breaking news
Road Accident
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి,పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన రేగం సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్పై బయలుదేరారు. రమేష్ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు. గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..గెమ్మెలి రమేష్ మృతి చెందాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. -
టీనేజర్ రీల్స్ మోజు.. తలకిందులైన మరో యువకుని జీవితం
న్యూఢిల్లీ: ఫిబ్రవరి మూడో తేదీన 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్షపూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా ‘రీల్స్’కోణం బహిర్గతమైంది. టీనేజర్ వాహనం నడిపేటప్పుడు పక్కనే అతని సోదరి కూర్చుని స్మార్ట్ఫోన్లో రీల్స్ చిత్రీకరించింది. సంబంధిత వీడియో తాజాగా బహిర్గతమైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతయ్యారు. ‘‘కనీసం డ్రైవింగ్ లైసెన్స్లోని 17 ఏళ్ల బాలుడు ఎస్యూవీ నడుపుతూ రీల్స్ చేస్తూ మా అబ్బాయిని ఢీకొట్టాడు.కారుతో ఢీకొట్టాక కనీసం బ్రేకులు కూడా వేయలేదు’’అని ఆమె అన్నారు. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. టీనేజర్కు పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్కు చెందిన క్యాబ్నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు.తర్వాత ఏమాత్రం పనిచేయగలనో నాకే అర్థంకావట్లేదు. నెలకు పాతిక వేలరూపాయల్లోపే సంపాదిస్తా. ద్వారకా సెక్టార్ 19 సమీప గ్రామంలో నివసిస్తున్నా. నా ఇంట్లో సంపాదించేది నేనొక్కడినే. డ్రైవింగ్ జీవనోపాధి పోయక ఇకపై ఎలా బతకాలి?. ధనికులకు ఇలాంటి ప్రమాదంతో పోయేదేం ఉండదు. కానీ నాలాంటి పేదల పరిస్థితి ఏంటి?’’అని అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. -
Sahil Dhaneshra: అక్క రీల్స్ చేస్తుండగా.. తమ్ముడు ప్రాణం తీశాడు
ఢిల్లీ: ఓ అక్కా, ఆమె తమ్ముడు కలిసి ఓ యువకుడి ప్రాణం తీశారు. డ్రైవింగ్ సీట్లో తమ్ముడు కారు నడుపుతుండగా, అక్క అతడితో రీల్స్ చేస్తోంది. రీల్స్ చేస్తుండగా కారు అదుపు తప్పింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు కొన్ని గంటల్లోనే మధ్యంతర బెయిల్పై విడుదలయ్యాడు. కారణం నిందితుడు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన సాహిల్ ధనేశ్రా (23). గుండె నిండా ఆశలు, కళ్ల నిండా కోరికలు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు. ఫిబ్రవరి 3న సాహిల్ తన ఇంటి నుంచి బైక్పై బయల్దేరాడు. ఉదయం 11:57 గంటలకు ద్వారకాలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల సమీపంలో ఉండగా సాహిల్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమయంలో అక్క రీల్స్ చేస్తుండగా డ్రైవింగ్ సీట్లు ఉన్న ఆమె తమ్ముడు ఎదురుగా బైక్పై వస్తున్న సాహిల్ను బలంగా డీకొట్టాడు. అతడి బైక్ నుజ్జునుజ్జైంది. మూడు భాగాలుగా విడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, స్కార్పియో, స్విఫ్ట్ డిజైర్ టాక్సీ, అలాగే సాహిల్ బైక్ చెల్లాచెదురుగా పడినట్లు గుర్తించారు. రోడ్డు పక్కనే రక్తమోడుతూ సాహిల్ పడి ఉన్నాడు. అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.In a devastating Delhi road acc!dent on February 3, 2026, 23-year-old Sahil Dhanera (also referred to as Sahil Dhaneshra or Kabir), a property dealer and only child, was k!Iled when his bike was allegedly struck by a Mahindra Scorpio in Dwarka. The SUV, driven by a 17 year-old… pic.twitter.com/A7eahZJhMt— Weapon. (@sk465g) February 17, 2026కేసు నమోదు చేసుకున్న ద్వారకా సౌత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, రాంగ్ రూట్లో వచ్చిన స్కార్పియో ఎదురుగా వస్తున్న సాహిల్ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత అక్కడే నిలిపి ఉంచిన టాక్సీని ఢీకొట్టినట్లు తేలింది. టాక్సీ డ్రైవర్ అజిత్ సింగ్ కూడా గాయపడి ఐజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతని వాంగ్మూలం పోలీసులు నమోదు చేశారు.నిందితుడికి తాత్కాలిక బెయిల్స్కార్పియో నడిపిన వ్యక్తి మైనర్. అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ప్రమాదం అనంతరం అదుపులోకి తీసుకుని, జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు హాజరుపరిచారు. కోర్టు మొదట అబ్జర్వేషన్ హోంకి పంపారు. కానీ ఫిబ్రవరి 10న జేజేబీ ఆ బాలుడికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కారణం అతడు 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండటమేనని తెలిపింది. అటాప్సీ రిపోర్టులో ఏముందంటే?తాజాగా విడుదలైన ఆటాప్సీ రిపోర్టులో కూడా ప్రమాద తీవ్రత కారణంగానే సాహిల్ మరణించినట్లు తేలింది. అక్కా–తమ్ముడు రీల్స్ పిచ్చి కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ తల ఎడమ వైపు కపాలం పగిలింది. తలలో రక్తం గడ్డకట్టింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మెదడు వాసింది. ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరింది. గుండెకు రక్షణగా ఉండే ఎముకలు విరిగాయి. గుండె లోపల తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గాయాల కారణంగానే సాహిల్ మరణించినట్లు ఆటాప్సీ రిపోర్టులో తేటతెల్లమైంది. స్టంట్స్ చేస్తూ రీల్స్ సాహిల్ మరణంపై అతని తల్లి ఇన్నా మకాన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీ ఆనందం కోసం నా కొడుకు బలితీసుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాహిల్ మరణంపై ఇన్నా మకాన్ మాట్లాడుతూ... ప్రమాదం జరిగే సమయంలో స్కార్పియోలో ఉన్న నిందితుడు అతని సోదరి రీల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే కారణమని అన్నారు. ‘నా కొడుకు ఫిబ్రవరి 3న ఆఫీసుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మైనర్ నిందితుడు తన సోదరితో కలిసి సరదా రీల్స్ చేయడానికి స్కార్పియోలో బయటకు వచ్చాడు. స్కార్పియోను నడుపుతున్న నిందితుడు వేగంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. బస్సు వస్తుంటే.. ఎదురుగా వెళ్లి కట్ కొట్టాడు. మీ ఆనందం కోసం నా కొడుకును బలితీసుకుంటారా? అని ప్రశ్నించారు. సాహిల్ మరణంలో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. A chilling video has emerged showing the moments before a speeding Mahindra Scorpio, allegedly driven by a 17-year-old without a valid licence, collided head-on with a motorcycle, killing 23-year-old Sahil Dhaneshra on February 3 near Lal Bahadur Shastri College. The victim’s… pic.twitter.com/uMnargen22— Orissa POST Live (@OrissaPOSTLive) February 17, 2026 -
పవన్ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్కళ్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఏం జరిగిందంటే.. పాలేరు రిజర్వాయర్లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్కళ్యాణ్పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్గూడెం వద్ద ఉన్న టోల్ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్ఎమ్ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
నాడు కొడుకు.. నేడు తండ్రి..!
నెల్లిమర్ల రూరల్: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. కాశీయాత్ర నుంచి తిరిగి వస్తూ నాడు కొడుకు, నేడు తండ్రి... అనే మాట గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నాడు. మండలంలోని కొండవెలగాడ, చంద్రంపేట, సారిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది భక్తులతో ఈ నెల 8న కాశీయాత్రకు వెళ్లిన బస్సుకు ఆయనే డ్రైవర్. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా బాహానాగ్ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఆ దాటికి బస్సు ముందు భాగంలోని అద్దాలు పగిలి సుమారు 20 అడుగులు ఎత్తు నుంచి బ్రిడ్జి కిందకు పడిపోయాడు. దీంతో తల, కంటి భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, కొండవెలగాడ గ్రామానికి చెందిన ఎ.సూర్యనారాయణ అనే వ్యక్తి కాలు విరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ శ్రీనివాసరావు మృతిపై కుండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పగబట్టిన ప్రమాదాలు.. మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్ భోగాపురం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా డ్రైవర్ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది. -
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
7 ప్రాణాలు తీసిన అతివేగం..
-
కారుపై పడిన కంటైనర్.. అక్కడికక్కడే..!
-
చిత్తూరులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
కర్నూలు (సెంట్రల్)/ఆదోని సెంట్రల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారాన్ని వాషింగ్టన్లోని సియోటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘జాహ్నవి మృతి మా హృదయాలను కలచివేసింది. ఈ ఆర్థికసాయమైనా ఆమె కుటుంబానికి కాస్తంత ఓదార్పు అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఇవాన్స్ వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కుమార్తె జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. అక్కడి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోర్సులో చేరింది. అయితే 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఈ ప్రమాదానికి పోలీసు వాహనం నడుపుతున్న కెవిన్ డవే అనే అధికారి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్ అడరర్ అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘‘ఈమెకు 26 ఏళ్లు ఉంటాయేమో. అయినా సాధారణ వ్యక్తి. ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు’’ అని అడరర్ వ్యాఖ్యానించడం మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. భారత విద్యార్థి మృతి, అధికారి అనుచిత వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. అమెరికా పౌరులూ డేనియల్ అడరర్ తీరును ఖండించారు. దీంతో అతనిపై వేటు పడింది. విధుల నుంచి పోలీసు ఏజెన్సీ తప్పించింది. ఈ క్రమంలో సియాటెల్ సిటీ అధికారులే తమ కుమార్తె మరణానికి కారణమని 110 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్లో దావా వేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాధిత కుటుంబానికి భారత ఎంబసీ ద్వారా ఆ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.మూడు రోజుల క్రితమే జాహ్నవి తండ్రి మృతి ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి తల్లిదండ్రులు కుమార్తె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే తండ్రి శ్రీకాంత్ గుండెపాటుతో మరణించారు. దీంతో తల్లి విజయలక్ష్మీ, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వారికి భారీ పరిహారం అందితే ఎంతో అండగా ఉంటుంది. అయితే ఈ విషయం వారికి తెలియదు. ప్రస్తుతం వారు శ్రీకాంత్ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు. -
దేశంలో 5... దక్షిణాదిలో 2
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై పదేపదే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్స్ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉండగా... దక్షిణాదిలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) గణాంకాలు దీన్ని నిర్ధారిస్తున్నాయి. గత వారం లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ జాబితాను ఆ శాఖ సభ ముందు ఉంచింది. దాని ప్రకారం 2024–25 గణాంకాల ఆధారంగా తెలంగాణ మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో 1,535 బ్లాక్స్పాట్స్ ఉన్నాయి. ఈ జాబితాలో 2,210 బ్లాక్స్పాట్లతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. దక్షిణాదికి సంబంధించి 1,661 స్పాట్స్తో తమిళనాడు మొదటి స్థానంలో, దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 1,535 స్పాట్స్తో తెలంగాణ దేశంలో ఐదు, దక్షిణాదిలో రెండో స్థానం ఆక్రమించగా... ఆ తర్వాత 1,407తో పంజాబ్, 1,339తో పశ్చిమ బెంగాల్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆ బ్లాక్స్పాట్స్పై సమగ్ర అధ్యయనం చేసిన మంత్రిత్వ శాఖ మైనర్, మేజర్ మరమ్మతుల్ని ప్రతిపాదించింది. మైనర్ మరమ్మతుల్లో 80 శాతం వరకు పరిష్కారం కాగా... మేజర్ మరమ్మతులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా ఆయా బ్లాక్ స్పాట్స్ అనేక ప్రాణాలను బలిగొంటున్నాయని ఎంఓఆర్టీహెచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.రాష్ట్రంలో సగం కూడా పూర్తి కాలే...బ్లాక్స్పాట్స్ నిర్మూలన కోసం ఎంఓఆర్టీహెచ్ సూచిస్తున్న మేజర్ మరమ్మతుల్లో జంక్షన్ల పునర్నిర్మాణం, గ్రేడ్ సెపరేటర్ల అమలు, సర్వీస్ రోడ్ల నిర్మాణం తదితరాలు ఉంటున్నాయి. ఇవన్నీ భూ సేకరణ, డిజైన్ మార్పు ఆమోదం, నిధుల సమీకరణ తదితర అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఫలితంగా ఎక్కడా సగం కూడా పూర్తికావట్లేదు. రాష్ట్రంలో గుర్తించిన 1,535 బ్లాక్ స్పాట్లలో కేవలం 516 ప్రాంతాల్లోనే (33.6 శాతం) మరమ్మతులు జరిగాయి. కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ల్లో సగం వరకు ఈ మరమ్మతులు జరిగాయి. రాజధానిలోనే మొత్తం 54 స్పాట్స్...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,535 బ్లాక్స్పాట్స్లో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 54 ఉన్నాయి. నాగ్పూర్– హైదరాబాద్– బెంగళూరు మధ్య ఉన్న ఎన్హెచ్–44పై బోయిన్పల్లి, తాడ్బండ్, చిల్డ్రన్స్ పార్క్, పూరానాç³Nల్, జూపార్క్ ప్రాంతాలు, ఎన్హెచ్–63లో చాదర్ఘాట్–భూపాలపట్నం మధ్య ఉన్న నింబోలిఅడ్డా, కాచిగూడ ఓల్డ్ ట్రాఫిక్ ఠాణా, త్రిశూర్ బార్–రామంతాపూర్ మధ్య ప్రాంతాలు ఉన్నాయి. పుణే–హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న ఎన్హెచ్–65లోని ఎస్సార్నగర్, పంజగుట్ట, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, మలక్పేట... ఎన్హెచ్–765లోని చాంద్రాయణగుట్ట–కేశవగిరి జంక్షన్ మధ్య ప్రాంతాల్లో ఈ బ్లాక్స్పాట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఫ్లైఓవర్లు, వాటి అప్రోచ్ రోడ్లు, అండర్ పాస్లు, చెక్పోస్టులు, టోల్ ప్లాజాలున్న ప్రాంతాలు, భారీ మలుపుల వద్దే ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. -
‘నా కుమారుడు కారులో ఎక్కడున్నాడు.. ఆస్పత్రిలో ఉంటే’
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్ టుబాకో టైకూన్ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు. కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని, బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్ అని పేర్కొన్నారు. కారు కండిషన్ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్ బారిన పడిందన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా. -
ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రెండు కార్లు ముఖాముఖీ ఢీసాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగి్నమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగి్నమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటకలో ఏపీ కూలీల మృతి.. జగన్ దిగ్భ్రాంతి
-
గుడ్ సామరిటన్లకు..‘గోల్డెన్’ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పుతుంది.. కానీ ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేసుల్లో ఇరుక్కుని పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయమే ఇందుకు కారణం. వాస్తవానికి అలా సాయం చేసేవారికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయినా జనంలో అవగాహన రావటం లేదు. ఈ నేపథ్యంలోనే అలా క్షతగాత్రులకు సాయం చేసి ప్రాణాలు నిలిపిన వారికి రూ.25 వేల నగదు పారితోషికంతో పాటు ప్రభుత్వ ప్రశంసాపత్రం కూడా అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. సర్కారు చొరవ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కొన్ని చాలాకాలంగా తెలంగాణలో అమలులో లేవు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో ముఖ్యమైన వాటిని అమలులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించిన వారికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో క్షతగాత్రుల పాలిట గుడ్ సామరిటన్ (సహాయం చేసిన మంచి వ్యక్తి)కు ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తెచ్చింది. తొలుత రూ.5 వేల ఆర్థిక సహాయం మాత్రమే ఉండేది. దానికి అంత స్పందన రావటం లేదన్న ఉద్దేశంతో, గతేడాది ఈ పథకానికి ‘రహ్ వీర్’అని పేరు పెట్టి, ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ.25 వేలకు పెంచింది. దీన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి పథకం అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘రహ్ వీర్’లను ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్రమాదాల్లో... ⇒ ప్రాణాపాయం కల్పించే పెద్ద ప్రమాదాల్లో క్షతగాత్రులను రక్షించే వారికి ఈ పురస్కారం అందుతుంది. పెద్ద శస్త్రచికిత్స అవసరం అవటం, కనీసం మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సినంత గాయం కావటం, మెదడు, వెన్నెముకలాంటి వాటికి తీవ్ర గాయాలు కావటం, చనిపోవటం.. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ క్షతగాత్రులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రి/ట్రామా కేర్సెంటర్కు తరలిస్తే వారికి ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్గా పేర్కొంటారు. ఆ గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన వారిని ‘రహ్ వీర్’లుగా పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ నిర్భయంగా ముందుకొచ్చి క్షతగాత్రులు వీలైనంత తొందరలో ఆసుపత్రికి చేర్చేందుకు సాయం చేసిన వ్యక్తుల వివరాలను ఆసుపత్రి సిబ్బంది ద్వారా, లేదా స్వయంగా తెలుసుకుని సంబంధిత పోలీసులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే కమిటీలకు వివరాలు అందిస్తారు. ⇒ జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీలో జిల్లా ఎస్పీ/ పోలీసు కమిషనర్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఆర్టీఓ/డీటీఓ/డీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నగదు పురస్కారానికి అర్హులను ఎంపిక చేసి సిఫారసు చేస్తుంది. వారికి రవాణా శాఖ ద్వారా పురస్కారం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ ఉంటుంది. ⇒ క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో సాయం చేసిన వ్యక్తి ఒకరే ఉంటే అతనికి/ఆమెకు రూ.25 వేల పారితోషికం, ప్రశంసాపత్రం అందిస్తారు. ఇద్దరున్నా, ఎక్కువ మంది ఉన్నా.. వారికి రూ.25 వేల మొత్తాన్ని సమంగా పంచుతారు. ⇒ ఆర్థిక సాయానికి సంబంధించి కేసులకు పరిమితి లేదు. ఎన్ని కేసులకు ఎంపిక చేసినా అన్నిటికీ పారితోషికం అందుతుంది. ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి రూ.25 లక్షల గ్రాంటును తొలి విడతగా అందించింది. ఎక్కువ అవసరమైతే ఆ మొత్తం ప్రతినెలా రీయింబర్స్ చేస్తుంది. ⇒ మోటారు వాహన చట్టం (సవరణ) 2019 సెక్షన్ 134 ఏ ప్రకారం... రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తికి చట్టపరంగా రక్షణ కలి్పస్తారు. వారిని అనవసరంగా పోలీసు స్టేషన్లకు రప్పించటం, కోర్డు చుట్టూ తిప్పటం, బలవంతంగా వారి వివరాలు సేకరించటం లాంటివి ఉండవు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్భయంగా ముందుకొచ్చి ప్రమాద క్షతగాత్రులను రక్షించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వం కోరుతోంది. -
బొలెరో బోల్తా పడి ముగ్గురు కూలీల దుర్మరణం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా నుంచి కర్ణాటకకు చింతకాయల కోత పనులకు వెళ్లిన కూలీల్లో ముగ్గురిని ప్రమాదం బలితీసుకుంది. బొలెరోలో వెళ్లినవారు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆ వాహనం బోల్తాపడడంతో ఈ విషాదం నెలకొంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలోని పూలకుంట్లపల్లెకు చెందిన 15 మంది కూలీలు బొలెరో వాహనంలో కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోయడానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీనివాసపురం వద్ద బ్రేక్ ఫెయిలవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు (25), మునెప్ప (65) అక్కడికక్కడే మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురిని వేర్వేరు వాహనాల్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స చేసేలోపే వెంకటమ్మ (60) మృతిచెందింది. ఆరుగురు మదనపల్లెలోను, మరో ఆరుగురు శ్రీనివాసపురంలో చికిత్స పొందుతున్నారు. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు ప్రాణాలు కో ల్పోవడంతో పూలకుంట్లపల్లెలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై శ్రీనివాçసపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కూలీలు మరణించడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. -
చిన్న పొరపాటు.. పెద్ద ప్రమాదం!
నిడమనూరు (నల్లగొండ జిల్లా): కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. శనివారం రాత్రి నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద సాగర్ ఎడమకాల్వలోకి కారు దూసుకుపోయి త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన తల్లం పుల్లయ్య, పద్మావతి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతం వారి బంధువుల రోదనలతో ఉద్రిక్తంగా మారింది. డ్రైవర్ రసూల్.. కారు నడుపుతున్న క్రమంలో చెప్పు జారీపోయిందని.. కాలుకు చెప్పును సరిచేసుకుంటున్న క్రమంలో కాలు కారు యాక్సిలేటర్కు తగిలి.. కారు వేగం పెరిగి అదుపుతప్పి కాల్వలోకి దూసుకపోయిందని చెబుతున్నాడు. తాను కారు అద్దం తెరుచుకుని బయటికి వచ్చి కేకలు వేయడంతో కాల్వ సమీపంలో ఉన్న వ్యక్తులు.. కొబ్బరిమట్ట ఇవ్వగా పట్టుకొని కాల్వలో నుంచి బయటపడ్డానని చెప్పాడు. కానీ తల్లం పుల్లయ్య, పద్మ కాల్వలో గల్లంతయ్యారు. రాత్రి పది గంటల ప్రాంతంలో కాల్వలో కారును గుర్తించారు. వయస్సు పైబడటం, కారు డోర్ లాక్ కావడంతో నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కాల్వలో నుంచి కారును బయటికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కాల్వలో నీటి ప్రవాహం 8 వేల క్యూసెక్కులకు పైగా ఉంది. దీంతో కాల్వలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తీసేందుకు యత్నంకాల్వ వెంట బారికేడ్లు లేక..సాగర్ ప్రధాన కాల్వపై ఉన్న బ్రిడ్జిల వద్ద పక్కల వెంట కనీసం బారికేడ్లు లేవు. కాల్వలోకి వెళ్లకుండా సూచికలు, అడ్డంగా రాతిస్తంబాలు లేకపోవడంతో కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. -
శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం
రేవా: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో పెళ్లివారింట తీవ్ర విషాదం నెలకొంది. ఫిబ్రవరి 24న జరగబోయే పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని బైక్పై వెళ్లిన తండ్రి, కొడుకుతో పాటు మరో బంధువు మృత్యువాత పడ్డారు. రేవా-ప్రయాగ్రాజ్ హైవేపై కోస్టా గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బాధితులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో, ప్రయాగ్రాజ్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వీరి బైక్ను వెనుక నుంచి బలంగా ఢీకొంది ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జవ్వగా, బైక్పై ప్రయాణిస్తున్న భగవత్ విశ్వకర్మ (55), ఆయన కుమారుడు శివం విశ్వకర్మ, బంధువు శీతల్ విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ కారు డివైడర్ను బలంగా ఢీకొని ఆగిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో భగవత్, శివం చాచాయ్ గ్రామానికి చెందిన వారు కాగా, శీతల్.. రథారా నివాసిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులను చూసి వారు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. పెళ్లి పత్రికలతో వెళ్లిన వారు శవాలై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి.. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్పై అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
జనంపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఆరుగురు దుర్మరణం
మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి (శనివారం) తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికుల విరామం కోసం రహదారి పక్కన ఆగింది. ప్రయాణికులు బస్సు దిగి, బయట నిలుచున్నారు. ఇంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి, ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంటే..!
ఈ రంగు కారు కొంటున్నారా?? ఒక చిన్న ప్రశ్న.. మనం కారు కొనే సమయంలో ఏమేమి చూస్తాం? మైలేజ్ చూస్తాం… ధర చూస్తాం… ఫీచర్స్ చూస్తాం… డిజైన్ చూస్తాం.. కానీ రంగు విషయంలో మాత్రం మనకు నచ్చిందే ఎంచుకుంటాం. అయితే ఆ రంగే మీ ప్రయాణ భద్రతపై ప్రభావం చూపుతుందని చెబితే నమ్ముతారా?అవును.. సురక్షితంగా డ్రైవ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, వాహనం రంగు కూడా ప్రమాదాలకు ఒక కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలపై వారు చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.👉ఇతర రంగులతో పోలిస్తే..ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసా? నలుపు రంగు కార్లకే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయట. ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు విజిబులిటీ సుమారు 47 శాతం వరకు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, మబ్బు ఉన్నప్పుడు, లేదా తక్కువ వెలుతురు ఉన్న సమయంలో నలుపు రంగు వాహనాలు స్పష్టంగా కనిపించవు. అందుకే ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.👉ఈ రంగులు అందంగా కనిపించినా..గ్రే రంగు కార్లకు కూడా ప్రమాదాల శాతం ఎక్కువగానే ఉంది. సుమారు 11 శాతం వరకు రిస్క్ ఉందని తెలిపారు. అలాగే నీలం, ఎరుపు రంగు కార్లు కూడా 7 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలకు గురైనట్లు పరిశోధన చెబుతోంది. ఈ రంగులు అందంగా కనిపించినా, రోడ్డు మీద స్పష్టంగా కనిపించే విషయంలో కొంత వెనుకబడి ఉంటాయి.👉ఏ రంగులు సేఫ్..అయితే ఏ రంగులు సేఫ్గా భావిస్తున్నారు? తెలుపు, పసుపు, ఆరెంజ్, బంగారు రంగుల కార్లు రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల వీటికి ప్రమాదాల శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా తెలుపు రంగు వాహనాలు పగలు, రాత్రి రెండింట్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది టాక్సీలు, కమర్షియల్ వాహనాలు తెలుపు రంగులోనే ఉంటాయి.👉నలుపు కారు కొనొద్దా?..అంటే నలుపు కారు కొనొద్దా? అంటే అలా కాదు. రంగు ఒక్కటే కారణం కాదు. డ్రైవింగ్ విధానం, వేగం, రోడ్డు పరిస్థితులు, వాతావరణం… ఇవన్నీ కలిసి ప్రమాదాలకు కారణమవుతాయి. కానీ రంగు కూడా ఒక చిన్న అంశంగా పనిచేస్తుంది అనేది ఈ అధ్యయనం చెప్పే విషయం. కాబట్టి మీరు కొత్త కారు కొనాలని అనుకుంటే… ఒక్కసారి రంగు గురించి కూడా ఆలోచించండి. అందంగా కనిపించడమే కాదు… రోడ్డు మీద స్పష్టంగా కనిపించడం కూడా ముఖ్యం. భద్రత ముందు… స్టైల్ తరువాత. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు రైతులు మృతి
సాక్షి,మల్లాపూర్: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు రైతులు మృతి చెందారు. స్థానికులు వివరాల మేరకు.. మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
20 రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి
రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్గౌడ్ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు పటాన్చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్గౌడ్ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ గౌడ్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రెండు పల్సర్ బైక్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రాజమండ్రి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి
తూర్పు గోదావరి జిల్లా: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెంటిస్ట్గా బీడీఎస్ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్చెరువులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్షిప్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ చదువుతున్న కిశోర్తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు. శోకసంద్రంలో చాగల్లు లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్ నాదేండ్ల శ్రీరామ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. -
స్నేహితుల ఆనంద ప్రయాణం… విషాదాంతం
మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్ (23), సాయివరుణ్ (23), వెంకట్ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ బీటెక్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్యూవీ 700 కారులో బోడుప్పల్ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్తో పాటు సాయివరుణ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Medipalli : అతివేగానికి మరో ఇద్దరు యువకులు బలి
-
రోడ్డు ప్రమాదంలో వైద్యురాలి మృతి
రామన్నపేట: వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వైద్యురాలు మృతి చెందారు. మృతురాలి భర్త డాక్టర్ సాలు రాఘవేంద్ర తెలిపిన వివరాలివి. డాక్టర్ రాఘవేంద్ర వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఫైనలియర్ చదువుతున్నారు. ఆయన భార్య డాక్టర్ మమతారాణి (33) ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగిసిన తర్వాత మమతారాణిని.. రాఘవేంద్ర స్కూటీపై ఇంటికి తీసుకొస్తున్నారు. హంటర్రోడ్డులోని జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన మమతారాణికి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అన్సారీ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు 9 నెలల గర్భిణి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది -
బోడుప్పల్లో ఘోర ప్రమాదం.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: మితిమీరిన వేగం ప్రాణాలు తీసింది. నగరంలోని బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి పిల్లర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఐటీ పోచారం వెళ్తున్న ఓ కారు.. బోడుప్పల్ వద్ద పిల్లర్ 97ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను, క్షతగాత్రులను వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్లంతా వనపర్తిలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. అతివేగంతో దూసుకెళ్లే క్రమంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో ఫిల్లర్ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు. మృతులను వరుణ్, నిఖిల్గా గుర్తించారు. ఆ మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గాయపడిన వెంకట్, రాకేష్,యశ్వంత్లకు చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
‘నేను ఇపుడు ఎవరికి అన్నం తినిపించాలి బిడ్డా’
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు.కరీంనగర్క్రైం/వీణవంక: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్లపై గణేశ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం మధ్యాహ్నం కరీంనగర్ వచ్చారు. అనంతరం గణేశ్, సందీప్రెడ్డి బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రైవేట్ సూ్క్ల్ బస్సును ఢీకొని బైక్పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్ తెలిపారు.మామిడాలపల్లిలో విషాదంకరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఇంటర్లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్రెడ్డి. ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. -
సరదా ప్రయాణం శాశ్వత వీడ్కోలుగా మారింది
తూర్పు గోదావరి జిల్లా: ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది.. సరదాగా సాగిపోతున్న ప్రయాణంలో విషాదం అలముకుంది.. కడియం మండలం వేమగిరి శివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య, కుమార్తెలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం మండలం కేదారిశెట్టిపల్లి గ్రామానికి చెందిన చిట్టూరి వెంకటేష్ (36) రాజమహేంద్రవరంలోని టాటా మోటార్స్లో పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలసి కడియం మండలం వేమగిరిలో నివాసం ఉంటున్నాడు.అయితే సోమవారం సెలవురోజు కావడంతో భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలను తీసుకుని రావులపాలెంలోని బంధువుల ఇంటికి మోటారు సైకిల్పై బయలు దేరారు. వేమగిరి సమీపానికి వచ్చేసరికి అక్కడి ఒక నర్సరీ వద్ద నుంచి హైవేపైకి ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ఒక కారు వేగంగా వచ్చి, వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ను ఢీకొంది. దీంతో వెంకటేష్, భార్యా పిల్లలతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తల బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కల్పన, తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తె లోహతాశ్రీ, ఏడాదిన్నర వయసుగల చిన్న కుమార్తె సౌర్యశ్రీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బంధువులు ఇంటికి వెళ్లేందుకు ఆనందంగా బయలు దేరిన వారు కొద్దిసేపటికే ప్రమాదం బారిన పడి, వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషయం నెలకొంది. భార్య, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా కడియం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ లక్ష్మీప్రసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం.. అదుపు తప్పి..
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున కర్నూలు శివారు రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కె.కావేరి ట్రావెల్స్ బస్సు.. డివైడర్ను ఢీకొట్టింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరగ్గా.. ఈ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారుబస్సు మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో బస్సులో ప్రయాణీకులను తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టి.. అక్కడికక్కడే దుర్మరణం!
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన కరీంనగర్ బైపాస్ రోడ్డలో చోటు చేసుకంది. స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్కూల్ బస్సు ముందు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ మృతి చెందారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో ఒకర గణేష్ అనే యువకుడు కాగా, మరొకరు సందీప్రెడ్డి అనే మరో యువకుడిగా నిర్దారించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం
పలన్పూర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు.. కారుని ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బనాస్కంఠ జిల్లాలోని ఇక్బాల్గాథ్లోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. If you are driving a truck on Highway & a biker suddenly turns in front of you and you have no time to brake, what would you do? This truck turned right, saved bike, hit car 3 de@dBaruva Junction,near Korlam Village, Srikakulam District, Andhra Pradesh.pic.twitter.com/4q89UBfpJg— Gary Pike 🇺🇦🇮🇳 (@PikeWala) January 25, 2026రాంగ్ రూట్లో వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఇన్నావో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్తో కలిపి 10 మంది ఇన్నోవా కారులో ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్కు చెందిన బస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ ముగ్గురూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సు క్లీనర్ అప్రమత్తంగా ప్రయాణికులను హెచ్చరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. -
తిరుమలగిరి: ఆర్మీ ట్రక్కు కింది నలిగిన విద్యార్థి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఘోరం జరిగింది. ఆర్మీ ట్రక్కు టైర్ కింద నలిగి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో విద్యార్థి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. తల్లితో స్కూటీ మీద స్కూల్కు బయల్దేరాడు విద్యార్థి. అయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గేట్ 2 వద్ద స్కూటీ స్కిడ్ అయ్యి తల్లీకొడుకులు కింద పడిపోయారు. ఆ వెనకాలే వస్తున్న ఆర్మీ ట్రక్కు టైర్ విద్యార్థి మీద ఎక్కేసింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన తల్లిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
తల్లి ప్రాణాలు కాపాడాలనే తొందరలో..
కందుకూరు: గుండెపోటుకు గురైన తల్లిని కాపాడుకోవాలని వెళ్తున్న కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ తానూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని కోటారెడ్డినగర్ జంక్షన్లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సంతోష్ నగర్కు చెందిన షాజిద్ అనే కానిస్టేబుల్ స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం సెంట్రీ డ్యూటీ ఉండడంతో స్టేషన్లోనే ఉన్నాడు. ఈ సమయంలో ఆయన తల్లి సమీమ్(60) ఆరోగ్యం బాగా లేదంటూ ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తల్లి ఆయాసంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో.. తన ద్విచక్ర వాహనంపై దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాడు. అయితే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్లో మరో హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ముందుగానే హాస్పిటల్కు వెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించాలనే ఉద్దేశంతో షాజిద్ తన బైక్పై కోటారెడ్డి హాస్పిటల్కు బయలుదేరాడు. షాజిద్ను అనుసరిస్తూ వెనుక వైపు అంబులెన్స్ వస్తున్న క్రమంలో.. కోటారెడ్డినగర్ జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, సింగరాయకొండ వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్ షాజిద్ బైక్ను ఢీకొట్టింది. దీంతో షాజిద్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ లోపు తల్లి సమీమ్ను తరలిస్తున్న అంబులెన్స్ హాస్పిటల్కు చేరుకుంది. సమీమ్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం అదే అంబులెన్స్లో తీవ్రగాయాలైన షాజిద్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ షాజిద్ మృతి చెందాడు. కాగా, కోటారెడ్డినగర్ జంక్షన్లో జరుగుతున్న పనుల వద్ద కాంట్రాక్టర్ ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. -
ఆ కుటుంబంలో వరుస మరణాలు
పల్నాడు జిల్లా: భార్య, బిడ్డల కోసం వెళుతున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. విధి ఆడిన వింత నాటకంలో భార్య బిడ్డలను చూడకుండానే భర్త కన్నుమూశాడు. ఈ హృదయవిదార ఘటన నడికుడి సమీపంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో మండలంలోని గామాలపాడుకి చెందిన సంకురాత్రి జగపతిబాబు(28) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గామాలపాడుకి చెందిన ముక్కంటి, వెంకటరావమ్మ దంపతులకు జగపతిబాబు ఏకైక కుమారుడు కాగా కుమార్తె కూడా సంతానం. కారంపూడి మండలం ఒప్పిచర్లకి చెందిన రవళితో జగపతిబాబుకి వివాహాం కాగా వీరికి సాత్విక్(3), హేమశ్రీ(1) సంతానం. – నడికుడి మార్కెట్యార్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో జగపతిబాబు పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య రవళి ఆమె పుట్టింటికి వెళ్లింది. సంక్రాంతి పండుగ రోజు జగపతిబాబు కూడా అత్తగారింట్లోనే ఉండి ఆ తరువాత గామాలపాడుకి వచ్చాడు. పండుగ ముగియటంతో భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై జగపతిబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో నడికుడి దాటిన తరువాత జామతోట వద్ద టాటా ఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లాయి. ఈ ఘటనలో జగపతిబాబు తలకు బలమైన గాయాలు కాగా టాటా ఏసీ వాహనం డ్రైవర్ బెల్లంకొండ మండలం చిన్నరాజుపాలెంకి చెందిన కలపాల వీరయ్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జగపతిబాబు మృతిచెందగా మెరుగైన వైద్యం కోసం వీరయ్యని గుంటూరుకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ జి.పాపారావు పరిశీలన చేశారు. మృతుడు జగపతిబాబు భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగపతిబాబు కుటుంబంలో వరుస మరణాలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జగపతిబాబు కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నది. జగపతిబాబు తల్లిదండ్రులు ముక్కంటి, వెంకటరావమ్మలు మృతిచెందగా తోడబుట్టిన చెల్లెలు కూడా మృతిచెందింది. ముక్కంటి తాలుకా కుటుంబ సభ్యులంతా మృతిచెందగా జగపతిబాబు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జగపతిబాబు కూడా మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జగపతిబాబు, రవళి దంపతులకు మూడేళ్ల కుమారుడు సాతి్వక్, ఏడాది వయస్సున హేమశ్రీ సంతానం. పెట్రోల్ బంకులో పనిచేస్తూ జగపతిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగపతిబాబు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో భార్య, పిల్లలు అనాధలయ్యారు. ⇒ సంఘటన గురించి తెలిసిన వెంటనే భార్య, ముక్కుపచ్చలారని పిల్లలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బోరన విలపించారు. నువ్వు లేకుండా మేమేట్లా బతకాలయ్యా అంటూ రవళి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలిద్దరిని నేనేట్ల బ్రతికించాలయ్యా అంటూ రవళి గుండెలు పగిలేలా రోధిస్తుంది. చిన్నారులైన సాత్విక్, హేమశ్రీలు మా నాన్నకి ఏమైందని చూస్తున్న తీరు కూడా అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. బంధువులు, కుటుంబ సభ్యులు చిన్నారులను హత్తుకుని రోదించారు. జగపతిబాబు కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలతో గామాలపాడు విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
సాక్షి,హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున (జనవరి 20) కంటైనర్, కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు పటేల్ (42),రాజన్న (60),బాబన్న(70)కారు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి
అర్వపల్లి, నల్లగొండ: సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన (43), తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత (48)తోపాటు తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల సునీతారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్వపల్లి శివారులోని ముదిరాజ్కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్లి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు ముందుభాగం ఎడమవైపు టైరు పేలింది. కారు పల్టీ కొట్టడంతోనే కల్పన రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరి కిందపడ్డారు. ప్రవీణ్కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సునీతారాణి, ప్రవీణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్కు తరలించారు. వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న గీత.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు సాయినితన్రెడ్డి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. కూతురు సౌమికకు పెళ్లి అయి భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. వచ్చే నెలలో కుమారుడికి కాన్వొకేషన్ ఉంది. దీంతో గీత ఫిబ్రవరిలో పిల్లల వద్దకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, శనివారం పాఠశాలకు వెళ్తూ గీత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న కూతురు, కుమారుడు.. భారత్కు బయల్దేరారు. కాగా.. నల్లగొండలోని హనుమాన్నగర్లో నివాసం ఉండే లింగంపల్లి కల్పన తుంగతుర్తి కేజీబీవీలో ప్రత్యేకాధికారి(ఎస్ఓ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పి.. రోజూ వచ్చే సమయం కంటే ముందుగానే శవమై వచ్చిందని ఆమె భర్త, పిల్లలు విలపించారు. గీత, కల్పన మృతదేహాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
పాకిస్తాన్లో ఘోర ప్రమాదాలు.. 24 మంది మృతి
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటన లాహోర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధా జిల్లాలోని కోట్ మోమిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రమాదానికి గురైన ట్రక్కులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు తెలిపారు. వీరంతా ఫైసలాబాద్లో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారి మూసివేయడంతో డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తక్కువ దృశ్యమానత కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి గాలాపూర్ వంతెన నుంచి నీరు లేని కాలువలోకి ట్రక్కు పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోట్ మోమిన్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బలూచిస్థాన్లో బస్సు బోల్తా: 10 మంది మృతిఇదే రోజు బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ సమీపంలోని మక్రాన్ తీరప్రాంత రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోరండ్ల వద్ద పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభానికి ఢీకొని, అనంతరం డివైడర్ను మోదింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. అతివేగం, మద్యం మత్తుతో పాటు యువకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైవేపై ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికీ గాయాల పాలైయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. -
కుటుంబంలో చీకట్లు నింపిన సంక్రాంతి
కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్ని నింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు నెలలకే దూరమయ్యాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రాపర్తి సంతోష్(32) దుర్మరణం చెందాడు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన రాపర్తి తిరుపతి–గుణసుందరి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతోష్ సంతానం. అతనికి నవంబర్ 13న రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. సంతోష్ తన భార్యతో సంగారెడ్డిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.దైవ దర్శనానికి వెళ్లి..సంక్రాంతి పండుగ సందర్భంగా నలుగురు స్నేహితులతో కారులో మెదక్లోని ఏడుపాయలు, దుర్గమ్మ ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లె వద్ద ఎదురొచ్చిన గేదెను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. తర్వాత అది వరిపొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను ఇప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.భార్యను పుట్టింటికి పంపి..పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో భార్యను నాలుగు రోజుల క్రితం పుట్టింటికి పంపించాడు. శుక్రవారం వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అంతలోనే ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గడిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భార్య, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
కన్యాకుమారిలో దంపతుల మృతి
-
విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తుల దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. ఓ వ్యాన్, ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొని ఐదుగురు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురం నుంచి తిరిగి వస్తున్న భక్తులపై విషాదాన్ని మోపింది. పోలీసుల వివరాల మేరకు.. భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతంలో వ్యాన్, ట్రాక్టర్ ట్రాలీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురం నుంచి తిరిగి వస్తున్న భక్తులపై విషాదాన్ని మోపింది.ఈ ప్రమాద సమయంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు సిరోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మరో పది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని హమీదియా ఆసుపత్రి, భోపాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బెరాసియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. ఇన్చార్జ్ విజేంద్ర సేన్ ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తుల ఆనందాన్ని విషాదంగా మార్చింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, వాహనాల అధిక వేగం, రాత్రి సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు పెంచితే ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. #WATCH | Bhopal, Madhya Pradesh: 5 people were killed, and 12 others were injured in a collision between a tractor-trolley and a pickup vehicle.Berasia SDM Ashutosh Sharma says, "The collision between the tractor-trolley and the pickup took place in front of Vidya Vihar. 5… pic.twitter.com/dOjK9WZedv— ANI (@ANI) January 15, 2026 -
పండుగ వేళ విషాదం
మహబూబ్ నగర్ జిల్లా: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా.. ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్లోని అల్వాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రెండ్రోజుల్లో రెండో ప్రమాదం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఆరు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ పల్టీ కొట్టిన కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కర్రలు మొత్తంగా రోడ్డుపై పడిపోయాయి.ఈ కారణంగా హైవేపై సుమారు ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. -
నల్లగొండ: కొర్లపహాడ్ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం
నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపహాడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి, ముందు వెళ్తోన్న వాహనాన్ని తిరువూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్గా బ్రే్క్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులు మెల్లగానే వెళ్తూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హిమాచల్లోని సిర్మౌర్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి దాదాపు 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.వివరాల ప్రకారం.. హిమాచల్లోని సిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్ధర్ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.STORY | Eight killed, five injured as private bus rolls down hill in Himachal's SirmaurEight people died while five others were injured after a private bus rolled down from the road in Himachal Pradesh's Sirmaur district on Friday, police said.READ: https://t.co/DrE5EEk11w… pic.twitter.com/3XA4HwgvR3— Press Trust of India (@PTI_News) January 9, 2026మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి సంగ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) సునీల్ కాయత్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు. జిల్లా కేంద్రం నాహన్ నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపుర్ధార్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సంగ్రా, దదాహు ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.Himachal: Bus accident in Sirmaur district, a dozen people injured.Himachal Pradesh: SP Sirmaur, Nishchint Singh Negi, says, "We have received information that a private bus traveling from Kupwi to Shimla slipped off the road near Haripur Dhar in Sirmaur district, resulting in… pic.twitter.com/iG6SqAUlt8— Manmeen Walia (@ManmeenWalia) January 9, 2026 -
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురి దుర్మరణం
నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి 9వ తేదీ) తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్యాంకర్, డీసీఎం ఢీకొని స్పాట్లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
బిచ్చగాళ్లు, వారి సంపద గురించి చాలానే విన్నాం. బిచ్చగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఖరీదైన ఇళ్లలో జీవించే వారి గురించి గతంలో అనేక కథనాలు చూశాం. కానీ ఇదొక బిచ్చగాని విషాద గాథ. కేరళలోని అలప్పు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 50 ఏళ్ళ బెగ్గర్ వద్ద లభించిన నోట్ల కట్టలు చూసి అంతా అయ్యో అనుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.ఆహారం కోసం కేరళలోని అలెప్పూ వీధుల్లో అడుక్కునే బిచ్చగాడి వద్ద విదేశీ కరెన్సీతో సహా ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ నగదులో రద్దైన రూ.2,000 నోట్లు కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. చారుమూట్ , సమీప ప్రాంతాలలో ఇతను అందరికీ సుపరిచితుడే. సోమవారం సాయంత్రం స్కూటర్పై వెళ్తుండగా ఒక వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రికార్డుల ప్రకారం అతను తనను తాను అనిల్ కిషోర్గా పరిచయం చేసుకుని, స్థానిక చిరునామా ఒకటి ఇచ్చాడు. తలకి తీవ్రమైన గాయాలయ్యాయని ప్రత్యేక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వారి మాటల్ని అతను పట్టించుకోలేదు. మంగళవారం ఉదయానికి, అతని మృతదేహం కడతిన్నల్ ప్రాంతంలోని ఒక దుకాణం వెలుపల కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి, అతని సమీపంలో దొరికిన వస్తువులను పరిశీలించగా డబ్బుల విషయం వెలుగు చేసింది.డబ్బు కట్టలుఅతని దగ్గర ఉన్న డబ్బాను స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో పోలీస్ స్టేషన్లో తెరిచి, అధికారులే ఆశ్చర్యపోయారు. దాని లోపల ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసి, టేప్తో చుట్టబడిన డబ్బు కట్టలు ఉన్నాయి. మొత్తం నగదు రూ.4.5 లక్షలకు పైగా ఉంది. ఆ నోట్లలో రద్దు చేయబడిన రూ.2,000 నోట్లు ,సౌదీ రియాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్అతను భిక్షాటనపైనే జీవించేవాడని, తరచుగా ఆహారం కొనడానికి చిన్న మొత్తంలో డబ్బు అడిగేవాడని స్థానికులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, అదీ విదేశీ కరెన్సీ ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఏమీ లేని వ్యక్తిగా జీవించే వ్యక్తి దగ్గర ఇంత మొత్తం ఉండటం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పంచాయతీ సభ్యుడుపేర్కొన్నాడు.కాగా అతడు తమ బంధువు అనిచెప్పి, మృతదేహం లేదా డబ్బు కోసం ఇంతవరకూ ఎవరూరాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్ట ప్రకారం నగదును కోర్టుకు అప్పగిస్తారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు కిషోర్ నేపథ్యాన్ని ఆ డబ్బు అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? -
చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
ట్రాలీని ఢీకొట్టిన లారీ.. దంపతుల మృతి
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామ సమీపాన మంగళవారం ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. శ్రీకాకు«ళం నుంచి ఖమ్మం జిల్లా వైరాకు వడ్డాది రాము (40) వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు ఏపీకే చెందిన వెంకటరత్నం (37)తో వివాహం జరిగింది. రాము వైరాలో వస్త్రదుకాణం నిర్వహిçస్తున్నాడు. వెంకటరత్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గిరిజన గురుకుల పాఠశాలలో టీజీటీగా పనిచేస్తోంది. రాము ట్రాలీ ఆటోలో పాఠశాల నుంచి భార్యను వైరా తీసుకొస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. రాము ఆస్పత్రిలో మరణించాడు. -
హైదరాబాద్లో విషాద ఘటన..
సాక్షి, హైదరాబాద్: టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. డెలివరీ బాయ్పైకి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తూ. అభిషేక్.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. గమనించకుండా.. ఆ యువకుడి తలపైకి డ్రైవర్ బస్సు ఎక్కించాడు. స్పాట్లోనే అభిషేక్ మృతి చెందాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్ను వాహనదారులు అడ్డగించి బస్సును నిలిపివేయించారు.ప్రమాదం తర్వాత రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. వాహనదారులు పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. బతికి ఉన్నాడో.. చనిపోయాడోనని చూసే ప్రయత్నం కూడా చేయని వాహనదారులు.. మృతదేహం పక్కనుంచే వెళ్లిపోయారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
-
గుండె ధైర్యం ఉంటేనే ఈ రోడ్డెక్కండి!
నిన్న గుండెలు జారిపోయే జర్నీ గురించి చూశాం కదా? ఇది అంతకుమించింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆ గుండె చాలా గట్టిదై ఉండాలి. ఎందుకంటే దీనిపై వెళ్తుంటే మండు వేసవిలోనూ వణుకు పుట్టడం ఖాయం. ఫొటోలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది కదూ? ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో చాలామంది మృత్యువాతపడ్డారు. అందుకే దీనిని డెత్ రోడ్డు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్ నుంచి నార్త్ యుంగాస్ వరకు 64 కిలోమీటర్ల మేర ఉంటుంది. 1930లలో చాకో యుద్ధ సమయంలో పరాగ్వే యుద్ధ ఖైదీలు దీనిని నిర్మించారు. రోడ్డులో చాలా భాగం కొండ అంచునే సాగుతుంది. పచ్చని చెట్లు.. దగ్గరగా పలకరించే మేఘాలు.. అందమైన జలపాతాలతో జర్నీ ఎంత బాగుంటుందో.. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు అంతే ఆందోళనకరంగా అనిపిస్తాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా.. కొన్నిచోట్ల 3 మీటర్ల వెడల్పు లోపే ఉంటుంది. ఓ పక్కన ఏకంగా 600 మీటర్ల లోతైన లోయలు శీతాకాలంలో కూడా అరికాళ్లలో చెమటలు పట్టిస్తాయి. లోయలోకి పడిపోకుండా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. 1990వ దశకం మధ్యకాలం వరకు ఈ రోడ్డులో ఏటా వంద మంది వరకు మరణించేవారు. అనంతరం ఆ సంఖ్య 200 నుంచి 300కి పెరిగింది. 1983 జూలైలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత దాదాపు 30 మంది సైక్లిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధన సవరించారు. బొలీవియాలో వాహనాలు రోడ్డుకు కుడివైపున నడుస్తాయి. కానీ ఈ రోడ్డులో వెళ్లేటప్పుడు డ్రైవర్లు లోయ అంచును స్పష్టంగా చూడటం కోసం ఎడమ వైపున ప్రయాణించాలని నిబంధన విధించారు. 2006లో సేఫ్టీ గ్రిల్స్, డ్రైనేజ్ సిస్టమ్తో కూడిన రెండు లైన్ల కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మృత్యురహదారి సాహస పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్కు ప్రసిద్ధ గమ్యస్థానమైంది. -
మమ్మీ... నొప్పి
అశ్వాపురం/వేంసూరు/పెనుబల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం రెండు విద్యా సంస్థల బస్సులు బోల్తా పడ్డాయి. అయితే, ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలైనా ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అశ్వాపురం మండలం మొండికుంట శివారులో వంతెన సమీపాన బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ పని చేయకపోవడంతో అదుపు తప్పి వాగు వంతెన పక్కకు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో 50 మంది విద్యార్థులు ఉండగా, సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులందరికీ గాయాలు కాగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు బోల్తా పడిన సమయాన మణుగూరుకు చెందిన విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కొని విలవిల్లాడింది. అర గంట పాటు ఆమె నొప్పితో రోదిస్తుండగా జేసీబీల సాయంతో బస్సును పైకి లేపి ఆమెను బయటకు తీయాల్సి వచి్చంది. అయితే, ఈ బస్సు వంతెనకు కాస్త ముందు వాగులో బోల్తా పడితే ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే, ఫిట్నెస్ లేకపోవడంతో స్టీరింగ్ బ్రేక్ అయి ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఒకే బస్సులో వంద మంది..: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్పాడు శివారు వీరబ్రహ్మాంద్ర స్వామి ఆలయం సమీపాన సాగర్ కాల్వలో వేంసూరు మండలం మొద్దులగూడెంకు చెందిన వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిశాక విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 107 మంది వరకు విద్యార్థులు ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడమే కాక బస్ డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో ఉండడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. బస్సు కాల్వలో పడగానే వచ్చిన శబ్దం, విద్యార్థుల కేకలు విని స్థానికులు చేరుకుని వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను తిరుపూరు, పెనుబల్లి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదాలపై మంత్రులు ఆరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగిన విద్యాసంస్థల బస్సు ప్రమాదాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో మాట్లాడిన వారు ప్రమాదాలకు కారణాలపై విచారణ చేపట్టాలన్నారు. -
న్యూ ఇయర్ వేళ విషాదం.. కులులో ఘోర ప్రమాదం
కులు: నూతన సంవత్సర వేళ విషాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులులో ట్రక్క్ను కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని పోలీసులు నిర్థారించారు.ఇవాళ (జనవరి 1, గురువారం) తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఘటన జరిగింది. కసోల్లో పుట్టినరోజు వేడుకలు, ఇయర్ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా వీరి కారు రోడ్డుపక్కన నిలిపిన లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. కారులో ఇరుక్కుపోయిన నలుగురి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే వ్యక్తి మృతి
హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐడిపిఎల్ డీమార్ట్ ముందు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంతో వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం
రంగారెడ్డి జిల్లా: పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న గణేశ్తో కలిసి బండల హంసలేఖ (22), దీప్తి అనే ఇద్దరు విద్యార్థులు పిగ్లీపూర్ గ్రామంలోని అన్నమాచార్య కళాశాలలో పరీక్ష రాసేందుకు బైక్పై వెళ్తున్నారు. బ్రిలియంట్ కమాన్ నుంచి ముకుంద డెయిరీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంసలేఖ, దీప్తి కిందపడగా, ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెనుక చక్రాల కింద పడిన హంసలేక అక్కడికక్కడే చనిపోయింది. దీప్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణేశ్కు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
నల్లగొండ ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని చిట్యాల వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై కంటైనర్ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. వీరంతా తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనికి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
లొంగుబాట్లు.. ప్రమాదాలు.. విచారణలు
తెలంగాణలో ఈ ఏడాది కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టుల ఉద్యమానికి ఓవైపు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలగా మరోవైపు గతంలో ఎన్నడూ చూడని తరహాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు అంతులేని విషాదం నింపాయి. ఇక ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ–కారు రేసు కేసులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. మరోవైపు రూ. వందల కోట్లు వెనకేసిన భారీ అవినీతి తిమింగలాల ఉదంతాలు కూడా ఈ ఏడాదే బట్టబయలయ్యాయి. అలాగే పోలీసు బృందాలు ‘డేగ’ కళ్లతో నిఘా వేసి మత్తు ముఠాల భరతం పట్టాయి. మొత్తంగా 2025లో జరిగిన ప్రధాన నేర, విషాద ఘటనలపై సింహావలోకనం ఇది. – సాక్షి, హైదరాబాద్వరుస ఎన్కౌంటర్లతో మావోల లొంగు‘బాట’మే: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించాడు.నవంబర్: మావోయిస్టు కీలక కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఏపీ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.సెప్టెంబర్13: సుజాత అలియాస్ కల్పన, మైనక్క తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు.అక్టోబర్: మల్లోజుల వేణుగోపాల్రావు అలియాస్ భూపతి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా పుల్లారి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.డిసెంబర్: సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు.» మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సహా వివిధ సందర్భాల్లో కలిపి ఈ ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు.» రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవ్జీ) లొంగిపోయేందుకు కేంద్ర హోంశాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.కాకరేపిన రాజకీయ పరిణామాలు..» గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లుగా వెలుగు లోకి వచ్చిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పోలీసుల ఎదుట లొంగిపోవడం, కోర్టు అనుమ తితో పోలీసులు ఆయన్ను విచారించడం చకచకా జరిగిపోయాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం.వెలుగులోకి భారీ అవినీతి అనకొండలు...ఏప్రిల్ 26: కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనపై ఏసీబీ సోదాలు చేసి అరెస్టు చేసింది. హరిరామ్ అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లకుపైనే ఉంటుందనే అంచనా ఉంది.జూన్ 11: సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేసిన నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాల్లో భారీ ఆస్తులు గుర్తించారు. మొత్తంగా రూ. 200 కోట్ల వరకు అక్రమార్జన సొమ్ము పోగేసినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.జూలై 15: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఈఎన్సీ సి. మురళీధర్రావుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మురళీధర్రావు అక్రమార్జన రూ. 450 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.డిసెంబర్ 23: మహబూబ్నగర్ జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న ముడ్ కిషన్ అక్రమార్జనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన వద్ద మొత్తం రూ. 200 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించారు.సెప్టెంబర్: టీజీ ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబేడ్కర్ ఎరుగుపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టారు. నెలకు రూ. 75,800 వేతనం ఉన్న ఆయన వద్ద ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బలగం..జూన్ 26: డ్రగ్స్ కట్టడికి కీలక ముందడుగు పడింది. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘ఈగల్’ అధికారులు రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడితోపాటు నైజీరియన్ డ్రగ్స్ నెట్వర్క్ను ధ్వంసం చేస్తూ వస్తున్నారు. గత 3 నెలల్లో మూడు ఆపరే షన్లు నిర్వహించి 132 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టిన భారీ ఆపరేషన్లో నైజీరియన్ల అరెస్టుతో తెలంగాణ ‘ఈగల్’ జాతీయ స్థాయిలో పేరు పొందింది.దుర్ఘటనల్లో మృత్యుకేళి..ఫిబ్రవరి 22: నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కుప్పకూలడంతో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది, నలుగురు కార్మికులతో కలిపి మొత్తం 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నౌకాదళం సహా 20కిపైగా ఏజెన్సీలు రంగంలోకి దిగినా కాపాడలేకపోయాయి.మే 18: హైదరాబాద్ గుల్జార్ హౌస్లోని ఒక భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17 మంది సజీవదహనమయ్యారు.జూన్ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడులో ఏకంగా 46 మంది మృతిచెందారు. మరో 33 మందికిపైగా గాయపడ్డారు.అక్టోబర్ 25: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.నవంబర్ 3: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి దానిపై ఒరిగిపోవడంతో 19 మంది కంకరలో కూరుకుపోయి సజీవదహన మయ్యారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు.నవంబర్ 17: హైదరాబాద్కు చెందిన ముస్లింలు ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 45 మంది పాతబస్తీవాసులు మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులున్నారు. -
Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి
ముంబై: ముంబై మహానగరంలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఒక ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విఖ్రోలి డిపోకు చెందిన ఈ బస్సు (రూట్ నంబర్ A-606) తన ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా, ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను బలంగా ఢీకొంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తమయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వెట్ లీజు (Wet Lease) ప్రాతిపదికన నడిచే బస్సుల నిర్వహణ, డ్రైవర్ల శిక్షణ, బస్సుల కండిషన్పై కఠినమైన తనిఖీలు ఉండాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కోరారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులను వెనుకకు తీసే సమయంలో సహాయకులు (Helpers) ఉండాలని, డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయువిచ్చిన అమ్మ వెంటే...
హిందూపురం టౌన్/ పెనుకొండ : తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా... ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం ఆస్పత్రి నుంచి వైద్యులు అనంతపురం రిఫర్ చేయడం వల్లే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మాకు బత్తలపల్లికి చెందిన కలీంతో రెండేళ్ల క్రితం వివాహమైంది.నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్ది సేపటికే నజ్మాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బీపీ పెరగడంతో వైద్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందింది. సోమవారం ఉదయం ప్రభుత్వ అంబులెన్స్లో నజ్మా మృతదేహంతోపాటు నవజాత శిశువును తీసుకుని కుటుంబ సభ్యులు బసవనపల్లికి బయలుదేరారు.మార్గంమధ్యలో పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే చనిపోయింది. వాహనంలోని ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన చికిత్స అందించి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచేవని... అనంతపురం రిఫర్ చేయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, ఖమ్మం: తల్లాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. మృతులను జనగామ జిల్లా వాసులుగా గుర్తించారు.విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ, అనిల్, అజయ్, క్రాంతి, రాకేష్ విహారయాత్రకు వెళ్లారు. పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జనగామకు వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద లారీ.. కారును ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే బాలకృష్ణ, అనిల్ మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్, క్రాంతి మృతి చెందారు. మృతులు బాలకృష్ణ, అనిల్ను జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామస్తులుగా గుర్తించారు. క్రాంతి, రాకేష్ స్టేషన్ ఘనపూర్ గ్రామస్తులుగా గుర్తించారు. -
అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి
-
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025 -
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పిన ప్రమాదం కారణంగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 161బీ కల్వర్టు గుంతలో అదపు తప్పి బైక్ పడిపోయింది. దీంతో, బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులను నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ఆవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)గా తెలిపారు. కాగా, వీరు ముగ్గురు.. నారాయణఖేడ్ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్కుమార్ తన తమ్ముడి కొత్త బైక్పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కొత్తవలస: మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవి్వన మట్టిపోగులపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపైనుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్స్టేషన్కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది.. షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందాడు. -
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకాలో 48వ హైవేలో జరిగిన ఘోర దుర్ఘటన ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. సుమారు 25 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ రఫీ మృతి బస్సు డ్రైవర్ మహమ్మద్ రఫీ హుబ్లీ కేఎంసీఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరగగానే కిటికీలో నుంచి రఫీ దూకేశాడు. ఆ సమయంలో కాళ్లు చేతులకు గాయాలు తగిలాయి, కానీ కోలుకోలేకపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడినవారు ఇప్పటికీ ఆ ఘోరాన్ని తలచుకుని వణికిపోతున్నారు. బయటపడ్డ బండారి యశవంతపుర: కార్వార కుమటాకు చెందిన విజయ్ బండారి అనే యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తొందరలో మొబైల్ఫోన్, లగేజీని బస్సులోనే వదిలేయడంతో బూడిదయ్యాయి. కుటుంబసభ్యులను సంప్రదించడం వీలు కాకపోయిందని చెప్పాడు. చివరికి ఎలాగో వారికి క్షేమ సమాచారం పంపించాడు.నవ్య– మానస చావులోనూ స్నేహబంధంఅందరి మృతదేహాలు హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో ఉండడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరారు. నవ్య కుటుంబ సభ్యుల వేదనను ఆపడం ఎవరితరమూ కాలేదు. మృతులు నవ్య, మానస ఒకటవ తరగతి నుంచి స్నేహితులని, ఎంటెక్ వరకు ఒకే కాలేజీలో చదువుకొని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణవాసి మానస, మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకావాసి నవ్య. నిజానికి ఒకే రోజు తమ తమ పెళ్లిళ్లు జరగాలని కూడా అనుకున్నారు. మృత్యువులోనూ కలిసే వెళ్లారని బంధువులు తెలిపారు. ఎవరి మృతదేహం ఎవరిదో తెలియనంతగా కాలిపోవడంతో మృతుల బంధువుల నుంచి, శవాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ఆ నివేదికలను బట్టి మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.కళ్ల ముందే స్నేహితురాలు..బనశంకరి: బస్సు ప్రమాదంలో గాయపడిన టెక్కీ గగనశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రవారం ఆ ఘోర దుర్ఘటన గురించి వివరించింది. బస్లో పైన సీటులో నిద్రపోయిన నేను, ప్రమాదం జరిగిన వెంటనే రక్షితతో కలిసి బయటకు దూకాము. రశ్మి కూడా దూకేలోపు ఆమె మంటల్లో చిక్కుకుందని తెలిపింది. గోకర్ణ కు వెళ్లి రశ్మి ఇంటికి వెళ్లాల్సి ఉంది, బస్లోపల ఉన్న లగేజీ బ్యాగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి, రశ్మి బయటకు రావడానికి దేవుడు సమయం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన చెందింది. మృతురాలు రశ్మి మురుడేశ్వరవాసి. ఈ ముగ్గురు ప్రమాదానికి ముందు తీసుకున్న ఫోటో వైరల్ కావడం తెలిసిందే. ప్రి వెడ్డింగ్ పారీ్టపై నిప్పులు బాధితుల్లో 7 మంది బృందం బెంగళూరు మావళ్లి, బిన్నిమిల్స్వాసులు. మంజునాథ్– కాబోయే భార్య కవిత, స్నేహితులు దిలీప్, సంధ్య, శశాంక్, బిందు–ఆమె కూతురు గ్రేయ. వీరందరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. మంజునాథ్– కవితకు ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో స్నేహితులకు గోకర్ణలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలనుకుని అందరూ ఈ బస్సులో ఎక్కారు. మంజునాథ్కు తీవ్ర కాలినగాయాలు కాగా, బెంగళూరు విక్టోరియాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దిలీప్కు బిందు సొంత సోదరి అవుతుంది. ఇలా ఒకరికొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. బిందు, ఆమె కూతురు ప్రమాదంలో చనిపోయారు. -
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
-
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు
ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది. -
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సిర్పూర్: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతిచెందారు.. ఈ ఘటన దేవాడ్-సోండో సమీపంలో చోటుచేసుకుంది.స్థానికులు మరియు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగ్పూర్లోని ఆస్పత్రికి వెళ్ళారు. వారితో పాటు బంధువులూ ఉన్నారు.బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో వీరు వస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడింది. ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్ మరియు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చంద్రపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బ్లాక్ స్పాట్స్.. డేంజర్ బెల్స్
రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం.. రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. గుంతలమయంగా, ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపడమంటే సర్కస్ ఫీట్లు చేసినట్లే. గమ్యం చేరేవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న బ్లాక్ స్పాట్లపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలకు స్పాట్పెడుతున్నాయని పోలీసు శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు..787 బ్లాక్ స్పాట్లురాష్ట్రంలో రహదారులపై అత్యధికంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 787 ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డిజైన్ లోపం, ప్రమాదకర మలుపులు, రోడ్లు నిర్వహణ లోపం, గుంతలమయంగా ఉండటంతో ఆ ప్రదేశాల్లో తరచూ రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.అత్యధికంగా బ్లాక్ స్పాట్లు ఉన్న జిల్లాల్లో తిరుపతి (100), ఎన్టీఆర్ (76), కృష్ణా (56), కాకినాడ (43), విశాఖ(40) జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 787 బ్లాక్ స్పాట్లు రాష్ట్రంలో 76 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. వాటిలో 44 పోలీస్స్టేషన్లు ఏలూరు, విశాఖ, అన్నమయ్య, కాకినాడ, కృష్ణా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఏమిటీ బ్లాక్ స్పాట్?భారతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా రహదారి 5 కి.మీ. పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని ‘బ్లాక్స్పాట్’గా గుర్తిస్తారు.వామ్మో! రోడ్డు ప్రమాదాలుబ్లాక్ స్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 30నాటికే ఏకంగా 18,837 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 8,237 ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 8,466 మంది దుర్మరణం చెందారు. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.2% పెరగగా... వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృతులు 4.6% పెరగ్గా తీవ్రంగా గాయపడినవారి సంఖ్య 0.4% పెరిగింది. » అత్యధికంగా 45% ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయి. » 44% ప్రమాదాలు జాతీయ రహదారులపై, 22% రాష్ట్ర రహదారులపై సంభవించాయి. » జాతీయ, రాష్ట్ర రహదారులుకాని రోడ్లపై 34% ప్రమాదాలకు కేంద్రమయ్యాయి.» మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధికంగా 39% ప్రమాదాలు సంభవించాయి.» తిరుపతి, విశాఖ, ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కలిపి 29% రోడ్డు ప్రమాదాలు జరిగాయి.రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన టాప్ 5 పోలీస్ స్టేషన్ల పరిధి » నల్లపాడు (గుంటూరు జిల్లా)» చంద్రగిరి (తిరుపతి జిల్లా)» ఒంగోలు తాలుకా (ప్రకాశం జిల్లా)» దేవరాపల్లి (తూర్పు గోదావరి జిల్లా)» రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) -
బైక్ను ఈడ్చుకెళ్లిన ట్రైన్.. ఐదుగురు దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్ షాహజహాన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం ఒకే బైక్పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని రైలు ఢీకొట్టడ్డంతో మృతులు అక్కడికక్కడే మరణించారు.ప్రమాదంపై రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ప్రమాదం రోసా పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్సలియా రైల్వే క్రాసింగ్ వద్ద సాయంత్రం 6:30 గంటలకు జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న ఐదుగురు ట్రాక్ దాటుతుండగా..బరేలీ నుండి లక్నో వెళ్తున్న సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బైక్ రైలులో ఇరుక్కుపోయి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.మృతులు ఖేరీ జిల్లా ఉచోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగావాన్ గ్రామానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు.మృతుల్లో ముగ్గురు పెద్దలు,ఇద్దరు పిల్లలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా నగరంలోని బుధవారం మార్కెట్ నుండి సరుకులు కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు.జీఆర్పీ ఎస్హెచ్ఓ మదన్పాల్ తెలిపిన ప్రకారం, ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైలు సుమారు అరగంట పాటు అక్కడే నిలిచింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే క్రాసింగ్ వద్ద భద్రతా చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అండర్పాస్ లేదా ఓవర్బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
చెన్నై:తమిళనాడు తిరుచారపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు టైర్లు పేలి అదుపు తప్పింది. అవతలి రోడ్డుపై వస్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. కడలూరు జిల్లా తిట్టకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కార్లలో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి నుండి చైన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. -
యూపీలో పొగమంచు బీభత్సం
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్ఖాన్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్పూర్ మలుపు వద్ద జరిగింది. -
Sangareddy: అతివేగంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం: సింహాచలం సింహపురి కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు, పవన్, లోకేశ్ జిల్లాల్లో.. శాంతిభద్రతలు దారుణం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి.. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా.. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నుంచి 2025 నవంబరు మధ్య కాలంలో రాష్ట్రంలో దాడులు, దోపిడీలు, ప్రధానంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా కనికట్టు చేసేందుకు యత్నించినా వాస్తవాలు మాత్రం బట్టబయలయ్యాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండోరోజు సదస్సులో భాగంగా గురువారం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించి నివేదికను సమర్పించారు. అందులోని ప్రధాన అంశాలివీ.. పది జిల్లాల్లో నేరాల తీవ్రత పెరుగుదల.. రాష్ట్రంలో కీలకమైన 10 జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల తీవ్రత పెరిగింది. అది కూడా ఆరు జిల్లాల్లో 4.8 శాతం నుంచి 9.5 శాతం నేరాలు తీవ్రంగా పెరగడం గమనార్హం. వామ్మో.. దాడులు, హత్యాయత్నాలు.. » ఇక నేరాల్లో దాడులు, హత్యాయత్నాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2024లో 13 దాడుల కేసులు నమోదు కాగా.. 2025లో 19.8 శాతం పెరుగుదలతో 157 కేసులు నమోదయ్యాయి. » 2024లో 1,291 హత్యాయత్నాలు జరగ్గా.. 2025లో 1,582 జరిగాయి. అంటే.ఈ ఏడాది హత్యాయత్నాలు 22.5 శాతం పెరిగాయి. » వైఎస్సార్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ దౌర్జన్యాలు, దాడులు పేట్రేగిపోయాయి. » ఇక పట్టపగలు దోపిడీలు.. ఈ సందర్భంగా హత్యలూ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. » ఈ తరహా నేరాలు ఎక్కువగా వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో పెరిగాయి. » ఇక 2025లో మొత్తం 6,139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. నేరాల రేటు ఎక్కువఈ సమావేశంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నేరాల రేటు అత్యధికంగా ఉందన్నారు. గంజాయి వ్యాపారానికి అడ్డం వస్తే ఏకంగా హత్యలు చేసేస్తున్నారని.. లేడీ డాన్స్ కూడా తయారవుతున్నారని చెప్పారు. నేరాల నియంత్రణలో జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందన్నారు. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. దీనిపై విశ్లేషించాలన్నారు. వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులకు 15 నిమిషాల్లోనే అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను రూపొందించాలని.. తీరప్రాంతాల్లో భద్రత కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేరస్తులకు రాజకీయ నేతల అండఇక అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏమీ చేయలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని రాజకీయ నేతలు వెనకేసుకొస్తున్నారని అంగీకరించారు. ఫలితంగా.. పోలీసులు నిర్లిప్తంగా ఉండిపోతున్నారని చెప్పారు. విశాఖపట్నంలో కొందరు దాడికి పాల్పడ్డారని పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పవన్కళ్యాణ్ ఈ సందర్భంగా ఉదహరించారు.ఆర్థిక నేరాలూ పైపైకి.. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు కూడా అమాంతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024లో మొత్తం 7,539 కేసులు నమోదు కాగా.. 2025లో ఈ సంఖ్య 8,035కు పెరిగింది. నమ్మకద్రోహంతో ఆరి్థక నేరాలు 2024లో 1,077 కేసులు.. 2025లో 25.6 శాతం పెరిగి 1,353 కేసులు నమోదయ్యాయి. ఇక మోసాలకు సంబంధించి 6,430 కేసులు నమోదు కాగా.. 2025లో 3.6 శాతం పెరుగుదలతో 6,660 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ఎక్కాలంటే భయం.. ఇక రహదారి భద్రతలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు 2.2 శాతం పెరుగుదలతో 18,837 సంభవించాయి. తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 4.6 శాతం పెరిగాయి. అలాగే, ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 4.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇలా 8,466 మంది మృతిచెందగా.. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే 29 శాతం సంభవించాయి. -
ఏఎస్ఐ కుమారుడు వాడిన కారు నాదే
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట హైవేపై ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన ఏఎస్సై కుమారుడు, ఇతర నిందితులు వినియోగించిన కారు తనదేనని యజమాని ఇచి్చన ఫిర్యాదుపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన ఆరి్థక అవసరాల నిమిత్తం నకరికల్లుకు చెందిన అంజినాయుడు వద్ద ఏపీ40 ఏజెడ్4419 నంబర్ గల స్విఫ్ట్ కారును 2024 ఆగస్టులో రూ.1.50 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఆ కారుకు కిస్తీలు ఓ ఫైనాన్స్ కంపెనీలో బకాయిలు ఉండటంతో తప్పించుకునేందుకు టీఎస్08 హెచ్వై 3158 నంబర్తో ఆ కారును తిప్పుతున్నారు. ఇదే కారుతో ఈ నెల 4న చిలకలూరిపేట హైవేలో వెళ్తున్న కంటైనర్ను వెంబడించి డబ్బుల కోసం ఆపడంతో ప్రమాదం జరగ్గా.. ఐదుగురు మరణించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఏఎస్ఐ కుమారుడు వెంకట్నాయుడుతోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నకిలీ నంబర్తో కారు నడిపినట్టు గుర్తించారు. దానిపై ఆరా తీయగా అంజి, భాను తనకు కార్లను తెచ్చి విక్రయిస్తుంటారంటూ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం తాను తాకట్టు పెట్టిన కారును కొందరు వ్యక్తులు మారు నంబర్తో నడిపి అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. కస్టడీకి ఏఎస్ఐ కుమారుడి గ్యాంగ్ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి కేసులో అరెస్టయి నరసరావుపేట సబ్జైలులో ఉన్న ఏఎస్ఐ కుమారుడు వెంకట్నాయుడుతో పాటు మరో నలుగుర్ని పోలీసు కస్టడీకి ఇస్తూ చిలకలూరిపేట న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి నేరాలకు పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ నాదెండ్ల పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వారిని పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. -
దుర్గా నగర్ చౌరస్తా వద్ద అదుపు తప్పిన వాహనం
-
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
టెహ్రాన్: మధ్య ఇరాన్లో ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం ఆలస్యంగా ఇస్ఫాహాన్ నుండి ఈశాన్య నగరమైన మషాద్కు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.బస్సు హైవే మధ్యలో ఉన్న సెంట్రల్ గార్డ్ రైల్ను ఢీకొని, ఎదురు లేన్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక టాక్సీని ఢీకొని బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు, టాక్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. మొత్తం 13 మంది మరణించారు. -
ప్రాణాలు తీసిన పొగమంచు
మథుర: చిమ్మచీకట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది. యమునా ఎక్స్ప్రెస్వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు 13 మంది ప్రయాణికుల ప్రాణాలను అనంతలోకాల్లో కలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుఏముందో కనపడనంతగా విపరీతంగా ఉన్న పొగమంచు కారణంగా ఆగ్రా–నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికి వెంట మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వీటిల్లో చిక్కుకుపోయి రక్తమోడుతూ 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.43 మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆగ్రాలోని ఎస్ఎన్ వైద్య బోధనాస్పత్రి, బృందావన్, ఢిల్లీ ఆస్పత్రుల్లో చేర్పించామని మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ చెప్పారు. అయితే 60 మందికిపైగా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. స్వల్ప గాయాలైన ప్రయాణికులను యూపీ ప్రభుత్వ వాహనాల్లో తమతమ గమ్యస్థానాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని బల్దేవ్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై 127 నంబర్ మైలురాయి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసబెట్టి ఢీ.. వెనువెంటనే చెలరేగిన మంటలు క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట తొలుత ఒక బస్సును మరో వాహనం మాత్రమే ఒకదానివెనుక మరోటి ఢీకొన్నాయి. వాటిలోని ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లు ప్రమాదం షాక్ నుంచి తేరుకుని కిందకు దిగి తర్వాత అటుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేలోపే వెనకనుంచి మరికొన్ని వాహనాలు అతివేగంతో ఢీకొట్టాయి. ‘‘కొన్ని వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పక్కకు పోనిద్దామని చూసినా అప్పటికే గాయపడిన ఇతరవాహన ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో మరోదారిలేక వీటినే గుద్దేశారు.ఘటనాస్థలికి నేను వెళ్లిచూసేసరికి అక్కడ దృగ్గోచరత(విజిబిలిటీ) కేవలం మీటర్ మాత్రమే. అంతకుమించి దూరంలో ఏముందో కనిపించనంతా పొగమంచు అలుముకుంది’’అని ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. ఇలా మొత్తం ఎనిమిది బస్సులు, కార్లు, వాహనాలు ఢీకొని తుక్కుతుక్కయ్యాయి. దీంతో ఇంధన ట్యాంక్లు బద్దలై మంటలు చెలరేగాయి. నుజ్జునుజ్జయిన వాహనాల్లో కొందరు, అగ్నికీలల కారణంగా తీవ్రంగా కాలిన గాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.వరుసబెట్టి బస్సులు, కార్లు తగలబడుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాలిపోయిన వాహనాలు కుప్పగా రహదారిపై అడ్డుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, మథుర జిల్లా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్రేన్లతో పక్కకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతటా భీతావహస్థితి.. చిమ్మచీకటి, చలిలో వాహనాల్లో తమతమ సీట్లలో మఫ్లర్లు ధరించి, బెడ్షీట్లు కప్పుకుని ముసుగుతన్ని నిద్రపోతున్న పలువురు అగ్నికీలల్లో కాలి బూడిదయ్యారు. కొందరు శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపుముద్దలుగా మారిపోయారు. వాహనాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగ, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారింది. వేగంగా వాహనాలు ఢీకొన్న శబ్దం సుదూరంలోని తమకూ వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్పారు. మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి కుటుంబసభ్యులు, బంధువుల డీఎన్ఏతో పోల్చిచూశాక పార్థివదేహాలను పోలీసులు అప్పగించనున్నారు.ఇప్పటికే 17 మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. డీఎన్ఏ ప్రక్రియ కోసం రెండు వైద్య బృందాలను నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా వల్లభ్ చెప్పారు. కొందరు మృతుల జాడ గుర్తించారు. వాళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మథుర జిల్లా మేజి్రస్టేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ చెప్పారు. దుర్ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సారథ్యంలో నలుగురు సభ్యులతో మేజి్రస్టియల్ విచారణకు ఆదేశించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనపై ఒక అనామక డ్రైవర్పై తొలుత ఒక కేసు నమోదుచేసి నేరదర్యాప్తు ఆరంభించారు. పిల్లలను బయటకు విసిరేసి.. బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనాలకు హఠాత్తుగా మంటలంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతథా ప్రయత్నించారు. పార్వతి అనే 42 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రాచీ, సన్నీలను వెంటనే బస్సు నుంచి బయటకు విసిరేశారు. కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ లోపలికి పడిపోయారు. ‘‘పిల్లల్ని విసిరేశాక ఆమెను నేను చూడలేదు. ఆమెకు ఏమైందో ఎక్కడుందో అర్ధంకావట్లేదు’’అని ఆమె సమీప బంధువు గుల్జారీ ఏడుస్తూ చెప్పారు. ‘‘క్షతగాత్రులను చేర్పించిన ఆస్పత్రుల చుట్టూ ఆమె జాడ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఆమె ఎక్కడా కన్పించట్లేదు’’అని గుల్జారీ రోదిస్తూ చెప్పారు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలను ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం’’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేíÙయా, క్షతగాత్రులకు తలో రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం
-
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్నగర్లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్నగర్లో ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల దుర్మరణం
ఏలూరు: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. కొయ్యలగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళుతున్న దంపతులు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామం నుండి మనవరాలి అన్నప్రాసనకై జంగారెడ్డిగూడెం బైక్పై వస్తున్న ప్రత్తి జయరాజు(52), భార్య సత్యవతి(45) దంపతులు.. ట్రాలీ ఆటోని ఢీకొట్టి మృతిచెందారు. కొయ్యలగూడెం శివారు పులి వాగు సమీపంలో బైక్ను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దాంతో ఘటనా స్థలంలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
పొగమంచు ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
సాక్షి, అమరావతి: శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లMý ు ఇరువైపులా పొగమంచు హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులోగానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్ చేయడం మధురానుభూతి కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉందన్నది డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు లోయలోపడి ప్రమాదానికి గురికావడంతో 9మంది దుర్మరణం చెందడంతోపాటు 37మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పొగమంచును బస్సు డ్రైవర్ సరిగా అంచనా వేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అందుకే శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్లీ హిల్స్ వంటి ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.చేయాల్సినవి...» లో బీమ్ హెడ్లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.» పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్లైట్లు ఆన్ చేయాలి.» టైల్ ల్యాంప్స్ను క్లీన్గా ఉంచాలి. స్పష్టంగా కనిపించేట్టుగా ఉండాలి.» బ్రేక్ లైట్లు కచ్చితంగా పనిచేసేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు గుర్తించగలరు.» వాహనంలో టూల్ కిట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.» రోడ్లపై ఉన్న లైన్ మార్కింగ్లను గమనిస్తూ.. తదనుగుణంగా డ్రైవింగ్ చేయాలి. రోడ్డుకు కుడి, ఎడమ చివర్లో ఉన్న లైన్లను దాటి వెళ్లకూడదు. ఒక లైన్ నుంచి మరో లైన్లోకి మారేటప్పుడు వెనుక, పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతే లైన్ మారాలి.» వాహనం వైపర్లు సరిగా పని చేసేట్టుగా చూసుకోవాలి.» వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే... రోడ్డుకు ఎడమవైపు లైన్లోనే నిలపాలి.» ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని నడపాలి.» రోడ్డు సరిగా కనిపించడంలేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలు, సమీపంలోని దాబాలు, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి. » విండ్ షీల్డ్ క్లీన్గా ఉండాలి. యాంటీ ఫాగింగ్(డీ ఫాగర్) మోడ్లో వాహనం ఉంచి నడపాలి.చేయకూడనివి...» మితివీురిన వేగంతో ప్రయాణించవద్దు. పరి మిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి. వాహనం ఎప్పుడూ డ్రైవర్ నియంత్రణ ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి. »దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓవర్ టేక్ చేయకూడదు.» క్రూయిజ్ కంట్రోల్ మోడ్లో వాహనాన్ని నడపకూడదు.» డ్రైవింగ్ చేస్తున్నపుడు డ్రింక్స్ తాగడం గానీ ఏమైనా తినడంగానీ చేయకూడదు. పొగ తాగకూడదు. » ఎదురుగా వాహనం వస్తుంటే హైబీమ్ లైట్లను ఫ్లాష్ చేయ కూడదు. » డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్ (త్రికోణాకృతి)లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేయకూడదు. వాహనాన్ని పార్క్ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్ లైన్లను ఆన్ చేసి ఉంచాలి. -
మెదక్: ప్రాణం తీసిన ఓటు..!
సాక్షి, మెదక్: పెద్దశంకరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది.మృతుల్లో దంపతులు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు. -
పంట కాల్వలోకి బోల్తా కొట్టిన ఆటో.. ముగ్గురి దుర్మరణం
దోనెపూడి: బాపట్ల జిల్లాలోని దోనెపూడి దగ్గరు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కొబ్బిరి కాయలతో వెళుతున్న ఓ ఆటో పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో ఐదుగురు ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకంది. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమం ఉన్నట్ల సమాచారం. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్ని చాటగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్గా గుర్తించారు. ఇదిలా ఉంచితే, ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు గోరింట గట్టులోకి పడిపోవడంతో కనీసం 9 మంది మృతి చెందగా, 23 మంది వరకూ గాయపడ్డారు. చింతూరు మండలంలోని తులసిపకల ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 37మంది ప్రయాణికులతో బస్సు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు.ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో క్లియరెన్స్ మందగించి ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన పోలీసు అధికారులు.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు 60 కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడంతో డ్రైవర్ల నియంత్రణ కోల్పోతున్నారు.మద్యం తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకున్ని డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణంగా మారుతుంది.డ్రైవింగ్ చేస్తున్నప్పడు ఫోన్లో మాట్లాడటం, మెసేజ్ టైప్ చేయడం వాహనం మీద నియంత్రణ కోల్పోవడం ఒక కారణం. నిబంధనలు పాటించకుండా వ్రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం మరో కారణం.ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి సిగ్నల్ జంప్ చేయడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం.హెల్మెట్, సీట్బెల్ట్ వంటి సేఫ్లీ పరికరాలు వాడకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. వాహనాలు బ్రేక్ ఫెయిల్, టైర్ బ్లాస్ట్ వంటి సమస్యలు. భారీ వర్షాలు కానీ, పొగమంచు ఉన్నప్పుడు కానీ సరైన లైటింగ్ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఒక కారణం. -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్స్పాట్గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్వర్క్లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
ఏపీలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
సాక్షి,అల్లూరి: ఏపీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన AP 39 UM 6543 నెంబర్ గల ప్రైవేట్ బస్సు 37మందితో భద్రాచలం నుంచి అరకు వెళ్తుంది. మార్గం మధ్యలో మారేడుమిల్లి ఘాటురోడ్డు లోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చిత్తూరులో మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన బస్సు ఈ నెల ఆరవ తేదీ రాత్రి 9 గంటలకు 39 మందితో యాత్రకు బయలుదేరింది. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఏర్పాటైంది. బస్సు ప్రమాదానికి ముందు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో పదుల సంఖ్యలో మృతిచెందారు. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మితిమీరిన వేగం..ప్రమాదం జరిగిన ప్రదేశం కొండప్రాంతం కావడంతో ఘాట్ రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని తెలుస్తోంది. -
షాకింగ్ వీడియో.. కారుపై విమానం క్రాష్ ల్యాండ్
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్స్టేట్-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ల్యాండింగ్కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.Unbelievable scene on I-95, Florida:A landing aircraft clipped a car on the highway.FHP confirms the driver is safe with only minor injuries.pic.twitter.com/gDmWcmxUou— TRIDENT (@TridentxIN) December 10, 2025 -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం. నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఖాకీ తండ్రి... కంత్రీ కొడుకు
సాక్షి, నరసరావుపేట: పెడదారిపడుతున్న కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన తండ్రి తనయుడి మోసాలను చూసీచూడనట్టు వదిలేశాడు. కన్న పేగు మమకారంతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే నమోదైన కేసుల్లో బయటపడేలా చేస్తుండటం ఆ కొడుకు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటుపడిన ఓ ఏఎస్ఐ కొడుకు చేసిన నిర్వాకానికి ఏకంగా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠా జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నగదు వసూలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది. నకిలీ రవాణాశాఖ అధికారుల పేరుతో... చిలకలూరిపేట బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వినుకొండ రూరల్ మండలంలో అయ్యప్పస్వామి భజనకు హాజరుకావడానికి గుంటూరు నుంచి వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న ట్రాలర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాలర్ను ముందుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఆపడంతో ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ట్రాలర్ను ఆపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు, చిన్న తురకపాలేనికి చెందిన ఎస్కే బాషా, బాలయ్యనగర్కు చెందిన వెంకట్రావ్, నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గోపి, మహేష్ లు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నలుగురు తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, ఒకరు మాత్రం నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. హైవేపై వెళ్తున్న లారీలను రవాణాశాఖ అధికారుల పేరిట ఆపి నగదు వసూలు చేయడం కోసమే ఆపాం అని, అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చినట్టు తెలియవచ్చింది. పోలీసు దందాలకు నాయకుడు రౌడీషిటర్ ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడిపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో రౌడీషిట్ నమోదై ఉంది. పదుల సంఖ్యలో చీటింగ్, చోరీలు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపరణలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి రౌడీషిటర్లను తరచూ పోలీసుస్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండాలి. ఈ పోలీసు కంత్రీ కుమారుడిని ఇటీవల కాలంలో స్టేషన్కి పిలిచి కౌన్సెలింగ్ చేపట్టిన దాఖలాలు లేవని రూరల్ పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తండ్రికి ఉన్నతాధికారులతో ఉన్న సత్ససంబంధాలతో రౌడీషిటర్ల కౌన్సెలింగ్కు వెళ్లాల్సిన పనిలేకుండా సెట్ చేశారట. గతేడాదిగా సదరు రౌడీషిటర్తో పోలీసు ఉన్నతాధికారులు మామూళ్ల వసూళ్లకు ఏజెంట్గా నియమించినట్టు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లను ఈ రౌడీషిటరే తండ్రి తరపున వెళ్లి బెదిరించి మరీ వసూళ్లు చేసేవాడని పోలీసు వర్గాలే చెప్పుకొస్తున్నాయి. తమ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అండతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారని, అయినా ఏం చేయలేక మిన్నుకుండిపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సదరు ఏఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కోటప్పకొండ వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన ఘటనలో తండ్రీకొడుకులను శిక్షించి ఉంటే ఈ సమస్య వచ్చేంది కాదని అంటున్నారు. ఇతని బా«ధితులు నరసరావుపేటలో పదుల సంఖ్యలో ఉన్నా తండ్రి అధికారంతో బా«ధితులు బయటకు రావడానికి భయపడుతున్నారు. -
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో షాకింగ్ నిజాలు
-
600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు మృతి!
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వాన్ తాలూకా, సప్తష్రింగ్ గర్ ఘాట్లో ఒక టయోటా ఇన్నోవా కారు అదుపుతప్పి, ఏకంగా 600 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో పింపాల్గావ్ బస్వంత్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతులను ఒకే కుటుంబానికి చెందిన కీర్తి పటేల్ (50), రసీలా పటేల్ (50), విఠల్ పటేల్ (65), లతా పటేల్ (60), వచన్ పటేల్ (60),మణిబెన్ పటేల్ (70)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. లోయలో పడిన కారు తుక్కుతుక్కుగా మారింది. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు , జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదకర ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.‘ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఘటనను ‘చాలా విషాదకరం’ అని అభివర్ణించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ కమిటీ సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నాసిక్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయాన్ని అందిస్తుందని రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్కుమార్ రాజ్పుత్ తెలిపారు.ఇది కూడా చదవండి: అర్థరాత్రి దాటాక.. నైట్ క్లబ్ల షాకింగ్ సీక్రెట్స్! -
బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు
సాక్షి, తిరుపతి జిల్లా: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి శబరిమలైకి వెళ్తున్న బస్సు రైటర్ సత్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ అయ్యప్ప భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రమాదంలో మృతి చెందిన.. విజయనగరం అయ్యప్ప భక్తులు!
-
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లు అని పోలీసులు ప్రకటించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మృతులు వీళ్లే.. 1) వంగర రామక్రిష్ణ(51) కొరప కొత్తవలస2)మార్పిన అప్పలనాయుడు(33) కొరప కొత్తవలస 3)మరాడ రాము(50) కోరప కొత్తవలస4)బండారు చంద్ర రావు(35) మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలంమృతుల కుటుంబాలకు తమిళనాడు పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. పోస్ట్మార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Palnadu: లారీని వెనక నుండి ఢీకొన్న కారు
-
పల్నాడు ఘోర ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
సాక్షి, తాడేపల్లి: పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు కంటెయినర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న ఐదుగురు బీటెక్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
కంటైనర్ను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే ఐదుగురు దుర్మరణం
పల్నాడు, సాక్షి : పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ను వెనుక నుంచి మారుతి షిప్ట్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదు మంది మృతి చెందారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
Khammam: సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టితో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు 9 ఏళ్ల బాలుడు ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులను బలిగొన్న పొగమంచు
కర్ణాటక: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నగరంలోని డాన్బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అరి్పంచారు. -
హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రొద్దుటూరువాసి మృతి
సాక్షి, కడప: కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఆంధ్ర- కర్ణాటక బార్డర్లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు పాలైనట్టు సమాచారం. మంగళవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు. గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు. తిరుప్పూర్ నుంచి కారైక్కుడి వస్తున్న తమిళనాడు రవాణా సంస్థ ఎక్స్ప్రెస్ బస్సు, కారైక్కుడి నుంచి దిండుగల్ వైపుగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు అతివేగంగా పిల్లయార్పట్టి సమీపాన సమత్తువ పురం వంతెన వద్ద ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని, శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసి కారైక్కుడి ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలొదిలారు. శివగంగై జిల్లా కలెక్టర్ పొర్కొడి, ఎస్పీ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంతెన దాటగానే ఉన్న మలుపు వద్ద రెండు బస్సులు అతివేగంగా దూసుకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శివగంగ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 40 మంది ఉండగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్కు వస్తుండగా ప్రమాదం జరిగింది.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి రోజే.. చివరి రోజు
ఎమ్మిగనూరు రూరల్/ఎమ్మిగనూరు టౌన్: పెళ్లి రోజును మంత్రాలయంలో జరుపుకుందామని కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలుదేరిన భార్యభర్తలు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులు కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోటేకల్ గ్రామం కొండ మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్కహోసహళ్లి, బంగరుపేటకు చెందిన మీనాక్షి(32), సతీష్కుమార్(34) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తమ పెళ్లి రోజును శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో జరుపుకోవాలనుకున్నారు. కుమారుడు రుత్విక్(4), మీనాక్షి తండ్రి వెంకటేషప్ప(76), తల్లి గంగమ్మ, అన్న కుమారుడు బనిత్(5), స్నేహితుడు చేతన్తో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరారు.అదే సమయంలో విజయనగరానికి చెందిన అశోక్, జాహ్నవి, రాధిక హైదరాబాద్ నుంచి ఆదోనికి ఫార్చ్యునర్ కారులో వస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు మండలం కోటేకల్ కొండల వద్దకు వచ్చేసరికి స్విఫ్ట్కారు నడుపుతున్న చేతన్ నిద్ర మత్తు, పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న ఫార్చ్యునర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్, మీనాక్షి దంపతులతో పాటు కుమారుడు రుత్విక్, బనిత్గౌడ్, వెంకటేషప్ప అక్కడికక్కడే మరణించారు. చేతన్, గంగమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. ఫార్చ్యునర్లో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చేతన్, గంగమ్మను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని డీఐజీ కోయ ప్రవీణ్, అడ్మిన్ ఎస్పీ ఉసేన్ పీరా, డీఎస్పీ ఎంఎన్ భార్గవి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్కుమార్, తహసీల్దార్ శేష ఫణి పరిశీలించారు. మృతుల బంధువులను వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రకోట రాజీవ్రెడ్డి, జగన్ పరామర్శించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని.. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధితులను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
Kurnool Road Incident: వైయస్ జగన్ దిగ్భ్రాంతి
-
మరోసారి వార్తల్లోకి బెంగళూరు రోడ్లు
బెంగళూరు: బెంగళూరులో గుంతలమయమైన రోడ్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. బెంగళూరులో పని చేస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన సౌరభ్ పాండే బైక్పై వెళ్తూ పెద్ద గుంత కారణంగా కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో బెడ్పై ఉండగా అతని స్నేహితురాలు సెల్ఫీ వీడియో తీసి బెంగళూరు రోడ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నా స్నేహితుడు ఈరోజు గాయాలతో ఆస్పత్రిలో ఉండడానికి కారణం బెంగళూరులో అధ్వానంగా ఉన్న రోడ్లే. తృటిలో ప్రాణాపాయం తప్పింది’ తెలిపింది. బెంగళూరులో ద్విచక్ర వాహనాలను నిషేధించండి అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. View this post on Instagram A post shared by Khyati Shree (@khyatishree2) -
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
-
కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా..
కర్నూలు: కర్ణాటక బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. బస్సు వేగం సమానంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ రోజు(శనివారం, ,నవంబర్ 29) ఉదయం బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిండి బస్సు. మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అంతకుముందు కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం -
AP: ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
కర్నూల్: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తెలిసిందే. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక ప్రమాదాలు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో శామీర్పేట వద్ద ఓఆర్ఆర్పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెలలోనే సంగారెడ్డి ఓఆర్ఆర్పై ఒక కారు అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ కారు అగ్నికి ఆహుతైంది. గత నెలలో పఠాన్చెరువు సమీపంలో ముతంగి ఓఆర్ఆర్పై ఓ కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరూ కూడా ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు.ఓఆర్ఆర్పై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 14449 నెంబరుకు కాల్ చేయవచ్చు. ప్రమాదాలు కానీ, వాహనాల బ్రేక్డౌన్, పెట్రోలు, డీజిల్ ఖాళీ అయినా, పంక్చర్లు అయినా ఈ నెంబరుకు కాల్ చేస్తే సాయం అందుతుంది. ఇది కాకుండా పోలీసుల హెల్్పలైన్ 100, ఆంబులెన్స్ కోసం 108, అగ్ని ప్రమాదాల సందర్భంలో 101కు కాల్ చేసి సాయం అందుకోవచ్చు.కార్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు..ఓఆర్ఆర్పై వేగంగా డ్రైవ్ చేయడం కూడా కార్లు తరుచు ప్రమాదంబారిన పడటానికి ప్రధాన కారణం. కార్లను అత్యంత వేగంగా, ఓఆర్ఆర్పై నిర్దేశించిన వేగం కంటే కారును నడుపుతున్న సందర్భాల్లో ఇంజిన్ ఓవర్హీట్ అవుతూ ఉంటుంది. దాంతో కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆయిల్ లీక్ అంశం కూడా కార్లు తొందరగా అగ్నికి ఆహుతి కావడానికి మరో కారణం. ఇక ఎలక్ట్రికల్ లోపాలతో కూడా కార్లు అగ్ని ప్రమాదం బారిన పడుతున్నాయి.ఓఆర్ఆర్పై ఏదైనా కారు ప్రమాదానికి గురైనప్పుడు అగ్ని మాపక వంటి సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యం అవుతుంది. ఓఆర్ఆర్ పై ప్రమాదం సమాచారం అందుకున్న తర్వాత స్పాట్కు ఎమర్జెన్సీ సర్వీసులు చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్నదిగా మారింది. గ ఓఆర్ఆర్పై కార్లు అగ్ని ప్రమాదం బారినపడ్డప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు సరైన సమయానికి రావడం అనేది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.డ్రైవర్లు ఇలా చేస్తే..రెగ్యులర్గా కార్లను చెక్ చేయడం అనేది డ్రైవర్లు పనిగా పెట్టుకోవాలి. వాహనం ఎలక్రికల్ వైరింగ్,ఆయిల్ ట్యాంక్, టైర్లు వంటి రెగ్యులర్ాగా జరిగేప్రాసెస్గా ఉండాలిఓఆర్ఆర్పై ాకార్లను పార్కింగ్ చేయడం అనేది మానేయాలి. ఓఆర్ఆర్ై వాహనాలను నిలిపి ఉంచడం అనేది నిషిద్ధమే కాదు.. ప్రమాదం కూడా .కారు నుంచి పొగలు రావడం గమనిస్తే వెంటనే నిలిపివేయాలి. వెంటనే కారు నుంచి దిగిపోవాలి. -
సోదరుని పెళ్లికి హాజరై వస్తుండగా..
ఒడిషా: తన సోదరుడి పెళ్లి చూసి ఎంతో ఉత్సాహంగా ఇంటికి తన స్నేహితులతో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై సోదరి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాత్రికేయులతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సంబల్పూర్ జిల్లాలోని కటర్బాగ్ సమితి పరిధిలోని కుసుందీహి గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ట్రెజరీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న పాత్రికేయుడు గొపినాథ్ గౌడోకు బుధవారం సంబల్పూర్లోని కుచేండ వద్ద వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపినాథ్ సోదరి జోత్స్నరాణి గౌడో (35)తో సహా పాత్రికేయులు సుప్రియా షడంగి, శక్తిదాస్ బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు. వివాహం పూర్తయి తిరిగి ఇంటికి బంధుమిత్రులతో పాటు వధువును తీసుకువస్తున్న సమయంలో బొలేరోలో ప్రయాణం చేస్తున్న జోత్స్నరాణి గౌడో, సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లు ఉన్నారు. సంబల్పూర్కు కొద్ది దూరం చేరేసరికి కుసుం«దీహి గ్రామ సమీపంలో వాహభం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో జోత్స్నరాణి గౌడో సంఘటన స్థలం వద్దే మృతి చెందగా సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బుర్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో సుప్రియ షడంగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. వాహనంలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన జోత్స్నరాణి గౌడో మృతదేహాన్ని గ్యాస్ కటర్లతో తొలగించి పోస్టుమార్టం కోసం సంబల్పూర్కు తరలించారు. అండగా జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘం జరిగిన సంఘటనను తెలుసుకున్న పాత్రికేయుల సంఘం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. మృతదేహాన్ని సంబల్పూర్ నుంచి రాయగడకు తరలించేందుకు జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘానికి చెందిన శివాజీదాస్, సంగ్రామ్ పటా్నయక్, శివనారాయణ గౌడో, ఆశీష్ రంజన్ పండ తదితరులు జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోను గురువారం సంప్రదించారు. అనంతరం ఆయన చొరవతో సంబల్పూర్ కలెక్టర్ను సంప్రదించి మృతదేహాన్ని ఆంబులెన్స్లో తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. అలాగే తీవ్రగాయాలకు గురై విశాఖలో చికిత్స పొందుతున్న సుప్రియా షడంగికి ఆర్థికంగా ఆదుకునేందకు సంఘం ముందుకు వచ్చింది. -
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
-
పిఠాపురం రోడ్డులో.. ఆదమరిస్తే అంతే..
కొత్తపల్లి: రహదారుల్లో మలుపులు ప్రమాదాలకు పిలుపుల్లా మారాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లలోని మలువుల వద్ద రక్షణ చర్యలు కరువయ్యాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే ఎందరో ప్రాణాలను కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వెళ్లే కొమరగిరి–ఆనందనగర్, గోర్స–నాగంపేట, పండూరు–కొత్తపల్లి రోడ్లలో మలుపులు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికల సూచనల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదకర మలుపుల్లో మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిలో వెళ్లాలంటే వాహన ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం మండలంలోని పండూరు– కొత్తపల్లి, గోర్స– పిఠాపురం, ఉప్పాడ– పిఠాపురం, నాగులాపల్లి–పిఠాపురం, నాగులాపల్లి– రమణక్కపేట వెళ్లే రోడ్లలో మలుపులు అతి ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు నియంత్రించే దిశగా రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. కానీ ఆర్అండ్బీ అధికారులు ప్రమాదకరంగా ఉన్న మలుపులు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రతి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మలుపులు వద్ద సూచికల బోర్డులను ఏర్పాటు చేసి ప్రమదాల నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి రహదారి మలుపులు వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ రహదారుల్లో వెళ్లాలంటే భయపడుతున్నారు. పండూరు – కొత్తపల్లి రోడ్డులో కొమరగిరి శివారు వెంకటరాయపురం సమీయంలో ఉన్న కాలువలో వాహనచోదకులు పడి క్షతగాత్రులువుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందాడు. గోర్స భద్రుని చెరువు వద్ద ఉన్న మలుపులో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆర్అండ్బీ అధికారులు ఏ ఒక్క రోజూ కూడా ఈ మలుపులో ఎటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన దాఖలాలేలేవు, రోడ్డుకిరువైపులా తుప్పలు పెరిగిపోవడంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. – సుబ్రహ్మణ్యం, కొమగరగిరి -
కూతురికి బై..బై చెప్పి శాశ్వతంగా వెళ్లిపోయాడు
హైదరాబాద్: పదిరోజులు కూతురు వద్ద సంతోషంగా గడిపారు.. ఇక తిరిగి తమ స్వగ్రామానికి పయనమయ్యారు.. కూతురు, అల్లుడికి బైబై మంచిగా ఉండండి బిడ్డా.. అంటూ నుండి బయలుదేరారు. ఇంటికి చేరగానే ఫోన్ చేస్తామని అన్నారు. పది నిమిషాల్లోనే పిడుగులాంటి వార్త.. మీ అమ్మ, నాన్నలకు యాక్సిడెంట్ అయ్యిందని.. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. టాటా మినీట్రక్ డీకొట్టిన ఈ ఘటనలో భర్త అక్కడికిఅక్కడే మృతిచెందగా బార్య తీవ్రంగా గాయపడింది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన మేరకు.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామానికి చెందిన కటంగూరి వెంకటరామిరెడ్డి(56), లత(52) భార్యభర్తలు. పదిరోజుల క్రితం దంపతులిద్దరూ చింతల్ శ్రీసాయి నగర్లో ఉండే చిన్నకుమార్తె దీపిక వద్దకు వచ్చారు. కూతురి వద్ద ఆనందంగా గడిపిన వారు సోమవారం ఉదయం 6 గంటలకు వారి స్వంత గ్రామానికి బయలుదేరారు. సికింద్రాబాద్ వెళ్లేందుకు చింతల్ గణే‹Ùనగర్ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతున్నారు. ఈక్రమంలో బాలానగర్ నుండి జీడిమెట్ల వైపు వెళ్తున్న టాటా మినీ ట్రక్ అతివేగంగా వచ్చి దంపతులను డీకొట్టింది. ఈఘటనలో తీవ్రగాయాలతో వెంకటరామిరెడ్డి అక్కడికిఅక్కడే మృతిచెందగా లత తీవ్రంగా గాయపడింది. లతను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేరి్పంచగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంకట రామిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్ల పారాణి ఆరకముందే కాటికి!
సాక్షి, సిద్ధిపేట: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంటను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఘటనలో నవ వధువు మృతి చెందగా.. భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేటకు చెందిన ప్రణతి(24), సాయికుమార్లకు ఈ మధ్యే వివాహం జరిగింది. లీవ్స్ ముగిసిపోవడంతో జాబ్ నిమిత్తం సోమవారం హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యారు. అయితే.. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారుకు చేరుకోగానే ఓ ట్రాక్టర్ వీళ్ల బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కాదు.. స్థానికంగానూ తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే అంతిమ సంస్కారాలు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తమిళనాడు టెంకాసి జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మదురై నుంచి శేంకొట్టైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.రెండు బస్సులు ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు.ప్రాథమిక దర్యాప్తులో మదురై-శేంకొట్టై మార్గంలో వెళ్లిన ‘కీసర్’ అనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ అత్యధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం.ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
ప్రాణం తీసిన అతి వేగం
హైదరాబాద్: అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. కేవలం స్వయం తప్పిదం కారణంగా బైకు డివైడర్ను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇరువురూ స్పాట్లోనే కన్నుమూశారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జరిగిన ఘటనపై ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కొత్తపేట మోహన్నగర్ ప్రజయ్ నివాస్లో ఉండే గుల్ల మధు (32), టెలిఫోన్ కాలనీకి చెందిన స్నేహితుడు కొర్నెపాటి రామచంద్ర హరీష్లు శనివారం అర్ధరాత్రి బైక్పై చైతన్యపురిలోని మరో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మధుకు సోదరుడు పవన్ ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదేమిటని అడగ్గా..చైతన్యపురిలోని స్నేహితుడి ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరిన మధు, హరీష్లు బైకున అతివేగంగా నడుపుతూ వచ్చారు. వీఎంహోం సమీపంలోని 1618 మెట్రో పిల్లర్ వద్దకు రాగానే అతివేగం కారణంగా బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి కిందపడిపోయారు. దీంతో తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలో మధు, హరీష్లు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ప్రమాద ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyd: ఓఆర్ఆర్పై మంటల్లో చిక్కుకున్న కారు..
