Plane Accident
-
Plane Crash: నా భార్యకింకా తెలియదు..!
అహ్మదాబాద్: ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఓ టీ స్టాల్ వెనక కూలింది. ఆ టీ కొట్టు నడిపే సీతాబెన్ అనే మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. కాలిన గాయాలతో బతికి బయటపడింది. చెట్టుకింద టీస్టాల్లో నిద్రపోతున్న 14 ఏళ్ల కుమారుడు ఆకాశ్ మాత్రం మంటలకు బలయ్యాడు. తన వెనకగా చెలరేగుతున్న మంటల నుంచి సీతాబెన్ తప్పించుకుని పరుగెత్తుకుంటూ వస్తున్న వీడియో వైరల్గా మారింది. ఐసీయూలో కోలుకుంటున్న ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘నేను విమానాన్ని చూడలేదు. కానీ భారీ శబ్దం విన్పించింది. వెంటనే మంటలు, పొగ కమ్ము కుంటుండటంతో ఏమీ కన్పించకుండా పోయింది. భయపడి పరుగులు తీశాను’’ అంటూ గుర్తు చేసుకుంది.నా భార్యకింకా తెలియదుసీతాబెన్ భర్త సురేశ్కుమార్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ‘‘ప్రమాద సమ యంలో నేను ఇంట్లో ఉన్నా. టీ స్టాల్లో ఉన్న నా భార్యకు ఆకాశ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లాడు. తర్వాత అక్కడే పడుకుని ప్రమాదానికి బలైపో యాడు’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘ఈ ఘోరం గురించి నా భార్యకు ఇంకా చెప్పలేదు. నా కొడుకు మృతదేహం గుర్తించలేనంతగా కాలిపోయింది. దాంతో పరీక్షల నిమిత్తం నా డీఎన్ఏ నమూనా ఇచ్చా’’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. -
‘నాన్నా.. నేను మాత్రం బ్రతికాను.. తమ్ముడు ఏమయ్యాడో తెలీదు’
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం జూన్ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్ విశ్వాస్ కుమార్తో పాటు అతని సోదరుడు కూడా లండన్ బయల్దేరాడు. కానీ రమేశ్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్ తన తండ్రికి ఫోన్ చేసిన విషయాన్ని రమేశ్ మరో సోదరుడు నయన్ కుమార్ రమేశ్ స్కై న్యూస్క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్ విశ్వాస్ ఫోన్ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు. What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే! -
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్లో ఐదు సెకన్ల పాటు రికార్డ్ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్.. నో త్రస్ట్.. గోయింగ్ డౌన్ ఇవి కెప్టెన్ సబర్వాల్ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే..!ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. -
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్పోర్ట్కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్తో నా కూతురు ఎయిర్పోర్ట్కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు. -
విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ఆకాశంలో విషాదం!
గుజరాత్లోని అహమ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్–787–8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్లైనర్ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్లో పనిచేసిన ఒక ఇంజనీర్ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
ఆయనొక యోగా ఔత్సాహికుడు.. భారత్లో యోగా ప్రోగ్రామ్లు నిమిత్తం అహ్మదాబాద్కు వచ్చారు. కొన్ని రోజుల పాటు అహ్మదాబాద్లోని ద హౌస్ ఆఫ్ ఎంజీలో బస చేశారు. ఇక ఇక్కడ ప్రోగ్రామ్లు పూర్తి కావడంతో భారత్ గురించి, అహ్మదాబాద్లోని తాను బస చేసిన హోటల్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా బ్రిటన్లో ఉన్న భార్యకు షేర్ చేశాడు. అహ్మదాబాద్లోని ద హౌస్ ఆఫ్ ఎంజీపై ప్రశంసలు కురిపించారు. నిజంగానే ఒక హెరిటేజ్ హోటల్ అని, భారత్లోని తన అనుభవాలు అద్భుతమని ఇలా ఒక్కో స్టోరీని పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి(బుధవారం, జూన్ 11) ఇదే ఇక్కడ చివరి రాత్రి అంటూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఇప్పుడు అదే వైరల్గా మారింది. దాంతో పాటు విమానం ఎక్కేముందు ‘గుడ్ బై ఇండియా’ అని బ్రిటన్కు చెందిన జమీ మీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాసేపటికి ఆయన విమానం ప్రమాదంలో మృతి చెందడం జరిగిపోయాయి. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! కాగా, గురువారం(జూన్ 12) అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా టేకాఫ్ తీసుకున్న తర్వాత జనవాసాలపై కూలిపోయింది. బీజే మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు. అయితే విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్రరు బ్రతికిబయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
Plane Crash: రెండు ఇంజన్లు ఉన్నా ఎలా కూలింది?
-
Plane Crash: విమానంలో ఉన్నవారందరూ మృతి
-
భారత దేశ చరిత్రలో.. అతిపెద్ద విమాన ప్రమాదం
-
విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం ప్రయాణికులు దుర్మరణం చెందినట్ల తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు.విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..ఈ ప్రమాదం కూలిన వెంటనే దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి.. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడారు. ‘ నేను విమానం కూలినప్పుడు నేను ఇంటిలోనే ఉన్నా. ఒక్కసారిగా బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందని బయటకి వచ్చి చూశాను. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించి ఉంది. అక్కడకు వెళ్లి చూశాను. విమానం కూలిపోయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అక్కడంతా భయానకంగా కనిపించింది’ అని పేర్కొన్నారు. VIDEO | Ahmedabad plane crash: Here's what an eyewitness said:"I was at home when we heard a massive sound. When we went out to see what had happened, there was a layer of thick smoke in the air. When we came here, dead bodies and debris from the crashed aircraft were scattered… pic.twitter.com/Km0xCm9yde— Press Trust of India (@PTI_News) June 12, 2025 -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
👉అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా పర్యటనవిమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతివిమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదుబాధిత కుటుంబాలకు అండగా ఉంటాండీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాంగుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశానుమృతదేహాల వెలికితీత పూర్తైంది👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్పోర్టును మూసివేశారు. -
అమెరికాలో మరో విమాన ప్రమాదం..
-
అమెరికాలో మరో విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఈశాన్య ఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. First hand video of what happened in northeast Philadelphia pic.twitter.com/LJt912Tw6l— Darren Minto (@FB_Darren) February 1, 2025ప్రమాదానికి గురైన విమానాన్ని లీఆర్జెట్ 55గా గుర్తించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ శాప్రియా స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, విమానం మిస్సోరీ వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, సాంకేతిక లోపం కారణంగానే విమాన ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, ఫెలడెల్ఫియా ఎయిర్పోర్టు నుంచి బిజినెస్ సంబంధిత జెట్స్, చిన్న విమానాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. 🚨BREAKING: A small plane fell out of the sky in Northeast Philadelphia.Wow, less than 2 weeks in trump's America, egg prices through the roof, tariffs making other prices skyrocket, and planes falling out of the sky.MAGA: Making America Gross Againpic.twitter.com/yiLjKYyaAB— BrooklynDad_Defiant!☮️ (@mmpadellan) February 1, 2025ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొని, నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను, విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి. కానీ, ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి
జుబా: సౌత్ సూడాన్లో (south sudan) ఘోర విమాన (plane crash) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు.యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది.ప్రమాదంతో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిధిలాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Maker Makoi, one of the two survivors that survived today’s Plane Crash in Unity State, South Sudan which resulted to the death of 19 passengers. pic.twitter.com/LEykATYz4W— South Sudan Eagles Media (@ssemtv) January 29, 2025ప్రమాదంపై సౌత్ సూడాన్ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. విమానం ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. స్థానిక అధికారుల వివరాల మేరకు.. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌత్ సూడాన్ 2011లో స్వాతంత్ర్యం పొందించింది. నాటి నుంచి దక్షిణ సూడాన్ పేలవమైన రవాణా కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదాలు సర్వసాధారణమని సమాచారం. 👉చదవండి: నల్లపెట్టె మౌనరాగం! -
California: కూలిన విమానం
-
179 ప్రాణాలు బుగ్గిపాలు
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 179 మంది ప్రయాణికులు నిస్సహాయంగా మంటల్లో చిక్కి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఆదివారం ఉదయం 9.03 గంటలకు థాయ్లాండ్లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజూ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737–800 విమానం ముయాన్ ఎయిర్పోర్టులో రన్వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా గుర్తించిన మృతుల్లో 85 మంది మహిళలు కాగా 84 మంది పురుషులు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. మహిళలో, పురుషులో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు. విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు. వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రమాదంలోనే కన్నుమూశారు. వారిలో అత్యధికులు దక్షిణకొరియా పౌరులే. ఇద్దరు మాత్రం థాయ్లాండ్ జాతీయులని తేలింది. రాజధాని సియోల్కు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడ్డ బోయింగ్ 737–800 విమానం 15 ఏళ్ల నాటిది. ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. తెరుచుకోని ల్యాండింగ్ గేర్ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ మూసే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేగంగా దూసుకొచి్చన విమానం రన్వేపై దిగుతూనే అదుపు తప్పింది. అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందుభాగం రక్షణ గోడను ఢీకొంది. అప్పటికీ వేగం పూర్తిగా తగ్గక మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకుని ఉవ్వెతున ఎగిశాయి. చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. విమానం పూర్తిగా ధ్వంసమైందని, కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగల స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 32 అగ్నిమాపక యంత్రాలు, హెలికాప్టర్ల సాయంతో 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, థాయ్లాండ్ ప్రధాని పెటాంగ్తర్న్ షినవత్ర తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జెజూ ఎయిర్ సంస్థ క్షమాపణ తెలిపింది. పక్షి వల్లే ప్రమాదమా? ల్యాండింగ్కు కాసేపటి ముందు పైలట్కు టవర్ సిబ్బంది బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చారని దక్షిణ కొరియా రవాణా శాఖ వెల్లడించింది. ‘‘ప్రమాదానికి ముందు విమాన పైలట్, ఎయిర్పోర్టు కంట్రోల్ టవర్ మధ్య సంభాషణను విశ్లేషించాం. విమానాన్ని పక్షి ఢీకొట్టేలా ఉండటంతో మరో రన్వేపై దిగడానికి అనుమతిచ్చారు. అక్కడ దిగలేని పరిస్థితి ఉందంటూ పైలట్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం రన్వే చివరి భాగంలో దిగి అదుపు తప్పింది’’ అని తెలియజేసింది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి విశ్లేషణకు పంపారు. దర్యాప్తు పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రన్వేను జనవరి 1వ తేదీ దాకా మూసేశారు.త్రుటిలో తప్పిన మరో మూడు ప్రమాదాలు కెనడాలో విమానానికి మంటలు నార్వేలో అదుపు తప్పిన విమానం నేపాల్లో హెలికాప్టర్ను ఢీకొన్న పక్షి ఒట్టావా/ఓస్లో/కఠ్మాండు: దక్షిణ కొరియా ప్రమాదం జరిగిన కాసేపటికే ఆదివారం మరో రెండు భారీ విమాన ప్రమాదాలు త్రుటిలో తప్పాయి. కెనడాలో సెయింట్ జాన్స్ నుంచి వస్తున్న ఎయిర్ కెనడా 2259 విమానం హలిఫాక్స్ విమానాశ్రయంలో రన్వేపై దిగుతూ అదుపు తప్పింది. దాంతో విమానానికి మంటలంటుకున్నాయి! అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఒక టైర్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో రన్వేపై దిగగానే విమానం అదుపు తప్పి 20 డిగ్రీల కోణంలో ఎడమకు వాలి అలాగే దూసుకెళ్లింది. దాంతో మంటలు అంటుకుని విమానం ఎడమ భాగం కాలిపోయింది. పెద్ద శబ్దం వినిపించింది. పైలట్ చాకచాక్యంగా విమానాన్ని ఆపగలిగాడు. వెంటనే సహాయక సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. నార్వేలో కూడా ఓ విమానం అత్యవసరంగా ల్యాండవుతూ అదుపు తప్పింది. ఓస్లో నుంచి నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్కు బయల్దేరిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737–800 టేకాఫయిన కాసేపటికే హైడ్రాలిక్ విఫలమైంది. దాంతో ఓస్లోకు 110 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి రన్వేను తాకి దట్టమైన గడ్డిలోకి వెళ్లి ఆగింది. విమానంలోని 182 మందినీ వెంటనే భద్రంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని బేస్ లుక్లా నుంచి ఆదివారం ఐదుగురు అమెరికన్లతో బయల్దేరిన హెలికాప్టర్ను పక్షి ఢీకొంది. దాంతో సురక్షితంగా బనెపాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. -
కజకిస్తాన్ ప్రమాదం.. విమానం లోపల ప్రయాణికుడి వీడియో వైరల్
మాస్కో: కజకిస్తాన్లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్లోని అక్తావ్ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమం అక్టౌలో కూలిపోయింది.అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదం నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024 -
గాలిలో మృత్యు ప్రయాణం
మాస్కో: విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్లోని అక్తావ్ నగర సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజీ్నలో పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. అక్తావ్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయతి్నంచారు. అదుపు తప్పిన విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ఎయిర్పోర్టు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే అనుమతి రాకపోవడంతో విమానం ఆకాశంలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. చివరకు అదుపుతప్పి నేలపైకి దూసుకొచి్చంది. ప్రమాదాన్ని నివారించడానికి పైలట్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కొందరి పరిస్థితి విషమం ప్రమాదానికి గురైన విమానంలో 42 మంది అజర్బైజాన్ పౌరులు, 16 మంది రష్యా జాతీయులు, ఆరుగురు కజకిస్తాన్ పౌరులు, ముగ్గురు కిర్గిజిస్తాన్ పౌరులు ఉన్నట్లు కజకిస్తాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కానీ, ఇద్దరు పైలట్లు కూడా మరణించారని రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ వెల్లడించింది. కనీసం 32 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అజర్బైజాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం స్పష్టంచేసింది. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అజర్బైజాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.పక్షి ఢీకొట్టడం వల్లే ప్రమాదం?ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా వైపు విమానం ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పక్షి ఢీకొట్టిందని, దాంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమయ్యారని, విమానాన్ని దారిమళ్లించడానికి ప్రయతి్నంచారని, కొద్దిసేపు తర్జనభర్జన తర్వాత అక్తావ్ వైపు మళ్లించారని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మొబైల్ ఫోన్ ఫుటేజీ సైతం సోషల్ మీడియాలో ప్రసారమైంది. విమానం నిట్టనిలువుగా కిందికి దూసుకొస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. అది భూమిని తాకిన వెంటనే మంటలు చెలరేగాయి. విమాన ప్రధాన భాగం నుంచి రెక్కలు విడిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తమ సహచరులను విమాన శిథిలాలనుంచి బయటకు లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అజర్బైజాన్ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. రష్యా పర్యటనలో ఉన్న అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ స్వదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అజర్బైజాన్ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. అలీయేవ్తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక విమానంలో వైద్య సిబ్బందిని, సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని పుతిన్ చెప్పారు. What just happened to Azerbaijan Airlines Flight 8243?? Flight Radar showed it having an emergency squawk 7700. The flight was erratic in altitude. #azerbaijan #planewatchers #avgeek #flightemergency pic.twitter.com/K6ApRsaPvK— Zach Shapiro (@zrs70) December 25, 2024 ⚠️#BREAKING: #Azerbaijan Airlines E190 Crashes in #Kazakhstan, Survivors ReportedA tragic aviation incident unfolded today as Azerbaijan Airlines Flight #J28243, an Embraer E190AR registered (4K-AZ65)carrying 72 people, crashed near Aktau, Kazakhstan. The flight was en route… pic.twitter.com/QZG3yBcSBh— Abdul khabir jamily (@JamilKhabir396) December 25, 2024Emergency services work on the scene of the Azerbaijan Airlines plane crash in #Kazakhstan#Aktau pic.twitter.com/1ruCG6mlQL— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) December 25, 2024 -
సురభివారి గాలి మోటార్
కొల్లాపూర్: నేడు విమానాల్లో ప్రయాణించటం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యులు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఓ వందేళ్లు వెనక్కు వెళితే? అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానం సాధారణ ప్రజలకు ఒక వింత. డబ్బున్నవాళ్లకు దానిని సొంతం చేసుకోవాలన్న ఆరాటం. నాడు సొంత విమానాలు కలిగి ఉండటమంటే మామూలు విషయం కాదు. కానీ, తెలంగాణలోని ఓ సంస్థానాదీశులు ఆ ఘనతను సాధించారు. జటప్రోలు (కొల్లాపూర్) సంస్థానాన్ని పాలించిన సురభి వంశస్తులు దాదాపు 93 ఏళ్ల క్రితమే సొంత విమానాల్లో తిరిగారు. పైలట్లుగా శిక్షణ పొంది లైసెన్సులూ సంపాదించారు. ఐవీఆర్తో ప్రారంభం క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతాన్ని సురభి వంశస్తులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. 1507 సంవత్సరం నుంచి వారి పాలనకు సంబంధించిన ఆధారాలున్నాయి. 1840లో తమ సంస్థానాన్ని జటప్రోలు నుంచి కొల్లాపూర్కు మార్చారు. 1884 నుంచి 1929 వరకు నిజాం నవాజ్వంత్ బహదూర్గా పిలిచే రాజా వెంకటలక్ష్మారావు కొల్లాపూర్ను పాలించారు. ఆయన తర్వాత రాణి వెంకటరత్నమ్మ రాజ్యపాలన చేపట్టారు. వెంకటలక్ష్మారావు కుమార్తె సరస్వతీ దేవిని బొబ్బిలి రాజ్యంలోని తిరుపాచారు జమీందారు ఇనుగంటి వెంకటకృష్ణారావు (ఐవీఆర్) వివాహం చేసుకున్నారు.ఆయన విమానాలు నడపాలనే కోరికతో పైలట్గా శిక్షణ కూడా పొందారు. 1931 నవంబర్ 11న ఆయన ఢిల్లీలో పైలట్గా లైసెన్స్ తీసుకొన్నారు. తమ అల్లుడు ఐవీఆర్ కోసం సురభి రాజులు ఇద్దరు ప్రయాణించగల విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు ప్రావిన్సులో మాత్రమే ఒక రాజ కుటుంబానికి సొంత విమానం ఉండేది. దక్షిణ భారతదేశంలో సొంత విమానం కొనుగోలు చేసిన రెండో కుటుంబం సురభి రాజులదే. దీనికి వేంకట అనే పెట్టారు. విమానాన్ని నిలిపేందుకు కొల్లాపూర్లోని జఫర్ మైదానాన్ని ఎయిర్పోర్టుగా వినియోగించారు. హకీంపేటలో నిర్వహించిన విమానాల పోటీల్లో జేఆర్డీ టాటాతోపాటు ఐవీఆర్ కూడా పాల్గొన్నారు.మద్రాసు నుంచి బెంగళూరు వరకు 1,800 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపి ఐవీఆర్ రికార్డు సృష్టించారు. ఇంతటి ప్రతిభావంతుడైన ఐవీఆర్.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలోనే 1935 ఆగస్టు 25న మరణించారు. ఆయన స్మారకార్థం జఫర్ మైదానం సమీపంలోనే (ఆర్ఐడీ బాలుర జూనియర్ కళాశాల పక్కన, వాలీ్మకి గుడి వద్ద) స్తూపం ఏర్పాటుచేశారు. -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్లైన్స్కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి
-
ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం
ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ నటుడు దుర్మరణం చెందాడు. ఇతడితో పాటు విమానంలో ప్రయాణిస్తున్న అతడు ఇద్దరు కూతుళ్లు కూడా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ వార్త అతడి అభిమానుల మనసు కదిలిపోయేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటుడు? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి) జర్మనీలో పుట్టి ప్రస్తుతం హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన క్రిస్టియన్ ఒలీవర్(51).. తాజాగా కరీబియన్ దీవులకు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అయితే గ్రెనాడిస్ అనే ద్వీపం నుంచి సెయింట్ లూసియా అనే ప్రాంతానికి ప్రైవేట్ జెట్లో వెళ్లాడు. కాకపోతే గురువారం ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. పక్కనే ఉన్న నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నటుడు క్రిస్టియన్ ఒలీవర్తోపాటు ఇతడు ఇద్దరు కుమార్తెలు, పైలెట్ మృతి చెందారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎవరో దూరం నుంచి వీడియో తీయగా.. అది ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే డైవర్స్ స్పందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాడీలని ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు.. యాక్సిడెంట్కి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
తుఫ్రాన్లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
వీడియో వైరల్: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్పోర్టులో Iv-P ప్రాప్జెట్ విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది. That’s gonna leave a mark, ouch! 🫣 T31 airport in Mc Kinney, Texas today 🎥 IG jackschneider17 via @HamWa07 pic.twitter.com/CKbgCTHOse — Thenewarea51 (@thenewarea51) November 11, 2023 దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు! -
ప్రిగోజిన్ మృతిపై క్రెమ్లిన్ రియాక్షన్..
వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది. అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
రన్వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ
ఎయిర్పోర్ట్లోని రన్వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో అధికారులు రన్వేని మూసేశారు. ఈ ఘటకు గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జపాన్ రాజధాని టోక్యలో హనెడా విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయలైనట్లు జపాన్ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఏం కాలేదని అంటోంది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద టాక్సీవేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. దీంతో రన్వే ఒక్కసారిగా మూసివేశారు అధికారులు. బ్యాంకాకు బయలుదేరిని థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్వేస్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ షాకింగ్ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. కానీ జపాన్ స్థానిక మీడియాలు మాత్రం ప్రయాణికులు కొద్దిపాటి గాయాలయ్యాయని, అలాగే ఓ విమానం రెక్కదెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాద సమయంలో టోక్యో విమానాశ్రయం సత్వరమే స్పందించడంలో జాప్యం చేసిందని పలు విమర్శనాత్మక కథనాలు వెలువరించడం గమనార్హం. కాగా, అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది. (చదవండి: రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!) -
నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..
కాఠ్మాండు: నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW — Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023 విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y — Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023 ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. #NepalPlaneCrash Prayers! pic.twitter.com/pn7ECs1Gyk — Rukhsar (@Rukhsar987) January 15, 2023 काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2 — Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023 చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే! -
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అమెరికాలో టెక్సాస్లోని డల్లాస్లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. కాగా, వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం. pic.twitter.com/peyMeEMA25 — Giancarlo (@GianKaizen) November 12, 2022 BREAKING: 2 planes, including a B-17 Flying Fortress, collide at Dallas airshow pic.twitter.com/hdieiJuqvX — BNO News Live (@BNODesk) November 12, 2022 -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్పోర్ట్కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
నింగి నుంచి నీళ్లలోకి...!
దక్షిణ ఫ్రాన్స్లోని మోంట్పిల్లర్ ఎయిర్పోర్ట్లో ల్యాండయ్యాక రన్వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్పోర్ట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా విమానంలోని ఒక ఇంజిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్ ఛార్లెస్ డీ గౌల్లే ఎయిర్పోర్ట్ నుంచి మోంట్పిల్లర్ ఎయిర్పోర్ట్కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk — BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022 ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ -
ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు యువకులు..
వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. -
క్రీడాలోకం దిగ్భ్రాంతి: విమానం నుంచి పడిన క్రీడాకారుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి బయల్దేరిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రపంచం మరువలేదు. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వివరాలు వెల్లడి కాగా మరో యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే ఆ దేశ జాతీయ ఫుట్బాల్ ఆటగాడు విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. ఈ విషాదకర వార్త వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: విమానం నుంచి పడిపోయిన ఘటన.. అన్నదమ్ముల విషాద గాథ ) తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్తాన్లో భయాందోళనలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన ఆక్రమించగా ఆ భయంతో ఆ తెల్లారి 16వ తేదీన ప్రజలు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగుల బాట పెట్టారు. అక్కడ ఉన్న అమెరికా యుద్ధ విమానం ఎక్కి ముగ్గురు కిందపడిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరు సోదరులు కాగా మరో యువకుడు ఆ దేశ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం కలచివేస్తోంది. అతడి పేరు జాకీ అన్వరీ. అఫ్గానిస్తాన్ జాతీయ ఫుట్బాల్ ఆటగాడు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ ధ్రువీకరించింది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి: అథ్లెటిక్స్ దిగ్గజం కన్నుమూత.. విషాదంలో పీటీ ఉష -
విమాన ప్రమాదంలో ఫుట్బాల్ ఆటగాళ్ల మృతి
బ్రసీలియా: ఇండోనేషియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే బ్రెజిల్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. బ్రెజిల్లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. పామాస్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. విలానోవా జట్టుతో ఆట ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. టేకాఫ్ అవుతుండగా దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్లో ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతి చెందిన వారిలో అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారు. పామాస్ ఫుట్బాల్ క్లబ్ ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్లోని నార్త్ ఫోర్ డివిజన్కు చెందిన క్లబ్. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తీరుపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
నా రెండు చేతులూ పోయాయనుకున్నా..
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నా రెండు చేతులు పోయాయనుకున్నా. తీవ్రమైన నొప్పితో కనీసం కదపడానికి కూడా వీలు లేనంత బాధను భరించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెలకువ రాగానే నా సోదరుడిని నేను అడిగిన మొదటి ప్రశ్న నా చేతులు ఏవి అని. ఆ సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరో నన్ను స్ట్రెచర్పై పడుకోబెట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ప్రతీ ఒక్కరిలో కరోనా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మాస్క్ను కొంచెం సేపు కూడా పక్కన పెట్టలేదు. ఎవరూ వాష్రూంకు కూడా వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అందరిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే పెద్ద శబ్ధం రావడంతో అందరం చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో తెలుసుకనేలోపే విమానం ముక్కలైంది. ఆ తర్వాత ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాం' అనే విషయాలను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (కోళీకోడ్ ప్రమాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు గాయాలపాలై ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారిలో ఆశిక్ ఆయన సోదరుడు మొహమ్మద్ అస్సియాస్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నామని, చాలామంది సహాయం చేయడానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి తన సోదరుడు ఏమై పోయాడో అని మళ్లీ వెనక్కి వచ్చి చూసుకున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని తనకు సహాయం చేసిన వైద్యులు, సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. (కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
‘మరోసారి విమానం ఎక్కాలని లేదు ’
