ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | AIR India AI-379 emergency Landing In Thailand | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Jun 13 2025 12:01 PM | Updated on Jun 13 2025 3:50 PM

AIR India AI-379 emergency Landing In Thailand

సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ఎయిర్‌ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్‌ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement