India Ban On International Commercial Flights Till September 30 - Sakshi
Sakshi News home page

విమానాల నిషేధం పొడిగింపు

Aug 30 2021 6:32 AM | Updated on Aug 30 2021 11:08 AM

India extends international flight ban till September 31 - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్‌ మిషన్‌తో పాటు, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ వంటి 28 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement