సాక్షి, బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతీయ సిటీ(తిరుమేనహళ్ళి)లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్ఙిత, యశ్వంత్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.




