Road Accident
-
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు మూడు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.ఈద్ పండుగ కోసం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా చాప్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చ వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.మరో ఘటనలో వడోదర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున గుజరాత్లోని వడోదర నగరంలో 20 ఏళ్ల లా విద్యార్థి నడుపుతున్న కారు వారి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
తాడేపల్లిగూడెం(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొట్టింది. ఏలూరు నుంచి తణుకు వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.భోగెళ్ల వెంకల సత్య సురేన్, భార్య నవ్య అక్కడక్కడే మృతి చెందగా, వారి కుమార్తె వాసవి(4) తన/కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృత్యువాత పడింది. మరొకవైపు అదే కారులో ప్రయాణిస్తున్న ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆమెను రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ..
వడోదర: గుజరాత్లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీబాగ్లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్ రౌండ్’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కార్గిల్లో భూకంపం -
HYD: బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్-1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో ఉన్న కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సదరు కారు.. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రెండు వాహనాలను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేలోని బమన్సుత గ్రామ సమీపంలోని రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ రాంగ్ రూట్(Wrong route) నుండి వస్తూ, ఎదురుగా వస్తున్న ఒక కారు, జీపును బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రేన్ సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్కు ముప్పుగా మారిందా? -
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్ లెక్కలు
సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.22 లక్షల మంది మృత్యువాత పడగా 2.58 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) అధికారులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై క్రమశిక్షణ పేరట ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల దుస్ధితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పంతా తమమీదే మోపడం అన్యాయ మని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం ముందు ఆకస్మాత్తుగా గుంతలు ప్రత్యక్షం కావడం, రిపేరు వచ్చి రోడ్డుపై లేదా పక్కన నిలిపి ఉంచిన వాహనాల వల్ల అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. పోలీసులదాకా వచ్చేవి కొన్నే... కాగా పెద్ద ప్రమాదాలకు సంబంధించిన కేసులే పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. వాటి వల్లే ప్రమాదాల సంఖ్య తెలుసుకునే అవకాశముంటుంది. చిన్నచిన్న ప్రమాదాల విషయంలో బాధితుడు, కారకుల మద్య సయోధ్య కుదిరి కేసు పోలీసులదాకా వెళ్లని సందర్భాలు లక్షల్లో ఉంటాయి. ఇలా 2016 నుంచి 2024 డిసెంబరు వరకు గడచిన తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,22,270 మంది మృతి చెందగా 2,58,723 మంది గాయపడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. ముంబైదే మొదటిస్థానం... రోడ్డు ప్రమాదాల్లో దేశ ఆరి్ధక రాజధాని ముంబై నగరం మొదటి స్ధానంలో ఉండగా మృతుల సంఖ్యకు సంబంధించి పుణే జిల్లా అగ్రస్ధానంలో ఉంది. ముంబైలో 23,519 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 3,802 మృత్యువాత పడ్డారు. ఇక అతి తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జిల్లాగా సోలాపూర్ నిలిచింది. ఈ జిల్లాలో 1,925 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 694 మంది మరణించారు. అలాగే సింధుదుర్గ్ జిల్లాలో 1,982 ప్రమాదాలు జరగ్గా 652 మంది బలయ్యారు. ఎన్ని చర్యలు చేపట్టినా... స్టేట్, నేషనల్ హై వే లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల అనేక విధాలుగా ప్రయతి్నస్తున్నారు. ప్రమాదకర మలుపులవద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఏదైనా పల్లె, గ్రామం మొదట్లో స్పీడ్బ్రేకర్ల ఏర్పాటుతోపాటు . జాతీయ, రాష్ట్ర రహదారులతోపై వేగ నియంత్రణ కోసం అక్కడక్కడా స్పీడ్గన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినాసరే రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. -
నా బర్త్డే కదా.. అమ్మానాన్నలేరీ?
రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించే అమ్మ ఎక్కడికెళ్లిందోనని ఆ చిన్నారి ఇంట్లోకి, బయటికి తిరుగుతోంది.. బయటకు వెళ్లిన నాన్న ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపిస్తాడని ఆశగా అందరినీ అడుగుతోంది.. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారు కానీ, ఇప్పుడు అమ్మానాన్న ఇద్దరూ కనిపించకపోయే సరికి ఆ పసికందు బేలచూపులు చూస్తోంది.. అయ్యే పాపం అన్నా అర్థం కాదు.. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేదు.. నా పుట్టిన రోజు అన్నారు కానీ, ఇంట్లో సందడే లేదన్నట్లుగా అందరి ముఖాల్లోకి చూస్తోంది.. అవ్వాతాతలు కొత్త డ్రెస్సు చూపిస్తూ నెత్తీనోరు కొట్టుకుంటుంటే వాళ్ల చుట్టూనే తిరుగుతూ వచీ్చరాని మాటలు చెబుతోంది.. వచ్చిపోయే వారు ఎత్తుకుని లాలిస్తున్నారే కానీ, అమ్మానాన్నలను తీసుకురాలేకపోతున్నారు.. .. ఆదోని మండలం కుప్పగల్కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సుస్మిత పుట్టిన రోజు నేడు. దంపతులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమను బస్సు కబళించింది.కంటికి రెప్పలా చూసుకునే అమ్మానాన్నలు.. జీవితాంతం రక్షణగా నిలిచే సోదరుడు.. నాన్నకు ఆసుపత్రిలో చూపించుకునేందుకని వెళ్లారు.. త్వరగా వస్తామని చెప్పారు, ఎంతకీ ఇంటికి రాలేదు.. ఒక్క ఫోన్ లేదు, ఎక్కడున్నారో తెలియదు.. ముగ్గురు ఆడ పిల్లలు, ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఎప్పుడు వస్తారో, తమ కోసం ఏమి తెస్తారోనని! ఇంతలో వచ్చిన ఓ ఫోన్ కాల్తో గుండె ఆగినంత పనైంది.. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇక తిరిగిరారని, ఆటపట్టించే అన్న, తోడూనీడగా నిలిచే తోబుట్టువు మరి లేడని.. తెలిసిన క్షణాన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది.. ముగ్గురినీ పోగొట్టుకున్న ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు సంతానం.. ఒకరికి పెళ్లి కాగా, మరో ముగ్గురు దిక్కులేని వాళ్లయ్యారు... కర్ణాటక రాష్ట్రం మాన్విక చెందిన హేమాద్రి, నాగరత్నమ్మ దంపతులు తమ కుమారుడు దేవ రాజ్తో కలిసి ఆసుపత్రికి వెళ్తూ మృత్యుఒడి చేరారు.ఐదుగురిని బలిగొన్న బస్సు – ఆదోని టౌన్ కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. -
విధి రాత: ప్రసవం కోసం వెళ్తూ..!
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. డేఅండ్నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపారు. 20 ఏళ్లకే .. చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది. -
అన్నం తినిపించే విషయమై గొడవ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్్టవేర్ ఉద్యోగి దుర్మరణం మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్్టవేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. -
దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం..‘మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బహ్రీ వద్ద ట్రక్కు, ఎస్యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరగుతోంది. అయితే, వీరంతా మైహార్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.VIDEO | Madhya Pradesh: Several people died, while some others got injured after a car collided with a truck in Sidhi last night.DSP Gayatri Tiwari says, “Last night at around 2 am, we received the information about the accident between a bulker and a car near Utni Petrol Pump.… pic.twitter.com/LVxoYGOrRe— Press Trust of India (@PTI_News) March 10, 2025 -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
ORR Accident: రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనువడు మృతి
హైదరాబాద్: ఓఆర్ఆర్పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(ORR Accident) మూసారంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజిత్రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి(19)(Kanishk Reddy) దుర్మరణం పాలయ్యాడు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్లోని స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్కు హాజరై బెంజ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళుతుండగా ఔటర్ రింగ్రోడ్డుపై గొల్లపల్లె కలాన్ వద్ద కారు ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్లోని స్వగృహానికి తీసుకొచ్చారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు.. ఆలస్యమైంది ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేయగా.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖుల పరామర్శ... కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్రెడ్డి, సునరితారెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ ఫతుల్లాగూడ మహాప్రస్థానం హిందూ శ్మశాన వాటికలో కనిష్క్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. -
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. -
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద(road accident) రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చెన్నైలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆనందం.. అంతలోనే ఆవిరి పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్ రెడ్డి (21) చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్(B.Tech students) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు. మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధని‹Ùరెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రం చెన్నై శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్హౌస్పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధని‹Ùరెడ్డి, రితి్వక్ ఎన్క్లేవ్కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చెన్నై వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులరి్పంచి బాధిత కుటుంబాలను ఓదార్చారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కలసివెళ్లి.. కానరాని లోకాలకు
మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంజినీరింగ్ కోర్సు అయిపోయిన తరువాత మంచి ఉద్యోగాలు చేద్దామని, లేదా మరింత ఉన్నత చదువులు చదవాలని భావించారు. అయితే వీకెండ్ టూర్ ఆలోచన– ఓ టిప్పర్ లారీ వారి స్వప్నాలను భగ్నం చేశాయి. ఐదుగురి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని కలిగించాయి. సరదాగా సాగుతున్న విహారయాత్రలో టిప్పర్ లారీ డ్రైవర్ యమదూత మాదిరిగా విరుచుకుపడ్డాడు. మైసూరు నుంచి బయల్దేరి.. చామరాజనగర జిల్లా కొళ్లేగాళ వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కొళ్లేగాల రూరల్లోని చిక్కందువాడి గ్రామం వద్ద రహదారిలో ఈ విషాదం సంభవించింది. వివరాలు.. మైసూరు సిటీలో నివసించే శ్రీలక్ష్మీ, లిఖిత, మండ్యకు చెందిన సుహాన్, నితిన్, శ్రేయస్లు మైసూరు ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వీరి వయస్సు 20– 23 ఏళ్లలోపు ఉంటుంది. అందరూ మంచి స్నేహితులు. మలె మహదేశ్వర బెట్టలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలను చూసుకుని, ఆ తరువాత హొగెనేకల్ జలపాతానికి వెళ్లాలని బయల్దేరారు. ఓ గంటన్నర పాటు ప్రయాణం సాగింది. మృత్యుశకటమైన టిప్పర్ ఇంతలో ఓ టిప్పర్ లారీ వేగంగా వస్తూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది, ఈ క్రమంలో కారును ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లి రెండు వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. కారు వెళ్లి ఓ నీటి గుంతలోకి పల్టీలు కొట్టింది. కారు చాలా భాగం నుజ్జయింది. ఈ తాకిడికిలో అందులో ఐదుగురు యువతీ యువకులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొళ్లేగాల రూరల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఇరుకు, మలుపుల రోడ్డు : ఎస్పీజిల్లా ఎస్పీ బీటీ కవిత ఘటనాస్థలిలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో మహదేశ్వర బెట్ట నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఓవర్ టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల కారును ఢీకొట్టింది, ఆపై 26, 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రెండు వాహనాలూ రోడ్డుపక్కన బోల్తా పడ్డాయి అని తెలిపారు.పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్కడ రోడ్డు ఇరుకుగా, అనేక మలుపులతో ఉండగా, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని తెలిపారు. కొళ్లేగాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘోరం గురించి తెలియగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చారు. వారి రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది. -
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి
బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృతిచెందారు. అలాగే, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై బొలివియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బొలివియాలోని ఉయుని సమీపంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే, లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్కు బస్సులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక బస్సు డ్రైవర్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.Dos autobuses chocaron en Bolivia y dejaron al menos 37 muertos y decenas de heridos. El incidente ocurrió en horas de la madrugada de hoy, en una ruta en la región andina de Uyuni. pic.twitter.com/DkMSqx7562— Chikistrakiz (@chikistrakiz) March 1, 2025 -
వచ్చే నెలలో వివాహం.. అంతలోనే విషాదం
కీసర: బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్పల్లి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి–భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్గూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్గా పని చేస్తున్నాడు.లాలాపేట శాంతినగర్లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్పల్లి– చీర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. చంద్రశేఖర్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లికూతురు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. అడవితక్కెళ్లపాడులోని రాజీవ్గృహకల్పకు చెందిన విజమూరి నాగమణి(45), కుమార్తె శరణ్య(14) రాజీవ్గాంధీ కాలనీలోని తమ బంధువులకు పూలను ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ వద్ద లాడ్జి సెంటర్ నుంచి అమరావతి వెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. నాగమణి భర్త పుల్లయ్య 2014లో అనారోగ్యంతో మృతి చెందటంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ఒక కుమారుడు గోపిచంద్, కుమార్తె శరణ్య(14) ఉన్నారు. గోపిచంద్ బీటెక్ పూర్తి చేసి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శరణ్య స్థానికంగా 9వ తరగతి చదువుతోంది. ఘఽటనా స్థలాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుని బంధువులకు అప్పగించారు. ఘటనపై మృతురాలి కొడుకు గోపిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్చెరు, నారాయణఖేడ్లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు. సడెన్గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం. -
ట్రాక్టర్ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
'నా కుమారుడిది ముమ్మాటికీ హత్యే ...
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఇసుక లారీ బీభత్సం
అల్లిపురం: మంగళవారం ఉదయం 6.50 గంటలు.. ప్రభాత వేళ సముద్రపు అలలు తీరాన్ని తాకుతుండగా, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారి పెద్ద శబ్దం. ఇసుక లారీ సృష్టించిన బీభత్సం. నోవాటెల్ హోటల్ రోడ్డులో పైనుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై బీచ్రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో బీచ్రోడ్డులో వాహనాల నిషేధం అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరో పది నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటే, ఊహించని ఘోరం జరిగిపోయేది. ఈ ఘటనలో ఒక పాదచారికి గాయాలు కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివీ..శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ హార్బర్కు 40 టన్నుల ఇసుకతో ఓ లారీ బీచ్రోడ్డు మీదుగా వస్తోంది. బీచ్రోడ్డులో నగర ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వేకువజాము 4.30 నుంచి ఉదయం 7 గంటల వరకు, వీఎంఆర్డీఏ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ వాహనాల నిషేధం ఉంటుంది. వీఎంఆర్డీఏ పార్కు వద్ద రోడ్డు మూసివేసి ఉండటంతో లారీ డ్రైవర్ ఏయూ మీదుగా పందిమెట్ట పైనుంచి నోవాటెల్ డౌన్కు దిగాడు. ఆ సమయంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి, బీచ్ వైపు దూసుకుపోయింది. ప్రమాదాల నివారణకు రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద ప్లాస్టిక్ ఇసుక డబ్బాలను ఢీకొట్టింది. ఫుట్పాత్ మీదుగా గోడను ఢీకొట్టి, అవతలి వైపు సర్వీసు రోడ్లోకి ఎగిరిపడి.. పార్కులోకి చొచ్చుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెల్లివీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్.కె.బీచ్కు వాకింగ్కు వెళ్తుండగా, ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పార్కు గోడ దెబ్బతింది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించారు. రవికుమార్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గతంలో ఇక్కడే రెండు ప్రమాదాలుగతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాగా.. బస్సులో పిల్లలు లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ప్రమాదంలో ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రక్షణ గోడను ఢీకొట్టి అవతలి వైపు గల సర్వీ సు రోడ్డులోకి వెళ్లింది. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి తన కుటుంబంతో సహా అక్కడ సేదతీరుతున్నారు. ఈ ప్రమాదంలో అతని తండ్రి చనిపోగా, అధికారికి కాళ్లు విరిగిపోయాయి. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు మినుము కోత కోసేందుకు నీరుకొండ ప్రాంతానికి ఆటోలో బయలుదేరారు.మార్గమధ్యంలోని నారాకోడూరు గ్రామ శివారులో దట్టమైన పొగుమంచు కారణంగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కూలీల ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తోట సీతారావమ్మ (41), అల్లం శెట్టి అరుణ (39), కుర్రా నాంచారమ్మ (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీంకు, మరో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. -
Mahakumbh: కుంభమేళాకు వెళ్తుంటే అపశృతి
ఉండవెల్లి: కర్ణాటక నుంచి ప్రయాగ్రాజ్ (కుంభమేళా)కు వెళ్తున్న ఓ కుటుంబం తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ యువతి దుర్మరణం చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. కుక్క అడ్డు రావడంతో స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు దగ్గర రామనగరకు చెందిన నవ్యశ్రీ (18), ప్రతిభ, రేణుక, శోభ, శివప్రసాద్, రాజన్న, మంజునాథ్, డ్రైవర్ బస్వరాజు కారులో శుక్రవారం కుంభమేళాకు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారుకు చేరుకున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నవ్యశ్రీ, ప్రతిభ, బస్వరాజు, రేణుకకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా.. నవ్యశ్రీ మృతిచెందింది. శోభ, శివప్రసాద్, రాజన్నకు స్వల్పగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో స్టార్ నటుడు మృతి అంటూ ప్రచారం
చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్గా రాణిస్తున్న యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్మీడియా ద్వారా ఒక పోస్ట్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q— Yogi Babu (@iYogiBabu) February 16, 2025 -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్గఢ్కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025 -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది. కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్తో కలిసి మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్ పిల్లర్ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అయ్యో.. మౌనిక!
హైదరాబాద్, సాక్షి: నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఝామ్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలకేం చెప్పాలి.. దేవుడా..
ఉప్పల్/మలక్పేట: మహాకుంభ మేళాకు వెళ్లి తమవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న ఆ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనందంతో బయలుదేరి విగత జీవులుగా మారి తిరిగి రావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధితులు భోరుమంటూ విలపిస్తున్నారు. తాము కుశలమేనంటూ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను పిండేసింది. మహా కుంభ మేళా నుంచి మినీ బస్సులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు నగర వాసులు మృత్యువాత పడ్డారు. నాచారం ప్రాంతానికి చెందిన ఆరుగురు, మూసారంబాగ్కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన వారంతా స్నేహితులే కావడం గమనార్హం. కాగా.. మృత దేహాలు బుధవారం మధ్యాహ్నం వరకు నగరానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.బై బై అంటూ బయలుదేరి.. మూసారంబాగ్కు చెందిన గోల్కొండ ఆనంద్కుమార్ (47) ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యా పిల్లలకు బై బై అని చెప్పి కుంభ మేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆనంద్ కుమార్ సలీంనగర్లో గోల్డ్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శనివారం ఉదయం నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు బయలుదేరారు. త్రివేణి సంగమంలో స్నానం చేశామని, ట్రాఫిక్ జామ్ ఉందని, వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని, ట్రాఫిక్ క్లియర్ కావడానికి 24 గంటలు పడుతుందని, ఎవరూ రావొద్దని సోమవారం రాత్రి ఫోన్ చెసి చెప్పాడని బంధువులు తెలిపారు. పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే.. భోరంపేట సంతోష్ భార్య గత ఏడాది క్రితం కన్నుమూశారు. బుధవారం ఆయన పెళ్లి రోజు. వచ్చే నెల్లో భార్య సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు హాస్టల్లో ఉంటున్నారు. తన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే భార్య వద్దకే వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు. బతుకు బండికి డ్రైవర్.. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కల్కూరి రాజు కుటుంబ పరిస్థితి దయనీయం. ఆయన డ్రైవింగ్ చేస్తేనే వారి ఇల్లు గడిచేది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని, అంతా రోడ్డునపడ్డామంటూ కుటుంబం విలపిస్తోంది. రాజు మరణ వార్త తెలియడంతోనే శ్రీరామ్ కాలనీ బస్తీ శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త లేడన్న వార్త తెలిసి రాజు భార్య మహేశ్వరి గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాలనీ సమస్యలపైనే దృష్టి మా నాన్న అందరికి రోల్ మోడల్గా ఉండేవారు. అందరికీ సాయపడే వ్యక్తి ఆయన. అందరితో కలిసి మెలిసి ఉండే వారు. నిత్యం స్థానికులతోనే గడిపే వారు. కాలనీయే ఆయనకు సర్వస్వం. సోమవారం గంగ స్నానం అయిందంటూ మాట్లాడారు. తిరిగి వచ్చేస్తున్నా అని కూడా చెప్పాడు. కాని నాన్న ఇంక రాలేరు. – మల్లారెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డిపిల్లలకేం చెప్పాలి.. దేవుడా.. ‘నా కొడుకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వారికి ఇంకా తెలియదు. గత ఏడాది వారి తల్లి మృతి చెందింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా’ అంటూ సంతోష్ తల్లి భోరున విలపిస్తోంది. – విలపిస్తున్న సంతోష్ తల్లి -
‘మహా’ విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్చారి జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమ్మా... నాన్నకు ఏమైంది? ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు. వస్తానని చెప్పాడు.. కానీ.. నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. - రాజు భార్య మహేశ్వరి మృతులు: 1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు. 2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. 3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి. 4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్. 5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. 6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి. 7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్సుఖ్నగర్లోని వివేకానందనగర్ వాసి -
జబల్పూర్ ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
తాడేపల్లి, సాక్షి: మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా సిహోరాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు భక్తులు మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాచారం నుంచి కొందరు భక్తులు మినీ బస్సుల్లో ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. సిహోరా వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
మధ్యప్రదేశ్లో తెలుగువారిని బలిగొన్న ఘోర ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారిని బలిగొంది. మంగళవారం ఉదయం హైవేపై ఓ మినీ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స అందుతోంది. మృతులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్లకు చెందిన స్థానికులు మూడు మినీ బస్సుల్లో మహా కుంభమేళా యాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అందులోని ఓ బస్సును.. రాంగ్ రూట్లో వచ్చిన సిమెంట్లోడ్ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. జబల్పూర్(Jabalpur) సిహోరా దగ్గర జాతీయ రహదారి 30పై మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 అని తెలిపారు. ఘటనపై నాచారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే.. మృతుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మృతుల వివరాలుబాలకృష్ణ శ్రీరామ్, సంతోష్ ఖాన్సారీ, శశికాంత్ ఖాన్సారీ,ఆనంద్ ఖాన్సారీటీవీ ప్రసాద్మల్లా రెడ్డిరవి వైశ్య, నవీన్ గాయపడ్డవాళ్లువీ సంతోష్ మృతుల్లో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసే శశికాంత్ కుటుంబ సభ్యులే ఉన్నట్లు సమాచారం. ఏడుగురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.హైదరాబాద్వాసులేప్రమాదంలో మరణించినవాళ్లంతా ఏపీ వాసులంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వాళ్లుగా తర్వాత అధికారులు నిర్ధారించుకున్నారు. ప్రమాద సమయంలో అందులో 9 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిమధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతిజబల్పూర్ ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ల తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్లో కేంద్రమంత్రి పరామర్శించారు. Jabalpur, MP: A bus from Andhra Pradesh returning from Prayagraj collided with a truck near Sihora on NH-30, killing seven people. The accident occurred around 9:15 AM near Mohla-Bargi. Officials, including the Collector and SP, have reached the site pic.twitter.com/j6uQD592Wl— IANS (@ians_india) February 11, 2025 -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : పల్నాడు జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,పల్నాడు : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఒక్కొగానొక్క కుమారుడు..ఆశల దీపం ఆరిపోయింది
చేబ్రోలు/వెల్దుర్తి : ఒక్కొగానొక్క కుమారుడు. బాగా చదివి ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. వారి కలలను మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని గుంటూరు – తెనాలి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కర్నూలుకు చెందిన లక్ష్మీరెడ్డి, ఊర్మిల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతూరు వెల్దుర్తి కాగా ఉపాధి నిమిత్తం కర్నూలుకు చేరుకుని అక్కడే స్థిర పడ్డారు. వీరి కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి(25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి యూనివర్సిటీ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో మణికంఠేశ్వరరెడ్డి దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మీరెడ్డి కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఏరియాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి బీఎస్సీ అగ్రికల్చర్ డెహ్రాడూన్లో పూర్తి చేశాడు. ఎంబీఏ కోసం చేబ్రోలు వచ్చాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, పలువురు నేతలు, కుటుంబసభ్యులు చేబ్రోలు చేరుకున్నారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
హైదరాబాద్- బెంగుళూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, వనపర్తి జిల్లా: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన లారీని కారు ఢీ కొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పదేళ్ల బాలుడు, మరో మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కారులో వెళ్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెద్ద అంబర్పేట్లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్పేట్లో విషాదం జరిగింది. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం రికార్డ్స్ బ్యూరో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ.. ఘటనా స్థలంలోనే మృతిచెందారు.కారు, బైక్ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాంగ్ రూట్లో వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో బైక్పై వెళుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మసీద్బండలో పీజీ హాస్టల్లో ఉంటున్న ప్రతిభా చంద్(25) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను బైక్పై గచ్చిబౌలి నుంచి మసీద్బండకు వెళుతున్నాడు. గచ్చిబౌలి స్టేడియం ఎదుట పాలప్యాకెట్ల లోడ్తో రాంగ్ రూట్లో వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఆటో అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిభా చంద్ను కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువ వైద్యుడి ప్రాణం తీసిన అతివేగం
మణికొండ: అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళా డాక్టర్ గాయాల పాలయ్యారు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రిలో వి.జస్వంత్ (25), భూమిక హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరు కారులో రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లికి ఓ వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున ఖానాపూర్ వద్ద రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో డివైడర్పై ఉన్న హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న జస్వంత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న భూమికకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్లోని ముజఫర్పూర్లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్కేఎంసీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
డబ్లిన్:ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. -
వాహనం ఢీకొని చిరుత మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రహదారిపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలో మృత్యువాత పడింది. మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామాయంపేట రేంజీ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ముందు ఒక వాహనం ఢీకొన్న అనంతరం చిరుత పరుగెత్తేందుకు ప్రయతి్నంచిన క్రమంలో మరో వాహనం ఢీకొని ఉండవచ్చని, నడుముకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతిమెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో NH-44పై రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంనడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి pic.twitter.com/KpHzjenKCw— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025 -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
పెడన: కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు దళితవాడకు చెందిన పాపవర్తి శాంతరాజు (26)తోపాటు బాపట్ల విజయచందర్ (40), పీతల అజయ్ (24) పెయింటింగ్ పనికోసం గురువారం ఉదయం మచిలీపట్నం వెళ్లారు.పని ముగించుకుని సాయంత్రం ముగ్గురూ బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. పెడన సమీపంలోని పెడన– బంటుమిల్లి బైపాస్ రోడ్డులో వస్తుండగా మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు రాంగ్ రూట్లో వచ్చి, శాంతరాజు బైక్ను బలంగా ఢీకొట్టింది. దాదాపు వంద మీటర్ల దూరం బైక్ను ఈడ్చుకుపోయింది. విజయచందర్, శాంతరాజు, అజయ్ రోడ్డుపై పడిపోయారు. విజయచందర్, శాంతరాజు అక్కడిక్కడే చనిపోగా అజయ్ను మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పుప్పాల పవన్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆ కుటుంబాలకు వారే ఆధారంమృతులు పెయింటింగ్ పనులు చేసి రోజువారీ కూలీతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరు ముగ్గురి మృతితో ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. బాపట్ల విజయచందర్కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వీరు పది, ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. ఆ కుటుంబానికి దిక్కు విజయచందరే. శాంతరాజుకు తండ్రి లేడు. అన్న, శాంతరాజు సంపాదిస్తూ ఆఖరి తమ్ముడ్ని చదివించుకుంటున్నారు. పీతల అజయ్కి కూడా తండ్రి లేడు. సోదరుడితో కలిసి పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. -
రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 2024లో సగటున రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ఘటనల్లో రోజూ సగటున 18 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉంది. రాష్ట్ర రవాణాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. 2024లో రాష్ట్రంలో సుమారు 26,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 7,700 మంది మరణించగా, కనీసం 20 వేల మంది గాయపడినట్లు రవాణాశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. రహదారి భద్రతపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపరిమిత వేగంతో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు ఇంజినీరింగ్లో లోపాలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణాశాఖ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలల్లో రోడ్డు భద్రతపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాంగా శుక్రవారం (జనవరి 31) నెక్లెస్రోడ్డులో రోడ్డు భద్రతా వాకథాన్ నిర్వహించనున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మానవ తప్పిదాలే కారణం.. గత మూడేళ్లలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదాల వల్లనే జరిగినట్లు రవాణాశాఖ తెలిపింది. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ పలు చర్యలు చేపట్టింది. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ‘4ఈస్’ (ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్)పై దృష్టి సారించింది. మరోవైపు రహదారులపై బ్లాక్స్పాట్స్ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్క్.. నెల రోజుల పాటు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థుల్లో అవగాహనకు ఇది దోహదం చేస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఈ పార్కును ప్రారంభించారు. అలాగే హెల్మెట్ల పంపిణీ, వైద్య, ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు క్విజ్ పోటీలు వంటివి నిర్వహించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడు మృతి
ఖైరతాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్కు చెందిన మహ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి చేసే యోచనలో ఉండగానే.. మహ్మద్ వాజిద్కు ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం. వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్ వాజిద్ గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్ మక్తాలోని వాజిద్ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. -
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025ప్రమాదంపై జిజాన్లో భారత రాయభార కార్యాలయం మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపింది. ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
ఫిల్మ్నగర్ పాపం.. ట్రాఫిక్ పోలీసులదే..!
కొందరు అవినీతి ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసీ.. ఓ కుటుంబాన్ని పెను విషాదంలో నింపాయి. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసి కనీసం కన్నవారికి ‘ముఖం’ చూసే అదృష్టం కూడా లేకుండా చేశాయి. మంగళవారం (Tuesday) ఉదయం షేక్పేట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పదేళ్ల చిన్నారి అథర్వి ఉసురుతీసింది. ఈ పాపం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదేనని చెప్పక తప్పదు. ఉత్తర్వులు ఉత్తవేనా? హైదరాబాద్ (Hyderanad) నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ప్రవేశించే అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 10 టన్నుల కంటే మించొద్దు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. కాసులు కురిపించడమే కారణమా? షేక్పేటలో చిన్నారిని చిదిమేసిన లారీ పంచదార లోడ్తో ప్రయాణిస్తోంది. ఇది కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు మాత్రమే నగరంలో తిరగాలి. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న 8.10 గంటలకు అది నగరంలోనే ఉంది. ఈ తరహా లారీలే కాదు... నగరంలో మరికొన్ని వాహనాలు తిరుగుతూ కొందరు ట్రాఫిక్ పోలీసులకు కాసులు పండిస్తున్నాయి. అక్కడ నుంచి మట్టి తరలించే, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను తీసుకువచ్చే వాటిని ‘వదిలేయడం’ కోసం యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రయితే చాలు రాకాసులే.. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం చాలా కీలకమైంది. నగర శివార్లలో ఉన్న, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఉన్న అనేక కార్యాలయాలు, పాఠశాలలకు చెందిన బస్సులు, వాహనాలతో ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనూ ఓ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చిందంటే దానికి కారణం అయితే మామూళ్ల మత్తయినా అయి ఉండాలి.. లేదంటే నిబంధనలు అతిక్రమించిందంటూ ‘ఉక్కుపాదం’ మోపిన ట్రాఫిక్ పోలీసులు ఓ చలానా రాసి వదిలేసైనా ఉండాలనే వాదన వినిపిస్తోంది. చదవండి: ‘మమ్మీ బాయ్..’ఈ రెంటిలో ఏది జరిగినా ఆ పాపం మాత్రం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదే. నగరంలోకి పగలంతా లారీల ప్రవేశం లేకపోవడంతో రాత్రయిందంటే చాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తాయి. వాయు వేగంతో దూసుకుపోయే ఇవి రాకాసులుగా మారుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పాయింట్స్లో ఉండకపోవడంతో విజృంభిస్తున్నాయి. -
‘మమ్మీ బాయ్..’
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్లో నివసించే గడ్డం హేమ సుందర్రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఐదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్రెడ్డి తన కుమార్తెను స్కూల్లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్తో వచి్చన లారీ హేమ సుందర్రెడ్డి నడుపుతున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. హేమ సుందర్రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. -
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, వరంగల్: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వివరాల ప్రకారం.. ఖిల్లా వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. అయితే, లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. -
బస్సు ప్రయాణికురాలి తల కట్
మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ కొందరు ఏదో కారణంతో తల బయటపెట్టి ప్రమాదాలకు గురవుతుంటారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి బస్సు ప్రయాణికురాలు దుర్మరణం చెందింది. శనివారం జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గుండ్లుపేటె తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) మృతురాలు. ఆమె మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సింధువళ్లి గ్రామం వద్ద మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయట పెట్టింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ, బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయాయి. ఆమె సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పీఎస్ఐ సిద్దరాజు, సిబ్బంది మహేంద్ర స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. -
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్పాత్పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్ పబ్లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది. బుధవారం రాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
సింధనూరు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ఫ్రాంతి
గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. In a tragic incident near Sindhanur taluk in #Raichur district, four people lost their lives when a vehicle carrying devotees overturned.The victims include three students from the Mantralayam Sanskrit School—Ayavandan (18), Sujendra (22), and Abhilash (20)—along with the… pic.twitter.com/ze2dALIfk1— South First (@TheSouthfirst) January 22, 2025మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..!
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దైవభక్తి ఎక్కవతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్రఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.డీఎస్పీ పరిశీలనరేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్ఐ అరుణ్కుమార్రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. -
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కూతురి వివాహం
యశవంతపుర: తండ్రి బైక్ ప్రమాదంలో చనిపోగా, పెళ్లిపీటలపై ఉన్న కూతురికి ఆ వార్త చెప్పకుండా పెళ్లిని పూర్తి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరెలో సోమవారం జరిగింది. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని కోరుకుంటాడు. అలాగే తండ్రి చేతుల మీదుగా వివాహం జరగాలని కూతురు ఆకాంక్షిస్తుంది. కానీ విధి నాటకంలో అంతా తారుమారైంది.పెళ్లి పత్రికలు పంచి వస్తుండగాతరీకెరెకి చెందిన చంద్రు కూతురు దీక్షిత అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం సాయంత్రం చంద్రు మరో ఇద్దరితో కలిసి పెళ్లిపత్రికలను పంచడానికి బైక్లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనటంతో చంద్రు, జతలో వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసి బంధువులు విషాదంలో మునిగిపోయినా తల్లీ, కూతురికి చెప్పలేదు. ఆ వార్త తెలిసినా, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పెళ్లి నిలిచిపోయి మరింత విషాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే చివరి నిమిషం వరకు చంద్రు పెళ్లి పనుల్లో ఉన్నాడని చెబుతూ సోమవారం మూడుముళ్ల వేడుకను పూర్తి చేయించారు. తండ్రి స్థానంలో మరో వ్యక్తిని ఉంచి కన్యాదానం చేశారు. అక్షింతలు, అతిథుల భోజనాల తరువాత చంద్రు భార్య, కూతురికి ఈ చేదు వార్త చెప్పగానే వారు బోరుమంటూ రోదించారు. అప్పటివరకు ఉన్న పెళ్లి కళ దూరమైంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులే అంత్యక్రియల పనులు పూర్తిచేశారు. -
త్వరలో పెళ్లి.. అంతలోనే మృత్యుకేళి
దొడ్డబళ్లాపురం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. మళవళ్లి తాలూకా హలగూరు గ్రామం సమీపంలోని బసాపుర గేట్ వద్ద చోటుచేసుకుంది. బళెహొన్నిగ గ్రామానికి చెందిన శరణ్య (25) గత ఏడాది నుంచి కనకపుర తాలూకా సాతనూరు పంచాయతీలో నరేగా ఇంజినీర్గా పని చేస్తోంది. ఫిబ్రవరి 16న ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. శనివారం సాయంత్రం స్కూటర్లో బళెహొన్నిగ నుంచి హలగూరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శరణ్య అక్కడికక్కడే చనిపోయింది. హలగూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తెలుగురాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు
-
చిత్తూరు వద్ద ఘోర ప్రమాదం
-
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉంటున్నారు. రవి, సంతోష్లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మహారాష్ట్రలోని షిరిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నలుగురు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో ఈ విషాద ఘటన(Accident) చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడకక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉంది. ఈ ఘటనలో మృతిచెందిన వారంత యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప(Konda gadapa) వాస్తవ్యులుగా గుర్తించారు.వీరంతా రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతలంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమలత(59, వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)లు మృతిచెందారు. -
కర్ణాటక మంత్రి లక్ష్మికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం బెళగావి వద్ద ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టంకొద్దీ గాయాలతోనే ఆమె బయటపడ్డారు.మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్(Lakshmi Hebbalkar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్(Chennaraj) తలకు గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ వెల్లడించారు. ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ చెబుతున్నారు. లక్ష్మి హెబ్బాళ్కర్ 2023, 2018 ఎన్నికల్లో బెళగావి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
గమ్యానికి చేరువై.. అంతలోనే దూరమై..
గోదావరిఖని(రామగుండం): మరో నిమిషంలో ఇంటికి చేరుకునేవారు.. ఇంకో రెండుగంటలు గడిస్తే భోగి పండుగతో ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేవి. ఈలోగా మృత్యువు ముంచుకొచి్చంది. కుటుంబానికి పెద్దదిక్కు, అతడి కొడుకు మృతిచెందడం, ఇల్లాలు ఆసుపత్రి పాలు కావడంతో ఖనిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు, అతడి కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాలు.. జీడీకే–11గనిలో పనిచేస్తున్న గిన్నారపు సతీశ్(32) తనకు వరుసకు సోదరుడు అయిన వ్యక్తికి హైదరాబాద్లోని ఆస్పత్రిలో కొడుకు జన్మించాడు. వారిని చూసేందుకు ఆదివారం సతీశ్ తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్(11నెలలు), బావ ఎ.సతీశ్, చెల్లె అనూషతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు గోదావరిఖనికి పయనమయ్యారు. ఎన్టీపీసీ బీ పవర్హౌజ్ వరకు తన బావ కారు డ్రైవ్ చేయగా అక్కడ కొద్ది సేపు మూత్ర విసర్జన కోసం ఆగారు. తర్వాత సతీశ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో సోమవారం వేకువజామున 3గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డు రావడంతో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనగా, సతీశ్, అతడి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య, బావ, చెల్లె గాయాలపాలయ్యారు. ఒక్క నిమిషం గడిస్తే..ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సతీశ్ ఇల్లు ఐదువందల మీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవారు. ఈలోగా జరిగిన ప్రమాదం సింగరేణి యువ కార్మికుడు, అతడి ముక్కుపచ్చలారని 11నెలల చిన్నారిని కబలించింది. తన ఎదపైన ఆడాల్సిన చిన్నారి బాబును పోస్టుమార్టం అనంతరం తండ్రి మృతదేహంపై పడుకోబెట్టిన దృశ్యం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం మృతదేహాలను తిమ్మాపూర్ మండలం పోరండ్లకు తరలించారు. -
తమ్ముళ్లతో కలిసి, భార్యను కడతేర్చాడు.. విషయం ఏమిటంటే!
మార్కాపురం: మార్కాపురం మండలం కుంట – జమ్మనపల్లి గ్రామాల మధ్య ఈ నెల 9వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కుట్రకోణాన్ని వెలికితీశారు పోలీసులు. హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సీఐ సుబ్బారావుతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని తమ ఎస్సై అంకమరావు, సిబ్బంది దర్యాప్తు చేపట్టి 3 రోజుల్లోనే సంఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మరొకరిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్నపాటి సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం ఈర్నపాటి వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. 2005లో తిప్పనబోయిన వెంకట నారాయణతో తన భార్య సుబ్బలక్ష్మమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకట నారాయణను గొడ్డలితో నరికి చంపడంతో 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి 2019లో జైలునుంచి వెంకటేశ్వర్లు విడుదలయ్యాడు. అయితే, తన భార్య సుబ్బలక్ష్మమ్మ పద్ధతి మార్చుకోలేదని, కుటుంబ పరువు తీస్తోందని, ఆస్తి విషయంలో గొడవపడుతోందని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్న కారణంతో సుబ్బలక్ష్మమ్మను చంపాలని భర్త పెద్ద వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు తమ్ముళ్లైన చిన్న వెంకటేశ్వర్లు, వెంకట రమణ కలిసి నిర్ణయించుకున్నారు. సుబ్బలక్ష్మమ్మ కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో నివాసముంటూ దుస్తుల వ్యాపారం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 9న సుబ్బలక్ష్మమ్మ కొత్తపల్లి గ్రామానికి వెళ్లి దుస్తులమ్ముకుని తన మేనకోడలైన ఏడుమళ్ల రాధ అలియాస్ రాధాంజలి (17)ని తన టూవీలర్పై ఎక్కించుకుని మార్కాపురం బయలుదేరింది. కోమటికుంట జంక్షన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుబ్బలక్ష్మమ్మను తమ టిప్పర్తో ఢీకొట్టించి చంపాలనే ఆలోచనతో ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న రమణయ్య ప్రోద్భలంతో చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ నడుపుకుంటూ వచ్చాడు. పథకం ప్రకారం స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే రాధాంజలి మృతి చెందింది. సుబ్బలక్ష్మమ్మ కూడా లారీ కింద పడి గాయాలతో ఉండటంతో ఆమె చనిపోలేదని భావించి చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ దిగి కర్రతో ఆమైపె హత్యాప్రయత్నం చేయబోయాడు. కానీ, రోడ్డుపై వెళ్తున్న జనాలు గమనించడంతో అక్కడే కర్ర వదిలి పారిపోయాడు. ఈ సంఘటనపై ముందుగా యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేసి కుట్రకోణం బయటకు రావడంతో హత్యకేసుగా మార్చారు. పూర్తిగా దర్యాప్తు చేసి ఆదివారం చిన్న వెంకటేశ్వర్లు, రమణయ్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మరో నిందితుడైన పెద్ద వెంకటేశ్వర్లును త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టి 3 రోజుల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసిన సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావును ఎస్పీ దామోదర్ అభినందించినట్లు తెలిపారు. -
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా 14 మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.VIDEO | Uttarakhand: Five people feared dead as bus meets with an accident in Pauri. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/F9RQzVuvpP— Press Trust of India (@PTI_News) January 12, 2025ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరోవైపు.. మహారాష్ట్రలోని నాసిక్లోని ద్వారకా సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి టెంపో-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనంఓ మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపో వాహనంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శించుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. #WATCH | Maharashtra | Visuals from the Nashik Mumbai Highway flyover where 6 people lost their lives in an accident between a pickup and a mini truck.5 other people are injured out of which 2 are in critical condition. The injured are being treated at the district hospital:… pic.twitter.com/RIYbwNCxFd— ANI (@ANI) January 12, 2025 -
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. పౌరీ గర్వాల్ జిల్లాలో ఓ బస్సు(Bus Accident) అదుపుతప్పి కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో నలుగురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటనలో 15 మంది వరకూ గాయాలయ్యాయి,. బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నవారు కూడా ఆ ప్రాంతానికి తమ సాయం అందిస్తున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
షాద్నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
-
మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది. గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటేకేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం -
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఆస్పత్రికి వెళ్తూ.. అనంత లోకాలకు
పహాడీషరీఫ్: అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీకూతుళ్లు చివరకు అదే ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లికి చెందిన చిత్తారి గోపాల్(36), లక్ష్మమ్మ(34) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.వీరి పెద్ద కూతురు విజయ(14)కు రక్తకణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉదయం 7.30గంటలకు వారిబైక్పై హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 9.45గంటల సమయంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక ఉంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా శంషాబాద్ టోల్ వైపునకు వాహనాన్ని మళ్లించాడు. ఈ క్రమంలో టిప్పర్ బైక్ను ఢీకొట్టడంతో పడిపోయిన లక్ష్మమ్మ, విజయ తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గోపాల్ కాలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. -
నగదు రహిత చికిత్స పథకం తీసుకురావాలి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. -
వివాహమైన రెండు నెలలకే..
అన్నానగర్: వివాహమైన రెండు నెలలకే బైక్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో భర్తతో పాటూ మహిళా పోలీసు దుర్మరణం చెందిన ప్రమాదం సోమవారం చిదంబరంలో కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో ఉన్న జయంకొండాన్కు చెందిన మహిళ ఇలవరసి. ఈమె చిదంబరం సమీపంలో కుమరాట్చి పోలీసు స్టేషన్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త కలైవేందన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ స్థితిలో ఇలవరసి తన భర్తతో కలిసి చిదంబరం సమీపంలోని వీరన్కోవిల్దిట్టు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యక్రమంలో పాల్గొనడం కోసం బైకులో వెళ్లారు. వారు చిత్తాలపట్టి గ్రామం సమీపంలో వెళుతుండగా ఎదురు వైపుగా కొడియంపాళయం గ్రామం నుంచి చిదంబరం వైపుగా వచ్చిన ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా ఇలవరసి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్తో పాటు ఇద్దరిని బస్సు ఈడ్చుకెళ్లింది.దీంతో తీవ్రంగా గాయపడి ఇలవరసి, కలైవేందన్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నామలైనగర్ పోలీసులు బస్సు కింద శిథిలాల్లో చిక్కుకున్న దంపతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా వీరికి గత నవంబర్ నెలలో వివాహం కావడం గమనార్హం. వివాహమైన రెండు నెలలకే నవ దంపతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతం వారిని శోకంలో ముంచేసింది. -
తిరుపతి: భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే, 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
మేడ్చల్లో ఘోర ప్రమాదం.. లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ చెక్పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను తీసుకెళ్తుండగా.. అదుపు తప్పిన లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. -
నల్లగొండ జిల్లా తిప్పర్తి దగ్గర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
జిన్నారం (పటాన్చెరు): అతివేగంగా వస్తున్న ఓ కారు..ఎదురుగా ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నర్సాపూర్–బాలానగర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడిదల పరిధిలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ ఆలయం వద్ద రహదారిపై నర్సాపూర్ నుంచి అతివేగంగా వస్తున్న ఓ కారు.. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. మొదటి ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఐశ్వర్య లక్ష్మి (20), పాపగారి మనీషా (25), ప్రవీణ్ (30), అక్కడికక్కడే మృతి చెందగా.. అనసూయ (62) న గరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. రెండో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో సంతో‹Ù, వడ్డే రాజు, గూని ప్రవీణ్, నవీన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి చికిత్స నిమిత్తం నగరంలోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ⇒ ఐడీఏ జీడిమెట్ల సంజయ్ గాంధీనగర్కు చెందిన పాపగారి మనీషా నర్సాపూర్లోని పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తోంది. ఈమె విధుల నిమిత్తం నర్సాపూర్ వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటో ఎక్కారు. æ నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్య లక్ష్మి (20) కొంపల్లిలోని ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్లి అక్కడ విద్యార్థులు లేకపోవడంతో తిరిగి బహుదూర్పల్లిలో ఆటో ఎక్కింది. ⇒ ప్రవీణ్ నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండా వాసిగా, అనసూయ కౌడిపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. æ కారు నడిపిన వ్యక్తి మెదక్లో తన పిల్లలను హాస్టల్లో వదిలి తిరిగి హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది. ఈయన వివరాలు ఇంకా తెలియలేదు. ప్రమాదంలో 2 ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. -
మృత్యువు కబళించింది
తుగ్గలి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వలుకూరు రాజు(35), సుమలత (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఊర్లో ఈనెల 22న జరిగే దేవర ఉత్సవాలు ఉన్నందున నేత చీరల తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపు రం జిల్లా యాడికి వెళ్లారు. అక్కడ పట్టుచీరలు కొనుగోలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్పై వ స్తుండగా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో 67వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద గుత్తి వైపు నుంచి యాడికికి శరవేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో దంపతులిద్దరూ మృతిచెందారు. బొలెరో వాహనంలో ఉన్న యాడికి గ్రామానికి చెందిన యువకుడు సాయి మణికంఠకూ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యాడికి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. -
కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం.. ముగ్గురు మృతి
జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్, ప్రేమ్ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొన్నారు. వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్ మృతి చెందాడు . చైతన్య, షాజహాన్, ప్రేమ్, షాహుల్ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
బ్రేకులు ఫెయిలై.. షాపులోకి దూసుకెళ్లి..
అక్కిరెడ్డిపాలెం: బ్రేకులు ఫెయిలైన ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఎత్తు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ షాపులోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఓ మహిళ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలివీ.. సుందరయ్య కాలనీలోని పాత కర్ణవానిపాలెంలో నివాసం ఉంటున్న గొలిశెట్టి వెంకటరమణ(58) స్టీల్ ప్లాంట్లోని కోక్ ఓవెన్స్ విభాగంలో సీనియర్ ఫోర్మెన్గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి దగ్గరలోని జిరాక్స్ షాపునకు పనిమీద వెళ్లారు. అదే సమయంలో ఇసుక లోడుతో వస్తున్న లారీ ఎత్తు నుంచి దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి నేరుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ వెంకటరమణను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ రామసత్యప్రసాద్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ దూసుకొస్తుండటం చూసిన ఓ మహిళ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న గాజువాక ఎస్ఐ విజయ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకటరమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వెంకటరమణకు భార్య నాగలక్ష్మి, కుమార్తె ఉన్నారు. ఆయన మధ్యాహ్నం విధులకు వెళ్లాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
కంటైనర్ బీభత్సం.. ఏకంగా పోలీసుల వాహనం పైకే !
-
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు
కొత్త ఏడాది(2025)లోకి మనమంతా అడుగుపెట్టేందుకు ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ తరుణంలో మన మదినిండా కొత్త ఆశలు చిగురిస్తాయి. అదేసమయంలో పాత ఊసులు కూడా మదిలో మెదులుతుంటాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిలోని ముఖ్యమైన ఐదు ఉదంతాలను మనం ఎప్పటికీ మరువలేం. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. రాజ్కోట్ గేమింగ్ జోన్ 2024, మే 25న గుజరాత్లోని రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇది సౌరాష్ట్రలోనే అతిపెద్ద గేమింగ్ జోన్గా పేరొందింది. ఈ ఘటన దరిమిలా పోలీసులు గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేకుండా ఈ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.హత్రాస్ తొక్కిసలాటయూపీలోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. సింకదారావులోని ఒక మైదానం.. సత్సంగం సందర్భంగా శ్మశాన వాటికలా మారింది. 2024, జూలై 2న హత్రాస్లోని పుల్రాయి గ్రామంలో సత్సంగం నిర్వహించారు. అనంతరం భోలే బాబా తన కారులో ఆశ్రమానికి తిరుగుపయనమయ్యారు. అదే సమయంలో బాబా పాదాలను తాకేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా దేవ్ ప్రకాష్ మధుకర్తో సహా తొమ్మదిమందిని చేర్చారు. అయితే భోలే బాబా అలియాస్ సూరజ్పాల్ను ఈ కేసులో నిందితునిగా పేర్కొనకపోవడం విశేషం.వయనాడ్ విలయం2024, జూలై 30వ తేదీ రాత్రి కేరళలోని వయనాడ్లో ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఇది యావత్దేశాన్ని కుదిపేసింది. వయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మృతిచెందారు. 180 మంది గల్లంతయ్యారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది.ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కొందరు శిశువులను వారి తల్లిదండ్రులు కళ్లారా చూసుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక ఆస్పత్రి పాలకవర్గ నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమయ్యింది. షార్ట్ సర్క్యూట్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం, సకాలంలో పిల్లలను ప్రమాదం బారి నుంచి తప్పించకపోవడం లాంటివి పెను ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటన దరిమిలా ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను విధుల నుంచి తొలగించగా, మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.జైపూర్ ట్యాంకర్ రాజస్థాన్లోని జైపూర్లో 2024, డిసెంబర్ 20న అజ్మీర్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. కంటైనర్ లారీ, ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్నాయి. వెంటనే ఎల్పిజి ట్యాంకర్కున్న అవుట్లెట్ నాజిల్ విరిగిపోయి, గాలిలోకి విష వాయువు వ్యాపించింది. చిన్నపాటి స్పార్క్ ఇంతటి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దాదాపు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది.ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం
భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చంపాపేట్కు చెందిన బైగళ్ల జగన్ భార్య పావని(30), కుమార్తె సాత్విక, కుమారుడు ప్రణయ్(2)తో కలిసి శుక్రవారం ఉదయం బైక్పై యాదగిరిగుట్ల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట నుంచి నగరానికి తిరిగి వస్తుండగా భువనగిరి మండల పరిధిలోని హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై దీప్తి హోటల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణయ్తో పాటు స్వల్పంగా గాయపడిన జగన్, సాతి్వకను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సెలవు రోజు కావడంతో.. జగన్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నాడు. వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరిలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం రాయగిరి చెరువు వద్ద సంతోషంగా గడిపిన వారు భోజనం చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
సిటీ చూసొద్దామని బయలుదేరి.. మృత్యుఒడికి..
మాదాపూర్: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్కు చెందిన ఆకాం„Š (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్నగర్ సిగ్నల్ దాటిన తరువాత ఆకాంక్షా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్ డివైడర్ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024 -
యమ డ్రింకరులు
కొన్నాళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగా మోటర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాహనం నడిపిన యువకుడు బార్లో పని చేస్తాడు. రాత్రి ఫుల్గా మద్యం తాగి వాహనాన్ని వేగంగా నడపటంతో ప్రమాదం జరిగింది. కర్నూలు బాలాజీ నగర్కు చెందిన కొంతమంది యువకులు స్నేహితుని పుట్టిన రోజు వేడుకలను అలంపూరు గ్రామ శివారులోని ఓ తోటలో జరుపుకున్నారు. అనంతరం కర్నూలుకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైంది.ఏ వాహనమూ వారికి అడ్డు రాలేదు. వేగంగా వెళ్లి బ్రిడ్జికి ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కూడా మద్యం మత్తులో వాహనం నడపటమే కారణమని పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘటనలతో ఆయా కుటుంబాలు చీకటిలోకి జారుకుంటున్నాయి. కర్నూలు: వారు నడిస్తే.. కాళ్లు రకరకాలుగా అడుగులేస్తాయి. ఇక వాహనాలు నడిపితే యముడు వెనుక వస్తున్నట్లే. మృత్యువుకు ఎదురెళ్తారు. ఎందుకంటే వారి శరీరంలోకి మద్యం వెళ్లింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మత్తులో రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అలా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నారు. మద్యం మత్తులోని యమకింకరులను పోలీసులు పట్టుకుంటున్నా, కోర్టు శిక్షలు విధిస్తున్నా నానాటికీ పెరిగిపోతున్న కేసులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగడం ఎంత హానికరమో.. వివరించే ప్రచార చిత్రాలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. పోలీసులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రంకెన్ డ్రైవ్పై అవగాహన కల్పిస్తుంటారు. ఇవి చాలా మందిలో మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పండుగలు, ఉత్సవాలు, ఇళ్లలో జరిగే శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. అదే సమయంలో వాహనాలతో రోడ్లపైకి రావడం ముప్పు తెస్తోంది. ఎక్కువగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య యువకులే తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 40 నుంచి 55 ఏళ్ల వయస్సు వారు తర్వాత స్థానంలో ఉన్నారు. ఇటీవల కాలంలో 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు వారు కూడా అధికంగానే మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చైతన్యపరుస్తున్నా.. లెక్క చేయని యువత మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని పోలీసులు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత లెక్క చేయడం లేదు. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న కన్నవారు తేరుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో ఎక్కడికక్కడ చైతన్యం చేస్తున్నప్పటికీ కొందరు లెక్క చేయడం లేదు. చివరకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వారిపై ఆధారపడినవారిని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ఏటా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు ముమ్మరం చేశారు. వారిని కూడా తప్పించుకుని వెళ్లిపోయినవారిని లెక్కల్లోకి తీసుకుంటే భయపడేంత స్థాయిలో మద్యం ప్రియులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దొరికిన కొందరు కొన్ని రోజుల పాటు జైలు శిక్షకు కూడా గురవుతున్నారు. ఇన్ని ఘటనలు తమ చుట్టూ జరుగుతున్నా ‘నిషా’లో మునిగిన వారు వాహనాలు నడపటం మాత్రం ఆపడం లేదు. మూడేళ్లలో 2,596 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.జైలు.. జరిమానా మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేస్తారని కూడా మందు బాబులు తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సంఘటనల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవటం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సెలింగ్లో సూచిస్తున్నాం. – మన్సూరుద్దిన్, ట్రాఫిక్ సీఐ, కర్నూలు -
చెట్టును ఢీకొన్న కారు
భువనగిరిటౌన్: స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా.. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రామంతాపూర్లో వివిధ కాలనీలకు చెందిన అర్జున్, శ్రీరాం మితిన్, శ్రీను, సుంకరి మణిజయంత్, యశ్వంత్ (17) స్నేహితులు. వీరంతా బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ సూఫియాన్ అలియాస్ రహీం (27) ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని అతడితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. అదే కారులో అబ్దుల్ సూఫియాన్ బంధువు షాకీబ్ కూడా ఉన్నాడు. ఉదయం 7 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారి దర్శనం పూర్తిచేసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట–భువనగిరి మధ్యలో ఓ హోటల్ వద్ద కారును ఆపి టిఫిన్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్లో ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు బయల్దేరారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీకొని అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న అబ్దుల్ సూఫియాన్తో పాటు వెనుక కూర్చున్న యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు.. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఐదుగురిని 108 వాహనంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. షాకీబ్తో పాటు మితిన్, మణిజయంత్కు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అనంతరం వాహనంలో ఇరుక్కుపోయిన సూఫియాన్, యశ్వంత్ మృతదేహాలను పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సెలవు రోజు కావడంతో.. అర్జున్, యశ్వంత్, మణిజయంత్, శ్రీరాం మితిన్, శ్రీను హైదరాబాద్లోనే వివిధ ప్రాంతాలలో ఇంటరీ్మడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీను, అర్జున్, మితిన్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, యశ్వంత్ నారాయణగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో, మణిజయంత్ నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా కళాశాలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ కుమారస్వామి తెలిపారు.శాంతినగర్లో విషాద ఛాయలు రామంతాపూర్: తమ ఒక్కగానొక్క కుమారుడు యశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామంతాపూర్ శాంతినగర్కు చెందిన శ్రీనివాస్, మాధవి దంపతుల దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కుమారుడి మరణ వార్త తెలియగానే శ్రీనివాస్ దంపతులు భువనగిరి జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సోదరుడి మరణంతో యశ్వంత్ సోదరీమణులు భవ్య, సమీక్ష భోరున విలపిస్తున్నారు. -
వేగంగా దూసుకొచ్చి.. బైకుని ఢీకొట్టి..
గచ్చిబౌలి: ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్..మితిమీరిన వేగం కారణంగా బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం..కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని(21) గండిపేట్లోని సీబీఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. గండిపేట్లోని ఓ హాస్టల్లో ఉంటోంది. నిజాంసాగర్లోని నవోదయ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల పూర్వ సమ్మేళనం కోసం ఈ నెల 22న ఉదయం 4.30 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరింది. తిరిగి రాత్రి 12 గంటలకు కూకట్పల్లిలో బస్సు దిగి హాస్టల్కు వెళ్లేందుకు తన స్నేహితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్రెడ్డిని పిలిచింది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి హాస్టల్కు బయలుదేరారు. రాత్రి 1.30 గంటల సమయంలో నానక్రాంగూడ రోటరీ నుంచి నార్సింగ్ సర్వీస్ రోడ్డులో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచి్చన స్కోడా కారు వీరి బైక్ను ఢీ కొట్టింది. దీంతో శివాని, వెంకట్రెడ్డి ఎగిరి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని 108 అంబులెన్స్లో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివాని మృతిచెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రెడ్డిని మెరుగైన చికిత్స కోసం మదీనాగూడలోని ఓ హాస్పిటల్లో చేరి్పంచారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుని కుమారుడు శ్రీకాలేష్ (19) కారును అతి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, స్కోడా కారును స్వాదీనం చేసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ చేయగా ఎలాంటి ఆల్కహాల్ తాగలేదని నిర్ధారణ అయిందని, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. కొండాపూర్లో నివాసం ఉండే శ్రీకాలేష్ అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితులను నార్సింగిలో డ్రాప్ చేసేందుకు కారులో బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం -
బెంగళూరు యాక్సిడెంట్.. అసలేం జరిగింది?
బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు దుర్మరణం పాలవడంతో రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్ టెర్రర్పై భయాందోళన వ్యక్తం చేస్తూ నెటిజనులు ఆన్లైన్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్లకు గల కారణాలను ఏకరువు పెడుతున్నారు. బెంగళూరు– తుమకూరు ఎన్హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రకు వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో అంతమవడం తీవ్రంగా కలిచివేసింది. మృతులను బెంగళూరులోని ఐఏఎస్టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), ఆయన భార్య గౌరాబాయి(42), వారి పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.అసలేం జరిగింది?బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న చంద్రం యోగప్ప తన సొంతూరిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వోల్వో కారులో మహారాష్ట్రలోని విజయపురకు బయలుదేరారు. హైవేపై వెళుతుండగా నెలమంగళ వద్ద భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా వీరి కారుపై పడిపోయింది. ప్రమాదం ధాటికి కారులోని వారు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో కంటైనర్ను తొలగించినా ఫలితం లేకపోయింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.ముందు వెళ్తున్న కారు సడన్గా బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ మీడియాతో చెప్పాడు. తన ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో కంటైనర్ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కారుపై పడిందని వివరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఆరిఫ్కు కాలిరిగింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, కంటైనర్ లారీలో 26 టన్నుల అల్యూమినియం స్తంభాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియాలో చర్చబెంగళూరు రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మనం ప్రయాణించే వాహనం ఎంత సురక్షితమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించలేవని చాలా మంది అభిపప్రాయపడ్డారు. సురక్షితమైన రోడ్లు, సుశిక్షితుడైన డ్రైవర్, రక్షణ ప్రమాణాలు కలిగిన వాహనం.. ఈ మూడింటితో ప్రమాదాలు నివారించవచ్చని ‘డ్రైవ్ స్మార్ట్’ పేర్కొంది. దీనిపై పలువురు నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెత్త రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కంటైనర్లు, లారీల్లో ఓవర్లోడ్ తీసుకెళ్లకుండా ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు.చదవండి: తప్పతాగి ఫుట్పాత్పైకి ఎక్కించి.. పుణేలో ఘోరంఊహించని విధంగా మరణం.. ‘ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో XC90 ప్రసిద్ధి చెందింది. 2002లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యూకేలో ఒక్క ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. అలాంటి సురక్షితమైన కారులో ప్రయాణిస్తూ ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కంటైనర్ ట్రక్ అదుపు తప్పి, డివైడర్ను దాటి కారుపై పడి యజమానితో పాటు అతడి కుటుంబ సభ్యులను బలితీసుకోవడాన్ని ఎవరూ ఊహించరు. ఎంత మంచి ప్రమాణాలు కలిగిన కారు అయిన ఇంత భారీ బరువు మీద పడితే కచ్చితంగా నలిగిపోతుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎవరూ ఊహించని విధంగా మరణం మన దరికి చేరడం విషాదమ’ని స్కిన్ డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.చదవండి: చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలుప్రతిగంటకు 19 మంది బలి‘మీరు సురక్షితమైన కార్లను తయారు చేయవచ్చు, కానీ భారతదేశం అత్యంత అసురక్షిత రహదారులను నిర్మిస్తుంది. జాతీయ రహదారులు గందరగోళంగా ఉంటాయి. కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తే చాలు డ్రైవింగ్ లైసెన్స్లు వచ్చేస్తాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, చెత్త రోడ్ల కారణంగా మనదేశంలో ప్రతిగంటకు 19 మంది బలైపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ రహదారులు దేశ భవిష్యత్తును చంపేస్తున్నాయ’ని మరో నెటిజన్ పేర్కొన్నారు. -
తప్పతాగి ఫుట్పాత్పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్పాత్పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్పాత్పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్పాత్పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
దొడ్డబళ్లాపురం: శనివారంనాడు నెలమంగల వద్ద కంటెయినర్ లారీ పడి కారు నుజ్జయిన ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుమందికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా జత్ తాలూకా మొరబగి గ్రామంలో అశృ నయనాలతో బంధువులు, గ్రామస్తులు వీడ్కోలు పలికారు. నెలమంగళ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించి ఆదివారం ఉదయం ఆరు మృతదేహాలను అంబులెన్సుల్లో గ్రామానికి తీసుకువచ్చారు. అప్పటికే గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ పెద్ద చంద్రం యోగప్ప, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల మృతదేహాలకు సహోదరుడు మల్లికార్జున్ నిప్పు అంటించారు. చంద్రం ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులు తరలివచ్చారు. చంద్రంపై గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ఉంది. నిరుద్యోగులు ఎవరున్నా వారికి ఉద్యోగం కల్పించేవాడు. చంద్రం పేద కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగారు.ఉసురు తీసిన కంటైనర్ లారీ -
వెంకన్నకు కూడా దయ లేదాయె!
వెంకన్న దర్శనం చేసుకుని తిరిగివస్తున్న వారిని మృత్యువు కాటేసింది. రెప్పపాటులో నలుగురిని బలితీసుకుంది. మరో 11 మందికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మరో 45 నిమిషాల్లో ఇళ్లు చేరతారనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ఉండటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.మడకశిర రూరల్: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర రూరల్ పరిధిలోని బుళ్లసముద్రం గ్రామ సమీపంలో 544ఈ– జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని టెంపోట్రావెలర్ వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా... గుడిబండ మండలం కేఎన్ పల్లి గ్రామానికి చెందిన శివరాజు, ప్రేమకుమారి(30) దంపతులకు అథర్వ (2) సంతానం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శివరాజు కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించేందుకు కుటుంబీకులు, బంధువులతో కలిసి గురువారం సాయంత్రం ఓ టెంపోట్రావెలర్లో తిరుమల వెళ్లారు. శుక్రవారం తిరుమలలో అథర్వ నామకరణం, తలానీలాల కార్యక్రమం ముగించుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామం కేఎన్ పల్లికి తిరుగు పయనమయ్యారు. వీరి వాహనం శనివారం తెల్లవారుజామున మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోకి రాగానే 544ఈ– జాతీయ రహదారిపై ముందు నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో ప్రేమకుమారి, అథర్వతో పాటు అమరాపురానికి చెందిన శివరాజు పెద్దమ్మ రత్నమ్మ(65)తో పాటు పావగడ తాలుకా కొండపురం గ్రామానికి చెందిన డ్రైవర్ మనోజ్(32) మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో పాటు మడకశిర ఫోర్ వీలర్ అసోసియేషన్ వాహనాల్లో మడకశిర ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఈ ఘనటపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నామకరణమే చివరి సంబరం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... అందులో శివరాజు భార్య ప్రేమకుమారి(30), కుమారుడు అథర్వ (2)తో పాటు శివరాజు పెద్దమ్మ రత్నమ్మ (65) ఉండటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు అథర్వకు నామకరణం చేసి గంటలు గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శివరాజు దుఃఖసారగంలో మునిగిపోయారు. భార్యను, బిడ్డను కోల్పోయి అతను రోదించిన తీరు స్థానికులనూ కంటతడిపెట్టించింది. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చిన్నారి అథర్వ మృతదేహం చూసిన వారంతా ‘అయ్యే ఎంత పని చేశావ్... దేవుడా అంటూ’ కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమరాపురం మండలం శివరం గ్రామానికి చెందిన నాగమణి, గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన గీతమ్మ, శ్రీదేవి, టీచర్ సుజాతమ్మ, కమలమ్మ, గంగమ్మ, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హరిబ్బి గ్రామానికి చెందిన శ్వేత, పావగడ తాలుకాలోని హర్తికేరే గ్రామానికి చెందిన గిరిజమ్మ, ఉమే‹Ù, అమ్మాజామ్మ, చిత్రదుర్గ జిల్లాకు చెందిన రవీంద్రలను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, కుటుంబీకులు, బంధువులు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న తమవారిని చూసి తల్లిడిల్లిపోయారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 10 మంది మెరుగైన వైద్య చికిత్సల కోసం తుమకూరు ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రత్న.. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఎస్పీ రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు వెంటనే మడకశిరకు వచ్చారు. నేరుగా ఘటన స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం మడకశిర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరామర్శించారు. నిద్రమత్తే కొంపముంచిందా?.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శివరాజు శనివారం బెంగళూరుకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వెంకన్న దర్శనం కాగానే కుటుంబంతో కలిసి స్వగ్రామం బయలుదేరారు. తెల్లవారుజాము కంతా ఇంటికి చేరాలన్న ఆలోచనలో ఎక్కడా వాహనం నిలపలేదు. రాత్రంతా వాహనం నడిపి అలిసిపోయిన డ్రైవర్ మనోజ్(32)కు నిద్రమత్తు వచ్చింది. దీంతో ఆతను గోరంట్లలో వాహనం నిలిపి టీ కూడా తాగాడు. ఓ గంటలో వాహనంలోని వారిని స్వగ్రామం చేరిస్తే తన పని అయిపోయిందని భావించి వెంటనే బయలు దేరాడు. ఇదే క్రమంలో బుళ్లసముద్రం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. నేనేట్లా బతికేది దేవుడా... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మనోజ్ ఆరేళ్ల క్రితం డ్రైవర్గా బెంగళూరులో పనిచేసే వాడు. అక్కడే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం స్వగ్రామం పావగడ తాలుకా కొండాపురం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, విగతజీవిగా చూసి భార్య వినుత బిగ్గరగా రోదించారు. ‘‘నాకు దిక్కెవరు దేవుడా...నేనెట్టా బతికేది’’ అంటూ ఆమె చేసిన రోదించిన తీరు అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. -
ట్రక్కును ఢీకొన్న బస్సు.. 38 మంది మృతి
బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బ్రెజిల్లోని మినాస్గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortosÔnibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024 -
ఉసురు తీసిన కంటైనర్ లారీ
ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దుల్లో పుట్టి పెరిగి, బెంగళూరుకు వచ్చారు. ఓ ఐటీ కంపెనీ నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. వీకెండ్, క్రిస్మస్ను సొంతూరిలో సంతోషంగా చేసుకుందామని కుటుంబంతో పయనమయ్యారు. కానీ అదే చివరి ప్రయాణమైంది. గంట దాటిందో లేదో.. మృత్యుఘంటికలు మోగాయి. కంటైనర్ లారీ యమ శకటంలా వచ్చి ఆ కారు మీద పడింది. అంతే.. కుటుంబ యజమానితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. రోడ్ టెర్రర్ విషాదానికి ఇది తాజా ఉదాహరణ.దొడ్డబళ్లాపురం: రాజధాని సమీపంలో తుమకూరు– బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కంటైనర్ లారీ.. కారు మీదకు పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరులోని ఐఏఎస్టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), సతీమణి గౌరాబాయి(42), పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు. కొంత సేపటికే.. వివరాలు.. విజయపుర– మహారాష్ట్ర సరిహద్దులకు చెందిన చంద్రం యోగప్ప బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటూ ఓ చిన్నస్థాయి ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీకెండ్తో పాటు క్రిస్మస్ పండుగకని సొంత ఓల్వో కారులో ఊరికి బయల్దేరారు. గత అక్టోబరులో కొత్త ఓల్వో కారును కొన్నట్లు తెలిసింది. శనివారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరినట్లు తెలిసింది. 60 కిలోమీటర్లు ప్రయాణించారో లేదో... ఈ దారుణ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చంద్రం కారును నడుపుతున్నారు. కంటైనర్ అతివేగం.. ⇒ బెంగళూరు– తుమకూరు ఎన్హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ⇒ బెంగళూరు వైపు నుంచి అనేక వాహనాలు తుమకూరు వైపు వెళ్తున్నాయి. వీకెండ్ కావడంతో హైవే రద్దీగా ఉంది. ⇒ కంటైనర్ లారీ, పక్క లేన్లో చంద్రం కుటుంబం ఓల్వో కారు వెళ్తోంది. కంటైనర్ ముందు వెళ్తున్న నందిని పాల వ్యాన్, కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లేన్ దాటి వెళ్లింది, అలా చంద్రం ఓల్వో కారు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ⇒ ఈ రభసకు కారు పూర్తిగా తుక్కయింది. కారులోని వారికి ఏం జరిగిందో తెలిసేలోగా నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కంటైనర్తో పాటు పాల వ్యాన్ బోల్తా పడగా, ఆ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల చొరవ వెంటనే స్థానిక యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటైనర్ కింద నుంచి కారును బయటకు తీయడానికి శ్రమించారు. క్రేన్లను తెప్పించి కంటైనర్ను పక్కకు జరిపించారు. ఇంతలో స్థానిక పోలీసులు చేరుకున్నారు. అతి కష్టం మీద కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం 11 గంటలకు దుర్ఘటన జరిగితే మధ్యాహ్నం 1 గంట వరకు కారును బయటకు లాగే పని కొనసాగింది. ఈ ప్రమాదంలో హైవేలో అటు ఇటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం నెలకొంది. వాట్సాప్ గ్రూప్లలో ఈ సమాచారం వేగంగా వ్యాపించింది. తమ యజమాని కుటుంబం దుర్మరణం పాలైందని తెలిసి హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న ఐఏఎస్టీ సాఫ్ట్వేర్ కంపెనీ సిబ్బంది షాక్కు గురయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీలో 100మందిపైగా పని చేస్తున్నారు. కొందరు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. మరికొందరు లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విజయపుర వద్ద మొరబగి గ్రామంలో ఉండే యోగప్ప తల్లితండ్రులయిన ఈరగొండ, జక్కవ్వలకు ప్రమాదం విషయం ఇంకా చెప్పలేదని తెలిసింది.అలా జరిగిపోయింది కంటైనర్ డ్రైవర్దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఈ ఘోరం జరిగిందని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ చెప్పాడు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. ముందు వెళ్తున్న కారు సడన్గా బ్రేక్ వేయడంతో ఢీకొనకుండా తప్పించబోయి స్టీరింగ్ తిప్పడంతో వాహనం పక్కకి దూసుకుపోయిందన్నాడు. ఇంత ఘోరం జరిగినట్టు తనకు తెలీదని, విషయం తెలిసి చాలా భాధగా ఉందని ఆరిఫ్ అన్నారు. మరోవైపు ప్రమాదంపై నెలమంగల డీఎస్పీ జగదీష్ సమగ్ర విచారణ చేయనున్నారు. -
హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. పంజగుట్ట– అమీర్పేట మార్గంలోని బిగ్బజార్ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్ బైక్ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి వచి్చన పోలీసులు లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్కుమార్ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు. -
AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి
సాక్షి, సత్యసాయి: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని మిని టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద శనివారం తెల్లవారుజామున లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది. ఏడాది కిందటి వరకు చిత్తూరులో టీచర్గా పనిచేసిన ఆమె ఇంటికి దగ్గరగా ఉండాలని కోరి మరీ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కానీ అంతలోనే విధి వెక్కిరించి ఆమెను తీసుకెళ్లిపోయింది. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండేవారే. ఏడాది కిందటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని టెక్కలి మండలం సన్యాసిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆమె స్వగ్రామం నుంచి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. తిమ్మాపురం నుంచి కోటబొమ్మాళి వరకు బస్సులో వచ్చి.. అక్కడ ఉంచిన తన స్కూటీపై బడికి వెళ్లేవారు. బుధవారం కూడా కోటబొమ్మాళి నుంచి తన పాఠశాలకు వెళ్లేందుకు గాను టెక్కలి వైపుగా స్కూటీపై బయల్దేరారు. అదే సందర్భంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఏపీ 39 జేక్యూ5568 నంబర్ గల కారు జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న త్రివేణి బండిని ఢీకొని అప్రోచ్ రోడ్డులోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టెక్కలి మండల ఎంఈఓలు తులసీరావు, చిన్నారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. త్రివేణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. టీచర్ చనిపోయారని తెలిసి సన్యాసిపేట వాసులు ఘట నా స్థలానికి చేరుకుని రోదించారు. కోటబొమ్మాళి ఎస్ఐ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పిల్లలను అంగన్వాడీలో ఉంచి..ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (30) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె ఇషికలను అంగన్వాడీ కేంద్రంలో విడిచిపెట్టి ఆమె స్కూల్కు బయల్దేరారు. అంతలోనే ఆమె చనిపోయారన్న వార్త తెలియడంతో భర్త సింహాచలంతో పాటు స్థానికులు నిశ్చేషు్టలయ్యారు. సాయంత్రానికి అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న ఆ చిన్న పిల్లలను చూసి కంట తడి పెట్టారు. వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి.. -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
మైలార్దేవ్పల్లి: దైవ దర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నగర వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ బాబుల్రెడ్డి నగర్కు చెందిన పోతన్న (50), శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన సీతారాం నాయక్ (49), ఆయన కుమారుడు చరణ్, శివకుమార్ గౌడ్లు ఈ నెల 16న శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరిగి బయలుదేరారు. తమిళనాడు దేవదాయపట్టి సమీపంలో వీరు వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో పోతన్న, సీతారాం నాయక్లు అక్కడిక్కడే మృతి చెందారు. చరణ్, శివకుమార్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మధురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మరణిస్తూ మరికొందరికి ప్రాణం పోసి..
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు జీవన్దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు. 22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడిప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. -
అక్కా.. వెళ్లిపోయావా..
అనకాపల్లి: మరికొద్ది సేపట్లో ఆనందం పంచుకోవాల్సిన ఆ ఇంట్లో దుర్వార్త వినడంతో కశింకోట మండలం వెదురుపర్తి గ్రామం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. తమ్ముడు భార్య గర్భిణి కావడంతో శనివారం సాయంత్రం ఆమెను పుట్టింటికి పంపించేందుకు కావాల్సిన సరంజామా అంతా తెచ్చేందుకు అతడితో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్క వి. విజయలక్ష్మి(40) దుర్మరణం చెందగా, తమ్ముడు మళ్ల గిరిబాబు (35)కు గాయాలయ్యాయి. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు తమ ద్విచక్ర వాహనంపై కశింకోట నుంచి అనకాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి బైక్ సైడ్ మిర్రర్ను స్పీడ్గా తాకడంతో ఒక్కసారిగా పడిపోయారు. దాంతో లారీ వెనుక చక్రం విజయలక్ష్మి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, గిరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే తన అక్క చనిపోవడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గాయపడిన అతడిని హైవే అంబులెన్స్లో ఎన్టీఆర్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. గిరిబాబు భార్య ఝాన్సీలక్ష్మి గర్భిణి కావడంతో పుట్టింటికి పంపించేందుకు పూలు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయలు దేరిన సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ అశోక్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి తన భర్త, కుమారుడుతో విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఉంటున్నట్టు తెలిసింది. -
రేయ్ ప్రసాదూ.. లేవరా!
‘బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని చూస్తానన్నావు.. స్నేహితులతో సరదాగా సినిమా చూసొస్తానని వెళ్లి మాకు పుత్రశోకాన్ని మిగిల్చావు.. అయ్యో దేవుడా మేమేం పాపం చేశామని, మాకింత పెద్ద శిక్ష విధించావు.. ప్రసాదూ లేవరా.. 13 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి’.. అంటూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందిన రేవుపోలవరానికి చెందిన విద్యార్థి దుర్గాప్రసాద్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు, తమ్ముడు గుండెలవిసేలా రోదించారు. అనకాపల్లి: ఆదివారం యలమంచిలి మార్చురీ వద్ద ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుని స్వగ్రామం రేవుపోలవరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలో లైనుకొత్తూరు వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం ఉపేంద్ర తెలిపారు. ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన దారబోయిన గోవిందరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(13), అదే గ్రామానికి చెందిన అర్జిల్లి ప్రవీణ్(14) శనివారం మధ్యాహ్నం యలమంచిలిలో సినిమా చూసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. సినిమా చూసిన తర్వాత తమ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం లైనుకొత్తూరు వద్ద రోడ్డు దాటుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని విద్యార్థులు నడుపుతున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై మృతి చెందిన విద్యార్థి తండ్రి గోవిందరావు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడపుతూ రోడ్డు దాటడం వల్లే ప్రమాదం జరిగి, తన కుమారుడు మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.కుటుంబీకులకు విద్యార్థి మృతదేహం అప్పగింతయలమంచిలి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం విద్యార్థి దుర్గాప్రసాద్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సినిమా చూసొస్తానని వెళ్లిన కుమారుడు అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మార్చురీ వద్ద వారి రోదనలు మిన్నంటడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రులు ఆ హెచ్చరికలను విస్మరిస్తుండడంతో అనుకోని ప్రమాదాలతో తీరని విషాదం మిగులుతుంది. మైనార్టీ తీరని పిల్లలకు వాహనాలు ఇస్తే, వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతోపాటు, ఎదుటి వారిని కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మైనర్లకు వాహనాలిచ్చే విషయంలో తల్లిదండ్రులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.సినిమా చూసొస్తూ విద్యార్థి దుర్మరణం -
అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం
-
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గచి్చబౌలి: అర్థరాత్రి అతి వేగంగా మృత్యు శకటంలా దూసుకొచి్చన ఓ టిప్పర్ బైక్ను ఢీ కొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా బయ్యారం, ఉప్పలపాడు లక్ష్మీ నర్సింహపురానికి చెందిన చల్లా లోహిత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసే తన అన్న చల్లా నవనీత్, స్నేహితులతో కలిసి గౌలిదొడ్డిలోని జగన్రెడ్డి మెన్స్ పీజీలో నివాసం ఉంటున్నారు. గౌలిదొడ్డిలో నివాసం ఉండే స్నేహితుడు తెనాలికి చెందిన రావిపూడి సాయి మహేష్ బాబు(24)తో కలిసి లోహిత్ డొమినార్ బైక్పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అన్వయ కన్వెన్షన్ సమీపంలో వీరి బైక్ను వేగంగా వచి్చన టిప్పర్ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న లోహిత్, మహే‹Ùబాబు ఇద్దరూ కిందపడ్డారు. లోహిత్ తలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన సాయి మహేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. టిప్పర్ డ్రైవర్ అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరొకరికి తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. నెల్లూరుకు చెందిన వినయ్(23), హేమలత(23) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. తిరుమల దర్శనార్థం శుక్రవారం బయలుదేరారు. శనివారం తిరిగి నెల్లూరుకు బైక్పై వెళుతుండగా శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద హేమలత బ్యాగు లారీకి చిక్కుకోవడంతో ఆమె లారీ కింద పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. వినయ్ స్వల్పగాయాలతో బయటపడడ్డాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం
-
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్ను విచారించారు. సంజయ్ మోర్ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు నల్లగొండ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. దండుమల్కాపురం గ్రామ స్టేజీ దాటిన తర్వాత ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి ఎయిర్లాక్ కావడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీ డీలక్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ సయ్యద్ సలీం పాష(50) బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు. బంటు శేఖర్, మిడతపల్లి సైదులుతో పాటు మరో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులు వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సలీం పాష మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సహయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బస్సు డ్రైవర్ సలీం పాష స్వగ్రామం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం కాగా 25 ఏళ్ల క్రితం నల్లగొండకు వెళ్లిపోయారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్ల యాదవరెడ్డి తెలిపారు.విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లే..ఆర్టీసీ అధికారులు విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లనే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుడు సలీం పాష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం డ్యూటీకి వెళ్లిన సలీం పాషా సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు డ్యూటీ అయిపోవడంతో ఇంటికి వస్తున్నానని చెప్పాడని, కొద్దిసేపటికే మళ్లీ డ్యూటీ వేశారని హైదరాబాద్ వెళ్లి వస్తానని ఫోన్లో చెప్పి ఇలా ప్రమాదంలో మృతిచెందాడని సలీం పాష సోదరుడు అనీస్ పాష బోరున విలపించాడు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ వారే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఉత్తమ డ్రైవర్ను కోల్పోయాం– ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డినల్లగొండ క్రైం: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో సోమవారం జరిగిన ప్రమాదంలో నల్లగొండ డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ సలీంపాష మృతిచెందాడని, సంస్థ ఒక ఉత్తమ డ్రైవర్ను కోల్పోయిందని ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ సలీంపాష ఇటీవల ఉత్తమ డ్రైవర్గా (కేఎంపీఎల్) అవార్డు పొందాడని, టిమ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడని ఆర్ఎం తెలిపారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా లారీని రోడ్డుపై నిలిపాడని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు ఏటవాలుగా ఉండటంతో.. లారీ నిలిచినప్పటికీ వెళుతున్నట్లుగా బస్సు డ్రైవర్ భావించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్పై ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎం తెలిపారు. బస్సు డ్రైవర్ విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై 15 రోజులు సెలవు తీసుకున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం
గజ్వేల్రూరల్: మారథాన్ పోటీలో పాల్గొనేందుకు వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటనతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్ పరంధాములు(46) రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తుండగా, గాడిచర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతంలో మారథాన్(రన్) కార్యక్రమం ఉండడంతో వీరు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.ఈ క్రమంలో పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో రాంగ్రూట్లో వెళుతుండగా, ఇదే సమయంలో గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్లు ధరించినా, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణంలోనూ వీడని స్నేహం: మరణంలోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. పరంధాములుది 2004 బ్యాచ్ కాగా, వెంకటేష్ 2007 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఎక్కడ మారథాన్ పోటీలు జరిగినా పోలీస్శాఖ తరపున వెళ్లి పాల్గొనే వారని తోటి పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్శాఖలో మారథాన్ పోటీల్లో పాల్గొనేవారు ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సభ్యులుగా ఉన్న వెంకటే‹Ù, పరంధాముల మధ్య స్నేహం ఏర్పడింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్తోపాటు ముంబయి, న్యూఢిల్లీలో సైతం జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
మితిమీరిన వేగంతోనే ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్..’(వేగం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చంపేస్తుంది) అని పోలీసులు చెబుతున్నా, రహదారులపై అక్కడక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. విశా లమైన రోడ్లపై యమస్పీడ్గా దూసుకెళుతున్నారు. అంతే వేగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలకు కారణాలు విశ్లేíÙస్తే.. మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడవుతోంది. రోడ్డు ప్ర మాదాలు నియంత్రించేందుకు, ప్రమాదాలకు మూలకారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ రోడ్డు భద్రత విభాగం అధికారులు 2023లో రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలు విశ్లేíÙంచారు. రహదారులు, ఓఆర్ఆర్పై మొత్తం 9,749 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఇందులో 5,817 రోడ్డు ప్రమాదాలు వాహనదారుల మితిమీరిన వేగం కారణంగానే సంభవించినట్టు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 120 రోడ్డు ప్రమాదా లు జరిగాయి. అత్యంత నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో 3,532 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలకు అసలు కారణాలు గుర్తించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 3,532 నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో యాక్సిడెంట్లు⇒ 2023లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన పోలీస్శాఖ రోడ్డు భద్రత విభాగం ⇒ ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే యోచన -
అదుపుతప్పిన స్కూల్ బస్సు
-
మరణంలోనూ వీడని స్నేహ బంధం
నాగోలు: వారంతా చిన్ననాటి మిత్రులు. మరణంలోనూ వారి స్నేహబంధం విడిపోలేదు. యాదాద్రి– భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నగరానికి చెందిన అయిదుగురు యువకులు జల సమాధి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీరని దుఃఖమే మిగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కడికెళ్లినా అందరూ కలిసే.. నగర శివారు బోడుప్పల్ జ్యోతినగర్లో ఉంటున్న మణికంఠ అనే యువకుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇతని స్నేహితుడు ఎల్బీనగర్ సిరినగర్ కాలనీ చెందిన తీగళ్ల వంశీ గౌడ్ (23) ఫొటోగ్రాఫర్. ఎల్బీనగర్ మజీద్ గల్లీకి చెందిన వీరమల్ల విఘ్నేష్ గౌడ్ (21) ఇంటర్ పూర్తి చేశాడు. ఎల్బీనగర్కు చెందిన హర్షవర్ధన్ (21) డిగ్రీ చదువుతూ రాపిడో డైవర్గా పని చేస్తుండగా.. ఇదే ప్రాంతానికి చెందిన కలకోటి అక్షయ్ కుమార్ (19) ఇంటర్ చదువుకున్నాడు. ఎల్బీ నగర్ సిరినగర్ కాలనీలో ఉంటున్న జెల్లా వినయ్ (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరంతా చిన్ననాటి స్నేహితులు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో వీరు తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్తుంటారు. మణికంఠ ఒక్కడే బతికాడు.. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఎల్బీనగర్లో స్నేహితులందరూ కలుసుకున్నారు. అప్పటికే వంశీ గౌడ్ దగ్గర తన స్నేహితుడి కారు మారుతి స్విఫ్ట్ కారు ఉంది. ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా వెళ్లొద్దామని కారులో నగరంలో తిరుగుతూ యాదాద్రి– భువనగిరి జిల్లా కొత్తగూడెం నుంచి భూదాన్ పోచంపల్లికి తెల్లవారుజామున చేరుకున్నారు. అక్కడ టిఫిన్ దొరక్కపోవడంతో కొత్తగూడేనికి వచ్చారు. అక్కడ కూడా టిఫిన్ దొరక్కపోవడంతో కొద్ది సమయం అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి వలిగొండలో తాటికల్లు కోసం కారులో బయలుదేరారు. అప్పుడు కారును వంశీ గౌడ్ నడుపుతున్నాడు. కారు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపు తప్పి జలాల్పూర్ చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురిలో మణికంఠ ఒక్కడు మాత్రమే డోర్ ఓపెన్ చేసుకొని బయటపడ్డాడు. మిగతా అయిదుగురూ చెరువులోనే జల సమాధి అయ్యారు. అంతులేని ఆవేదన.. ఎల్బీనగర్ పరిసర కాలనీల్లో నివాసం ఉండే అయిదుగురు స్నేహితులు ఒకేసారి చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో అంతులేని ఆవేదన నెలకొంది. యువకుల కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలతో ఆయా కాలనీల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఎదిగి వచి్చన యువకులు తమ కుటుంబాలకు అండగా ఉంటారని అనుకుంటే.. వారంతా జల సమాధి కావడం అంతులేని విషాదాన్ని నింపింది. పక్కనే ఉన్నా.. ఇంటికి వస్తున్నా అమ్మా.. ఎల్బీనగర్లో నివాసం ఉండే హర్షవర్ధన్ ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తూ తల్లికి అండగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ర్యాపిడోకు వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిన హర్షవర్ధన్ తెల్లవారుజామున 2 గంటలకు తల్లికి ర్యాపిడోలో వచ్చిన 500 ఫోన్ పే చేశాడు. తల్లి మధురవాణికి ఫోన్ చేసి పక్కనే ఉన్నానమ్మా.. ఇంటికి వస్తున్నా అని చెప్పి స్నేహితులతో కలిసి కారులో భూదాన్పోచంపల్లికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సినిమాకు వెళ్లొస్తానని.. పుష్ప సినిమాకు వెళ్తున్నా అంటూ వినయ్ తండ్రి వెంకటే‹Ùకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన కుమారుడికి శుక్రవారం రూ.350 ఫోన్ పే చేశారు. రాత్రి కుటుంబ సభ్యులు వినయ్కి ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ రావడంతో స్నేహితుల వద్ద ఉన్నాడనుకున్నారు. ఉదయం కాలేజీ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అతివేగానికి ఇద్దరు యువకులు బలి
