దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు | No mechanical faults found with crashed Boeing 787-8 plane | Sakshi
Sakshi News home page

దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు

Jul 15 2025 6:36 AM | Updated on Jul 15 2025 6:36 AM

No mechanical faults found with crashed Boeing 787-8 plane

ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే 

అహ్మదాబాద్‌ ఘటనపై ఎయిరిండియా సీఈవో వ్యాఖ్య 

న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘ­ట­నపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవు­తుందని అభిప్రాయపడ్డారు. 

‘ప్రాథమిక నివేదిక విడుద­ల­తో­పాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నా­రు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్‌ ప్రక్రియలోగానీ తేడా­ల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష కూడా జరిగిందన్నారు.

 ‘ప్రాథమిక నివేదిక­లో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటు­వంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్‌ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్‌ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యా­సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్‌ అయి­న కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్‌ సప్లయ్‌ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. 

ఫ్యూయల్‌ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ 
ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబా­ద్‌ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమాన­యా­న సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్‌ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్‌ లాకింగ్‌ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్ప­ష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదిక­లో­ని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించక­మునుపే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement