హైదరాబాద్లోని కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ పేరుతో అల్లు అరవింద్ నెలకొల్పిన భారీ మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు.
అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం అల్లు అర్జున్తో కలిసి డాల్బీ స్క్రీన్లో ప్రదర్శించిన పలు ప్రచార చిత్రాలను వీక్షించారు.
ఈ ఈవెంట్లో దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, క్రిష్, నందినిరెడ్డి, పలువురు నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.