మేడ్చల్: మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్పేట వద్ద ఓఆర్ఆర్పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెలలోనే సంగారెడ్డి ఓఆర్ఆర్పై ఒక కారు అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ కారు అగ్నికి ఆహుతైంది. గత నెలలో పఠాన్చెరువు సమీపంలో ముతంగి ఓఆర్ఆర్పై ఓ కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరూ కూడా ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. ఓఆర్ఆర్పై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 14449 నెంబరుకు కాల్ చేయవచ్చు. ప్రమాదాలు కానీ, వాహనాల బ్రేక్డౌన్, పెట్రోలు, డీజిల్ ఖాళీ అయినా, పంక్చర్లు అయినా ఈ నెంబరుకు కాల్ చేస్తే సాయం అందుతుంది. ఇది కాకుండా పోలీసుల హెల్్పలైన్ 100, ఆంబులెన్స్ కోసం 108, అగ్ని ప్రమాదాల సందర్భంలో 101కు కాల్ చేసి సాయం అందుకోవచ్చు.కార్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు..ఓఆర్ఆర్పై వేగంగా డ్రైవ్ చేయడం కూడా కార్లు తరుచు ప్రమాదంబారిన పడటానికి ప్రధాన కారణం. కార్లను అత్యంత వేగంగా, ఓఆర్ఆర్పై నిర్దేశించిన వేగం కంటే కారును నడుపుతున్న సందర్భాల్లో ఇంజిన్ ఓవర్హీట్ అవుతూ ఉంటుంది. దాంతో కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆయిల్ లీక్ అంశం కూడా కార్లు తొందరగా అగ్నికి ఆహుతి కావడానికి మరో కారణం. ఇక ఎలక్ట్రికల్ లోపాలతో కూడా కార్లు అగ్ని ప్రమాదం బారిన పడుతున్నాయి.ఓఆర్ఆర్పై ఏదైనా కారు ప్రమాదానికి గురైనప్పుడు అగ్ని మాపక వంటి సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యం అవుతుంది. ఓఆర్ఆర్ పై ప్రమాదం సమాచారం అందుకున్న తర్వాత స్పాట్కు ఎమర్జెన్సీ సర్వీసులు చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్నదిగా మారింది. గ ఓఆర్ఆర్పై కార్లు అగ్ని ప్రమాదం బారినపడ్డప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు సరైన సమయానికి రావడం అనేది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.డ్రైవర్లు ఇలా చేస్తే..రెగ్యులర్గా కార్లను చెక్ చేయడం అనేది డ్రైవర్లు పనిగా పెట్టుకోవాలి. వాహనం ఎలక్రికల్ వైరింగ్,ఆయిల్ ట్యాంక్, టైర్లు వంటి రెగ్యులర్ాగా జరిగేప్రాసెస్గా ఉండాలిఓఆర్ఆర్పై ాకార్లను పార్కింగ్ చేయడం అనేది మానేయాలి. ఓఆర్ఆర్ై వాహనాలను నిలిపి ఉంచడం అనేది నిషిద్ధమే కాదు.. ప్రమాదం కూడా .కారు నుంచి పొగలు రావడం గమనిస్తే వెంటనే నిలిపివేయాలి. వెంటనే కారు నుంచి దిగిపోవాలి. -
నంద్యాల బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన సంచలన నిజాలు
-
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
-
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
-
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తుపాన్ వాహనంలోని నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒరిస్సా నుంచి విశాఖకు వెళుతుండగా ఆదివారం తెల్లవారు జామున ఘటన జరిగినట్లు సమాచారం.మృతులు భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)లుగా పోలీసులు గుర్తించారు. -
భయానక రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి కిందపడి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంలో ఉన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదం సందర్భంగా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలోని గౌరా పడావ్లో ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. బైక్తో రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వేగంతో వస్తున్న కారు.. సదరు బైక్ను ఢీకొట్టింది. దీంతో, ఒక్కసారిగా బైక్, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో బైకర్దే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వారిని వాన్భూల్పుర నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. -
‘ఎమర్జెన్సీ’ పెళ్లి
సాధారణంగా పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా కల్యాణ మండపాల్లో జరుగుతాయి. కానీ కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పెళ్లి మండపంగా మారిపోయింది. తంబోలికి చెందిన వరుడు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన వధువుకు అక్కడే తాళి కట్టాడు. పెళ్లి కూతురి ముస్తాబుకు వెళ్తూ..ఆలప్పుజలోని కొమ్మడికి చెందిన అవని, తంబోలికి చెందిన వి.ఎం.షారన్ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం తంబోలిలో జరగాల్సి ఉంది. అయితే, ఉదయాన్నే పెళ్లికూతురు అవని.. అలంకరణ కోసం కుమరకోమ్ వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే గాయపడిన అవనిని కొట్టాయం వైద్య కళాశాలకు తరలించారు. ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో, ప్రత్యేక చికిత్స కోసం మధ్యాహ్నం ఎర్నాకుళంలోని వీపీఎస్ లేక్షోర్ ఆసుపత్రికి తరలించారు. ముహూర్తం ముఖ్యం! ప్రమాద వార్త విన్న షారన్, అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అందరూ అయోమయంలో ఉన్నా, రెండు కుటుంబాల దృష్టి ముహూర్తంపైనే ఉంది. మధ్యాహ్నం 12.15 గంటల నుండి 12.30 గంటల మధ్య పెళ్లికి శుభ ముహూర్తం నిర్ణయించారు. దీంతో, ముహూర్త సమయం మించిపోకూడదన్న గట్టి సంకల్పంతో, రెండు కుటుంబాలు వివాహాన్ని ఆసుపత్రిలోనే జరిపించాలని కోరాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులను సంప్రదించి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. వధువు అవనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎమర్జెన్సీ విభాగంలోనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. కల్యాణమంటపమైన ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అతికొద్దిమంది బంధువుల సాక్షిగా.. శుభ ముహూర్తంలో షారన్, అవని మెడలో తాళి కట్టి జీవిత సహచరిగా స్వీకరించాడు. ఆ క్షణంలో, ఆసుపత్రిలోని మెడికల్ పరికరాల శబ్దాల మధ్య.. బంధువుల దీవెనలు మారుమోగిపోయాయి. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సు«దీష్ కరుణాకరన్ మాట్లాడుతూ, అవని వెన్నెముకకు గాయమైనందున త్వరలోనే శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. ప్రాణం నిలవడానికి ఔషధం కావాలి, కానీ జీవితం మొదలవడానికి ముహూర్తం కావాలి.. అన్నట్లు. కత్తిరింపులు, కుట్లు, ఐవీ సెలైన్ల మధ్య ఈ వివాహ వేడుక జయప్రదంగా జరిగిపోయింది. జీవితంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా.. అవని, షారన్ ఇద్దరూ కలిసి ఎదుర్కొంటారనే ధైర్యాన్ని, హామీని. అంతకుమించిన నమ్మకాన్ని ప్రపంచానికికిచ్చింది. In a moment of extraordinary love and resilience, a #Kerala couple went ahead with their #wedding inside a #hospital emergency room after the bride met with a #roadaccident en route to bridal makeup and suffered a spinal #injury. With both families, doctors and hospital staff… pic.twitter.com/g9gO59XfsI— Salar News (@EnglishSalar) November 22, 2025 -
హైవేపై ఢీకొన్న కార్లు.. ఒకరు మృతి, పలువురి గాయాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో శుక్రవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
మరో స్లీపర్ బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాన్పూర్: దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని అరౌలి ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఢిల్లీ నుండి బిహార్లోని సివాన్కు వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు అతివేగంగా సెంట్రల్ డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. పగిలిన గాజు ముక్కలు, చెల్లాచెదురుగా పడిన సామాను, గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమేననే ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. కాగా ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పారిపోయారు. ఈ విషయాన్ని అరౌలి పోలీసు ఇన్స్పెక్టర్ జనార్ధన్ సింగ్ యాదవ్ ధృవీకరించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు అంబులెన్స్లలో గాయపడిన వారిని బిల్హౌర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్లోని ఆసుపత్రులకు తరలించారు. డాక్టర్ సంజీవ్ దీక్షిత్, ఏసీపీ మంజయ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రులోని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య -
అమ్మా.. నాన్న దగ్గరికి వెళ్లిపోయావా..!
మంచిర్యాల జిల్లా: ‘‘అమ్మా.. నాన్న దగ్గరికి వెళ్లిపోయావా.. మా బాగోగులు చూసేదెవరు.. మా వద్దకు ఎప్పుడొస్తవ్.. పొద్దంతా వరంగల్లోని దేవాలయాల వద్దకు తీసుకెళ్లి దర్శనాలు చేయించావు. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలన్నావు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యావు.. ఏ దేవునికి అనిపించలేదా..? మాకు దూరం చేయొద్దని..’’ అంటూ ఆ పిల్లలు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి తండ్రిని దూరం చేయగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తల్లీ దూరమైంది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. వేమనపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. మండల కేంద్రం వేమనపల్లికి చెందిన మద్దెర్ల పుష్పలత, వెంకటేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు నిహాల్, రిషిత్, సహస్ర ఉన్నారు. గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహించే వెంకటేష్ ఆరేళ్ల క్రితం కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి సోదరుడు విక్కీ సహాయంతో కిరాణ దుకాణాన్ని పుష్పలత కొనసాగిస్తూ పిల్లలను చదివిస్తోంది. కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వరంగల్కు వెళ్లిన పుష్పలత ఇంటర్, 8వ తరగతి చదువుతున్న కుమారులు నిహాల్, రిషిత్లతో కలిసి అక్కడి వేయి స్తంభాల గుడితోపాటు పలు ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు. అనంతరం పిల్లలను హాస్టళ్లలో అప్పగించి తిరుగు ప్రయాణమైంది. ఆమెను తీసుకెళ్లడానికి ఇందారం చౌరస్తా వరకు కారులో వచ్చినట్లు సోదరుడు విక్కీ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గోదావరిఖని బస్టాండ్ వరకు వచ్చిన ఆమె అక్కడి నుంచి తెలిసిన వ్యక్తి చెన్నూర్కు చెందిన హోల్సేల్ వ్యాపారి అరుణ్కుమార్ మోటార్సైకిల్పై బయల్దేరింది. గోదావరి వంతెన వద్ద చీర కొంగు మోటారు సైకిల్ టైరులో చుట్టుకుని కిందపడి పుష్పలత(40) మృతిచెందింది. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని వేమనపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పుష్పలత మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కరోనాతో తండ్రి, ప్రమాదంలో తల్లి మృతిచెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, అరుణ్కుమార్కు గాయాలైనట్లు తెలిసింది. -
మృత్యుంజయుడు!
సాక్షి, హైదరాబాద్: సౌదీ ఆరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని జిర్రా నటరాజ్నగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాల పాలైన 24 ఏళ్ల షోయబ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన షోయబ్ తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, తల్లి గౌసియా బేగం, తాత మహమ్మద్ మౌలానా మరణించారు. మక్కాలో ఆదివారం ప్రార్ధనలు పూర్తి చేసుకొని రాత్రి 12 గంటలకు ప్రత్యేక బస్సులో బయలు దేరారు.అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సును నిలిపివేసి కిందకు దూకగా, ఆయనతో పాటు షోయబ్ కూడా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఉమ్రా యాత్రకు వచ్చి మక్కాలో ఆగిపోయిన తన సోదరుడు సమీర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తర్వాత షోయబ్ తీవ్ర గాయాలతో కింద పడిపోగా డ్రైవర్ పూర్తి సమాచారం అందించాడు. సౌదీ పోలీసులు షోయబ్ను ఆసుపత్రికి తరలించారు. -
యా అల్లా!.. సౌదీలో మృత్యు ఘోష
న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్/సాక్షి,న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. మరణించిన నగర వాసుల్లో 18 మంది పురుషులు, 26 మంది మహిళలు కాగా వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరి మృతదేహాలను జెడ్డాలోని కింగ్ ఫహద్, కింగ్ సల్మాన్, అల్ మిఖత్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను మదీనాలోనే స్థానిక సంప్రదాయాల మేరకు ఖననం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద జరిగిన రెండు ఘోర బస్సు ప్రమాదాలను మరిచిపోక ముందే మరో దుర్ఘటన జరగడం, ఏకంగా 44 మంది హైదరాబాదీలు మరణించడం నగరాన్ని కుదిపేసింది. సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఇతను ఒక్కడే.. ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షోయబ్ మొత్తం 54 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీల నుంచి మొత్తం 54 మంది ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. మక్కా సందర్శన అనంతరం నలుగురు అక్కడే ఆగిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన 46 మందీ బస్సులో మదీనా వెళ్తుండగా గమ్య స్థానానికి 25 కి.మీ దూరంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలను సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు త్రెలిపారు. 8002440003 (టోల్ ఫ్రీ), 00966122614093, 00966126614276 00966556122301 (వాట్సాప్) హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జెడ్డా నుంచి అధికారుల బృందం ఘటనా స్థలికి, ఆస్పత్రులకు వెళ్లినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రియాద్లోని ఎంబసీ కార్యాలయం కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తోంది. సౌదీ ప్రమాదం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. (కాంటాక్ట్ నంబర్లు.. వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ –+91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 99583 22143, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ –+91 96437 23157). ఇలావుండగా షెడ్యూల్ ప్రకారం యాత్రికుల బృందం ఈనెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు వీరికి విమాన టిక్కెట్లు సైతం బుక్ అయ్యాయి. ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను తీవ్ర విచారంలో మునిగిపోయా. నా ఆలోచనలన్నీ ఆప్తుల్ని కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయి. జెడ్డాలోని మన కాన్సులేట్, రియాద్లోని ఎంబసీ అవసరమైన సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ఇక్కడి మన అధికారులు కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నారు..’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జైశంకర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి సౌదీ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఢిల్లీలోని అధికారులు, సౌదీలోని రాయబారితోనూ మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయకచర్యలు తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందం తక్షణమే సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనుంది. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాలుగా అదుకుంటామని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చెప్పాట్టాలని సౌదీ అధికారులను కోరినట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కుటుంబాల నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్తో మాట్లాడి తగు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మృతుల కుటుంబసభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సహాయ సహకారాల కోసం పోలీసు విభాగం తరఫున సంయుక్త పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎప్పుడూ ప్రమాదకరమే.. సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల నుంచి యాత్రికుల తరలింపు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా హజ్ యాత్ర సమయంలో రోడ్లన్నీ బస్సులతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉంటాయి. 2023లో మక్కా నుంచి వెళ్తున్న ఓ బస్సును బ్రిడ్జిని ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 2019లో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది చనిపోయారు. సౌదీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం విచారకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 45 మంది మృతి బాధాకరంఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మృతిచెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్రా యాత్రలో దుర్ఘటన దురదృష్టకరం రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రారి్థస్తున్నట్లు పేర్కొన్నారు.ఏపీ వక్ఫ్బోర్డు చైర్మన్ సంతాపంసౌదీ అరేబియా ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అదేవిధంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. -
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన బస్సు.. స్పాట్ లోనే 42 మంది..
-
Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు
-
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ రాజధాని బస్సు.. ఇద్దరు మృతి
సాక్షి, జనగామ జిల్లా: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని ప్రభుతాసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులను ఓం ప్రకాష్, నవదీప్ సింగ్గా గుర్తించారు. వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ట్రావెల్స్ బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం.. ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం తప్పింది. కీసర టోల్గేట్ వద్ద ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. టోల్గేట్ సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.