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో ఉన్నవారిని ఊహించని ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఈ దుర్ఘటన ఓ పీడకలగా మారింది. అంతా 15 సెంకడ్లలో జరిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ముహమ్మద్ జునైద్ అనే ప్యాసింజెర్ చెప్పాడు. దేవుడి దయతో తాను బయటపడ్డానని, ఇంకోసారి విమాన ప్రయాణం చేయాలనే ఆలోచననే లేదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (చదవండి : భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..) ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు జునైడ్(25) ఒకరు. మూడేళ్ల క్రితం దుబాయ్కి వెళ్లి అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. నెలకు 75 వేల జీతం. అంతా బాగుంటుందన్న సమయంలో కరోనా మహ్మమారి అతని ఉపాధిని దెబ్బతీసింది. మే నెలలో సగం జీతం ఇచ్చిన కంపెనీ.. తర్వాత మూడు నెలలు సెలవులపై వెళ్లాలని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో భారత్కు తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనుక భాగం చివరి సీట్లో కూర్చోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని జునైద్ చెప్పాడు. విమాన పైకప్పు తాకడం వల్ల తలకి, పెదాలకు చిన్న గాయం తప్పా ఎలాంటి ప్రమాదం జరగలేదని జునైద్ పేర్కొన్నారు. దేవుని దయతో బయటపడ్డానని, మరోసారి విమానం ఎక్కాలని లేదని చెప్పుకొచ్చారు. (చదవండి : కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
గాల్లో ఢీకొన్న విమానాలు: 8 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రెండూ కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం) మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని చెప్పారు. రెండు విమానాలు ఢీ కొట్టుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఇంకా కనుగొనలేదని తెలిపారు. సరస్సులో మునిగిపోయిన రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్లు వెల్లడించారు. వాటిని బయటకు తీయడానికి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. (ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 100 ఏళ్ల తర్వాత) -
కూలిన విమానం : నలుగురి మృతి
న్యూయార్క్ : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్ ఎయిర్పోర్ట్లో విమానం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కరోనా ఎయిర్పోర్ట్లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగా, విమానం గాలిలో ప్రయాణించలేకపోయింది. ఆ తర్వాత విమానం ఫెన్స్ను తాకుతూ కుప్పకూలి విమానాశ్రయానికి తూర్పున ఉన్న బారికేడ్ను తాకింది. 80 గ్యాలన్ల ఇంధనాన్ని మోస్తున్న విమానం, ఆపై పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది తర్వాత మంటలు చెలరేగాయి. పైలట్కు విమానంపై కంట్రోల్ తప్పిందని రన్వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాద ఘటనను వీక్షించిన మరో పైలట్ దొర్తీ వోల్ చెప్పారు. ఇంధన ట్యాంకుల నుంచి పేలుడు శబ్ధం వినిపించగా విమానంలో మంటలు వ్యాపించాయని ప్రయాణీకులు పరిగెత్తుతూ కనిపించారని తెలిపారు. విమానం గంటకు 90 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండవచ్చని మరో పైలట్ వాట్ సిండర్ అంచనా వేశారు. కాగా విమాన మోడల్తో పాటు ప్రమాదానికి ప్రధాన కారణం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంతో విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణకు ఆదేశించాయని వెల్లడించారు. చదవండి : 176 మంది మృతి: ‘నా తండ్రి సజీవంగా ఉన్నారు’ -
పేలిన విమానం ..ఇద్దరి మృతి
మాస్కో : ఇంజన్ ఫెయిలవడంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే సమయంలో విమానం పేలిన ఘటన సైబీరియాలోని బుర్యేతియా ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విమానం రష్యాకి చెందిన ఆంటోనోవ్ ఏఎన్-24గా గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఉలాన్-ఉడే నుంచి ఐదుగురు సిబ్బంది, 48మంది ప్రయాణికులతో నిజ్నియాన్గార్క్స్కు ఏఎన్-24 విమానం బయలుదేరిందని తెలిపారు. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో బుర్యేతియా ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించాడని.. ఆ సమయంలో విమానం రన్వేను బలంగా తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. కాగా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని, మరణించిన వారిలో ఒకరు పైలట్, మరొకరు టెక్నీషయన్ అని అధికారులు ధ్రువీకరించారు. -
ఫుట్బాల్ జట్టుకు తృటిలోతప్పిన ప్రమాదం
-
ఫుట్బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
రాస్తోవ్: సౌదీ అరేబియా ఫుట్బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా సౌదీ ఫుట్బాల్ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్కు వెళ్తున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. కాగా, ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ ప్లేయర్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు సౌదీ ఫుట్బాల్ సంఘం వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా, మంటలు చెలరేగడానికి పక్షి ఢీకొనడం కారణంగా రష్యా ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను విమానంలో ఉన్న ఆటగాళ్లు వీడియో తీయగా, దాన్ని సౌదీ మీడియా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. -
నేపాల్ విమాన ప్రమాదం
-
80 ఏళ్ల మిస్టరీ వీడింది
వాషింగ్టన్ : దాదాపు 8 దశాబ్దాలకు పైగా నెలకొన్న మిస్టరీకి ఎట్టకేలకు తెర పడింది. అదృశ్యమైన అమెరికన్ వైమానికురాలు అమెలియా ఇయర్హార్ట్ మృతదేహం తాలూకు అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పశ్చిమ పసిఫిక్ ఐలాండ్లో పరిశోధకులు వీటిని గుర్తించగా.. వాటిని పరిశోధించిన టెన్నెస్సె యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ జాన్ట్జ్ ఇది అమెలియా అవశేషాలనే అని పేర్కొన్నారు. యాత్రికురాలు, రచయిత అయిన అమెలియా 1937లో విమానం ద్వారా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. విమానంలో ఆమెతోపాటు నేవిగేటర్ ఫ్రెడ్ నూనన్ కూడా ఉన్నారు. విమానం ఫసిఫిక్ సముద్రం మీదుగా వెళ్తుండగా నికూమరోరో ప్రాంతంలో అదృశ్యమైంది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె జాడ తెలియకపోయేసరికి చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె అదృశ్యం గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈమె జీవిత చరిత్రపై పలు భాషల్లో చిత్రాలు కూడా వచ్చాయి. చివరకు 1940లో ఎముకల గూడు గార్డనర్ ఐలాండ్కు కొట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై అంథ్రోపాలజిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మృత దేహ నిర్ధారణ కోసం చేసిన అధ్యయనాల్లో చాలా వరకు గందరగోళ ప్రకటనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు శాస్త్రీయంగా మూడు సిద్ధాంతాలను అన్వయించిన రిచర్డ్ .. చివరకు అది అమెలియాదే అని తేల్చారు. ఇంధనం అయిపోవటంతోనే విమానం కూలిపోయి ఉంటుందని.. ఆమె అస్థిపంజరం ద్వీపానికి కొట్టుకొచ్చిందని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రెడ్ నూనన్ అవశేషాలు మాత్రం ఇప్పటిదాకా లభ్యం కాలేదు. అమెలియా ఇయర్హార్ట్ చివరి చిత్రం -
విమాన ప్రమాదంలో ముగ్గురి మృతి
వాషింగ్టన్ : విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో జరిగింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్లోని ఫ్రెడరిక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా చనిపోయింది. మరో శునకం అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడింది. ఆ శునకాన్ని పోలీసు అధికారులు దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానానికి ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
విమాన ప్రమాదం:35 మంది సైనికుల మృతి
డెమాస్కాస్: రవాణా సరుకు తీసుకెళ్లే చిన్న సైజు విమానం కూలి ఘటనలో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిరియాలో శనివారం కార్గో విమానం రవాణా సరుకు తీసుకు వెళుతున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలి పోయింది. దీంతో 35 మంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఆదివారం ఆ దేశ న్యూస్ ఏజెన్సీ సానా ధృవీకరించింది. విమాన ప్రమాదంలో సైనిక విభాగంలో పనిచేస్తున్న కీలక సభ్యులు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. -
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
హైదరాబాద్: అందేంటోగాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు నీడలా వెంటాడుతున్నాయి .... ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానాన్ని వేర్పాటు వాదులు క్షిపణులతో కూల్చివేశారు. మరో విమానం అదృశ్యం. అలాగే మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది వరుసగా ... *మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ తెలియలేదు. * జూలై 17న ఎమ్ హెచ్ 17 విమానం నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు బయలుదేరింది. ఈ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల శక్తిమంతమైన క్షిపణితో దాడి చేశారు. దాంతో విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 298 మంది మరణించారు. * జూలై 23న ట్రాన్స్ఏసియా ఎయిర్వేస్ విమానం తైవాన్లో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. * ఆగస్టు 10న టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. * ఆగస్టు 25న ఎండీ -83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్కు విమానం బయలుదేరింది. విమానం బయలుదేరిన 50 నిమిషాల అనంతరం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందారు. -
సముద్రంలో కూలిపోయిన విమానం
-
రక్షణ విమానం కూలి 11 మంది మృతి
టూనిస్: నేపాల్ లో విమానం కూలి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువముందే మరో విమానం ప్రమాదానికి గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అయితే ప్రమాద గురైన ఈ విమానం మాత్రం రక్షణ విభాగానికి చెందినది. లిబియన్ మిలటరీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. టునిషియాకు అత్యంత సమీపంలో సంభవించిన విమాన ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు టునిషియా రక్షణ శాఖ అధికారి ప్రకటించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రోగులు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా ప్రమాదానికి జరిగిన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. ఈ విమానం నుంచి చివరి కాల్ టూనిస్-కార్తేజ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినట్లు నమోదైందన్నారు. -
విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి
హైదరాబాద్ : అమెరికా విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పైలెట్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూల్ జిల్లాకు చెందిన చామకూర కార్తీక్ ఈ ఘటనలో మృత్యవాత పడినట్లు మంగళవారం హూక్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం సెసీనా 172 విమానంలో సాంకేతిక లోపం సంభవించడంతో ప్రమాదం జరిగింది. సింగిల్ ఇంజిన్ తో నడిచే సెసీనా పేలిపోవడంతో కార్తీక్ అసువులు బాసాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. గత సెప్టెంబర్ లోనే అమెరికాకు వెళ్లిన కార్తీక్ మృతిపట్ల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.అతని తండ్రి బీఎస్ఎన్ఎల్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నకార్తీక్ పూర్తి విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది.