
👉అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా పర్యటన
- విమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి
- విమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదు
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
- డీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాం
- గుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.
- విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశాను
- మృతదేహాల వెలికితీత పూర్తైంది
👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందం
విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ
ఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతి
అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం
2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని
👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా
క్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్
బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం
👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడు
ఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ
11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులు
ఆలస్యంగా గుర్తించిన పోలీసులు
రమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు
👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?
మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానం
విమానానికి పలుమార్లు సాంకేతిక లోపం
గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలు
ఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు
జూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు
👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!
229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి
10 మంది విమాన సిబ్బంది మృతి
👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన
విమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారు
మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖ
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
ఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..
మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..
👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్
బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్
స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్
👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్
క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
జరిగిన ఘటన దురదృష్టకరం
చాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాం
రక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్
రక్తదాన కేంద్రాలు:
1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524
2. IHBT Department, Civil Hospital
2nd floor, 1200 bed Civil Hospital,
Contact no-9428265409
3. IKDRC Blood Centre
1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi
Contact no-07922687500
Ext no-4226
4. GCRI Blood Centre
1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026
👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించింది
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన
బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని
👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి
బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్
👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859
ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444
👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం
బీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతి
విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది
👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు
హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444
ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్
బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్
👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు
విమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు
విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు
అహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు
👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటన
విమానంలో 242 మంది ప్రయాణికులు
ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది
ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది
ఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదు
అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలింది
ఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం

👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్
విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని
ఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ
👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులు
సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేత
విమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లు
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?
విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది
పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానం
విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్
న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd
— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025
828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షా
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విమానంలో 242 మంది: డీజీసీఏ
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.
