్ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది. -
DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కు డీవీఆర్ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
రన్ వేపై రెక్కల ముక్కలు
భారత విమానాశ్రయాలు చాలావరకు భద్రమైనవి. అయితే ఆ భద్రతకు ఊహించని విధంగా పక్షులు, ఇతర వన్యప్రాణుల మూలంగా తరచూ ముప్పు వాటిల్లుతోంది. పక్షులు ఢీకొనటం; జింకలు, నక్కలు, కుక్కలు వంటి జంతువులు తగలటం వల్ల రన్ వే పైన విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు, గత అక్టోబర్లో భువనేశ్వర్ విమానాశ్రయం సమీపంలో అడవి పిల్లి సంచరిస్తూ కనిపించటం, ఈ ఏడాది మార్చిలో డయ్యూ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సింహం ప్రత్యక్షమవటం భవిష్యత్తులో జరగనున్న విమాన ప్రమాదాలకు సంకేతంగా గుర్తించి, అధికారులు అప్రమత్తం అవుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అడ్డొచ్చి తగులుతుంటాయి :.. ఏప్రిల్ 14న హిసార్–అయోధ్యల మధ్య విమానాన్ని ప్రారంభించటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ముందు హర్యానాలోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం అధికారులు డెహ్రాడూన్లోని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’నుంచి నిపుణులను రప్పించి మరీ ఆ దరిదాపుల్లోకి ‘నీల్గై’భారీ జింకలు రాకుండా చూసుకున్నారు. అగ్రసేన్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రదేశం చాలాకాలంగా నీల్గైలకు నివాసంగా ఉంటోంది! ఇక కోల్కతాలోని రన్వేల మీద ఇటీవల నక్కలు పరుగులు తీశాయి. సంతతి కోసం విమానాశ్రయంలో అవి తవ్వుకున్న బొరియల్ని సైతం అధికారులు గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు ప్రాంగణంలో రహస్యంగా ముపై్పకి పైగా బోన్లు ఏర్పాటు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రన్వేలపై విమానాలు టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షులు, వన్యప్రాణులు వచ్చి తగిలే అవకాశం ఉండటంపై అధికారులూ, ప్రయాణికులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అతి పెద్ద ప్రమాదం!రన్వేపై పక్షులు ఢీకొనడం, జంతువులు వచ్చి వేగంగా వెళ్తున్న విమానానికి తగలటం చాలాసార్లు ప్రాణాంతకం కాకపోయినా కొన్నిసార్లు ఘోర ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ఇందుకు ఉదాహరణ.. ఇటీవల పక్షి ఢీకొని దక్షిణ కొరియాలో సంభవించిన జెజు ఎయిర్ క్రాష్లో విమానంలోని 179 మందీ మరణించటం! (దీనిపై ఇంకా విచారణ సాగుతోంది). భారత్లో చివరిసారిగా 2015లో ఇలాంటి ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్తో సహా ఏడుగురు చనిపోయారు. ఢిల్లీ రన్వేపై 700సార్లు!పక్షులు ఢీకొన్న సంఘటనల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. 2018–2023 మధ్య ఆ రన్వేలపై 700 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు... జంతు సంక్షేమ కార్యకర్త గౌరీ మౌలేఖి దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’, ‘ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా’సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విమానా శ్రయం పరిసరాల్లో కబేళాలు, మాంసం దుకాణాలు, పాడి పరిశ్రమలు ఉండటం విమానయాన భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని మౌలేఖీ తన పిటిషన్లో పేర్కొన్నారు. 39 ఫ్లెమింగోల మృత్యువాత.. 2023 డిసెంబర్ 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం... భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణులు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. ఈ ఘటన వన్యప్రాణుల ప్రేమికులను ఎంతగానో కలవరపరిచింది.పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షీల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. పక్షులను చెదరగొట్టే మార్గాలు ప్రమాదాలు జరిగి అటు వన్యప్రాణులు, పక్షులు గానీ, ఇటు విమానాలు, ప్రయాణికులు గానీ నష్టపోకుండా / ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షంగా చేపట్టాల్సినవి, అప్రమత్తం చేసే ధ్వని పరికరాలు, రాప్టర్ కైట్స్, బెలూన్లు, రిఫ్లెక్టింగ్ టేప్ వంటివి వాడాలి. ఇక పరోక్షంగా.. నీటి వనరుల మూసివేత, వ్యర్థాల తొలగింపు, పచ్చిక ఉన్న ప్రదేశాలలో చీడపురుగుల ఏరివేత, గూళ్లు పెట్టకుండా గడ్డిని కత్తిరించడం, ఎలుకల నియంత్రణ వంటివి చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ సూచించింది. అంతిమంగా మనమంతా.. పక్షులు మన స్థలంలోకి రావటం లేదు, వాటి స్థలంలోకే మనం వెళ్లి అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అని గుర్తించి వన్యప్రాణి హితమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. అన్ని పక్షులూ ముప్పుకాదు.. 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గుముఖం పట్టింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణు తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులు కారణమయ్యాయి. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్లు, ల్యాండింగ్లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లుజనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది. -
చిన్న పక్షితో 'పెద్ద పక్షి'కి ముప్పు
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. రివ్వున ఎగిరేలోపు.. వాటికి ఎగిరే స్వేచ్ఛ లేదన్నట్టుగా పక్షులు వార్నింగ్ ఇస్తున్నాయి. ఎయిర్ పోర్టుల సమీపంలో పక్షుల కదలికలు విమాన ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దక్షిణ కొరియాలో విమాన ఘోర ప్రమాదంలో 179 మృత్యువాత పడటానికి పక్షులే ప్రధాన కారణమని.. తెలిసిన తర్వాత భారత్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటికే పక్షుల కారణంగా టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే విమానాలు తిరిగి ల్యాండ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో.. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా డీజీసీఏ అడుగులు వేస్తోంది. ఓ వైపు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ.. మరోవైపు విమాన ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పే..ద్ద విమానానికి పక్షితో ముప్పా! విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. విమాన క్యాబిన్, ఇంజన్ను పక్షులు ఢీకొడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.విమానం పైకి ఎగిరినప్పుడు లేదా దిగుతున్నప్పుడు దాని ఇంజన్లు బలంగా లోపలికి గాలిని తీసుకుని బయటికి వదులుతుంటాయి. జా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆ గాలికి సమీపంలోకి పక్షులు వస్తే అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజన్లు లోపలికి లాగేసుకుంటాయి. దాంతో ఇంజన్లు పాడైపోతుంటాయి. విమానం ఎగిరే సమయంలో ఇంజన్ లోపలికి పక్షులు వెళ్లిపోతే ఇంజన్ తిరగడం కొన్నిసార్లు ఆగిపోయి ఊహకందని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఫ్యాన్ థ్రస్ట్ ఆగిపోయినట్టు గుర్తిస్తే పైలట్ వెంటనే సమీపంలోని ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసేస్తుంటారు. అంతేకాదు.. ఫ్లైట్ క్యాబిన్లో ఉన్న పైలట్ విండ్ షీల్డ్ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. బలంగా కొట్టినప్పుడు పొరపాటున విండ్ షీల్డ్కి పగుళ్లు ఏర్పడితే విమానం ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు. అప్రమత్తమైన డీజీసీఏ భారత్లోనూ ఇటీవల పక్షుల కారణంగా విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్ట్లో గోవాలోని దబోలి ఎయిర్పోర్ట్లో పక్షి ఢీకొన్న తర్వాత విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ను హఠాత్తుగా నిలిపేసింది. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్టులోనే 2023లో 169 విమానాలకు పక్షుల కారణంగా స్వల్ప ప్రమాదాలు సంభవించడం గమనార్హం. విహంగాలతో లోహపు విహంగాలకు ప్రమాదాలు పెరుగుతుండటంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్పోర్టు సమీపంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విహంగాల ఉనికిని తప్పించే మార్గాలపై దృష్టి సారించింది. రన్వేల వెంట బిగ్గరగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం, జోన్ గన్స్ ద్వారా భారీ శబ్దాలతో పక్షుల రాకను నియంత్రించడం, ఎయిర్ ఫీల్డ్ సమీపంలో వేప నూనె స్ప్రే చేయడం వంటి భిన్నమైన విధానాలను వినియోగించడంపై చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ఎయిర్పోర్టుకి 10 కి.మీ. పరిధిలో పక్షులు, వన్యప్రాణుల్ని ఆకర్షించే చెత్తా చెదారాలతో కూడిన ఆహారం, జంతు కళేబరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎయిర్పోర్టు వర్గాలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోళ్లు, మేకలు, ఇతర జంతు వధ జరగకుండా దృష్టి సారించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ సమస్యని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ఎయిర్పోర్టులు ప్రయత్నిస్తున్నాయి.నౌకాదళ సాయంతో చర్యలు పక్షుల అంతరాయం కలగకుండా వైజాగ్ ఎయిర్పోర్టులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎయిర్పోర్టు చుట్టూ కెనాల్ ఉంది. వేస్టేజ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యాలని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తో సమీక్షలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తూర్పు నౌకాదళ వైమానిక బృందం సహాయంతోనూ వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా పక్కç³క్కనే ఉన్నాయి. వీటిపక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పక్షుల రాకపోకలు పెరుగుతుండటంతో విమాన సర్వసులకు అంతరాయం ఏర్పడుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారుల స్ప్రే డ్రోన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరకుండా నియంత్రించే చర్యలు చేపడుతున్నాం. ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేయడం ద్వారా రన్వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలం. – రాజారెడ్డి, వైజాగ్ ఎయిర్పోర్టు డైరెక్టర్ -
గగనతలంలో 1.42 కోట్ల మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా నవంబర్లో 1.42 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. 2023 నవంబర్తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య గత నెలలో 11.9 శాతం అధికం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో 1.27 కోట్ల మంది విమానయానం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. 2024 అక్టోబర్లో దేశీయ విమాన ప్రయాణికుల(Air passengers) సంఖ్య 1.36 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో భారత్లో వివిధ నగరాల మధ్య 14.64 కోట్ల మంది రాకపోకలు సాగించారు. వార్షిక వృద్ధి 5.91 శాతం నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 13.82 కోట్లుగా ఉంది. దేశీయ మార్కెట్ పరంగా ఇండిగో 63.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిరిండియా 24.4 శాతం, అకాశా ఎయిర్ 4.7, స్పైస్జెట్ 3.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలయన్స్ ఎయిర్ 0.7 శాతం వాటాతో స్థిరంగా ఉంది. ఎయిరిండియా(Air India)లో విస్తారా విలీనం నవంబర్లో పూర్తి అయింది. గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 2,24,904 మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది. -
Delhi: రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. #WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH— ANI (@ANI) December 9, 2024 -
ఆకాసా ఎయిర్కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
వచ్చేస్తోంది.. పేద్ద డ్రోన్
శంషాబాద్: అత్యవసరాల్లో ట్రాఫిక్ కష్టాలుండవు.. అనుకున్న సమయానికి మీ కార్గో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తు వులు, ఆర్గాన్స్ కూడా గ్రీన్ చానల్ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. దీనికి మరెంతో దూ రం లేదు. 2026లో మార్కెట్లోకి రాబోతున్న అతి పేద్ద డ్రోన్తో ఇవన్నీ సాకారమవుతాయి. హైదరాబాద్ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్రన్లో సక్సెస్ కావడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులతో త్వరలో నే అందుబాటులోకి రానుంది. దీనిని ఆదిభట్లలోని బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ఉత్తమ్కుమార్, అమర్దీప్ నేతృత్వంలోని ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందం తయారు చేసింది. నోవాటెల్ హోటల్లో ‘కోల్డ్చైన్ అన్బ్రోకెన్–2024’సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు. ‘పర్యావరణహితంగా తయారు చేసిన ఈ పైలట్రహిత డ్రోన్ 100 కిలోల కార్గోను 300 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానానికి గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది. ఇంత సామర్థ్య మున్న డ్రోన్ తయారీ దేశంలో ఇదే మొదటిది. 2029 నాటికి పదిమంది ప్రయాణికులతోపాటు వేయి కేజీల బరువు, వేయి కి.మీ. దూరం ప్రయాణించే డ్రోన్ను తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం’అని ఉత్తమ్కుమార్ ‘సాక్షి’తో తెలిపారు. ప్రత్యేకతలు..డ్రోన్ బరువు 400 కేజీలు మోసుకెళ్లే సామర్థ్యం 300 కి.మీ.వేగం గంటకు 200 కి.మీ.ప్రయాణించే ఎత్తు భూమికి 1000 అడుగుల ఎత్తులోఇంధనం హైడ్రోజన్, విద్యుత్ (కాలుష్యరహితంగా) -
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
3 ఎయిర్లైన్స్పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్జెట్పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా: కారణం ఇదే
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) రూ. 90 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్కు రూ. 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్లను హెచ్చరించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.జూలై 9న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి రియాద్కు విమానాన్ని నడపాల్సి సమయంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రైనింగ్ కెప్టెన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, విమానాన్ని ట్రైనీ పైలట్ నడిపారు.ట్రైనీ పైలట్ శిక్షణ కెప్టెన్తో ముంబై-రియాద్ విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, శిక్షణ కెప్టెన్ అనారోగ్యం పాలయ్యాడు మరియు అతని స్థానంలో శిక్షణ లేని కెప్టెన్ని నియమించారు. నిర్వహణ వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ సంఘటన జరిగింది. జూలై 10న ఎయిర్లైన్ సమర్పించిన నివేదిక ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. -
ఎయిర్ ఇండియాకు రూ.80 లక్షలు ఫైన్.. కారణం ఇదే
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియా లిమిటెడ్కు ఏకంగా రూ. 80 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా ఎందుకు విధించారు, కారణం ఏంటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), సిబ్బందికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవియేషన్ వాచ్డాగ్ 'ఎయిర్ ఇండియా' (Air India)కు రూ. 80 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా లిమిటెడ్పై స్పాట్ ఆడిట్ నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన వెలువడిందని ఏవియేషన్ రెగ్యులేటర్ మార్చి 22న ఒక ప్రకటనలో వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆడిట్ నిర్వహించిన సమయంలో.. సిబ్బందిలో 60 ఏళ్లకు పైబడిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ పీరియడ్లు, అల్ట్రా-లాంగ్-రేంజ్ ఫ్లైట్లకు ముందు, తర్వాత సిబ్బందికి విశ్రాంతి ఇవ్వకపోవడం.. లేఓవర్ల సమయంలో అనేక ఉల్లంఘనలను వెల్లడించింది. DGCA has imposed a financial penalty of Rs. 80,00,000 (Rupees eighty lakhs) to Air India Limited for violation of regulations pertaining to Flight Duty Time Limitations (FDTL) and fatigue management system (FMS) of flight crew: DGCA — ANI (@ANI) March 22, 2024 -
ఎయిర్పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
ఒక్క వీల్చైర్ కోసం రూ.30 లక్షలు జరిమానా.. అసలేం జరిగిందంటే..
