9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..! | Pregnant Woman Allegedly Assaulted By Husband And In-Laws In Bengaluru | Sakshi
Sakshi News home page

9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

Feb 23 2026 12:15 PM | Updated on Feb 23 2026 12:21 PM

Pregnant Woman Allegedly Assaulted By Husband And In-Laws In Bengaluru

తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.

ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు  2017లో ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది. 

ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

ఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా  మళ్లీ,తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని  ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని  ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్‌లైన్‌లో కుటుంబ కౌన్సెలింగ్  తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement