సాక్షి, మహబూబ్నగర్: హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి 44 పై బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్ నుంచి వనపర్తి జిల్లా వైపుగా వస్తున్న బస్సు రంగాపూర్ వద్ద ప్రమాదావశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 లో దగ్గరలో గల ఆసుపత్రికి తరలించారు.
అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