ఎయిర్ ఇండియా సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గురువారం రూ.30 లక్షల జరిమానా విధించింది. ముంబైలోని అరైవల్ ఏరియాలో నడుస్తూ కుప్పకూలి మరణించిన 80 ఏళ్ల ప్రయాణికుడికి వీల్ చైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాపై ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..ఫిబ్రవరి 12న ఓ 80 ఏళ్లు వృద్ధడు అతడి భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో ముంబైకి వస్తున్నాడు. ఎయిర్పోర్ట్కు రాగానే అక్కడ సిబ్బందిని వీల్చైర్ అడిగాడు. అయితే అప్పటికే అతని భార్య వీల్చైర్ని ఉపయోగిస్తుంది. తనకోసం మరొకటి కావాలని కోరాడు. సరైన సమయానికి అందుబాటులో వీల్చైర్లు లేవు. దాంతో కాసేపు వేచి ఉండాలని సిబ్బందివారిని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ప్రయాణీకుడు నడిచి వెళ్లడానికి ఇష్టపడ్డాడు. దాంతో తన భార్యను తీసుకుని ఇమ్మిగ్రేషన్ విభాగం వరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించాడు. ఈ విషయాన్ని పరిశీలించిన డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సంస్థ ఫిబ్రవరి 20న నోటీస్కు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. వృద్ధ ప్రయాణికుడు మరో వీల్చైర్ కోసం ఎదురుచూడకుండా తన భార్యతో కలిసి వెళ్లిపోయాడని చెప్పింది. అయితే, సంస్థ వీల్చైర్ను అందించకుండా సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్(సీఏఆర్) నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుందని అని రెగ్యులేటర్ తెలిపింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా తప్పు చేసిన సిబ్బందిపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయలేదని డీజీసీఏ ఘాటుగా స్పందించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చెప్పడంలో సంస్థ విఫలమైందని తెలిపింది. ఇదీ చదవండి: ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. సీఏఆర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్క్రాఫ్ట్ రూల్స్, 1937 ప్రకారం ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. ప్రయాణ సమయంలో విమానం ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు సహాయం కోరుతున్న ప్రయాణీకుల కోసం తగిన సంఖ్యలో వీల్చైర్లు అందుబాటులో ఉండేలా అన్ని విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ముంబై ఘటన.. ఎయిరిండియాకు జరిమానా
ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్చైర్ సౌకర్యం కల్పించకపోవటంతో 80 ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 16న ముంబైలో చోటు చేసుకుంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి టెర్మినల్ వరకు ఆ ప్రయాణికుడికి వీల్ ఛైర్ సౌకర్యం కల్పించపోవటంపై డీజీసీఏ సీరియస్ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఏడు రోజుల్లో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పూర్తి వివరణ ఇవ్వాలంది. అదే విధంగా ఎయిర్ ఇండియా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ‘ ఇద్దరు ప్రయాణికులు ఫిబ్రవరి 12న న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు, ఆయన భార్య ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అయితే వీల్ చైర్లకు అధిక డిమాండ్ ఉండటంతో ఆయన భార్యకు వీల్ చైర్ సౌకర్యం కల్పిచాం. ఆయనకు సైతం కల్పిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేసింది. కానీ ఆయన వినకుండా తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్లారు’ అని ఎయిరిండియా తెలిపింది. అయితే డీజీసీఏ చేపట్టిన విచారణలో ఎయిరిండియా దివ్యాంగులు, వృద్ధులకు కల్పించాల్సిన వీల్ చైర్ సౌకర్య నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని తేలింది. ఈ ఘటన నేపథ్యంలో.. ప్రయాణికులకు అవసరమైన వీల్ చైర్లను అందుబాటులో ఉంచాల్సిందేనని విమాన సంస్థలకు డీజీసీఏ నొక్కి చెప్పింది. చదవండి: 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట! -
ఉప్పందించిన సొంత ఉద్యోగి.. ఎయిర్ఇండియాకు భారీ పెనాల్టీ!
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని దీర్ఘ-శ్రేణి, టెరైన్ క్రిటికల్ మార్గాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ చర్య తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాల విషయంలో భద్రతా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు ఎయిర్లైన్ ఉద్యోగి నుంచి స్వచ్ఛంద భద్రతా నివేదిక అందిందని, వాటిపై సమగ్ర దర్యాప్తును చేపట్టినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి! ఎయిర్ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, దీంతో ఆ విమానయాన సంస్థ అకౌంటబుల్ మేనేజర్కి షోకాజ్ నోటీసు జారీ చేశామని డీజీసీఏ తెలిపింది. దీనికి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన స్పందనను సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు రెగ్యులేటరీ /ఓఈఎం పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. -
ముంబై ఎయిర్ పోర్టు, ఇండిగోపై జరిమానా విధింపు
ముంబై విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.30లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)రూ.60లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా ఇండిగో ఎయిర్ లైన్స్పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)రూ.1.20కోట్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)రూ.30లక్షలు మొత్తం 1.50కోట్ల భారీ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్వేపై కూర్చుని భోజనం చేసిన ఘటనపై ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా చేస్తూ.. ఈ జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. Video of passengers eating on the tarmac at Mumbai Airport | A total of Rs 90 Lakhs fine imposed on MIAL - Rs 60 lakhs by Bureau of Civil Aviation Security (BCAS) and Rs 30 lakhs by DGCA. A total of Rs 1.50 Crores on IndiGo - Rs 1.20 Crores by BCAS and Rs 30 Lakhs by DGCA. https://t.co/vhanRbcC9d — ANI (@ANI) January 17, 2024 ఇటీవల పొగమంచు కారణంగా ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు రన్వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి విదితమే. చదవండి: కాంగ్రెస్ గూటికి ఒడిషా మాజీ సీఎం గమాంగ్ -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..
ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాగ్రూప్ నిర్వహిస్తోన్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మే-సెప్టెంబర్లో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చిన్, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది. ఇదీ చదవండి: రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు ఫలితంగా సంస్థ నిబంధనలు పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణను సమీక్షించిన తర్వాత.. సీఏఆర్ నిబంధనలు పాటించడంలో టాటా గ్రూప్ సంస్థ విఫలమైందని నిర్ధారించారు. ఆలస్యమైన విమానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, కొందరు సర్వీస్లేని సీట్లలో ప్రయాణించవలసి రావడం వంటి అంశాలను పరిగణలోని తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించడంలో సంస్థ విఫలం అయిందని గుర్తించారు. దాంతో సంస్థకు రూ.10 లక్షలు జరిమానా విధించారు. -
ఎయిర్ ఇండియాకు మరో షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా ఫెసిలిటీలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసినట్టు సమాచారం. తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబైలోని ఎయిర్ ఇండియా కేంద్రంలో బోయింగ్ పైలట్లకు శిక్షణ కార్యకలాపాలను డీజీసీఏ నిలిపివేసిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. డీజీసీఏ నిర్ణయంతో ఎయిర్ ఇండియాకు నిర్వహణ సవాళ్లు ఎదురు కానున్నాయి. న్యారో బాడీ, వైడ్ బాడీ విమాన పైలట్లకు సొంత కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. ముంబై ఫెసిలిటీలో బోయింగ్ 777, బీ787 ఎయిర్క్రాఫ్టŠస్, హైదరాబాద్ కేంద్రంలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తున్నారు. -
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
డ్రోన్ పైలట్గా డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళ!
కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి అబ్దుల్ రజాక్ను అడిగి తెలుసుకునేది. ప్లస్ టు పూర్తయిన తరువాత బీటెక్ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న టైమ్లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు. శిక్షణ కోసం కాసర్గోడ్లోని ఏఎస్ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్ పార్క్లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్పార్క్లో యువతరం కోసం ఆటోమోటివ్ టెక్నాలజీ, కంప్యూటర్ హార్డ్వేర్, హాస్పిటాలిటీ, రిటైల్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో వొకేషనల్కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఫ్లయింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్ ఫ్లైట్ ప్రిన్సిపల్స్ నుంచి డ్రోన్ ఫ్లయింగ్ రూల్స్ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష. ఏరియల్ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్ మానిటరింగ్, ఫైర్ ఫైటింగ్లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్... మొదలైన వాటిలో డ్రోన్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి. డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్ పైలట్గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్పార్క్ ఉన్నతాధికారులు. (చదవండి: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ! -
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్లైన్ డాక్యుమెంటేషన్లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్కేసులో డెడ్బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
కొత్త అగ్రి డ్రోన్ మోడల్కు డీజీసీఏ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన కొత్త అగ్రి–డ్రోన్ ’అగ్రిబాట్ ఏ6’కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ’టైప్ సర్టిఫికెట్’ లభించినట్లు ఐవోటెక్వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి ఉన్నట్లు ధృవీకరిస్తూ డీజీసీఏ ఈ సర్టిఫికెట్ను అధికారికంగా జారీ చేస్తుంది. క్రితం మోడల్తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ తెలిపారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 పైచిలుకు డ్రోన్లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నారు. -
గో ఫస్ట్కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్సీఎల్టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
గో ఫస్ట్ నుంచి విమానాల కోసం లీజర్ల పట్టు!
న్యూఢిల్లీ: దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి తమ విమానాలను తిరిగి పొందే విషయంలో లీజర్లు వెనక్కు తగ్గడం లేదు. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తమ విమానాలను డీరిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికే నిరాకరించిన డీజీసీఏను తప్పు పడుతూ ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ తారా వితస్తా గంజు ఈ పిటిషన్ విచారణను వాదనల నిమిత్తం మే 30న లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలోగా లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రతిపాదులను ఆదేశించారు. హైకోర్టును ఆశ్రయించిన లీజర్లలో ఆక్సిపిటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిర్క్రాఫ్ట్ 2 లిమిటెడ్, ఈఓఎస్ ఏవియేషన్ 12 (ఐర్లాండ్) లిమిటెడ్, పెంబ్రోక్ ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ 11 లిమి టెడ్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నాయి. ► ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్ను విచారణకు స్వీకరించింది. ► తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్కు రక్షణ లభించనట్లయ్యింది. సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది. ► దీనితో ఎన్సీఎల్టీ రూలింగ్ను సవాలు చేస్తూ, విమాన లీజర్లు ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, జీవై ఏవియేషన్, ఎస్ఎఫ్వీ ఎయిర్క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఇంజిన్ లీజింగ్ ఫైనాన్స్ బీవీ (ఈఎల్ఎఫ్సీ) సంస్థలు.. ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేశాయి. అయితే ఈ అప్పీళ్లను చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ తోసిపుచ్చింది. ► దీనిని ఆయా సంస్థలు సుప్రీంలో అప్పీల్ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గో ఫస్ట్ అత్యున్నత న్యాయస్థానంలో నాలుగు కేవియెట్లను దాఖలు చేసింది. ► గో ఫస్ట్కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 3వ తేదీ నుంచి గో ఫస్ట్ సేవలు నిలిచిపోయాయి. ► మరోవైపు 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని గో ఫస్ట్కు డీజీసీఏ సూచించడం మరో విషయం. గోఫస్ట్ సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ గోఫస్ట్ సేవల పునరుద్ధరణకు అనుమతించే ముందు, సన్నద్ధతపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆడిట్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంతో గోఫస్ట్ మే 3 నుంచి విమానయాన కార్యకలాపాలు నిలిపివేసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా పరిష్కార చర్యల పరిధిలో ఉంది. ఇలా సేవలను అర్థంతరంగా నిలిపివేయడంపై గోఫస్ట్కు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ చేయగా.. దీనికి స్పందనగా వీలైనంత త్వరగా ఫ్లయిట్ సేవలు ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తున్నట్టు బదులిచ్చింది. ఈ విషయాన్ని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గోఫస్ట్ కూడా తన ఉద్యోగులకు ఇదే విషయమై సమాచారం పంపింది. రానున్న రోజుల్లో మన సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థ ఆమోదం లభిస్తే వెంటనే కార్యకాలపాలు ప్రారంభిస్తామని వారికి తెలియజేసింది. కార్యకలాపాలు ప్రారంభానికంటే ముందే ఏప్రిల్ నెల వేతనాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ సీఈవో భరోసా ఇచ్చారు. అలాగే, వచ్చే నెల నుంచి ప్రతీ నెలా మొదటి వారంలో వేతనాలను చెల్లించనున్నట్టు గోఫస్ట్ ఆపరేషన్స్ హెడ్ రంజింత్ రంజన్ ఉద్యోగులకు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ కేసులో కన్సార్షియంకు ఊరట ఇదిలావుండగా, సేవలను నిలిపిచేసిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశలో అప్పీలేట్ ట్రిబ్యునల్– ఎన్సీఎల్ఏటీ కీలక రూలింగ్ ఇచ్చింది. ఎయిర్వేస్ విజేత బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే కన్సార్షియం అందించిన రూ. 175 కోట్ల ఫెర్మార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని ఎన్క్యాష్ చేయవద్దని రుణదాతలను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు 2022 నవంబర్ 16, 2023 మార్చి 3వ తేదీల్లో కన్సార్షియం రుణ చెల్లింపుల కాలపరిమితిని రెండుసార్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ పొడిగించింది. కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. కాగా, జెట్ ఎయిర్వేస్ కేసులో చెల్లించనున్న రూ. 150 కోట్ల పెర్ఫార్మెర్స్ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్క్యాష్ చేయకుండా ప్రధాన రుణ దాత ఎస్బీఐని నిరోధించాలని కోరుతూ విన్నింగ్ బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన పటిషన్పై మే 30న ఉత్తర్వులు జారీ చేస్తామని అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కన్సార్షియం – రుణదాతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక సూచనలు చేస్తూ పరిష్కార ప్రణాళికను అమలు చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలనూ కోరింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 18న కార్యకలాపాలను నిలిపివేసింది. క్యారియర్పై దివాలా పరిష్కార ప్రక్రియ జూన్ 2019లో ప్రారంభమైంది. 2021 జూన్లో కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. దీని ఫలితంగా క్యారియర్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. -
కాక్పిట్లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్.. రూ.30లక్షల ఫైన్!
తన స్నేహితురాలిని కాక్పిట్లో కూర్చోబెట్టుకున్న పైలెట్పై ప్రముఖ దేశీయ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలెట్ను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాలిని కాక్పిట్లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అంతేకాదు తన స్నేహితురాలికి సపచర్యలు చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. అందుకు ఒప్పుకోని సిబ్బందిపై దుర్భాషలాడాడు. చేయి చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏ (Directorate General of Civil Aviation)ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీజీసీఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా పైలెట్కు రూ.30లక్షల ఫైన్ వేసింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ను విరుద్ధంగా విధులు నిర్వహించిన 3 నెలల పాటు పైలెట్ లైసెన్స్ (పీఐసీ) క్యాన్సిల్ చేసింది. -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్పిట్లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్పిట్లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్పిట్లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్పిట్లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్పిట్లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్పోర్ట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్జెట్ ఫ్లయిట్స్లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్లైన్స్లోనూ సీక్వెన్షియల్గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
ఎయిర్ఏషియాకు రూ.20లక్షల ఫైన్! ఎందుకంటే..
సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది. డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ఏషియా మేనేజర్కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే.. -
ప్రయాణికుడిని పాట్నాకు బదులు ఉదయ్పూర్ తీసుకెళ్లిన ఇండిగో..
న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్పూర్కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్పూర్లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్పూర్లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉదయ్పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
గగనతలంలో ఉన్న విమానంలో మంటలు.. 184 మంది ప్రయాణికులు..
గగనతలంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్లో మంటలు చెలరేగాయి. రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్ ఇంజన్లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. #BREAKING | Massive scare on an #AirIndia Express plane from Abu Dhabi to Calicut. The flight's engine caught fire during climb, forcing it to make landing. @Aruneel_S reports pic.twitter.com/IY8zYYZaV1 — Mirror Now (@MirrorNow) February 3, 2023 కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్లైన్కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్లైన్కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్లైన్కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్లైన్కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
విమాన టికెట్ డౌన్గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్లైన్స్ ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్ను డౌన్గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
అదే తరహాలో రెండో ఘటన: ఎయిర్ ఇండియాకి మరోసారి షాక్
ఎయిర్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్ 6న ప్యారిస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
Urination Case: ఎయిరిండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).. ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్కు రూ.3 లక్షల ఫైన్ విధించింది. ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్ అరెస్ట్ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్కు నిరాకరించింది కోర్టు. -
ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్లైన్ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్లైన్ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్పాస్లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
ఎయిరిండియాకు భారీ షాక్
ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిరిండియా విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 26న మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా ఎయిరిండియా న్యూయార్క్ - ఢిల్లీ విమాన ప్రయాణంలో వృద్ద మహిళపై మూత్రం పోయడం కలకలం రేపింది. దీంతో ఎయిరిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజా డీజీసీఏ ఎయిరిండియాకు పంపిన నోటీసుల్లో.. నవంబర్ 26న శంకర్ మిశ్రా మహిళపై మూత్రం పోశాడు. డిసెంబరు 6న పారిస్ - న్యూఢిల్లీ విమానంలో మద్యం సేవించిన ప్రయాణికుడు ఖాళీగా ఉన్న సీటు, మహిళా దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. మరొకరు మద్యం సేవించి లావేటరీ(ఫ్లైట్ బాత్రూం)లో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలపై ఎయిరిండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆలస్యంగా స్పందించడంపై మండిపడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేసింది. పారిస్ విమానంలో జరిగిన ఘటనలపై డీజీసీఏ నివేదిక కోరిన తర్వాత మాత్రమే ఏం జరిగిందో చెప్పింది. అంతే తప్పా వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరిగినప్పుడు విమానయాన సంస్థ ఏదైనా సంఘటనను 12 గంటల్లోగా నివేదించడమే కాకుండా, వాటిని అంతర్గత కమిటీకి కూడా పంపాలని డీజీసీఏ తెలిపింది. కమిటీలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఛైర్మన్గా ఉండాలి. వేరొక షెడ్యూల్డ్ ఎయిర్లైన్కు చెందిన ప్రతినిధి సభ్యుడు, ప్రయాణీకుల సంఘం లేదా వినియోగదారుల సంఘం నుండి ప్రతినిధి లేదా వినియోగదారు వివాద పరిష్కార ఫోరమ్కు చెందిన రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ అవేం చేయకుండా ఎయిరిండియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చదవండి👉 వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్హోస్టస్తో అసభ్యకరంగా..
పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ అధికారులు అరెస్ట్చేశారు. ప్రస్తుతం బిహార్లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్పై డీజీసీఏ సీరియస్ న్యూఢిల్లీ: పారిస్–న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది. ‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. -
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్లో 58 శాతంగా ఉండగా అక్టోబర్లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
స్పైస్జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్జెట్కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్తో కలిసి ఫస్ట్టైం విమానం ట్రిప్కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్రూమ్లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
స్పైస్జెట్కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్జెట్ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
స్పైస్జెట్కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ
సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్జెట్కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్లు చేసింది. అయితే ఇటీవలి కాలంలో స్పైస్జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్జెట్కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లో పెట్రోల్ లేదని చలాన్ -
స్పైస్జెట్పై కొరడా ఝుళిపించిన DGCA
-
విమానంలో ఒక్కసారిగా తగ్గిన ప్రెజర్.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి!
కొచ్చి: కొద్ది రోజులుగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసరంగా కిందకు దింపాల్సిన సంఘటనలు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా దుబాయ్ నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది. క్యాబిన్లో ప్రెజర్ తగ్గటం వల్ల విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ముంబయి నుంచి మరో విమానంలో ప్రయాణికులను కొచ్చికి శుక్రవారం ఉదయం చేర్చారు. దుబాయి నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సంకేతిక సమస్య తలెత్తిన ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ‘దుబాయి నుంచి కొచ్చికి వస్తున్న ఎయిరిండియా బోయింగ్ విమానం ఏఐ-934 కెప్టెన్.. క్యాబిన్లో ప్రెజర్ తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు ఐఓసీసీకి సమాచారం అందించారు. విమానాన్ని ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశాం.’ అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులను దర్యాప్తునకు నియమించినట్లు చెప్పారు. గత బుధవారం.. ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న గోఎయిర్ విమానం విండ్షీల్డ్ పగిలిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత గోఎయిర్ విమానాన్ని జైపూర్కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈనెలలోనే ఇలాంటివి రోజుకు 30 సంఘటనలు చోటు చేసుకున్నట్లు తాజాగా డీజీసీఏ తెలిపింది. అయితే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ‘సార్ నా బ్యాగులో బాంబు ఉంది..’ ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్ -
స్పైస్జెట్కు షాక్.. DGCA నోటీసులు
న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్జెట్ సంస్థకు షాక్ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్జెట్ సంస్థకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్జెట్ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ స్పైస్జెట్.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. చదవండి: ఈ స్పైస్జెట్కు ఏమైంది? -
ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని మండిపడింది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. 2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. అదే 24 గంటలు దాటితే రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ పేర్కొంది. -
అలర్ట్: మాస్క్ ధరించకుంటే దించేస్తారు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు అలర్ట్. ఎయిర్పోర్ట్లోగానీ, విమానంలోగానీ మాస్క్ ధరించకుంటే అనుమతించకూడదని కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మాస్కులు ధరించకుంటే.. దించేయాలని తెలిపింది. అంతేకాదు.. ప్రయాణం మొత్తంలో మాస్క్ను తప్పనిసరి చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్పోర్ట్, విమానాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే.. ప్రయాణికులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టు.. రెగ్యులేటరీ బాడీని ఆదేశించింది. మాస్క్లు ధరించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, పదే పదే హెచ్చరించినా పట్టించుకోపోతే వాళ్లను.. నిబంధనలను పాటించని ప్రయాణికుల జాబితాలో చేర్చి, తదనంతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. Mask Must ఈ తరుణంలో.. డీజీసీఏ ఆదేశాలనుసారం మాస్క్లు ధరించని ప్రయాణికులపై చర్యలు తీసుకోనున్నారు ఎయిర్పోర్ట్ నిర్వాహకులు. అలాంటి ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే హక్కు కూడా కల్పించారు. ప్రయాణాల్లో కేవలం ప్రత్యేక కారణాలు చూపిస్తేనే.. మాస్క్ తొలగించే అవకాశం కల్పిస్తారు. -
రెక్కలు తొడిగి, మళ్లీ నింగిలోకి జెట్ ఎయిర్ వేస్..!