కుత్బుల్లాపూర్: ఇటీవల కొత్తగా బైక్ కొన్న ఓ యువకుడు.. దానిపై మరో స్నేహితుడిని తీసుకుని వెళ్లి.. మిత్రులను కలిసి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురూ అసువులు బాశారు. ఈ దుర్ఘటన శనివారం తెల్లవారుజామున పేట్బష్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గుండ్లపోచంపల్లికి చెందిన దొంతిరి కార్తీక్రెడ్డి (26) అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగి. ఇతను ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కొన్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ఆరుద్ర అనిల్ (21)తో కలిసి సెంట్రల్ పార్క్లో ఉన్న మిత్రులు రాకేష్, నరేష్ వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. శనివారం వేకువజామున సుమారు 2 గంటల ప్రాంతంలో గుండ్లపోచంపల్లికి తిరుగు పయనమయ్యారు. వీరు వస్తున్న బైక్.. కృష్ణ ట్రేడర్స్ ఏజీ ల్యాండ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కార్తీక్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. అంతకుముందు బైక్పై వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇంటికి సక్రమంగా వెళ్లారా.. లేదా..? అని తెలుసుకునేందుకు స్నేహితుడు నరేష్ వీరికి ఫోన్ చేయగా ఎంతకు లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచి్చ న నరే‹Ù.. కార్తీక్రెడ్డి, అనిల్ కోసం వెళ్తుండగా రోడ్డు పై ఇద్దరు యువకులు పడి ఉన్న విషయాన్ని గుర్తించాడు. కార్తీక్రెడ్డి విగతజీవిగా పడి ఉండటం.. అనిల్ తీవ్ర గాయాలతో ఉండటాన్ని గమనించి కార్తీక్రెడ్డి తండ్రి నరసింహారెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఐదుగురు యువకులు జలసమాధి
భూదాన్ పోచంపల్లి: వారంతా 25 ఏళ్లలోపు యువకులు.. కలసి తిరిగే స్నేహితులు.. సరదాగా షికారుకు బయలుదేరారు.. మధ్యలో మద్యం తాగారు.. ఆపై కల్లుతాగాలనే కోరిక పుట్టింది.. దానికోసం వెళుతుంటే, పొగమంచులో దారి సరిగా కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. మృతులంతా హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారే. ఆరుగురు కలసి వెళ్లి.. ఎల్బీ నగర్ ప్రాంతంలోని సిరినగర్ కాలనీకి చెందిన తీగుళ్ల వంశీగౌడ్ (23), ఇంద్రపల్లి హర్షవర్ధన్ (22), వీరమల్ల విఘ్నేశ్వర్(20), ఆర్టీసీ కాలనీకి చెందిన కలకోటి అక్షయ్కుమార్ అలియాస్ బల్లు (19), వాస్తుకాలనీకి చెందిన జెల్ల వినయ్ (21), బోడుప్పల్ జ్యోతినగర్ కాలనీకి చెందిన మేడబోయిన మణికంఠయాదవ్ (21) స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా ఎల్బీ నగర్లో కలసి పార్టీ చేసుకొందామని అనుకున్నారు. తీగుళ్ల వంశీగౌడ్ తన ఇంటి వద్ద ఓ స్నేహితుడు పెట్టివెళ్లిన కారు ఉండటంతో.. దానిని తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయలుదేరారు.మార్గమధ్యలో అంబర్పేట వద్ద మద్యం తాగారు. అక్కడే రెండు గంటల పాటు గడిపారు. ఆ సమయంలో వారికి ఈతకల్లు తాగాలని కోరిక పుట్టింది. దీనితో సుమారు 3.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లికి వచ్చారు. ఇంకా చీకటిగానే ఉండటంతో అక్కడే టీ తాగారు. టిఫిన్ చేసి వద్దామనుకుని కొత్తగూడెం ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లారు. టిఫిన్ సెంటర్లు తెరవకపోవడంతో తిరిగి పోచంపల్లికి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న వంశీ కారు నడుపుతున్నాడు. అయితే మధ్యలో అటవీ ప్రాంతం కావడం, తెల్లవారుజాము సమయం కావడంతో పొగమంచు దట్టంగా కప్పుకొంది. దానితో రోడ్డు సరిగా కనిపించక వంశీ ఒక్కసారిగా కారు హ్యాండ్ బ్రేక్ వేశాడు. వేగంగా ఉన్న కారు దీనితో అదుపుతప్పి పక్కనే ఉన్న జలాల్పురం చెరువులోకి బోల్తా కొట్టింది. ఈత రాక, బయటపడలేక.. కారులో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న మణికంఠ కారు సైడ్ అద్దం కొద్దిగా తెరిచి ఉంటడంతో దానిని కాలుతో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారు నడుపుతున్న వంశీ, వెనుక సీట్లో కూర్చున్న అక్షయ్, వినయ్, హర్షవర్ధన్, విఘ్నేశ్వర్ నీట మునిగి ప్రాణాలు వదిలారు. ఒడ్డుకు చేరిన మణికంఠ రోడ్డుపై వెళ్తున్న పాల వ్యాపారిని ఆపి ప్రమాదం గురించి చెప్పాడు. ఆ వ్యాపారి 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై భాస్కర్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నీట మునిగిన కారును జేసీబీతో వెలికితీయించి.. అందులోని మృతదేహాలను బయటికి తీశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, స్థానిక తహసీల్దార్ మహేందర్రెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతా పేద కుటుంబాల వారే జల సమాధి అయిన ఐదుగురు యువకులు కూడా పేద కుటుంబాలకు చెందినవారే. ఇందులో వంశీగౌడ్ ఇంటర్ పూర్తి చేసి ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతడి తండ్రి శంకర్ ఆటోడ్రైవర్కాగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఇక అక్షయ్కుమార్ ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి తండ్రి నర్సింహాచారి కార్పెంటర్గా పనిచేస్తున్నారు. జెల్ల వినయ్ ఇంటర్ చదివాడు. అతడి తండ్రి జగన్నాథం చేనేత కారి్మకుడు. హర్షవర్ధన్ డిగ్రీ పూర్తి చేశాడు. ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరమల్ల విఘ్నేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. అతడి తండ్రి సత్యనారాయణ ఆర్టీసీ కండక్టర్ అని తెలిసింది. అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చాను పార్టీ చేసుకొందామని ఫ్రెండ్స్ చెబితే రాత్రి ఎల్బీ నగర్కు వచ్చాం. వంశీ కారు తీసుకొచ్చాడు. ఆరుగురం కలసి రాత్రి 12 గంటలకు బయలుదేరాం. రామోజీ ఫిల్మ్సిటీ వద్ద ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామైతే గంటపైగా అక్కడే ఉన్నాం. కల్లు దొరుకుతుందని రాత్రి 3.30 గంటలకు పోచంపల్లికి వచ్చాం. ఇంకా తెల్లరకపోయేసరికి టిఫిన్ చేయడానికి కొత్తగూడెం ఎక్స్రోడ్డుకు వచ్చి తిరిగి పోచంపల్లికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనబడక సడన్గా హ్యాండ్ బ్రేక్ వేసిండు. కారు పల్టీ కొట్టి చెరువులో బోల్తా పడింది. డోర్లు తెరుచుకోలేదు. ముందు సీట్లో ఉన్న నేను కారు సైడ్ అద్దాన్ని కాలితో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాను. డోర్లు తెరుచుకుని ఉంటే అంతా ఎలాగోలా బయటపడేవారు. – మణికంఠ యాదవ్, (ప్రాణాలతో బయటపడిన యువకుడు) రాత్రి 11 గంటల దాకా ఇంటివద్దే ›ఉన్నాడు మేం ముగ్గురం అన్నదమ్ములం. వంశీ రెండోవాడు. పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. రాత్రి 11 గంటల వరకు అంతా ఇంటి వద్దే ఉన్నారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఉదయం నేను జిమ్కు వెళ్తుంటే తెలిసినవారు మీ తమ్ముడు చనిపోయాడని, స్నాప్చాట్లో ఫొటోలు వచ్చాయని చెప్పడంతో చూసి షాక్ అయ్యాం. – తిగుళ్ల ఉదయ్కుమార్ (మృతుడు వంశీ సోదరుడు) -
ఐదుగురి ప్రాణాలు తీసిన.. నైట్ అవుట్ సరదా
-
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఐవరీకోస్ట్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
అబుజాన్: ఐవరీకోస్ట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య -
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ఉన్నట్టు సమాచారం. మృతులను హైదరాబాద్కు చెందిన వంశీగౌడ్, దినేష్, బాలు, హర్షబాబు, వినయ్గా గుర్తించారు. ప్రమాదం నుంచి మణికంఠ ఒక్కడే బయట పడ్డారు. ఈ ఘటనపై చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులందరూ మద్యం సేవించినట్టు చెప్పారు. రాత్రంతా పార్టీ చేసుకుని.. కారు నడిపినట్టు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా మద్యం సేవించినట్టు వెల్లడైంది. 57 పాయింట్స్ చూపించినట్టు చెప్పుకొచ్చారు. -
UP : ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. #UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ— ANI_HindiNews (@AHindinews) December 6, 2024కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. -
అదే జరిగితే.. బతుకులు ‘రోడ్డు’న పడవు!
‘‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. సినిమా డైలాగే కావొచ్చు.. ఇది అక్షర సత్యం. ఏదో ఒక పని మీద రోడ్ల మీదకొచ్చి.. ఇంటికి చేరుకునేలోపే ఛిద్రమవుతున్న బతుకులు ఎన్నో. మన దేశంలో ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది కూడా. తప్పేవరిదైనా.. శిక్ష మాత్రం ఆ కుటుంబాలకే పడుతోంది.ఇరుకు రోడ్లు మొదలుకుని.. గల్లీలు, టౌన్లలో, రద్దీగా ఉండే సిటీ రోడ్లపైన, విశాలమైన రహదారుల్లోనూ.. ప్రమాదాలనేవి సర్వసాధారణంగా మారాయి. మనదేశంలో ప్రతీరోజూ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలేవీ ఫలించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాంకేతికత’నే మరోసారి నమ్ముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏఐ.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(కృత్రిమ మేధస్సు). సోషల్ మీడియాలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగానే చూస్తున్నారు చాలామంది. కానీ, దాదాపు ప్రతీ రంగంలోనూ ఇప్పుడు దీని అవసరం పడుతోంది. ప్రపంచం అంతటా.. ఏఐ మీద కళ్లు చెదిరిపోయే రేంజ్లో బిజినెస్ నడుస్తోంది. కానీ, ఇలాంటి టెక్నాలజీ సాయంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తే ఎలా ఉంటుంది?.ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించేది ఏ దేశంలోనో తెలుసా?మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా రోడ్ల నిర్మాణం, వాటి రిపేర్ల కోసం అయిన ఖర్చు ఘనంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. పెరిగిన రద్దీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణ పద్దతుల(సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్) మీద వాహనదారుల్లో అవగాహన లేకపోవడం.. వీటితో పాటు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం, పేలవమైన రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు సరిపోకపోవడంలాంటివి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.2022లో.. అధికారిక గణాంకాల ప్రకారం 4,60,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మరణించగా.. 4,43,366 మంది గాయపడ్డారు.2023లో.. 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు.ఈ లెక్కల ఆధారంగా.. రోడ్డు ప్రమాదాలు 11 శాతం పెరిగితే.. మరణాలు దాదాపు 10 శాతం, గాయపడినవాళ్ల సంఖ్య 15 శాతం పెరుగుతూ వచ్చింది.అరికట్టడం ఎలా?సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI).. మహారాష్ట్ర నాగ్పూర్లో 2008 నుంచి 2021 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. దాదాపు 30 లక్షలకుపైగా జనాభా ఉన్న నాగ్పూర్లో.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడాదికి సగటున 200 మంది చనిపోతున్నారు. గాయపడేవాళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో ఇదే అధికమని తేలింది.ఈ అధ్యయనం ఆధారంగా.. సాంకేతికతకు ఇంజినీరింగ్ సొల్యూషన్స్ను జత చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించొచ్చని చెబుతున్నారు. అదెలాగంటే.. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ను రూపొందించడం. ఇందులోనే ఆడియో, వీడియో వ్యవస్థలను కూడా రూపొందించారు.ఎలాగంటే.. ఈ సిస్టమ్ను వాహనాల విండ్ షీల్డ్(ముందు ఉండే అద్దాలకు) అమర్చడం ద్వారా ముందు ఉన్న రోడ్లను పూర్తిగా స్కాన్ చేస్తుంది. ముందు ఏదైనా ముప్పు పొంచి ఉంటే గనుక.. ఆ ఆడియో లేదంటే వీడియో అలారమ్ ద్వారా వాహనం నడిపేవాళ్లను అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ప్రమాదాలను తృటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు, భారీ వాహనాలకే కాదు.. ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, వీధుల్లో తిరిగే జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది.ఆచరణలోకి వచ్చిందా?అవును.. నాగ్పూర్లోనే సెప్టెంబర్ 2021లో iRASTE ప్రాజెక్టు ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, తద్వారా కొందరి ప్రాణాలైనా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ వాహనాలను కాకుండా.. ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. నాగపూర్ అర్బన్-పెరి అర్బన్ రోడ్డు నెట్వర్క్లో నడిచే సుమారు 150 బస్సులకు ఏఐ టెక్నాలజీ కెమెరాలను అమర్చారు. కనీసం 2.5 సెకండ్ల తేడాతో ప్రమాదం జరిగే ముందు.. ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేసేవి. అలా.. రెండేళ్లకు పైగా ఈ పైలట్ ప్రాజెక్టును. బ్లాక్,గ్రే పాయింట్లుగా విభజించి పరిశీలించారు. ఫలితం ఇలా.. ఐఆర్ఏఎస్టీఈ ప్రాజెక్టు క్రమక్రమంగా మెరుగైన ఫలితం చూపించడం మొదలుపెట్టింది. సకాలంలో డ్రైవర్లు స్పందించడంతో ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగారు. అయితే ఇది 100కు వంద శాతం సక్సెస్ను(66%) ఇవ్వలేకపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య మాత్రం అంతేస్థాయిలో కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జులై 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య.. నాగ్పూర్ గ్రే స్పాట్స్లో డ్రైవర్లు సకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడగలిగారు. తద్వారా.. 36 మంది ప్రాణాలు నిలబడ్డాయి.మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది. 2018-2022 మధ్య తమిళనాడులో రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మరణాలు మాత్రం ఉత్తర ప్రదేశ్లో సంభవించాయి. 2021, 2022 సంవత్సరాల్లో 22,595.. 21,227 మంది మరణించారు. వీటిల్లో ఓవర్ స్పీడ్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి దేశంలో 2030నాటికల్లా.. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం(ప్రాణ, వాహన నష్టం) 50 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ఏఐ సంబంధిత వాహనాలను రోడ్లపైకి తేవాల్సిందేనంటున్నారు మేధావులు. ఇది ఒక తరహా ఆలోచన మాత్రమేనని.. మరిన్ని అవకాశాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నారు వాళ్లు. తద్వారా మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా చూడొచ్చని చెబుతున్నారు. -
వెంటాడిన మృత్యువు!
సాక్షి, సిటీబ్యూరో/లంగర్హౌస్: మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి లంగర్హౌస్లోని మిలటరీ వాటర్ ట్యాంక్ వద్ద చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తలు మోన ఠాకూర్, దినేష్ గిరిలను యాక్సిడెంట్స్ వెంటాడాయి. మోన కుటుంబంలో ఇద్దరు ప్రమాదాల బారినేపడి మృతి చెందగా..దినేష్ను రెండేళ్ల క్రితం ఓ ‘నిషా’చరుడు ఢీ కొట్టాడు. అప్పట్లో తీవ్రగాయాలతో బయటపడినా..ఇప్పుడు మరో మందుబాబు డ్రైవింగ్కు భార్యతో సహా అశువులుబాశారు. మోన ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, తల్లిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు బతికిపోయినా ఇప్పుడు... బంజారాహిల్స్కు చెందిన దినేష్ గిరికి, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడిపోయిన లంగర్హౌస్కు చెందిన మోన ఠాకూర్కు 2022లో వివాహం నిశ్చయమైంది. ఆ ఏడాది అక్టోబర్ 6న దినేష్ తన ద్విచక్ర వాహనంపై ట్యాంక్బండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లక్డీకాపూల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన పవన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. వాటిలో ఓ వాహనంపై ఉన్న దినేష్ కు ముఖం, తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డారు. అప్పటికీ వివిధ సర్జరీల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి ఏడు నెలలు పట్టింది. దీంతో మోనతో జరగాల్సిన పెళ్లి ఆలస్యమై... 2023 మే 25న ఒక్కటయ్యారు.ఆమె కుటుంబంలోనూ విషాదాలెన్నో... లంగర్హౌస్ పెన్షన్పురకు చెందిన మోన ఠాకూర్ కుటుంబంలోనూ విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఈమె తండ్రి భగవాన్ సింగ్ మొదటి భార్య ఇందిర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండో భార్య రత్నభాయికి పుట్టిన సంతానమే మోన. మొదటి భార్య కుమారుడు బచ్చన్ (మోన సవతి సోదరుడు) వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే వారు. 2007 మేలో తన సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం రాత్రి లంగర్హౌస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తతో సహా మోన కన్నుమూసింది. ఆ సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. సొంత తండ్రి వద్ద దొరకని ప్రేమ దినేష్ వద్ద... మోనకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ప్రేరణ శ్రీ (12) తొమ్మిదో తరగతి, ధ్రితి శ్రీ (9) ఐదో తరగతి చదువుతున్నారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో వీళ్లు అనాథలుగా మారారు. తమ సొంత తండ్రి నిత్యం గొడవలు పడేవాడని, తమను వేధించేవాడని ఈ చిన్నారులు చెబుతున్నారు. దినేష్ గిరి సవతి తండ్రి అయినప్పటికీ..సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడని చెప్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాము తల్లిదండ్రులతో కలిసి గడిచిన 18 నెలల్లో ఎన్నో సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడకు వెళ్లినా తమను తీసుకునే వెళ్లేవారని, అయితే పరీక్షల కారణంగా ఇటీవల గోవా వెళ్లలేకపోయామని చెప్తున్నారు. దీంతో గోవా నుంచి వచ్చిన రోజే తాము కోరడంతో ఆహారం తేవడానికి వెళ్లి కన్నుమూశారని బాధగా చెప్తున్నారు. ప్రణయ్ను పోలీసు కస్టడీకి కోరాంలంగర్హౌస్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు ప్రణయ్ను అరెస్టు చేశాం. ఆదివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి మత్తు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని, మద్యం మత్తులో ఏమి చేశానో తెలియదని చెబుతున్నాడు. స్నేహితులతో కాకుండా తాను ఒక్కడినే మద్యం తాగానని చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరాం. – కె.రఘుకుమార్, లంగర్హౌస్ ఇన్స్పెక్టర్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
పావుగంటలో ఇంటికి చేరతామనగా..
అబ్దుల్లాపూర్మెట్: మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న అక్కా తమ్ముడిని మృత్యువు కబళించింది. ఓఆర్ఆర్పై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లె గ్రామానికి చెందిన ఎరగదిండ్ల మనోజ్ (25) అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్కు చెందిన తన అక్క చల్లా పద్మ (31), బావ వెంకటేశ్, మేన కోడళ్లు గంగ, యమున, మేనల్లుడు చల్లా అర్జున్ను తీసుకుని సోమవారం ఉదయం వనపర్తి నుంచి కారులో కుంట్లూర్కు బయలుదేరాడు. మార్గమధ్యలో ఔటర్ రింగ్రోడ్డుపై కోహెడ –పెద్దఅంబర్పేట మార్గంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారుకు.. ముందు అతి వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. లారీలో కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో మనోజ్తో పాటు పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వానిరి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆసరా అవుతాడనుకుంటే ఆగం చేసిండు!
లింగాలఘణపురం: చేతికందిన కొడుకు ఆసరా అవుతాడని అనుకుంటే ఆగం చేసిండంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన గండి అంజయ్య, రేణుక దంపతుల కుమారుడు కల్యాణ్ (22) గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు దేవరాయ కరుణాకర్తో కలిసి గత నెల 25న భువనగిరి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంగపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కల్యాణ్కు తీవ్ర, కరుణాకర్కు స్వల్ప గాయాలు కాగా పోలీసులు హై దరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్ కోమాలోకి వెళ్లాడు. ఐదు రోజులు చికిత్స పొందినా ఫలితం లేదు. శనివారం రాత్రి మృతి చెందాడు. ఫ్యాషన్ షోలపై మక్కువకల్యాణ్కు ఫ్యాషన్ షోలపై మక్కువ. 2023లో సడఫ్ ప్యాషన్ షో అడిషన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్యాణ్ భువనగిరికి ఎందుకు వెళ్లాడో ఏమో తెలియదు. ప్రమాదంలో గాయపడ్డాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లారు. ఏదైనా పని చేసి తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి. తాము ఇష్టంగా కొనిచి్చన బైక్తో ప్రమాదం జరిగి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఎంత విషాదం.. తొలి పోస్టింగ్కు వెళుతూ యువ ఐపీఎస్ దుర్మరణం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్రూట్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల హర్ష్ బర్దన్ క్ణాటక కేడర్కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. సోమవారం తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు. డ్రైవర్కు స్పల్ప గాయాలయ్యాయి.మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్లో పోస్ట్ చేశాడు. -
ప్రాణాలు తీసిన ప్రమాదం
అందరూ 30 ఏళ్ల వయస్సు లోపువారే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నవారు. ఆమెరికా నుంచి వస్తున్న మేనమామను తీసుకొచ్చేందుకు వెళ్తూ ఒకరు.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న భార్య, తోడుగా వెళ్తున్న భర్త.. పొట్టకూటికోసం పనిచేసే డ్రైవర్.. అందరి ప్రాణాలను రోడ్డు ప్రమాదం గాలిలో కలిపేసింది. వారి కుటుంబాలకు కన్నీటిశోకాన్ని మిగిల్చింది. భోగాపురం/శ్రీకాకుళం క్రైమ్: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారి వద్ద శనివారం ఉదయం 8:12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఫార్చూనర్ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీకాకుళం నగరానికి చెందిన గవిడి కౌశిక్ (27), వడ్డి అభినవ్ (27), అతని భార్య మణిమాల (24)తో పాటు కారు డ్రైవర్ ఎం.జయే‹Ù(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నాలుగంటే నాలుగే క్షణాల్లో జరిగిపోయింది. ఫ్రంట్ బోనెట్ పై నుండే గ్లాస్, ఇంజిన్లే కాక స్పీడోమీటర్ రీడింగ్ ముక్కముక్కలైందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మేనమామ కోసం.. మృతుల్లో ఒకరైన గవిడి కౌశిక్ శ్రీకాకుళంలోని ఇందిరా జ్యుయలర్స్ యజమాని గవిడి వాసుదేవ్ కుమారుడు. బంగారు వ్యాపారి లంక బావాజీ నాయుడుకి మనుమడు. నాయుడు జ్యుయలర్స్ యజమాని లంక గాంధీ పెద్దకుమార్తె నిహారికతో కౌశిక్కు 2023లో వివాహమైంది. ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు. కౌశిక్ పిన్ని కుమారుడికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ శుభ కార్యానికి హాజరు కావడానికి కౌశిక్ మేనమామ బాలాజీ అమెరికా నుంచి శనివారం రానున్నారు. ఆయనను రిసీవ్ చేసుకోవడం కోసమే కౌశిక్ తన మామ గాంధీ కారులో విశాఖ బయలుదేరారు. పరీక్ష రాసేందుకు.. శ్రీకాకుళంలోనే లియో మెడికల్ ల్యాబ్ సెంటర్ నడుపుతున్న మన్మథరావు పెద్ద కుమారుడు వడ్డి అభినవ్ కౌశిక్కు మంచి స్నేహితుడు. అభినవ్కు నాలుగేళ్ల కిందట హిరమండలానికి చెందిన మణిమాలతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు మమకార్ ఉన్నాడు. మణిమాల బ్యాంక్ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నారు. ఆమెకు శనివారం విశాఖలో పరీక్ష ఉంది. దీంతో భార్యాభర్తలు కౌశిక్తో కలిసి కారులో విశాఖ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గురువారమే అభినవ్ పుట్టిన రోజు కూడా జరిగింది. జయేష్ డ్రైవర్గా.. ఏడాది కిందటే లంక గాంధీ ఫార్చూనర్ కారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎం.జయేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనితో కలిసే కౌశిక్, అభినవ్, మణిమాల విశాఖ బయల్దేరారు. జయేష్ తండ్రి మరణించడంతో తల్లి, చెల్లితో కలిసి శ్రీకాకుళానికి అనుసరించి ఉన్న కుశాలపురంలో ఉంటున్నారు. వీరి స్థిర నివాసం కృష్ణాపార్కు వద్ద సున్నపువీధి. తల్లి టీకొట్టు నడుపుతుండగా జయేష్కు డ్రైవింగ్ రావడంతో స్థానిక ట్రావెల్స్లో కొన్నాళ్లు పనిచేసి ఇటీవలే గాంధీ వద్ద డ్రైవర్గా చేరారు. జయేష్ చనిపోవడంతో ఇప్పుడు వారి కుటుంబానికి ఆధారం పోయింది. ప్రమాదం జరిగిందిలా..? శనివారం ఉదయం వీరు కారులో విశాఖ బయల్దేరారు. అప్పటికే చినుకులు పడుతుండడంతో రోడ్డు తడిగా ఉంది. నాతవలస టోల్గేట్ దాటిన తర్వాత సుందరపేట వద్ద కారు నిలిపి టీ తాగారు. టీ తాగి బయల్దేరిన నిమిషాల వ్యవధిలోనే భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే రహదారిపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో నిండిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్నుక్రమబద్ధీకరించారు. కౌశిక్ బాబాయ్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎన్.వి.ప్రభాకర్ తెలిపారు. మూడేళ్ల కిందట... పోలిపల్లి వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడేళ్ల కిందట ఇదే ప్రాంతం వద్ద తీర్థయాత్ర బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనకాలే వచ్చిన మరో వాహనం బస్సును ఢీకొట్టడంతో 39 మంది యాత్రికుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరచిపోకముందే మళ్లీ రోడ్డు ప్రమాదంలో అదే స్థలంలో నలుగురు మృతిచెందారంటూ స్థానికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. -
అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లయిన నెల రోజులకే అనంత లోకాలకు..
ఉక్కునగరం: పెళ్లయిన నెల రోజులకే ఒక యువకుడికి నిండు నూరేళ్లు నిండి పోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ దరి ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్కుమార్(31) పరవాడ ఫార్మాసిటీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం దరి శాతావాహన నగర్లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలస రూపేష్కుమార్(21) హైదరాబాద్లో సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7.50 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బైక్పై స్టీల్ప్లాంట్ ప్రధాన మార్గంలో కణితి జంక్షన్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కూర్మన్నపాలెం నుంచి కణితి జంక్షన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బైక్ను సుమారు 30 మీటర్లు ఈడ్చుకుపోయింది. ఇద్దరిపై ఆర్టీసీ బస్సు టైర్లు ఎక్కడంతో.. వీరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పవన్ కుమార్ బంధువులు అక్కడకు చేరుకుని రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పవన్కుమార్కు గత నెల 26న వివాహమైంది. మరికొన్ని రోజుల్లో భార్యను తీసుకువచ్చేందుకు చూస్తున్న ఈ సమయంలో ఇలా జరిగిందంటూ అతని అక్క కన్నీటి పర్యంతమైంది. రూపేష్కుమార్ ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న స్టీల్ప్లాంట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు లొంగిపోయాడు. పోస్ట్మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
ఆటో స్టీరింగ్పై సెల్ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ..
లంగర్హౌస్: ఆటో స్టీరింగ్పై సెల్ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. వీరు ఇబ్రహీంబాగ్లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్హౌస్ బాపునగర్లోని పీఎస్ఆర్ హాస్టల్లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్పై సెల్ఫోన్లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఒకరి వెంట ఒకరు.. మృత్యుఒడికి
వెల్గటూర్(ధర్మపురి): ఆ ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. కలిసే చదువుకున్నారు, ఆడుకున్నారు.. చివరికి మృత్యువులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు.. వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి అనుబంధ గ్రామం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ముగ్గురి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం రోజే ఒకరు, ఆ తర్వాత రోజు విడిచి రోజు మరో ఇద్దరు చనిపోవడంతో స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కుక్కలగూడూర్కు చెందిన నల్లపు అవినాశ్(19), బడుగు సాగర్(19), కుదిరె సాగర్(18) మంచి స్నేహితులు. గత శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బైక్పై ధర్మపురి మండలంలోని రాయపట్నం వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్గటూర్ మండలంలోని కొత్తపల్లి స్టేజి వద్ద 7వ నంబర్ రాష్ట్ర రహదారిపై ఎదురుగా ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురికీ తల పగిలి, తీవ్ర గాయాలయ్యాయి. అవినాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మిగతా ఇద్దరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బడుగు సాగర్ ఆదివారం, కదిరె సాగర్ మంగళవారం చనిపోయారు.అందరివీ పేద కుటుంబాలే..బడుగు రవికి ఒక కూతురు, కొడుకు సాగర్ సంతానం. సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కదిరె గట్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిద్దరివి వ్యవసాయ కుటుంబాలు. నల్లపు తిరుపతికి ఒక కూతురు, కుమారుడు అవినాశ్ ఉన్నారు. అవినాశ్ ఇంటర్ పూర్తి చేశాడు. తిరుపతి మద్యానికి బానిసై, కుటుంబాన్ని పట్టించుకోడు. అవినాశ్ తొలుత పెట్రోల్ బంకులో పని చేశాడు. ప్రస్తుతం టెంట్హౌస్లో పనిచేస్తూ తల్లి, అక్కను పోషిస్తున్నాడు. చేతికందిన కుమారులు తమకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరివీ పేద కుటుంబాలేనని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు..ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి నుంచి రాయపట్నం వరకు ఉన్న రోడ్డు(15 కి.మీ.)పై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గడిచిన రెండేళ్లలో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయి. మరమ్మతు చేయకపోగా కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు. గ్రామ కూడళ్లలో వీధి దీపాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికా రులు స్పందించి, రోడ్డుకు మరమ్మతు చేయించా లని ప్రజలు కోరుతున్నారు.