మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్‌.. థాక్రే ఆరోపణలు | Maharashtra Municipal Elections Updates | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్‌.. థాక్రే ఆరోపణలు

Jan 15 2026 7:59 AM | Updated on Jan 15 2026 11:55 AM

Maharashtra Municipal Elections Updates

Maharashtra Elections Updates..

ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్‌

  • మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్‌, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. 
  • ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్‌ నమోదు
  • ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

 

ఎన్నికల నిర్వహణపై రాజ్‌ థాక్రే ఆరోపణలు..

  • ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే ఆరోపణలు.
  • తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
  • చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.
  • పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.
  • ఇది ఆమోదయోగ్యం కాదు.
  • ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.
  • పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను

 

ఓటు వేసిన నితిన్‌ గడ్కరీ, థాక్రే

  • నాగపూర్‌లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.
  • ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే.
  • ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్‌ థాక్రే. 
     

ఓటు వేసిన ప్రముఖులు.. 

  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్‌
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో సచిన్‌ ఓటు వేశారు.
  • సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

 

ఓటు వేసిన ప్రముఖులు వీరే.. 

 

 

 

ఓటు వేసిన మోహన్‌ భగవత్‌, అక్షయ్‌ కుమార్‌

  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.
  • నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ముంబైలో ఓటు వేశారు. 
  • ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 
  • తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

 

 

మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభం.. 

  • దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికలు.
  • బృహన్‌ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.
  • ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.
  • రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.

పోటీలో 1700 మంది అభ్యర్థులు.. 

  • మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.
  • సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
  • బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
  • వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement