breaking news
Mahabubnagar District Latest News
-
గణపతి కోసం బంకమట్టి తెచ్చేందుకు వెళ్లి..
మిడ్జిల్: వినాయక విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకుందామని అన్నతో కలిసి చెరువుకు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. త మ్ముడు నీటిలో మునగడాన్ని గమనించిన అన్న వెంటనే అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన కావలి లక్ష్మయ్య, కళావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నరేందర్, చిన్న కుమారుడు సాయితేజ (11). వినాయక చవితి సందర్భంగా విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకోవాలని ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లారు. ముందుగా సాయితేజ నీటిలోకి దిగి మట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు లోతులోకి జారిపోయి నీట మునిగాడు. తమ్ముడిని కాపాడేందుకు నరేందర్ వెంటనే నీటిలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా సాయితేజను రక్షించలేకపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నరేందర్ గ్రామంలోకి పరుగెత్తుకెళ్లి విషయాన్ని చెప్పి, ఇతరులను వెంటబెట్టుకుని చెరువు వద్దకు వచ్చేలోపే సాయితేజ మృతి చెందాడు. విగ్రహం తయారు చేయాలన్న చిన్నారి ఆశ.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పండుగ వేళ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదన గ్రామ స్తులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సాయితేజ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చెరువులో మునిగి బాలుడి మృత్యువాత తమ్ముడిని కాపాడేందుకు అన్న విశ్వప్రయత్నం.. అయినా దక్కని ఫలితం వినాయక చవితి వేళ కొత్తపల్లిలో విషాదం -
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుంది
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ముందు హైవేపై ఏర్పడిన గుంతలను ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులు శ్రమదానంతో పూడ్చారు. గత కొన్ని రోజులుగా గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో సమీపంలోని మట్టిని గంపలతో తీసుకొచ్చి గుంతల్లో పోశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గాలెన్న మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత, రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. శ్రమదానంలో విద్యార్థులు భరత్బాబు, బుగ్గేష్, ఆంజనేయులు, పవన్, యాదగిరి, ఉదయ్, మహే ష్, రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో ప్రజాపాలన వేడుకలు పాలమూరు యూనివర్సిటీలో ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలను నేటితరం యువత గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత, విద్యావేత్తలు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. పీయూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు కరుణాకర్రెడ్డి, భూమయ్య, ఈశ్వర్కుమార్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి స్టేషన్ మహబూబ్నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచంలో అభివృద్ధిలో భారతదేశం ముందుకు పోతున్నదని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ అన్నారు. నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని అమావాస్య అన్నదాన మండపం వద్ద జ్యోతి వెలిగించారు. రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతూ జ్యోతి వెలిగించి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు నర్సింహరావు, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురాంగౌడ్, మహిళా అధ్యక్షురాలు గీత, బాలప్రసాద్, శ్రీను, దశరథ్, కొండల్ పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి అచ్చంపేట రూరల్: అనుమానస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని సింగారంలో చోటు చేసుకుంది. సిద్దాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి బాల్నారి(63) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సా గిస్తున్నాడు. బాల్నారికి ఇద్దరు భార్యలు ఉన్నా రని పేర్కొన్నారు. మొదటి భార్య సాయిలమ్మ, కుమారుడు వెంకటయ్య, కోడలు, కుమార్తెలు బాలమ్మ, సైదమ్మ ఉన్నారు. రెండో భార్య కృష్ణమ్మ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీస్స్టేషన్ హెచ్సీ గౌతమ్ తెలిపారు. -
అత్యవసరమైతే అవస్థలే!
జనరల్ ఆస్పత్రిలో సరిపడా పడకలు లేక వైద్యం కోసం ఎదురుచూస్తున్న రోగులు ‘గద్వాల జిల్లాకు చెందిన బుడ్డమ్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అక్కడి నుంచి ప్రైవేట్ అంబులెన్స్లో గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ మెరుగైన చికిత్స పేరుతో స్థానిక వైద్యులు గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. నిరుపేదలు అయిన బాధితులు గద్వాల నుంచి మహబూబ్నగర్కు రావడానికి రూ.3 వేలు, ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి మరో రూ.3,500 అంబులెన్స్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన ఒక రైతుకు ఇటీవల పాముకాటుకు గురై చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితి విష మంగా ఉండటంతో అత్యవసర సేవలు అందించాల్సి వచ్చింది. ఐసీయూ విభాగానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయగా అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న 30 పడకలకు 30 వెంటిలేటర్స్ అమర్చాం. అత్యవసర వైద్యానికి రోగుల సంఖ్య అధికంగా పెరిగింది. పడకలు ఏర్పాటు చేయడానికి ఉన్న వెంటిలేటర్స్ అందుబాటులో లేవు. కరోనా సమయంలో వచ్చిన వెంటిలేటర్స్ పని చేయడం లేదు. కొత్త భవనంలో 100 పడకల ఐసీయూ విభాగం ఏర్పాటు చేశాం. ఈ ఏడాది నవంబర్ నాటికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్ -
జూరాల ఆయకట్టుకు నీటిగండం
జూరాల ప్రధాన కాల్వకు నిలిచిన నీటి సరఫరా అమరచింత: జూరాల ప్రాజెక్టుకు పూర్తిగా ఇన్ఫ్లో నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి గండం ఏర్పడింది. ఎగువన నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడం, వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు ప్రధానం కుడి, ఎడమ కాల్వలకు గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారు. గతంలో కాల్వకు 4 రోజుల పాటు నీటిని వదిలి మిగిలిన 3 రోజులు నిలిపేస్తూ వారబందీ ద్వారా సాగునీటిని ఆయకట్టుకు ఇస్తారని అనుకున్న రైతన్న ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు చుక్కనీటిని కాల్వలకు వదలమని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 5 టీఎంసీలు మాత్రమే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.222 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో కేవలం తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు, ఎత్తిపోతలకు నీటి సరఫరా పూర్తిస్థాయిలో నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 200 క్యూసెక్కుల వరద మాత్రమే చేరుకుంటుందని అధికారులు తెలిపారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్సాగర్, నెట్టెంపాడ్, పవర్హౌజ్లకు నీటిని నిలిపివేశారు. దీంతో జూరాల ఆయకట్టులో ఈసారి కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరి రైతుల ఆందోళన.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలతో ఈసారి 5 లక్షల ఎకరాల మేరకు వరి పంట సాగు చేపట్టారు. ప్రతి ఏడాది వేసవిలో మాత్రమే సాగునీటి కష్టాలను ఎదుర్కొనే ఆయకట్టు రైతులకు వారబందీతో అతికష్టం మీద సాగునీటిని అందించే యత్నం చేసేవారు. వర్షాలు కురవడం లేదని ఎల్నినో ప్రభావం ఉందని ఆయకట్టులో వరి పంటను సాగుచేసుకోవద్దని అధికారులు రైతులకు ముందస్తు సమాచారం అందించారు. అయినా రైతులు మాత్రం జూరాలకు ఎగువ నుంచి వరద వచ్చి ముందుకు వెళ్తోందని తమ పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలంటూ వరి పంటలను సాగుచేయడంతో అసలు సమస్య మొదలైంది. అసలు వారబందీ ఉందా లేదా అనే విషయాన్ని ప్రాజెక్టు ఎస్ఈ చంద్రశేఖర్ను వివరణ అడగ్గా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాల్వలకు నీటి విడుదలను నిలిపేసినట్లు తెలియజేశారు. ఇంకా వారబందీపై ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటి అవసరాల మేరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు నిలిపేసిన సాగునీరు వరదలొస్తేనే విడుదలంటున్న అధికారులు ఆందోళనలో అన్నదాతలు -
మూడు నెలల్లో ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య
పాలమూరు: ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో సరిపడా పడకలు లేకపోవడంతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి స్థాయికి ఎదిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిత్యం ఓపీ, ఐపీ క్రమంగా పెరుగుతున్నా.. ఐసీయూలో పడకలు పెంచకపోవడంతో ప్రతి రోజు ఐదు నుంచి పది మంది రోగులు పడకల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు స్థానికంగా కన్పిస్తున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 900 పడకలు ఉన్న జనరల్ ఆస్పత్రిలో 650 పడకల్లో రోగులు అడ్మిట్ అవుతున్నారు. దీంట్లో 30 పడకలతో ఐసీయూ విభాగం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి పాముకాటు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పక్షవాతం, ఇలా పరిస్థితి విషమంగా ఉన్న రోగులను వెంటిలేటర్ సహాయం కోసం ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 30 పడకలు ఏమాత్రం సరిపోవడం లేదు. బెడ్ ఎప్పుడు ఖాళీ అవుతుందని నిత్యం ఇతర రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. రోగులపై ఆర్థిక భారం ప్రస్తుతం రోగుల తాకిడి దృష్ట్యా కనీసం 60 పడకలతో ఐసీయూలో సేవలందిస్తే రోగులకు లబ్ధి జరగనుంది. నిత్యం ఐసీయూ విభాగానికి 10 నుంచి 20 కేసులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొత్తకోట, కోస్గి, ఇతర ప్రాంతాల నుంచి రోగులు వస్తుండగా.. అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన వారికి ఐసీయూ విభాగానికి సిఫారసు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అక్కడ సరిపడా బెడ్లు లేక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు, హైదరాబాద్కు పరుగులు తీయాల్సి వస్తోంది. దీంతో పేద రోగులకు ఆర్థిక భారం పడుతుంది. అత్యవసరంగా మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహకులు రూ.3,500నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. కరోనా సమయంలో.. జిల్లా జనరల్ ఆస్పత్రికి కరోనా సమయంలో దాదాపు 30 వెంటిలేటర్ మిషన్లు వచ్చాయి. దీంట్లో కొన్నింటిని ప్రస్తుత ఐసీయూ విభాగంలోని పడకలకు అమర్చారు. మిగిలిన 15 వెంటిలేటర్లను మూలకు పడేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల నుంచి అవి నిరుపయోగం ఉండటంతో మిషన్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసిన కొనుగోలు చేసిన మిషన్లు పేదలకు పనికిరాకుండా పోయాయి. నెల రోగులు జూన్ 350 జూలై 361 ఆగస్టు 391 30 ఐసీయూ పడకలతోనే నెట్లుకొస్తున్న వైనం రోజూ 10 నుంచి 20 అత్యవసర కేసులు వెంటిలేటర్ మిషన్లు ఉన్న పడకలు పెంచని అధికారులు -
జింక్ బియ్యంతో పోషకాహార రక్షణ
● అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం మదనాపురం: చిన్నారుల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని నివారించి, వారిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బయోఫోర్టిఫైడ్ (జీవ రసాయన పోషకాలు పెంచిన) వరి రకాలు ఎంతగానో దోహదపడతా యని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. పోష ణ్ మాహ్ (పోషకాహార మాసం)ను పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో జింక్ సమృద్ధిగా ఉండే డీఆర్ఆర్, డీహెచ్ఏఎన్ 48, డీఆర్ఆర్, డీహెచ్ఏఎన్ 63 వరి రకాలపై అవగాహన, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఫామ్ టు ఫుడ్ విధానమే మార్గం.. సీనీయర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతుస్థాయిలో నాణ్యమైన పోషకాలు కలిగిన పంటలను పండించి, వాటిని నేరుగా ఆహారంలో భాగంగా మార్చే విధానం అత్యంత ప్రాధాన్యమైందని తెలిపారు. వ్యవసాయం, ఆహారం, పోషకాహార భద్రతల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లుల్లో పోషకాహార చైతన్యాన్ని పెంచాలని కోరారు. 90 రోజుల పైలెట్ ప్రాజెక్ట్.. హోమ్ సైన్న్స్ నిపుణురాలు డాక్టర్ అనిత మాట్లాడుతూ.. జిల్లాలోని 18 ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 200 మంది ప్రీ స్కూల్ చిన్నారులకు 90 రోజుల పాటు రోజువారీ ఆహారంలో జింక్ బియ్యాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పిల్లల్లో సూక్ష్మ పోషకాహార లోపాలు తొలగి, శారీరక పెరుగుదల మెరుగుపడుతుందన్నారు. శాస్త్రవేత్తల బృందం (డా.సాయిప్రసాద్, డా. నీరజ, డా.అమ్తుల్వారిస్, డా.అరవింద్ కుమార్, డా.జ్యోతిబద్రి) మా ట్లాడుతూ.. శరీరంలో సాధారణ ఎదుగుదల, మానసిక వికాసం, వ్యాధి నిరోఽ దక శక్తి పెంపొందడానికి జింక్ అత్యంత కీలకమైన సూక్ష్మపోషకమని వివరించారు. సాధా రణ బియ్యంలో కంటే బయోఫోర్టిఫైడ్ రకాల్లో జింక్ శాతాన్ని శాసీ్త్రయంగా పెంచామని, రోజు వారీ సమతుల్య ఆహారంతో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని పేర్కొన్నారు. అనంతరం 18 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా జింక్ బియ్యం బస్తాలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో వన పర్తి జిల్లా సంక్షేమ అధికారిణి సుధారాణి, సీడీపీఓలు షేక్ సన్హేరా, రాజ్యలక్ష్మి, అమృతమ్మ, కేవీకే విస్తరణ అధికారులు, నిపుణురాలు డా. భవాని, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు. -
‘అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు భూములు ఇవ్వం’
● అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు రైతుల వినతి గట్టు : ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూములను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రాయాపురం రైతులు తెలిపారు. ఈ మేరకు గురువారం గద్వాలలో అదనపు కలెక్టర్ మదుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావును కలసి వినతిపత్రం అందజేశారు. బుధవారం గిర్దారర్, జీపీఓలు రాయాపురం గ్రామానికి చేరుకుని సర్వే నెంబర్ 83లో గట్టు నుంచి గద్వాలకు వెళ్లే మార్గంలో దేవరగట్టు దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్న 50 ఎకరాలకు సంబంధించిన భూములను పరిశీలించినట్లు రైతులు తెలిపారు. 60 ఏళ్లుగా ఈ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అగ్రికలర్చ్ రీసెర్చ్ సెంటర్ కోసమంటూ భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు వాపోయారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తమ భూములను లాక్కొని రోడ్డున పడేయొద్దని అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు విన్నంచారు. కార్యక్రమంలో రైతులు సాలెకర్రెప్ప, నర్సింహులు, పరుశరాముడు, గొవిందు, పాగుంటప్ప, తిమ్మప్ప,మారెప్ప, వీరేష్, బస్వరాజు పాల్గొన్నారు. -
ప్రాణం కోసం అరగంట పోరాటం
కల్వకుర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కారులోనే అరగంట పాటు ప్రాణాలతో పోరాడి.. బయటకు తీసే సమయానికే తుది శ్వాస విడిచారు. ప్రమాద స్థలంలో కళ్లుతెరిచి చూస్తున్న ఆమెను బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన అరుణ(57), ఆమె భర్త రాజేందర్రెడ్డి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కోదాడ–రాయచూరు హైవేపై కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే కారు టిప్పర్ను ఢీకొంది. ప్రమాదంలో అరుణ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అరుణ కళ్లుతెరిచి చూస్తుండటంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. కారు ధ్వంసమై ఉండటంతో సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు, బంధువులు జేసీబీని తీసుకొచ్చారు. కారులో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలోనే అరుణ తుది శ్వాస విడిచారు. కాగా..అచ్చంపేటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అరుణ శుక్రవారం పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో రాత్రి భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంలో రాజేందర్రెడ్డికి కాలికి గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ● కారులో చిక్కుకుని విలవిల్లాడిన ఉపాధ్యాయురాలు.. ● బయటకు తీసేలోపే తుదిశ్వాస ● కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో రోడ్డు ప్రమాదం -
‘పాలమూరు’ మొదటి పంపు నుంచి నీటి విడుదల
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు గ్రామ శివారు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు మొదటి పంపు ద్వారా గురువారం అధికారులు నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ లోకిలాల్ మాట్లాడుతూ ప్యారామీటర్ చెక్ చేసుకోవడంలో భాగంగా 2 గంటలపాటు నీటిని విడుదల చేసి.. మరోసారి మోటార్ను చెక్ చేసుకున్నామని చెప్పారు. వచ్చే వారం నుంచి రిజర్వాయర్లోకి నీటిని నిరంతరాయంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాపాలనలో ప్రగతిబాట
నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక రోజు సెప్టెంబర్ 17 ● జిల్లాలో రైతుభరోసా కింద 2.12 లక్షల మందికి రూ.818.22 కోట్లు జమ ● ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నాం ● సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ● ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిజాం రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలనలో పారదర్శకత, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్యారంటీల అమలు.. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3.81 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా రూ.185.60 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,27,056 మంది వినియోగదారులకు 4.13లక్షల సిలిండర్లు అందించగా రూ. 11.35 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గృహ జ్యోతి కింద 1,37,046 జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసి రూ.107.77కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పా రు. ఆరోగ్యశ్రీ కింద 50,314 మంది లబ్ధి పొందగా రూ.145.79 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ● జిల్లాలో 10,232 ఇళ్లకు రూ.511.60 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో 3,302 ఇళ్లు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లకు రూ.240.97 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు, 500 ఇళ్ల పైకప్పుల మార్పునకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుకు భరోసా.. రైతుభరోసా కింద 2,12,153 మంది రైతులకు రూ.818.22 కోట్లు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. 2024 పంట రుణమాఫీలో 76,385 మంది రైతులకు రూ.597.05 కోట్ల రు ణమాఫీ చేసినట్లు చెప్పా రు. రైతుబీమా కింద 1,855 మంది రైతుల నామినీలకు రూ.92.75 కోట్లు అందించామన్నా రు. వానాకాలం 2026–27లో 2,97,203 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. ఆయిల్పామ్ విస్తరణకు 1,302ఎకరాలకు, సూక్ష్మ సేద్యానికి 769.75 ఎకరా లకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ● భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శక సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో 6,545 అర్జీలు, 3,840 సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన 2,006 దరఖాస్తుల్లో 1,747 పరిష్కరించగా 259 పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చిన 742 దరఖాస్తుల్లో 666 పరిష్కరించామని తెలిపారు. ఆరోగ్యం, రహదారులు.. జిల్లాలో 17 పీహెచ్సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక సివిల్ ఆస్పత్రి, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 46,950 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రంగారెడ్డిగూడ–రాజాపూర్ రహదారి విస్తరణకు రూ.30 కోట్లు, నవాబ్పేట–తిరుమలాపూర్ రహదారికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కురుమూర్తి స్వామి ఆలయం, చిన్నచింతకుంట ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్కు రూ.110 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పర్యాటకం, తాగునీరు.. వన మహోత్సవంలో 50.82 లక్షల లక్ష్యానికి 37.99 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. పిల్లలమర్రిని టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. కోయిల్సాగర్ అభివృద్ధికి రూ.9.5 కోట్లు, పిల్లలమర్రికి రూ.2.5 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 1,697 కి.మీ. పైప్లైన్ నెట్వర్క్తో 1,50,056 ఇళ్లకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. 423 గ్రామ పంచాయతీలు, 109 మున్సిపల్ వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాం. ఉద్యోగ మేళాలో 78 కంపెనీలు పాల్గొని 3,126 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 828 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందించాయి. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీ ఖాతాల్లో రూ.57.89 కోట్లు జమ చేశాం. కోయిల్సాగర్, కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు అవసరమైన 12,370 ఎకరాల్లో 11,150 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. – మంత్రి జూపల్లి కృష్ణారావుజాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం సెల్యూట్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, మేయర్ మమత, కార్పొరేషన్చైర్మన్ కొత్వాల్, తదితరులువిద్యకు ప్రాధాన్యం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని జూపల్లి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 642 పాఠశాలల్లో పనులు ప్రారంభించి 585 చోట్ల పూర్తి చేసినట్లు చెప్పారు. 76 పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు ప్రారంభించామని, పెద్దయిపల్లిలో నవోదయ విద్యాలయం మంజూరైందని తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు మంజూరైనట్లు చెప్పారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రజా పాలన దినోత్సవంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా సహకారం అవసరమని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, నగర మేయర్ మమత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, డీఆర్ఓ నిర్మల, ఏఓ సువర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాలు, సబ్ప్లాన్ నిధుల వినియోగం, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీల ఆవాస ప్రాంతాల్లో వారి సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని సూచించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతర్ కుల వివాహ ప్రోత్సాహకం, భూమి కొనుగోలు తదితర పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అర్హులకు అవగాహన కల్పించాలన్నారు. మూఢనమ్మకాలను వీడి విద్య, ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి అనుసూచిత్ అభ్యుదయ యోజన కింద భూమి పొందిన లబ్ధిదారులకు బోర్లు, పంపుసెట్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నిర్వహించి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మెప్మా, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులకు అమలవుతున్న బీమా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.పెండింగ్ అంశాలపై నివేదికలు పంపితే సెప్టెంబర్ 22న సీఎంతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, డీఆర్వో నిర్మల, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సునీత, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించొద్దు సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి రోస్టర్, రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా?
పాలమూరు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గణనాథుల నిమజ్జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న నిమజ్జనానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్ చుట్టుపక్కల చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో భారీ విగ్రహాల నిమజ్జనంపై ఆందోళన నెలకొంది. దీంతో కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో చిన్న విగ్రహాల కోసం కృత్రిమ చెరువులు (బేబీ పాండ్స్) ఏర్పాటు చేస్తున్నారు. పదేళ్ల కిందట ఇదే తరహాలో ఎదురైన సమస్య మళ్లీ తలెత్తింది. 1,945 విగ్రహాలకు అధికారిక అనుమతులు జిల్లాలోని 16 పోలీస్స్టేషన్ల పరిధిలో గణనాథుల ఏర్పాటుకు 2,067 దరఖాస్తులు రాగా.. 1,945 విగ్రహాలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. మరోవైపు అనుమతులు అవసరం లేని మూడు అడుగుల లోపు విగ్రహాలు సుమారు 15 వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటన్నింటికీ నిమజ్జనానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్, హన్వాడ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి నీటి లభ్యత కొంత మెరుగ్గా ఉండగా.. మహబూబ్నగర్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాల నిమజ్జనమే ప్రధాన సమస్యగా మారనుంది. బీచుపల్లికి బదులు స్థానికంగా.. మహబూబ్నగర్ నగరంలోని భారీ గణనాథులను ప్రతిసారీ బీచుపల్లికి తరలించి నిమజ్జనం చేసేవారు. అయితే ఈసారి కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో స్థానికంగా ఉన్న చెరువుల్లోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హన్వాడ, పెద్దదర్పల్లి చెరువుల్లో కొంత నీరు ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస కాలనీ, పాలకొండ చెరువుల్లోనూ నీరు అందుబాటులో ఉండటంతో కొన్ని విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవరకద్రలోని పెద్ద చెరువులోనూ నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. జడ్చర్లలో దుందుబీ వాగు పరిధిలోని క్వారీల్లో నిలిచిన నీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బేబీ పాండ్స్ ఏర్పాటు చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూ ర్ మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్నగర్లో పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.5 లక్షలతో బేబీ పాండ్ నిర్మించారు. 38 అడుగు ల పొడవు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఇందులో సుమారు లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయనున్నారు. మూడు అడుగుల లోపు విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేయనున్నారు. ● అప్పన్నపల్లి శివారులోని గంగోస్కుంట ఆవరణలో మరో రెండు బేబీ పాండ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.8.50 లక్షలతో ఒక్కొక్కటి 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సుమారు రెండు లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు అడుగుల లోపు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. ● జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఒకటి, హౌసింగ్బోర్డు కాలనీలో ఒకటి, బీసీ వసతిగృహం సమీపంలో మరొకటి బేబీ పాండ్ ఏర్పాటు చేస్తున్నారు. – దేవరకద్ర మున్సిపాలిటీలో స్టేషన్ రోడ్లోని చర్చి సమీపంలో, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ తండాలోనూ ఒక బేబీ పాండ్ నిర్మిస్తున్నారు. జూరాల నుంచి నీరు విడుదల చేయాలి భారీ విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. నిమజ్జనానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నీటి లభ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. కృత్రిమ కుంటల్లోనే వినాయక నిమజ్జనం: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమకు సమీపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ బేబీ కుంటలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. చిన్న, మధ్య తరహా విగ్రహాలను ఆయా కుంటల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు చెరువులు, కుంటలు ఎండిపోవడంతో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో కృత్రిమ కుంటలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ వీటిని వినియోగించుకోవాలని, తద్వారా నీటి కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. 23న జిల్లాలో గణపతి నిమజ్జనం మహబూబ్నగర్ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఎండిపోవడంతో ఇబ్బందులు కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులు 5 అడుగుల లోపు విగ్రహాలకు స్థానికంగానే నిమజ్జన ఏర్పాట్లు జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి -
నిధులను సక్రమంగా వినియోగించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న పీఎంశ్రీ నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించి, నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, విద్యా సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రశస్త్కు సంబంధించిన వీడియోలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరూ వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్వచ్ఛ విద్యాలయ రేటింగ్స్ వివరాలను యాప్లో క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్ సీడింగ్ పూర్తితో పాటు అపార్ ఐడీలను జనరేట్ చేయాలన్నారు. ప్రతి పాఠశాలను డ్రగ్ ఫ్రీ క్యాంపస్గా ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు. -
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పార్టీని బూత్స్థాయి నుంచి గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయి వరకు బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు. బీజేపీ వస్తే అధికారికంగా విమోచన దినం పాలమూరు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అనేక పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మజారెడ్డి, అంజయ్య, వీర బ్రహ్మచారి, బాలరాజు, కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు రమేష్, పాండురంగారెడ్డి, మర్రిజ్యోతి, రాజు, హరికృష్ణ పాల్గొన్నారు. ● ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో గురు వారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు ఆశీస్సుల దీపం కార్యక్రమం సందర్భంగా ఇళ్లపై దీపాలు వెలిగించారు. 24 నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అండర్–14, అండర్–17 విభాగాలకు సంబంధించి ఈనెల 24వ తేదీన వాలీబాల్, 25వ తేదీన కబడ్డీ బాలబాలికల, 26న ఖోఖో బాలబాలికల మహబూబ్నగర్ జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలాల జట్లు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9948787711 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
జాతీయ ఉత్తమ పోలీస్స్టేషన్ రేసులో కోయిలకొండ
మహబూబ్నగర్ క్రైం: దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్స్టేషన్లను గుర్తించేందుకు కేంద్ర స్థాయిలో నిర్వహించే వార్షిక సర్వేకు మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ పోలీస్స్టేషన్ షార్ట్లిస్ట్ అయింది. ఇందులో భాగంగా ట్రాన్సురురల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సర్వే అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ బుధవారం కోయిలకొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని మౌలిక వసతులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారం, పోలీసుల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ సీఐ బి.గాంధీనాయక్, కోయిలకొండ ఎస్ఐ ఎ.నాగరాజు సర్వే అధికారికి స్వాగతం పలికారు. కాల్వలో పడి మత్స్యకారుడు మృతి కొల్లాపూర్ రూరల్: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారు డు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జవాయిపల్లి చెరువుకు సాగునీరు వెళ్లే ప్రధాన కాల్వలో చో టుచేసుకుంది. సర్పంచ్ తెలుగు యాదన్నగౌడ్, బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెలుగు కృష్ణయ్య (39) బుధవారం తెల్లవారుజామున సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్ నుంచి జవాయిపల్లి గ్రామ చెరువుకు నీరు వెళ్లే ప్రధాన కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఎక్కువ సాగునీరు విడుదల చేయడం వల్ల ఆ తాకిడికి ఈ ప్రమాదం జరిగుండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ యాదన్నగౌడ్ విజ్ఞప్తి చేశారు. జొన్న మిషన్లో ఇరుక్కుని తెగిన రైతు కాలు మహబూబ్నగర్ క్రైం: జొన్నలు పట్టే మిషన్లో కంకులు వేస్తున్న క్రమంలో రైతు కాలు ప్రమాదవశాత్తు మిషన్లో తెగిపడిన ఘటన చోటు కుంది. వివరాలు.. కోయిలకొండ మండలంలోని కళ్యాన్నగర్తండాకు చెందిన రైతు ఉమ్లానాయక్ బుధవారం పొలంలో జొన్న కంకులు మిషన్లో వేస్తుండగా.. అతడి కాలు మిషన్లో ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో అతడి మోకాలు వరకు తెగిపోయింది. స్థానికులు క్షతగాత్రుడిని 108లో జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. అనుమానాస్పద మృతి.. కేసు నమోదు వెల్దండ: మండల పరిధిలోని తిమ్మినోనిపల్లికి చెందిన కడమంచి అలివేలు (30) అనే వివాహిత అనుమానాస్పద మృతిపై తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగందర్రెడ్డి తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలంకు కల్వకుర్తి తిమ్మరాశిపల్లికి చెందిన అలివేలుకు 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సదరు మహిళ మంగళవారం రాత్రి గ్రామంలోని వినాయకుడి వద్దకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ఇంటి సమీపంలో పడిపోయింది. గమనించిన గ్రామస్తులు భర్తకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త శ్రీశైలంతో పాటు కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ శారదా హరికిషన్ రూ.5వేలు అలాగే బీఆర్ఎస్ నాయకులు గండికోట రాజు రూ.2వేలు, ఉప్పట ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. -
ఉల్లి ధర మండుతోంది
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన ఉల్లి వేలంలో ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా అటూ ఇటుగా నమోదయ్యాయి. అయితే నాలుగు వారాలుగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉండటంతో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు ఊహించని స్థాయిలో కనిష్ట ధరలు సైతం పలుకుతున్నాయి. బుధవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.5,300, కనిష్టంగా రూ.4,100 ధర పలికింది. మార్కెట్కు కేవలం 200 బస్తాల ఉల్లి మాత్రమే విక్రయానికి వచ్చింది. తూకం అనంతరం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.2,100 చొప్పున అమ్ముడైంది. మార్కెట్కు ఉల్లి దిగుబడి తక్కువగా రావడంతో చిరు వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో వినియోగదారులకు ఉల్లి లభ్యత తగ్గింది. దేవరకద్ర సంతలో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. -
నిన్న సన్మానం.. నేడు అనంత విషాదం!
● ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న కొన్ని గంటల్లోనే మృతి ● ‘మా టీచర్ ఎక్కడా..?’ అంటూ కన్నీరుమున్నీరైన విద్యార్థులు అమరచింత: నిన్నటి వరకు ఆమె ముఖంలో చిరునవ్వు.. చేతుల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం.. తోటి ఉపాధ్యాయుల అభినందనలు.. విద్యార్థుల ప్రేమాభిమానాలు. అంతలోనే విధి ఆమెను దూరం చేసింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కారం అందుకున్న మరుసటి రోజే గుండెపోటుతో మృతి చెందడంతో అమరచింతలో విషాదం నెలకొంది. అమరచింత మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆనందలక్ష్మి (48) మంగళవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారితో కలిసి ఫొటోలు దిగుతూ, సంతోషాన్ని పంచుకున్నారు. సన్మానం అనంతరం ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. అయితే అర్ధరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో భర్త రాము వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమీపంలోని డీఎంఆర్ఎం ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
‘మా టీచర్ ఎక్కడా..?’
ఆనందలక్ష్మి మృతి వార్తతో డీఎంఆర్ఎం పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెకు నివాళి గా పాఠశాలకు సెలవు ప్రకటించారు. తమకు ఎంతో ఆప్యాయంగా బోధించిన టీచర్ ఇక లేరన్న విషయం తెలియక కొందరు విద్యార్థులు ‘మా టీచర్ ఎక్కడా?’ అంటూ ఆమె మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆనందలక్ష్మి భర్త రాము కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె నర్వ మండలం బెక్కర్పల్లి, అమరచింత మండలం పాంరెడ్డిపల్లిలో సుమారు తొమ్మిదేళ్లు సేవలందించారు. ప్రస్తుతం అమరచింతలోని డీఎంఆర్ఎం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న ఆనందం 24 గంటలు గడవకముందే విషాదంగా మారడం స్థానికులను కలచివేసింది. -
విపత్తు సమయంలో బాధితులకు సాయం చేయాలి
ఎర్రవల్లి: యువ ఆపద మిత్రులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో ప్రాణ రక్షణ చర్యలకు సహకరించాలని పదవ పటాలం ఇన్చార్జి కమాండెంట్ ఆదినారాయణ సూచించారు. బుధవారం బీచుపల్లి పదవ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్), తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా రెవెన్యూ అధికారి నిర్మలతో కలిసి హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని ఐదు జిల్లాల నుండి ఎన్ఎస్ఎస్ నుండి 43మంది, బిఎస్జి నుండి 17మంది, ఎన్వైకెఎస్ నుండి 31మంది చొప్పున ఎంపికై న మొత్తం 91మంది బాల బాలికలకు ఏడు రోజుల పాటు విద్యార్థులు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాదితులను సురక్షితంగా తరలించే విధానాల గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపు, సమీపంలో ఉన్న యువత తమకు అందుబాటులో ఉన్న వసరులతో బాధితులకు ప్రాథమికసాయం అందించడం, ప్రాణాలను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టేలా యువతను సిద్ధం చేయడమే యువ ఆపదమిత్ర కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారదిరెడ్డి, వెంకటరమణ, ఆర్ఐ శ్రీనివాస్, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పీయూ పీజీ కళాశాల తనిఖీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీజీ కళాశాలలోని పలు డిపార్ట్మెంట్లను వీసీ శ్రీనివాస్ బుధవారం ఉదయం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, అటెండెన్స్ రిజిస్ట్రర్లు, అకాడమిక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించాలని, అటెండెన్స్ రిజిస్ట్రర్లను అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరంతో ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కొద్దిసేపు తరగతులు బోధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి మంజూరు పీయూలో ఆడిటోరియం నిర్మించేందుకు రూ. 10 కోట్లు ఇస్తామని కాన్వకేషన్ సందర్భంగా ఎంఎస్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మొదటి దశ రూ.కోటి మంజూరు చేసినట్లు అధికారులు పేర్కన్నారు. ఈ మేరకు ఈ నిధులతో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి రిమాండ్ నవాబుపేట: బాలికను ప్రేమపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. బుధవారం మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్ను అదే గ్రామానికి చెందిన నర్సింహులు ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నట్లు బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
వేరుశనగ సాగు.. జాగ్రత్తలతో లాభాలు
మిడ్జిల్: రాష్ట్రంలో అధికంగా సాగు చేసే పంటలలో వేరుశనగ ఒకటి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక శాతం సాగు చేస్తుంటారు. అ యితే వేరుశెనగలో అధిక దిగుబడులు సాధించాల ంటే అధికారుల సూచనలు తప్పకండా పాటించా లని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ తెలిపారు. నేలల ఎంపిక–తయారీ.. వేరుశనగ పంటకు ఎర్ర ఇసుక నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. దుక్కిని 2–3 సార్లు బాగా దున్ని చివరి దుక్కిలో ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కిలోతు 20సెం.మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. విత్తనాల ఎంపిక.. విత్తనాల ఎంపికలోనే రైతులు ఎక్కువగా మోసపోతుంటారు. మార్కెట్లో దొరికే ప్రతి విత్తనం మంచిది కాదు. ● కె–6 (కదిరి): 100–110 రోజులలో పంట చేతికి వచ్చి దిగుబడి ఎకరానికి 12–14 క్వింటాళ్లు వస్తుంది. ● కదిరి–9: కరువును తట్టుకుంటుంది. నూనే శాతం ఎక్కువ. 110 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 10–12 క్వింటాళ్లు. ● కదిరి హరితాంధ్ర: పంట కాలం వంద రోజులు. ఎకరానికి 10 –12 క్వింటాల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితులను, ఆకుపచ్చ, తామర తెగులును తట్టుకుంటుంది. ● ధరణి: పంట కాలం 100 – 105 రోజులు. దిగుబడి 9–10 క్వింటాళ్లు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ● టిఏజి–24 రకం: పంట కాలం 95 – 100 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ● జెఎల్–24 రకం: పంట కాలం 105 – 110 రోజు లు దిగుబడి 10–12 క్వింటాళ్లు. గింజలు పద్దెగా ఉంటాయి. ఒకే సారి కాయలు గట్టి పడుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి విత్తనం బరువుగా నిండుగా ఉండాలి. పుచ్చిన పగిలిన గింజలను తీసివేయాలి. గింజపై పొట్టు ఎరుపు మెరుస్తూ ఉండాలి. గతేడాది పొలంలో పండిన దాన్నే వాడుతుంటే 9 నెలలు లోపు విత్తనం అయి ఉండాలి. పాత విత్తనం మొలక శాతం తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం.. వేరుశనగ పంటకు ఎక్కువ యూరియా అవసరం లేదు. ఎకరానికి డీఏపీ 60 కిలోలు, ఎంఓపి 30 కిలోలు, జిప్సం 200 కిలోలు వేసుకోవాలి. జిప్సం చాలా ముఖ్యం. పూత దశలో (విత్తిన 35–40 రోజులకు) జిప్సం వేయడం వలన కాయలో గింజ బీటగా నిండుతుంది. పొల్ల కాయలు రావు. సూక్ష్మదాతువులు, బోరాన్ లోపం వలన కాయలు లోపల గింజ నల్లబడుతుంది. దీనికి 0.5 శాతం బోరాన్ ను పూత సమయంలో పిచికారీ చేయాలి. చీడ పురుగుల సమగ్ర నివారణ.. ● పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగలి పురుగు నివారణకు వేపనూనేను పిచికారీ చేసుకోవాలి. ● వేరు పురుగు–సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్ ఫోరేట్ 10 శాతం గుళికలు, ఎకరానికి 6 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ● ఆకు ముడత పురుగు: ఈపురుగు విత్తిన 15 రోజుల నుంచి ఆశిస్తుంది. ఆకులపైన గోధుమ రంగుమచ్చలు ఉంటాయి. ఈ పురుగు 2–3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండి కాలిపోయినట్లు కనబడుతాయి. నివారణకు క్లోరిఫైరిపాస్, 500 మి.లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● శనగపచ్చ పురుగు: ఈ పురుగులు లేత ఆకులపైన మొగ్గలు, పువ్వులపై చేరి రంధ్రాలను ఏర్పరుస్తాయి. నివారణకు ఎకరానికి 4–5 లింగాకర్చక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కిలో బి.టి ఫార్కులేషన్ లేదా 5శాతం వేపనూనె పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. పాడి–పంట -
కెమికల్ కంపెనీలతో కాలుష్యం
కృష్ణా: మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో వెలిసిన కెమికల్ ఫ్యాక్టరీల మూలంగా ప్రతినిత్యం దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీల్లో నిల్వ ఉంచుతున్న వ్యర్థాల మూలంగా ముక్కులు పగిలిపోయే విధంగా దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఆ వాసన భరించలేకున్నారు. ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు చల్లగాలికి వచ్చే వాసనకు తట్టుకోలేక పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాగే మండలంలోని స్నేహ చికెన్, ఇథనా ల్ ఫ్యాక్టరీల నుంచి కూడా భరించలేని దుర్వాసన వస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ● కర్ణాటకలోని కడెచూర్ శివారులో ఏర్పాటు చేసిన కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలను ప్రతినిత్యం అండర్ గ్రౌండ్ పైప్లైన్ ద్వారా తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు అతి సమీపంలో ఉన్న కాల్వకు వదులుతుండడంతో మన ప్రాంతానికి భరించలేని దుర్వాసన వస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ విషపూరిత పదార్థాల మూలంగా భవిష్యత్లో ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కలుషితం అవడంతోపాటు భూసారం కూడా దెబ్బతిని, పంటలు పండించలేని దుస్థితి ఏర్పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. పది గ్రామాలకు ఇబ్బంది రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పదుల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. దాంతోపాటు తెలంగాణ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వ్యర్థాలను కూడా ఇక్కడకు తీసుకొచ్చి వాటిని భూమిలోకి వదులుతున్నారు. మన రాష్ట్రంలోని చేగుంట, ఐనాపూర్, కున్సీ, ఆలంపల్లి, మాగనూర్ మండలంలోని కొత్తపల్లి, మాగనూర్, గుర్రావ్లింగంపల్లి, కర్ణాటకలోని బాడియాల్, సైదాపూర్, గూడూర్తోపాటు మరో పది గ్రామాలకు ఈ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాసనకు ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. అఖండ సినిమాలో మాదిరిగ హైదరాబాద్, బెంగళూర్ సుదూర ప్రాంతాల్లోని కంపెనీలు వదిలే అ భయంకరమైన వ్యర్థాలను ఇక్కడకు తీసుకొచ్చి డంపు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా డంపు చేసిన వ్యర్థాలు భూమిలో కలిసిపోయి గ్రౌండ్ వాటర్ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఏదీఏమైనా ఈ ఫ్యాక్టరీల మూలంగా వల్ల తమ భూములకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు అనారోగ్యం సాయంత్రం అయిందంటే ముక్కుపుటాలదిరే దుర్వాసన వాసన భరించలేక తలెత్తుతున్న శ్వాసకోశ ఇబ్బందులు కర్ణాటక సరిహద్దులోని కంపెనీలు వదులుతున్న కాలుష్యమే కారణం ఎక్కడెక్కడినుంచో కెమికల్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న వైనం అటు కర్ణాటకలోని గ్రామాలతోపాటు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు -
మన్యంకొండలో ముగిసిన శ్రావణ మాస వేడుకలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా 35 రోజులుగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ స్వామివారికి నిత్యపూజలు, ప్రత్యేక అలంకరణలు, అఖండ భజనలు, హోమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన వేడుకలకు బుధవారం సమారాధనతో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించాలి
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరూ స్వబుద్ధితో ఆలోచించాలని, బుద్ధి పక్కదారి పడితే దానిని ఆలోచన అనే అంకుశంతో అణిచివేయాలని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచించారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని గౌరీశంకర్ కాలనీలోని వినాయక మండపం వద్ద శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆధునిక జీవితంలో భగవద్గీత ప్రాధాన్యంపై ఆయన ప్రవచించారు. మాటల్ని బట్టి మనిషిని గౌరవించటం అలవర్చుకోవాలని, మనిషిని బట్టి మాటల్ని విశ్వసించరాదన్నారు. మనందరి అంతిమ లక్ష్యం మరో జన్మ ఉండకూడదని, జన్మరాహిత్యం కోసం ప్రయత్నించాలన్నారు. మానవ జన్మ ఎంతో అదృష్టమని, అందుకే ఇలా వినాయక వ్రతం, పూజ చేసుకోగలుగుతున్నామని, ప్రవచనాలు వినగలుగుతున్నామన్నారు. అందుకే ఏది ధర్మమో అది చేయాలన్నారు. మనపనిమనం చేయాలని, లాభనష్టాలు ఆశించకూడదన్నారు. లాభం మాత్రం ఆశిస్తామని నష్టం భరించలేమంటే ఎలా అన్నారు. అలాగే సుఖం కోరుకుంటామని, దుంఖః భరించనంటే ఎలా అని ఆలోచించాలన్నారు. లాభం రావాలంటే కొంత నష్టం తప్పదని, సుఖం దక్కాలంటే కొంత దుంఖం తప్పదన్నారు. మనవాడు దుర్మార్గుడైన సమర్దిస్తామని, మిగిలిన వారిని ద్వేషిస్తామని, అలాకాకుండా మంచి చెడులు ఆలోచించి దుర్మార్గుడైన మనవాడిని సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. అంతకుముందు ఆయనకు శ్రీనాథ్ ఆధ్వర్యంలోని భక్తబృందం ఘన స్వాగతం పలికారు. -
విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు
కంపెనీల నుంచి వచ్చే పొగ, వాసన మూలంగా మా గ్రామంలోని వృద్ధులకు, చిన్నపిల్లలకు విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది దగ్గు, ఆస్తామ వంటి వ్యాధులకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. – మాలింగప్ప, రైతు, చేగుంట మండలంలోని పలు గ్రా మాల ప్రజలు ఈ కంపెనీ ల మూలంగా ఇబ్బందుల కు గురవుతున్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని గ్రామాల ప్రజలతో ఆందోళనలు చేపట్టబోతున్నాం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాం. న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడుతాం. – బస్లింగప్ప, యువకుడు, చేగుంట మండలంలోని గుడెబల్లూర్, వాసునగర్, చేగుంట, ఐనాపూర్ తదితర గ్రామాల ప్రజలతోపాటు కర్ణాటకలోని కెమికల్ ఫ్యాక్టరీల మూలంగా దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. తమకు ఆయా గ్రామాల ప్రజలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్, తహసీల్దార్, కృష్ణా మండలం ● -
కేఎల్ఐ కాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలి
● ప్రాజెక్టు ఈఈ వాహనాన్ని అడ్డుకున్న రైతులు కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలం సున్నపు తండా సమీపంలోని కేఎల్ఐ ప్రాజెక్టు డీ–5 పంటకాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలని మంగళవారం కుడికిల్ల, నార్లాపూర్, సున్నపుతండా తదితర గ్రామాల రైతులు డీ–5 కాల్వ దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల నిమిత్తం పంటకాల్వ లింకును అధికారులు కట్ చేయడంతో మూడురోజుల నుంచి కాల్వకు సాగునీరు రావడం లేదన్నారు. దాదాపు వెయ్యి ఎకరాలలో పంట కాల్వ కింద పంటలు చేశామన్నారు. ఆ పంటలు మూడురోజులుగా సాగునీరు రాకవపోడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పంట కాల్వకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలుపాటు నిరసన తెలపడంతో ప్రాజెక్టు ఈఈ అమర్సింగ్తోపాటు అధికారులు రైతుల వద్దకు చేరుకోగా.. అధికారులను రైతులు చుట్టుముట్టి ఆయన వాహనాన్ని అడ్డంగించారు. ఈ సందర్భంగా ఈఈ అమర్సింగ్ మాట్లాడుతూ.. భగీరథ పనులు జరుగుతుందున కాల్వ లింకును కట్ చేయడం జరిగిందని తాత్కాలికంగా రిజర్వాయర్ నుంచి కాల్వలకు 50 హెచ్పీ మోటార్లతో మూడు పంపుల నుంచి సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైతే హెచ్పీని పెంచి ఎక్కువ మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. రైతుల పంటలు కాపాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులతోపాటు సున్నపుతండా మాజీ ఎంపీటీసీ శంకర్నాయక్, బీఆర్ఎస్ మండల సమన్వ కమిటీ సభ్యులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల గర్భిణిని కడతేర్చిన భర్త
లింగాల: కడుపులో బిడ్డను మోస్తున్న ఆ ఇల్లాలు భర్త చేతి లోనే బలైంది. ఆరు నెలల గర్భిణి అయిన గాడ్డుల శివాని(26)ను ఆమె భర్త పరుశరాముడు హత్య చేసి నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. ఘటనను ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దారారం గ్రామానికి చెందిన గాడ్డుల పరుశరాముడికి వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శివానితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. కొంతకాలం మండల కేంద్రంలోని ఓ బేకరిలో పనిచేసిన పరుశరాముడు రెండు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అల్వాల్లో ఉంటూ ర్యాపిడ్ వాహనం నడుపుతున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భార్యపై అనుమానం పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న పరుశరాముడు శివానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయిందని మామ వెంకటేష్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. వారు అక్కడికి చేరుకునేలోపే శివాని మృతిచెందింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం దారారం తీసుకొచ్చారు. శివాని మృతదేహాన్ని అత్తింటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆమెను హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలను తిరిగి ఇవ్వాలని పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదరడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. గర్భిణి అయిన శివాని మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన నేపథ్యంలో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు చంద్రకాంత్, జయన్నతో పాటు లింగాల, బల్మూర్, ఉప్పునుంతల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రమాదంగా చిత్రీకరించే యత్నం.. పోలీసుల ఎదుట నేరం అంగీకారం మృతదేహంతో అత్తింటి ముందుబంధువుల ఆందోళన.. లింగాల మండలం దారారంలో ఉద్రిక్తత -
జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత
● ఆందోళనలో అన్నదాతలు..వారబందీపై ఇంకా స్పష్టత కరువు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 300 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుండటంతో దిగువకు నీటిని తరలించే కాల్వలకు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్సాగర్, నెట్టెంపాడు, పవర్హౌస్లకు నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.242 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని రిజర్వు చేయాలనే ఉద్దేశంతో కాల్వలకు సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో జూరాల ఆయకట్టులో సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఈసారి సుమారు 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. కాల్వలకు నీటి విడుదల నిలిచిపోవడంతో పంటలకు నీరందుతుందా లేదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పంటల దశలో నీటి సరఫరా నిలిచిపోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డివిజన్ ఈఈ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. వారబందీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, అధికారులతో చర్చల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీటి విడుదలపై నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. -
రూ.24.18 లక్షల అల్ఫాజోలం పట్టివేత
● ఆరుగురిపై కేసు.. నలుగురి అరెస్టు మణికొండ: కల్లు తయారీలో ఉపయోగించే అల్ఫాజోలంను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.24.18 లక్షల విలువైన 1.931 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సహాయ కమిషనర్ జి.శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన లింగరాజుగౌడ్, టి.ఆంజనేయులు, ఆర్.రమేష్, కాటమయ్యలు మరో ఇద్దరి నుంచి అల్ఫాజోలం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంచిరేవులలో నిఘా పెట్టిన అధికారులు వ్యాగనార్ కారులో తరలిస్తున్న ఇద్దరి నుంచి 751 గ్రాములు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో ఇద్దరి నుంచి 1.18 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సేఊర కృష్ణ, ఎస్ఐ రమేష్, ట్రైనీ ఎస్ఐలు రమణ, రమేష్, గిరిలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురితో పాటు కారును, ద్విచక్రవాహనాన్ని గండిపేట ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో అల్ఫాజోలం పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్రావు, డిప్యూటీ కమిషనర్ జై హరికిషన్ అభినందించారు. బైక్ను ఢీకొన్న డీసీఎం.. మహిళ దుర్మరణం శంషాబాద్: అతివేగం.. నిర్లక్ష్యంతో ఓ డీసీఎం వాహనం బైక్పై వెళుతున్న వారిని ఢీ కొనడంతో మహిళ దుర్మరణం చెందిన సంఘటన శంషాబాద్ సిద్దాంతిలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ తన భార్య సోని(35) కుమార్తె శాన్వితో కలిసి హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళుతున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సిద్దాంతి రైల్వేగేటు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి ఐచర్ డీసీఎం వాహనం వేగంగా ఢీ కొనడంతో వెనకాల కూర్చున్న సోని కిందపడిపోయింది. డీసీఎం వెనకభాగం టైరు కూడా ఆమె మీది నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్యాంసుందర్తో పాటు కుమార్తెకు కూడా గాయాలు కావడంతో వారికి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్ కర్ణాటక రాయచూర్కు చెందిన బస్వరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమీక్షించిన మంత్రి అదె సమయంలో అటుగా వెళుతున్న మంత్రి వాకిటి శ్రీహరి రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించి కారులోంచి దిగారు. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులతో పరిస్థితిని సమీక్షించి గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లే వరకు ఉన్నారు. సిద్దాంతి వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారుల ఎలాంటిచర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
నల్లగుట్టపై చిరుత..
● కొండాపూర్ గ్రామస్తుల్లో భయాందోళన ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో నల్లగుట్టపై సోమవారం ఉదయం చిరుత కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కోయిల్కొండ వైపు వెళ్తున్న కొందరు గ్రామస్తులకు చిరుత కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం గ్రామ శివారులో పంట పొలాల వద్ద ఓ మేకను చిరుత చంపి తిన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో చిరుతను వెంటనే పట్టుకుని గ్రామాల వైపు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
విభిన్న రూపాల్లో.. వినాయకుడి వైభవం
పాలమూరులో అనంత పద్మనాభుడి సెట్టింగ్లో..జడ్చర్లలో పసుపు కొమ్ముల గణపతి జడ్చర్ల గంజ్ ఏరియాలో మంచు గణపతి ఎర్రవల్లిలో దినపత్రికల గణపయ్యపాలమూరులో బంగారు ఆభరణాలతో విగ్రహం ఉమ్మడి పాలమూరులోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేళ గణనాథులు విభిన్న రూపాల్లో కొలువుదీరారు. అమర్నాథ్ శివలింగం ఆకృతిలో పసుపు కొమ్ములతో రూపొందించిన వినాయకుడితో పాటు పూలు, పేపర్లు, బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన గణనాథులను మండపాల్లో ప్రతిష్టించారు. రంగురంగుల అలంకరణల నడుమ కొలువైన ఈ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టి రూపొందించిన గణనాథులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వేడుకలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
అంబులెన్స్ ఢీ కొట్టడంతో.. ఒకరు మృతి
● తాగునీటి కోసం వాహనాన్ని ఆపిన సమయంలో ప్రమాదం చిన్నచింతకుంట: ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సల్ వాహనాన్ని అంబులెన్స్ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని లాల్కోట ఎక్స్రోడ్డు చౌరస్తా వద్ద రైచూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి మొగిలయ్య(53) తన భార్య చెన్నమ్మతో కలిసి టీవీఎస్ ఎక్సల్పై తీలేరు నుంచి దేవరకద్రకు బయలుదేరారు. లాల్కోట చౌరస్తా వద్ద మంచినీటి కోసం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. చెన్నమ్మ నీటి కోసం సమీపంలోని హోటల్కు వెళ్లగా.. మక్తల్ నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న మినీ అంబులెన్స్ ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనంపై కూర్చున్న మొగిలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. జడ్చర్ల: బాదేపల్లి నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. మండలంలోని పెద్దపల్లికి చెందిన కోళ్ల రాజశేఖర్రెడ్డి(27) ఆదివారం రాత్రి మోటర్ బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విశమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి తండ్రి భగవంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పదంగా కూలీ మృతి మరికల్: అనుమానాస్పద స్థితిలో ఓ కూలీ మృతిచెందిన ఘటన సోమవారం ఎక్లాస్పూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్లాస్పూర్కు చెందిన చాంద్పాషా(48)అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిపంటకు ఫర్టిలైజర్ మందును చల్లేందుకు కూలీగా వెళ్లాడు. అయితే పొలంలో కరెంట్ తీగలు కూడా కిందకు ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడా, లేక యూరియా గుళికలతో కూడిన మందు విషప్రభావం వల్ల మృతిచెందాడా అన్న విషయం తెలియాల్సి ఉందని ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నడుము నొప్పి భరించలేక వృద్ధురాలి బలవన్మరణం మానవపాడు: నడుము, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న 86 ఏళ్ల వృద్ధురాలు పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కొంతకాలంగా నడుము, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. సోమవారం కుమార్తె, అల్లుడు పొలానికి వెళ్లడంతో ఇంట్లో 12 ఏళ్ల మనవరాలితో ఉంది. నొప్పి తీవ్రతతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన మనవరాలు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గోవిందమ్మను మానవపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీలో వలస కార్మికుడు.. మరికల్: చిత్తనూర్ ఇథనాల్ కంపెనీలో ఓ వలస కార్మికుడు గదిలో ఉరేసుకొని మృతిచెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన తుఫాన్ మండల్(19) వలస కార్మికుడు ఆదివారం గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. -
దాబాలే టార్గెట్.. రాత్రికి రాత్రే మద్యం మాయం
ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని ప్రధాన రహదారిపై మూసి ఉన్న దాబాల్లో సోమవారం తెల్లవారుజామున దొంగతనాలు జరిగినట్లు నిర్వాహకులు, స్థానికులు తెలిపారు. దొంతికుంట తండా, సోళీపురం గ్రామాల సమీపంలోని దాబాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు చెప్పారు. సోళీపురం సమీపంలో అంజనేయులు నిర్వహిస్తున్న దాబా వెనుక ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు ఐదు కాటన్ల బీర్లు, 144 క్వార్టర్ బాటిళ్లు, 20 ఆఫ్ బాటిళ్ల విస్కీ, 50 కిలోల బియ్యం, సుమారు రూ.10 వేల విలువైన కిరాణా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు తెలిపాడు. దొంతికుంట తండా స్టేజీ సమీపంలోని గన్యానాయక్ దాబాలో రెండు కాటన్ల బీర్లు, ఒక కాటన్ విస్కీ చోరీ అయినట్లు చెప్పారు. కొత్తపల్లి తండా సమీపంలోని విష్ణు దాబా, సోళీపురానికి చెందిన గొల్ల కాశయ్య దాబాల్లోనూ దొంగతనానికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే దాబాల్లో చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
గిరిజన సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట
● 17న తండాల్లో కార్యక్రమాలు: లక్ష్మారెడ్డి జడ్చర్ల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈనెల 17న జిల్లాలోని అన్ని తండాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్లో ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని తెలిపారు. తాగునీరు, రహదారుల కల్పనతో తండాల రూపురేఖలు మార్చామని, గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని అన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి విమర్శించారు. భూ కబ్జాలకు సంబంధించి ఒక్క గజం అక్రమాన్ని కూడా నిరూపించలేదన్నారు. రంగారెడ్డిగూడ దేవాదాయ భూములు, జడ్చర్ల భూదాన్ భూమి, బాదేపల్లి నల్లకుంట ఎఫ్టీఎల్ ఆక్రమణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో తాము సహకరిస్తామని, అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ లక్ష్మినాయక్, నాయకులు నందకిషోర్, రామ్మోహన్, మురళి, లత, ప్రణీల్ ,శ్రీనివాస్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 1,311 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
పాలమూరు: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. తొలిరోజు ఏనుగొండ కేజీబీవీ అర్బన్ పాఠశాలలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ సెక్టార్లో చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. గతంలో పరీక్షల్లో కంటి సమస్యలు గుర్తించిన విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేయడంతోపాటు, ప్రస్తుతం కొత్తగా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఎస్కేకు చెందిన ఆరు బృందాలు తొలిరోజు మొత్తం 1,311 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాయి. వీరిలో 124 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత విద్యార్థులకు అవసరమైన అద్దాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్సమ్మ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, వైద్యులు పులి విద్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బోనస్ కావాలంటే.. నమోదు తప్పనిసరి
● ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం మహబూబ్నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో సన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సన్న రకం ధాన్యం పండించే ప్రతి రైతుకు క్వింటాలుకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు నిర్ధేశిత నిబంధనలను పాటించి సకాలంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం–2026లో జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సన్న, దొడ్డు రకాల వరిని రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అర్హులైన రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచించింది. ఈనెల 17వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం బోనస్కు నిర్దేశించిన సన్న రకాలలో తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), బీపీటీ 5204, జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 8715, డబ్ల్యూజీఎల్–44 ఉన్నాయి. ఈ ఏడు రకాల్లో ఏదైనా సాగు చేసిన రైతులు మాత్రమే తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. విత్తన దుకాణంలోనే నమోదు రైతులు సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు సంబంధిత విత్తన దుకాణంలోనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. రైతుల వద్ద సొంతంగా ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేసినట్లయితే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. విత్తన దుకాణంలో అప్పట్లో నమోదు చేసుకోని రైతులు విత్తనం కొనుగోలు చేసిన రశీదును చూపించి అదే దుకాణంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నమోదైన వివరాలు డిజిటల్గా భద్రపరుచబడతాయని, భవిష్యత్తులో బోనస్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు సకాలంలో నమోదు చేసుకోవాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేలోనూ వివరాలు ప్రస్తుతం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలం వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పంట వివరాలను సరైన రీతిలో నమోదు చేయించుకోవాలి. బోనస్ పొందేందుకు అవసరమైన వివరాల నమోదులో రైతులు సహకరించాలి – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. ..పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి -
కేఎల్ఐకి ‘పాలమూరు’ నీరు
నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐ నీటితో కొత్త వెసులుబాటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక పంపు పనిచేస్తే సుమారు 800 క్యూసెక్కులు, రెండు పంపులు పనిచేస్తే 1,600 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే సామర్థ్యం ఉంది. అయితే విద్యుత్ సమస్యలు, పంపుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతరాయంగా పంపింగ్ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో కేఎల్ఐ కాల్వలకు ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పీఆర్ఎల్ఐ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి ఎల్లూరుకు మళ్లించే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు. రోజుకు 0.3 టీఎంసీ ఎత్తిపోత పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. అటు నుంచి నీటి తరలింపు.. ఇటు వినియోగంపై ఆందోళన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలిస్తున్నదని తెలంగాణకు చెందిన నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు, వెలిగొండ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి తదితర మార్గాల ద్వారా మరో 3,500 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. మొత్తం మీద సుమారు 15 వేల క్యూసెక్కుల వరకు నీరు తరలిపోతే శ్రీశైలం నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తనకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పీఆర్ఎల్ఐ పంపులను అందుబాటులోకి తెచ్చి, నార్లాపూర్–ఎల్లూరు అనుసంధానాన్ని వినియోగిస్తే కేఎల్ఐకి నీటి లభ్యత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ అవకాశం ఉంది నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని పంపించే అవకాశం ఉంది. రెండు రిజర్వాయర్ల మధ్య ఇంటర్లింక్ నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి నీటిని స్లూయిస్ ద్వారా కేఎల్ఐకి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్కు పంపించడానికి వీలుంది. – లోకిలాల్ నాయక్, కేఎల్ఐ డీఈఈ నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు మళ్లించే అవకాశం ఇంటర్లింక్ స్లూయిస్తో రోజూ 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
సీహెచ్సీలో మందుల స్టాక్ ఉండాలి
● ఇన్సులిన్ లేకపోవడంపై వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం పాలమూరు: కోయిలకొండ మండలంలో మంగళవారం పర్యటించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది హాజరు, పిటిషన్లను పరిశీలించి పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీహెచ్సీని సందర్శించి వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడగా ఐరన్ మాత్రలు, ఇన్సులిన్ అందుబాటులో లేవని వారు తెలిపారు. దీంతో ఇన్సులిన్ స్టాక్ వెంటనే తెప్పించాలని డీఎంహెచ్ఓను ఆదేశించగా.. మహబూబ్నగర్ నుంచి మందులు పంపించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బీసీ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసి ఆహార సరుకులు, విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనంపై ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, పనిచేయని ఫ్యాన్లను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. బూర్గుపల్లి సర్పంచ్ ప్రస్తావించిన చెక్కుల సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజరావు ఇతర అధికారులుపాల్గొన్నారు. -
17న ఆశీస్సుల దీపం కార్యక్రమం
పాలమూరు: ఈనెల 17న దేశ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆశీస్సుల దీపం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేశానికి మరింత సేవ చేయాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఎదుట ఆశీస్సుల దీపం వెలిగించాలని కోరారు. బ్రహ్మోస్ భూసేకరణపై రైతులతో సమావేశం దేవరకద్ర: బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు కోసం చేపడుతున్న భూసేకరణ పక్రియలో భాగంగా మంగళవారం ఆర్డీఓ నవీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రైతులతో సమావేశం నిర్వహించి చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతుల వారీగా చెప్పిన అభిప్రాయాలను నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హర్షద్, ఆర్ఐ శరత్, సర్పంచ్ శివకుమార్, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు. ఖేలో ఇండియాకు ‘యోగా’ సెలక్షన్ ట్రయల్స్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జిల్లాస్థాయి యోగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ యూసుఫ్గూడలోని కేవీబీఆర్ ఇండర్ స్టేడియంలో ఈనెల 17న (బాలుర), 18న (బాలికల) రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా యోగా సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొంటారని జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఆయా తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పోటీ ప్రాంగణంలో రిపోర్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కె.ఆనందం, సీనియర్ అసిస్టెంట్ పి.రవీందర్రెడ్డి, డీఎస్ఏ యోగా కోచ్ కె.సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే..
పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్కుమార్, కిషోర్కుమార్, నూర్జహాన్, జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రకిరణ్కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నైపుణ్యం కలిగిన పశువులు..
మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలువయ్య, మన్ననూర్, అమ్రాబాద్ మండలంప్రత్యేక హోదా కల్పిస్తాం.. నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ విస్మరిస్తోంది
● బీఆర్ఎస్ బాటలోనే కొనసాగుతోంది:ఎంపీ డీకే అరుణ చిన్నచింతకుంట: తెలంగాణ విమోచన దినోత్సవా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరులపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రజాకార్ల నిరంకుశత్వానికి అప్పంపల్లి రావిచెట్టు సాక్ష్యంగా నిలిచిందన్నారు. అమరుల రక్తంతో తడిసిన ఈ నేల ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు రతంగ్ పాండురెడ్డి, పడాకుల శ్రీనివాస్, డోకూర్ పవన్కుమార్రెడ్డి, నంబిరాజు, యజ్ఞభూపాల్రెడ్డి, కుర్వరమేష్, ప్రశాంత్రెడ్డి, బలరాం రెడ్డి, దశరథ్, లక్ష్మి, వీరబ్రహ్మచారి, రఘురామయ్య, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అప్పంపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ -
ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పీఆర్ శాఖ మంత్రి సీతక్కను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ గౌరవ వేతనాలు, పంచాయతీ నిధులు విడుదల చేయాలని, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, ఇందిరమ్మ కమిటీలతో సర్పంచ్ల అధికారాలను తగ్గించే జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర అన్నారు. హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే జూనియర్ అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషుల, మహిళా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శనివారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్చంద్ర జెండాఊపి ఎంపికలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు సి.శ్రీనివాసులు, రమేష్బాబు, ఎ.శ్రీనివాస్, రాజు, వినోద్కుమార్, శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 4 పతకాలు మహబూబ్నగర్ క్రీడలు: కరీంనగర్లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. 8–10 ఏళ్ల విభాగంలో రిత్విక్రెడ్డి, 10–12 ఏళ్ల విభాగంలో దౌసిక్ శ్రీప్రసాద్, 14–16 ఏళ్ల విభాగంలో ఎం.శివతేజ, 16–18 ఏళ్ల విభాగంలో సీహెచ్.అఖిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. అదే విధంగా 12–14 ఏళ్ల బాలుర విభాగంలో జయచంద్ర నాలుగోస్థానం, బాలికల విభాగంలో ఎం.రూప ఐదోస్థానం, 16–8 ఏళ్ల బాలుర విభాగంలో ఎన్.మధు ఆరో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్కుమార్గౌడ్, టి.చంద్రశేఖర్, చైర్మన్ శాంతికుమార్, కార్యనిర్వాహక కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు అభినందించారు. -
గ్యాస్.. గోస
మహబూబ్నగర్ రూరల్: ఇంట్లో పొయ్యి వెలగాలంటే గ్యాస్ ఉండాలి.. సిలిండర్ ఖాళీ అయితే వెంటనే మరో సిలిండర్ రావాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ బుకింగ్ చేసినా సరైన సమయంలో సిలిండర్ అందకపోవడం, కొత్త కనెక్షన్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం, అదనపు సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా రేషన్కార్డులు పొందిన కుటుంబాలు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గృహ అవసరాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. కొత్త జంటలకు.. గ్యాస్ గండం వంట గ్యాస్ కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గతంలో దరఖాస్తు చేసుకున్న అనేక మంది దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. మరికొందరు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఆదేశాలతో హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ కంపెనీలు కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కొత్త గ్యాస్ కనెక్షన్ అడిగిన వెంటనే లభించేది. ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నందున కొత్త కనెక్షన్ల జారీకి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గృహ అవసరాలకు సంబంధించి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు ఇవ్వడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గృహ అవసరాలకు కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కొత్తగా పెళ్లయిన జంటలకు శాపంగా మారాయి. కొందరు కొత్త గ్యాస్ సిలిండర్ బాధ్యత అత్తామామలపై పెడుతుండగా.. డబుల్ సిలిండర్లు ఉన్నవారు ఒక సిలిండర్ కొత్త జంటలకు ఇచ్చి పంపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు డబుల్ సిలిండర్లు ఉన్నవారి నుంచి అధిక ధర చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్ స్టౌలు కొందామంటే మార్కెట్లో ఇవి వెంటనే దొరకడం లేదు. కొత్త కనెక్షన్లు మళ్లీ ప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాయా..? అని అందరూ ఎదురుచూడాల్సి వస్తుంది. నగర శివార్లలోనే ఎక్కువ మంది కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎల్పీజీ డీలర్ల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు కాకుండా చిరునామా మారిన వారు, ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన పత్రాల్లో మార్పులు, చేర్పుల కోసం కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త కనెక్షన్లు ఇచ్చేటప్పుడే పత్రాల్లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ (సర్) నోటీసులు అందుకున్న వారు చిరునామా ధ్రువీకరణ కోసం, అలాగే ఆధార్లో మార్పుల కోసం ఎల్పీజీ కనెక్షన్ పత్రాలను ఆధారంగా చూపించేందుకు అవకాశం ఉంది. అయితే గ్యాస్ బుక్లో చిన్నపాటి మార్పులు గతంలో వెంటనే చేసేవారు. ఇప్పుడు వీటిని సవరించుకునే అవకాశం లేదంటున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడే వీటిని కూడా సవరిస్తామంటున్నారు. దీంతో ఆధార్లో సవరణలు, సర్ కోసం ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ గడువులో తీవ్ర ఇబ్బందులు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు నిరీక్షణ డబుల్ సిలిండర్ దొరకక తిప్పలు స్పష్టత ఇవ్వని గ్యాస్ ఏజెన్సీలు జిల్లాలో 3.92 లక్షల కనెక్షన్లు -
మచ్చలే మకుటంగా.. నల్లమల రాజసం
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. లోతట్టు అభయారణ్యంలో.. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. కోడె దూడలకు డిమాండ్ వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి. తెలంగాణ బ్రాండ్గా తూర్పు పొడ జాతి పశువులు లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర 500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం 2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు -
ప్రతి నెలా ఇతరులను అడగాల్సిందే..
పెళ్లయి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి హెచ్పీ గ్యాస్నే వినియోగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఒకే గ్యాస్ కుండతో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం కుటుంబం విడిపోయి వేరుగా ఉంటున్నాం. దీంతో వంటకు గ్యాస్ అవసరం పెరిగింది. అదనంగా మరో గ్యాస్ కుండ ఇవ్వాలని సంబంధిత ఏజెన్సీని అడిగినా స్పందించడం లేదు. ఒకే కుండ ఉండటంతో అది ఖాళీ అయిన ప్రతిసారీ కొత్త కుండ వచ్చేవరకు వంట చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. వంట ఆగిపోకుండా ఉండేందుకు ప్రతి నెలా బంధువులు, పరిచయస్తుల వద్ద గ్యాస్ కుండ కోసం అడగాల్సి వస్తోంది. – పి.నారాయణమ్మ, మహబూబ్నగర్ -
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ రాజమార్గం
పాలమూరు: కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ప్రశాంతమైన జీవనం సాగించే అవకాశం ఉంటుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. ఒకసారి కేసును రాజీ చేసుకుంటే జీవితకాలంలో తిరిగి అదే వివాదంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదన్నారు. జిల్లా ప్రధాన కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించారు. కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలకు పరిష్కారం చూపేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్లో భాగంగా దేవరకద్ర కోర్టులోనూ ప్రత్యేక బెంచీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్బౌన్స్, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాద తదితర కేసులను పరిష్కరించినట్లు వివరించారు. మూడు కోర్టుల్లో 7,075 కేసులు రాజీ మహబూబ్నగర్ కోర్టులో ఐదు, జడ్చర్లలో ఒకటి, దేవరకద్రలో ఒక బెంచీ చొప్పున మొత్తం ఏడు బెంచీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 7,075 కేసులను రాజీ పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఇన్సూరెన్స్ కేసులో బాధితులకు రూ.21.50 లక్షల చెక్కును న్యాయమూర్తి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆంజనేయులు, ఆఫ్రోజ్ అక్తర్, ఇందిర, ఈశ్వరయ్య, కిరణ్కుమార్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్శాఖ పరిధిలో 3, 200 కేసులు రాజీ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 3,200 కేసులు పరిష్కరించారు. రాజీ అయిన కేసుల్లో 432ఎఫ్ఐఆర్లు, 752 డ్రంకన్డ్రైవ్ కేసులు, ఈ–పెట్టీ కేసులు 1988, అదేవిధంగా 57సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కరించారు. ప్రధానంగా మూడు కోర్టుల్లో కలిపి సైబర్ నేరాల్లో మొత్తం 57 కేసుల్లో కలిపి రూ.56.65లక్షల నగదు తిరిగి బాధితులకు ఇప్పించారు. ఈ కేసుల పరిష్కార ప్రక్రియలో కోర్టు డ్యూటీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది విశేషంగా కృషి చేశారని ఎస్పీ డి.జానకి అభినందించారు. ఒక్కసారి రాజీ చేసుకుంటే జీవితకాలం సమస్య ఉండదు మూడు కోర్టుల్లో 7,075 కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత -
కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి
జడ్చర్ల: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ.. వాటిని వారికి వివరించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులను కలిసి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజల్లో మరింత విశ్వాసం పొందాలన్నారు. భవిష్యత్లో రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మిథున్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రబ్బానీ, అశోక్యాదవ్, వంశీచారి పాల్గొన్నారు. -
నల్లమలలో ఆయుధాల కలకలం
నాగర్కర్నూల్: మావోయిస్టుల ప్రభావంతో ఒకప్పుడు నిత్యం అలజడిగా ఉండే నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ ఆయుధాల వ్యవహారం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి అపహరణ కేసులో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు, దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. . కాగా..ఇళ్లలోనే దాచి ఉంచిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకుని మల్లేశ్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఉడిమిళ్లతో అనుబంధం రాజు స్వస్థలం నల్లమలలోని ఉడిమిళ్ల గ్రామం. కొన్నేళ్ల క్రితం అతని కుటుంబం అక్కడి నుంచి మున్ననూరుకు, అనంతరం అచ్చంపేటకు వచ్చి స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో రాజు సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఆయన తండ్రి నారాయణ వసతిగృహాల్లో పనిచేసేవాడని సమాచారం. రాజుకు నాగర్కర్నూల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన అనూషతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ పట్టణంలో కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది. గడ్డివాములో ఆయుధాలు.. పోలీసులు గురువారం సాయంత్రం రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం రాజును అచ్చంపేటకు తీసుకెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇంటి సమీపంలోని గడ్డివాములో ఆయుధాలు దాచినట్లు చెప్పడంతో అక్కడ తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అపహరించిన ఆయుధాలను తొలుత అచ్చంపేటలో దాచిన అనంతరం ఉడిమిళ్లలోని పాత ఇంటికి తరలించి, మళ్లీ అచ్చంపేటకు తీసుకొచ్చి గడ్డివాములో ఉంచినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రాజును అదుపులోకి తీసుకునే ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్కర్నూల్లో వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అచ్చంపేటలో ఆర్మీజవాన్ మల్లేష్ ఇల్లు బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో నాగర్కర్నూల్ జిల్లా వాసి ఉడిమిళ్లకు చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్గా గుర్తింపు అచ్చంపేట ఇంటి సమీపంలో గడ్డివాములో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మూడు ప్రాంతాల్లో కలకలం రాజు పేరు ఆయుధాల అపహరణ కేసులో వెలుగులోకి రావడంతో ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్కర్నూల్తో పాటు ఆయన అత్తగారి గ్రామమైన సిరిపురంలోనూ చర్చనీయాంశమైంది. అచ్చంపేటలోని రాజు ఇంటికి తాళం వేసి ఉండగా.. అద్దెకు ఉంటున్న వారు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. నాగర్కర్నూల్లో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి వద్ద పనిచేసే వారు కూడా గురువారం సాయంత్రం నుంచి రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు -
ఫిన్లాండ్కు 8 మంది టీచర్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: టీచర్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్–ఫిన్లాండ్ (బ్యాచ్–2)లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 10 వరకు అక్కడ పర్యటించి విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. ఉపాధ్యాయుడు హోదా పాఠశాల వరద సురేందర్రెడ్డి జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ధర్మవరం, గద్వాల బాలుయాదవ్ బైకాని జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ తాటికొండ, మహబూబ్నగర్ మల్లికార్జునుడు జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ శాఖాపూర్, వనపర్తి సంధ్య ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ చంద్రకల్, నాగర్కర్నూల్ సాయిచందర్రెడ్డి ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ పెద్దమందడి, వనపర్తి శ్రీకాంత్ ఎస్జీటీ ఎంపీపీఎస్ గొల్లపల్లి, నారాయణపేట మసుంబి ఎస్జీటీ ఎంపీపీఎస్ ఉండవల్లి, గద్వాల సబా సుల్తానా ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ ఊట్కూర్, నారాయణపేట 26 నుంచి అక్టోబర్ 10 వరకు విద్యా పర్యటన -
బెట్టతో పంటకు బెంగ
● పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ● వరికి పోషక లోపాలు.. కందిలో ఎదుగుదల మందగింపు ● నివారణకు శాస్త్రవేత్తల సూచనలు మహబూబ్నగర్ (వ్యవసాయం): వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రొఫసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కల్యాణి, డాక్టర్ జి.మాధురి శుక్రవారం చిన్నచింతకుంట మండలంలోని నెల్లికొండి, వడ్డేమాన్, ఎదులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వరి, పత్తి, కంది, మిరప, చెరకు, ఆయిల్పామ్ పంటలను పరిశీలించి.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. పత్తిలో పురుగుల ఉధృతి అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగినట్లు గుర్తించారు. తామర పురుగు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 మి.లీ. మీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. వరిలో ఎర్ర ఆకులు వర్షాభావం, చౌడు ప్రభావంతో వరి ఆకులు ఎర్రబడటం వంటి పోషక లోపాలను గుర్తించారు. పంట పరిస్థితిని బట్టి తగిన పోషక యాజమాన్యం పాటించాలని సూచించారు. కంది ‘ట్రిపుల్–19’ ఎదుగుదల మందగించిన కంది పొలాల్లో 19 :19:19 (టిపుల్–19) లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు. మిరపలో తామర పురుగు నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్–2 మి.లీ. లేదా థయోమెథాకామ్స్ 0.5 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. మిరపలో తామర పురుగు మిరపలో తామర పురుగుల ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా థయోమెథాక్సామ్ 0.5 గ్రాములను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీటి పొదుపే కీలకం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని వివరించారు. డ్రిప్, తుంపర సేద్య పద్ధతులను అవలంబించాలని, పంట అవశేషాలను వరుసల మధ్య పరచి నేలలో తేమను కాపాడుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో బెట్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫార్మ్ పాండ్లు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
బెట్టింగ్ ఉచ్చులో యువకుడి బలి
● ఆర్థికంగా నష్టపోయి.. అప్పులు తీర్చలేక ఆత్మహత్య మహబూబ్నగర్ క్రైం: క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్లో ఆర్థికంగా నష్టపోయి.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన నగరానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్లోని సంజయ్నగర్కు చెందిన ఎండీ అజారుద్దీన్ (27) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న అతడు ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో పాటు బెట్టింగ్లో డబ్బులు రావాల్సిన వారు ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అజారుద్దీన్ ఈనెల 9న రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బుర్రానుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. పాముకాటుతో కార్మికుడు మృతి ఊట్కూర్: మండలంలోని పగిడిమారిలో శుక్రవారం పాముకాటుతో బాలరాజు (36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. బాలరాజు ఉదయం పనికి వెళ్తుండగా మార్గమధ్యలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితిలో కిందపడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కిష్టమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. రైలు ఢీకొని దుర్మరణం దేవరకద్ర: రైలు ఢీకొనడంతో గుర్తు తెలియయని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కౌకుంట్ల–కురుమూర్తి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలని పట్టాలపైకి వెళ్లాడా లేదా అకస్మాత్తుగా రైలు రావడంతో ఘటన జరిగిందో తెలియరాలేదు. మృతుడు బూడిద కలర్ జీన్స్ప్యాంటు వేసుకుని షర్టు లేకుండా ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. చామన ఛాయ ముఖం, గుండ్రటి మొహం కలిగి ఉన్నాడని, వయసు 35 నుంచి 40 మధ్య ఉండొచ్చన్నారు. ఎవరికై న వివరాలు తెలిస్తే మహబూబ్నగర్ రైల్వే ఎస్ఐకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు చారకొండ: మండలంలోని జూపల్లిలో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలోని జనావాసాల్లో చొరబడి మంతోజు జయమ్మ, అక్కి కృష్ణయ్య ,విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ శేఖర్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అనంతరం స్థానికులు పిచ్చికుక్కను చంపేశారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కురుమూర్తి గుట్టలో భక్తుల రద్దీ
● మార్మోగిన గోవింద నామస్మరణ ● అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు స్వామి దర్శనానికి క్యూలైన్లో నిల్చున్న భక్తులు చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి శ్రావణమాసం అమావాస్యను పురష్కరించుకొని శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన స్వామివారితో పాటు అలివేలు మంగమ్మ, చెన్నేకేశవస్వామి, ఆంజనేయస్వామి ఉద్దాల మండపం, స్వామివారి పాదుకలను దర్శించుకొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ భత్తుల బాల్రాజు, కమిటీ సభ్యులు అర్జున్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
ఐదురోజుల పనివిధానం అమలు చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: ప్రభుత్వం ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని పలు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుమేరకు మహబూబ్నగర్లోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట శుక్రవారం అఖిల భారత బ్యాంకు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో ఆయా బ్యాంకుల ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఐదు రోజుల బ్యాంకింగ్ పనివిధానం అమలు చేస్తామని అంగీకారం తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. వెంటనే ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన, సముచితమైన పీఎల్ఐ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మల్లికార్జున చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఆయా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమల్రెడ్డి, రాజేష్, జయకర్, సోంభూపాల్, రాంభూపాల్రెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, నరేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, సీపీఎం నాయకులు రాములు, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు రాజేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ తదితరులు సంఘీభావం తెలిపారు. -
నవజాత శిశువు ఘటనలో ముగ్గురు అరెస్ట్
● మైనర్ బాలికకుప్రేమ పేరుతో వేధింపులు మహబూబ్నగర్ క్రైం: అర్ధరాత్రి నడిరోడ్డుపై నవజాత శిశువును వదిలివేసిన ఘటనలో బాలిక తల్లి, తండ్రి, బాబాయిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు. కోయిలకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 8వ తరగతి నుంచే గార్లపాడ్కు చెందిన సెట్రింగ్ కూలీ ఆనంద్తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో అతడు బాలికను మోసం చేయడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక 9 నెలల పాటు తల్లిదండ్రులకు చెప్పకుండా దాచింది. సెప్టెంబర్ 4న అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబేద్కర్ చౌరస్తా–న్యూటౌన్ మధ్యలో ప్రసవమై మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లి, తండ్రి, బాబాయి కలిసి శిశువును హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట రోడ్డుపై వదిలేసి బాలికను గ్రామానికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితులను గుర్తించారు. బాలిక తల్లి, తండ్రి, బాబాయిను అరెస్టు చేశారు. ఆనంద్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసును భరోసా కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలికలు ప్రేమ పేరుతో మోసపోయి వారి భవిష్యత్ను నాశనం చేసుకోరాదని సూచించారు. సమావేశంలో ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు, ఏఎస్ఐ సాయి నిర్మల దేవి, సిబ్బంది శేఖర్, అశోక్, కురుమూర్తి పాల్గొన్నారు. -
రేపల్లెలో పోలీస్ పికెటింగ్
గద్వాల క్రైం: గద్వాల మండలం రేపల్లెకు చెందిన దళిత రంగముని, బోయ మహేశ్వరి ఇద్దరు మేజర్లు కావడంతో కులాంతర వివాహ చేసుకున్న ఘటనపై అమ్మాయి కుటుంబ సభ్యులు గురువారం అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లను కూల్చివేసిన ఘటన విధితమే.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృస్టించింది. ఈ మేరకు జిల్లా పోలీసుశాఖ రేపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు పికెటింగ్ను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పట్టిష్టమైన బదోబస్తు నిర్వహించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తుల వివరాలను తెలుసుకున్నారు. రెండు సామాజిక వర్గాలకు చెందిన నివాస గృహాల్లోని బంధువుల వివరాలను ఆరా తీశారు. ఇళ్లు కూల్చివేత సమయంలో ఎంతమంది వచ్చారు. కూల్చివేతకు ఉపయోగించిన వాహనాలు, వాటిని గ్రామంలోకి తీసుకొచ్చిన వ్యక్తులేవరు..? ప్రస్తుతం వాహనాలు ఎక్కడున్నాయి.? తదితర అంశాలపై బృందాలుగా వీడిపోయి కూపీ లాగారు. బాధిత కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. కూల్చివేతకు వచ్చిన క్రమంలో మారణాయుధాల వంటివి ఉపయోగించారనే విషయాలపై గ్రామస్తులను అడిగి తెలుసున్నారు. ఆగ్రహం వ్యక్తం కులాంతర వివాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహించి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుందని ఎమ్మార్పీస్, సీపీఎం జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలను నివారించి మతం, జాతీ భేదం లేకుండా ఉంటున్న గ్రామాల్లో ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి బీసీ కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడం చట్ట వీరద్దమైన ఘటనగా మారిందన్నారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన నిందితులు, ఘటనకు కారకుడైన సర్పంచ్ను కూడా అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతధికారులు గ్రామాన్ని సందర్శించి దళితులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి, రక్షణ ఇవ్వలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, కుర్మన్న, రాజు, పరుశరాము, కన్నా, శ్రీనివాసులు, ఇమ్మానియేలు, ఆశన్న, పరంజ్యోతి తదితరులు ఉన్నారు. ఇళ్లు కూల్చిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పోలీసుల అదుపులో నిందితులు ఆగ్రహ వక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ, సీపీఎం సంఘాల నాయకులు -
బతుకుదెరువు కోసం వలస.. పసిపాప బలి
మదనాపురం: బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లిన ఆ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. ఇంట్లో జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి జూలీ మృతిచెందడంతో స్వగ్రామమైన దుప్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రాము, సుధ దంపతులకు ముగ్గురు పిల్లలు. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏడాది క్రితం హైదరాబాద్కు వెళ్లారు. రాము హిటాచీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సుధ పిల్లల సంరక్షణ చూసుకుంటోంది. గురువారం రాత్రి ఇంట్లో స్నానానికి నీటిని వేడి చేస్తుండగా.. ఆగుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఐదేళ్ల జూలీ వేడినీటి బకెట్లో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు దుప్పల్లికి చేరుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు బంధువులను, గ్రామస్థులను కలచివేశాయి. బతుకుదెరువు కోసం ఊరు విడిచిన ఆ కుటుంబానికి.. చివరికి పసిపాపను కోల్పోయిన కడుపుకోత మిగిలింది. ● వేడి నీళ్ల బకెట్లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి ● దుప్పల్లిలో మిన్నంటిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు -
ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలో గుర్తింపు
● 24న పీయూలో ఉద్యమకారుల సమ్మేళనం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈనెల 24న జరుగనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కోకన్వీనర్ నాచా శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతు ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశం ఈనెల 24న పాలమూరుయూనివర్సిటీలో జరుగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గౌరవ అతిథులుగా కే.కేశవరావు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, రాములునాయక్, అద్దంకి దయాకర్, శోభన్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ చైర్మన్ పిడమర్తి రవి హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రహీం ఓయూ జేఏసీ అధ్యక్షులు, రాములు, అన్వర్, గడ్డమీది గోపాల్, బ్రహ్మం, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్స్
● భారీ గణనాథులు బీచుపల్లికి తరలించేలా ఏర్పాట్లు ● చెరువులు పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి పాలమూరు: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా విగ్రహాలు నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా వెల్లడించారు. పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కృత్రిమ బేబీ పాండ్తోపాటు పాలకొండ చెరువు, శ్రీనివాసకాలనీ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి చెరువులను శుక్రవారం కలెక్టర్ ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు. అప్పన్నపల్లి చెరువు వద్ద ఎక్కువ వినాయక విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున రెండు పెద్ద బేబీ పాండ్లు నిర్మించాలన్నారు. నిమజ్జన కేంద్రాల దగ్గర విద్యుద్దీపాలు, బారీకేడ్లు, పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం అనంతరం విగ్రహాల అవవేషాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ప్రతి బేబీ పాండ్ దగ్గర నిరంతరం పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. నగరం నుంచి వెళ్లే భారీ గణనాథులను బీచుపల్లిలో నిమజ్జనం చేసేలా గద్వాల కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్ చెప్పారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచోసుకోకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి పాల్గొన్నారు. ● మండపాల వివరాలను https://policeportal .tspolice.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్స్టేషన్, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం నిమజ్జనానికి వినియోగించే వాహనం తదితర సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. -
హాస్టల్ డిపాజిట్ ఫీజును తగ్గించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ డిపాజిట్ ఫీజు (మెస్) ను తగ్గించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బీసీలు బాలురకు రూ.12,100, బాలికలకు రూ.19,100, ఎస్సీ, ఎస్టీలు బాలురకు రూ.11,100, బాలికలకు రూ.9,100, ఓసీలు బాలురకు రూ.18,100, బాలికలకు రూ.16,109 ఉండేదన్నారు. ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా బాలురకు రూ.18,000, బాలికలకు రూ.16,100 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇంత మొత్తం చెల్లించలేరని రూ.12 వేలకు తగ్గించాలన్నారు. నేడు జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ పాలమూరు: జిల్లాలోని మూడు కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర కోర్టుల్లో కలిపి ఏడు బెంచీల్లో ఉదయం 10 గంటల నుంచి కేసుల పరిష్కారం ఉంటుందన్నారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని వారి కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు. తగ్గిన లడ్డు పరిణామం.. కేసు నమోదు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి
అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొమిరెడ్డిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిపై అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. నిర్ధేశిత నిబంధనలు, మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రీసర్వేలో భూ వివరాల నమోదును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ బగ్గి కమలమ్మ, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
కార్పొరేషన్లో కలకలం
● ‘ఎవరు చెబితే.. హైమాస్ట్లు’ కథనంపై తీవ్ర చర్చ ● విచారణ జరిపిస్తామన్న కమిషనర్ రామాంజులారెడ్డి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పరిధిలో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ల బాగోతంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎక్కడపడితే అక్కడ.. అవసరం లేనిచోట్ల కూడా వాటిని ఏర్పాటు చేశారని శుక్రవారం ‘సాక్షి’లో ‘ఎవరు చెబితే హైమాస్ట్లు’ కథనం కార్పొరేషన్లో ఒకింత కలకలం సృష్టించింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో వీధిలైట్లు ఉండగా అవి కాకుండా అనవసరంగా హైమాస్ట్ లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారని, ఎవరు చెబితే ఏర్పాటు చేశారనే విషయంపై అటు కార్పొరేటర్లు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి స్పందిస్తూ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఎక్కడెక్కడ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.. ఎక్కడ అవసరం మేరకు వినిగిస్తున్నారు.. అనవసరంగా ఏవైనా ఉన్నాయా.. అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాక్షిలో ప్రచురితమైన కథనం -
వెంకటాపూర్ కల్లు డిపోలో హైడ్రామా
● తారాస్థాయికి చేరిన భాగాల పంచాయితీ ● ఆదాయంలో వాటా కావాలని ఇరువర్గాల ఘర్షణ ● రూరల్ పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసులు నమోదు మహబూబ్నగర్ క్రైం: ఒక సొసైటీలోని రెండు వర్గాల మధ్యలో ఉన్న అంతర్గత భేదాలు భగ్గుమన్నాయి. దీంతో గత 48 గంటల నుంచి వెంకటాపూర్ కల్లు డిపో దగ్గర హైడ్రామా సాగుతుంది. కల్లు డిపో పరిధిలో ఉన్న 15 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపై తమకంటే.. తమకు భాగాలు (వాటా) కావాలంటూ రెండు రోజుల నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం పాతవర్గం అంటూ చెప్పుకొనే వారిలో దాదాపు వందమంది వరకు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత నూతనంగా ఎంపికై న సొసైటీ వాళ్లు అక్కడికి చేరుకోగా.. ఎవరికి వారు అనుకూలంగా నినాదాలు చేసుకున్నారు. ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకోగా ఎస్ఐ విజయ్కుమార్కు రెండు వర్గాలు రాత పూర్వకంగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారిలో 14 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా కల్లు డిపో లోపలికి ప్రవేశించి, దాడులు చేయడానికి ప్రయత్నించారనే అంశంపై సొసైటీ అధ్యక్షుడు శరత్బాబుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీధర్గౌడ్తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మరోవైపు మురళీధర్గౌడ్ సైతం కల్లు డిపోలో కల్లు తయారీ చేయకుండా విచారణ చేయాలనే దానిపై వినతిపత్రం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తోంది.. సొసైటీ ఎన్నికల నిర్వహణతోపాటు కల్లు దుకాణాల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల నుంచి రెండువర్గాల మధ్య గొడవ జరుగుతుంటే తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈఎస్ సంతకం ఫోర్జరీ చేశారనే విషయాన్ని మహబూబ్నగర్ ఈఎస్ సుధాకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా మా సంతకాలు ఎవరూ ఫోర్జరీ చేయలేదని, కల్లు డిపో వ్యవహారం పూర్తిగా వారి అంతర్గత విషయం అని చెప్పడం గమనార్హం. రెండు నెలల కిందట ఎన్నికలు వెంకటాపూర్ కల్లు డిపో నూతన సొసైటీ కోసం జూలై 4న టీఎన్జీఓ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో శరత్బాబుగౌడ్ ప్యానెల్ గెలుపొందింది. ఇందులో అప్పటి వరకు 23మంది సభ్యులు ఉండగా మరో 13 మందిని కూడా కలిపే వరకు ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకువస్తే వాటిని పట్టించుకోకుండా ఎకై ్సజ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికలు జరిపారని మరోవర్గం ఆరోపిస్తోంది. ట్యాపింగ్ టెస్ట్ అడ్డుకొని వారికి నచ్చినట్లు ఎన్నికలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతల ప్రమేయంతో పాత వర్గానికి వాటా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాజీమంత్రితోపాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రోద్బలంతోనే సొసైటీలో కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడానికి వచ్చారని ప్రతాప్గౌడ్ ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై గిట్టక మాజీ మంత్రి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి అడ్డుకోవడానికి పంపించారని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ ఈఎస్ సంతకంతోపాటు స్టాంపులు ఫోర్జరీ చేశారని దీనికి సంబంధించి 13 మందిపై ఫోర్జరీ కేసులు నమోదవుతున్న క్రమంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వెంకటాపూర్ డిపో మీదకు దాడికి వచ్చారని ఆరోపించారు. సొసైటీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండు నెలలపాటు వారికే సమయం ఇచ్చి.. ఆ తర్వాత తమ ఆధీనంలోకి డిపోను తీసుకుని కల్లు తయారీ ప్రారంభించిన మొదటిరోజే దాడికి రావడం సరికాదన్నారు. కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఉంటే బాగుండేదని అలా కాకుండా కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ ● నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు ● దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు ● డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ● ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్కు సాఫీగా నీరు నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్లో నీళ్లు ఉంటే రిజర్వాయర్లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ నాగర్కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. -
ఉత్సాహంగా యోగా జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగా సంఘం వర్కింగ్ చైర్మన్ రాములు, సలహాదారులు చెన్న వీరయ్య తదితరులు క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల సందర్బంగా క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘం సభ్యులు ఆర్.బాలరాజయ్య, షంషేర్అలీ, వెంకటేశ్, రజనీ, మణికంఠ, నాగరాజు, బాలమణి, సాగర్, స్వప్న, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వస్తూ అనంత లోకాలకు..
● లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు ● నలుగురు మిత్రులు జోగుళాంబ ఆలయాలకు వెళ్తుండగా ప్రమాదం ● గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఘటన ఎర్రవల్లి: జోగుళాంబ ఆలయాలకు దర్శనానికి వె ళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్, స్థా నికులు తెలిపిన కథనం మేరకు.. హైదరాబాద్లోని మేడ్చల్– మల్కాజ్గిరికి చెందిన ముఖేష్ తన మి త్రులు సాయిరాం(37), మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మౌనిక (25), గద్వాలకు చెందిన రాఘవతో కలిసి జోగుళాంబ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ క్రమంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలి యన్ పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న సాయిరాం, మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా ముఖేష్, రాఘవ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గద్వాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాఘవ పరిస్థితి విషమంగా ఉంది, మృతుడు సాయిరామ్కు భార్య మాధురితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాలకు గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అతివేగమే ప్రమాదానికి పూర్తి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కబడ్డీ ‘అకాడమీ’కి కూత
మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరు జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియం క్రీడలకు అడ్డాగా మా రుతోంది. ఇప్పటికే బాల, బాలికల వాలీబాల్ అకాడమీలు కొనసాగుతుండగా.. తాజాగా రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ ఇక్కడ అందు బాటులోకి వచ్చింది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అత్యుత్తమ శిక్షణ అందించాలనే లక్ష్యంతో డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో అదనపు విభాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈనెల 7వ తేదీ (సోమవారం) నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. 20 మంది బాలురకు ప్రవేశాలు డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేశారు. కబడ్డీ అకాడమీలో బాలురకు ప్రవేశాల కోసం గత నెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులతో కూడిన సెలక్షన్ కమిటీ సమక్షంలో ఎంపికలు జరిగాయని డీవైఎస్ఓ తెలిపారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీలో ప్రవేశాలు పొందిన 20 మంది బాలుర పేర్ల వివరాలను మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు: బి.కౌషిక్, పి.లక్ష్మిగణేష్ (ఖమ్మం), ఎం.నందకిషోర్ (వనపర్తి), సీహెచ్ రాహుల్ (నిజామాబాద్), వి.గౌతమ్ (మహబూబ్నగర్), బి.అజయ్ (నిజామాబాద్), ఎ.లింగు (ఆదిలాబాద్), ఎస్కే.రేహాన్ బాబా (నల్గొండ), బి.అర్జున్ (కామారెడ్డి), ఎ.భానుప్రకాశ్ (నల్గొండ), చరణ్ (మహబూబాబాద్), జి.లోకేష్ (ఆదిలాబాద్), ఖాజా అజీమ్ ఖాద్రీ (కరీంనగర్), ఎం.రోహిత్ (వరంగల్), కె.నీలకంఠ, ఎంకె జయక్రిష్ణ (మహబూబ్నగర్), డి.శివకుమార్ (వనపర్తి), ఎం.శివ శంకర్ (మహబూబ్నగర్), వి.సచిన్ (వికారాబాద్), జె.ఉమేష్కుమార్ రెడ్డి (ఖమ్మం). రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ 20 మంది క్రీడాకారులకు ప్రవేశాలు.. పాలమూరులో నేటి నుంచి ప్రారంభం సబ్జూనియర్ నుంచి జాతీయ స్థాయి పోటీలే లక్ష్యం -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నియోజకవర్గంలో 13 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూమిపూజలు చేశామని, ఇప్పటికే 550 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు అందించామని తెలిపారు. తాజాగా మరో 800 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని, వాటిని మండలాల వారీగా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.● ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి ● 800 ట్రాన్స్ఫార్మర్లు.. మండలాల వారీగా పంపిణీ -
21 క్వింటాళ్ల నల్లబెల్లం, పటిక పట్టివేత
ఉప్పునుంతల: నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్న మినీలారీని పోలీసులు పట్టుకున్నారు. నాగర్కరూన్ల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వెల్టూరు స్టేజీ సమీపంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులను గమనించిన డ్రైవర్ వాహనాన్ని పొలాల్లోకి మళ్లించి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు మినీలారీని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 21 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు కిలోల పటిక లభించింది. పరారైన డ్రైవర్ను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి బాపూజీనగర్కు చెందిన అల్లకుంట శంకర్గా గుర్తించినట్లు ఎస్ఐ పుట్ట మహేష్గౌడ్ తెలిపారు. వాహన యజమాని అదే గ్రామానికి చెందిన పిట్ల రాజాపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉప్పునుంతల మండలంలోని తండాలు, గ్రామాల్లో విక్రయించేందుకు వీటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. ● పోలీసులను చూసి మినీలారీని పొలాల్లోకి తీసుకెళ్లిన వైనం ● డ్రైవర్ పరారీ.. వాహనం యజమానిపైనా కేసు -
రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పల్లె రవి మృత్యువాతమహబూబ్నగర్ క్రైం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు పల్లె రవి మృతి చెందారు. బైక్పై రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని క్రిస్టియన్పల్లికి చెందిన పల్లె రవి(48) భార్య వరలక్ష్మితో కలిసి బైక్పై శనివారం రాత్రి 9 గంటల సమయంలో క్రిస్టియన్పల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి తీవ్రంగా గాయపడగా, భార్య వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రవిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పల్లెరవిని కోల్పోవడం బాధాకరం.. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పల్లె రవి లాంటి నిబద్ధత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పల్లె రవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో పల్లె రవి చిత్రపటానికి పూలమాల వేశారు. రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్ నరేందర్, గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవిని కోల్పోవడం దురదృష్టకరం.. ఉద్యమకారుడు పల్లె రవి మృతదేహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రవితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఆయన మృతి ఎంతో బాధించిందని వాపోయారు. విప్తో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ఖాద్రీ, నాయకులు మైత్రియాదయ్య నివాళి అర్పించారు. -
అర్హులైన వారు ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలి
రాజాపూర్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్లో భాగంగా ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఫారం–6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులు, సవరణల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్లో నోటీసులు అందుకున్న వారికి ఈనెల 19న హియరింగ్ నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ భారతి తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడాలని అదనపు కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ మంజుల, జీపీఓ కృష్ణయ్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు మౌలిక వసతులు కల్పిస్తాం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఎంప్లాయీస్కాలనీలో కొత్తగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి ఆవరణలోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, దీని నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగిస్తామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాలకులవి కార్మిక వ్యతిరేక విధానాలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్నగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు పాలకులు యథేచ్ఛగా దేశ సంపద, వనరులు దోచిపెడుతున్నారని విమర్శించారు. దీంతో అసమానతలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు పెరగనందున కొనుగోలు శక్తి పడిపోయి కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.పార్టీ నాయకులు వి.కురుమూర్తి, కిల్లె గోపాల్, లక్ష్మయ్య, వి.పద్మ, బొల్లె చంద్రకాంత్, రాజ్కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. తండా సమస్యలపై అదనపు కలెక్టర్ ఆరా భూత్పూర్: మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన పోతుగుట్టతండాలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదివారం పర్యటించి తండావాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో ప్రభుత్వ భవనాలు, అంగన్వాడీ కేంద్రం, ఓటర్ల జాబితాలోని తప్పులపై వివరాలు సేకరించారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ కిషన్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్, జీపీఓ ప్రణీత్, తండావాసులు పాల్గొన్నారు. పోలింగ్కేంద్రాల పరిశీలన భూత్పూర్ (అడ్డాకుల): అడ్డాకుల మండలం శాఖాపూర్ 103,104 పోలింగ్ కేంద్రాలను, మూసాపేట మండలం జానంపేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల, ఎన్నికల సంబంధిత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 24న పీయూలో ఉద్యమకారుల సమ్మేళనం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 24న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉంటుందని పీయూ ఉద్యమకారుల కమిటీ సభ్యులు అన్వర్, రాము తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీయూ ఆవరణలో సమ్మేళనం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలల ఉద్యమకారులు ఆ రోజు జరిగే సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మం, శివ, కొండా గణేష్, చంద్రకాంత్గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, గోపాల్, సుగుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో మాస్టర్ కేశవ్
జడ్చర్ల టౌన్: గంగాపురం వాసి, జడ్చర్ల కేంద్రంగా అమెచ్యూర్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న మాస్టర్ కేశవ్గౌడ్కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్ రామకోటిలోని తెలంగా ణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘గ్లోబల్ ఎక్స్లెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 400 మందిని ఒకే వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అసాధారణ విజయంగా గుర్తిస్తూ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు. ఈ సందర్భంగా కేశవ్గౌడ్ను జీనియస్ బుక్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రవీందర్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్గౌడ్ తదితరులు సత్కరించారు. కేశవ్గౌడ్కు రికార్డులో చోటు దక్కడంపై గంగాపురం వాసులు, జడ్చర్లలోని కరాటే సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
రింగ్లో పంచ్.. మెడలో మెడల్స్!
● పంచ్ పవర్తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు ● బాక్సింగ్లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాక్సింగ్ రింగ్లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్షిప్కు ఎంపిక కాగా.. మహబూబ్నగర్కు చెందిన ఎం.రాజు, నాగర్కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్షిప్కు ఎంపికై ంది. భవిష్యత్లో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్నగర్ క్రీడలు -
మూగజీవిపై.. అమానుషం!
తిమ్మాజిపేట: చేను మేసిందనే కారణంతో ఓ వ్యక్తి నాలుగు నెలల లేగదూడను ట్రాక్టర్కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మండలంలోని లక్ష్మణ్నాయక్తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన అర్షద్ పొలంలో పాండునాయక్కు చెందిన లేగదూడ చేను మేసింది. దీంతో ఆగ్రహించిన అర్షద్ దూడను ట్రాక్టర్కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన తండావాసులు వెంటనే దూడ యజమాని పాండునాయక్కు సమా చారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయ న తీవ్రంగా గాయపడిన దూడను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసు లు అర్షద్పై కేసు నమోదు చేశారు. గాయపడిన లేగదూడ పరిస్థితి విషమంగా ఉందని యజమాని తెలిపారు. ● చేను మేసిందని లేగ దూడను ట్రాక్టర్కు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం ● నిందితుడిపై కేసు నమోదు -
దళితులను తక్కువ అంచనా వేయొద్దు
● రోడ్లపైకి వస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ● ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ వనపర్తి టౌన్: వనపర్తిలో ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికేందుకు దళిత, బహుజన, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కర్మగుడి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నప్పుడు దళితులు, బడుగు బహుజనులు, గిరిజనులు ఎందుకు ఏకం కాకూడదని ప్రశ్నించారు. రాజ్యాధికారంలో ప్రతి సామాజిక వర్గానికి సమాన హక్కు, భాగస్వామ్యం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న దళితులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం స్తంభించిపోతుందని పేర్కొన్నారు. ప్రతి కులానికీ గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, గిరిజనులు, దళితులు తమ చరిత్రపై గర్వపడాలని సూచించారు. దళితులు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాడల కురుమన్న, అనంతరాజు, పులిభీముడు, గట్టయ్య, రామకృష్ణ, సూర్యప్రకాశ్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. -
కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలి గల్లంతు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లి వార్డులో ఉన్న కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిలార్పల్లికి చెందిన అంజనమ్మ (70) ఆదివారం ఉదయం కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంత సేపటికి వృద్ధురాలు తిరిగి రాకపోవటంతో కొడుకు పర్వతాలు మిత్రులు, బంధువులతో కలిసి గాలించారు. అయితే అదే గ్రామానికి చెందిన చిన్నారి రాధిక తనకు అవ్వ కేఎల్ఐ కాల్వ వద్ద కనిపించిందని చెప్పడంతో కాల్వ వద్దకు వెళ్లి చూడగా అంజనమ్మ చెప్పులు, చేతికర్ర కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు కొనసాగిస్తామని ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. పిచ్చికుక్క కాటుకు ఒకరు బలి తెలకపల్లి: పిచ్చికుక్క కా టు వేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చో టు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని వ ట్టిపల్లికి చెందిన జలాల శ్రీనివాస్యాదవ్ (40) గత నెలలో పని నిమి త్తం తెలకపల్లికి వెళ్లాడు. అక్కడ ఓ పిచ్చి కుక్క కాటు వేసింది. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికి త్స అనంతరం ఇంటికి వచ్చాడు. కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో హైదరా బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.మృతునికి భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. శ్రీనివాస్యాదవ్ మృతితో గ్రా మంలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లి మందలింపు.. కుమారుడి బలవన్మరణం కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సత్యహళ్లి గ్రామానికి చెందిన ఎం.కుమార్ (27) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఎం.విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు కుమార్. అయితే కొంతకాలంలో పనులు చేయకుండా తిరుగుతుండడంతో మూడు రోజుల క్రితం తల్లి పార్వతమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం అప్పరాల శివారులోని చెప్పరోని గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కుమార్గా గుర్తించిన పోలీసులు.. ఆయన అన్న శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో మృతదేహం లభ్యం వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణంలోని మహభూపాల్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. పురుషుడి (40) మృతదేహం తేలాడుతూ ఉందని తమకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా బ్లూకలర్ జీన్స్ పాయింట్ ధరించి, కుడి చేతికి వెండి కడెం ధరించి ఉన్నాడన్నాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురికి తరలించామన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే పెబ్బేరు పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
ముకుందా.. ముకుందా..
● మన్యంకొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ● వైభవంగా శేషవాహన సేవ.. తరలివచ్చిన వేలాది భక్తులు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరా త్రి ఉట్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఓబ్లాయపల్లి భక్తులు పాల్గొని ఉత్సవాన్ని ముగించా రు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అ భిషేకాలు నిర్వహించారు. శ్రావణమాసం సంద ర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలా ది మంది భక్తులు తరలిరావడంతో మన్యంకొండ భక్తజన సంద్రంగా మా రింది. శ్రావణమాసం సందర్భంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న శేషవాహన సేవలో భాగంగా శనివా రం రాత్రి స్వామివారిని శేషవాహనంపై కొలు వుదీర్చి మ ంటపం వరకు ఊరేగించారు. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడు మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహ రి మధుసూదన్కుమార్,ఈఓ శ్రీనివాసరాజు, పా లకమండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
కొడుక్కు అంత్యక్రియలు చేసిన తల్లి
● నీటికుంటలో పడి పెద్ద కుమారుడు మృతి ● గతంలో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు దుర్మరణం ● రెండు నెలల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయిన వైనం మిడ్జిల్: చస్తే కాశీలో చావాలి.. లేదా కన్న కొడుకు ఒడిలో మృతి చెందాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది కన్న కొడుకులకు ఆ తల్లి తలకొరివి పెట్టాల్సిన దురదృష్టం ఆమెను వెంటాడుతుంది. గతంలో భర్తను కోల్పోయిన ఆ తల్లి రెండు నెలల వ్యవధిలో ఇద్దరు కొడుకులకు అంత్యక్రియలు చేసిన మండలంలోని మసిగొండ్లపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మణెమ్మకు ఇద్దరు కుమారులు వడ్ల శ్రీనివాసులు(43), రాజేందర్(40) ఉన్నారు. ఈ ఏడాది జూన్ 28న మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేందర్ మృతి చెందగా అదే ప్రమాదంలో శ్రీనివాసులు ఆస్సత్రిలో చికిత్స పొందుతుండగా మణేమ్మ చిన్న కుమారుడు రాజేందర్కు అంత్యక్రియలు పూర్తి చేసేంది. తాజాగా ఆదివారం పెద్ద కుమారుడు శ్రీనివాసులు గ్రామ సమీపంలోని పొలంలో ఏర్పాటు చేసిన నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు మూడు, మూడు పెళ్లిళ్లు చేసినా వారి భార్యలు గతంలోనే వదిలి వెళ్లడంతో ఆదివారం పెద్ద కుమారుడు శ్రీను మృతి చెందగా ఆమెనే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులు తనకు ఆసరాగా ఉంటారు అనుకుంటే 65 రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయి మణెమ్మ అనాథగా మిగిలింది. -
పల్లె ప్రగతికి ‘పక్కా’ ప్లాన్!
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను సమగ్రంగా గుర్తించి వచ్చే మూడేళ్లకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీసీడీపీ)కు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి విలేజ్ ప్రొఫైల్ను సిద్ధం చేస్తున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రెయినేజీలు మొదలు సామాజిక భద్రత, మహిళా సంఘాలు, రైతులు, విద్య వంటి వందకుపైగా అంశాలను ఇందులో పొందుపరుస్తున్నారు. అవసరమేంటి.. పనులేంటి? గ్రామంలో ఏ సౌకర్యం ఉంది? ఏది లేదు? ఇంకా ఏం కావాలి? అనే వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలు, నల్లా కనెక్షన్లు లేని ఇళ్లు, తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలు, పాత చేతిపంపులు, మోటార్ల మరమ్మతులు, సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు తదితర అవసరాలను గుర్తిస్తున్నారు. వీటితోపాటు ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులపైనా వివరాలు సేకరిస్తున్నారు. డిజిటల్ గ్రామ ప్రొఫైల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. దీంతో గ్రామానికి సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. పల్లెల ప్రగతికి ఇదే దిక్సూచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మూడేళ్ల అభివద్ధి ప్రణాళిక కోసం వివరాల సేకరణ వేగంగా జరుగుతోంది. ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని గ్రామ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. ఇతర శాఖల ఉద్యోగులు, సర్పంచుల సహకారంతో దీనిని పూర్తి చేయాలని చెప్పాం. ఈ నివేదిక పల్లెల ప్రగతికి దిక్సూచిలా పని చేస్తుంది. – వెంకట్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ మూడేళ్లకు గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 2026–29 లక్ష్యంగా జీపీసీడీపీ రూపకల్పన వందకుపైగా అంశాలపై క్షేత్రస్థాయి వివరాల సేకరణ అవసరాల గుర్తింపు.. ప్రాధాన్యతల వారీగా అభివృద్ధి పనులు ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్.. ఒక్క క్లిక్తో పూర్తి సమాచారం -
ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలి
● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ‘వెయ్యి రోజుల పాలన.. వెయ్యి మోసాలు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీ అనంతరం తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రూ.12 వేల సాయం కోసం ఆశపడి కాంగ్రెస్కు ఓట్లు వేసిన ఆటో కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని, పిల్లల ఫీజులు, ఆటోల కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆటో కార్పొరేషన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతులకు కరెంటు, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆటో నడిపిన శ్రీనివాస్గౌడ్ బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆయనను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో ఆటోలు ర్యాలీగా కదిలాయి. బీఆర్ఎస్ నాయకులు వెంకన్న, శివరాజు, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రాజు, పట్టణ అధ్యక్షుడు బాబుమియా, నగేష్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోస్ భూసేకరణలో రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం
● సాధ్యమైనంత మెరుగైనపరిహారం అందిస్తాం: కలెక్టర్ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బ్రహ్మోస్ ప్రాజెక్టుతో జిల్లాకు పారిశ్రామికంగా కొత్త ఊపు రానున్న నేపథ్యంలో.. భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. చట్ట నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించేలా భూసేకరణ చేపడతామని తెలిపారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై గురువారం కలెక్టరేట్లో నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ భూములకు ఎంత పరిహారం ఆశిస్తున్నారు? మీ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయండి’’ అని రైతులను కోరారు. ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతోపాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమ జిల్లాకు రావడం గర్వకారణమని సర్పంచ్ శివకుమార్ అన్నారు. ప్రాజెక్టుపై గ్రామస్తులు సంతోషంగా ఉన్నప్పటికీ.. భూములు కోల్పోయే రైతుల విషయంలో ఆందోళన ఉందని గ్రామ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. సర్వే వివరాలు పక్కాగా ఉండాలి భూసేకరణ సర్వేలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, పట్టా భూములు, కబ్జా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వివరాలపై రైతులకు అభ్యంతరాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరోసారి గ్రామస్థాయిలో సమావేశమై భూముల ప్రస్తుత ధరలు, వాస్తవ పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మక ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. ప్రాజెక్టు అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ భూసేకరణను పారదర్శకంగా, న్యాయబద్ధంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, సర్పంచులు, రైతులు, పాల్గొన్నారు. -
పీయూలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ పీయూ శాఖ కార్యదర్శి కావలి కిషోర్ డిమాండ్ చేశారు. గురువారం ఏబీవీపీ నాయకులు పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ, విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ, పరిపాలన సేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. శివమార్తండ్, యువకుమార్, తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలి గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అధికారులు హాస్టల్ ఫీజులను ఒకే సారి పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే తగ్గించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బాలికల హాస్టల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్గ సభ్యులు మహేశ్వరి మాట్లాడుతూ ఫీజులు పెంచి ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలామంచ్ కన్వీనర్ శైలజ, క్రితిక, చైతన్య, ప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు రాజీ చేసుకోవాలి
● జిల్లాలో 12న మూడు కోర్టుల్లోజాతీయ లోక్ అదాలత్ ● 4 వేల కేసుల పరిష్కారానికి చర్యలు పాలమూరు: జిల్లాలో ఈనెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో భాగంగా మహబూబ్నగర్ కోర్టులో ఐదు, దేవరకద్ర ఒకటి, జడ్చర్లలో ఒక బెంచీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత వెల్లడించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ ఏడాదిలో ఈ జాతీ య లోక్ అదాలత్ మూడోదని, జిల్లావ్యాప్తంగా 4 వేలు కేసులు రాజీ కోసం గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 200 కేసులు రాజీ చేశామని, మిగిలిన కేసులు ఈ నెల 12న ఉదయం 10గంటల నుంచి రాత్రి వరకు జరగనున్న లోక్ అదాలత్లో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో రాజీ చేసుకోవడానికి వీలు కలిగిన అన్ని రకాల కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని, ప్రధానంగా సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్బౌన్స్, ప్రమాద, బీమా, బ్యాంకు ఫ్రీలిటిగేషన్ వంటి కేసులు రాజీ చేసుకోవచ్చునని వివరించారు. భూమి చారిటబుల్ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు వనపర్తి జిల్లాలో 12 మంది వెట్టి చాకిరి పనిచేస్తున్న గిరిజనులను తమ ప్రత్యేక టీం రక్షించినట్లు న్యాయమూర్తి తెలిపారు. న్యాయమూర్తి ఇందిర పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం
చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ ఖుష్బూగుప్తా, మేయర్ మమత, తదితరులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారు నగర మేయర్ మమతతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. -
ఎవరి ఆదేశాలతో.. ఇన్ని హైమాస్ట్లు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైన హైమాస్ట్ లైట్లు.. ప్రస్తుతం పలు డివిజన్లలో అవసరం ఉన్నా లేకున్నా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ విద్యుత్ స్తంభాలకు లైట్లు ఉన్నప్పటికీ అదనంగా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో కార్పొరేషన్పై నిర్వహణ భారం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ విద్యుత్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.13 కోట్లకు చేరినట్లు సమాచారం. మరోవైపు హైమాస్ట్ లైట్లు, బోర్ల నిర్వహణకు నెలకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణ, విద్యుత్ బిల్లులు కార్పొరేషన్కు భారంగా మారాయి. బోర్లూ.. భారమే మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ పలు డివిజన్లలో అదనంగా బోర్లు, పంప్సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నెలకు 20 నుంచి 30 వరకు బోర్లు పాడవుతుండటంతో మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బోర్ల నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ బిల్లులకు కలిపి నెలకు రూ.15–20 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఎవరు చెప్పారు.. ఎందుకు వేశారు? అవసరం ఉన్నా లేకున్నా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలతో నివేదిక రూపొందించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 60 డివిజన్లలోని ప్రతి హైమాస్ట్ లైట్ వివరాలను సేకరించనున్నారు. ఎవరి సూచనతో ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి ప్రతిపాదన వచ్చింది? అనే అంశాలను పరిశీలించనున్నారు. వార్డు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం (నేడు) నుంచి లైట్ల వద్ద సోషల్ సర్వే నిర్వహించి, సమీపంలోని ఇళ్ల యజమానుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. సర్వే పూర్తయితే హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వెనుక అసలు పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ విషయం మాట్లాడేందుకు కార్పొరేషన్ కమిషనర్ రామాంజులారెడ్డి సంప్రదించగా.. ఆయన స్పందించలేదు. 2 వేలకుపైగా హైమాస్ట్లు కార్పొరేషన్లోని 60 డివిజన్ల పరిధిలో 2 వేలకుపైగా హైమాస్ట్ లైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రతి నెలా సుమారు 100 నుంచి 150 వరకు బల్బులు, హెచ్క్యూలు, వైర్లు తదితర పరికరాలు పాడవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలోనే పెద్ద సంఖ్యలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల ఏర్పాటు చేసిన కొన్ని లైట్లు సైతం పనిచేయడం లేదని, వాటికి వారంటీ, గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరం లేకున్నా.. ఇష్టానుసారంగా ఏర్పాటు కార్పొరేషన్ పరిధిలో 2 వేలకుపైగా లైట్లు రూ.13 కోట్ల కరెంట్ బకాయిలు.. నెలకు రూ.40 లక్షల ఖర్చు ‘హైమాస్ట్’లు ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై నేటి నుంచి సోషల్ సర్వే -
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన నవీన్రెడ్డి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సుమారు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు కొత్త రెగ్యులర్ డీఎఫ్ఓగా మందాడి నవీన్రెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా అటవీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఖుష్బూగుప్తాను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ భూములను ఆక్రమించి, అక్రమ చెట్ల నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ను ముమ్మరం చేయడంతో పాటు జిల్లావ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. కాగా, ఈయన యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) 2019 బ్యాచ్లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. గతంలో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) లో విధులు నిర్వహించిన సమయంలో వేసవి తీవ్రతలో వన్యప్రాణులకు తాగునీటి కొరత లేకుండా అటవీ ప్రాంతంలో సోలార్ బోర్లను ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నీటి తొట్టె (సాసర్ పిట్స్)లను ఎప్పటికప్పుడు నింపేలా చర్యలు తీసుకున్నారు. రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 13న ‘కబడ్డీ’ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు జిల్లాస్థాయి జూనియర్ బాలు ర, సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే జూనియర్ బాలురు 05.11.2006 తర్వాత పుట్టినవారై 75 కేజీల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికలు 13.12.2010 తర్వాత పుట్టిన వారై 55కేజీల లోపు బరువు ఉండాలని పేర్కొ న్నారు. క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ ఒరిజనల్ మెమో, జనన ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 26 నుంచి 29 వరకు జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్ కో రారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ము గించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్ దీప్లానాయక్, చందర్నాయక్, ముడావత్ మణికంఠ, కుమార్, పవన్, మోహన్, ఈశ్వర్, చందర్ పాల్గొన్నారు. -
దొంగతనం కేసుల్లో రివకరీ వేగవంతం కావాలి
● పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి ● గణపతి ఉత్సవాల్లో కట్టుదిట్టంగా బందోబస్తు: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: పోలీస్స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసులకు అధిక ప్రాధన్యత ఇచ్చి దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలు, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. మాదకద్రవ్యాలు, సైబర్నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా నిరంతరం అవగహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. ప్రధానంగా దొంగతనం కేసుల్లో నేరస్తులను సకాలంలో గుర్తించి సొమ్ము రికవరీ చేయాలని సూచించారు.మహిళలు, అమ్మాయిలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామంతో పాటు పట్టణం, మండలకేంద్రాల్లో ఉండే ప్రధాన కూడళ్లు, వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చైతన్యం చేయాలన్నారు. ఈ నెల 14 నుంచి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని మండపాలపై నిఘా పెట్టాలని, రాత్రి వేళ గస్తీ పెంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, రాజేందర్రెడ్డి, క్రిష్ణ, మోతీరాం, రామకృష్ణ, రవిబాబు, మహేష్, నర్సింహులు, ఎస్హెచ్ఓలు, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సీఎందే బాధ్యత
● ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సీఎం రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీలోకి రాకుండా చేయాలనే కుట్రతోనే గేటు వద్ద పోలీసులు రాద్ధాంతం సృష్టించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు దురుసుగా వ్యవహరించిన ఘటనపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఫేక్ ఫొటోల ఆధారంగా కేసులు పెడుతున్నారని, తమ ఎమ్మెల్యేల తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎం, మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఎత్తిపోతలకు విఘాతం
నాగర్కర్నూల్: కరెంట్ కష్టాలు రైతులకే కాదు.. ఏకంగా సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సైతం మొదలయ్యాయి. రాత్రివేళ మూడు రిజర్వాయర్ల వద్ద నీటిని ఎత్తిపోసే పంపుసెట్లు ఆపేయాలని.. ఉదయం వేళ నడపాలని ఎస్ఎల్డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో కొన్ని రిజర్వాయర్ల వద్ద రాత్రివేళ పంపులను ఆపేసి.. మరికొన్ని చోట్ల ఒక పంపుసెట్ నడుపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా కాల్వల నీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మూడు రిజర్వాయర్లు.. కేఎల్ఐ పరిధిలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రేగుమాన్గడ్డ వద్ద ఎల్లూరు రిజర్వాయర్కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడ ఐదు పంపుసెట్లకు గాను ప్రస్తుతం రెండు మరమ్మతుకు గురవగా మూడు నడుస్తున్నాయి. ఎల్లూరు నుంచి సింగోటం గ్రావిటీ మీదుగా జొన్నలబొగుడకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐదు పంపులు ఉండగా మూడే నడుపుతున్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ కాల్వలకు వదులుతారు. గ్రావిటీ మీద నీరు పారుతుండగా ప్రధాన కాల్వ 160 కి.మీ., కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మరో 60 కి.మీ., మాడ్గుల మండలం నాగిళ్ల వరకు టెలెండ్ కాల్వ వెళ్తుంది. 13 గంటలకు కుదింపు.. ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి 18 నుంచి 13 గంటలకు కుదించారు. అయితే వాస్తవ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పది గంటలే సరఫరా అవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్య కేఎల్ఐ పంపుసెట్లకు తాకడం ఆందోళనకరం. ఎస్ఎల్డీసీ (లోడ్ డిస్పాచ్ సెంటర్) విద్యుత్ వాడకంపై నియంత్రణ విధిస్తున్నారు. మూడు రోజుల నుంచి కేఎల్ఐ పంపుసెట్ల విద్యుత్ వాడకంపై నియంత్రణ చేయాలని, రాత్రివేళ నిలిపివేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు నిలిపివేస్తే లోడ్ కంట్రోల్ చేయవచ్చని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేసినా.. కేఎల్ఐ సాగునీరు విడుదలతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపారు. ప్రస్తుతం కేఎల్ఐ కాల్వలో పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. అది కూడా ఎప్పుడు ఆగిపోతాయోనని, చివరికి పంటలు చేతికి వస్తాయో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో కేఎల్ఐ పంపింగ్కు ఆటంకాలు జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల వద్ద మోటార్ల నిలిపివేత ఎస్ఎల్డీసీ సూచన మేరకు రాత్రివేళ నిలుపుదల సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం -
సూచిక బోర్డును ఢీకొన్న డీసీఎం
● మంటలు చెలరేగి క్లీనర్ సజీవ దహనం.. 270 మేకలు మృతి ● భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భూత్పూర్: అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా మేకల లోడ్ వెళ్తున్న లారీ హైవేపై సూచికల బోర్డును ఢీకొట్టిన ఘటన భూత్పూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి డ్రైవర్ రషీద్ క్లీనర్ అమిత్కుమార్, ఇద్దరు కూలీలు అబ్దుల్ బారి, ఇస్తికర్తో కలిసి 270 మేకలను బెంగుళూరుకు డీసీఎంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో డీసీఎం భూత్పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై రాష్ట్రాలు, కిలోమీటర్ల దూరాన్ని సూచించే సూచికల బోర్డు దిమ్మెను వేగంగా ఢీకొట్టడంతో బోల్తాపడింది. వెంటనే మంటలు చెలరేగాయి. డీసీఎంపైన ఉన్న క్లీనర్ అమిత్కుమార్ (32)తో పాటు 270 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. డ్రైవర్ రశీద్, అబ్ధుల్ బారి, ఇస్తికర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టగా.. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను పూర్తి నియంత్రించాయి. మృతుడు అమిత్కుమార్ చిన్నాన్న దయాశంకర్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ రషీద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగయ్య తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన ప్రమాద ఘటన స్ధలాన్ని ఎస్పీ జానకీ పరిశీలించారు. ప్రమాద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, భూత్పూర్ ఎస్ఐ నాగన్న, మూసాపేట ఎస్ఐ వేణు, అగ్నిమాపక సిబ్బంది, స్ధానిక పోలీసులు ఉన్నారు. -
అబ్దుల్ రాఫే సెంచరీ
మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ అండర్–23 మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్స్ 4–డే టోర్నమెంట్లో జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా ప్రతిభచాటాడు. టోర్నీలో టీమ్–బీకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అబ్దుల్ రాఫే అద్భుతమైన సెంచరీతో రాణించాడు. గురువారం టీమ్–సీ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో అబ్దుల్ రాఫే సెంచరీతో రాణించాడు. 220 బంతుల్లో 19 ఫోర్లు కొట్టి 129 పరుగులు చేసి సత్తాచాటాడు. టీమ్–బీ జట్టు 89 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే సెంచరీ సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మార్కెట్లోకి న్యూ బాలెనో పాలమూరు: వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మారుతీ కంపెనీ మరో కొత్త మోడల్ న్యూ బాలెనో కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. నగరంలోని మారుతీ నెక్సా షోరూంలో గురువారం శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి న్యూ బాలెనో కారును మారె్క్ట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ న్యూ బాలెనో కారు 1200 సీసీ ఇంజిన్, క్రోమ్ గ్రిల్, లెదర్ సీట్స్, లెవెల్ 2 అడాస్, రియర్ ఏసీవెంట్స్, ఆరు ఎయిర్బ్యాగ్స్, ఫ్రంట్ వెంటిలేటర్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. 360 వ్యూ కెమెరా, స్పేసియస్ క్యాబిన్, పెట్రోల్ వెర్షన్లో 24.77 కి.మీ. మైలేజ్ ఇస్తుందన్నారు. ఆరు రంగుల్లో అందుబాటులో ఉందని.. ఎక్స్ షోరూం ధర రూ. 6.09లక్షల నుంచి రూ. 9.99లక్షలకు లభిస్తుందన్నా రు. కార్యక్రమంలో సీఈవో విక్రమ్, జనరల్ మేనేజర్ తుకారాం, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్షులు ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. కరీంనగర్లో శుక్ర, శనివారం జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగా పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఇండోర్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్కుమార్గౌడ్ మాట్లాడుతూ యోగా క్రీడను ఎంచుకున్నందుకు మీరెంతో అదృష్టవంతులని అన్నారు. యోగా చేయడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు, సభ్యులు బాలరాజయ్య, పాండురంగం, శరణ్య, పవన్కుమార్, స్వరూపారాణి పాల్గొన్నారు. -
రోలర్ స్కేటింగ్లో భరత్ ప్రతిభ
● ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికై న పాలమూరు క్రీడాకారుడు మహబూబ్నగర్ క్రీడలు/జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రోలర్ స్కేటింగ్ క్రీడలో పాలమూరు నగరంలోని కిద్వాయిపేటకు చెందిన కోడుగంటి భరత్చంద్ర విశేష ప్రతిభ కనబరుస్తున్నా డు. ఐదేళ్ల నుంచి రోలర్ స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటూ అనతికాలంలోనే సత్తా చాటాడు. భరత్చంద్ర ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా ఐదుసార్లు జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2021, 2022, 2023 సంవత్సరాల్లో చండీఘర్లో జరిగిన జాతీయస్థాయి జూనియర్ రోలర్ స్కేటింగ్లో పాల్గొన్నాడు. 2024లో తమిళనాడు కోయంబత్తూర్లో, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగిన ( 20 ఏళ్లకు పైబడి) సీనియర్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఇటీవల చంఢీఘర్లో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో భరత్చంద్ర ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పరాగ్వే దేశం అసున్సియోస్లో అక్టోబర్ 2 నుంచి 18 వరకు వరల్డ్ స్కేట్స్ గేమ్స్ పాల్గొనే భారతజట్టుకు ఎంపిక చేశారు. కలెక్టర్కు అభ్యర్థన.. రూ.2.52 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత తనకు లేదని, సాయం అందించాలని భరత్చంద్ర మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తాను అభ్యర్థించాడు. పరాగ్వే వెళ్లి ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు రూ.5,05,000 ఖర్చవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... స్పందించిన కలెక్టర్ జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి మొత్తం ఖర్చుల్లో 50 శాతం ఆర్థికసాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం కలెక్టర్ రూ.2,52,250 ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భరత్ చంద్ర ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి, మహబూబ్నగర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. మరిన్ని పోటీల్లో ఆడడమే లక్ష్యం రోలర్ స్కేటింగ్లో తొలిసారిగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్బీ స్టేడియంలో కోచ్ జితేందర్గుప్త వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో దేశం తరఫున మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో ఆడాలన్నదే లక్ష్యం. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – భరత్చంద్ర -
హాస్టల్ విద్యార్థికి పాముకాటు
● ఆస్పత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం ● హాస్టల్ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ కల్వకుర్తి టౌన్: మంచినీరు తాగేందుకు రాత్రివేళ బయటకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ రవికుమార్ వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థి శివ మంచినీరు తాగేందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. సదరు విద్యార్థిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వార్డెన్ రవికుమార్ తెలిపారు. ● హాస్టల్ విద్యార్థి పాముకాటుకు గురైన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ భీమా నాయక్ సిబ్బందితో కలిసి హాస్టల్ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హాస్టల్ పరిసరాల పరిశీలన సందర్భంగా ప్రాంగణంలో చెత్త పెద్దఎత్తున పేరుకుపోయి కనిపించడం గమనార్హం. ఉదయం 10 గంటల తర్వాత అక్కడి సిబ్బంది చెత్తను తొలగించారు. చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణంతో విషపురుగులు సంచరిస్తున్నాయని.. హాస్టల్ పరిసరాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జాతీయ గోగేమ్లో ఐదు పతకాలు
మహబూబ్నగర్ క్రీడలు: మహారాష్ట్రలోని షిరీడీలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మూడు బంగారు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించి సత్తాచాటారు. సింగిల్ విభాగం సబ్ జూనియర్లో సిటి.లలితేష్ బంగారు పతకం, జె.అభిజిత్ కాంస్య పతకం, జూనియర్లో సబావత్ వర్షిత్ బంగారు పతకం, పి.రాహుల్ రజత పతకం, సీనియర్లో పి.రాజేష్ బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను గోగేమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్ తదితరులు అభినందించారు. -
ముమ్మరంగా రైల్వే బ్రిడ్జి గడ్డర్ల ఏర్పాటు
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలో 167వ నెంబరు జాతీయరహదారిపై ఎల్ఐసీ కార్యాలయం నుంచి డిగ్రి కళాశాల హాస్టల్ భవనం వరకు మొత్తం 750 మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సిగ్నల్గడ్డ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైస్కూల్ వైపు బ్రిడ్జి కోసం 5 గడ్డర్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై మే నెలలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండో వైపు ఉన్న పాత బ్రిడ్జి తొలగించి దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఉదయం నుంచే రెండు భారీ క్రేన్లు, 1 హైడ్రాలికల్ క్రేన్, పదిమంది నిపుణుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ దశలో పెద్ద ఎత్తున బ్రిడ్జికు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఐదు గడ్డర్లకు గానూ మొదటిరోజున మూడింటిని అమర్చారు. మరో రెండు శుక్రవారం అమర్చనున్నారు. రైల్వేలైన్పై గడ్డర్ల బిగింపు తరువాత వాటిపై స్లాబ్ వేయనున్నారు. లైన్కు రెండు వైపులా ఆర్యూబీల నిర్మాణం పూర్తిచేసి మరో మూడు నెలల్లో రాకపోకలు సాగించేలా కసరత్తు చేస్తున్నారు. -
అబార్షన్ మాత్రలు వికటించి మహిళ మృతి
లింగాల: వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోకుండా అబార్షన్ కోసం మాత్రలు మింగడంతో అవి వికటించి మూడావత్ జ్యోతి (26) అనే మహిళ మృతి చెందిన ఘటన పద్మన్నపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడావత్ చందూ, జ్యోతి దంపతులు ఆరేళ్ల క్రితం జీవనోపాధికై హైదరాబాద్ వెళ్లి చెత్తసేకరణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల మళ్లీ గర్భం దాల్చడంతో అది ఇష్టం లేని జ్యోతి అబార్షన్ కావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం డాక్టర్ సలహ తీసుకోకుండా ఓ మెడికల్ షాపులో సొంతంగా మందులు కొనుగోలు చేసి వేసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యలు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది. గర్భిణి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. నాగర్కర్నూల్లో దారుణ హత్య కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్కాలనీలో వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం పట్టణంలోని రాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో కరీంపాషా(40)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి, కళ్లలో పొడిచి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరీం భార్య బంధువులతో కలిసి సోమవారం ఊరికి వెళ్లగా భర్త ఒక్కడే ఉంటున్నాడు. అతని భార్య సలీమా కరీంకు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. ఇంటిపక్కల అద్దెకున్న వారికి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ ఇవ్వాలని కోరగా ఆమె భర్తకు ఫోన్ ఇచ్చేందుకు వెళ్లగా ఇంట్లో కరీం హత్యకు గురై కన్పించాడు. వెంటనే సలీమాకు ఈ విషయం చెప్పగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. కరీం సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతునట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలపై దాడి.. లైంగిక దాడి ఆరోపణలు మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని దత్తాత్రేయస్వామి ఆలయం సమీపంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో వారిని అడ్డుకుని, భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారితో పాటు ఇతరుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మక్తల్ ఎస్ఐ రాజు తెలిపారు. -
స్థాయికి మించి వైద్యం!
● మహమ్మదాబాద్లో ఏడు క్లినిక్ల సీజ్ ● ఇద్దరు ఆయూష్, ఐదుగురు ఆర్ఎంపీలపై చర్యలు ● జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి పాలమూరు/మహమ్మదాబాద్: వారు ఎంబీబీఎస్ కాదు.. ఎండీలు కాదు.. కానీ వారికి ఏమాత్రం తక్కువ కాదంటూ అర్హత లేకపోయినా వైద్యంచేస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై జిల్లా వైద్యారోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. గురువారం డీఎంహెచ్ఓ డా.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహ్మదాబాద్లోని ఆర్ఎంపీల క్లినిక్లలో చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇద్దరు వ్యక్తులు హోమియో, యునాని వైద్యవిద్యం అభ్యసించి ఆయూష్లో క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించి.. ఏకంగా అల్లోపతి వైద్యంతో ప్రసవాలు, సర్జరీలు చేసే విధానాలు చూసి డీఎంహెచ్ఓ బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు. మరో ఐదుగురు ఆర్ఎంపీలు ఎలాంటి అనుమతి లేకపోయినా ప్రత్యేకంగా క్లిని క్లు ఏర్పాటు చేసుకొని వాటిలో మూడు, ఐదు ఇలా పడకలు ఏర్పాటుచేసి వైద్యం చేస్తున్నారు. వారు వైద్యుల మాదిరిగా యాంటీబాయాటిక్స్ డ్రగ్స్, పలు రకాల ఇంజక్షన్లు, అధిక డోస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కొన్నింటిలో స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్ గుర్తించారు. ఏడు క్లినిక్లను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ వెల్లడించారు. ఇటీవల ఒకరి ప్రాణం బలి.. మహమ్మదాబాద్కు చెందిన రుకుంపల్లి కిష్టయ్యకు స్వల్పంగా అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆర్ఎంపీ బాల్రెడ్డి వద్దకు వెళ్లాడు. క్లినిక్లో ఉన్న బాల్రెడ్డి కుమారుడు నిఖిల్రెడ్డి (గాధిర్యాల్ ప్రాథమిక ఉపకేంద్రం డాక్టర్) కిష్టయ్యకు ఇంజక్షన్ చేయడంతో పాటు మాత్రలు ఇచ్చి పంపించాడు. సందరు పేషెంటు అక్కడి నుండి ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే నురగలు కక్కుతూ మృతిచెందాడు. అయితే రూ. 15లక్షలకు ప్రాణం ఖరీదు కట్టడంతో పాటు అధికారులు, ఇతర ఫిర్యాదుదారులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే, గతంలో ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న మంగంపేట తండావాసి ప్రాణాల మీదకు తెచ్చుకుని రూ.లక్షలు ఖర్చుచేసుకున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీలు చెలగాటమాడుతున్నారు. అలాంటి వారిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
చిరుతల అలజడి
● రాత్రివేళ పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న జనం ● బలవుతున్న మూగజీవాలు,అధికారుల మూగనోములు ● బోను ఏర్పాటులో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ఆందోళనలు చేపడతాం చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు భయంతో జంకుతున్నారు. చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా అటవీ అధికారులకు ఇచ్చాం. అయినా వారిలో కనీస స్పందన లేదు. శనివారం మహమ్మదాబాద్ ఫారెస్టు కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతాం. – నాగేంద్రమ్మ, సర్పంచ్, మన్సూర్పల్లి ఉన్నతాధికారులకుసమాచారం ఇస్తున్నాం ఘటన జరిగిన ప్రతిసారి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నాం. బోను ఏర్పాటు మా పరిధిలో లేదు. ప్రతిసారి నివేదికలు పంపుతూనే ఉన్నాం. సోమవారం మరోమారు ఉన్నతాధికారులను సంప్రదిస్తాం. త్వరలోనే బోను ఏర్పాటు చేసేలా చూస్తాం. – అబ్దుల్ హై, ఫారెస్టు రేంజర్, మహమ్మదాబాద్గండేడ్: ఒక్కటి కాదు రెండు ఏకంగా ఆగస్టునెలలోనే ఐదు పశువులు చిరుతల విందుకు బలయ్యాయి. దాదాపు ఏడాదిపాటు ఈ తంతు కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మూగనోము వీడడంలేదు. మండలంలోని కొండాపూర్కు చెందిన రైతు పకిరప్ప మేకలు మేపడానికిగాను బొందెగట్టు ప్రాంతానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో మేకలు మేస్తుండగా.. అతను దాహం తీర్చుడానికి కిందికి వచ్చాడు. తిరిగి పైకి వెళ్లేసరికి అందులో మూడు మేకలు కనిపించలేదు. వాటి కోసం వెతకగా కొద్ది దూరంలో అవి చనిపోయి ఉన్నాయి. అతను అక్కడికి వెళ్లిన సమయంలో చనిపోయిన మేకను అతని కళ్లముందే వేరేచోటికి లాక్కెళ్లింది. గ్రామానికి గొల్ల చిన్న వెంకటయ్య గ్రామ సమీపాన రాజగొండ వద్ద ఉన్న ఇతని పొలంలో పాలకోసం రెండు ఆవులు వ్యవసాయం కోసం రెండు ఎడ్లు పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే 20రోజుల క్రితం మేత మేపిన పశువులను సాయంత్రం పాకలో కట్టేసి ఇంటికి వచ్చేశాడు. అతను ఉదయం యథావిధిగా తిరిగి పొలానికి వెళ్లి చూడగా.. లేగదూడ చనిపోయింది. తాజాగా ఆదివారం రాత్రి రెడ్డిపల్లికి చెందిన బోడి రామయ్య ఆవుదూడ చిరుత ఆకలికి బలైంది. ఇలా ఇటీవల రెగ్యులర్గా పశువులు చిరుతలకు విందవ్వగా.. రైతుకు మాత్రం కన్నీరు మిగులుతున్నది. చిరుతలెన్ని..? మండలంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న చిరుత దాడులను బట్టి చూస్తే చిరుతల సంఖ్యపై అనుమానం తలెత్తున్నది. మొదట్లో బొందెగట్టు ప్రాంతంలో మూడు చిరుతలు మాత్రమే రైతుల కంటపడ్డాయి. కాని ఇవి మూడుకు బదులు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. బొందెగట్టు బండరాళ్లలో గుహల మాదిరిగా చిరుతల ఆవాసానికి అనువుగా ఉన్నాయి. దీనికి తోడు చుట్టు పక్కల చెరువులు, కుంటలు ఉండడంతో నీటి వసతి కూడా వీటికి మరింత అనుకూలంగా ఉంది. దీనికితోడు హన్వాడ మండలం ఎల్లంబాయి తండా ప్రాంతంలో కూడా చిరుత దాడులు జరగడంతో చిరుతలు ఆరువరకు ఉన్నాయని పలు గ్రామాల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశించినా.. చిరుతదాడుల విషయం ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు సర్పంచులు అటవీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. చిరుతలను పట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించినా.. అటవీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. చివరకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తక్షణమే బోను ఏర్పాటు చేసి చిరుతలను పట్టాలని కోరినా.. అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన బొందెగట్టుపై మూడు చిరుతలు కనిపించాయి. ఫారెస్టు డివిజనల్ అధికారి గణేష్ వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించి చిరుతలకు అది అనువైన ప్రదేశమని చెప్పారు. వాటిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతులు తీసుకొని బోను ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకూపలుకులేదు. ఘటన జరిగినప్పుడు రావడం పరిశీలించడం వెళ్లడం తప్పా.. చర్యలు తీసుకోవడంలో అటవీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పుట్టపల్లిలో దారుణ హత్య
దేవరకద్ర: కౌకుంట్ల మండలం పుట్టపల్లి గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన బీచుపల్లి ఉత్తన్న (55) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ భాస్కర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్కమ్మ కుటుంబ సభ్యులకు, ఉత్తన్నకు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఉత్తన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉత్తన్న తరచూ మద్యం సేవించి గొడవలకు పాల్పడేవాడని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో.. అదే వివాదం హత్యకు దారితీసిందా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ● దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఉత్తన్న మృతి? ● హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు -
ఆత్మకూర్లో అగంతకురాలి హల్చల్
● నగలు, డబ్బులు ఇవ్వాలని బెదిరింపు.. ● కేకలు వేయడంతో మహిళపై దాడి చేసి పరారీ ఆత్మకూర్: పట్టణంలోని సంజీవ్నగర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న షమీమ్పై గుర్తుతెలియని మహిళ కత్తితో దాడి చేసి పరారైన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. బురఖా ధరించిన మహిళ ఇంటి తలుపు తట్టడంతో షమీమ్ తలుపు తీయగా లోపలికి ప్రవేశించింది. అనంతరం తలుపు మూసివేసి నగలు, డబ్బులు ఇవ్వాలని, లేదంటే కత్తితో చంపేస్తానని బెదిరించింది. తన వద్ద ఏమీ లేవని, వెళ్లిపోవాలని షమీమ్ వేడుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో షమీమ్ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ మహిళ కత్తితో ఆమె మెడపై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. వెంటనే బయటకు వచ్చిన షమీమ్ ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు భర్త సాజీద్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జయన్న తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. -
అక్టోబర్ 4న రెడ్క్రాస్ ఎన్నికలు
● మహబూబ్నగర్ సొసైటీలో 4,719 మంది ఓటర్లు ● చైర్మన్ పదవికి పలువురు ఆశావహులు.. 15 పోస్టులకు ఎన్నిక పాలమూరు: దాదాపు మూడేళ్ల తర్వాత జిల్లా రెడ్క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 2023 ఆగస్టు 3న చివరిసారిగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా.. తాజాగా ఎన్నికల నిర్వహణకు డి.కృష్ణను ఎన్నికల అధికారిగా నియమించారు. అక్టోబర్ 4న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 4,719 మంది ఓటర్లు మే నాటికి సొసైటీలో 2,851 మంది ఓటర్లు ఉండగా.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్ ద్వారా మరో 1,868 మంది కొత్త సభ్యులుగా చేరారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 4,719కు చేరింది. బుధవారం కలెక్టరేట్లోని 217వ గదిలో ఓటర్ల జాబితాను ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను ఈనెల 15లోగా తెలియజేయాలి. 19న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 24 నుంచి నామినేషన్లు ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఒక్కో నామినేషన్దారు రూ.10 వేల డిపాజిట్ చెల్లించాలి. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. చైర్మన్ పదవికి పోటీ చైర్మన్తో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత చైర్మన్ నటరాజ్ పదవీకాలం ఆగస్టులో ముగిసింది. దీంతో కొత్త కార్యవర్గం కోసం పలువురు ఆశావహులు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాదులు, వైద్యులు, సేవా రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరుగుతాయా.. ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా అనేది తేలాల్సి ఉంది. జిల్లా రెడ్క్రాస్ కార్యాలయం -
ఘాటెక్కిస్తున్న ఉల్లి
దేవరకద్ర: ఉల్లి ధర సామాన్య ప్రజలకు తినకుండానే ఘాటెక్కిస్తోంది. నాలుగు వారాలుగా ధరలు పెరుగుతూ రికార్డు స్థాయి చేరుకుంటున్నాయి. గడిచిన వారం రూ.5,200 వరకు ఉన్న ధర బుధవారం రూ. 5,600కు చేరింది. ఇక చిన్నపేడు ఉల్లికి కనిష్టంగా రూ. 3,200 పలికింది. మధ్యస్తంగా రూ.4,400 వరకు పలికాయి. సీజన్ లేకపోవడం వల్ల గత యా సంగి సీజన్లో నిల్వ చేసిన ఉల్లిని రైతులు అమ్మకానికి తెస్తున్నారు. మార్కెట్కు దాదాపు వంద క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ ధరల ప్రకారం 50 కేజీల బస్తా గరిష్టంగా రూ. 2800, కనిష్టంగా రూ.1,600కు అమ్మకాలు సాగించారు. -
శ్రీనివాసకాలనీ పార్క్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్కాలనీ పార్క్ను రాత్రి సమయంలో పలువురు వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్క్ స్థలం తమదంటూ పలువురు గతంలో కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం సంబంధిత వ్యక్తుల వద్ద ఉన్న ఆధారాలు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించాలని, వాస్తవాలను తేల్చి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. పలువురు వ్యక్తులు రాత్రివేళలో జేసీబీలు, ఇతర సామగ్రితో వాకింగ్ ట్రాక్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఏపుగా పెరిగిన చెట్లను సైతం తొలగించారు. స్థానికులు విషయాన్ని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ మహిళతో సహా మొత్తం 18 మందిపై క్రిమినల్ కోసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై కార్పొరేషన్ కమిషనర్ రామాంజులారెడ్డిని వివరణ కోరగా.. పార్క్ స్థలంపై కోర్టుకు వెళ్లిన పలువురు రాత్రి వేళల్లో చెట్లు, వాకింగ్ ట్రాక్ను ధ్వంసం చేశారని, వారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కోసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీనివాస్కాలనీ పార్కులో మిగిలిన చెట్ల మొదళ్లు పార్క్ స్థలం తమదంటూ కోర్టుకు వెళ్లిన పలువురు వ్యక్తులు ఇంతలోనే పార్క్లో చెట్లు, వాకింగ్ ట్రాక్ తొలగింపు కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదుతో 18 మందిపై కేసులు -
ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడి మృతికి సంతాపం
పాలమూరు: మహబూబ్నగర్ నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ (67) అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన మృతితో మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంఐఎం పార్టీ శ్రేణుల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అబ్దుల్ హాదీ రెండుసార్లు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఎంఐఎం కౌన్సిలర్గా గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన విశేష సేవలు అందించారు. అబ్దుల్ హాదీ మృతి వార్త తెలుసుకున్న ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ,చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెదుల్లా కోత్వా ల్ ఆయన ఇంటికి చేరుకొని నివాళులర్పించి దువా చేశారు. అదే విధంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్గౌడ్ తదితరులు నివాళులు అర్పించారు. -
ప్రైవేట్ స్కూల్ వాహనం బోల్తా
● ఐదుగురికి గాయాలు ● మద్యం మత్తులో డ్రైవర్ మహబూబ్నగర్ క్రైం: ఓవర్ లోడ్.. పైగా మద్యం మత్తులో డ్రైవర్, అతివేగం వెరసి ప్రైవే ట్ స్కూల్ వాహనం బోల్తాపడిన ఘటనలో విద్యార్థులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కోయిలకొండ మండలంలోని ఇంజమూర్లో శివ, కల్పన ప్రాథమిక పాఠశాల నడుపుతున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత డ్రైవర్ రాజు టాటా మ్యాజిక్ వాహనంలో 30 మంది విద్యార్థులను ఎక్కించుకొని బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో పాటు అతివేగంగా నడపడంతో వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి సాయికార్తీకకు చేయి ఫ్యాక్చర్ కాగా.. చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు విద్యార్థులను కోయిలకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. డ్రైవర్ రాజుతో పాటు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
జిల్లాలో ఎస్జీఎఫ్ సందడి
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీల సందడి నెలకొంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో అండర్– 14, అండర్–17 బాల, బాలికలకు వేర్వేరుగా మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తారు. నైపుణ్యానికి వేదికగా.. పాఠశాల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విద్యా ర్థులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. గతంలో జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ద్వారానే ప్రతిభ చాటి వెలుగులోకి వచ్చారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయి టోర్నీ ల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. జిల్లా లో ప్రతి ఏడాది రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలతోపాటు జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది. మండల స్థాయిలో కొనసాగుతున్న పోటీలు.. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు సంబంధించి మండల స్థాయిలో క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నీ కం ఎంపికలు జరుగుతున్నాయి. మిడ్జిల్, చిన్నచింతకుంట, మహ్మదాబాద్ మండలాల్లో పోటీలు జరిగాయి. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి టోర్నీ కం సెలక్షన్స్లో పాల్గొంటారు. అదే విధంగా ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాస్థాయి, అనంతరం ఉమ్మడి జిల్లా (జోనల్) స్థాయిలో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎంపికయ్యే జట్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటాయి. మండల స్థాయిలో ఉత్సాహంగా పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాస్థాయి, అనంతరం ఉమ్మడి జిల్లా ఎంపికలు త్వరలో రాష్ట్రస్థాయి టోర్నీలు -
ఆలయ భూముల కౌలు చెల్లించాలి
చారకొండ: సీర్సనగండ్ల దేవాలయ సంబంధిత భూములు సాగుచేస్తున్న రైతులు కౌలు చెల్లించాలని దేవాదాయ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు తెలిపారు. మండలంలోని సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాగణంలో బుధవారం ఆలయ భూములు సాగుచేస్తున్న కౌలు రైతులతో ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ రంగాచారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, మండలంలోని అగ్రహారం తండా, గైరాన్తండా, సీర్సనగండ్ల తదితర గ్రామాల కౌలు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ మట్లాడుతూ.. ఆలయ భూముల సాగుచేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు చెల్లించాలని వివరించారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు ఎకరాకు ఏడాదికి రూ.500 చెల్లించేందుకు ముందుకు రావడంతో దీనిపై తీర్మానం చేసి నిర్ణయించారు. దేవాదాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కౌలు నిబంధనలు తదితర వాటిపై పూర్తి వివరాలు తెలియజేస్తామని సహాయ కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఈఓ ఆంజనేయులు, ఆయా దేవాలయాల ఈఓలు జైపాల్రెడ్డి, ప్రసాద్, సత్యచంద్రారెడ్డి, ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య
మరికల్: గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరికల్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ రైల్వే ఎస్ఐ రాజు తెలిపిన వివరాల మేరకు.. మరికల్కు చెందిన షేక్సద్దాం (30) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరికల్లోని రైల్వేస్టేషన్కు వచ్చి మహబూబ్నగర్ నుంచి రాయాచూర్ వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. సద్దాంకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కందనూలు/ తాడూ రు: పిచ్చికుక్క దాడి చేసి అయిదుగురిని గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. తాడూరు మండలం బల్లాన్పల్లిలో ఓ పిచ్చికుక్క గ్రామంలో తిరుగుతూ బాలమ్మ, రేణుక, పండు, నిరంజన్, పార్వతమ్మపై దాడి చేసింది. గాయపరిచిన వారిని గ్రామస్తులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గడ్డిమందు తాగి ఆత్మహత్య దేవరకద్ర: మండలంలోని కోయిల్సాగర్ గ్రామానికి చెందిన ఆవుల రవి (40) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో మంగళవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు గమనించి జిలా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడని ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహం లభ్యం రాజాపూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదా రి పక్కన గల మసీద్ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రాజాపూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మృతదేహం పురుషుడిదని, వయసు 45–50 ఏళ్లల్లోపు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు ఎవరికై న తెలిస్తే 87126 59347, 87126 59315 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. తాళం వేసిన ఇంట్లో చోరీ దేవరకద్ర: మున్సిపాలిటీ పరిధిలోని కోయిల్సాగర్ రోడ్డులో నివాసం ఉంటున్న నట్టలి తిమ్మమ్మ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనాని కి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. గుర్తుతెలియని వ్యక్తులు 5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు దోచుకుపోయారని బాధితులు వాపోయారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ భాస్కర్రెడ్డి పరిశీలించారు. -
కోతలతో కాసుల వేట
జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ప్రసవాల తీరు ● రెండేళ్లలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 5,317 సిజేరియన్లు ● సాధారణ కాన్పులు 2,400 మాత్రమే.. ● ప్రభుత్వ వైద్యులే ‘ప్రైవేట్’గా సాగిస్తున్న దందా ● ఆరోగ్యశాఖ లోపాలను ఎత్తిచూపుతున్న గణాంకాలు కారణాలెన్నో.. అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయవచ్చనే ఆశతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు మహిళలకు ఓపిక, ప్రసవ వేదన భరించడానికి సిద్ధంగా లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉంటున్నాయి. నొప్పులు లేకుండా సులువుగా డెలివరీ అయిపోతుందనే అపోహతో స్వయంగా సిజేరియన్ను ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఫలానా రోజు, అనుకున్న నక్షత్రంలో పుట్టాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ సమయానికి కచ్చితంగా ఆపరేషన్ ద్వారా పిల్లలను కనాలనే భావనలో ఉంటున్నారు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలతో సిజేరియన్లు అనివార్యం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం తెలంగాణ చౌరస్తాలో జలసాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే పెండింగ్ ప్రాజెక్టులకు పేరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యానికి రైతు లు, ప్రజలు ఇంకెంతకాలం బలికావాలని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే జిల్లా శాశ్వతంగా వెనుకబాటులోనే ఉండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతమైన పాలమూరును ఎండబెట్టి నల్లగొండకు నీటిని తరలించే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి, జేఏసీ కోకన్వీనర్ బెక్కం జనార్దన్, వీరబ్రహ్మచారి, నాయకులు చెన్నకిష్టన్న, వెంకటేశ్వర్లు, రవీందర్రెడ్డి, అంజయ్య, కృష్ణముదిరాజ్, హనీఫ్ అహ్మద్, శివన్న, లక్ష్మికాంత్ పాల్గొన్నారు. -
పరస్పర అంగీకారంతో రాజీ చేసుకోవచ్చు: ఎస్పీ
● 12న జాతీయ లోక్ అదాలత్నుసద్వినియోగం చేసుకోవాలి మహబూబ్నగర్ క్రైం: పరస్పర అంగీకారంతో వివాదాలను సత్వరం పరిష్కరించుకునేందుకు ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్బౌన్స్, విద్యుత్ చౌర్యం తదితర కేసులను రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి కక్షిదారులకు సకాలంలో నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్కు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కాళోజీకి ఎస్పీ నివాళి తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ డి.జానకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, ఆకాంక్షలను సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, అశోక్ పాల్గొన్నారు. -
నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
పాలమూరు: శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న నవజాత శిశువుల ఆరోగ్యంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలో ఉన్న బాలసదన్, శిశుగృహ కేంద్రాలను బుధవారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులు, భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పిల్లలకు సకాలంలో కావాల్సిన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని అధికారుల దగ్గర న్యాయమూర్తి ఆరా తీశారు. ప్రధానంగా శిశుగృహలో ఉంటున్న చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులతో నిత్యం టచ్లో ఉంటూ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.ఆ తర్వాత ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో న్యాయమూర్తి మట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, లీగల్ సర్వీసెస్ యాక్ట్లపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, డీడబ్ల్యూఓ జరీనాబేగం, న్యాయవాది రవికుమార్ పాల్గొన్నారు. -
దేవరకద్ర అభివృద్ధికి రూ.73.50 కోట్లు
● రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు ● ఎమ్మెల్యే జీఎమ్మార్కు జీఓ కాపీ అందజేసిన మంత్రి సీతక్క దేవరకద్ర: నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారుల అభివృద్ధి, వంతెనల నిర్మాణం చేపట్టేందుకు జీవో నంబర్లు 477, 478 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలో వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అసెంబ్లీలోని మంత్రి సీతక్క చాంబర్లో బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి మంజూరైన పనులకు సంబంధించిన జీఓ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన నిధులతో రహదారులు, వంతెనలు మెరుగుపడి గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. మంజూరైన పనులు ఇవే.. పోతులమడుగు–గోపన్నపల్లి మార్గంలో హెచ్ఎల్బీ నిర్మాణానికి రూ.4 కోట్లు చిన్నవడ్డెమాన్–ఉంద్యాల మార్గంలో హెచ్ఎల్బీ నిర్మాణానికి రూ.3 కోట్లు పోల్కపల్లి ఎస్సీ కాలనీ–కప్పెట మార్గంలో హెచ్ఎల్బీ నిర్మాణానికి రూ.3.60 కోట్లు ఎన్హెచ్–44 నుంచి ఇస్రంపల్లి, పెద్దమునగల్చేడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు డోకూర్–చౌదర్పల్లి మార్గంలో రెండు వంతెనల నిర్మాణానికి రూ.7.20 కోట్లు కౌకుంట్ల–రేకులంపల్లి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.1.80 కోట్లు తిమ్మాపూర్–జానంపేట మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.70 కోట్లు దేవరకద్ర–ఆత్మకూర్ పీడబ్ల్యూడీ రోడ్డులో కౌకుంట్ల, రాచాల, ఇస్రంపల్లి వద్ద వంతెనల నిర్మాణానికి రూ.5.40 కోట్లు మదనాపురం–ఎన్హెచ్–44 మార్గంలో పాలెం, దంతనూర్, రామంతపూర్ మీదుగా వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు -
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉప సర్పంచ్లకు ఇచ్చిన చెక్ పవర్ను వెంటనే రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు విడుదల చేయాలని, గ్రామ పంచాయతీల నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, గ్రామసభ, సర్పంచ్ల అధికారాలను నిర్వీర్యం చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ హరిప్రియకు వినతిపత్రం అందజేశారు. తలసేమియాపై సిబ్బందికి శిక్షణ పాలమూరు: తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్, జిల్లా వైద్యారోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తలసేమియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ చీఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ జైన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ పద్మ ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. సకాలంలో స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ, అవసరమైన వైద్య సంరక్షణపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శంకర్, డాక్టర్ శివకాంత్ పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐకు కొత్త సారథులు ● ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం స్టేషన్ మహబూబ్నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. మహాధర్నా వాయిదా జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన మహాధర్నాను వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి బుధవారం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డితో నాయకులు భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
వేములలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
● పాఠశాల, పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాల తనిఖీ ● మెనూ పాటించకపోవడంతో షోకాజ్ నోటీసులకు ఆదేశం భూత్పూర్ (అడ్డాకుల): మూసాపేట మండలం వేములలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. జడ్పీ ఉన్నత పాఠశాల, పల్లె దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు, పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పరిశీలించారు. విద్యార్థులు గణితంలో పట్టు సాధించాలని సూచించారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను, అక్షయపాత్ర ద్వారా అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థిని మాధురి రచించిన ‘శతక మధురిమ’ పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. పల్లె దవాఖానలో రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య, నమోదవుతున్న అనారోగ్య సమస్యలు, అందుతు న్న వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని పరిశీలించగా.. ఎగ్ బిర్యానీకి బదులు అన్నంలో గుడ్డు కలిపి అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 26న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులకు పర్యాటక ప్రాంతాల సందర్శన, వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోయిల్కొండ మండలం రాంకొండను బెస్ట్ టూరిజం విలేజ్గా అభివృద్ధి చేసి ఫిల్మ్ షూటింగ్లకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జడ్చర్లలో హెరిటేజ్, టూరిజం ప్లాజాల ఏర్పాటుకు పీపీపీ విధానంలో ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ వీసీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జిల్లా టూరిజం అధికారి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన గౌరీశంకర్
● సౌత్ ఏషియన్ డ్రిప్ట్బాల్ పోటీల్లో స్వర్ణం ● క్రీడాకారుడిని అభినందించిన ‘పేట’ కలెక్టర్ ప్రియాంక నారాయణపేట: గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటాడు ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు బడుగు గౌరీశంకర్. నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించిన సౌత్ ఏషియన్ డ్రిప్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. గౌరీశంకర్ విజయాన్ని కలెక్టర్ ప్రియాంక సోమవారం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేష్శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి
నాగర్కర్నూల్ రూరల్: వ రిమడిలో ట్రాక్టర్తో దు న్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఓనర్ కం డ్రైవర్ ఎద్దుల బాలస్వామి(45) మృతిచెందిన ఘటన సోమవారం మల్కాపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నకేశువులు తరిపొలం ట్రాక్టర్తో దున్నుతుండగా.. ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్పై ఉన్న డ్రైవర్ బాలస్వామి ట్రాక్టర్ కిందిబాగంలో పడి మృతిచెందాడు. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. బైక్ బోల్తా : నంద్యాల యువకుడి దుర్మరణం అయిజ: బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువ కుడు మృతిచెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు చెందిన షైక్ ఆఫ్రికన్ (25) రాయచూరులోని శిల్ప ఫార్మా లైఫ్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నంద్యాల నుంచి రాయచూరుకు బైక్పై వెళ్తుండగా భారత్మాల రోడ్డుపై బైక్ అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నెలరోజులు మృత్యువుతో పోరాడి తనువు చాలించిన కాపరి పాన్గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అన్నెరాములు(50) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం అన్నె రాములు గత నెల 7న బైక్పై వెళ్తుండగా తెల్లరాళ్లపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఒక కాలును తొలగించారు. దాదాపుగా నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య నారమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నెరాములు కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య అలంపూర్ రూరల్: అప్పు ల బాధతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘ టన అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపురంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ పరుశురాము డు (39) మూడేళ్లుగా కౌలుకు పొలం సాగు చే స్తున్నాడు. పంటలు సరిగా పండక అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లైంగికదాడి కేసులో ఇద్దరు మైనర్లకు రిమాండ్ గోపాల్పేట: వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం ఇద్దరు మైనర్లను రిమాండ్ చేసినట్లు ఎస్సై శశిధర్ తెలిపారు. -
కోనేరులో పడి యువకుడి మృతి
భూత్పూర్(అడ్డాకుల): మండలంలోని కందూర్ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ ఐ, బంధువుల కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సాయినాథ్రెడ్డి (31) ప్రైవే ట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా, ఫోన్ స్విచ్చాఫ్ చేసి మోటర్ సైకిల్పై అడ్డాకుల మండలంలోని కందూర్లో శ్రీరామలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చాడు. రాత్రి ఆలయం వద్దకు వచ్చి ఫోన్ స్విచ్ ఆన్ చేసి సాయినాథ్రెడ్డి బావకు ఫోన్లో లోకేషన్ పెట్డాడు. ఉదయం లోకేషన్ ఆధారంగా భార్య రాజ్యల క్ష్మి, బంధువులు శ్రీరామలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చారు. కోనేరు వద్ద చెప్పులు, మోటర్సైకిల్ క న్పించడంతో కోనేరులో కొద్ది సేపు వెతికారు. ఈ క్రమంలో కొనేరులోని ఓ చోట సాయినాథ్రెడ్డి మృతదేహాం కన్పించింది. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని ఎస్ఐ మురళీ పరిశీలించారు. అనంతరం సాయినాథ్రెడ్డి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం
● స్వల్ప గాయాలతో బయటపడిన మహిళ ● భూత్పూర్ బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు ● 10 రోజుల్లో రెండో ప్రమాదం.. ఆందోళనలో వాహనదారులు భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. వాహనాలు అతివేగంగా నడపడం, ముందుగా వెళ్తున్న వాహనాలను గుర్తించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు బ్రిడ్జిపై వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోంది. తాజాగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఆగిన డీసీఎం.. వెనుక నుంచి మరో వాహనం ఢీ ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్గౌడ్ (26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. పది రోజుల క్రితమే ఇద్దరి మృతి గత నెల 27న ఇదే బ్రిడ్జిపై మరమ్మతుల కోసం లారీని నిలిపి ఉంచినా ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో బైక్పై వెళ్తున్న కావేరమ్మపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీని ఢీకొని మృతిచెందారు. తాజాగా మరో ప్రమాదం జరగడంతో బ్రిడ్జిపై భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పది రోజుల వ్యవధిలో ఇదే బ్రిడ్జిపై ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. -
మన్యంకొండకు పోటెత్తిన భక్తజనం
● శ్రావణమాసం చివరి సోమవారం సందడి ● దాసంగాలతో స్వామివారికి నైవేద్యాలు శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా.. కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు కాలినడకన కొండపైకి చేరుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారు సర్వాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంతో పాటు శివాలయం, అలివేలుమంగతాయారు ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో నెల రోజులుగా కొనసాగిన శ్రావణమాస వేడుకలు ముగిశాయి. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, అళహరి రామకృష్ణ, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ రూరల్ -
పాలమూరులో కబడ్డీ అకాడమీ ప్రారంభం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం శాట్ బాలుర కబడ్డీ అకాడమీ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి అకాడమీలో ప్రవేశాలు పొందిన క్రీడాకారులను అభినందించారు. వారికి సూచనలు, సలహాలు అందజేశారు. డీవైఎస్ఓ మాట్లాడుతూ బాలుర కబడ్డీ అకాడమీలో 18 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు క్రీడాకారులు మంగళవారం రిపోర్టు చేస్తారని తెలిపారు. రాష్ట్ర క్రీడాచరిత్రలో తొలిసారిగా కబడ్డీ అకాడమీని మహబూబ్నగర్లో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్నగర్లో బాలుర కబడ్డీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు. అకాడమీలో నిష్ణాతులైన కోచ్లతో బాలురకు మెరుగైన కబడ్డీ శిక్షణ అందజేస్తామని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని కోరారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, ప్రొకబడ్డీ లీగ్లో ఎంపికకావడానికి పట్టుదలతో కష్టపడి ఆడాలని సూచించారు. కబడ్డీ అకాడమీ క్రీడాకారులకు అన్ని క్రీడా వసతులు సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, కబడ్డీ కోచ్లు శివప్రసాద్, రాజు, సంఘం ప్రతినిధులు శ్రీరామ్, బాల్రాజు, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూజీసీ నెట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
● ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి ● అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని ఎంఎస్ఏస్ ఇన్ఫోటెక్ సర్వీసెస్, ఫాతిమా విద్యాలయ, క్రిస్టియన్పల్లి కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీ కెమెరాల నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు, ప్రథమ చికిత్స, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, దివ్యాంగులకు గ్రౌండ్ఫ్లోర్లో సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని, నిర్ణీత సమయానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. -
వేతన బకాయిలు ఇవ్వకుంటే బతికేదెట్లా?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సంస్థలో 35 ఏళ్లకు పైగా పనిచేసి రిటైరైన తర్వాత కూడా బకాయిలు రాకుంటే బతికేదెట్ల అని ఆర్టీసీ విశ్రాంత ఉద్యో గుల ఫోరం ప్రధాన కార్యదర్శి కె.రవీందర్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ చౌరస్తాలోని టీఎన్జీవోల సంఘ భవనంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే అరకొర వేతనంతో రిటైరైన తాము పెన్షన్ లేక వయసు మీదపడుతూ రోగాలు చుట్టుముట్టి ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అధ్యక్షుడు ఎ.రాజసింహుడు మాట్లాడుతూ 2017, 2021 పీఆర్సీలకు చెందిన డిఫరెన్స్ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈనెల 8న చేపట్టే ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలోనాయకులు జి.బి.పాల్, భగవంతు, ఆర్.నారాయణ, వి.రామచంద్రయ్య, వహీద్, మజీద్ఖాన్, జహీరొద్దీన్ పాల్గొన్నారు. 15న మెడికల్ కళాశాలలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ పాలమూరు: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్ రెసిడెంట్స్ నియామకం కోసం ఈనెల 15న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలి పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.gmcmbnr.org.in వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
తెలంగాణ తెచ్చినందుకు సిగ్గుపడుతున్నాం
● పాలించటం చేతకాకపోతే గద్దె దిగండి ● పాలమూరు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల టౌన్: అనేక మంది బలిదానాలు, ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లో పెట్టినందుకు సిగ్గుపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ సోమవారం జడ్చర్లలో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి పోలీసులు అడ్డుకున్నందుకు మండల పరిషత్ కార్యాలయం ఎదుట 167వ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిధులు, అప్పుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని, ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. వెయ్యి రోజుల పాలనలోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించిన ఆయన.. తమ హయాంలో చేసిన అప్పులను ప్రజాప్రయోజనాలకు వినియోగించామని, ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదన్నారు. పాలన చేతకాకపోతే గద్దె దిగాలని, సరైన సమయంలో కేసీఆర్ తిరిగి వస్తారని అన్నారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నా, రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు 24 గంటల హ్యాకథాన్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఇంజినీరింగ్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10, 11 తేదీల్లో 24 గంటల హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సాఫ్ట్వేర్ అభివృద్ధి, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలతో పాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు బృందాలుగా పాల్గొనాలని, అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, హెచ్ఓడీ తేజవర్దన్, అధ్యాపకులు పాల్గొన్నారు. క్విజ్లో పాల్గొనాలి విద్యార్థులు మైభారత్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని నిర్వహించే క్విజ్ పోటీల్లో పాల్గొనాలని మైభారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కోటానాయక్ సూచించారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల తో మాట్లాడిన ఆయన.. విజేతలకు ఢిల్లీలో ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. క్వి జ్ ద్వారా క్రిటికల్ థింకింగ్, వికసిత్ భారత్ తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. అవార్డు గ్రహీతకు సన్మానం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న రాజ్కుమార్ను టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, ఈశ్వర్కుమార్, కరుణాకర్రెడ్డి, బూమయ్య పాల్గొన్నారు. -
వివాహానికి వెళ్తుండగా విషాదం
మృతుడు హరీశ్గౌడ్ హైదరాబాద్లో కారు మెకా నిక్గా పనిచేస్తున్నారు. ఆ దివారం రాత్రి భార్య క ల్యాణితో కలిసి బంధువు ల వివాహానికి హాజరయ్యే ందుకు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పెస్టిసైడ్ మందుల లోడ్తో వెళుతూ.. మరో మృతుడు శేఖర్ అడ్డాకుల మండల కేంద్రానికి చెందినవాడు. హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఆయ న హైదరాబాద్ నుంచి కర్నూలుకు పెస్టిసైడ్ మందుల లోడ్తో వెళ్తు న్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగయ్య వెల్లడించారు. -
క్యాన్సర్ కట్టడికి చర్యలు తీసుకోవాలి
అమరచింత: ప్రస్తుత ప్రపంచంలో అత్యధికతతో వైద్యసేవలు విస్తరిస్తున్న క్యాన్సర్ను దూరం చేసే పరిజ్ఞానం అందుబాటులోకి రాకపోవడంతో ఎంతోమంది క్యాన్సర్కు గురై మృతి చెందుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములును పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ కరోనా కంటే భయంకరంగా మారిందన్నారు. ప్రపంచాన్ని వనికించిన కరోనాకు వ్యాక్సిన్ను కనుగొన్నారని క్యాన్సర్ నిరోధకానికి వ్యాక్సిన్ కనుకోలేక పోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా క్యాన్సర్ నిరోధకంకు అడ్డుకట్టవేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లో నివసించే ప్రతిఒక్కరికీ క్యాన్సర్ పరీక్షలను నిర్వహించాలని, దీంతో ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వ్యాధి తొలిదశలో ఉంటే వైద్యంతో నియంత్రించే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాధి సంక్రమించి చివరి దశలో ఉంటే ఎన్ని లక్షలు వెచ్చించినా ఫలితం లేక ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడంతో వ్యాధిని త్వరితంగా నిరోధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు బాలనరసింహులు, అబ్రహం, శ్రీహరి, భాస్కర్, మోషా, సురేష్, ఆర్ఎన్.శంకర్తోపాటు పలువురు ఉన్నారు. -
మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా చేస్తాం..
మహిళా సంఘాల్లో చదువు రాని సభ్యులకు.. అదే సంఘాల్లో చదువుకున్న మహిళలతో బోధన అందించేలా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, వయోజన విద్య, ఉమ్మడి జిల్లా అధికారి తరగతులు బోధిస్తున్నారు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మాకు అక్షరాస్యత పెంచేందుకు గ్రామంలోని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు తరగతులు బోధిస్తున్నారు. దీంతో అవసరమైన చోట సంతకాలు చేయడం, మహిళా సంఘం పుస్తకాల్లో లెక్కలు చూసుకోవడం నేర్చుకుంటున్నాం. ఈ తరగతులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – పద్మ, మన్యంకొండ, మహబూబ్నగర్ మాకు ఎంతో మేలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం వేళల్లో చదువులు బోధిస్తున్నారు. చదవడం, రాయడం నేర్చుకోవడంతో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. బ్యాంకు, మహిళా సంఘాలకు సంబంధించిన పనులను సొంతంగా చేసుకునే అవకాశం కలుగుతోంది. ఈ కార్యక్రమం వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది. – సుమంగళ, మాచన్పల్లి, మహబూబ్నగర్ ● -
ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించి.. ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యపై ఆరా తీశారు. ప్రతి స్టేషన్లో జా ప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరించే దిశగా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలన్నారు. పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే లైసెన్స్లు రద్దు పాలమూరు: ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం నగరంలోని శ్రీకర్ చిల్డ్రన్, భవిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీకర్ ఆస్పత్రిలో ఫైర్ ఆడిట్, మాక్డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బందిలో మార్పులుంటే ముందస్తు అనుమతి పొందాలని, ధరల పట్టికను తెలుగులో ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీల్లో డాక్టర్ శివకాంత్, సీతారామ్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. 10న మహాధర్నా జయప్రదం చేద్దాం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహాధర్నాలో జిల్లాలోని వేలాదిమంది ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ విజయ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించి మహాధర్నా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కృష్ణమోహన్, నందకిషోర్, మహేశ్వర్రెడ్డి, తానాజీ, నరేష్, యాదగిరి, కృష్ణగౌడ్, మధు, తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
● కలెక్టర్ ఖుష్బూ గుప్తా ● ప్రజావాణిలో 62 ఫిర్యాదుల స్వీకరణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజావాణిలో ప్ర జలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలపై 62 ఫిర్యాదులు అందాయి. జిల్లా, సీఎం ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. శాఖల వారీగా పెండింగ్ వివరాలను అధికారుల గ్రూపుల్లో పంపిస్తామని, పరిష్కరించిన అంశాలు, తీసుకున్న చర్యలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించారు. పరిష్కారం సాధ్యం కాని దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని, చిన్న సమస్యలను సైతం వెంటనే పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. మహ బూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. వి ద్యార్థుల హాస్టల్ కేటాయింపు దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించాలని, ఇరిగేషన్ శాఖలో ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరమైన వాటిపై వెంటనే విచారణ నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, జెడ్పీ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, గృహనిర్మాణ శా ఖ పీడీ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ స్కూల్స్కు నిధుల వరద
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్ 164ను విడుదల చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒకే క్యాంపస్లో అన్ని తరగతులకు బోధన కొనసాగనుంది. ఇందుకోసం ఆధునిక తరగతి గదులతో పాటు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా మైదానం, మరుగుదొడ్లు తదితర వసతులను కల్పించనున్నారు. అవసరమైన చోట్ల రవాణా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యా బోర్డులో విలీనం చేసే ప్రక్రియ నేపథ్యంలో పబ్లిక్ స్కూల్స్లో ఇంటర్ వరకు విద్య కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుతో కొత్తగా భారీగా సిబ్బందిని నియమించాల్సిన అవ సరం లేకుండా.. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందినే వినియోగించే అవకాశముంది. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అదనపు వసతులను ప్రభుత్వం కల్పించనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య తరగతి గదులు, ల్యాబ్స్, గ్రౌండ్, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు స్థలం ఉన్న బడులకే ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా.. ప్రస్తుతం 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మరో ఆరు నియోజకవర్గాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాల లేదా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రధానంగా ఇప్పటికే స్థలం, భవనాలు అందుబాటులో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. అయితే మహబూబ్నగర్లో మాత్రం మార్కెట్ రోడ్డులోని బాలికల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ఈ పాఠశాలను ఎంవీఎస్ జూనియర్ కళాశాల ప్రాంగణానికి తరలించి.. అక్కడ పబ్లిక్ స్కూల్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ రాస్తారోకో
● గేట్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను అడ్డుకున్న పోలీసులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆ పార్టీ నాయకులను పోలీసులు ప్రధాన గేట్ వద్ద అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నేతలు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడా న్ని ఖండించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులు, ఉద్యోగు లు, ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్ని స్తే ప్రభుత్వం గొంతు నొక్కుతోందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు విలువైన భూములను కబ్జా చేసేందుకు 22ఏ నిబంధనను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై స్వేచ్ఛగా ప్రజావాణికి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నా రు. వెలిగొండ ద్వారా ఏపీకి 12 టీఎంసీల నీరు తరలిపోతున్నా జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ఎమ్మెల్యేలు స్పందించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్గౌడ్, శివరాజ్, ఆంజనేయులు, కార్పొరేటర్లు ఈశ్వరయ్య, నవకాంత్, శరత్, నరేష్, నరేందర్, సత్యం, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పాస్బుక్కులు మంజూరు చేయాలి..
మాది పాలకొండ. సర్వే నంబర్ 73/ఏలో ఉన్న రెండు గుంటల భూమికి పాస్బుక్ ఇవ్వడం లేదు. ఇందుకోసం ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. భూ భారతి రికార్డుల్లో రెండు గుంటల భూమి చూపిస్తున్నా పాస్బుక్కు ఇవ్వడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – మొగులయ్య, పాలకొండ ఆన్లైన్లో నమోదు చేయాలి.. చిన్నరేవల్లిలో సర్వే నంబర్ 138లో మా పాలివాళ్లకు కలిపి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. మా పాలివాళ్లు తమకు చెందిన భూమిని విక్రయించడంతో.. మా పేరుపై ఉన్న ఎకరం 30 గుంటల భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారు. ఈ భూమి కోసం సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ సూచించినా భూ భారతి ఆపరేటర్ నమోదు చేయడం లేదు. – లింగమ్మ, చిన్నరేవల్లి, బాలానగర్ మండలం -
అమ్మకే అక్షరమాల.. నాన్నకు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: చదువు వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం. అక్షరాస్యతతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు హక్కులు, బాధ్యతలపై చైతన్యం వస్తుంది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యత సమస్య పూర్తిగా తొలగలేదు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ‘సాక్షర భారత్’ వంటి కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రస్తుతం అవి అంతగా కనిపించడం లేదు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకే అక్షరాలు నేర్పించడంపై దృష్టి సారిస్తోంది. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న పురుషుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో పూర్తిగా తొలగని నిరక్షరాస్యత ‘సాక్షర భారత్’కు బదులు ‘అమ్మకు అక్షరమాల’ మహిళా సంఘాల సభ్యులకే పరిమితమైన అక్షరాస్యత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు.. ఇందులో 2.99 లక్షల మంది పురుషులు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
7.78 లక్షల మంది నిరక్షరాస్యులు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ పోరాటం
● ‘రాగా ఫర్ ఇండియా’ పాదయాత్రకు ఘన స్వాగతం స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో న్యాయం, సమానత్వం, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం రాహుల్గాంధీ నిరంతరం పోరాడుతున్నార ని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. రాహుల్గాంధీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగా ఫర్ ఇండియా పాదయాత్ర’ సోమవారం మహబూబ్నగర్కు చేరు కుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి న్యూటౌన్ వరకు నిర్వహించిన పాదయాత్రలో సంజీవ్ ముదిరాజ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ధృఢ సంకల్పంతో వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర అభినందనీయమన్నారు. ఎండ, వాన, అలసటను లెక్కచేయకుండా దేశం కోసం వేల కిలోమీటర్లు నడుస్తున్న ఆయ న సంకల్పం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు వేస్తున్న ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, బలమైన దేశ నిర్మాణం దిశగా సాగుతున్న ఉద్యమానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు చంద్రకుమార్గౌడ్, జహీర్ అఖ్తర్, బెక్కరి మధుసూదన్రెడ్డి, మినాజుద్దీన్, పసుల రాజు, ప్రవీణ్కుమార్, తాహెర్, ప్రశాంత్, మహేందర్ పాల్గొన్నారు. -
కాళోజి జయంతిని దీక్షాదినంగా నిర్వహిద్దాం
జడ్చర్ల టౌన్: కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 9న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జలసాధన దీక్షా దినంగా జరుపుకుందామని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జరుగుతున్న నీటి అన్యాయంపై మరోమారు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా డిండి పేరుతో జిల్లాకు అన్యాయం చేసేందుకు పాలకులు పాల్పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులంటే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు. కృష్ణానదిలో 276 టీఎంసీల నీటిని మనం వినియోగించుకోవాల్సి ఉండగా 70 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 6 టీఎంసీలు నదిలో పారటానికి కేటాయించగా మిగిలిన 200 టీఎంసీలో 170 టీఎంసీలు నల్లగొండ జిల్లాకు వెళ్తున్నాయన్నారు. మిగిలిన 30 టీఎంసీల నీటిని మాత్రమే మనం వినియోగించాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, అన్నింటిని పూర్తి చేసేందుకు పోరాటాలు తప్పవన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎడారి కాకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తికావాల్సిన అవసరం ఉందని, 40 లక్షల ఎకరాల సాగుభూమికి నీళ్లు అందేవరకు పోరాటం చేయాల్సిందేనన్నారు. దీక్ష దినం రోజున అన్ని మండల కేంద్రాల్లో సాగునీటిపై జరుగుతున్న అన్యాయం గురించి చర్చించాలన్నారు. అదే విధంగా ఈ నెల 12న నాగర్కర్నూల్ గాంధీపార్కులో జలసాధన సత్యాగ్రహి దీక్ష నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రాఘవాచారి, సభ్యులు చెన్నకిష్టప్ప, యాదగిరి, శంకర్బాబు, మోహన్రాజ్, కుర్మంతి పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు రాష్ట్ర జట్ల పయనం
మహబూబ్నగర్ క్రీడలు: మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 7 నుంచి 10 వరకు జరిగే 4వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ జాతీయస్థాయి గోగేమ్ పోటీలకు రాష్ట్ర జట్లు బయలుదేరాయి. జిల్లా కేంద్రంలోని మాస్టర్ మైండ్స్ హైస్కూల్ ఆవరణలో శనివారం క్రీడా జట్లను పలువురు అభినందించారు. పోటీల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించాలని ఆకాక్షించారు. అనంతరం మాస్టర్ మైండ్స్ హైస్కూల్ యాజమాన్యం క్రీడాకారులకు టీషర్టులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మి, అకడమిక్ డైరెక్టర్ రాజేష్కుమార్, ప్రిన్సిపాల్ స్వరూప, వైస్ ప్రిన్సిపాల్ సుధారాణి, గోగేమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్షకీల్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల వివరాలు.. సబ్ జూనియర్ బాలుర సింగిల్ విభాగంలో జెట్టిగారి అభిజిత్, లలితేష్, జూనియర్ బాలుర సింగిల్లో సభావత్ వర్షిత్, రాహుల్, సీనియర్ పురుషుల విభాగం సింగిల్లో రాజేష్, మహ్మద్రాయన్ నజమ్ ఉన్నారు. -
కురుమూర్తి గుట్టకు భక్తుల రద్దీ
చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో వెలిసిన కురుమూర్తి గుట్టకు శ్రావణ శనివారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలివేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి, ఉద్దాల మండపం వద్ద దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
అక్షర శిల్పులకు అవార్డుల ప్రదానం
వికారాబాద్ జిల్లా కొడంగల్లో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన చేతుల మీదుగా వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, వారిలో నైతిక విలువలు పెంపొందించడం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో చూపిన సేవలను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. – సాక్షి నెట్వర్క్ -
కలుపు నివారణతో అధిక దిగుబడి
నాటిన 25–35 రోజుల మధ్య వెడల్పాకు కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే పొలంలో నీరు తీసేసి ఎకరానికి 400 గ్రాముల 2,4, డీ సోడియం సాల్ట్ను లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలంపూర్ : వరితో సహా ఏ పంటలోనైనా దిగుబడిపై ప్రభావితం చూపేది కలుపు. కలుపు వలన దాదాపు 35 శాతం పంట నష్టం జరుగుతుందని ఏంఏఓ నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. సరైన సమయంలో కలుపును నివారించకపోతే 40 శాతం వరకు దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. వరిలో కలుపు నివారణ చర్యలను ఈ విధంగా వివరించారు. నాటిన 3 నుంచి 5వ రోజు మధ్య : వరి నాటిన 3 లేక 5 రోజులలోపు పొలంలో 3 నుంచి 5 సెంటిమీటర్ల నీటిని నిల్వ ఉంచి ఎకరానికి 4 కిలోల 2, 4 డీ ఇౖథైల్ ఎస్టర్ లేదా 4 కిలోల బ్యూటక్లోర్ గుళికల్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతట సమానంగా పడే విధంగా చల్లాలి. లేదా లీటర్ నీటికి 35 గ్రాముల ఆక్సిడయార్జిల్ లేదా 80 గ్రాముల పైరజో సల్ఫురాన్ ఇథలైన్ కలిపి ఆ తర్వాత దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంత సమానంగా పడేలా చల్లాలి. పొలం అంత పలుచగా నీరు పెట్టి వీటిని చల్లుకోవాలి. ఈ మందులు చల్లిన రెండు మూడు రోజుల వరకు పొలంలోని నీరు బయటికి పోకుండా బయటి నీరు లోపలికి రాకుండా చూడాలి. గడ్డి జాతీ మొక్కలు (ప్రత్యేకించి ఊద ఎక్కువగా ఉంటే) : ఎకరానికి 500 మి.లీ అనిలోఫాస్ లేదా 500 మి.లీ ప్రిటిలాక్లోర్ లేదా 1.5 లీటర్ల బెంధియోకార్ప్ను 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో పలుచగా నీరు ఉంచి పొలం అంత సమానంగా పడేటట్లు చల్లాలి. నాటిన 8–12 రోజుల్లో ఎకరానికి 37.5 మి.లీ ఫెనాక్సులమ్ను బురద పదునులో పిచికారీ చేసి మరుసటి రోజు తేలిక పాటి నీరు పెట్టాలి. గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు ఉపయోగపడుతుంది. నాటిన 15–20 రోజుల మధ్య : నాట్లు వేసిన 3–5 రోజుల లోపుగాని 8–12 రోజుల లోపుగాని కలుపు మందుల వాడకం కుదరనప్పుడు 15–20 రోజుల మద్య మందుల ద్వారా కలుపు నివారించవచ్చును. గడ్డి జాతి వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే పొలం నుంచి నీటిని తీసి ఎకరానికి 80–100 మి.లీ బిస్పైరి బాక్సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ఉత్తమం. పాడి–పంట -
ఓం నమో.. వెంకటేశాయ
మహబూబ్నగర్ రూరల్/చిన్నచింతకుంట: మ న్యం ్డకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, కురుమూర్తి దేవస్థానాలు శనివారం జనసంద్రమయ్యాయి. శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు మన్యంకొండ, కురుమూర్తికి తరలివచ్చారు. శ్రావణమాసం వేడుకలను మన్యకొండలో ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే దేవస్థానంలో ఈ ఏడాది కూడా నెలరోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సర్వాభరణ అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలతోపాటు ప్రత్యేక పూజలు, శేషవాహన సేవలు నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులుదీరారు. దీంతో ఎక్కడ చూసినా మన్యంకొండలో భక్తులే కనిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చాలామంది భక్తులు దిగువ కొండ నుంచి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. దేవస్థానంతోపాటు స్టేజీ సమీపంలోని శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఆయా ఆలయాల్లో శ్రావణమాసం పూజలు ముగిశాయి. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజుతోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రావణమాసం చివరి శనివారం తరలివచ్చిన భక్తులు జనసంద్రమైన మన్యంకొండ, కురూమూర్తి గిరులు దాసంగాలతో స్వామివారికి నైవేద్యాలు -
జాబ్ క్యాలెండర్ పేరిట కుచ్చుటోపి
అమరచింత: ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరిట కుచ్చుటోపి పెడుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా 3వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ఉద్యమమే కీలకం అంటున్నారే తప్పా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను యువశక్తి, దేశ భవిష్యత్ అంటూ ప్రసంగాల్లో పొగడటం కాకుండా వారికి శాశ్వత ఉపాధి, నాణ్యమైన విద్య, సామాజిక భద్రత, ఉద్యోగాలు కల్పించే విధానాలను అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో శిక్షణ కార్యక్రమాలు ప్రకటిస్తూ.. మరోమైపు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను తగ్గించడం ప్రైవేటీకరణ– కాంట్రాక్టీకరణను పెంచడం ద్వారా యువత భవిష్యత్ను అనిశ్చితిలోకి నెట్టడం ఆపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీ గాలిలో దీపంగా మారిందన్నారు. రారష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు భర్తీ చేయలేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం నిఘా అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసి విద్యార్థి, యువత ప్రాణాలను రక్షించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జబ్బార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, రాజశేఖర్, మహేష్, నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రూ 3.80కోట్ల ధాన్యం మాయం
వనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లి శివారులోని బాలజీ రైసుమిల్లులో శనివారం సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ డీటీ పరమేష్ అండ్ సీసీఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కలసి తనిఖీ నిర్వహించగా.. 37,118 బస్తాల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ పరమేష్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని చిమనగుంటపల్లి శివారు బాలాజీ రైసుమిల్లుకు 2023–24 వానకాలం సీజన్లో వరి ధాన్యం 40 కేజీల బ్యాగులు 72,061 కేటాయించామని తెలిపారు. వీటిలో 9ఏసీకేల రైస్ సీఎంఆర్ ఇవ్వడం జరిగందని, మిగతాత 62,423 బస్తాలు రైతుమిల్లులో ఉండాలి. కాని 25,305 బస్తాల ధాన్యం మాత్రమే అందుబాటులో ఉందని, మిగతా 37, 118 బస్తాల ధా న్యం మాయమైన ట్లు గుర్తించారు. అట్టి ధాన్యం విలువ రూ 3.80కోట్లు ఉంటదని తెలిపారు. అధికారుల సూచనల మేరకు చర్య లు ఉంటాయని వివరించారు. -
రూ.110 కోట్లతో రూపురేఖల మార్పు
కురుమూర్తి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.110 కోట్లతో పలు పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం వద్ద మహామండపం, జాతర మైదానంలో కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రాజగోపురం వద్ద రేకుల షెడ్డు, కోనేరు సమీపంలో విడిది సత్రం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. మెట్ల కష్టాలకు చెక్ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి అమావాస్య, శని, సోమవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. అయితే వృద్ధులు, దివ్యాంగులు కొండపైకి మెట్లు ఎక్కలేక రాజగోపురం వద్ద నుంచే స్వామివారిని దర్శించుకుని వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఘాట్రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాల్లోనే ప్రధాన ఆలయం వరకు చేరుకునే అవకాశం కలగనుంది. దీంతో భక్తుల ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. -
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలి
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి ● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ సంస్కారం, విలువలు, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయిలో ఎంపికై న 69 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల దృష్టి మరల్చే అంశాలు అనేకం ఉన్నందున వారిని సరైన మార్గంలో నడిపించాలన్నారు. సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నారు. విద్యారంగంలో ప్రయోగాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ డిజిటల్ లెర్నింగ్, పాఠ్యపుస్తకాలు, త్రీడీ యానిమేషన్ల ద్వారా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 100 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషితో వివిధ రంగాల్లో నిపుణులు తయారవుతున్నారని అన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 69 మందికి అవార్డులు అందిస్తున్నప్పటికీ ప్రతి ఉపాధ్యాయుడు ఈ గౌరవానికి అర్హుడేనని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులే ప్రేరణ, మార్గదర్శకులు, ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో డీఈఓ విజయకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్, ఏఎంఈఓ శ్రీనివాస్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.