అప్పులతో కుదేలైన ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తిరిగి తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జెట్ ఎయిర్ వేస్కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్(ఏఓసీ)ని అందించింది మే5,1993న నరేష్ గోయల్ జెట్ ఎయిర్ వేస్ పేరుతో తొలి కమర్షియల్ ఫ్లైట్ను ప్రారంభించారు. 100 పైగా విమానాలతో జెట్ ఎయిర్ వేస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. కానీ మార్కెట్లో కాంపిటీషన్, ఫ్లైట్ నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ ఏప్రిల్ 18,2019 నాటికి ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో జాతీయ అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా,ఈ సంస్థను యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి జలాన్, యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్ సంస్థలు ఒప్పొంద ప్రాతిపదికన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడం,పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థల కన్సార్టియం జెట్ ఎయిర్ వేస్కు 180మిలియన్ల నిధుల్ని అందించనున్నాయి. అందులో 60 మిలియన్లను అత్యవసర రుణాల్ని జెట్ ఎయిర్ వేస్ తీర్చనుంది. డీసీజీఏ వివరాల ప్రకారం డీసీజీఏ వివరాల ప్రకారం.. జెట్ ఎయిర్ వేస్ ఇప్పటికే తన కార్యకాలపాల్ని ప్రారంభించింది. మే15నుంచి మే17 మధ్య కాలంలో 5 విమానాల రాకపోకల్ని నిర్వహించింది. మిగిలిన కమర్షియల్ ఫ్లైట్లు జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభం కానున్నాయని డీసీజీఏ తెలిపింది. చదవండి👉ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే! -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
సంచలనం: పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!
విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. ఏవియేషన్ రెగ్యూలేటర్ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానయాన సంస్థలు కాక్పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. చదవండి👉మద్యం తాగి కాక్పిట్లో ప్రయాణం -
రెక్కలు తొడిగిన జెట్ ఎయిర్వేస్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ మళ్లీ రెక్కలు తొడిగింది. కమర్షియల్ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు సాధించింది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత తర్వాత జెట్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగిరింది. డీజీసీఏ నుంచి అనుమతి రావడంతో టెస్ట్ ఫ్లైట్ను ముందుగా నడిపించింది జెట్ ఎయిర్వేస్. 2022 మే5న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొదటి విమానం బయల్ధేరింది. మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆ కంపెనీ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. త్వరలోనే కమర్షియల్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. జెట్ ఎయిర్వేస్ చివరి కమర్షియల్ సర్వీస్ 2019 ఏప్రిల్ 17న నడిచింది. చదవండి : సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదంటున్న అపర కుబేరుడు వారెన్ బఫెట్ -
మార్చిలో విమానయానం జూమ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తదుపరి దేశీ విమానయానం ఊపందుకుంటోంది. గత మార్చిలో దేశీ ప్రయాణికుల సంఖ్య 1.06 కోట్లను తాకింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 76.96 లక్షలతో పోలిస్తే సుమారు 38 శాతం అధికం. వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజా గణాంకాలివి. గత నెలలో దేశంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 80 శాతం దాటడం గమనార్హం. విమానాల ఆక్యుపెన్సీని తెలియజేసే పీఎల్ఎఫ్ స్పైస్జెట్లో 86.9 శాతం, ఇండిగోకు 81 శాతం, విస్తారాలో 86.1 శాతంగా నమోదైంది. ఈ బాటలో గో ఫస్ట్ 81.4 శాతం, ఎయిరిండియా 85 శాతం, ఎయిరేషియా ఇండియా 81.3 శాతం చొప్పున పీఎల్ఎఫ్ను సాధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. అయితే కేంద్రం నిర్వహణలోని ప్రాంతీయ సంస్థ అలయెన్స్ ఎయిర్ మార్చిలో 74 శాతం పీఎల్ఎఫ్నే సాధించినట్లు పేర్కొంది. కాగా.. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలపై నిషేధ ఆంక్షలు విధించడంతో విమానయాన రంగం కుదేలైన విషయం విదితమే. -
ఆకాశవీధిలో.. వేసవిలో పెరగనున్న విమానాలు
న్యూఢిల్లీ: రాబోయే వేసవి షెడ్యూల్కు సంబంధించి దేశీ విమానయాన సంస్థలు .. వారంవారీగా ఫ్లయిట్ సర్వీసులను 10.1 శాతం మేర పెంచనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. గత సీజన్లో ఈ సంఖ్య 22,980గా ఉండగా ఈ సీజన్లో 25,309గా ఉంటుందని పేర్కొంది. ఇండిగో అత్యధికంగా దేశీ రూట్లలో తన ఫ్లయిట్స్ సంఖ్యను 10.4 శాతం పెంచి 11,130 వీక్లీ సర్వీసులను నడపనున్నట్లు వివరించింది. ఎయిర్పోర్ట్ స్లాట్లపై గత నెల జరిగిన వర్చువల్ సమావేశం అనంతరం దేశీ విమానయాన సంస్థల వేసవి షెడ్యూల్ను ఖరారు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షల కారణంగా గత 24 నెలలుగా దేశీ ఏవియేషన్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. గత కొద్ది వారాలుగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. వేసవి షెడ్యూల్ ప్రకారం వారంవారీగా ఎయిర్ఏషియా 1,601 (16 శాతం అధికం), ఎయిరిండియా 2,456 (10 శాతం అధికం) ఫ్లయిట్ సర్వీసులు నడపనున్నాయి. -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
అమెరికా జాబ్ వదిలి స్వదేశానికి.. అంతలోనే...
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. తన కల నేరవేరే సమయంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు మహిళా శిక్షణ పైలట్ మహిమా గజరాజ్ (29). మరి కొన్ని నెలల్లోనే పైలట్ శిక్షణ ముగుస్తుందనగా ఆమె అనూహ్యంగా దుర్మరణం చెందడం విషాదం. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో మహిమ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమెకు.. బాల్యం నుంచే పైలట్ కావాలని కోరిక. పీజీ పూర్తైన తర్వాత అమెరికా ఉద్యోగంలో చేరారు. పైలట్ కావాలన్న సంకల్పంతో అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగివచ్చారు. భర్త పరంథామన్, కుటుంబ సభ్యులను ఒప్పించి పైలట్ శిక్షణలో చేరారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో గత ఐదారు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్లో చేరిన నెల రోజుల్లోనే చాలా వరకు మెలకువలు నేర్చుకుని.. బెస్ట్ ట్రైనీగా నిలిచారు. మహిమకు తోడుగా ఆమె తల్లి, భర్త.. రైట్ బ్యాంక్ సమీపంలోనే నివసిస్తున్నారు. విషాదం వెంట విషాదం కొద్ది రోజుల క్రితమే మహిమ తండ్రి గజరాజ్.. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శిక్షణలో చురుకైన అభ్యర్థిగా ఉన్న మహిమ.. ప్రమాదానికి గురికావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్గా నడిపిన అనుభవం ఉందని ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత తెలిపారు. ఊహాగానాలు వద్దు.. వాస్తవాలు కావాలి ప్రమాదం ఎలా జరిగిందన్న వానిపై వాస్తవాలు వెల్లడించాలని మహిళ గజరాజన్ భర్త పరంథామన్ కోరారు. భర్తను, ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకుని తన అత్తగారు కుప్పకూలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన రూట్లో ఇంతకుముందు కూడా తన భార్య విమానం నడిపారని, కానీ ఇప్పుడు ఏమైందనేది తమకు తెలియాలని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. అక్టోబర్ చివరినాటికి ట్రైనింగ్లో చేరే నాటికే థియరీ పూర్తైందని, 185 ఫైయింగ్ అవర్స్ కోసం శిక్షణకు వచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్/మే నాటికి ట్రైనింగ్ పూర్తి చేయాలని మహిమ అనుకుందని వెల్లడించారు. అదంతా అబద్దం ఆన్లైన్ ట్రేడర్గా పనిచేస్తున్న పరంథామన్ కూడా గతంలో పైలట్గా శిక్షణ తీసుకున్నారు. అయితే ఆయన పైలట్ శిక్షణ పూర్తిచేయలేకపోయారు. మహిమ నాలుగు నెలల గర్భిణి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఇదంతా అవాస్తవం. నా భార్య గర్భంతో ఉంటే విమానం నడిపే సాహసం ఎందుకు చేయనిస్తాం?’అని ప్రశ్నించారు. కాగా, శిక్షణ విమానం కుప్పకూలిన దుర్ఘటనపై డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
తప్పిన ఘోర ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
అలెర్ట్! అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచి ఆంక్షలే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా 2020 మార్చి 29న భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఆ తర్వాత 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడిపించారు. ఆ తర్వాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. పునరుద్ధరిస్తాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ డీజీసీఏ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ వేరియంట్ గురించి సమాచారం దక్షిణాఫ్రికా బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ వెంటనే పరిమితంగా నడుస్తున్న విమాన సర్వీసులు, ప్రయాణికుల విషయంలో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు డిసెంబరు 1న డీజీసీఏ ప్రకటించింది. జనవరి 31 వరకు గత పది రోజుల వ్యవధిలో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2021 డిసెంబరు 9న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపింంచాలనే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/EXPkDc8Ejw — DGCA (@DGCAIndia) December 9, 2021 వీటికి గ్రీన్సిగ్నల్ ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 32 దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 32 దేశాల జాబితాలో యూకే, యూఎస్, కెన్యా, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయి. అదే విధంగా కార్గో విమాన సర్వీసులు కూడా యథావిధిగా ఉంటాయి. చదవండి: హైదరాబాద్ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్న్యూస్ ! -
కరోనా భయం తగ్గింది.. దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్లో ఇది సుమారు 90 లక్షలుగా నమోదైంది. గతేడాది అక్టోబర్లో నమోదైన 53 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో 48 లక్షలు, ఎయిరిండియా 11 లక్షలు, విస్తార 7 లక్షలు, ఎయిర్ఏషియా ఇండియా 6 లక్షలు, స్పైస్జెట్ 8.10 లక్షలు, గో ఫస్ట్ 8.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. కీలకమైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సమయపాలనకు సంబంధించి ఇండిగో (88.8 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో మార్కెట్ వాటా అత్యధికంగా 53.5 శాతంగా ఉంది. ఎయిరిండియా 11.8 శాతం, గో ఫస్ట్ 9.8 శాతం, స్పైస్జెట్ 9 శాతం, విస్తారా 7.8 శాతం వాటా దక్కించుకున్నాయి. చదవండి: ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. -
స్పైస్జెట్ ఎయిర్వేస్కు డీజీసీఏ షాక్
భారత్లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్కు ఝలక్ ఇచ్చింది. స్పైస్ జెట్ కార్గొ లైసెన్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గొ రవాణా ద్వారా సాధించింది స్పైస్ జెట్ సంస్థ. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్ణు బ్లాక్ లిస్ట్లో చేర్చినట్లు స్పైస్ జెట్ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. చదవండి: క్రిప్టోపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు -
Dgca :67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టి వచ్చారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్లో దేశవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టివచ్చారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 33.8 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. ఏప్రిల్లో 57.25 లక్షలు, మే నెలలో 21.15, జూన్లో 31.13, జూలైలో 50 లక్షల మంది ప్రయాణం చేశారు. గణాంకాలనుబట్టి మే నెలలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గత నెలలో ఇండిగో 38.16 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి 57 శాతం వాటాను దక్కించుకుంది. స్పైస్జెట్ 5.84 లక్షల మంది ప్రయాణికులతో 8.7 శాతం వాటా పొందింది. ఎయిర్ ఇండియా 8.86 లక్షలు, గో ఫస్ట్ 4.58, విస్తారా 5.58, ఎయిర్ ఏషియా 3.49 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేట్ 60.3–79.6 శాతం మధ్య నమోదైంది. స్పైస్జెట్ అత్యధికంగా 79.6 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. చదవండి: భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
బార్క్, మైసూర్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్లోని అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► పోస్టుల వివరాలు: డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్మెన్, సబ్ ఆఫీసర్. ► అర్హత: హెచ్ఎస్సీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–శారీరక ప్రమాణాలు ఉండాలి. ► వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021 ► వెబ్సైట్: https://recruit.barc.gov.in/barcrecruit/ డీజీసీఏలో 27 కన్సల్టెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ లైసెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, సంబంధిత అనుభవం ఉండాలి. ► వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిక్రూట్మెంట్ సెక్షన్, డీజీసీఏ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► వెబ్సైట్: https://www.dgca.gov.in -
విమానాల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. -
భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి
మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!) జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు. -
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థతులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. అలాగే కొన్నికార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది. కాగా కరోనా థర్డ్వేవ్పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి 2020 మార్చి 23 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఏడాది మేనుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ
న్యూఢిల్లీ: డ్రోన్ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్ ఎక్స్ప్రెస్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్ల డెలివరీ పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్లైన్స్ కంపెనీ స్పైస్ జెట్కు చెందిన స్పైస్ ఎక్స్ఫ్రైస్ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్వోఎస్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్ మెడికల్ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్ ఎక్స్ప్రెస్ సీఈవో సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పైస్జెట్తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్ పాయ్ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత pic.twitter.com/IueesZFoiV — DGCA (@DGCAIndia) May 28, 2021 -
ఆకాశవీధిలో పెళ్లి.. వధువరులపై కేసు!
న్యూఢిల్లీ: ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. పెళ్లిపై విచారణ ఛార్టెడ్ ఫ్లైట్లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న ఫ్లైట్ సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించారనే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పెళ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని తీవ్రంగా పరిగణించింది డీజీసీఏ. వైరల్గా మారిన పెళ్లి తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్, దక్షిణలు పెళ్లి కుదిరింది. పెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వధువరులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన వారు బెంగళూరు నుంచి మధురైకి చార్టెట్ ఫ్లైట్లో బయల్దేరారు. అయితే తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో ... విమానంలోనే వధువరులకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దేశం నలుమూలల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. -
గంట సేపు గాల్లోనే చక్కర్లు...
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు దుబాయ్కి వెళ్లిన భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. సరైన అనుమతులు లేవనే కారణంతో శనివారం బాక్సర్లు వెళ్లిన ప్రత్యేక విమానాన్ని (స్పైస్ జెట్) అక్కడి విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్కు అనుమతించలేదు. దాంతో గంటకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఆటగాళ్లంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇంధనం అయిపోవచ్చిదంటూ ‘ఫ్యూయల్ ఎమర్జెన్సీ’ని కూడా ప్రకటించింది. చివరకు విదేశాంగ శాఖ జోక్యంతో పరిస్థితి కుదుట పడింది. దీనిపై డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. కరోనా కారణంగా భారత్నుంచి వచ్చే విమానాలపై యూఏఈలో ఆంక్షలు ఉన్నాయి. సాధారణ ఫ్లయిట్లను ఆ దేశం అనుమతించడం లేదు. దాంతో ప్రభుత్వ అనుమతితో భారత బాక్సింగ్ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో సమన్వయ లోపం కారణంగా కిందకు దిగేందుకు అనుమతి దక్కలేదు. దాంతో యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన తర్వాత అధికారులు ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. అయితే మరో గంట పాటు అన్ని పత్రాల తనిఖీ పూర్తయ్యే వరకు బాక్సర్లు విమానంనుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా... భారత్ నుంచి 19 మంది బాక్సర్లు (10 మంది మహిళలు, 9 మంది పురుషులు) బరిలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మేజర్ బాక్సింగ్ టోర్నీ. మహిళల విభాగంలో మేరీ కామ్ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ బరిలో ఉన్నాడు. -
గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరీ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని ఎదుర్కోవడానికి మరో ఔషధ వినియోగానికి తాజాగా అనుమతి లభించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉండే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ విరాఫిన్ను ఉపయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగనికి అనుమతి లభించినట్లు జైడస్ కాడిలా ప్రకటించింది. తక్కువ స్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్డెసివర్ ఇంజక్షన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో 20-25 కేంద్రాలలో నిర్వహించిన మల్టీసెంట్రిక్ ట్రయల్ లో విరాఫిన్ కోవిడ్-19 చికిత్సలో ప్రధాన సవాళ్లలో ఒకటైన శ్వాసకోశ బాధలను, వైఫల్యాన్ని విరాఫిన్ నియంత్రించగలిగిందని ఇతర సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఏమి రాలేదని కంపెనీ పేర్కొంది. దేశంలో ఒకే రోజులో 3.32 లక్షల కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కు చేరుకోగా, క్రియాశీల కేసులు 24 లక్షలను దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి -
అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ
సాక్షి, న్యూ ఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్కు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్లో కరోనా కేసుల సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తగు చర్యలు తీసుకుంటోంది. అందుకుగాను విమానంలో మాస్క్లు సరిగా ధరించకపోతే లేదా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని ‘విధేయత లేని ప్రయాణీకులు' గా పరిగణిస్తామని డీజీసీఏ హెచ్చరించింది. మార్చి 13న రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో డీజీసీఏ , "విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు 'కోవిడ్ -19 ప్రోటోకాల్'లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్లను కచ్చితంగా ధరించాల’ని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్ , టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు. ఒకవేళ, ఎవరైనా ప్రయాణీకులు "కోవిడ్ -19 ప్రోటోకాల్" ను ఉల్లంఘింస్తే హెచ్చరికలను జారీ చేయాలని, తరువాత కూడా వినకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. (చదవండి: టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే) pic.twitter.com/YgW0HzrGoc — DGCA (@DGCAIndia) March 13, 2021 -
టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానయానాన్ని నియంత్రించే డీజీసీఏ మంగళవారం స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్గా అన్ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలని తెలిపింది. అన్ఫిట్ లక్షణాలు 14 రోజులకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్నెస్ ఉందో లేదో చెబుతామంది. పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత విమానాల్లో పని చేసే సిబ్బందిని అరగంట పాటు వైద్యులు పరిశీలిస్తారని చెప్పింది. -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూదిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్లను నడుపుతున్నారు.(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!) -
కర్నూలు ఎయిర్పోర్టుకు డీజీసీఏ అనుమతులు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులొచ్చాయి. విమాన సర్వీసులు ప్రారంభించడానికి అనుమతిస్తూ జనవరి 15న డీజీసీఏ ఉత్తర్వులిచ్చినట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, వేగంగా నిధులు మంజూరు చేయడంతో స్వల్ప కాలంలోనే కీలకమైన అనుమతులు పొందగలిగినట్టు ఆయన తెలిపారు. గతేడాదే విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు చేయడం సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టడంతో పాటు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎయిరొడ్రోమ్ లైసెన్స్తో పాటు, ఇతర అనుమతులు తీసుకురావడంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ కృషిని మంత్రి గౌతమ్రెడ్డి కొనియాడారు. డీజీసీఏ జారీ చేసిన అనుమతి పత్రం -
జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి వచ్చే(2021) జనవరికల్లా దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు ఎయిమ్స్(AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్కేర్ రంగ కంపెనీలే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం! వీటిలో ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్కాగా.. మరొకటి భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్. వీటిని ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) జనవరికల్లా అనుమతించవచ్చని రణదీప్ అంచనా వేశారు. మూడో దశ క్లినికల్ పరీక్షలలో ఉన్న వ్యాక్సిన్లకు ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 నిర్వహణకు సంబంధించిన జాతీయ టాస్క్ ఫోర్స్లో సభ్యులు కూడా కావడంతో రణదీప్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. యూకే బాటలో ఇటీవల యూకే ప్రభుత్వం అత్యవసర వినియోగానికి యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకండ్వేవ్లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో పలు దేశాలు ఈ బాటను అనుసరించే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకున్నాక వ్యాక్సిన్ పనితీరుపై డేటా ఆధారంగా ఔషధ నియంత్రణ సంస్థ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించే వీలున్నట్లు ఫార్మా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎస్ఐఆర్- ఐఐఐఎంకు చెందిన రామ్ విశ్వకర్మ సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగానూ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి సంప్రదించవచ్చని, అయితే డేటా ఆధారంగా డీసీజీఐ నిర్ణయాన్ని తీసుకోనుందని తెలియజేశారు. వ్యాక్సిన్కు అనుమతించడం లేదా మరిన్ని పరీక్షలకు ఆదేశించడం తదితర చర్యలకు వీలున్నట్లు వివరించారు. పరిశీలించాకే వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను పరిశీలించాక పరిస్థితులకు అనుగుణంగా డీసీజీఐ పరిమితకాలానికి ఎమర్జెన్సీ అనుమతిని మంజూరు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపై ఆయా కంపెనీలు వ్యాక్సిన్లపై పరీక్షల పూర్తి డేటాను అందజేయవలసి ఉంటుందని తెలియజేశారు. వ్యాక్సిన్ పనితీరు, భద్రత, ప్రమాణాలు, ఇతర ప్రభావాలు వంటి అంశాలను తెలియజేయవలసి ఉంటుందని వివరించారు. సైంటిస్టులు సిఫారసు చేశాక కొద్ది వారాలలోనే దేశీయంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో వారాంతాన ప్రధాని మోడీ సైతం ప్రకటించిన విషయం ప్రస్తావనార్హం! -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
కంగన ఎఫెక్ట్: రెండు వారాల పాటు నిషేధం
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. దాంతో కంగన ఇండిగో విమానంలో హుటా హుటిన ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఇబ్బందలు ఎదుర్కొనున్నాయి. సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల ఉల్లంఘించారనే ఆరోపణలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రెగ్యులేటరీ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. కంగన వచ్చిన విమానంలో చాలామంది మాస్క్లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా డీజీసీఏ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విమానంలో ఫోటోలు తీసినట్టు గుర్తిస్తే రెండు వారాలపాటు సర్వీసులను నిలిపివేయాల్సి ఉంటుందని డీజీసీఏ విమానయాన సంస్థలను హెచ్చరించింది. (కంగనా ఎపిసోడ్ : ఇండిగోకు నోటీసులు) pic.twitter.com/WiqckBK2w1 — DGCA (@DGCAIndia) September 12, 2020 నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిన ఉంటుందని డీజీసీఏ పేర్కొన్నది. ‘డైరెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లేదా సివిల్ ఏవియేషన్ విభాగం రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ లిఖితపూర్వకంగా మంజూరు చేసిన అనుమతి నిబంధనలు, షరతులకు లోబడి తప్ప ఏ వ్యక్తి ఫోటోలు తీయరాదు’ అని డీజీసీఏ శనివారం నాటి ప్రకటనలో తెలిపింది. అంతేకాక ‘ఇప్పటి నుంచి ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆ నిర్దిష్ట మార్గంలో రెండు వారాల పాటు విమాన సర్వీసులు నిలిపివేయబడతాయి. అంతేకాక ఉల్లంఘనకు కారణమైన వారిపై సదరు సంస్థ అన్ని చర్యలు తీసుకున్న తర్వాతే విమాన సర్వీసులు పునరుద్ధరించాల్సి ఉంటుంది’ అంటూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి ఉల్లంఘన అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో రాజీకి దారితీస్తుందని డీజీసీఏ వ్యాఖ్యానించింది. (చదవండి: ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) కంగన ముంబై వస్తున్న సందర్భంగా విమానంలో టీవీ ఛానెళ్ల సభ్యులతో మాట్లాడుతున్న ఒక వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు షేర్ చేస్తూ, ఫేస్ మాస్క్, సామాజిక దూరంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన డీజీసీఐ ఇండిగోకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది. క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్ ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్లను అనుసరించామని తెలిపింది -
కంగనా ఎపిసోడ్ : ఇండిగోకు నోటీసులు
సాక్షి,ముంబై: నటి కంగన రనౌత్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైలోని తన బాంద్రా బంగ్లాను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఇండిగో విమానంలో హుటా హుటిన కంగన ముంబైకు చేరుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండిగో చిక్కుల్లో పడింది. సెప్టెంబర్ 9న నటి కంగనా ప్రయాణించిన విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఇండిగో విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. చండీగఢ్-ముంబై విమానంలో చాలామంది మాస్క్ లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. టీవీ ఛానెళ్ల సభ్యులతో మాట్లాడుతున్న ఒక వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు ట్విటర్లో షేర్ చేస్తూ, ఫేస్ మాస్క్, సామాజిక దూరంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన డీజీసీఐ ఇండిగోకు తాజా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది. క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్ ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్లను అనుసరించామని తెలిపింది. కాగా ముంబైను పాకిస్తాన్లో పోల్చుతూ శివసేనపై కంగనారనౌత్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ముంబై బంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమం నిర్మాణమని బీఎంసీ ఆరోపించింది. అంతేకాదు ప్రొక్లెయినర్లతో అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండిగో విమానంలో జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నాబ్ గోస్వామి, నటుడు కునాల్ కమ్రా వివాదంలో కమ్రాను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. The flight’s still on the runway but when #KanganaRanuat is on the same flight as you, you gotta do what you gotta do..! Also, this is how this dude wore his mask all through the flight! #KanganaWelcomeToMumbai pic.twitter.com/zPMIcyv4v1 — Divya Talwar (@talwardivya) September 9, 2020 It was bad enough when I had to get on a plane with Tarun Tejpal and his family when he resurfaced before arrest in 2013. Worse now. This is flight risk. pic.twitter.com/SPQiaoySPm — Jaskirat Singh Bawa (@JaskiratSB) September 11, 2020 -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సోమవారం వెల్లడించింది. అయితే సంబంధిత అధికార యంత్రాంగం ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయా దేశాలతో పరస్పర ఒప్పందాలతో పాటు వందే భారత్ మిషన్ కింద కొద్ది నెలలుగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను ప్రభుత్వం నడుపుతోంది. ఇక కార్గో కార్యకలాపాలకు, డీజీసీఏ నిర్ధిష్టంగా అనుమతించిన విమానాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రకటన పేర్కొంది.అన్లాక్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్కూళ్లు, విద్యాసంస్ధల మూసివేతను సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. మరోవైపు సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టనుండగా, కంటైన్మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. చదవండి : అన్లాక్ 4.0 : మెట్రోకు గ్రీన్ సిగ్నల్ -
నో మాస్క్ , నో ఫ్లై : డీజీసీఏ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. మాస్కు ధరిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చి చెప్పింది. అంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు. గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందించవచ్చు. అలాగే అంతర్జాతీయ విమానాలు, చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లు కూడా తమ ప్రయాణీకులకు ప్రామాణిక పద్ధతుల ప్రకారం వేడి భోజనం, ఇతర పానీయాలను అందించేందుకు అనుమతించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది. అలాగే ప్రతీసారి సిబ్బంది హ్యాండ్ గ్లౌజులు ధరించాలని పేర్కొంది. ప్రయాణ ప్రారంభంలో ప్రయాణీకులకు డిస్పోజబుల్ ఇయర్ ఫోన్లు లేదా శుభ్రపరిచిన , శానిటైజ్ చేసిన హెడ్ ఫోన్లు అందిస్తారని తెలిపింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు మూడు నెలల తరువాత మే 25న దేశీయ విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమైనా, భోజనం సరఫరాకు అనుమతి లేదు. -
ఎయిర్ ఏషియాకు షాకిచ్చిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. "భద్రతా ఉల్లంఘనలపై" సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మాజీ పైలట్, ప్రముఖ యూట్యూబర్ కెప్టెన్ గౌరవ్ తనేజా ఆరోపణలకు మేరకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. జూన్ లోనే వీరికి షోకాజ్ నోటీసుల జారీ చేశామనీ, ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ హెడ్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ నేమాను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించామని సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నతనేజా ఈ సంవత్సరం జూన్ లో ఎయిర్ ఏషియా ఇండియాపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనపై వేటు వేశారంటూ ఒక వీడియోను షేర్ చేసిన ఆయన విమానయాన సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపించారు. ప్రయాణీకుల క్షేమం కోసం మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారంటూ ఒక వివరణాత్మక వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఇంధన ఆదా సాకుతో "ఫ్లాప్-3" మోడ్లో 98 శాతం ల్యాండింగ్లు చేయాలని పైలట్లపై ఒత్తిడి చేస్తోందని, అలా చేయని వారిని ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఉల్లంఘనగా పేర్కొంటోందని ఆరోపించారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సురక్షితమైంది కాదా, లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్లాప్-3 ల్యాండింగ్లు చేయమంటోందని, ఇది ప్రయాణీకుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ట్విటర్ లో దుమారం రూగింది. దీనిపై స్పందించిన డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించామనీ, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు. 184 మంది ప్రయాణికులతో దుబాయ్నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్ అనే ప్లంబర్ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 737ఐఎక్స్ 1344 విమానానికి చెందిన డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లు లభించాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. డీఎఫ్డీఆర్లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్ ప్రశంసించారు. విమాన ప్రమాదంలో కరోనా భయం విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు. పెళ్లి కోసం తిరిగివస్తూ... పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రియాస్ (24), సోదరుడు నిజాముద్దీన్తో కలిసి దుబాయ్లో పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్ కోళీకోడ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కో–పైలట్ భార్య నిండుగర్భిణి కోళీకోడ్ ఎయిర్పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్ అఖిలేష్ కుమార్(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్లోని మథురకు చెందిన అఖిలేష్కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్ తెలిపారు. మొదట అఖిలేష్కు సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణాలివేనా ? కోళీకోడ్లో విమానం దిగిన రన్ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్ రాడార్ చెబుతోంది. రన్ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ అమర్ సింగ్ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్ టాప్ రన్ వేపై సాధారణ రన్ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. టేబుల్ టాప్ రన్ వేలు ప్రమాదకరం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్ టాప్ రన్ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు. అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ మాజీ చీఫ్ బీఎన్ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్ వే అచ్చంగా ఒక టేబుల్ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు. కోళీకోడ్ విమానాశ్రయంలో రన్ వేకి రెండు వైపుల అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్ మార్షల్ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు. దేశంలో అయిదు మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. కోళీకోడ్ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్ప్రదేశ్), పాక్యాంగ్ (సిక్కిం), లెంగ్పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్ వేలు ఉన్నాయి. ఈ రన్ వేలపై షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ (ఎస్ఎఫ్పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు. -
మరో నెల రోజులు విదేశీ ప్రయాణాలు లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక విషయాన్ని ప్రకటించింది. ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతుందని శుక్రవారం వెల్లడించింది. అయితే డీజీసీఏ ప్రత్యేక అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అలాగే కార్గో విమానాలు, వందేమాతరం మిషన్లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని కూడా డీజీసీఏ జారీ చేసిన ఒక సర్క్యులర్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిన నేపథ్యంలో, జూలై నెల ఆరంభంలో అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని మరింత పొడిగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. వందే భారత్ మిషన్ కింద మే 6 - జూలై 30 మధ్యకాలంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ల ద్వారా మొత్తం 2,67,436 మందిని, ఇతర చార్టర్ల ద్వారా 4,86,811మంది ప్రయాణీకులను స్వదేశానికి తరలించినట్టు వెల్లడించింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి గాను విధించిన లాక్డౌన్ కారణంగా మార్చి 23న జాతీయ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25న ప్రత్యేక నిబంధనలతో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనాయి. మరోవైపు అన్లాక్ 3.0 లో భాగంగా లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్డౌన్ కాలంలో సంక్షోభంలో పడిన దేశీయ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది. కరోనా కట్టడి, సోషల్ డిస్టెన్సింగ్ కోసం విమాన ప్రయాణాల్లో విధించిన మధ్యసీటు ఖాళీ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీం మధ్య సీటు ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఎయిరిండియా పైలట్ దేవెన్ కానన్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ భూషణ్ గవైలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. తద్వారా ఎయిరిండియాతో పాటు ఇతర దేశీయ విమానయాన సంస్థలకు మధ్య సీటును భర్తి చేసుకునేందుకు అనుమతించింది. (అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు) దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు రెండు నెలల తర్వాత మే 25న సేవలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పౌర విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం లేకుండా మిడిల్ సీటును ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఇక డ్రోన్స్తో ఫుడ్ డెలివరీ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్వోఎస్ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులిచ్చింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దన్నుగా ఉన్న డ్రోన్ స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్కు ఇది తొలి అడుగు కానుంది. గతేడాది నుంచే ప్రయత్నాలు .. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్ ఫ్లయిట్స్ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్ అధిగమించినట్లు గోయల్ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్కు ఫుడ్ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్ స్టార్టప్ సంస్థ టెక్ఈగిల్ను కూడా కొనుగోలు చేసింది. డ్రోన్ ట్రయల్స్కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ మే నెలలో వెల్లడించింది. అనుమతి తప్పనిసరి... డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
విమానాలకు తప్పని మిడతల ముప్పు
న్యూఢిల్లీ: మిడతల దండు పచ్చని పైర్లకు, చెట్లకు మాత్రమే ప్రమాదంగా పరిణమించగా వీటివల్ల విమానాలకూ ముప్పు వాటిల్లే అవకాశముందని డీజీసీఏ(వైమానిక నియంత్రణ సంస్థ) హెచ్చరించింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయాల్లో ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీజీసీఏ శుక్రవారం పైలట్లకు, ఇంజనీర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో.. మిడతలు సాధారణంగా తక్కువ ఎత్తులోనే విహరిస్తాయని తెలిపింది. (రాకాసి పురుగుపై టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు) విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో విమానంలోని ప్రవేశ మార్గాల(ఇంజిన్ ఇన్లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్, తదితర మార్గాలు) ద్వారా మిడతల దండు లోనికే ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా విమానాలు ఎగురుతున్నప్పుడు ఆ ద్వారాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పిటోట్, స్టాటిక్ సోర్స్(గాలి ప్రవాహ వేగాన్ని కొలిచే సాధనాలు) మూసుకుపోవడం వల్ల గాలివేగం, అల్టీమీటర్ సూచీలు తప్పుడు సంకేతాలిస్తాయని తెలిపింది. కాగా ఖండాలను దాటుతూ పయనిస్తోన్న మిడతల దండు భారత్లో తొలిసారిగా రాజస్థాన్లోకి ప్రవేశించింది. అనంతరం పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. (మిడతల దండుపై దండయాత్ర) -
విమాన టికెట్ల బుకింగ్లను ఆపేయండి: డీజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3 వరకు లౌక్డౌన్ అమల్లో ఉండగా, ఆ తర్వాతి తేదీలకు ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ బుకింగ్లను కొనసాగిస్తుండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ‘‘ఎయిర్లైన్స్ సంస్థలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన సమయం, ముందస్తు నోటీసు ఇవ్వడం జరుగుతుంది’’ అంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లను నిలిపివేసింది. మే 4వ తేదీ నుంచి ప్రయాణాలకు ఎయిర్ఇండియాతోపాటు, ప్రైవేటు ఎయిర్లైన్స్ బుకింగ్లు తీసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు దూరంగా ఉండాలని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ సూచించడం గమనార్హం. -
మే 3 వరకు దేశీయ,అంతర్జాతీయ సర్వీసులు బంద్
శంషాబాద్: దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో ఈ మేరకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. లాక్డౌన్ నేపథ్యంలో మే 3 వరకు దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించవని మంగళవారం ట్విట్టర్లో పేర్కొంది. మే 15 నుంచి బుకింగ్లు చేపట్టిన ఎయిర్లైన్స్ల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. డీజీసీఏ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేనిదే టికెట్ల బుకింగ్ ఎలా ప్రారంభించారని పలువురు ప్రశ్నించారు. భారత్లో చిక్కుకుపోయిన విదేశీయులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. -
విమాన టికెట్లు క్రెడిట్ షెల్లోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్డౌన్ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్జెట్కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్జెట్లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. 15 నుంచి క్రెడిట్ షెల్లోకి.. ఇండిగో, స్పైస్జెట్ వంటి అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు ఆయా వెబ్సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్డౌన్ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే. ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది. రద్దీ తాత్కాలికమే.. ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే. -
రన్వే మీద జీపు; విమానంకు తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన ఎ321 విమానంకు శనివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. పుణే విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రన్వే మీద ఉన్న జీపును, డ్రైవర్ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్యూస్లేజ్ విభాగం(విమానం బాడీ) కాస్త దెబ్బతింది. అయితే విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!) ఇదే విషయమై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు స్పందిస్తూ.. 'పుణే ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ సమయంలో 120 నాట్స్ వేగంతో ఉంది. అయితే రన్వే మీద జీపును గమనించిన పైలట్ కాస్త ముందుగానే విమానాన్ని గాల్లోకి లేపడంతో విమానం బాడీ కాస్త దెబ్బతింది. అయితే విమనంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదానికి గురవ్వలేదు. పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రన్వేపై ఏదైనా గుర్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పూణే ఎటిసి(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సమన్వయం చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు సూచించాము. దీంతో పాటు విమానంలోని కాక్పిట్ రికార్డర్ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఎయిర్ఇండియాకు తెలిపాం' అని పేర్కొన్నారు. (సీఎం ప్రమాణ స్వీకారం.. 50 మంది అతిథులు వాళ్లే..!) -
ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!!
న్యూఢిల్లీ: ఇరాన్లోని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానం కూలిపోయిన నేపథ్యంలో..ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ఎయిర్లైన్స్లు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ డీజీసీఏ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్షియన్ గల్ఫ్ మీదుగా అమెరికన్ విమానాలను నిలిపివేయాలని ఆదేశించింది. -
నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో తన పాత విమానాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి కొత్త ‘ఏ 320 నియో’ విమానానికి.. అన్మోడిఫైడ్ ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లను కలిగిన పాత విమానాలను నిలుపుచేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. ఇక వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 97 ఏ 320 నియో విమానాల్లో పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాల్సిందేనని ఇటీవలే డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గడువుతేదీ లోపు మార్చకపోతే వీటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) హెచ్చరికను పట్టించుకోకుండా విమానాన్ని నడిపినందుకు ఇద్దరు ఇండిగో పైలట్లను డీజీసీఏ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇండిగో విమానం టేల్ ప్రాప్(విమానం ల్యాండ్ అయిన సమయంలో దానికి సపోర్టింగ్గా వెనుక భాగంలో ఉంచే స్టాండ్)తో అలానే టేకాఫ్ అయింది. విమానంలో గాల్లోకి లేచే సమయంలో టేల్ ప్రాప్ కిందకు వేలాడకూడదు. అయితే దీనిని గమనించిన ఏటీసీ అధికారులు విమానంలోని ఇద్దరు పైలట్లకు ఈ సమాచారం చేరవేశారు. అయితే వారు విమానాన్ని తిరిగి హైదరబాద్కు మళ్లించకుండా విజయవాడకు వెళ్లారు. జూలై 24న చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఆ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసింది. ఈ విధంగా టేల్ ప్రాప్ తో ప్రమాణం ప్రమాదకరమని డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సదరు పైలట్లకు షో కాజ్ నోటీసులు జారీ చేయగా.. వారు తమ తప్పును అంగీకరించారు. -
తప్పు కోడ్ పంపినందుకు పైలెట్ సస్పెండ్
శ్రీనగర్ : విమానానికి సంబంధించిన 'హైజాక్ కోడ్'ను ఏటీఎస్ అధికారులకు తప్పుగా పంపినందుకు ఎయిర్ ఏషియా ఇండియాకు చెందిన పైలెట్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. జూన్ 9న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న E-I5-715 విమానంలో సాంకేతిక లోపంతో ఒక ఇంజిన్ నిలిచిపోయింది. విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ రవి రాజ్ అత్యవసర కోడ్ 7700ను ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎటిఎస్) అధికారులకు పంపాల్సి ఉండగా, దానికి బదులు 7500 ను పంపినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన డీజీసీఏ జూన్ 28న సదరు పైలెట్కు షోకాజ్ నోటీసులు పంపినట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కెప్టెన్ రవిరాజ్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అతన్ని మూడునెలల పాటు విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీజీసీఏ వివరించింది. కాగా, విమానానికి సంబంధించి సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించనందుకు, పైలట్ రవిరాజ్ పనితీరును సరిగ్గా పర్యవేక్షించనందుకు పైలట్ కమ్ కమాండర్ కిరణ్ సాంగ్వాన్ను హెచ్చరించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయనను ఆదేశించింది. -
ఇండిగోకు మరో షాక్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ, ప్రమోటర్ల వివాదంతో చిక్కుల్లో పడిన ఇండిగోకు మరో షాక్ తగిలింది. ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) ఇండిగో సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీజీసీఏ ప్రత్యేక ఆడిట్ బృందం భద్రతా లోపాలను గుర్తించిన నేపథ్యంలో నలుగురు సీనియర్ ఉద్యోగులకు శుక్రవారం నోటీసులిచ్చింది. ట్రైనింగ్ హెడ్ కెప్టెన్ సంజీవ్ భల్లా, చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ కెప్టెన్ హేమంత్ కుమార్, ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషీమ్ మిత్రా, క్యూఏ (క్వాలిటీ అస్యూరెన్స్) కెప్టెన్ రాకేశ్ శ్రీవాస్తవలకు ఈ నోటీసులిచ్చింది. విమానాల ల్యాండింగ్ ప్రమాదాల సంఘటనల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు , విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 8, 9తేదీల్లో గుర్గావ్లోని ఇండిగో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రధాని జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్ మరోవైపు ఇండిగో ప్రమోటర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కో ప్రమోటర్ రాహుల్ భాటియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీకి లేఖ రాసిన ఇండిగో ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. సంస్థ ఎదుర్కొంటున్న కార్పొరేట్ పాలన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. -
పొరపాటున కూల్చేయొచ్చు; అందుకే..
న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో భారత్కు చెందిన పౌర విమానాల దారి మళ్లించనున్నట్లు డీజీసీఏ( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేయడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇరాన్ గగనతలం నుంచి ప్రయాణించే విమాన మార్గాలను మారుస్తున్నట్లు తెలిపింది. వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. కాగా హొర్ముజ్ జలసంధి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెళ్లే పౌర/వాణిజ్య విమానాలు కూడా పొరపాటున కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్రిటిష్ ఎయిర్వేస్, ఇతిహాద్, సింగపూర్ ఎయిర్లైన్స్, మలేసియా ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్ఎం సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన మార్గాలను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా నిర్ణయం ఫలితంగా న్యూయార్క్- ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఆ మార్గంలో విమానం నడిపి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించలేమని తెలిపింది. ఇక తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్ని ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై యుద్ధం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. అయితే ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నారు. కాగా ఒబామా కాలంలో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ సర్కార్ విరమించుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
సీనియర్ పైలట్ ఘనకార్యం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఇద్దరు పైలట్ల మధ్య ఈగో సమస్య వివాదం రేపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఓ సీనియర్ మగ పైలట్ ససేమిరా ఇష్టపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఓ మహిళ చెబితే తాను వినాలా అనుకున్నాడో ఏమో కానీ.. మూర్ఖంగా ప్రవర్తించాడు..అత్యవసర సమయంలో మహిళా సహ పైలట్ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విమానాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 2017లో జరిగిన ఈ ఘటనపై జరిపిన విచారణలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. 102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ 452 విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్వే కనిపించలేదు. దీంతో విమానం రన్వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో అధికారుల్లో, ప్రయాణీల్లో తీవ్ర ఆందోళనకుదారితీసిన ఈ ఘటనపై సీనియర్ అధికారులు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. భారీ వర్షం వల్ల విమానం రన్వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ..ఈ మగ పైలట్ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది. -
రాహుల్ విమానంలో ఇంజన్ సమస్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఢిల్లీ నుంచి పట్నాకు శుక్రవారం ప్రయణిస్తుండగా ఆయన విమానంలో ఇంజన్ సమస్యతో విమానాన్ని మళ్లీ ఢిల్లీకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఉదయం 10.20 గంటలకు విమానం సురక్షితంగా ఢిల్లీకి తిరిగొచ్చిందని, అప్పుడు విమానంలో సిబ్బందితో కలిపి పది మంది ఉన్నారని అధికారి చెప్పారు. ఇంజిన్లో సమస్య కారణంగా ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చిందని చెబుతూ రాహుల్ గాంధీ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సమస్య వల్ల శుక్రవారం బిహార్లోని సమస్తీపూర్లో, ఒడిశాలోని బాలాసోర్లో, మహారాష్ట్రలోని సంగమ్నేర్లో తాను పాల్గొనాల్సిన సమావేశాలు ఆలస్యమవుతాయనీ, అసౌకర్యం కలిగిస్తున్నందుకు క్షమించాలని ట్విట్టర్లో రాహుల్ కోరారు. అనంతరం సమస్తీపూర్లో ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్తో కలిసి రాహుల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ శుక్రవారం తనలాంటి పేరుతోనే ఉన్న మరో యువకుడిని కలుసుకున్నారు. బిహార్లోని సమస్తీపూర్లో ఓ సభలో ఆయన మాట్లాడుతూ అక్కడికొచ్చిన జనంలో ఒక యువకుడిని నీ పేరేంటి అని అడిగారు. అతను తన పేరు రాహుల్ అని చెప్పడంతో ప్రజలంతా ఉత్సాహంగా అరిచారు. అనంతరం రాహుల్ అతణ్ని వేదిక పైకి పిలిపించి, ఇతర నాయకులకు పరిచయం చేశారు. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంపై అత్యవసర భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యంతో మంగళవారం జరిపిన అత్యవసర భేటీలో డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నగదు లభ్యత కొరవడటంతో సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్ ఎయిర్వేస్ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. జెట్ ఎయిర్వేస్ చేతులెత్తేయడంతో వేతనాలపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మార్చి నాటికి వేతనాలను క్లియర్ చేస్తామని తమకిచ్చిన హామీ నెరవేరకపోవడంతో కంపెనీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని జెట్ ఎయిర్వేస్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. జెట్ ఎయిర్వేస్లో దాదాపు 560 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లు పనిచేస్తుండగా 490 మంది ఇంజనీర్లు ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ తమకు కంపెనీ మూడు నెలల జీతాలు బకాయి ఉందని ఇంజనీర్ల అసోసియేషన్ డీజీసీఏకు పంపిన ఈ మెయిల్లో పేర్కొంది. అత్యవసర భేటీ.. జెట్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులకు నెలకొన్న అసౌకర్యం నేపథ్యంలో అత్యవసర భేటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో డీజీసీఏ సంస్థ యాజమాన్యంతో సమావేశమైంది. విమాన సర్వీసుల రద్దు, క్యాన్సిలేషన్, రిఫండ్ల వివరాలతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, బ్యాంకర్లకు బకాయిలు వంటి పలు అంశాలపై యాజమాన్యంతో ఈ భేటీలో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సంక్షోభం సమసేలా.. ప్రైవేట్ ఎయిర్లైనర్ జెట్ ఎయిర్వేస్ దివాళా బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను కాపాడే క్రమంలో ప్రభుత్వం బ్యాంకర్లను చొరవ చూపాలని సూచించింది. బ్యాంకులకు కంపెనీ బకాయి పడిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని దివాళా గండం నుంచి గట్టెక్కించాలని బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కాగా, జెట్ ఎయిర్వేస్ను తిరిగిగాడిలో పెట్టే ప్రణాళికలను సైతం ఆయా బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టాల్లో ఎయిర్లైన్స్.. ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్ఎయిర్వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్కు తగ్గట్లుగా ఎయిర్లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు. ‘మ్యాక్స్’ సమస్యలు.. మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
నేలకు దిగిన బోయింగ్లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్జెట్కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్లను విశ్లేషణల కోసం యూరప్కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
ఇండిగో కస్టమర్ల నెత్తిన పిడుగు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పైలట్ కొరత కష్టాలు వీడడం లేదు. గత కొన్నిరోజులుగా రోజూ విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నసంస్థ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. విమాన సర్వీసుల రద్దు ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనుందని ప్రకటించింది. రోజుకు కనీసం 30 విమాన సేవలు రద్దు కానున్నాయంటూ ఇండిగో కస్టమర్ల నెత్తిన బాంబు వేసింది. ఎందుకంటే..చివరి నిమిషంలో ఇండిగో విమానాలు రద్దు కావడంతోపాటు, లాస్ట్ మినిట్ విమాన టికెట్ల బుకింగ్ చార్జీలతో ప్రయాణికుల భారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఈ అసౌకర్యతను నివారించడానికి, ముందుగానే సంబంధిత సర్దుబాట్లు చేస్తున్నామని, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నామని ఇండిగో చెబుతోంది. కాగా సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో 32విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా వెల్లడించింది. ఇది ఇలా వుంటే ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
ఆకాశయానంలో అనుకోని కష్టం
మన దేశంలో విమానయాన భద్రతకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల్లో లోపాలున్నాయని అమెరికాకు చెందిన ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) రెండు నెలలక్రితం చెప్పింది. వచ్చే 65 రోజుల్లోగా వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఈలోగానే వెంట్రుకవాసిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. గురువారం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ బోయింగ్ 737 శ్రేణి విమానంలో ఒక్కసారిగా పీడనం పడిపోవటంతో అందులోని 168 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. వారిలో 30 మందికి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు స్రవించింది. విమానంలో గాలి పీడనాన్ని నియంత్రించే మీట నొక్కటం మరిచిపోవటంవల్ల ఈ పరిణామం ఏర్పడింది. ఇలాంటి పొరపాట్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2005లో సైప్రస్ నుంచి గ్రీస్లోని ఏథెన్స్కు 115 మందితో వెళ్తున్న హెలియోస్ ఎయిర్వేస్ బోయింగ్ విమానంలో ఇలాంటి పొర బాటే జరిగి అది కుప్పకూలింది. పైలెట్లు మీట నొక్కడం మర్చిపోవటమే కాక పీడనం తగ్గుతున్నా గమనించలేకపోయారు. అంతే కాసేపటికి హైపోక్సియా (ఆక్సిజెన్ లోపించటం) ఏర్పడి వారు స్పృహ కోల్పోయారు. విమానాన్ని ఆటో పైలెట్ పద్ధతిలో ఉంచటంతో అది ఇంధనం అయిపోయేంతవరకూ గాల్లో ఎగిరి గ్రీస్ పర్వతాల్లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో సిబ్బంది సహా 121 మంది మరణించారు. విమానయాన భద్రత వ్యవహారాలను దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలోని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఆ సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ విధానాలు సంతృప్తికరంగా లేవని ఎఫ్ఏఏ తేల్చింది. ఎఫ్ఏఏకన్నా ముందు అంతర్జా తీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) సైతం ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. విమా నయాన భద్రత పర్యవేక్షణలో భారత్ స్థితి పాకిస్తాన్, నేపాల్ దేశాలతో పోల్చినా నాసిరకంగా ఉన్న దని వ్యాఖ్యానించింది. వైమానిక భద్రతలో మన స్కోరు 65.82 నుంచి 57.44కు పడిపోయిందని అది తేల్చింది. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు రోజూ వేలాది విమానాల రాకపోకలు సాగు తుంటాయి. ఇంతవరకూ ఈ మాదిరి ఘటన ఎప్పుడూ జరగలేదు. విమానం ఇంజిన్ ఆన్ చేసే ముందు క్యాబిన్లో ఒత్తిడి ఏమేరకు ఉందో పైలెట్లు చూసుకుంటారు. టేకాఫ్కు ముందు గాలి పీడ నాన్ని నియంత్రించే బటన్ నొక్కుతారు. దాంతో ఇంజిన్ నుంచి వేడి గాలి ఏసీ వ్యవస్థలోని హీట్ ఎక్స్చ్ంజర్లోకి ప్రవేశిస్తుంది. ఆ వ్యవస్థ దాన్ని చల్లగా మార్చి కేబిన్లోకి పంపుతుంది. పర్యవసా నంగా కేబిన్లో ఉష్ణోగ్రత, పీడనం నియంత్రణలో ఉంటాయి. ఇదంతా నిత్యం యధావిధిగా సాగి పోతుంది. కానీ జెట్ ఎయిర్వేస్ విమానం ప్రధాన పైలెట్ దీన్ని మరిచిపోయారు. విమానం గాల్లో 10,000 అడుగులు లేచాక పది నిమిషాల్లోనే ఆ ప్రభావం ప్రయాణికుల అనుభవంలోకొచ్చింది. ఆక్సిజెన్ స్థాయి పడిపోయింది. వెంటనే పొరపాటు గ్రహించి విమానాన్ని వెనక్కి తీసుకురావటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీనంతటికీ 23 నిమిషాలు పట్టింది. 30మంది అస్వస్థులయ్యారు. ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చినవారు కొందరైతే, కొందరికి దాంతోపాటు వినికిడి లోపం కూడా ఎదురైంది. దీన్ని గుర్తించటంలో ఇంకా ఆలస్యమై ఉంటే ముందు ఊపిరితిత్తులకు, తర్వాత మెదడుకు ఇబ్బందులు ఎదురై శాశ్వత అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బీపీ, హృద్రోగ సమస్యలున్నవారికి ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. ప్రధాన పైలెట్కు విమానాల్ని నడపడంలో 14 ఏళ్ల అనుభవం ఉంది. అయినా ఈ ఘటన చోటుచేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలికాలంలో ఎయిరిండియా విమానాన్ని మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయంలో నిర్దేశిత స్థలంలో కాక నిర్మాణంలో ఉన్న వేరే రన్వేపై దించటం వివాదాస్పదమైంది. పైలెట్ చేసిన తప్పిదం కారణంగా విమానం ప్రధాన చక్రాలు దెబ్బతిన్నాయి. అనుకోనిదేమైనా జరిగుంటే విమానంలోని 136మంది ప్రయాణికులకు ముప్పు ఏర్పడేది. ఢిల్లీ నుంచి 370మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్లిన మరో ఎయిరిండియా విమానం పదిరోజులక్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ విమానానికున్న బహువిధ వ్యవస్థలు ఒక్కసారిగా విఫలం కావటం, వాతావరణ పరిస్థితి బాగులేక పోవటం, అన్నిటికీ మించి విమానంలో ఇంధనం దాదాపు అడుగంటడం వంటివి ఒకేసారి చుట్టుము ట్టాయి. అయితే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడి అనుమతి తీసుకుని జాగ్రత్తగా కిందకు దించాడు. సుదూర ప్రాంతాలకెళ్లే విమానంలో ఇలా బహువిధ వ్యవస్థలు విఫలం కావటం అసాధారణమైన విషయం. విమానం గాల్లోకి లేచాక అందులో ఎదురయ్యే ఏ సమస్య విషయంలోనైనా విమాన సిబ్బంది వ్యవహరించే తీరు చాలా ముఖ్యమైనది. వారు ఏమాత్రం కంగారు పడినట్టు కనిపించినా, సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయినా ప్రయా ణికుల్లో ఉండే కంగారు మరింత పెరుగుతుంది. ఎఫ్ఏఏ ఆడిట్లో బయటపడిన అంశాలపై మన డీజీసీఏ శ్రద్ధ పెట్టి గట్టి చర్యలు తీసుకోవడం తప్ప నిసరి. ఆ సంస్థ నిబంధనల ప్రకారం అది ఎత్తిచూపిన లోటుపాట్లపై 30 రోజుల్లోగా నివేదిక పంపాలి. ఆ తర్వాత ఎఫ్ఏఏ ప్రతినిధి బృందం మరో నెలరోజుల్లో వచ్చి ఏ తరహా చర్యలు తీసుకు న్నదీ సమీక్షిస్తుంది. దాని ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న అభిప్రాయం కలిగితే కొత్తగా మన దేశం నుంచి వెళ్లే విమానాలను అనుమతించటం నిలిపేస్తారు. ఇప్పుడు నడుస్తున్న విమానాలకు కఠినమైన తనిఖీలు మొదలవుతాయి. పర్యవసానంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ తనిఖీలన్నీ పూర్తయి ప్రయాణికులు దిగి విమానాశ్రయ ప్రాంగణంలోకి చేరుకోవటానికి బోలెడు సమయం పడుతుంది. దాంతో ఆ దేశానికెళ్లే ప్రయాణికులు మన విమానయాన సంస్థల్ని ఎంచుకోవటం మానుకుంటారు. తరచు సమస్యలెదురవుతున్నపుడు, ఎఫ్ఏఏ, ఐఓసీఏ వంటి సంస్థలు లోపాలు ఎత్తిచూపినప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టడం అవసరం. ఈ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. -
విమానాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఎన్జీటీ గట్టి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: టాయిలెట్ వ్యర్థాలను గాల్లో వదిలి వేయకుండా చర్యలు తీసుకోవడానికి తామిచ్చిన మార్గదర్శకాలను పక్కన పడేసిన పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ జీతభత్యాలను నిలుపుదల చేయిస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో డీజీసీఏ విఫలమయ్యారని మండిపడింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విమానాల్లో పోగైన టాయిలెట్ వ్యర్థాలు గాల్లో పడేయకుండా నిరోధించేందుకు డీజీసీఏకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. లేదంటే సెప్టెంబర్ 17 జరిగే తదుపరి విచారణకు డీజీసీ డైరెక్టర్ హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇళ్లపై గాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గల నివాసాలపై విమానాల నుంచి టాయిలెట్ వ్యర్థాలు పడుతున్నాయని 2016లో సావంత్ సింగ్ దహియా అనే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ అప్పట్లో డీజీసీయేకు మార్గదర్శకాలు జారీ చేసింది. గాల్లో మానవ వ్యర్థాలను పడేస్తున్న విమాన సంస్థలు పర్యావరణ సహాయ నిధిగా 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ విమాననాశ్రయం గుండా వెళ్లే విమాన సంస్థలకు సర్క్యులర్ జారీ చేయాలని డీజీసీఏని ఆదేశించింది. కాగా, ఎన్జీటీ నోటీసులపై స్పందించిన పౌర విమానయాన సంస్థ.. విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వ్యర్థాలను పడేసే అవకాశమే ఉండదని తెలిపింది. ఫిర్యాదు దారు ఇంటిపై పక్షుల రెట్టలు పడ్డాయేమోనని పేర్కొంది. నేటి ఆధునిక కాలంలో విమానాల్లో పోగైన మానవ వ్యర్థాలను నిల్వ చేసే సదుపాయం ఉందనీ, విమానాశ్రయాల్లో మాత్రమే వాటిని పడేస్తామని సెలవిచ్చింది. మరోవైపు.. ఫిర్యాదుదారు ఇల్లు, ఆ చుట్టుపక్కల భవనాలపై పడిన వ్యర్థాల నమూనాలు సేకరించి విచారిచేందుకు ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఇళ్లపై పడిన వ్యర్థాలు టాయిలెట్ వ్యర్థాలేనని సదరు కమిటీ తేల్చింది. దీంతో మరోమారు ఈ విషయంపై ఎన్జీటీ రంగంలోకి దిగింది. నోటీసులను బేఖాతరు చేసిన డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించింది. -
‘నో ఫ్లై లిస్ట్’లో బంగారం వ్యాపారి
న్యూఢిల్లీ: ప్రియురాలిని ఉద్యోగం మాన్పించి.. తనతో పాటు తీసుకెళ్లేందుకు గతేడాది అక్టోబర్లో జెట్ ఎయిర్ వేస్ విమానంలో హైజాక్ డ్రామా ఆడిన బంగారం వ్యాపారి బిర్జూ కిషోర్ సల్లా(37)ను విమానాలు ఎక్కకుండా నిషేధిస్తూ ( నో ఫ్లై లిస్ట్) డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి సాధారణ పౌరుడిగా కిషోర్ సల్లా రికార్డు సృష్టించాడు. కానీ నిషేధం ఎంతకాలం అమల్లో ఉంటుందో డీజీసీఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు ఆయన్ను నిషేధిత జాబితాలో చేర్చామని సంస్థ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 30న ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో హైజాకర్లు ఉన్నారు..ఢిల్లీలో విమానాన్ని ల్యాండ్ చేస్తే పేల్చేస్తామని కిషోర్ టాయిలెట్లో లెటర్ పెట్టాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్లో ల్యాండ్ చేశారు. -
విమాన ఆలస్యం.. వామ్మో అంత జరిమానా!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాలు వెన్నంటే ఉన్నట్టు ఉన్నాయి. విమాన ఆలస్యమైనందున ఈ విమానయాన సంస్థ భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైనందుకు 323 మంది ప్రయాణికులకు 8.8మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.59కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ వల్ల ఈ ఆలస్యం ఏర్పడింది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన ఏఐ 127 విమానం 16 గంటల్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్వాకీ ప్రాంతానికి తరలించారు. మిల్వాకీ నుంచి చికాగోకు విమానంలో వెళ్లడానికి 19 నిమిషాలే సమయం పడుతుంది. ఆ సమయానికే ఆ విమానం 16 గంటలు ప్రయాణించింది. డీజీసీఏ నిబంధలన ప్రకారం విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. దీంతో విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోయాయి. మరోవైపు నిబంధనలనుసరించి వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్కు అనుమతి ఉంది. ఈ కారణాలతో మరో మార్గం లేక ఎయిరిండియా ఆ విమానం కోసం కొత్త సిబ్బందిని రోడ్డుమార్గంలో మిల్వాకీకి తరలించింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆ విమానం చికాగో చేరుకోవడానికి దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు కూడా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఆరు గంటల ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్న ఎయిరిండియా మరో పెద్ద సమస్యే ఎదురైంది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై ఆ విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. అంటే ఆ విమానంలో 323 మంది ప్రయాణికులు ఉన్నందున మొత్తం కలిపి 8.8మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తున్నందున డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ ఫిర్యాదు మే 15న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో తాము వాతావరణ ప్రతికూలతతోనే విమానాన్ని దారి మరలించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. -
240 ప్రాణాలు..15 వేల అడుగులు
న్యూఢిల్లీ: ఓ విమానం.. 240 మంది ప్రయాణికులు.. 15 వేల అడుగుల ఎత్తు.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఊడిపడిన విమానం కిటికీ ప్యానెల్.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర గందరగోళం.. ఆందోళన.. 12 నిమిషాలపాటు నరకం. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన విమానం. ఈనెల 19న అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఎయిరిండియా విమానంలో నెలకొన్న పరిస్థితి ఇది. విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అదే సమయంలో కిటికీ ప్యానెల్ ఊడిపడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో, తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారు వేరే విమానాల్లో వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎయిరిండియాతోపాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టొరేట్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదాల దర్యాప్తు బోర్డు (ఏఏఐబీ) విచారణ జరుపుతున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 50 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఊడిపడిన కిటికీ ప్యానెల్ను తిరిగి బిగించేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నిస్తుండటం అందులో కనిపించింది. -
వైరల్ : గాల్లోనే తెరుచుకున్న విమానం కిటికీ
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం(ఏప్రిల్ 19) అమృత్సర్ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. ఒక్కసారిగా విమాన కిటికీ తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం 15వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కిటికీ ఒక్కసారిగా తెరుచుకుందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించామన్నారు. విమానంలో పది నిమిషాల పాటు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఎయిర్హోస్టెస్ కిటికీని యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికి
-
ఇండిగో సర్వీసులు రద్దు.. నగరాలకు ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ ధరకే టికెట్లు అందిస్తూ సామాన్యుడు సైతం గగనయానం చేసేలా సర్వీసులు అందిస్తున్న ఇండిగో విమానయాన సంస్థ మంగళవారం 47 సర్వీసులను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గువాహటి తదితర నగరాలకు తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణీకులు చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇంజిన్ పరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఇండిగో చెందిన 8 ఏ 320 విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసింది. దీంతోపాటు మరో మూడు గో ఎయిర్ విమానాలను కూడా ఆపేయించింది. ఈ నేపథ్యంలో ఇండిగో దేశీయ సేవలు అందించే 47 విమానాలను మంగళవారం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్లో కూడా పేర్కొంది. లక్నో వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానం 40 నిమిషాల తర్వాత ఇంజిన్లో సమస్య ఏర్పడిందని తిరిగి అహ్మదాబాద్ తిరిగొచ్చింది. తరుచుగా ఇండిగోలోని ఏ 320 విమానాల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు వెంటనే ఎనిమిది విమానాలను ఉన్నపలంగా ఆపేయాలని డీజీసీఏ ఆదేశించింది.


