3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు | DGCA initiates action on 3 airlines | Sakshi
Sakshi News home page

3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు

Aug 30 2024 2:33 AM | Updated on Aug 30 2024 2:33 AM

DGCA initiates action on 3 airlines

న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. 

అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

ఫ్లయిట్స్‌ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్‌ యూనిట్ల స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదంపై ఆడిట్‌ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్‌ ఏవియేషన్‌ అనుమతులను డీజీసీఏ సస్పెండ్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement