breaking news
Mahabubnagar District Latest News
-
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వా«దీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వా«దీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
● హానికర బాణాసంచాకు దూరంగా ఉండాలి ● చిన్నారులతో జాగ్రత్త ● పర్యావరణ హితమే మేలు మహబూబ్నగర్ క్రైం: వెలుగు పూలు పూయించే దీపాల పండగ దీపావళి కొందరికీ సంతోషాన్ని.. మరికొందరికి అనారోగ్యాన్ని మోసుకొస్తోంది. ఆనందం కోసం కాల్చే టపాసులు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ప్రాణికోటి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. ఇదే సమయంలో మోతల మాటున శబ్ద కాలుష్యం, వెలుగుల మాటున రసాయన కాలుష్యం వెదజల్లుతూ ప్రకృతికి హాని కల్గిస్తోందన్న వాదన ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణీత సమయం వరకు టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ శబ్దలు వింటే.. టపాసులు కాల్చే సమయంలో ఎంతో ఆనందిస్తాం. కానీ అవి విడుదల చేసే వాయువులు, దుమ్ము, శబ్దాలు ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. వాతావారణం పూర్తిగా నాశనం అవుతుంది. ఎక్కువ శబ్దం వచ్చే టపాసులు కాల్చడం వల్ల చెవులకు హని కలిగే ప్రమాదం ఉంది. మనిషి సాధారణంగా వినే శబ్దాల తీవ్రత 60 నుంచి 65 డెసిబుల్స్ మధ్య ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీవ్రత కల్గిన శబ్దాల వల్ల మనిషి వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిసస్తునన్నారు. గాలిలో కలుస్తున్న దుమ్ము కణాలు దీపావళి పండగ సందర్భంగా వారం రోజుల పాటు కాల్చే టపాసుల కారణంగా శబ్దాలే కాకుండా పొగ, దుమ్ము, దూళి గాలిలో పెద్ద మొత్తంలో కలుస్తాయి. నేల మీద టపాసులు పేలినప్పుడు ఆ శబ్దాల తీవ్రతకు దుమ్ము ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలిలోకి చేరుతుంది. మహబూబ్నగర్ పట్టణంలో సాధారణ రోజులల్లో రోడ్లపై దుమ్ము కణాలు 30 నుంచి 35 ఆర్ఎస్పీఎం (రెస్పిరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులేట్ మ్యాటర్) శాతంగా ఉంటాయి. అదే దీపావళి రోజు 52శాతం వరకు చేరుతున్నట్లు సమాచారం. గాలిలో 50 శాతం దుమ్ము కణాలు ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంతో జాగ్రత్త వినలేని శబ్దాలను అదే పనిగా వింటూ ఉండటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారి ఆరోగ్యానికి ఇలాంటి శబ్దాలు మరింత ప్రమాదకరం. ముఖ్యంగా పెద్ద శబ్దాలు వినడం వల్ల తలనొప్పి, రక్తపోటు, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మైగ్రేన్తో బాధపడేవారికి శబ్దాలు వింటే రెండు గంటల పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. శబ్ద ప్రభావం పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు టపాసులు కాల్చే సమయంలో వచ్చే పొగ ఎక్కువగా మనుషులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ముక్కు, నోటికి మాస్క్, చెవుల్లో దూది లాంటివి పెట్టుకోవడం మేలు. టపాసుల నుంచి వచ్చే కా లుష్యం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించాలి. దగ్గర ఉండి కాల్చకండి.. దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడానికి రూ.వేలు ఖర్చు చేసి అధిక స్థాయిలో టపాసులు కొనుగోలు చేస్తారు. వాటిని దగ్గర నుంచి కాల్చడం వల్ల 91 డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాలను స్పష్టంగా వినిపిస్తాయి. 100 డెసి బు ల్స్ తీవ్రత గల శబ్దాలను 15 నిమిషాల వరకు.. 112 డెసిబుల్స్ శబ్దాలను ఒక నిమిషం పాటు వినగలం. 140 డెసిబుల్స్ శబ్దం మనుషులు వింటే వినికిడి శక్తి కొంత మేరకు కోల్పోవడానికి అవకాశం ఉంది. తీవ్రమైన శబ్దం వచ్చే బాణాసంచా 140 నుంచి 150 డీబీ శబ్ద తీవ్రత విడుదల చేసే ప్రమాదం ఉంది. శబ్ధాలతో ప్రమాదం టపాసులు కాల్చుతున్న సమయంలో అతి ధ్వనులనిచ్చే వాటికి దూరంగా ఉండాలి. భారీ శబ్దాల కారణంగా కర్ణభేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోవాల్సి వస్తోంది. దీపావళి సమయంలో ఇలాంటి వారు చాలా మంది చికిత్స కోసం వస్తుంటారు. బాణాసంచా నుంచి వెలువడే హనికర రసాయనాల ద్వారా పొగతో ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ సందీప్కుమార్, పల్మానాలజిస్ట్ -
ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. యోగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని కోరారు. ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్రాజు మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు, శరణ్య, మణికంఠ, పవన్కుమార్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. కిక్బాక్సింగ్ లీగ్లో ప్రతిభ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి వరకు జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ సిటీ లీగ్లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారిణులు 57 పతకాలు సాధించారు. ఇందులో 31 బంగారు పతకాలు, 15 రజతం, 11 కాంస్య పతకా లు సాధించి లీగ్లో అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు. క్రీడాకారిణులు ప్రతిభ చాటి పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్య క్షులు కె.రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్లు అభినందించారు. ప్రథ మ స్థానంలో నిలిచిన వారు త్వరలో జరిగే జోనల్ సెలక్షన్స్కు ఎంపికవుతారని తెలిపారు. జోనల్ సెలక్షన్స్లో పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు● ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు ● తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ● ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
జిల్లాకేంద్రంలో దీపావళి సందడి..
పాలమూరు పట్టణంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. షాపుల్లో కూడా దీపావళి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రత్యేకంగా పూల స్టాళ్లు వెలిశాయి. జడ్చర్ల టౌన్: దీపావళి సందర్భంగా గోగునార కట్టలతో చేసిన దుందువాతో దిష్టి తీస్తారు. జడ్చర్ల మండలంలోని చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. పొలాల్లో ఉన్న జీనుగ, పుంటికూర (గోగునార) కట్టెలు తీసుకువచ్చి వాటిని కట్టలా తయారు చేసి చిన్న చిన్న గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి దిష్టితీయడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని వాడుక భాషలో దుందువాగా వ్యవహరిస్తారు. దిష్టి తీశాక పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడం చేస్తారు. దీన్ని ఉల్కాదానంగా పిలుస్తారు. పితృదేవతలకు దక్షిణ దిక్కుగా దీపం వెలిగించడం వల్ల స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపినట్లవుతుందని భావిస్తారు. దీపం వెలిగించాక పిల్లలు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చి పూజాగృహంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కారం చేయాలి. సోమవారం సాధారణ నోములు, వ్రతాలు, లక్ష్మీపూజలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారు మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారమే చతుర్దశి కూడా ఉండడంతో ఉదయం భోగి మంగళహారతులు స్వీకరించి.. సాయంత్రం నోములు చేసుకోనున్నారు. ● లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువైన గంగాపురం గ్రామంలో పెద్ద దుందువాతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కార్తీక పాడ్యమి రోజున ఈ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది బుధవారం రోజున దుందువా వేడుకలను జరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
కారు ఇంజిన్లో మంటలు
జడ్చర్ల: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే గమనించి కారును నిలిపి వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి జడ్చర్ల సిగ్నల్గడ్డ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజన్లో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును వెంటనే నిలిపి పరిశీలిస్తుండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు నీటిని చల్లి మంటలను ఆర్పారు. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పాముకాటుతో గొర్రెల కాపరి మృతి నవాబుపేట: మండలంలో ని కూచూర్లో గొర్రెల కా పరి పాము కాటుతో మృతి చెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈ ఘటన వివ రాలు ఇలా.. కూచూర్కు చెందిన చిన్న మల్లయ్య (55) శనివా రం గొర్రెలను ఎప్పటి మాదిరిగా మేతకు తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో పాము కాటువేయగా అంతగా పట్టించుకోలేదు.ఏదో పురుగు అని ధీమాగా ఉన్నాడు.తీరా ఇంటికి వచ్చే సరికి విషం ఎక్కడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంత రం బాధిత కుటుంబ సభ్యులు అస్పత్రికి తరలించే లోగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చోరీకి పాల్పడిన దొంగకు దేహశుద్ధి కొత్తపల్లి: తాగిన మైకంలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి గమనించిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మద్దూరు మండలంలోని పెద్దిరిపాడు తండాకు చెందిన రాజునాయక్ కొత్తపల్లిలోని ప్రధాన చౌరస్తా వద్ద శివాలయంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ.1,450 నగదు అపహరించడంతోపాటు ఆలయం ముందున్న బోరు మోటరు కేబుల్ వైరును కటింగ్బ్లేడ్తో కట్ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజునాయక్ తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో అప్పటినుంచి తాగడానికి డబ్బుల్లేక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
కురుమూర్తి దారులకు మోక్షం!
● రోడ్డుకిరువైపులా ముళ్లపొదల తొలగింపు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ త్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కురుమూర్తి రహదారులన్నింటికీ అధికారు లు మరమ్మతులు చేపట్టారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత తదితర పనులు చేపట్టారు. ఆదివారం అమ్మాపురం, దేవరకద్ర, అల్లీపురం, అడ్డాకుల మండలంలోని వర్నే ముత్యాలంపల్లి, రోడ్లకు జేసీపీలను పెట్టి ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు కురుమూర్తి స్వామి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఈ సంవత్సరం ముందస్తుగానే ఆలయ అధికారులు ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. అందుకు రెండుమూడురోజుల క్రితమే పంచాయతీరాజ్ నుంచి గ్రా మా ల్లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ నుంచి నిధులు మంజూరు కా కున్న బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశతో ప్రధాన రోడ్ల మరమ్మతులు చేపట్టారు. పీఆర్ నిధులు మంజూరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామా ల్లో స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు చేపడుతారు. అందుకు ఆయా గ్రామాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. అందుకు నిధులు కూడా మంజూరు చేశారు. చిన్నవడ్డేమాన్ నుంచి అప్పంపల్లి వరకు ఉద్దాల బాటకు రూ.40వేలు, అప్పంపల్లి నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, తిర్మలాపురం సమీపం నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, కురుమూర్తి గ్రామం నుంచి అమ్మాపురం వరకు దేవుని బాటకు రూ.1.20లక్షలు, అమ్మాపురం నుంచి గ్రామ వాగుకు, కురుమూర్తి గ్రామం వరకు రూ.75వేలు, ఉంధ్యాల నుంచి చిన్నచింతకుంట వరకు రూ.70వేలు, అమ్మాపురం నుంచి గూడూరు వరకు రూ.75వేలు, అప్పంపల్లి నుంచి అమ్మాపురం, రాజోళి బాటకు రూ.1.20లక్షలు, లాల్కోట నుంచి పల్లమరి వరకు రూ.60వేలు, మద్ధూర్ నుంచి గ్రామ వాగు వరకు రూ.30వేలు, కౌకుంట్ల నుంచి పొన్నకల్, రాచాల, ఇస్రంపల్లి వరకు రూ.2లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలు పెట్టిన పనులు కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు ఆలయ అధికారులు పదిరోజుల క్రితం ఆర్అండ్బీ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. మహబుబ్నగర్, వనపర్తి డివిజన్లకు సంబంధించి మహబుబ్నగర్ జిల్లాకు చెందిన దేవరకద్ర నుంచి అమ్మాపురం, ఆత్మకూర్ వరకు, అల్లిపురం నుంచి లాల్కోట క్రాస్ రోడ్డు వరకు, దేవరకద్ర నుంచి తిర్మలాపురం, అప్పంపల్లి వరకు, దేవరకద్ర నుంచి కౌకుంట్ల, వెంకంపల్లి, కురుమూర్తి దేవస్థానం వరకు, వనపర్తి డివిజన్ చెందిన లక్ష్మీపురం నుంచి కొత్తకోట వరకు, కొన్నూర్ నుంచి నెల్విడి వరకు, మదనాపురం నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహబుబ్నగర్ డివిజన్ అధికారులు మాత్రం ఆదివారం పనులు చేపట్టారు. వనపర్తి డివిజన్వారు ఇంకా పసనులు చేపట్టలేదు. -
ఆకట్టుకుంటున్న ‘ప్రమిదలు’
దీపావళి పండుగలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. గత మూడు రోజుల నుంచి దీపాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ డిజైన్లలో దీపావళి ప్రమిదలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలోని ఏనుగొండ, పద్మావతీకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి, జిల్లా పరిషత్ ఎదుట, మల్లికార్జున్ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, క్లాక్టవర్, బస్టాండ్, పాన్చౌరస్తాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. కొంతమంది స్టాళ్ల నిర్వాహకులు కొన్ని ప్రమిదలను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తున్నారు. వివిధ డిజైన్ల ఆకర్షణీయమైన మట్టి దీపాలను తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతుండగా అక్కడి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమిదల పరిణామం, డిజైన్ను బట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గాజుతో చేసిన దీపాలు, కందీల్ దీపాలు, ఐదు క్యాండిల్స్ దీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి దీపాలు డజన్ రూ.50 నుంచి అమ్ముతుండగా.. ఇతర దీపాలు రూ.1,600 వరకు కూడా లభిస్తున్నాయి. వాటర్ ఫ్లవర్ రూ.150 నుంచి రూ.200, ఎలక్ట్రిక్ ప్రమిద రూ.200 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. -
వందనం
వీరులారా.. ● ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్తూపం శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ●ఉమ్మడి పాలమూరులో మావోయిస్టుల తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 1990లో కోడేరు మండలం తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ బలయ్యాడు. 1991లో వంగూరు పోలీస్స్టేషన్పై దాడి చేయగా ఖాజాపాషా అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. అదే ఏడాది కొల్లాపూర్లోని ఓ హోటల్లో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. 1993లో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్నగర్ ఎస్పీ పరదేశినాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్ఐలు కిషోర్కుమార్, శివప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాణ్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. 1994లో తలకొండపల్లి పోలీస్స్టేషన్పై మావోయిస్టులు జరిపిన దాడులో ఫయోద్దీన్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. 1996లో కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీధర్రెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. 1997లో బల్మూర్లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ నక్సల్స్ తూటాలకు బలయ్యాడు. అదే ఏడాదిలో అమ్రాబాద్ పరిధి లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్లో వెళ్తున్న ఎస్ఐ మాల్సూర్, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్ అలీఖాన్ అనే కానిస్టేబుల్ మరణించాడు. 1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు. 2000 ఏడాదిలో కానిస్టేబుల్ హన్మనాయక్ను హతమార్చారు. 2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు. అదే ఏడాదిలో ఆమనగల్ సమీపంలోని కాటన్మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు. 2002లో మన్ననూర్ పండరీ అనే కానిస్టేబుల్ చంపేశారు. 2004లో కొల్లాపూర్ ఎమ్మెల్యే గన్మెన్గా ఉన్న హుమ్లానాయక్, వెంకట్రెడ్డిలను తుపాకీతో కాల్చిచంపారు. అదే ఏడాది అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్మేన్ సుగుణాకర్ను కాల్చిచంపారు. 2005లో బాలానగర్ ఎస్ఐని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరకు ప్రకాష్ అనే కానిస్టేబుల్ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్స్టేషన్ ఎదుట నిల్చొని ఉన్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖర్నాయక్లను మావోయిస్టులు కాల్చిచంపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్ఐ అహ్మద్ మోహియుద్దీన్ను పోలీస్స్టేషన్ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు. 2006లో కొండనాగులలో జహంగీర్ అనే హెడ్కానిస్టేబుల్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిస్తున్న జోష్బాబు అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమార్చారు. అదే ఏడాది కొల్లాపూర్ పరిధిలోని సింగోటం వద్ద రమేష్ అనే కానిస్టేబుల్ మావోల తూటాలకు బలయ్యాడు. -
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వాధీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వాధీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
వెలుగుల దివ్వెలు..
శుభ, సంతోషాలకు సూచిక.. దీపావళి ● చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు ● ఇళ్లలో లక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు ● నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు చీకటి నుంచి వెలుగు వైపు పయనిద్దామని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానానికి ప్రతీక అయిన దీపాన్ని వెలిగించి.. మనలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని ధార్మికవేత్తలు ప్రజలను మేల్కొలుపుతారు. దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. ప్రాంత భేదాన్ని అనుసరించి దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. రాజస్తాన్ మార్వాడీలకు దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దాదాపు వందేళ్ల క్రితమే రాజస్తాన్కు చెందిన మార్వాడీల కుటుంబాలు పాలమూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం చాలా కుటుంబాలు హైదరాబాద్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 150కిపైగా రాజస్తాన్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడే ఉంటున్నప్పటికీ రాజస్తాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలు జరుపుకొంటారు. ముఖ్యంగా దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధన్తేరాస్ జరుపుతారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండోరోజు రూప్ చౌదాస్ వేడుకలు ఉంటాయి. కాగా.. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదోరోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు. వీరు గుంజ, బేసన్ చక్కి, పేటతోపాటు బెల్లంతో తయారుచేసిన తీపి వంటకాలు చేస్తారు. – స్టేషన్ మహబూబ్నగర్ హైందవ పర్వదినాల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించి ప్రత్యేకంగా లక్ష్మి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున లక్ష్మీపూజతో ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. – గొండ్యాల రాఘవేంద్రశర్మ, ప్రధాన అర్చకులు, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం -
మళ్లీ తాగునీటికి కటకట
జిల్లాకేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు పట్టుకుంటున్న ప్రజలు జడ్చర్ల పరిధిలోని నాగసాల వద్ద మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు మరమ్మతు చేస్తుండటంతో జిల్లాకేంద్రంలోని 35 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు రోజులుగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా మున్సిపల్ అధికారులు నిత్యం 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. ధర్మాపూర్ వద్ద మరోసారి మిషన్ భగీరథ పైపులైన్కు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని మరమ్మతు చేయడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. దీంతో నగరంలో మంగళవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. – మహబూబ్నగర్ మున్సిపాలిటీ -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బల్మూర్: ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పంజుగుల మనోహర్(24) ఐదేళ్లుగా ఆటో నడుపుతై జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి ఇటీవల అనారోగ్యంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఐదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి బాత్రూంకు వెళ్లి ఎంతకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించిగా ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి సుల్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హన్వాడ: మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కమ్మరి వెంకటేష్ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అప్పులు కూడా పెరిగడంతో వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇటీవలే కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. శుక్రవారం తాను నిర్వహిస్తున్న కార్పెంటర్ షాపునకు వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఇంటికి రాకపోవడంతో భార్య సుకన్య షాపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో వెంకటేష్ విద్యుత్ వైర్లతో ఉరేసుకుని మృతి చెందడాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించింది. ఎస్ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య జడ్చర్ల: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శికార్గానిపల్లిలో చోటుచేసుకుందని సీఐ కమలాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శికార్గానిపల్లికి చెందిన మండ్ల శైలజ అలియాస్ గుడిసె లాస్య(27) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మూసాపేట మండలం జానంపేటకు చెందిన వెంకటేశ్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ముగ్గురు కుమారులు అనారోగ్యానికి గురైనా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వరుసగా మృతిచెందారు. దీంతో లాస్య శికార్గానిపల్లిలోని తల్లి మండ్ల జయమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. తనకు అదనంగా కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారకుడైన వెంకటేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాస్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వేలూరు రైల్వేస్టేషన్లో గట్టువాసులు
గట్టు: మండలానికి చెందిన మూగవారు తప్పిపోయి తమిళనాడులోని వేలూరు రైల్వేస్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు, మహిళ, ఇద్దరు పిల్లలను వేలూరులో రైల్వే పోలీసులు గుర్తించి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని.. ఏ ప్రాంతం వారని ఆరా తీసినట్లు సమాచారం. వారంతా మూగవారు కావడంతో అతికష్టం మీద వారి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే తమది జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ప్రాంతమని పేపర్పై రాసి ఇవ్వడంతో.. రైల్వే పోలీసులు శనివారం గద్వాల ఆర్డీఓకు సమాచారం అందించారు. ఈ మేరకు వేలూరు రైల్వే స్టేషన్లో కనిపించిన వారి ఫొటోలను గట్టు తహసీల్దార్ విజయ్కుమార్కు పంపించి.. గుర్తించాల్సిందిగా చెప్పారు. రెవెన్యూ అధికారులు సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులకు వీరి ఫొటోలను ఫార్వర్డ్ చేశారు. వారు ఎవరనే విషయాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు. -
కురుమూర్తి ఉత్సవాలకు ఏర్పాట్లు
● ఆలయ పరిసరాల్లో పనుల ముమ్మరం ● పూర్తిదశకు చేరుకున్న రంగులు అద్దడం ● మంచినీరు, పారిశుద్ధ్యంపైప్రత్యేక దృష్టి చిన్నచింతకుంట: కాంచన గుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామి బహ్మోత్సవాలు, జాతర ఈనెల 22 అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. అందుకు ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టారు. పనులను పూర్తి చేసేందుకు రెండుమూడు రోజులుగా పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు పారిశుద్ధ్యం, మంచినీరు, ట్రాఫక్ నియంత్రణ, పార్కింగ్, ప్రయాణ సౌకర్యాలు, వైద్యం, నిఘా ఏర్పాట్లపై దృష్టిసారించి అందుకనుగుణంగా పనులు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే రంగులు అద్దే పనులు పూర్తి దశకు చేరుకోగా.. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర మైదానంలోని డ్రైనేజీల్లో జేసీబీల ద్వారా మురుగు, పిచ్చిమొక్కలను తొలగించారు. అన్నదాన సత్రం, కోనేరు వద్ద మరుగు దొడ్లు, మూత్రశాలలు, స్నానపుగదుల మరమ్మతులు చేపట్టారు. మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదుకు తగు చర్యలు చేపడుతున్నారు. భక్తుల ప్రయాణానికి బస్స్టాప్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు, సీసీ కెమెరాలు, వైద్య, ఆరోగ్య కేంద్రాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అందుకు ఆయా ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి చదును చేయాల్సి ఉంది. జాతర మైదానంలోని పలుచోట్ల నీటిగుంతలు పూడ్చాల్సి ఉంది. కొన్నిచోట్ల ఉన్న మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వాటికి ట్యాపులు బిగించాల్సి ఉంది. అయితే ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చేపట్టాల్సిన పనులు పనులు పూర్తి చేస్తాం స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద రంగులు అద్దే పనులు పూర్తి చేశాం. ఆలయ ప్రాంగణం, మెట్ల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి శుభ్రపరిచాం. జాతర మైదానంలో చేయాల్సిన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేస్తాం. – మధనేశ్వరెడ్డి, ఈఓ, కురుమూర్తిస్వామి ఆలయం ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టాం. ముఖ్యంగా మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నింత్రణపై దృష్టిసారించి చర్యలు చేపడుతాం. బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం. – గోవర్ధన్రెడ్డి, చైర్మన్, కురుమూర్తి స్వామి ఆలయం -
ఉత్సాహంగా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంరటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్లో ఉమ్మడి జిల్లాతో వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది బాలికలు పాల్గొన్నారు. పోటీలను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రీడలను ప్రాక్టిస్ చేయాలని తద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. సెల్ఫోన్కు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు. మహబూబ్నగర్ క్రీడాపోటీల నిర్వహణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. డీవైఎస్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ సిటీ లీగ్ పెట్టడం జరిగిందన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్లు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిభచాటిన వారు త్వరలో జరిగే జోనల్ స్థాయి సెలక్షన్స్లో పాల్గొంటారని చెప్పారు. జోనల్ స్థాయిలో మెడల్స్ సాధించేవారు జాతీయస్థాయి పోటీలకు వెళ్తారని, నగదు పారితోషికాలు ఉంటాయన్నారు. నిరంతరం కిక్బాక్సింగ్ ప్రాక్టిస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్సోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, రవినాయక్, భరత్, కనకం యాదవ్, శేఖర్, నర్సింగ్రావు, తిరుపతి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలు.. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాలు, టీం వెపన్, టీం కతాస్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రియేటివిటీ ఫాంలో మహబూబ్నగర్ జట్టు భావన వర్షిణి, కె.క్రితిజ్ఞ, రిత్వికారెడ్డి ప్రథమ (మహబూబ్నగర్) ప్రథమ, శ్రీహిత, అవిశృతి– ద్వితీయ (మహబూబ్నగర్), హార్డ్ స్టైల్ ఫాంలో రితిక ప్రథమ, గోమతి (ద్వితీయ), ఆరోహి (తృతీయ), మ్యూజికల్ ఫాంలో హారికారెడ్డి ప్రథమ, వర్షిణి ద్వితీయ స్థానాల్లో నిలిచారు. -
నెట్టెంపాడు కాల్వలో పడిన యువకుడు
ధరూరు: పొట్ట కూటి కోసం జాతరలో సర్కస్ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదశాత్తు నెట్టెంపాడు కాల్వలో పడి ప్రాణాలతో బయటపడిన ఘటన మండలంలోని గుడ్డెందొడ్డి శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సర్కస్ వేసేందుకు వచ్చిన కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన తనాజీ అనే 25 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతడు శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మండలంలోని గుడ్డెందొడ్డి శివారులోని నెట్టెంపాడు ప్రధాన కాలువలో చేపల పట్టేందుకు వెళ్లాడు. పంప్హౌస్ సమీపంలోనే కాల్వ లోతుగా ఉందని తెలియని ఆ యువకుడు కాల్వలోకి దిగి జారిపడిపోయాడు. అక్కడే ఉన్న వారి బంధువైన మరో యువకుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల రైతులు, అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ముందుగా రేవులపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం సిబ్బందికి విషయం తెలిపారు. అందరూ కలిసి గంట పాటు శ్రమించి ఆ యువకుడిని తాళ్లు, నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి ఓ నిండు ప్రాణానాన్ని కాపాడిన ఎస్ శ్రీహరి, గద్వాల ఫైర్ స్టేషన్ ఎస్ఐ రాకేష్, పోలీసులను గుడ్డెందొడ్డి మాజీ సర్పంచు రఘువర్ధన్రెడ్డి, సామాజిక కార్యకర్త అంజి సాగర్ శాలువాలతో సన్మానించారు. 10 అడుగుల దూరంలోనే పంప్ హౌస్ మోటారు రన్నింగ్లో ఉండడంతో అందులోకి జారుకునే ప్రమాదం ఉందని, పోలీసులు సమయానికి వచ్చి ప్రాణాలను కాపాడారని గుడ్డెందిడ్డి గ్రామస్తులు తెలిపారు. బాధితుడికి తల, చేతికి గాయాలవడంతో చికిత్స కోసం 108 అంబులెన్స్లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. -
తల్లిదండ్రులకు పాదపూజ
అడ్డాకుల: మండలంలోని కందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మా తృపూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడే తపణను ఆయన వివరించారు. హెచ్ఎం మురళీధర్, నిర్వాహకులు అని ల్ భగవత్, సంభూపాల్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్శర్మ, జనార్దన్రెడ్డి, చంద్రశేఖర్, విజయ్కుమా ర్, జయశ్రీ, శ్రీదేవి, గోపాల్, నాగమణి, అనిత పాల్గొన్నారు. -
గుమ్మకొండ తండాలో విషాదం
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండ తండాకు చెందిన శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శంకర్నాయక్ పనులు ముగించుకొని బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించడంతో శుక్రవారం రాత్రి శంకర్ నాయక్ మృతదేహాన్ని శనివారం తండాకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, తండావాసుల రోదనలతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నా యి. కాగా శంకర్ నాయక్ మరణవార్త తెలుసుకున్న మరికల్ చైటచెరువు తండాకు చెందిన రామునాయక్, మంజుల దంపతులు అంత్యక్రియల నిర్వహణకు గాను మృతుడి కుటుంబానికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. డీసీఎం, కారు ఢీ: ఇద్దరి దుర్మరణ ం వనపర్తి రూరల్: ముందు వెళ్తున్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన నాగరాజు (డ్రైవర్), కొంపల్లికి చెందిన మనీష్, విశాల్, రాజేష్ బ్యాండ్ మేళం వాయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వీరు బ్యాండ్ మేళం వాయించడానికి కర్నూల్కు వెళ్తున్నారు. మార్గ మధ్యలో పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై నందగోపాల్ హోటల్ సమీపంలోకి రాగానే తెల్లవారుజామున 3.30కు వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎం సడన్గా బ్రేక్ వేయడంతో వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో నాగరాజు (24), మనీష్ (24) అక్కడిక్కడే మృతి చెందారు. విశాల్, రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జంగాల రాజేష్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి ఊట్కూరు: మండలంలోని నిడుగుర్తిలో శనివారం ఇంటి దగ్గర ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతిచెందగా.. మరొకకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతమ్మ(55) అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంటికి పెరుగు కోసం వెళ్లింది. పెరుగు తీసుకొని కృష్ణారెడ్డి కూతురు మంజులతో మాట్లాడుతూ.. ఎదురుగా ఉన్న అరుగులపై కూర్చుంది. అప్పు డే పొలానికి వెళ్లేందుకు ఆంజనేయులు ట్రాక్టర్ను స్టార్ట్ చేయగా.. వేగంగా వెళ్లి ఇద్దరు మహి ళలపై దూసుకెళ్లిది. అనంతమ్మ, మంజులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అనంతమ్మ మృతిచెందింది. మంజుల కాలు విరిగింది. ఈ విషయమై మృతురాలి మేనల్లుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. పురుగు మందు తాగి.. వ్యక్తి బలవన్మరణ ం భూత్పూర్: మండలంలోని పోతులమడుగుకు చెందిన ఖాసీం (48) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఖాసీం వ్యవసాయ కూ లీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం ఉదయం కోట్ల నారాయ ణ వ్యవసాయ పొలంలో పనికి వెళ్తున్నానని భా ర్య సుజాతతో చెప్పి వెళ్లాడు. ఖాసీం స్నేహితుడు జోగు చెన్నప్ప కూడా పనినిమిత్తం కోట్ల నారాయణ పొలం వద్దకు వెళ్లగా ఖాసీం చలికి వణుకుతున్న స్థితిలో కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా ఆర్ధిక పరిస్ధితి బాగా లేకపోవడంతో పురుగు మందు తాగినట్లు ఖాసీం చెప్పాడు. దీంతో చెన్నప్ప వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆస్పత్రికి తరలించారు. పరి స్థితి విషమించడంతో ఖాసీం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి స్టేషన్ మహబూబ్నగర్: నారాయణపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం స్వయంగా సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా తీసుకున్నామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి శనివారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ అర్బన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందని, ఎవరూ ఎలాంటి అపోహలు లేకుండా అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ చేపట్టిందన్నారు. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ముందున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎవరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో, ఎవరు డీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందో గ్రహించి వారి పేరును ఏఐసీసీ పరిశీలకులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఏఐసీసీ పరిశీలకులు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. అదేవిధంగా హన్వాడ, మహబూబ్నగర్ రూరల్ మండలాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ ఓ కన్వెన్షన్ హాల్లో చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధులు హర్షవర్ధన్రెడ్డి, జహీర్ అఖ్తర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, మన్నె జీవన్రెడ్డి, సురేందర్రెడ్డి, రాధ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు
రాజ్యాంగబద్ధంగా కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ‘సాక్షి’పై దాడు లు, పోలీసుల బెదిరింపు లు తగవు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు విమర్శ చేసే హక్కు, ప్రజలు, ప్రభుత్వాల కు వారధిగా ఉండేలా రాజ్యాంగం కల్పించిన హక్కు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, సా మాజిక స్పృహ కలిగిన వారు ‘సాక్షి’ పత్రిక, చా నల్పై చేస్తున్న కక్ష్యపూరిత చర్యను ఖండించాలి. – ఎన్.కురుమూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రజలే తిరగబడతారు.. మీడియా గొంతు నొక్కితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. సమాజంలో నాలుగో స్తంభం పత్రిక. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా తమ భావజాలాన్ని ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ హరిస్తోంది. అణచివేతకు గురిచేసిన ప్రభుత్వాలకు గతంలో ఏ గతి పట్టిందో అదేగతి ఈ ప్రభుత్వాలకు పడుతుంది. – రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి పాలమూరు: సమాజంలో ఫోర్త్ పిల్లర్గా పేరొందిన మీడియాపై కక్ష్యసాధింపు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం అప్రజాస్వామికమని, దుర్మార్గపు చర్య అని మేధావులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఏపీ కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులతోపాటు వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో పలువురు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బెదిరింపులు సరికాదు.. ప్రజాస్వామ్యంలో అన్ని పత్రికలు సమానమే. ఏ పత్రిక అయినా ప్రజల పక్షానే ప్రశ్నిస్తుంది. అంతే తప్పా ప్రశ్నించే గొంతులకు నొక్కివేసే ప్రయ త్నం చేయకూడదు. నిజంగా తప్పు జరిగి ఉంటే చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలి తప్పా.. బెదిరింపు ధోరణి సరైన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిది. – భరత్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి దాడులను ఖండించాలి.. ప్రజా సమస్యలపై ప్రజా స్వామ్యబద్ధంగా పోరాటం చేసే పత్రికలపై ప్రభుత్వాలు దాడులు చేయడం, కేసులతో నిర్బంధం చేయడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రతిఒక్కరూ పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించాలి. – బాలకిషన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ● -
రిజర్వేషన్లు ఇచ్చేవాళ్లు రోడ్లపైకి రావడం విడ్డూరం
జెడ్పీసెంటర్: రిజర్వేషన్ ఇచ్చేవాళ్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బంద్లో భాగంగా తెల్లవారు జామున 5 గంటలకే బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ బంద్లో పాల్గొని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ ఇవ్వగలిగే బీజేపీ కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి పదేళ్లలో బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, పేదలకు రుణాలు, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిందని వివరించారు. -
బంద్ సంపూర్ణం
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్ నిర్మానుష్యంగా మారిన జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్స్టేషన్ మహబూబ్నగర్/ జెడ్పీసెంటర్/ మహబూబ్నగర్ క్రైం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు ఉదయం నుంచే దుకాణాలను బంద్ చేయగా.. ఆర్టీసీ బస్సులు డిపోలు, బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. ఉదయం నుంచే ప్రధాన పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని బస్టాండ్ గేటు ఎదుట బైఠాయించి.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మహబూబ్నగర్ డిపోకు చెందిన 137 బస్సులు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్సుల బంద్తో డిపోకు సంబంధించిన రోజువారీ ఆదాయంపై ప్రభావం ఏర్పడింది. ముందస్తుగా తెలంగాణ బంద్ సమాచారం ఉండడంతో బస్టాండ్లో ప్రయాణికులు చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ గేటు ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, నాయకులు శివరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి బస్టాండ్ గేటు ఎదుట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు నాగేశ్వర్రెడ్డి, అంజయ్య, రమేష్కుమార్, పాండురంగారెడ్డి, సతీష్కుమార్, కృష్ణవేణి, యాదమ్మ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆర్అండ్బీ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల మీదుగా మోటార్బైక్ ర్యాలీలు చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సమూహంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాష్ట్ర ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధతతోపాటు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, మైత్రియాదయ్య, బీసీ జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్, శ్రీనివాస్సాగర్, సారంగి లక్ష్మీకాంత్, మున్నూరు రాజు తదితరులు గేటు ఎదుట నిరసన చేపట్టారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలతో ర్యాలీ తీశారు. అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సంప్రదాయమైన డోలుతో బస్టాండ్ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. మోటార్బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్, టీఎఫ్టీయూ, సబ్బండ ప్రజా సంఘాలు పట్టణ పురవీధుల్లో ప్రదర్శనలు, తెలంగాణ చౌరస్తా, క్లాక్టవర్, అంబేద్కర్ చౌరస్తాలో సభలు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆయా ప్రతినిధులు రామచందర్, ఎస్ఎం ఖలీల్, హనీఫ్ అహ్మద్, రాఘవాచారి, కిల్లె గోపాల్, కురుమూర్తి, తిరుమలయ్య, చంద్రకాంత్, రాజ్కుమార్, పాష, విజయ్కుమార్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. డిపోలు, బస్టాండ్లకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా దుకాణాలు తెరవని వ్యాపారులు బస్టాండ్ గేటు ఎదుట పార్టీలు, బీసీ సంఘాల నేతల బైఠాయింపు జిల్లాకేంద్రంలో బైక్, ఆటోల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు -
ఎస్పీ పర్యవేక్షణ
మహబూబ్నగర్ క్రైం: బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా శనివారం ప్రజా సంఘాలు, పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలపై బందోబస్తును ఎస్పీ జానకి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్తోపాటు ప్రధాన చౌరస్తాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అదనపు బందోబస్తు, రోడ్లపై పెట్రోలింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేశామన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్దాస్ తెలిపారు. అలంపూర్ పట్టణంలోని పాపనాశిని ఆలయాల్లో గార్డెన్ పనులను గురువారం కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల సముదాయాన్ని కేంద్ర పురావస్తు శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో అభివృద్ధికి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా రూ. 20 లక్షలతో పను లు ప్రారంభించామని తెలిపారు. పాపనాశిని, సంగమేశ్వర ఆలయాల ప్రాముఖ్యత భక్తులకు, పర్యాటకుల తెలిసే విధంగా ప్రచార చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి 5వ శక్తి పీఠ క్షేత్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయాల సందర్శన అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయాలను కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ నిఖిల్దాస్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈఓ దీప్తితో కలిసి ఆలయాల్లో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. వీరితో పాటు కేంద్ర పురాతత్వ శాఖ కన్సర్వేషన్ అసిస్టెంట్ వెంకటయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఈగలపెంట వద్ద..
దోమలపెంట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్ఎస్జీ అధికారుల ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వి.వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పోలీసులు ఈగలపెంటలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించారు. ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాలన్నింటిని జెన్కో గ్రౌండ్లోకి మళ్లించి అక్కడే నిలిపి వేశారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సున్నిపెంట నుంచి ప్రధానమంత్రి హెలికాప్టర్లో బయలుదేరిన తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగించారు. ఈగలపెంట ఎస్ఐ జయన్న ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఏపీ పోలీసులకు సహకరించారు. -
హైవేపై దారి మళ్లింపు
● కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన ● తెలంగాణ సరిహద్దులో ట్రాఫిక్ ఆంక్షలు ● జాతీయరహదారిపై నిలిచిన వాహనాలు ● దారి మళ్లించే ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అలంపూర్/మానవపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన కారణంగా జాతీయ రహదారి నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలను మళ్లించారు. పోలీసులు సూచించిన రోడ్డు మార్గాల ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు తరలివెళ్లారు. కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొనందున అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి రోజంతా కొనసాగింది. దీంతో అలంపూర్, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్, అయిజ వంటి ప్రాంతాలు వాహనాలతో రద్దీగా మారాయి. అలంపూర్ సీఐ రవిబాబు, ఉండవెల్లి ఎస్ఐ శేఖర్, అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఏపీకి చెందిన సీఐ, పోలీసులు సైతం ట్రాఫిక్ మళ్లింపులో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి ఒక్కసారిగా వచ్చిన వాహనాలతో ఫ్లైఓవర్, జాతీయ రహదారిలో రద్దీ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా దారి మళ్లించే ప్రదే శాల్లో ఆయా ప్రాంతాల పేర్లు, గుర్తులతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో ఏపీ పోలీసులు లారీ వంటి వాహనాలతో పాటు కార్లను సైతం దారి మళ్లించారు. దీంతో జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సీఐ రవిబాబు ఇక్కడికి చేరుకోని కార్ల లాంటి చిన్న వాహనాలను నేరుగా జాతీయరహదారి గుండా వెళ్లడానికి అవకా శం కల్పించారు. దీంతో ట్రాఫిక్ సమస్య సద్దుమణిగింది. భారీ వాహనాల నిలిపివేత కర్నూల్ జిల్లాలోని నన్నూరులో ప్రధాని భారీ బహిరంగ సభ నేపథ్యంలో మానవపాడు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి–44పై భారీ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో బెంగుళూరు, అనంతపురం, హిందూపురం, పుట్టపర్తికి వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. -
చెంచుల అభ్యున్నతికి పథకాలు
● క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దడంలో కళాకారులు, రచయితలుభాగస్వాములు కావాలి ● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఆదివాసీ చెంచుల సమగ్ర, సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో ఉన్న 1,441 మంది లబ్ధిదారులకు చేరాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, సౌర విద్యుత్, పక్కా ఇళ్లు, విద్య తదితర పథకాలు చెంచులకు అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని, క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు, రచయితలు, కవులు, కళాకారులు వీధి నాటకాలు, జానపద గేయాలు, రచనలతో మూడ నమ్మకాలు, సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి తమవంతు కృషి చేయాలన్నారు. చెంచులు, ఆదివాసీ మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి మహబూబ్నగర్ జిల్లా విశిష్టత, ప్రముఖ పర్యాటక స్థలాలు, విద్య, వెద్యం, వివిధ శాఖల్లో సాధించిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యం, క్రీడలు, రచనలు, సేంద్రియ సాగు, సామాజిక సేవ తదితర రంగాల్లోని 16 మంది ప్రముఖులు ఆయా రంగాల్లో చేసిన సేవలను తెలియజేశారు. మొక్క నాటిన గవర్నర్.. కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కనాటి నీరు పోశారు. పచ్చదనంతో పర్యావరణానికి మేలు చేకూరుతుందని.. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు ఘన స్వాగతం.. కలెక్టరేట్కు చేరుకున్న గవర్నర్కు కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్ స్వాగతం పలకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం గ్రామీణాభివృద్ధి, వైద్య, మెప్మా, రెడ్క్రాస్ సొసైటీ, మహిళా, శిశుసంక్షేమ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ తిలకించారు. చెంచుల ఆరోగ్య పరీక్షల నిర్వహణకుగాను ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ కింద సంచార వైద్య వాహనాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. -
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే నివాసంలో కురుమూర్తి స్వామి ఆలయ పాలక మండలితో కలిసి స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆలయం వద్ద కొనసాగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా జరుపుకుందామన్నారు. అందుకు ఆలయం వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలక మండలి సభ్యులు, తదితరులు ఉన్నారు. -
మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణస్వామి దేవరకద్ర/అడ్డాకుల: మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తారని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం దేవరకద్ర, అడ్డాకులలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, టీపీసీసీ పరిశీలకుడు ఉజ్మాషాకీర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు. మెజార్టీ అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ తీసుకునే నిర్ణయం కూడా అభిప్రాయాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీహరి, శెట్టి శేఖర్, శ్రీనివాస్రెడ్డి, అంజిల్రెడ్డి, నాగార్జున్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, నాగిరెడ్డి, బగ్గి కృష్ణయ్య, గోవర్దన్రెడ్డి, కతలయ్య, నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, దశరథ్రెడ్డి, విజయమోహన్రెడ్డి, బాలస్వామి, వెంకటేశ్, కిషన్రావు, రాంపాండు, ఆదిహన్మంతరెడ్డి, అంజన్కుమార్రెడ్డి, ఫారూఖ్, కోనరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్ల జీవనం సాగించాలి..
వారం రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎట్ల జీవనం సాగించాలి. ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడిగినా పైపులైన్లు పగులుతున్నాయని చెబుతున్నారు. వీటికి త్వరగా మరమ్మతులు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు చేయాలి. మా ప్రాంతంలో కొన్ని నెలలుగా ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి రెండు రోజులకోసారైనా క్రమం తప్పకుండా ఇంటింటికీ తాగునీటిని అందించాలి. – కమల, గృహిణి, క్రిస్టియన్కాలనీ, సుభాష్నగర్ లీకేజీలను బాగు చేశాం నగరంలోని రాంరెడ్డిగూడెం వద్ద, ధర్మాపూర్ శివారులో అలాగే ఎన్హెచ్–167పై షాషాబ్గుట్ట మలుపు వద్ద మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు పది రోజుల వ్యవధిలోనే భారీగా ఏర్పడిన లీకేజీలను బాగు చేయడానికి కొంత సమయం పట్టింది. గురువారం ఉదయం నుంచి తిరిగి తాగునీటి సరఫరాను పునరుద్ధరించగలిగాం. రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు విడతల వారీగా తాగునీరు అందుతుంది. ఈ పది రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఆయా ప్రాంతాలకు నిత్యం 20 ట్యాంకర్లను పంపించాం. – నర్సింహ, ఇన్చార్జ్ ఎంఈ, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ తాగునీరు రాక 20 రోజులైంది.. మా తండాలో 60 నుంచి 70 వరకు కుటుంబాలు ఉంటాయి. 20 రోజుల నుంచి మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీరు ఇంటింటికీ అందడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాటర్ ట్యాంకర్లను మా ప్రాంతానికి పంపిస్తే సమస్య కొంత తీరుతుంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – నీలిబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు, పూజారితండా, చిన్నదర్పల్లి ● -
విలువలు పెంపొందించుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని.. అది విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భం అన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం పొందడమే కాదని.. అది వ్యక్తిత్వం, విలువలు, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. పీయూలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మిలియన్ ట్రీ ప్లాంటేషన్, యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకోవడం, కనెక్ట్ విత్ చాన్స్లర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏ యూనివర్సిటీ సాధించలేని విధంగా పీయూ పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు సాధించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ ఈ సంవత్సరం న్యాక్ రెండోసారి వెళ్లడం మంచి పరిణామం అని, ఉన్నత విద్యకు కృషి చేసే యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి యూనివర్సిటీలు రీసెర్చి, ఇంక్యూబేషన్ సెంటర్లుగా మారి విద్యార్థుల ద్వారా కొత్త స్టార్టప్లు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. పీయూలో ఇటీవల లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని గవర్నర్ అన్నారు. ఇంజినీరింగ్లో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషన్ లర్నింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 100 శాతం అడ్మిషన్లు సాధించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్టులతో ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020తో విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు అభినందించారు. -
భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరైన సందర్భంగా పోలీసులు పహారా కాశారు. బందోబస్తును జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు డీఐజీ బందోబస్తు పర్యవేక్షిస్తూ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో సర్వైలైన్స్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తే చర్యలు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఏదైనా ప్రాంతాల్లో కానీ, ఇళ్లు, ఫ్యాక్టరీలలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వంటి డ్రగ్స్ తయారీ కార్యకలాపాలు ఉంటే టోల్ ఫ్రీ నం.18005996969తోపాటు ఆయా జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ ఏరియాల్లో అనుమానాస్పదంగా కనిపించినా, ఎవరైనా వ్యక్తులు డ్రగ్ విక్రయాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను గుర్తిస్తే నకిలీ, నాణ్యత లేని మందులను మార్కెట్లోకి రాకుండా నివారించవచ్చని చెప్పారు. ఖాళీ సీట్ల భర్తీకిదరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని బాలానగర్, దేవరకద్ర, రాంరెడ్డి గూడెం, జడ్చర్ల, నంచర్ల గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోఆర్డినేటర్ వాణిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 18 లోగా ఆయా గురుకులల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. నేడు వాలీబాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఒరిజినల్ మెమో, బోనోఫైడ్తో ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరుకావాలని ఆమె కోరారు. 19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్ను సంప్రదించాలని సూచించారు. యోగాసన క్రీడాజట్ల ఎంపికలు ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్కు సంప్రదించాలని వారు సూచించారు. -
నగరంలో తాగునీటికి కటకట!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటమే. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోకి వచ్చే నగరంలోని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, బీఎన్రెడ్డికాలనీ, బాలాజీనగర్, క్రిస్టియన్పల్లి, అయోధ్యనగర్, పాతపాలమూరు, బండమీదిపల్లి, హనుమాన్పురా, గణేష్నగర్, వల్లభ్నగర్, కిసాన్నగర్, బండ్లగేరి, వీరన్నపేట, టీడీగుట్ట, కోయిల్కొండ ఎక్స్రోడ్, చిన్నదర్పల్లి, కొత్తచెరువురోడ్, కొత్తగంజి, హనుమాన్నగర్, సింహగిరి, మోతీనగర్, రైల్వేస్టేషన్ ఏరియా, సుభాష్నగర్, కోర్టురోడ్, బోయపల్లి తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.. ● నగరంలోని 60 డివిజన్ల పరిధిలో మూడు లక్షల పైచిలుకు మంది ప్రజలు నివసిస్తున్నారు. 2020 నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా మొత్తం 28 ఓవర్హెడ్ ట్యాంకులను నింపుతున్నారు. ఇంటింటికీ తాగునీటిని రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అయితే సుమారు 20 ఏళ్ల క్రితం పాత పైపులైన్లకు మిషన్ భగీరథ లైన్లు కలపడంతో తరచూ అవి ఎక్కడబడితే అక్కడి పగిలిపోతున్నాయి. అలాగే మెయిన్ పైపులైన్కు సైతం లీకేజీలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఎన్హెచ్–167పై స్థానిక షాషాబ్గుట్ట మలుపు వద్ద, రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు తాగునీరు నిలిచిపోయింది. వీటిని బాగుచేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వారం రోజులు పట్టడంతో అందరూ అల్లాడిపోయారు. మూడు రోజుల నుంచే ట్యాంకర్లను పంపించగలిగారు. చివరకు గురువారం తెల్లవారుజామున పునరుద్ధరించి ఆయా ఓవర్హెడ్ ట్యాంకులను నింపారు. ఉదయం నుంచి భగీరథకాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆరంభం కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. వీలైనంత త్వరగా విడతల వారీగా మిగతా ప్రాంతాలకు నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో పైపులైన్లకు లీకేజీ మరమ్మతుల పేరిటమున్సిపల్ అధికారుల కాలయాపన పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు అందని వైనం మూడు రోజుల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా ఎట్టకేలకు ఓవర్హెడ్ ట్యాంకులకు పంపింగ్ కావడంతో కొంత ఊరట -
దీపావళికై నా వేతనాలు ఇవ్వండి
జడ్చర్ల టౌన్: ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండగకు ఎలాగూ వేతనాలు ఇవ్వలేదు.. కనీసం దీపావళికై నా ఇవ్వండంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. దసరా పండగకు ముందే నాలుగు నెలల వేతన బడ్జెట్ విడుదలైనప్పటికి శ్రీశాంతి ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ వేతనాలు అందడంలేదని ఆరోపించారు. గత శుక్రవారం చేసిన మెరుపు సమ్మెకు ఆస్పత్రి సూపరింటెండెంట్ దిగివచ్చి ఐదురోజుల్లో వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడురోజుల్లో దీపావళి పండగ వస్తుందని, అందరి జీవితాల్లో వెలుగులున్నా.. ఆస్పత్రి కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. వెంటనే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని వేతనాలు ఇచ్చేలా చూడాలన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి యూనియన్ అధ్యక్షుడు నర్సింహులు, కార్మికులు నవీన్, శేఖర్, రవీందర్, రామకృష్ణ, విజయలక్ష్మి, మనెమ్మ, శివలీల, పద్మ, సుక్కమ్మ, అలివేల, భార్గవి, నీరజ, అంజలి, నర్సమ్మ, స్వామి, భాగ్యమ్మ పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులు అవలంబించాలి
మహబూబ్నగర్ రూరల్: పంటల సాగుకోసం రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించాలని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శశిభూషణ్ అన్నారు. బుధవారం మండలంలోని మాచన్పల్లి రైతువేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి మహాత్మా జ్యోతిభా ఫూలే ఉమెన్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగుకు ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని వ్యవసాయరంగ నిపుణుల సూచనలు, సలహాల మేరకు పంటలను సాగుచేయాలని తెలిపారు. పంటల సాగులో తగిన మెలకువలు పాటించాలని, తక్కువ రసాయనిక ఎరువులు వాడాలన్నారు. పురాతన పనిముట్లను వీడి ఆధునిక పరికరాలతో పంటలు సాగు చేస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన పెంపొదించడానికి ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకొని లాభాలు పొందాలని సూచించారు. అనంతరం ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి రైతులకు వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయమే రైతులకు శ్రీరామ రక్ష అని, దానినుంచి ఉత్పత్తయ్యే అన్నిరకాల ధాన్యాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయని అభిప్రాయ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తలు అర్చన, కల్యాణి, ఏఓ శృతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లికార్జున్రెడ్డి, మల్లు వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి క్వింటా రూ.1,900
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర క్వింటాకు గరిష్ఠగా రూ.1900 వరకు పలికింది. కనిష్ఠంగా 1200 వరకు ధరలు నమోదయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఉల్లి ధరులు అటుఇటుగా నిలకడగానే ఉన్నాయి. సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరల్లో మార్పురాలేదు. మార్కెట్కు కొత్త ఉల్లి వచ్చినప్పటికీ పాత ఉల్లికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. నాణ్యంగా ఉన్న ఉల్లికి గరిష్ఠ ధరలు పలుకగా, రెండో రకం ఉల్లికి కనిష్ఠ ధరలు వచ్చాయి. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.950, కనిష్ఠంగా రూ. 600వరకు పలికింది. కొత్త ఉల్లి నాణ్యతగా లేకపోవడంతో కొనేవారు లేక తిరిగి వాపసు తీసుకుపోయారు. హంస రకం రూ.1,809 దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లల్లో హంస ధాన్యం ధర క్వింటాకు గరిష్ఠంగా రూ.1809గా ఒకే ధర లభించింది. మార్కెట్కు రెండు వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. వ్యక్తి ఆత్మహత్య ఆత్మకూర్: కుటుంబ కలహాలతో ఓవ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూరాలకు చెందిన కుర్వగట్టు ఆంజనేయులు(38) భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాద్కు వెళింది. ఇది జీర్నించుకోలేని ఆంజనేయులు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
హత్య చేసి..
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం నాగర్కర్నూల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని కట్టుకున్న భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నాగర్కర్నూల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) గుడిపల్లి శివారులో ఈ నెల 12న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుడు మైనగాని రాములు ఇంట్లో 6 నెలల క్రితం బంగారం చోరీకి గురికాగా.. పెద్దముద్దునూరుకు చెందిన సురేశ్గౌడ్ తన మంత్ర శక్తితో కనిపెడతారని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య మానసకు సరేశ్గౌడ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మానస, సురేశ్గౌడ్ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మానస తన భర్తను ఎలాగైనా హత్య చేయించాలని పథకం రచించింది. ఈ నెల 8న తన కుటుంబ సభ్యులతో కలిసి గుడిపల్లికి వెళ్తున్నామని.. నాలుగు రోజులు అక్కడే ఉంటామని సురేశ్గౌడ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అక్కడే తన భర్తను హతమార్చాలని చెప్పింది. ఈ మేరకు రాములును హత్య చేసేందుకు సురేశ్గౌడ్ తన వద్ద పనిచేస్తున్న వెన్నచర్ల గ్రామవాసి బాలపీరు, లక్ష్మీతండాకు చెందిన హన్మంతుతో రూ. 2.80 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత మానసకు ఫోన్చేసి రాములును హతమార్చేందుకు ఓ పార్టీ ఉందని.. అతడితో కలిసి పెద్దముద్దునూరుకు రావాలని చెప్పాడు. ఇవేవీ తెలియని రాములు తన భార్యతో కలిసి పెద్దముద్దునూరుకు వెళ్లగా.. అక్కడ మద్యం తాగించారు. అనంతరం నిందితుడు సురేశ్గౌడ్ తన కారులో గుడిపల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ వద్దకు తీసుకొచ్చి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం రాములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మిచేందుకు మృతదేహంతో పాటు మోటారు సైకిల్ను రోడ్డుపై వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. హత్యకు పాల్పడిన సురేశ్గౌడ్, మానసతో పాటు బాలపీరు, హన్మంతును అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం మృతుడి తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద కేసు నమోదు భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరి రిమాండ్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ -
ప్రతి ఒక్కరూ హస్తకళల్లో నైపుణ్యం సాధించాలి
● టీజీ హస్తకళ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల బల్మూర్: ప్రకృత్తిలో లభించే మట్టి, చెట్లు, రాళ్లతో అనేక రకాల వస్తువులు తయారు చేసే హస్త కళాకారుల నైపుణ్యతను ప్రోత్సహించాలని తెలంగాణ హస్తకళల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సూ చించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్రం తెలంగాణ హస్తకళల డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మూడురోజుల అవగాహన, వర్క్షాప్ కా ర్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు హస్తకళలతో నేర్చుకోవాలని సూ చించారు. హస్తకళలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ చాటుతున్న యువతి, యువకులను గుర్తించి వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించి గుర్తింపుకార్డులతోపాటు ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ హస్తకళలపై అభిరుచి పెంచుకోవాలని కోరారు. దేశంలో హస్తకళలకు ఉన్న గుర్తింపుతో భవిష్యత్లో ఈ రంగంలో రాణిస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. మూడురోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో క్రోచ్ వర్కు, హాండ్ ఎంబ్రాయిండరీ, వెదురు పనిముట్లపై వర్క్షాప్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు నిమ్మలపద్మ, వెంకటమ్మ, మౌనిక, శ్రీబిఫిన్పాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
బిజినేపల్లి: మండలంలోని ఖీమ్యాతండా జీపీ పెద్ద వే ములతండాకు చెందిన కే తావత్ శివ (21) పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దవేములతండాకు చెందిన శివ సోమవారం తండాలో పురుగుల మందు తాగాడు. విష యం గుర్తించిన కుటుంబ సభ్యులు శివను ఆస్పత్రికి తరలించారు.హైదారాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నీటిగుంతలో పడి వ్యక్తి మృతి చిన్నచింతకుంట: మతిస్థిమితంలేని ఓవ్యక్తి నీటిగుంతలో పడి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండ లం గూడూర్ ఊకచెట్టువాగు సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిర్మలాపురం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య(55) కొన్నిరోజులుగా మతిస్థిమితంలేకుండా తిరుగుతున్నాడు. కృష్ణయ్యకు భార్యాపిల్లలు లేకపోవడంతో అక్క చెన్నమ్మతో ఉండేవాడు. రెండు రోజులుగా కనిపించకుండాపోయాడు. బుధవారం తెల్లవారుజామున గూడూర్ ఊకచెట్టు వాగు సమీపంలోని నీటిగుంతలో శవమై తేలాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.ఈ విషయంపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపారు. యువకుడి బలవన్మరణం నాగర్కర్నూల్ క్రైం: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నల్లవెల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నవీన్(21) వ్యవసాయం చేసుకుని జీవ నం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం తండ్రి వెంకటయ్య వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి రాగా.. కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో వివాహిత మృతి గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన దుర్గమ్మ(32) భర్త ఎల్లప్ప జీవనోపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం గద్వాలకు వచ్చారు. బీసీ కాలనీలోని ప్రైవేట్ స్థలంలో గుడిసె ఏర్పాటు చేసుకుని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం నివాసం ఉంటున్న గుడిసెలో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన భర్త జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై భర్త ఎల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్య కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం సమీపంలో శ్రీవారి సముద్రం చెరువు కట్టపై పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన చోటోచేసుకుందని ఎస్ఐ హృషికేశ్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్కు చెందిన మొట్టె లక్ష్మి(40) పురుగు మందుతాగి చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు అందులేదన్నారు. కుటుంబ కలహాలే మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త చంద్రయ్య, ఉన్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు కేటీదొడ్డి: గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన ఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి గువ్వలదిన్నె రోడ్డు పక్కనున్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుప్తనిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. దుండగులు చేతకాక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు గమనించారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు, విగ్రహాలు ధ్వంసం కాలేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా.. అక్కడి పరిస్థితిని గమనించి నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చుట్టపక్కల గ్రామస్తులకు తెలియజేశారు. -
మహబూబ్నగర్ విజయం
● 120 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్పై గెలుపు మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ బి–డివిజన్ టూడేలీగ్ మ్యాచ్లో జిల్లా జట్టు 120 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్పై విజయం సాధించింది. మహబూబ్నగర్ జట్టు మొదటి రోజు 76.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుధవారం రెండో రోజు బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 39.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు ఎండి.ముఖితుద్దీన్ 28 పరుగులకు 3 వికెట్లు, జస్వంత్ 38 పరుగులకు వికెట్లు, మనోజ్ 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. జిల్లా జట్టు మ్యాచ్లో విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా అభినందించారు. రానున్న మ్యాచుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మధ్యాహ్న భోజనంలో పురుగులు
● వాంతులు చేసుకున్న విద్యార్థులు ● మూడు రోజుల నుంచి ఇదే తీరు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు మక్తల్: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో బుధవారం విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటికి వెళ్లారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజ నం సక్రమంగా వండటం లేదని మూడు రోజు ల నుంచి ఉపాధ్యాయులు, హెచ్ఎంకు చెప్పి నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. గతంలో కలెక్టర్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వంట ఏజెన్సీ మహిళలను ఆదేశించారు. కలెక్టర్ చెప్పినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. విషయం బయటకు రావడంతో ఏబీవీపీ నాయకులు వినయ్తో పాటు మరికొందరు అక్కడికి చేరుకొని పురుగుల అన్నాన్ని పరిశీలించారు. సమస్యను ఎంఈఓ అనిల్గౌడ్కు వివరించగా.. ఆయన అక్కడికి చేరుకున్నారు. వంటలు సక్రమంగా చేయడం లేదని, నీళ్ల సాంబర్ వడ్డిస్తున్నారని విద్యార్థులు ఎంఈఓ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎంఈఓ వంట ఏజెన్సీ వారిని వెంటనే తొలగించి, కొత్తవారికి అప్పగించాలని హెచ్ఎంను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం అందించాలని, లేకుంటే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నప్పటికీ ఉపాధ్యాయులు విషయాన్ని బయటకు రానివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం లేదని, తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భోజనం వండిన తర్వాత మొదటగా హెచ్ఎం పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయని, బియ్యంలో పురుగులను సక్రమంగా తీయడం లేదని తెలిపారు. గోదాం నుంచి పాత బియ్యం తెచ్చారా.. లేక పాఠశాలలో మక్కిన బియ్యంతో అన్నం వండారా అని విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ తెలిపారు. చిన్నచింతకుంట: మండలంలోని లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులక వడ్డించే మధ్యాహ్నం భోజనంలో కప్ప కనిపించిందని వదంతులు వచ్చాయి. నిత్యం పాఠశాలకు అక్షయ పాత్ర ద్వారా 270మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందుతుంది. బుధవారం పాఠశాలలో సిబ్బంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా.. ఓ విద్యార్థి అన్నం పెట్టుకొని పప్పు వేసుకోగానే కప్ప కనిపించిందని.. విద్యార్థులు, ఉపాధ్యాయులు భోజనాన్ని పార బోసినట్లు సమాచారం. అనంతరం విద్యార్థులు తమ ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎం, ఎంఈఓ మురళికృష్ణను వివరణ కోరగా.. కప్ప ఉందన్న పుకార్లు మాత్రం ఉన్నాయన్నారు. కప్ప కనిపించిన ఆధారాలు ఎక్క డాలేవని తెలిపారు. ప్రస్తుతం చిన్నచింతకుంటలో సమావేశంలో ఉన్నందున పాఠశాలకు అందుబాటులో లేనన్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని విచారణ చేపట్టనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు. కప్ప ఉందని వదంతులు -
నేడు నల్లమలలో ట్రాఫిక్ ఆంక్షలు
నాగర్కర్నూల్ క్రైం: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న గురువారం శ్రీశైలం పర్యటన నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ట్రాఫి క్ ఆంక్షలు ఉండనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రధాని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నందున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ నుంచి వీఐపీలు శ్రీశైల క్షేత్రం వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సందర్శించాలని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు పోలీసుశాఖకు సహకరించాలని తెలిపారు. శ్రీశైలం రాకపోకలు నిలిపివేత మన్ననూర్: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్న సందర్భంగా 16వ తదీ(గురువారం) శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి మన్ననూర్ నుంచి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శాంతిభధ్రతల దృష్ట్యా ఈ రకమైన ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉంటాయన్నారు. ఎన్ఎస్జీ పర్యవేక్షణలో ఏపీ పోలీసులు దోమలపెంట: శ్రీశైలంలో గురువారం ప్రధానమంత్రి పర్యటన పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధికారుల పర్యవేక్షణలో బుధవారం ఈగలపెంటలో ఏపీ పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్ఎస్జీ ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలంకు వస్తున్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఈగలపెంటలో ఉన్న జెన్కో గ్రౌండ్లోకి మళ్లించి అక్కడే వాహనాలను నిలిపి వేయిస్తున్నారు. శ్రీశైలంలో ఉన్న ఎన్ఎస్జీ అధికారులు తెలిపినప్పుడు మాత్ర మే ఈ వాహనాలను అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సమాచారం తెలియకుండా విచ్చేస్తున్న పర్యాటకులు, భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాగా ఈగలపెంట, దోమలపెంట ప్రాంతాల్లో హోటల్స్ తెరిచి ఉండడంతో భోజనాలు, టిఫిన్లు తాగునీటికి ఇబ్బందులు లేవు. ఈగలపెంట దాటితే ఒక్క హోటల్ కాని ఇతరత్రా షాపులన్నీ మూసిఉంచారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రదాని మోదీ శ్రీశైలం పర్యటనలో బందోబస్తు ఈగలపెంట జెన్కో గ్రౌండ్లోకి వాహనాల మళ్లింపు -
ఢీఎంఎఫ్టీ..!
మహబూబ్నగర్జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీరుపై రగడ గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)కు సంబంధించి చెలరేగిన వివాదం ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. పలు అభివృద్ధి పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి లేఖ ఆలస్యంగా వెలుగుచూడగా.. చర్చనీయాంశమైంది. నియోజకవర్గ శాసనసభ్యుడిగా, డీఎంఎఫ్టీ సభ్యుడిగా ఉన్న తనకు సమావేశంపై సమాచారం ఇవ్వలేదు.. మీటింగ్ మినిట్స్ కూడా అందజేయలేదని అందులో పేర్కొనగా.. రగడ రాజుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్లో చైర్మన్/చైర్పర్సన్గా జిల్లా ఇన్చార్జి మంత్రి, సెక్రటరీగా జిల్లా కలెక్టర్, కన్వీనర్గా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ), కోశాధికారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల్లోని లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు/జెడ్పీ చైర్పర్సన్లు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి సమావేశం నిర్వహించి.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాలతో అధికారులు పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపు చేపట్టాలి. కానీ.. గద్వాల జిల్లాలో ఇలా జరగలేదని కలెక్టర్ బీఎం సంతోష్కు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది. పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపుపై వివాదం తనకు తెలియకుండానే చేయడంపై అలంపూర్శాసనసభ్యుడి అసంతృప్తి జోగుళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన లేఖ నియోజకవర్గ నేత ‘హస్తమే’ కారణమంటూ ఊహాగానాలు కమీషన్లే కారణమని విమర్శలు.. -
స్నాతకోత్సవానికి వేళాయె
ఒకప్పుడు ఓయూ అనుబంధ పీజీ సెంటర్తో ప్రారంభమై.. అనంతరం యూనివర్సిటీగా ఏర్పడి.. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశోధనలకు ఊతమిస్తూ.. వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేసింది పాలమూరు యూనివర్సిటీ. మొదట సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలతో ప్రారంభమైనా క్రమంగా ఉపాధి, ఉద్యోగ కోర్సులైన ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటుతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాజాగా పీయూ పరిధిలో 160 కళాశాలలు ఉండగా.. 42,554 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమంలో గురువారం జరిగే నాలుగో స్నాతకోత్సవానికి పీయూ ముస్తాబైంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) నాలుగో స్నాతకోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం జరిగే కార్యక్రమానికి పీయూలోని లైబ్రరీ ఆడిటోరియం వేదిక కానుంది. ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. మొదటగా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్తో సమావేశం.. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, వివిధ డిపార్ట్మెంట్ల డీన్స్, గోల్డ్మెడల్స్ తీసుకునే విద్యార్థులు, పీహెచ్డీ పట్టాలు అందుకునే స్కాలర్స్, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. పీయూ చరిత్రలో మొదటిసారిగా సామాజిక విభాగంలో విశిష్ట సేవలందిస్తున్న ఎంఎస్ఎన్ అధినేత, పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. పీయూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు ఎంతో కృషి చేస్తుంది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్తో ప్రారంభభమై.. 2008లో పూర్తిస్థాయి యూనివర్సిటీగా ఏర్పడింది. ప్రారంభంలో అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలన్ని కూడా పీయూలో ప్రస్తుతం ఉన్న పీజీ కళాశాలలో జరిగేవి. 2010–11లో అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించిన తర్వాత అక్కడికి బదిలీ చేశారు. 2018–19 ఎగ్జిమినేషన్ బ్రాంచ్ను రూ.10 కోట్లతో నిర్మించడంతో అక్కడికి ప్రత్యేకంగా బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. పీయూ రక్షణ కోసం 3.1 ఎకరాల పొడువు గోడను 2020లో అధికారులు నిర్మించారు. సువిశాల పీయూ క్యాంపస్, కార్యాలయాలు, హాస్టళ్లు, కళాశాలల పర్యవేక్షణ కోసం 152 సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉన్నత విద్య చేరువ.. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు పీజీ స్థాయి విద్యను అందిస్తుంది. ఇందులో ప్రస్తుతం ప్రొఫెషనల్, ట్రెడీషనల్ కోర్సులు కలిపి 19 కోర్సులకు తోడుగా ఇంజినీరింగ్, లా కళాశాలలు కూడా ప్రారంభం కావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రస్తుతం పీయూలో మొత్తం రెండు బాలుర హాస్టల్స్, రెండు బాలికల హాస్టల్స్ ఉండగా ఇందులో 1320 మంది విద్యార్థులు ఉంటున్నారు. నేడు పీయూకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక నాలుగోసారి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎంఎస్ఎన్రెడ్డికి గౌరవ డాక్టరేట్.. 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు.. 12 మందికి పీహెచ్డీ పట్టాల ప్రదానం ఏర్పాట్లు పూర్తి చేశాం.. స్నాతకోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియం వేదికగా జరిగే కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమంలో ఎంఎస్ఎన్రెడ్డి గౌరవ డాక్టరేట్, 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12 మందికి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ -
అంచెలంచెలుగా ఎదుగుతూ.. విశిష్ట సేవలందిస్తూ..
నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఓయూ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. రసాయన శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించి.. 2003లో ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. అనతికాలంలోనే ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు నెలకొల్పారు. చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తూ 27 ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రాలు, 400కు పైగా డోసేజ్ ఫార్ములేషన్లు, వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లతో సంస్థ వృద్ధికి కృషిచేశారు. వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు హృద్రోగ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల శస్త్ర చికిత్సలకు ఆయన సహకారం అందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ నుంచి ఆయన గతంలోనే ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రతన్ పురస్కారం అందుకున్నారు. తాజాగా పీయూ నుంచి గౌరవ డాక్టరేట్ను ప్రకటించడం గర్వంగా ఉందని, నా వంతుగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు సాగుతానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
భోజనం కలుషితమైతే ఎవరు బాధ్యులు
భూత్పూర్: విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో క్రిమి, కీటకాలు పడి కలుషితమైతే ఎవరు బాధ్యులని కలెక్టర్ విజయేందిరబోయి అసహనం వ్యక్తం చేశారు. భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బుధవారం మధ్యాహ్న భోజనం చెట్ల కింద తింటుండగా గమనించిన కలెక్టర్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని, చెట్ల కింద భోజనం ఎలా పెడుతారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనాన్ని బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయులు ఎవరని హెచ్ఎంను ప్రశ్నించారు. హెచ్ఎం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఇలాంటి పరిస్థితి మరోసారి రానివ్వరాదని హెచ్చరించారు. హాస్టళ్లలో మెనూ పాటించకుంటే చర్యలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ కచ్చితంగా పాటించాలని, పాటించని హాస్టళ్లపై చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారం ప్రభుత్వం జారీచేసిన మెనూ ప్రకారం అదించాలన్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు హాస్టల్ వార్డెను అందుబాటులో ఉండాలని, బాలికల హాస్టల్లో వాచ్మెన్కు వదిలేసి వెళ్తున్నారని విమర్శించారు. స్టోర్రూమ్లో కూరగాయలు పప్పులు, పాలు ఇతర సామగ్రి అందుబాటులో ఉండడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, జిల్లా మైనార్టీ అధికారి శంకరాచారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్సీ సంక్షేమాధికారి సునీత ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి భూత్పూర్ జెడ్పీహెచ్ఎస్లో చెట్లకింద విద్యార్థుల భోజనం ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం -
రాజ్యాధికారం కోసం బీసీలు ఏకమవ్వాలి
● టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మెట్టుగడ్డ: రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ ఏనుగొండలో జరిగిన బీసీ జేఏసీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు చూస్తున్నారే గానీ.. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యంపై మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఇంటలెక్షన్ ఫోరంలో వక్తల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విద్య, వైద్యం, వలసలు, ఉపాధి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు బీసీల అస్థిత్వం అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జానయ్య, సూర్యారావు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్సాగర్, బెక్కెం జనార్దన్, సారంగి లక్ష్మికాంత్, కోరమోని వెంకటయ్య, విజయ్కుమార్, వెంకటయ్య, నిర్మల, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో పీయూ
● 344మంది పోలీసులతోప్రత్యేక బందోబస్తు ● ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పాలమూరు యూనివర్సిటీలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. పీయూలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలపై ట్రయల్ను పరిశీలించారు. పీయూతో పాటు కలెక్టరేట్లో సైతం భద్రత ఏర్పాట్లు చేశారు. పీయూ పరిసర ప్రాంతాల ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బలగాలు బుధవారం నుంచి పీయూలో విధుల్లో ఉన్నారు. గవర్నర్ పర్యటన పూర్తి అయ్యే వరకు ప్రత్యేక ఆంక్షలు కొనసాగనున్నాయి. 344 మంది పోలీసుల బలగాలతో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 90 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు గవర్నర్ బందోబస్తులో ఉండనున్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు కేటాయింపులలో పోలీస్ అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నర్ పర్యటన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యత నిబద్ధతతో పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆమె వెంట ఏఎస్పీలు ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, భగవంత్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నీటి నిల్వకు అడుగులు
కృష్ణానదిపై ఉన్న పాత వంతెనకు షెట్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● రెండు టీఎంసీలు నిలిచే అవకాశం ● ఇప్పటికే కర్ణాటకతో కొనసాగుతున్న చర్చలు ● కృష్ణా, మాగనూర్ రైతులకు పూర్తిస్థాయిలో అందనున్న సాగునీరు కల సాకారం కానుంది.. ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలకు ప్రాజెక్టుగాని, డ్యాంగాని ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నాం. భీమా ప్రాజెక్టుపై చేపడుతామని ప్రజాప్రతినిధులు చెబుతూనే వస్తున్నారు కానీ చేపట్టడం లేదు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వంతెనకు షెట్టర్లు బిగించి సాగునీటిని అందిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. – సంతోష్, రైతు, గుడెబల్లూర్ వంతెన పనులకు వెళ్లాం.. కృష్ణానదిపై వంతెన నిర్మాణ సమయంలో నా వయస్సు 11 ఏళ్లు. అప్పుడు మా కు టుంబ సభ్యులు, గ్రామస్తులకు పనులకు వెళ్లేవారు. వా రి వెంట నేను కూడా వెళ్లా. నాడు నిర్మించిన వంతెన నేడు మాకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు నా వయస్సు 91 ఏళ్లు. – హన్మంతు, గుడెబల్లూర్ రైతుల సంక్షేమమే ధ్యేయం.. కృష్ణానదిపై ఇప్పుడున్న పా త వంతెనకు షెట్టర్లు బిగించి రెండు టీఎంసీల నీటి నిల్వ కు నిర్ణయం తీసుకున్నాం. అ లాగే భీమానదిపై ఎక్కడికక్క డ చెక్డ్యాంలు నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించబోతున్నాం.ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ●కృష్ణా: మండలంలోని కృష్ణానదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనకు షెట్టర్లు ఏర్పాటు చేసి రెండు టీఎంసీల నీటినిల్వకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త వంతెన వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పాత వంతెన నిరుపయోగంగా మారకుండా షెట్టర్లు ఏర్పాటు చేసి నదికి సమాంతరంగా నీటిని నిలిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నీటినిల్వతో పరిసర గ్రామాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకరించనుందని.. ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మాగనూర్, కృష్ణా మండలాల్లోని పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కృష్ణా మండలంలో 31 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 18 వేల ఎకరాల్లో రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. మాగనూర్ మండలంలో 30 వేల ఎకరాలు ఉండగా.. 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ పెద్దవాగు తీరంతో పాటు సంగంబండ ప్రాజెక్టు నుంచి అత్యధికంగా సాగునీరు అందుతోంది. మిగిలిన 12 వేల ఎకరాల్లో వర్షధార పంటలు సాగు చేస్తున్నారు. ● నిజాం కాలం నాటి వంతెన.. 1933లో హైదరాబాద్ నిజాం కాలంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి పునాది వేయగా 1945లో పూర్తయింది. సుమారు 12 ఏళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి. ● కృష్ణా జలాల్లో రాష్ట్రవాటా పూర్తిగా వినియోగించుకుంటున్నా.. భీమానది నీటి విషయంలో 5 టీఎంసీలు వృథా అవుతున్నాయి. షెట్టర్లు ఏర్పాటుతో వీటిని కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో వరి, పత్తి అత్యధిక దిగుబడి సాధించిన మండలంగా కృష్ణా గుర్తింపు పొందింది. ఇకమీదట సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మండలంలోని చేగుంట, ఐనాపూర్, కున్సీ, ఆలంపల్లి, హిందూపూర్లో నల్లరేగడి భూములున్నాయి. ఇక్కడి రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు. -
అనన్యశ్రీని అభినందించిన సీఎం
మహబూబ్నగర్ క్రీడలు: అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న మక్తల్కు చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి పి.అనన్యశ్రీని మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీ ఎం రేవంత్రెడ్డి అభినందించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అనన్యశ్రీ, ఆ మె తల్లిదండ్రులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనన్యశ్రీ సీనియర్ నేషనల్లో సాధించిన బంగారు పతకం, ఎఫ్ఐఎస్యూ వరల్డ్ యూని వర్సిటీ, ఇతర స్థాయిల్లో సాధించిన మెడల్స్ను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా అనన్యశ్రీని సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐల య్య, కుంభం అనిల్కుమార్తోపాటు పి.ఆనంద్, వరలక్ష్మి, ఆదిత్య శౌర్య తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల డేగ కన్నుల్లో నల్లమల
● ప్రధాని పర్యటన నేపథ్యంలో విస్తృత తనిఖీలు ● శ్రీశైలం పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ పోలీసులు ● గురువారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు దోమలపెంట: శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు మంగళవారం నుంచే సరిహద్దు ప్రాంతాలు లింగాలగట్టు, సున్నిపెంట, శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు ఇతరత్రా అన్నింటిని మూయించారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలన్నింటినీ దోమలపెంట, ఈగలపెంటలోని జెన్కో గ్రౌండ్లో నిలిపివేయనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షల ఉత్తర్వులు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందినట్లు ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపారు. ఇదిలా ఉండగా నల్లమల ప్రాంతం అంతా పోలీసుల డేగ కన్నుల్లో ఉంది. మరో పక్కన శ్రీశైలం పరిసర ప్రాంతాలన్నింటిని స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ వేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్జీ దళాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. శ్రీశైలం పరిసర ప్రాంతాలు హైఅలర్ట్లో ఉన్నాయి. గురువారం ఆర్టీసీ బస్సులను సైతం ఈగలపెంటలో ఆపివేయనున్నారు. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనంతరం ఆర్టీసీ సర్వీసులు, ఇతర వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు
స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కుమారలింగంపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 వరకు ఉపన్యాసాలు, భజనలు, కుంకుమ పూజా కార్యక్రమాలు ఉంటాయని, ఈనెల 21 నుంచి 25 వరకు జిల్లాలోని దేవరకద్ర మండలం అజిలాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజ, ఈనెల 31, 31 తేదీల్లో గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వారి సేవకులు కేశవు లు, పాండురంగం, సురేష్చందర్దూత్, హనుమంతురెడ్డి, పల్లాటి తారకం, రాములు, ఏనుగొండ నర్సింలు, బాల్రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం పోటీలు మహబూబ్నగర్ క్రైం: ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ సేవలు– త్యాగాలు ప్రజా రక్షణపై ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని, ప్రతిఒక్కరూ మూడు ఫొటోలు పంపాలన్నారు. షార్ట్ఫిలీం పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత– సమాజ రక్షణ అనే అంశంపై ఈ నెల 23 వరకు పంపించాలన్నారు. మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మీ పూర్తి వివరాలతో ఫొటోలు, షార్ట్ఫిలిం వీడియోలు పంపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న మూడు ఉత్తమ ఫొటోలు, షార్ట్ఫిలింలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, జిల్లాలోని విద్యార్థులు, యువత ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. -
జూదానికి బానిసై యువకుడి ఆత్మహత్య
వంగూరు: జూదానికి బానిసై సర్వం కోల్పోయి ది క్కుతోచని స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరా లు.. తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన నవీన్(27) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్లు, తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున శ్రీశైలం క్రాస్రోడ్డు వద్దకు ఆటోలో వెళ్లి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పది నెలల బాబు ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తెల్కపల్లి మండ లం గడ్డంపల్లికి చెందిన కాకనూరి శ్రీనివాసులు (55) తన బైక్పై బిజినేపల్లి మండలం ఖానాపూర్లో బంధువుల చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ఉయ్యలవాడ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్పై కత్తితో దాడి వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎండీ సలీంపై హైదరాబాద్కు చెందిన రిషిప్రణయ్, విజయ్ కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అచ్చంపేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో వెల్దండ నుంచి హైదరాబాద్కు స్కూటీపై వెళ్తున్న ప్రణయ్, విజయ్ పెద్దాపూర్ సమీపంలో బస్సుకు అడ్డు వచ్చారు. దీంతో డ్రైవర్ వారిని మందలించారు. పెద్దాపూర్ స్టేజీ వద్ద ప్రయాణికులను దించేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. స్కూటీపై ఉన్న ప్రణయ్ తన వద్ద ఉన్న కత్తితో ఆర్టీసీ డ్రైవర్ సలీంపై దాడి చేసి చేతిని గాయపరిచారు. అప్రమత్తమైన ప్రయాణికులు పారిపోతున్న రిషిప్రణయ్, విజయ్ను పట్టుకున్నా రు. అనంతరం నిందితులను వెల్దండ పోలీస్స్టేషన్లో అప్పగించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి పేర్కొన్నారు. ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఆర్చరీ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల ఉమ్మడి జిల్లా ఆర్చరీ ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఎంపికలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది బాలురు, 5 మంది బాలికలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్గౌడ్, పీడీలు వేణుగోపాల్, రాంకల్యాణ్జీ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ రాఫే సెంచరీ; పాలమూరు 238 ఆలౌట్ మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ బీ–డివిజన్ టూ డే లీగ్లో జిల్లా జట్టు ఓపెనర్ అబ్దుల్ రాఫే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెంచరీ చేశాడు. హైదరాబాద్లోని ఎస్ఆర్–1 క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం మహబూబ్నగర్–బాలాజీ కోల్ట్స్ జట్ల మధ్య టూడే లీగ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 76.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా 235 బంతుల్లో 23 ఫోర్లతో 144 పరుగులు చేశాడు. బాలాజీ కోల్ట్స్ బౌలర్లు వివేక్ నందు 4, వి.ఆరుష్ చంద్ర 3 వికెట్లు తీశారు. బుధవారం బాలాజీ కోల్ట్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. -
చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎర్రవల్లి: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని జింకలపల్లి స్టేజీ వద్ద శాంతినగర్ జోన్ చెరుకు సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కొత్తకోట మండలంలోని అమడబాకుల రైతువేదికలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కృష్ణవేణి చెరుకు రైతు సంఘం జనరల్ బాడీ సమావేశం ఉంటుందన్నారు. అందులో చెరుకు రైతుల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం అందరితో చర్చించి పలు నిర్ణయాలతో కూడిన వినతిపత్రాన్ని కృష్ణవేణి చెరుకు పరిశ్రమ యాజమాన్యానికి సంఘం తరఫున అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చెరుకు సంఘం నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, చంద్రసేనారెడ్డి, వెంకటేష్గౌడ్, షాలిమియ్య, వీరన్న, వెంకటేష్, రామకృష్ణ, అశోక్రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్రెడ్డి, రామాంజనేయులు, మదుసూదన్రెడ్డి, లక్ష్మన్న తదితరులు ఉన్నారు. -
ఇసుక డంప్ సీజ్
రాజోళి: మండలంలోని మాన్దొడ్డి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవె న్యూ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో తని ఖీలు చేపట్టగా గ్రామం నుంచి నౌరోజీ క్యాంపునకు వెళ్లే మార్గంలోని పెద్దవాగు వద్ద 60 ట్రాక్టర్ల ఇసుక డంప్ను గుర్తించి సీజ్ చేశామన్నారు. తుంగభద్ర నది నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా అనుమతులు లేకుండా తరలించి డంప్ చేశార్నారు. ఆర్ఐ చంద్రకాంత్ ఆధ్వ ర్యంలో తనిఖీ చేసి ఇసుక సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. డంప్ ఎవరు చేశారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
బాలిక మృతదేహంతో ధర్నా
మల్దకల్: మహబూబ్నగర్ జిల్లా రాంరెడ్డిగూడెం గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ప్రి యాంక సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రంలోని అయిజ–గద్వాల ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతికి కార కులైన వారిని కఠినంగా శిక్షించే వరకు విరమించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆందోళన తో వాహనాలు అక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని భరోసానివ్వడంతో ఆందోళన విరమించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు, పోలీసులు ఉన్నారు. -
డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలి
పాలమూరు: మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ హాజరై జిల్లాలో మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. డ్రగ్ల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు చేసే సమాచారం ఉంటే కంట్రోల్ రూం నంబర్ 87126 59360 లేదా డయల్ 100కు చెప్పాలన్నారు. మోసపూరిత లింక్లు ఎవరూ ఓపెన్ చేయరాదని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కృష్ణాజీ పాల్గొన్నారు. -
తేలని ఇసుక పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకులు తొలగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మిళల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను సేకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోగా.. దుమారం చెలరేగింది. ఇసుక రవాణా కొనసాగాలంటే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున కప్పం చెల్లించాలని హుకుం జారీ చేయగా.. కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అధికార పార్టీకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఎవరి పట్టు వారిదే.. తుమ్మిళ్ల నుంచి ఇసుక బయటకు రావాలంటే ఒక్కో ట్రిప్పర్కు రూ. 6వేల చొప్పున ఎట్టిపరిస్థితుల్లోనైనా చెల్లించాల్సిందేనని అధికార నేత పట్టుబట్టినట్టు సమాచారం. దీనిపై మంగళవారం సైతం అధికార నేతకు చెందిన సన్నిహితులు.. కాంట్రాక్టర్తో చర్చ లు జరిపినట్లు సమాచారం. బేరసారాలు జరిగినా సఫలం కానట్లు తెలిసింది. సదరు నేతకు కప్పం చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఇసుక రవాణాకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల మౌనంపై విమర్శలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం తుంగభద్ర నుంచి ఇసుక తవ్వకాలను ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం.. సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తో ‘అధికార’సన్నిహితుల బేరసారాలు కప్పం కట్టేందుకు అంగీకరించని కాంట్రాక్టర్ మౌనం వీడని అధికారులు ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్లలబ్ధిదారుల్లో అసహనం -
ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం
● ఏసీబీకి చిక్కిన లైన్మన్ నాగేందర్ ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యుత్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ బిగించడంలో లైన్మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్ఫార్మర్ కోసం లైన్మన్ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్మన్ సకాలంలో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నా యి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తు న్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పో టీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ● -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో పోలీస్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పారదర్శకత, సమయపాలన తప్పక పా టించాలని ఎస్పీ జానకి అన్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రతి వి భాగంలో ఉండే సిబ్బంది ప్రత్యేక దృష్టితో విధులు చేపట్టాలని, ఎన్బీడబ్ల్యూ వారెంట్లు పెండింగ్లో ఉన్నవాటిని అమలు చేసి ప్రతి వారానికి నివేదిక సమర్పించాలన్నారు. సీసీటీఎన్ఎస్ అప్డేట్స్ సమయానికి నమోదు చేసి పెండింగ్ ఎఫ్ఐఆర్లు, చార్జీ షీట్లు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించి, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి అంశాలపై ప్ర త్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి సర్కిల్ స్థాయిలో రోడ్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఎక్కు వగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన నివా రణ చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానితులు, రౌడీషీటర్స్ నిఘా పెట్టడంతోపాటు తిరిగి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదృశ్య కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రజా పోలీసింగ్ బలపరచాలని ఆదేశించారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం మద్యాహ్నం 2.10 నుంచి 2.45 వరకు కలెక్టరేట్లో కలెక్టర్, టీబీ అధికారులతో, రెడ్క్రాస్ సభ్యులతో సమావేశం, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొంటారని చెప్పారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఏఎస్పీ రత్నం, డీఆర్డీఓ నర్సింహులు, డీఎంహెచ్ఓ పద్మజ, సీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి చర్యలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం ఇతర మౌలిక వసతుల అమలు తీరును పరిశీలించాలని సూచించారు. పాఠశాలకు ఎంపికై న ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతతో..
ఈ ఏడాది జిల్లాలో 80,534 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 8,05,340 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసింది. సీసీఐ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, దళారులు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా నూతన సాంకేతికతతో ఈ యాప్ ద్వారా పత్తి అమ్మకాలను పకడ్బందీగా కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పకడ్బందీగా ఏర్పాట్లు.. సీసీఐ పత్తి కొనుగోళ్ల కోసం పకడ్బందీగా ఏ ర్పాట్లు చేస్తున్నాం. కపా స్ కిసాన్ యాప్లో రైతు లు తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దళారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం నూత న యాప్ తీసుకువచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి అమ్ముకోవచ్చు. పత్తిని పూర్తిగా శుభ్రంగా ఎండబెట్టి నాణ్యతగా తీసుకువస్తేనే మద్దతు ధర లభిస్తుంది. – బాలమణి, మార్కెటింగ్ శాఖ ఏడీ ● -
స్నాతకోత్సవానికి హాజరు
మహూబబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో గురువారం నిర్వహించే నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని వీసీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు కంపెనీలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎన్ రెడ్డికి సామాజిక సేవా విభాగంలో పీయూ చరిత్రలో మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం మొత్తం 88 గోల్డ్ మెడల్స్, 12 డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నామన్నారు. అలాగే 2,809 పీజీలు, 8,291 ప్రొఫెషనల్ కోర్సులు, 18,666 యూజీ డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అక్షయపాత్ర, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బాదేపల్లి పాఠశాల హెచ్ఎంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మధ్యాహ్న భోజనంలో జెర్రి’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం పెట్టాలని, భోజనం తినే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అభిప్రాయాలు సేకరించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ను పరిశీలించి సూచనలు చేశారు. సీసీరోడ్డు పనులు పునఃప్రారంభం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాతపాలమూరులోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం నుంచి మైసమ్మ గుడి వరకు అసంపూర్తిగా ఉన్న పనులు ఎట్టకేలకు మంగళవారం పునః ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు నెలల క్రితం యూజీడీతో పాటు సీసీరోడ్డు పనులను హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్ చేపట్టారు. అయితే అప్పట్లో కేవలం రూ.పది లక్షలే మంజూరు కావడంతో మధ్యలో ఆపేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో గత నెల 29న ‘ఎందుకీ నిర్లిప్తత..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనులకు కావాల్సిన మరో రూ.15 లక్షలు మంజూరు చేశారు. దీంతో తాజాగా ఇక్కడ మిగిలిన పనులను పునఃప్రారంభించగా.. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, వెంకటేష్, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటలకు అందలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్ తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్ లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బా ల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలు గా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్ నిర్మాణంతో ప్రయోజనం ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ధన్ధాన్య’తో రైతులకు వరం
గద్వాల: ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా వెనకబడిన ప్రాంతాలైన 100 జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఎంపిక కాగా పాలమూరు ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈపథకం కింద మూడు జిల్లాలకు మొదటి విడత కింద రూ.960 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా సాగునీటి వనరు లు లేని ప్రాంతాల్లో సాగునీటి వనరులను కల్పించి వివిధ రకాల పంట ఉత్పత్తులు సాగుచేసేలా అభివృద్ధి చేస్తారన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు అవరమైన మార్కెటింగ్ సౌకర్యం, మద్దతు ధర కల్పించడం, ఎలాంటి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయి, సాగుపంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేలా పెద్ద ఎత్తున గోదాములను నిర్మిస్తామని, రైతుల ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి వ్యవసాయ అనుబంధరంగాలైన డైరీ, గొర్రెలపెంపకం, చేపల ఉత్పత్తి వంటివాటిని అభివృద్ధి చేస్తారని ఆమె వివరించారు. ఈప్రాంతప్రజల తరపున దేశప్రధాని మోడీ, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సిగ్చౌహాన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కోన్నారు. 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా దేశప్రధాని మోడీ ఒకవిజన్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన వల్ల ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడం లేదన్నారు. ఈరెండు ప్రభుత్వాలు పాలనపరంగా పూర్తిగా వైఫల్యం చెందినట్లు విమర్శలు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్రెడ్డి, రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవదాసు, రజకజయశ్రీ, విజయలక్ష్మీ, సమత తదితరులు పాల్గొన్నారు. అనంతరం గద్వాల జిల్లా మహిళా యువమోర్చా అధ్యక్షురాలిగా సమత, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా దేవదాస్లను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 250మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా.. ఎంపీ కండువాలు కప్పారు. అలాగే, డి లిమిటేషన్ ప్రక్రియలో అయిజను అసెంబ్లీ, గద్వాలను పార్లమెంట్ నియోయోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలకు చెందిన అఖిలపక్ష కమిటీ నేతలు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. గద్వాల, పేట, నాగర్కర్నూల్ జిల్లాలు పథకానికి ఎంపిక మొదటి విడతగా రూ.960 కోట్లతో అభివృద్ధి పనులు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కలవరం?
● కోతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో 20 మంది.. ముగ్గురికే అవకాశం మెట్టుగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్శాఖలో 300పైగా ఉద్యోగులుండగా.. కేవలం 110 మందిని మాత్రమే కొనసాగించేందుకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. మిగతా 190 మందికి ఉద్వాసన పలుకుతారా? అన్న చర్చ పొరుగు సేవల ఉద్యోగుల్లో మొదలైంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఒక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అన్ని కార్యాలయాల్లో 20 మంది ఉద్యోగులు పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి ఏటా పొడగింపునకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ శాఖలో పెరిగిన పని భారానికి అనుగుణంగా నియామకాలు లేకపోవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఆధారంగా మారారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న 20 మంది ఉద్యోగుల్లో కేవలం ముగ్గురిని మాత్రమే కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగతా 17 మంది ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. చాలీచాలని వేతనాలతో పనిచేసే తాము రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. -
కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం
మానవపాడు: జాతీయ రహదారి–44పై ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద కర్నూలు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చొని ఉన్న వ్యక్తి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణయ్యగౌడ్ (50) సోమవారం తెల్లవారు జామున 1 గంట సమయంలో ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద సొంత కారు పంక్చర్ అవ్వగా లిఫ్ట్ కోసం రోడ్డుపై నిల్చున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. చెక్పోస్టు సిబ్బంది చికిత్స నిమి త్తం కృష్ణయ్యగౌడ్ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్య భూత్పూర్: మండలంలోని మద్దిగట్ల గ్రామాని కి చెందిన రాజు(35) సోమవారం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తండ్రి బాలకిష్ట య్య తెలిపారు. పూర్తి వివరాలు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురానికి చెందిన రాజు ఆదివా రం కూలీ పని నిమిత్తం వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం పురుగు మందు తాగి అపస్మారిక స్థితిలో ఉండగా గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడి తండ్రి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెట్టు పైనుంచి జారిపడి యువకుడి మృతి జడ్చర్ల: సీతాఫలాలను తెంపేందుకు చెట్టుపైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన రామురాం కాష్యప్(22) బోర్వెల్ పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం పెద్దరేవల్లి సమీపంలో సీతాఫలాలు తెంపేందుకు చె ట్టు ఎక్కాడు. పండ్లు తెంపుతూ జారి దాదా పు 15 అడుగుల లోతు గుంతలో పడడంతో తీ వ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సోమవారం మృతుడి బావ దుర్గా రాం మార్కమ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చారకొండ: ఇంటి మిద్దె పైనుంచి జారి కిందపడిన ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సారంబండతండాకు చెందిన ఇస్తావత్ ధన్కోటి(44) పదిరోజుల కిందట తన ఇంటి మీద నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తలకు తీవ్రగాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ మృతదేహం లభ్యం పెంట్లవెల్లి: మండలంలోని మంచాలకట్ట సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద చాకలి రాము డు గట్టు వద్ద మహిళ శవం ఉందని బర్రెల కాపరి గమనించి స్థానికులకు తెలియజేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వవగా.. ఎస్ఐ రామన్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతదేహం మహిళదని.. మహిళ వయసు 30నుంచి 40 ఏళ్లమధ్యలో ఉండవచ్చని తెలియజేశారు. మహిళను పెట్రో ల్ పోసి కాల్చినట్లు తెలియజేశాడు. శవాన్ని పోస్ట్మార్టం చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని, దుండగులను కచ్చితంగా పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. మహిళ అదృశ్యం: కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: మహిళ అదృశ్యంపై సోమ వారం కేసు నమోదైనట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన స్వాతి భర్తతో గొడవ పడి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొట్రలో వృద్ధుడు.. వెల్దండ: కొట్రకు చెందిన వృద్ధుడు పోనుగంటి అర్జున్రావు(65) అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాలు.. అర్జున్రావు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి ఎంతకి రాకపోవడంతో అర్జున్రావు సోదరుడు కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
జూరాలకు భారీగా తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద రోజురోజుకు భారీగా తగ్గుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 55 వేల క్యూసెక్కులు ఉండగా.. సోమవా రం రాత్రి 8 గంటలకు 43 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. నెట్టెంపాడు ఎత్తిపోతలలో ఒక పంపును ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపుతున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి నిమి త్తం 45,177 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.029 టీఎంసీలు ఉందన్నారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో సో మవారం ఉత్పత్తి కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్, డీ ఈ పవన్కుమార్ తెలిపారు. సోమవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, దిగువ 6 యూని ట్ల నుంచి 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 821 .177 మి.యూ.ఉత్పత్తి సాధించామని చెప్పా రు. శ్రీశైలంలో 884.3 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో సోమవారం 884.3 అడుగుల వద్ద 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,177 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,958 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరిందన్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,236 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్కు వదులుతున్నట్లు చెప్పారు. భూగర్భ కేంద్రంలో 17.101 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.689 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వ కు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
పులుల సంరక్షణలో కలిసి పనిచేయడం కీలకం
దోమలపెంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని నల్లమల అడవులలో పులుల సంరక్షణలో సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడం కో సం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) మరి యు నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) అంతర్రాష్ట్ర సమావేశాన్ని సోమవారం దోమలపెంటలోని అటవీ శాఖ కార్యాలయం వనమయూరిలో నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు ముఖ్య అతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. రాబోయే అఖిల భారత పులుల అంచనా కోసం వ్యూహాత్మక సన్నాహాలు చేయడం, జాతీయ సంరక్షణ ప్రణాళికకు ఇది కీలకం అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సహకారానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించి తుది నిర్ణయాలను తీసుకున్నారు. అడవుల్లో వేట, అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టడానికి ఏటీఆర్, ఎన్ఎస్టీఆర్ రిజర్వ్ల వద్ద సంయుక్త గస్తీని చేయడం కొరకు సమన్వయం పాటించాలని నిర్ణయించారు. పులుల డేటా భాగస్వామ్యం కొరకు ఖచ్చితమైన పర్యవేక్షణ, సంరక్షణ నిర్ణయాల కోసం ఫొటోగ్రాఫిక్ ఆధారాలను, కదలికల నమూనాలతో సహా పులుల డేటాను నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడం కొరకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడంపై చర్చించారు. అలాగే, వన్యప్రాణుల కారిడార్ నిర్వహణ, అగ్ని నివారణ, మానవ మరియు వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడం వంటి వాటికి సంబంధించిన ప్రయత్నాలను సమకాలీకరంచడం కొరకు పాల్గొనే వారి నిర్దిష్ట సహకార ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో రెండు పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి ఫీల్డు డైరెక్టర్లు, డిఎఫ్ఓలు, ఎఫ్డిఓలు, ఎఫ్ఆర్ఓలు, కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
బాలికపై లైంగిక దాడి
చిన్నచింతకుంట: ఇన్స్ర్ట్రాగామ్ పరిచయం ప్రేమగా మారి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ, ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బాలికకు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బోజతండాకు చెందిన చందర్నాయక్తో ఇన్స్ట్రాగామ్లో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో చందర్నాయక్ సదరు బాలికను ప్రేమిస్తున్నానని వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చందర్నాయక్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్కు జిల్లా విద్యార్థిని కందనూలు: ఒడిశా రాష్ట్రంలో ని భువనేశ్వర్లో త్వరలో నిర్వహించే 40వ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లాకు చెందిన కొడావత్ స్వప్న ఎంపికై ందని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు విజేందర్ యాదర్ సోమవారం తెలిపారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీలో జరిగిన 11వ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విద్యార్థిని స్వప్న విశేష ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా హైదర్ పాషా ఎర్రవల్లి: మండల కేంద్రానికి చెందిన సయ్యద్ హైదర్ పాషా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా ఎంపికయ్యారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన టీఏఏ సెమినార్లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీ య స్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా ఎన్నికయ్యారు. ఈ నెల 16 నుంచి 18వరకు హన్మకొండలో నిర్వహించనున్న 5వ అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అథ్లెటిక్స్ త్రోస్కు ఆయన ప్రాతినిథ్యం వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పదో బెటాలియన్లోని సాయిధ చైతన్య పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. మూఢనమ్మకాల పేరుతో మోసం: నలుగురు అరెస్ట్ మదనాపురం: మూఢనమ్మకాల పేరుతో మదనాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్యం చెప్తాననే ప్రకటన ద్వారా బాధితుడిని నమ్మించి, దుష్టశక్తులు ఉన్నాయంటూ అష్టదిగ్బంధన పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబ లికాడు. మొత్తం రూ.5.66 లక్షలు వసూలు చేశాడు. మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఊరగోపి పల్నా డు జిల్లా బెల్లంకొండకు చెందినవాడిగా గుర్తించారు. అతనితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన సిరిగిరి బాబు, పస్తం రాజు, వరంగల్కు చెందిన అల్లం గోపి కలిసి హైదరాబాద్లో నివాసముంటూ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా పూజలు చేస్తామని చెప్పి మోసం చేసే వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ● ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయం ● నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
వాలీబాల్ టోర్నీ విజేత మహబూబ్నగర్
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 ఉమ్మడి జిల్లా బాల బాలికల వాలీబాల్ టోర్నీలో మహబూబ్నగర్ జట్లు విజేతగా, నాగర్కర్నూల్ జట్లు రన్నరప్గా నిలిచాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ జిల్లాల క్రీడా జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బాదేపల్లి ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.కృష్ణ , క్రీడాకమిటీ అధ్యక్షుడు కృష్ణ, ఇతర కమిటీ బాధ్యులు జ్ఞాపికలు అందజేశారు. అలాగే అన్ని జిల్లాల నుంచి చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ జట్టు ఈ నెల 16న జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననుంది. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్న వీరయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు డి.నిరంజన్, పీడీలు వడెన్న, రాంకళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో ఐదు రోజుల వ్యవధిలో టెండర్లు ఏ స్థాయిలో పెరుగుతాయి అనే టెన్షన్లో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ కూడా చివరి ఐదు రోజుల్లో దరఖాస్తులు అమాంతం పెరిగిన సందర్భాలు ఉండగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న దుకాణాలకు మొత్తం 1,308 టెండర్లు రాగా.. ఇందులో చివరి మూడు రోజుల్లోనే 1,123 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన రోజుల్లో వచ్చినవి కేవలం 200లోపే.. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 14 సర్కిళ్ల పరిధిలో ఉన్న సీఐలు టెండర్లు పెంచుకోవడానికి కావాల్సిన కసరత్తు సైతం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు 455 టెండర్లే దాఖలు అత్యధికంగా పాలమూరులో, అత్యల్పంగా వనపర్తిలో.. చివరి మూడు రోజుల్లోజోరందుకుంటాయని ఆశాభావం -
పాఠశాల స్థలంపై రియల్టర్ల కన్ను
సాక్షి, నాగర్కర్నూల్: పెరుగుతున్న భూముల ధరలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్న అక్రమార్కుల చూపు ఏకంగా సర్కారు బడి జాగాపై పడింది. ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల కొనసాగుతున్న స్థలాన్ని కాజేసేందుకు కొందరు రియల్టర్లు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి అండగా ఉండి.. పట్టా మార్పిడిలో అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం. 1961లో పీహెచ్సీ ఏర్పాటు.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని సర్వే నం.23లో ఉన్న 1.30 ఎకరాల భూమిని పీహెచ్సీ కోసం సంబంధిత యజమాని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. 1961 మే 12న అప్పటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చేతుల మీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఆస్పత్రిని మరోచోట విశాలమైన భవనంలోకి మార్చగా.. పాత భవనంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటం.. రూ.కోట్లు విలువ చేసే స్థలం కావడంతో కొందరు రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాల స్థలం నుంచి 23 గుంటల భూమిని 2012లో బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. తర్వాత 2015లో సదరు భూమిని భూత్పూర్కు చెందిన రియల్ వ్యాపారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. పాఠశాల స్థలంలోని రోడ్డువైపు ఉన్న 6 గుంటల స్థలంలో కమర్షియల్ షెట్టర్లు, షాపుల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పాఠశాల స్థలం అన్యాక్రాంతమవుతున్నట్టు గుర్తించిన గ్రామస్తులు.. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు బిజినేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం -
అధికారుల సహకారంతో..
పీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీజీ వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగా లు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. అందుకోసం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాం. అందుకోసం యూనివర్సిటీ అధికారులు సైతం ఎంతో సహకరించారు. – భూమయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్, పీయూ సదుపాయాలు బాగున్నాయి.. పీయూలో 2013– 15 బ్యాచ్ లో నేను ఎంఎస్డబ్ల్యూ చదివాను. ఈ క్రమంలో అప్పటికే లైబ్రరీలు, స్టడీ హాల్ వంటి సదుపాయాలు బాగానే ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యాపకులు, అధికారులు ఎంతో ప్రోత్సహించడంతో పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకొని ఉద్యోగం సాధించా. – మల్లేష్, జూనియర్ లెక్చరర్, వనపర్తి కళాశాల యువతకు జీవితం.. నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు. పీయూ 4వ స్నాత కోత్సవం జరపుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంది యువతకు జీవితాన్ని ఇచ్చింది. – పరమేశ్వర్గౌడ్, ఎకై ్సజ్ సీఐ, పటాన్చెరు స్థిరపడేందుకు ప్రోత్సాహం.. పీయూలో చదువుకునేందు కు, పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేందుకు చక్కటి వాతావరణం ఉంది. అక్కడ లైబ్రరీ, స్టడీ హాల్, కంప్యూటర్ ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నారు. – అనిల్కుమార్, పీజీటీ, బీసీ గురుకులం● -
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా, మండల ప్రత్యేకాధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల ని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. వివిధ శాఖల అధికారులు వారికి కేటాయించిన హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలను ప్రతినెలా మొ దటి వారంలో తనిఖీ చేసి.. సంబంధిత రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరచాలని, ముఖ్యంగా మెనూ పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అంశాలపై షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు. 16న గవర్నర్ పర్యటన.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ జిల్లాకు రానున్నారని కలెక్టర్ వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు 12.30 గంటలకు వరకు పాలమూరు యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి చాన్స్లర్గా అధ్యక్షత వహిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 నుంచి 2.45 గంటల వరకు కలెక్టరేట్లో టీబీ అధికారులు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశమవుతారని, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్లో ప్రొటోకాల్ ఏర్పాటు ఆర్డీఓ, తహసీల్దార్, బందోబస్తు ఏర్పాట్లు పోలీసు, శాఖ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన అవసరం ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు జరిగి వచ్చిన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాంటి వారికి సీపీఆర్తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడుతారన్నారు. కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈ నెల 13 నుంచి 17 వరకు వారం రోజుల పాటు సీపీఆర్పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వైద్యాధికారులు మనుప్రియ, శివకాంత్ ప్రయోగ పూర్వకంగా సీపీఆర్ ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ● స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ● ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని మీనాంబరం పరుషవేదీశ్వరస్వామి ఆలయంలో సోమవారం అగ్నిగుండ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ముందుగా తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఓం నమః శివాయ నామస్మరణ మధ్య అగ్నిగుండంలో భక్తులు నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా జరిపించారు. కల్యాణోత్సవంలో రమాదేవి, విజయమ్మ, సుదర్శన్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపాల్, పర్వతాలు, కై లాస్ జవహర్, మల్లేష్, యాదయ్య పాల్గొని అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆదివారం అర్ధరాత్రి వేసిన ఖడ్గాలు ఆకట్టుకున్నాయి. -
చీరాల బీచ్లో జడ్చర్ల విద్యార్థి దుర్మరణం
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జడ్చర్లకు చెందిన ఓ విద్యార్థి ఆదివారం సెలవు రోజున ఆటవిడుపు కోసం మిత్రులతో కలిసి సముద్ర తీరాలకు వెళ్లి సముద్రం అలలలో కొట్టుకుపోయి నీట మునిగి మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు.. జడ్చర్ల గంజ్ ప్రాంతానికి చెందిన బాదం సాయి మణిదీప్(20) ఏపీలోని అమరావతి వద్ద ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్య నభ్యసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఏడుగురు మిత్రులతో కలిసి ఆటవిడుపు కోసం చీరాల బీచ్కు వెళ్లారు. బీచ్లోని ససముద్రం అలలలో ఎనిమిది మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను కాపాడగా.. ఐదుగురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో జడ్చర్లకు చెందిన విద్యార్థి సాయి మణిదీప్ ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు బాదం రాఘవేందర్, కల్యాణి ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. కన్నీరు మున్నీరై విలపించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి విద్యార్థి మృతిపై ఆరా తీసి విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని త్వరితగతిన జడ్చర్లకు తీసుకొచ్చే విధంగా సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
యూరియా తిని 12 మేకలు మృతి
నవాబుపేట: పొలంలో మేతలు మేస్తున్న మేకలు అక్కడున్న యూరియాను తినడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని అమ్మాపూర్కు చెందిన మంగళి ప్రభాకర్కు చెందిన మేకలను ఎప్పటి మా దిరిగా ఆదివారం మేతకు తీసుకెళ్లాడు. కాగా గ్రామ సమీపంలోని పొలంలో మంగళి మా సయ్య పొలంలో మొక్కజొన్న మేత మేస్తుండగా పక్కనే ఉన్న సొప్పగూళ్లో ఉంచిన కొంత యూరియాను మేకలు తినేశాయి. దీంతో కొద్దిసేపట్లోనే మేకలు కిందపడి మృతిచెందాయి. 20మేకలను తీసుకెళ్తే 12మేకలు మాత్రం యూరియా తిన్నాయి. మిగతా మేకలు వేరేచోట మేత మేస్తున్నాయి. మేకలు ఒక్కొక్కటిగా కిందపడి మృతిచెందడంతో రైతు బోరున విలపించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తు లు వచ్చేసరికే అక్కడ యూరియా తిన్న 12మేలు మృతిచెందాయి. కాగా మృతిచెందిన మేకల విలువ దాదాపు రూ.2లక్షలకు పైగానే ఉంటుందని రైతు వాపోయాడు. ఈ విషయంలో మేకలతో ఉపాధి పొంది జీవిస్తున్న మంగళి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శ్రీశైలానికి స్వల్పంగా వరద
దోమలపెంట: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెరిచి ఉన్న ఒక్క గేటును రాత్రి అధికారులు మూసివేశారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,587, సుంకేసుల నుంచి 8,892 మొత్తం 54,479 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 27,142 మొత్తం 62,457 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.6 అడుగుల వద్ద 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.264 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.398 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల రాజోళి: సుంకేసుల డ్యాం రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆదివారం జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి 15,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 11,156 క్యూసెక్కులు విడుదల చేశారు. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ పేర్కొన్నారు. కోయిల్సాగర్ గేట్ల మూసివేత దేవరకద్ర: ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. పెద్దవాగు ఇన్ఫ్లో తగ్గడంతో ఆదివారం ఉదయం ఒక్క గేటును తెరవగా మధ్యాహ్నం నుంచి ఆ గేటును మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగులుగా ఉంది. జూరాల గేట్ల మూసివేత ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గడంతో తెరిచి ఉంచిన గేట్లను మూసివేసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 9.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 55 వేల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లను కొనసాగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,527 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 47,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 811.700 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఆదివారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 412.937 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 398.763 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 811.700 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఉత్పత్తికి గానూ 45,587 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు పేర్కొన్నారు. -
ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య
నాగర్కర్నూల్ క్రైం: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని యువకుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. కొల్లాపూర్ పట్టణానికి చెందిన కొమ్ము రామకృష్ణ (25) జిల్లాకేంద్రంలోని మంతటి చౌరస్తా వద్ద బైక్ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు ఏడాది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో తల్లిదండ్రులు కొమ్ము రామకృష్ణను మందలించారు. ప్రేమించిన యువతి తనకు దక్కదని మనస్తాపానికి గురై క్షణికావేశంలో రాఘవేంద్రకాలనీలోని తన బాబాయి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరించారు. ఘటనకు సంబంధించి మృతుడి అన్న సలేశ్వరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నీటిగుంతలోకి దూకి యువకుడు ఆత్మహత్య జడ్చర్ల: నీటి గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని కొండేడులో చోటుచేసుకుంది. కొండేడు గ్రామ శివారులో గ్రామాభివృద్ధి కోసం భారీగా మట్టిని తీయడంతో అక్కడ ఓ గుంత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో భారీగా నీరు నిలించింది. గ్రామానికి చెందిన రమేశ్(25) అక్కడకు చేరుకుని ఆకస్మికంగా అందులోకి దూకి మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని నీటి గుంతలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య కొన్నాళ్ల కిందటే భర్తను విడిచి వెళ్లిందని, మృతుడికి తల్లి చిలకమ్మ, తమ్ముడు సురేశ్ ఉన్నారు. మద్యం మత్తులో నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు తెలకపల్లి: పంక్షన్ హాలులో చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఓ పంక్షన్ హాలులో ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పంక్షన్ హాలులో ఉన్న ఐదున్నర క్వింటాళ్ల ఇనుము, జేసీబీకి సంబంధించిన సామగ్రి చోరీకి గురైనట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందుతుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గు డిపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) తన భార్య మానస తో కలిసి జిల్లా కేంద్రంలో ఓ అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నాడు. ఇతడు ఫ్లంబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 9న త న బంధువుల వివాహం ఉండడంతో గుడపల్లికి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి గుడిపల్లి శివా రులో మైనగాని రాములు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఘటనా స్థలా న్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తలించారు. మృతుడు మైనగాని రాములు భార్య మానసకు పెద్దముద్దునూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఇరువురు కలిసి హత్య చేసి ఉంటారని, మృతిపై అనుమానం ఉందని పోలీసులకు మృతుడి తండ్రి మైనగాని పాండయ్య ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలింత మృతిపై కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: బాలింత మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన రాత్లావత్ కవిత (26) ఈనెల 10న కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరింది. కాన్పు అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఘటనకు సంబంధించి మృతురాలి తల్లి రాత్లావత్ తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం
రాష్ట్రస్థాయి జూనియర్ నెట్బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విన్నర్, రన్నరప్, మూడో స్థానం జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగపరచడమే కాకుండా ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పట్టుదల, లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని నేర్పుతుందన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అంతర్జాతీయ నెట్బాల్ పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారిణులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, కార్యదర్శి శిరీషరాణి, రామ్మోహన్గౌడ్, అంజద్అలీ, విహారి, షరీఫ్, మాజీ కౌన్సిలర్ షేక్ ఉమర్తోపాటు వివిధ జిల్లాల జట్ల కోచ్లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
నెట్బాల్ విజేత పాలమూరు
వికసించిన అరుదైన పుష్పాలు హబీనేరియా డీజీటేటా తెల్ల కలువ జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన మొక్కలకు పూ లు పూసా యి. దేశంలోని వివిధ ప్రాంతాల అడవుల నుంచి తీసు కొచ్చి నాటిన మొక్కలకు కాలానుగుణంగా పుష్పాలు వికసిస్తున్నా యని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. ఆర్కిడ్ జాతులైన హబీనేరియా, ఫర్సిఫెర, హబీనేరియా డిజిటేట, జియో డోరం, డెన్సిఫ్లోరం జియోడోరం, లా క్సిఫ్లోరం, యూలోఫియా గ్రమీనియా, లూసి యా జైలానిక, వాండ టెస్టేసియా మొక్కలకు ఇప్పటికే పూలు కాసాయని.. తెల్ల కలువ, హెటెరోస్టెమ అనే తీగజాతి మొక్క సైతం పుష్పించిందన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాల్లో మా త్రమే చూసే మొక్కలు, పూలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినట్లయిందని ప్రిన్సి పాల్ డా. సుకన్య, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. నర్మద చెప్పారు. – జడ్చర్ల టౌన్ చిన్నారులపై వీధికుక్కల దాడి -
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయ సేకరణ
స్టేషన్ మహబూబ్నగర్: డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో జిల్లా కాంగ్రెస్, బ్లాక్, మండల స్థాయిలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, శ్రీగణేష్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోనం తనకు ఏఐసీసీ పరిశీలకుడిగా నియామకం చేశారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయవచ్చని, ఆశావాహులు ఈ నెల 20 వరకు దరఖాస్తుఫారాలు అందజేయాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అభిప్రాయాలు సేకరిస్తామని, 22లోగా నివేదికను ఏఐసీసీకి సమర్పిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో వ్యక్తిగతంగా, గ్రూపులుగా అభిప్రాయాలు సేకరణ ఉంటుందన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, వివిధ చైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నట్లు తెలిసింది.సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు మెట్టు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, హర్షవర్ధన్రెడ్డి, మన్నె జీవన్రెడ్డి, జహీర్ అఖ్తర్, వసంత, సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, అజ్మత్అలీ, అవేజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముగ్గురం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారమేనని, ప్రభుత్వం కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పోరాడుతుందని, ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీల్లో సమర్థవంతమైన నాయకులను డీసీసీ అధ్యక్షుడిగా పరిగణలోకి తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పరిశోధనలకు పట్టం
పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు -
స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: స్నాతకోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో వివిధ కమిటీల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులు, అధికారులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మెడల్స్ స్పాన్సర్ కోసం అన్ని వసతులు కల్పించాలన్నారు. మీడియా వారికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించే హాల్తోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, అధ్యాపకులు మాలవి, అర్జున్కుమార్, భూమయ్య, శ్రీధర్రెడ్డి, జిమ్మీకార్టన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోల అప్లోడ్తో ఇందిరమ్మ బిల్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వివరాల నమోదుకు యాప్లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బిల్లుల ప్రతిపాదలనలో జాప్యం నివారణ, ఇబ్బందులు దూరం చేసేందుకు గాను ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం నేరుగా లబ్ధిదారులకే కల్పించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం మొదలైనప్పటి నుంచి వివిధ దశల ఫొటోలు తీసి పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు యాప్లో అప్లోడ్ చేసేవారు. అవి గృహ నిర్మాణ శాఖ ఏఈ లాగిన్కు ఆ తర్వాత డీఈ, పీడీ, కలెక్టర్కు చేరేవి. పునాది పూర్తయితే రూ.లక్ష, స్లాబ్ లెవల్ (గోడలు) వరకు పూర్తయితే మరో రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, రంగులతో సహా ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష ఇలా విడతల వారిగా మొత్తం రూ.5 లక్షలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అయితే పంచాయతీ కార్యదర్శులు ఈ ప్రక్రియ చేపట్టడంలో కొంత ఆలస్యం చేయడం, దీంతో లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూసే పరిస్థితులు తలెత్తేవి. ఈ జాప్యాన్ని నివారించేందుకు గాను ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేసేందుకు నూతన యాప్ను తీసుకొచ్చింది. నమోదు ఇలా.. లబ్ధిదారులు స్మార్ట్ ఫోన్ (ఇంట్లో ఎవరిదైనా)లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. బెనిఫిషియర్ లాగిన్కు వెళ్లి.. పేరు, ఫక్షన్ నంబర్, గ్రామ వివరాలు నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. నిర్మాణ దశలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తే ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియను జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాప్లో అందుబాటులోకి కొత్త ఆప్షన్ నేరుగా లబ్ధిదారులే ఎంట్రీ చేసే అవకాశం ప్రతిపాదనలో జాప్యానికి తప్పనున్న తిప్పలు ఇందిరమ్మ లబ్ధిదారులు స్వయంగా ఫొటో అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తే పరిశీలన తర్వాత బిల్లులు వారి ఖాతాలో జమ అవుతాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. – వైద్యం భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ -
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
మహబూబ్నగర్ క్రైం: కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్న డయల్ 100 లేదా స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలో రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్న క్రమంలో ఎస్పీ శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, అనుమానస్పద వ్యక్తులను, పిస్తాహౌజ్ చౌరస్తా, న్యూటౌన్, బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయడంతోపాటు ఆ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటమే పోలీసుల లక్ష్యం అని, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ పెంచుతున్నట్లు చెప్పారు. తనిఖీల్లో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ తప్పక తీసుకోవాలి దీపావళి పండగ నేపథ్యంలో ప్రత్యేకంగా హోల్సేల్తోపాటు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి బాణాసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ తీసుకోవాలని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసుల దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో కాకుండా.. జిల్లా అగ్నిమాపక అధికారులు సూచించిన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వార్డెన్పై సస్పెన్షన్ వేటు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నవాబుపేట మండలంలోని ఎన్మన్గండ్ల హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్మన్గండ్లలోని బాలికల హాస్టల్ను శనివారం కలెక్టర్ విజయేందిర తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థులకు భోజనంలో కూరగాయలు వడ్డించకుండా కేవలం సాంబార్ మాత్రమే వడ్డించడం, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హాస్టల్ వార్డెన్పై సస్పెషన్ వేటు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే ఆదివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ ఎస్టీ హాస్టల్, వెంకటేశ్వరకాలనీలోని ఎస్సీ హాస్టల్ను అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు వడ్డించే చట్నీలో నాణ్యత లేకపోవడంతో సంబంధిత హాస్టల్ వార్డెన్కు మెమోలు జారీ చేశారు. -
‘చేయి’ తడపాల్సిందే!
ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ● ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ ● పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు ● తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ● ఆందోళనలో లబ్ధిదారులు.. సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. డ్రైవర్ల ఆందోళన.. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. ‘ఇందిరమ్మ ఇంటికై నా.. ఇతర అవసరాలకై నా.. ఏదైనా సరే.. పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఒక్కో టిప్పర్కు రూ.6 వేలు చెల్లించాల్సిందే’నని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ ‘అధికార’ నేత తేల్చిచెప్పడంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తుమ్మిళ్ల రీచ్ వద్దకు అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ వాహనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేత నుంచి పర్సంటేజీ ఇవ్వని పక్షంలో ఒక్క వాహనాన్ని కూడా తిరగనిచ్చేది లేదంటూ సదరు కాంట్రాక్టర్కు వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. -
ఫైనల్లో పాలమూరు– పేట
● ఉత్సాహంగా సాగుతున్న నెట్బాల్ టోర్నీ ● బాలికల ట్రెడిషనల్ ఫైనల్లో రంగారెడ్డి, నల్లగొండ ● ప్రారంభమైన ఫాస్ట్–5 పోటీలు ● నేడు ముగియనున్న జూనియర్ చాంపియన్షిప్ బాలుర విభాగం మహబూబ్నగర్–ఖమ్మం జట్ల సెమీఫైనల్ మ్యాచ్ నాగర్కర్నూల్–ఆదిలాబాద్ జట్ల మధ్య బాలికల మ్యాచ్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్ నెట్బాల్ చాంపియప్షిప్ ఉత్సాహంగా జరుగుతోంది. ట్రెడిషనల్ విభాగం పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఈ విభాగంలో అతిథ్య మహబూబ్నగర్ బాలుర జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తుది సమరానికి చేరుకుంది. ఫైనల్లో నారాయణపేట జిల్లా జట్టుతో తలపడనుంది. ఇక బాలికల్లో రంగారెడ్డి, నల్లగొండ జట్లు ఫైనల్కు చేరాయి. బాలుర విభాగం మూడో స్థానంలో ఖమ్మం, జనగాం జట్టు, బాలికల విభాగంలో నిజామాబాద్, మహబూబ్నగర్ జట్లు సంయుక్తంగా నిలిచాయి. నేడు ఈ మెగా టోర్నీ ముగియనుంది. సెమీఫైనల్ ఫలితాలు: బాలుర మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ బాలుర జట్టు 16–11 పాయింట్ల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్ మ్యాచ్లో నారాయణపేట జట్టు 18–12 తేడాతో జనగాం జట్టుపై గెలిచింది. బాలికల విభాగం సెమీఫైనల్ మ్యాచ్లో రంగారెడ్డి జట్టు 11–6 పాయింట్ల తేడాతో నిజామాబాద్ జట్టుపై, నల్గోండ జట్టు 15–11 తేడాతో మహబూబ్నగర్ జట్టుపై గెలుపొందాయి. క్వార్టర్ ఫలితాలు: బాలుర విభాగం క్వార్టర్ఫైనల్ మ్యాచుల్లో ఖమ్మం జట్టు 21–11 పాయింట్ల తేడాతో నల్లగొండ జట్టుపై, నారాయణపేట జట్టు 23–7 తేడాతో హైదరాబాద్పై, మహబూబ్నగర్ జట్టు 18–02 తేడాతో గద్వాల జట్టుపై, జనగాం జట్టు 14–12 తేడాతో నాగర్కర్నూల్ జట్టుపై విజయం సాధించాయి. బాలికల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో రంగారెడ్డి జట్టు 12–5 పాయింట్ల తేడాతో మేడ్చల్ జట్టుపై, నల్లగొండ జట్టు 16–4 తేడాతో ఖమ్మంపై, నిజామాబాద్ 19–14 తేడాతో కొమురంభీమ్ ఆసిఫాబాద్పై, మహబూబ్నగర్ జట్టు 13–3 తేడాతో నాగర్కర్నూల్ జట్టుపై గెలుపొందాయి. ఫాస్ట్–5 పోటీలు ప్రారంభం శనివారం బాలబాలికల విభాగం ఫాస్ట్–5 పోటీలు ప్రారంభమయ్యాయి. బాలుర విభాగం నాకౌట్ మ్యాచుల్లో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జట్టు 22–13 తేడాతో మెదక్ జట్టుపై, కరీంనగర్ జట్టు 22–10 తేడాతో కొత్తగూడెంపై, వనపర్తి జట్టు 10–3 తేడాతో వరంగల్పై, మేడ్చల్ జట్టు 11–3 తేడాతో రంగారెడ్డిపై, హైదరాబాద్ జట్టు 34–6 తేడాతో నిర్మల్పై విజయం సాధించాయి. బాలికల విభాగంలో జగిత్యాల జట్టు 10–4 తేడాతో జనగాంపై, మహబూబ్నగర్ 16–4 తేడాతో మహబూబాబాద్పై, కామారెడ్డి జట్టు 7–3 తేడాతో వికారాబాద్పై, నాగర్కర్నూల్ 14–4 తేడాతో మంచిర్యాలపై, ఖమ్మం జట్టు 11–4 తేడాతో కొమురంభీమ్ ఆసిఫాబాద్పై గెలుపొందాయి. అంతకుముందు ఫాస్ట్–5 మ్యాచ్ జట్లను నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి శిరీషారాణి పరిచయం చేసుకున్నారు. టోర్నీలో ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. -
రైల్వే ఉద్యోగిని మోసం చేసిన సైబర్ నేరస్తులు
నాగర్కర్నూల్ క్రైం: వాట్సప్లో వచ్చిన ట్రెండింగ్ యాప్లో పెట్టుబడి పెడితే ఎక్కువ మొ త్తంలో నగదు వస్తుందని పెట్టుబడి పెట్టిన రై ల్వే ఉద్యోగిని సైబర్ నేరస్తులు మోసం చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన తిరుపతయ్య రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు తన ఫోన్లోని వాట్సాప్కు వచ్చిన మెసేజ్లో ట్రెండింగ్ యాప్లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని నమ్మి ఈ ఏడాది ఆగస్టు రూ. 13.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టాడు. తాను పెట్టుబడి పెట్టిన నగదు రాకపోవడంతో వాట్సప్కు వచ్చిన ఫోన్ నంబర్కు ఫోన్ చేయడంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మమ్మకు మాజీ మంత్రుల ఘన నివాళి తిమ్మాజిపేట: మాజీ మంత్రి డా. ఆవంచ లక్ష్మారెడ్డి తల్లి లక్ష్మమ్మ ఈ నెల 1న హైదరాబాద్లో మృతిచెందగా.. స్వగ్రామం ఆవంచలో దహన సంస్కారాలు నిర్వహించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన దశదినకర్మలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలుజల్లి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, యాదయ్య, శ్రీశైలంయాదవ్, దయాకర్రెడ్డి, వేణుగోపాల్గౌడ్, మోహనాచారి, అజయ్, ఊషన్న, కృష్ణయ్య, ఇబ్రహీం, స్వామి, సైఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 62 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ఎత్తివేత ● 65,140 క్యూసెక్కుల నీరు దిగువకు ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 79 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 62 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు తాత్కాలికంగా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు కేవలం 3 క్రస్టు గేట్లను ఎత్తి 18,384 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,055 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 65,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. వేగవంతంగా విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 408.044 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 394.443 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కలిపి 802.487 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. శ్రీశైలం ఆనకట్ట ఒక గేటు ఎత్తివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టానికి మించి నీరు నిల్వ ఉండడంతో సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 63,439 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 11,238, హంద్రీ నుంచి 250 మొత్తం 74,927 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఒక్క గేటును పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 27,983 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,819 మొత్తం 66,134 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.8 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835, ఎంజీకేఎల్ఐకు 866 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.990 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.747 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
రసాయనాలు కలిసిన నీరు తాగి నెమళ్లకు అస్వస్థత
● వనపర్తి ఎస్పీ చొరవతో పశువైద్యశాలకు తరలింపు ● పోలీసు, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణలో చికిత్స వనపర్తి: పంటపొలంలో రసాయనాలు కలిసిన నీటిని తాగి అస్వస్థతకు గురైన మూడు నెమళ్లకు పశువైద్యులు చికిత్స అందించి ఊపిరి పోశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల–తిరుమలాపురం రోడ్డు పక్కనున్న పొలంలో రైతు కంతుల కురుమయ్య మినుముల పంట సాగుచేశాడు. ఇటీవల పంటకు రసాయనిక ఎరువులు వేశాడు. శనివారం అటుగా వచ్చిన మూడు నెమళ్లు పొలంలో నిలిచి ఉన్న నీటిని తాగడంతో అస్వస్థతకు గురై కదలలేని పరిస్థితికి చేరుకున్నాయి. గమనించిన సమీప రైతులు ఫారెస్టు అధికారులు, పోలీసులతో పాటు స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రావుల గిరిధర్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి గోపాల్పేట ఎస్ఐ నరేశ్తో పాటు ఎస్బీ కానిస్టేబుల్ బాలును పంపించారు. అక్కిడికి వెళ్లిన వారు మూడు నెమళ్లు కదలలేని స్థితిలో ఉన్నాయని ఎస్పీకి సమాచారం ఇవ్వగా.. వెంటనే వాటిని వనపర్తి జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలకు తీసుకురావాలని సూచించారు. వారు పశువైద్యశాలకు నెమళ్లను తీసుకొచ్చే వరకే ఆయన అక్కడికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ మల్లేశ్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. నెమళ్లను తీసుకొచ్చిన వెంటనే చికిత్స మొదలుపెట్టారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుకొని వైద్యం అందించాలని వైద్యుడు సూచించడంతో.. వనపర్తి ఫారెస్టు సెక్షన్ అధికారులు విజయ్, స్వప్నకు నెమళ్లను అప్పగించారు. వారు స్థానిక ఎకో పార్క్కు తరలించి తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. అవి పూర్తిగా కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఎక్కడైనా మూగజీవాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. -
వీకేర్ సీడ్స్లో పూర్తయిన ఐటీ సోదాలు
ఉండవెల్లి: మండలంలోని జాతీ య రహదారి పక్కన ఉన్న వీకేర్ సీడ్స్ ప్రైవేట్ కంపెనీలో మంగళవారం తెల్లవారుజాము నుంచి శనివారం వరకు ఆంధ్ర, తెలంగాణాకు చెందిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగులను ఇళ్ల నుంచి తీసుకొచ్చి మరీ డాక్యుమెంట్లు, పత్రాలు, కంప్యూటర్లు, లాకర్లు, బీర్వాలు పరిశీలించారు. చివరకు ఎలాంటివి పట్టుబడలేదని శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయారు. గురువారం యాజమాన్యంలో భాగమైన కిరణ్ కుమా రుడిని శుక్రవారం ఇద్దరు యజమానులు దూడెంపూడి కిరణ్కుమార్, ధూళిపాల వెంకట్రావును విచారించారు. మిగిలిన ఇద్దరు ధూళిపాల కోటిస్వామి, బాబాయ్య హాజరుకాలేదని సమాచారం. కాగా రైతులు వీకేర్కు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని శనివారం తరలించడం ప్రారంభించారు. -
వృద్ధదంపతుల మృతదేహాలు లభ్యం
● బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శ ● అంబటాపూర్కు బీటీరోడ్డు మంజూరు చేస్తామని హామీ జడ్చర్ల: మండలంలోని కిష్టారం పోతిరెడ్డి చెరువు అలుగు ప్రవాహంలో గురువారం గల్లంతైన అంబటాపూర్కు చెందిన వృద్ధ దంపతుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. అంబటాపూర్కు చెందిన భార్యాభర్తలు బాలయ్య, రాములమ్మ ఉపాధి పనులకు సంబంధించిన కూలీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయోనని తెలుసుకోవడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. వరదలో రోడ్డు దాటుతూ గల్లంతైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారికోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం వరద ప్రవాహం గణనీయంగా తగ్గడంతో ఘటన స్థలానికి కొద్దిదూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శనివారం అంబటాపూర్లో మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్లో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, అంబటాపూర్కు త్వరలోనే బీటీరోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
కంటివైద్యుడి అదృశ్యంపై వీడిన మిస్టరీ
మద్దూరు: పట్టణంలో కంటి ఆస్పత్రి నిర్వహిస్తున్న కంటివైద్యుడు పాత్లావత్ రమేశ్నాయక్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ 17 పేజీల లేఖ రాసి గత నెల 28న అదృశ్యమైన విషయం పాఠకులకు విధితమే. శనివారం హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు బస్సులో వస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు మార్గమధ్యంలో పట్టుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విలేకర్ల ఎదుట ప్రవేశపెట్టారు. మతమార్పిడులు, దొంగ బంగారం, హవాల తదితర అంశాలు ఊహించి రాసి డబ్బుల గురించి వేధించే వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంలో ఇదంతా చేసినట్లు విచారణలో వెల్లడైందని కోస్గి సీఐ సైదులు తెలిపారు. రమేష్నాయక్ను తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. న్యాయ సలహా మేరకు కేసుపై తదుపరి చర్యలుంటాయని చెప్పారు. రమేష్నాయక్ను పట్టుకునేందుకు కృషిచేసిన టాస్క్ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ వసురాంనాయక్, పోలీసులు పరశురాంనాయక్, నాగమల్లేష్, పూల్చ్యానాయక్, రాఘవేందర్రెడ్డి, హన్మంతు తదితరులను సీఐ అభినందించారు. వేధింపులతోనే ఇదంతా చేశా.. కంటి వైద్యుడు రమేష్నాయక్ పోలీసుల ఎదుట జరిగిన విషయాన్ని విలేకర్లకు వివరించారు. తన మిత్రుడు రామచంద్రయ్య గతంలో పట్టణంలోని తాజోద్దీన్ వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకోగా తాను జమానత్ ఉన్నానన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ ఏడాది మే నెల 23న ఆత్మహత్య చేసుకున్నాడని.. తనను పిలిచి డబ్బులు చెల్లించాలంటూ తాజోద్దీన్ ఒత్తిడి పెంచి తరచూ వేధిస్తున్నట్లు వివరించారు. డబ్బులు చెల్లించాలని మళ్లీ స్నేహితుల సమక్షంలో మరో బాండ్ పేపర్ రాయించుకున్నారని, దీంతో చేసేది లేక నెల వడ్డీ చెల్లించినట్లు చెప్పారు. వేధింపులకు తట్టుకోలేక సినిమాల ప్రభావంతో మతమార్పిడులు, దొంగ బంగారం, హవాల డబ్బులు తదితర వాటిని పేర్కొంటూ లేఖ రాసినట్లు తెలిపారు. విలేకర్ల ఎదుట హాజరుపర్చిన పోలీసులు -
విద్యుత్ ఆదా..
యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో సోలార్ విద్యుత్ వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రూ.3 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవనం పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా యూనివర్సిటీలోని పలు విభాగాలకు సోలార్ విద్యుత్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వం అందించే సాధారణ విద్యుత్తో కలుపుకొని అన్ని విభాగాలకు అందిస్తున్నారు. దీని ద్వారా యూనివర్సిటీకి తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొన్ని విభాగాలకు సరిపోవడం లేదని, దీనిని పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు పేర్కొంటున్నారు. -
ఎట్టకేలకు శుభ్రం చేశారు..!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక ఎస్ఆర్నగర్ పక్కన ఖాళీ స్థలంలో గుట్టలు గుట్టలుగా పోగైన చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను ఎట్టకేలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. నగరంలోని ఈ ప్రాంతంతో పాటు వివిధ చోట్ల ఎక్కడబడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను కొందరు వ్యక్తులు యథేచ్ఛగా పారబోస్తున్న వైనంపై ‘సాక్షి’లో శనివారం ‘పొడి.. తడబడి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన వారు ఎస్ఆర్నగర్ వద్ద పారబోసిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించి ట్రాక్టర్ ద్వారా కోయిల్కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలించారు. అలాగే జేసీబీతో ఆ ప్రాంతం మొత్తం చదును చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అయితే మిగతా ప్రాంతాల్లో ఉన్న అపరిశుభ్రతను తొలగించడంపై మాత్రం దృష్టి పెట్టకపోవడం గమనార్హం. -
అన్నను కాపాడబోయి తమ్ముడు..
● చెక్డ్యాంలో మునిగి ఇద్దరు సోదరుల మృతి ● చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ● తల్లి ఏడాది దినకర్మ చేయడానికి వచ్చి మృత్యువాత ● వనపర్తి జిల్లా బలీదుపల్లిలో విషాదం అడ్డాకుల: తల్లి చనిపోయి ఏడాది కావడంతో దినకర్మ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు పట్నం నుంచి ఊరికి వచ్చారు.. కార్యం పూర్తిచేసిన మరుసటి రోజు సరదాగా చేపలు పట్టేందుకు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటి సుడిలో మునిగిపోతున్న అన్నను కాపాడబోయి తమ్ముడు కూడా మృతిచెందిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా బలీదుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. అందరూ హైదరాబాద్లో ఉంటూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతేడాది మణెమ్మ చనిపోవడంతో ఏడాది దినకర్మ చేయడానికి నలుగురు కుమారులు కుటుంబాలతో కలిసి రెండు రోజుల కిందట బలీదుపల్లికి వచ్చారు. శుక్రవారం మణెమ్మ ఏడాది దినకర్మ పూర్తి చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెద్ద కుమారుడు మంద సుధాకర్ (32), చిన్న కుమారుడు మంద సాయి(25) మరో తమ్ముడు మంద కుమార్తో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు ఆటోల్లో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్దవాగు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. దుస్తులు శుభ్రం చేసుకుని కొద్దిసేపు సరదాగా గడిపొద్దామని అక్కడికి చేరుకున్నారు. అయితే చెక్డ్యాం దిగువన చేపలు కనిపించడంతో వెంటనే సుధాకర్ చేపలు పడతానంటూ నీళ్లలోకి దిగాడు. చెక్డ్యాం దిగువన నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి సుడి వద్దకు వెళ్లిన సుధాకర్ అందులో చిక్కుకుని మునిపోతూ కనిపించాడు. వెంటనే గుర్తించిన తమ్ముడు మంద సాయి నీళ్లలోకి దిగి అన్నను కాపాడే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ నీటి సుడిలో చిక్కుకున్నాడు. ఇద్దరు అందులో కొట్టుమిట్టాడుతుండగా.. కొద్దిదూరంలో ఉన్న మరో తమ్ముడు మంద కుమార్ నీటిలోకి దిగి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రాణాలకు తెగించి కుటుంబసభ్యుల సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. పెద్ద కుమారుడు మంద సుధాకర్ అప్పటికే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న చిన్న కుమారుడు సాయిని అంబులెన్స్లో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. సుధాకర్కు భార్య మమత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయికి ఇంకా పెళ్లి కాలేదు. కాగా ఇద్దరు సోదరులు ఒకేరోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తుల చేత కంటతడి పెట్టించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను జనరల్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి దినకర్మకు వచ్చిన కుమారులను మృత్యువు కబలించడంతో బంధువులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. మంద సుధాకర్ (ఫైల్) మంద సాయి (ఫైల్) -
ఆధునిక హంగులు
పీయూలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిపాలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు. సమర్థ్ పోర్టల్తో సేవలు.. పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కీలకంగా సీవేజ్ ప్లాంట్.. యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా తీసుకువస్తున్న మార్పుల్లో కీలకమైంది సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. రూ.5 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ కిందభాగంలో దీనిని నిర్మిస్తున్నారు. యూనివర్సిటీలో పలు హాస్టల్స్, కళాశాలలు నుంచి వచ్చే డ్రెయినేజీ నీటిని ఇక్కడ ఉండే పెద్ద మూడు ట్యాంకుల్లోకి మళ్లించి నీటితోపాటు ఇతర వ్యర్థాలను శుద్ధి చేసే విధంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన నీటిని తిరిగి చెట్లు, తోటలు, గార్డెన్లకు, ఘన పదార్థాల వ్యర్థాలను బయో ఫర్టిలైజర్గా వినియోగిస్తున్నారు. చెట్లకు ఇతర అవసరాల కోసం ఎరువులుగా ఉపయోగించనున్నారు. దీని ద్వారా పీయూ వ్యర్థాల పునర్వినియోగంలో టాప్లో నిలువస్తుంది. న్యాక్ ర్యాంకింగ్లో మెరుగైన స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ -
డీసీసీ అధ్యక్షులపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే క్రమంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం.. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డీసీసీ అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు. ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మహబూబ్నగర్కు చేరుకుని స్థానిక నేతలతో ముచ్చటించారు. ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాల్లో అభిప్రాయాల సేకరణతో పాటు డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదివారం నాగర్కర్నూల్, 14న వనపర్తి, 16న జోగుళాంబ గద్వాలలో పర్యటించనున్నారు. నవంబర్లో ఖరారయ్యే అవకాశాలు ఏఐసీసీ పరిశీలకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల 18వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వడబోత తర్వాత ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ఈ నెల 22వ తేదీ నాటికి అటు ఏఐసీసీ, ఇటు పీసీసీకి అందజేయనున్నారు. అనంతరం సీఎం ఇతర ముఖ్య నేతలు జిల్లా ఇన్చార్జిలు, ఇన్చార్జి మంత్రు లు, ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతిని ధ్యం వహిస్తున్న మంత్రులతో సంప్రదింపులు జరి పి సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ) వారీగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు. మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డీసీసీ అధ్యక్షులు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆశావహులు తాము చేసిన దరఖాస్తుల్లో పార్టీకి అందించిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయోడేటా ఇవ్వాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జిల్లాల వారీగా పోటాపోటీ ఇలా.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి డీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ పదవి కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్ఖాద్రి పోటీపడుతున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. లక్కాకుల సతీష్, రాజేంద్రప్రసాద్, డి.కిరణ్ కుమార్ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వర్గాల మధ్య డీసీసీ పదవికి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గంలోని గద్వాలకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలానికి చెందిన పటేల్ ప్రభాకర్రెడ్డి.. జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత భర్త తిరుపతయ్య, మల్దకల్కు చెందిన నల్లారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్.. సరిత వర్గంలోని నల్లారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 18 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదన 5 జిల్లాల్లోనూ పలువురి మధ్య పోటాపోటీ నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్కుమార్ రెడ్డి, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికల్ మండలం తీలేరుకు చెందిన ఆయనతో పాటు మక్తల్ మండలానికి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ధన్వాడ మండలంలోని గోటూరు నాగేశ్వర్రెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, కోస్గి మండలం పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి సైతం డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బీసీ జేఏసీ నేత మైత్రి యాదయ్యతోపాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే జీర్ణించుకోలేని కొందరు కోర్టుకు పోయి ఆపడం బాధాకరమన్నారు. బీసీ మంత్రులు సుప్రీంకోర్టులో పోరాటం చేసైనా రిజర్వేషన్ అమలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి ఆర్డినెన్సు తెచ్చి జీఓ జారీ చేసిందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, బీసీ ఆత్మగౌరవం కోసం పని చేస్తుందన్నారు. పేదల కోసం మహిళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్రెడ్డి, నాయకులు వినోద్కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, నాయకులు సురేందర్రెడ్డి, చంద్రకుమార్గౌడ్, సిరాజ్ఖాద్రీ, కృష్ణయ్య, గోపాల్, మహేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
‘ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం’
జడ్చర్ల టౌన్: చట్టబద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ వెల్లడించారు. శుక్రవారం జడ్చర్ల ఎమ్మార్సీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీసీ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు కేటాయిస్తామని మోసం చేశారని, ఇప్పుడు అదే తరహాలో 42శాతం రిజర్వేషన్లు అంటూ అమలు చేసే ఉద్దేశం లేకుండా పోయిందన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోయిందని ఆరోపించారు. చట్టబద్ధత కల్పించేందుకు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో రజకసంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నర్సింహులు, విజయ్కుమార్, శ్రీనివాస్, గోపాల్, శివశంకర్ పాల్గొన్నారు. బీసీలు ఇకనైనా మేల్కొనాలి రాష్ట్రం ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేస్తుందని, అందుకే ఇకనైనా మేల్కొనాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్గౌడ్ ప్రకటనలో పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్లంటూ మభ్యపెడుతున్నారని గుర్తించాలన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటీషన్లు వేసినవారు ఎవరో గుర్తించాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ఏం సమాధానం ఇస్తుందని ప్రశ్నించారు. బంగారు షాపులో చోరీకి యత్నం మక్తల్: పట్టణంలో బంగారు షాపులు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో నాలు గు చోట్ల దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గురువా రం రాత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోని బొడ్రా యి ఎదురుగా ఉన్న విష్ణు జ్యువెలర్స్లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. పూర్తి వివరాలు.. స్థానిక విష్ణు బంగారు దుకాణం ముందు భాగాన ఉన్న స్వెటర్ తాళాలు విరగొట్టినా ఎంతకు తెరచుకోకపోవడంతో దుకాణం వెనుక భాగాన ఉన్న గోడకు రంధ్రం వేసేందుకు ప్ర యత్నించారు. దొంగతనానికి అనుకూలంగా లేకపోవడంతో దొంగతనాన్ని విరమించుకున్నారు. దుకాణ యజమాని ముకేశ్ శుక్రవారం ఉదయం దుకాణం తెరిచేందుకు ప్రయత్నించ గా తాళాలు విరగ్గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టా రు. ఈ క్రమంలో బస్టాండ్లో పలువురిని అదుపులోకి తీసుకోని వేలి ముద్రలు తీసుకున్నారు. -
బాదేపల్లి పాఠశాలలో డీఈఓ విచారణ
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో జెర్రి కనిపించిన ఘటనపై శుక్రవారం జిల్లా విద్యాధికారి ప్రవీణ్కుమార్ విచారణ జరిపారు. పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు వేర్వేరుగా డీఈఓను కలిసి వంట ఇక్కడే చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఏబీవీపీ కన్వీనర్ సౌమ్య ఉన్నారు. పీయూకు బంగారు పతకం అందించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యారర్థులు యోగా పోటీల్లో తమ నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని పీయూకు బంగారు పతకం అందించాలని వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు అన్నారు. పీయూలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో ఎంపికై న విద్యార్థులను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు బెంగళూరులోని సవస్య యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనున్నట్లు పీడీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ అధ్యక్షుడు బాలరజాయ్య, సెక్రటరీ రజిని తదితరులు పాల్గొన్నారు. -
యువత నైపుణ్యం పెంచుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణం పెంచుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్మాణ్ ఓఆర్జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యంతో పాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు దక్కాలంటే ఆధునిక సాంకేతికతతో పాటు సరైన పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. దీని కోసం స్థానికంగా టాస్క్, అమరరాజా, సెట్విన్ సంస్థల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మేళాకు సుమారు 20 కంపెనీల ప్రతినిధులు హాజరై.. అక్కడికి వచ్చిన సుమారు 270 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి 120 మందిని ఎంపిక చేశారు. వీరికి ఉద్యోగ స్థాయిని బట్టి కనీస నెల వేతనం రూ. పది వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గద్వాల క్రైం: ఎదురుగా వ స్తున్న వాహనం ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దౌదర్పల్లి కాలనీ కి చెందిన పెద్దయ్య(39) జీవనోపాధి నిమిత్తం గ్యా స్ పొయ్యిలకు మరమ్మతు చేస్తుంటాడు. ఈ శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని గద్వా ల ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్దయ్య వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య గోపాల్పేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రేవల్లి మండలంలోని కేశంపేట పాతతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. రేవల్లి హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపి న వివరాలిలా.. కేశంపేట పాతతండాకు చెందిన నున్సావత్ బౌసింగ్(35), చిట్టి భార్యభర్తలు. వీరు నాలుగేళ్లుగా పిల్లలతో కలిసి హైద్రా బాద్లోనే ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. గురువారం బౌసింగ్ దంపతులు ఇద్దరూ గ్రామానికి వచ్చారు. ఏమైందో తెలియదు.. శుక్రవారం ఉదయం చూసేసరికి బౌసింగ్ తన ఇంట్లోనే ఉరేసుకొని కనిపించాడు. గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బౌసింగ్ అమ్మ తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని హెడ్కానిస్టేబుల్ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నవాబుపేట: క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని జంగమయ్యపల్లికి చెందిన కమ్మరి ఆచారి(46) ఈనెల 4వ తేదీన మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతడి భార్య భారతమ్మ నిత్యం తాగి వస్తావా అంటూ భర్తతో గొడవ పెట్టుకుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో క్షనికావేశంలో ఇంటి మేడపై ఉన్న కలుపు మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వారం రోజులపాటు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయంలో మృతుడి కుమారుడు కమ్మరి పవన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి మద్దూరు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని దోరేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. దోరేపల్లి గ్రామా నికి చెందిన బుడగ జంగం శేఖర్తో కొన్నేళ్ల క్రి తం పద్మమ్మ(35) కు వివాహం జరిగింది. వీరి కి ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పద్మమ్మ తన ఇద్దరు కొడుకులు చదువుతున్న దోరేపల్లి పాఠశాలకు భోజ న సమయంలో వెళ్లి వారికి తినిపించింది. కుమారులు అడిగిన తినుబండారాలను కొని చ్చి తనతో రావాలని కోరింది. కానీ పాఠశాల వేళల్లో విద్యార్థులను పంపమని ఉపాధ్యాయు లు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లింది. అప్పటి నుంచి గ్రామంలో కనిపించలేదన్నారు. శుక్రవారం పాఠశాల సమీపంలో ఉన్న ఊర చెరువులో ఓ శవం బయట పడటంతో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు వెళ్లి చూశా రు. ఎవరూ గుర్తు పట్టకపోవడంతో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన మహిళ భర్త శే ఖర్ను పిలిపించారు. అతను అక్కడికి వెళ్లి చూ డగా.. తన భార్య పద్మనే అని గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. శ వాన్ని మహబూబ్నగర్ ప్రధాన ఆస్పత్రికి పో స్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిసింది. -
పరిహారం ఇస్తారా.. చావమంటరా?
కృష్ణా: సత్యసాయి పంప్హౌజ్ ఎదుట శుక్రవారం ఓ నిరుపేద కుటుంబ సభ్యులు పురుగుమందు డబ్బాతో నిరసన వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. తమకు పరిహారం ఇస్తారా? చావమంటరా? అంటూ హెచ్చరించారు. బాధితుల కథనం ప్రకారం.. గుడేబల్లూర్కు చెందిన బుడ్డమోళ్ల మహేశ్ కుటుంబానికి చెందిన 7గుంటల భూమిని 25ఏళ్ల కిందట సత్యసాయి తాగునీటి పంపుహౌజ్ నిర్మాణానికి ఇచ్చారు. అప్పట్లో సంస్థలో ఒరికి ఉ ద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని.. తీరా ఉద్యో గం కల్పించలేదు, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. మా నాన్న కార్యలయాలకు తిరిగితిరిగి మృతిచెందాడని, ఇప్పుడు కూడా పలుమార్లు సత్యసాయి కార్యాలయాలు, అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తు తం భారత్మాల రోడ్డు నిర్మాణం ఈ భూమి నుంచి (సత్యసాయి నీటిపంపు) వెళ్తుంది. ఆ పరిహారం డబ్బులు బాధిత కుటుంబానికి రావడంలేదు. దీంతో ఆ పరిహారం డబ్బులు మా కుటుంబానికి అందించాలని, ఈ విషయంపై పలుమార్లు మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. దీంతో సహ నం నశించి పంపుహౌజ్ ఎదుట పురుగుల మందుతో బైఠాయించారు. పరిహారం అందిస్తారా లేక ఆత్మహత్య చేసుకోవాల అంటూ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సత్యసాయి నీటిసరఫరా అధికారులు, ఎస్ఐ ఎండీ నవీద్ అక్కడికి చేరుకొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. వారం రోజుల్లో తమకు న్యాయం జరగకపోతే మళ్లీ బైఠాయిస్తామని పేర్కొన్నారు. సత్యసాయి పంప్హౌజ్ ఎదుట బాధితుల నిరసన భారత్మాల పరిహారం మాకే ఇవ్వాలంటూ డిమాండ్ -
రూ.10వేలతో మొదలై రూ.450కోట్ల టర్నోవర్
● శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి ● ఘనంగా శ్రీరామ జయరామ 51వ వ్యవస్థాపక దినోత్సవం పాలమూరు: 1974లో రూ.10వేల పెట్టుబడితో మొదలైన శ్రీరామ జయరామ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రూ.450కోట్ల వార్షిక టర్నోవర్కు చేరిందని సంస్థ అధినేత బెక్కరి రాంరెడ్డి అన్నారు. శ్రీరామ జయరామ 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. ఈ సంస్థల ద్వారా 1200మంది ఉద్యోగులతో కలిసి రైతులకు సేవలు అందిస్తున్నామని, 1984లో మహీంద్ర ట్రాక్టర్ డీలర్ షిప్ తీసుకుని ఇప్పటివరకు 40వేల ట్రాక్టర్లు విక్రయించామన్నారు. ఇదే ఏడాది టీవీఎస్ ద్విచక్ర వాహనాల డీలర్ షిప్ తీసుకుని 20వేల వాహనాలు విక్రయించినట్లు వెల్లడించారు. 2012లో మారుతీ కార్ల డీలర్ షిప్ తీసుకొని ఇప్పటివరకు 20వేలకు పైగా కార్లు విక్రయాలు చేశామన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఆస్పత్రి ద్వారా 3వేల మంది రోగులకు ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. అనంతరం 50 ఏళ్ల యాత్రలో సహకరించిన అందరినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ బెక్కరి జయలక్ష్మి, మహీంద్ర జోనల్ సేల్స్హెడ్ ఇంద్రకంటి అరవింద్, ఏరియా సీనియర్ మేనేజర్ శెట్టి ఉదయ్, డిప్యూటీ మేనేజర్ యాసిప్త్, సంస్థ సీఈవోలు సరసయ్య, విక్రమ్యాదవ్, నాగేంద్ర, మారుతీ షోరూం జీఎం వేణుగోపాల్రెడ్డి, రామకృష్ణ, తుకారం, రామదాసు, శ్రీనివాస్గౌడ్, నవీన్తో 1200మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
క్రీడలకు ప్రాధాన్యం
● ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎన్పీ వెంకటేశ్ ● పాలమూరులో ప్రారంభమైన రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలు ● పాల్గొన్న 28 జిల్లాల జట్లు నల్లగొండ–కొత్తగూడెం బాలికల జట్ల మ్యాచ్ నిర్మల్–మెదక్ బాలికల మ్యాచ్ మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎన్పీ వెంకటేశ్ అన్నారు. పాలమూరులోని ప్రధాన స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి జూనియర్ నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 7వ ట్రెడిషనల్, 3వ ఫాస్ట్–5, 1వ మిక్స్డ్ విభాగాల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. ఈ నెల 12 వరకు టోర్నమెంట్ జరగనుంది. టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎన్పీ వెంకటేష్ హాజరై మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టోర్నీలో 28 జిల్లాల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపునకు శ్రమించాలని సూచించారు. క్రీడా పోటీలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధానకార్యదర్శి కురుమూర్తిగౌడ్ మా ట్లాడుతూ.. క్రీడాకారులకు క్రమశిక్షణ చాలా అవసరమని, కోచ్లు చెప్పే సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బి.విక్రం ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు పట్టుదలతో ఆడి జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బాలికలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడటం సంతోషంగా ఉందని.. ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న యశశ్రీ, లితిషను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయా జిల్లాల జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు విక్రం ఆదిత్యరెడ్డి, శిరీషరాణి, ఖాజాఖాన్, రాజారాం, రామ్మోహన్గౌడ్, అంజద్అలీ, అక్రమ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ విభాగంలో పాలమూరు బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో జిల్లా జట్టు 15–9 పాయింట్ల తేడాతో సిరిసిల్లపై, మరో మ్యాచ్లో 16–1 తేడాతో పెద్దపల్లి జట్టుపై విజయం సాధించాయి. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు 5–1 పాయింట్ల తేడాతో సిరిసిల్ల జట్టుపై గెలుపొందింది. బాలుర విభాగంలో మహబూబాబాద్ జట్టు 15–7 తేడాతో నిజామాబాద్పై, ఖమ్మం జట్టు 16–5 తేడాతో ఆసిఫాబాద్పై, నల్లగొండ జట్లు 14–1 తేడాతో ఆదిలాబాద్పై, వనపర్తి జట్టు 7–1 తేడాతో వరంగల్పై, మెదక్ జట్టు 8–2 తేడాతో నిర్మల్పై గెలిచాయి. బాలికల విభాగంలో మేడ్చల్ జట్టు 14–2 పాయింట్ల తేడాతో ఆదిలాబాద్పై, నల్లగొండ జట్టు 12–4 తేడాతో వరంగల్పై, హైదరాబాద్ జట్టు 4–2 తేడాతో మెదక్పై, కామారెడ్డి జట్టు 4–1 తేడాతో నారాయణపేటపై, కరీంనగర్ జట్టు 6–2 తేడాతో జనగాంపై, మేడ్చల్ జట్టు 6–1 తేడాతో పెద్దపల్లిపై, ఖమ్మం జట్టు 14–2 తేడాతో మహబూబాబాద్పై, నాగర్కర్నూల్ జట్టు 6–3 తేడాతో ఖమ్మంపై, నిజామాబాద్ జట్టు 8–5 తేడాతో కరీంనగర్పై, జగిత్యాల జట్టు 6–1 తేడాతో మంచిర్యాలపై, ఆసిఫాబాద్ జట్టు 10–9 తేడాతో గద్వాల జట్టుపై గెలుపొందాయి. ‘పాలమూరు’ శుభారంభం.. -
అంతా అపరిశుభ్ర వాతావరణమే
టీడీగుట్ట సమీపంలోని కూరగాయల మార్కెట్ మొత్తం అపరిశుభ్రంగా తయారైంది. ఎక్కడబడితే అక్కడ కుళ్లిపోయిన కూరగాయలు, ఆకుకూరలు అలాగే పడేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి అక్కడికి వెళ్లాలంటేనే జుర్రుమంటోంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ వ్యర్థాలను తొలగిస్తే బాగుంటుంది. – రవికుమార్, లక్ష్మీనగర్కాలనీ, మహబూబ్నగర్ అన్ని చర్యలు తీసుకుంటున్నాం నగరంలో పరిశుభ్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. ఓపెన్ ప్లాట్ల లో చెత్త వేయొద్దని లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. దీనిపై మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా వారి నుంచి సరైన స్పందన రావడం లేదు. నగరాన్ని స్వచ్ఛతగా ఉంచటానికి అందరూ సహకరించాలి. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ ● -
‘పొడి’.. తడబడి!
● రాంమందిర్ చౌరస్తా నుంచి వీరన్నపేట రైల్వే ట్రాక్ వరకువెళ్లే దారిలో మూడు, నాలుగు చోట్ల రోడ్డు పక్కన చెత్తాచెదారంపడేస్తున్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఏటా స్వచ్ఛత.. పరిశుభ్రత కోసం ఎన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. దీంతో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రహదారుల పక్కన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అసలే వర్షాకాలం.. ఆపై అపరిశుభ్రత కారణంగా సీజనల్ వ్యాధులు (డెంగీ, మలేరియా, విషజ్వరాలు) ప్రబలుతున్నాయి. వివిధ డివిజన్లలో ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది. ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. సుమారు మూడు లక్షల జనాభాకు క్షేత్రస్థాయిలో 388 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. చెత్తను సేకరించడానికి 75 స్వచ్ఛ ఆటోలు, 12 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఇవేగాక మరో 12 ప్రైవేట్ ట్రాక్టర్లు తిరుగుతున్నా ప్రయోజనం దక్కడం లేదు. నిత్యం 107 మెట్రిక్ టన్నుల చెత్తను కోయిల్కొండ ఎక్స్ రోడ్కు తరలిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏడాది పొడవునా ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని నగర ప్రజలకు మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా స్పందన అంతంత మాత్రమే వస్తోంది. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తున్నారు. అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ కొనసాగినా ఎలాంటి ఉపయోగం లేదు. అడపాదడపా నీటి వనరుల వద్ద, జన సమర్ధ ప్రదేశాలలో చెత్తచెదారం నామమాత్రంగా తొలగించి చేతులు దులుపుకొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో రాష్ట్ర స్థాయిలో మహబూబ్నగర్ గతేడాది నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి పదికి పడిపోవడం గమనార్హం. దీనిని బట్టే చూస్తే ఇక్కడి అధికారులు, సిబ్బంది పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడెక్కడ అంటే..? ‘స్వచ్ఛత’పై నామమాత్రంగానే ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా స్పందన కరువు నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలే దర్శనం.. రహదారుల పక్కన పేరుకుపోతున్న వ్యర్థాలు అసలే వర్షాకాలం.. ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు -
ఆకస్మిక వరదలపై అప్రమత్తంగా ఉండాలి
జడ్చర్ల: వర్షాలు కురిసి వరదలు వస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కిష్టారం– అంబటాపూర్ ప్రధాన రహదారిపై సమీప చెరువు అలుగు ఉధృతిలో వృద్ధ దంపతులు బాలయ్య, రాములమ్మ గల్లంతైన స్థలాన్ని ఆమె పరిశీలించి.. సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగులు, వంకలు దాటుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని, చెరువులు, జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు. అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రహదారిపై అటు ఇటుగా కంప చెట్లు వేసి రాకపోకలను నిలిపివేసినా కొందరు కొనసాగించారని, ఇలాంటి క్రమంలోనే వీరిని కూడా గ్రామస్తులు హెచ్చరించారన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. చెరువులు అలుగులు పారుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా కిష్టారం– అంబటాపూర్ ప్రధాన రహదారిపై ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని, ఇక్కడ వంతెన నిర్మించి రాకపోకలకు వీలు కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఇదిలా ఉండగా.. గల్లంతైన వృద్ధ దంపతుల కోసం సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరవగా కలెక్టర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ వాహనం ఘటనా స్థలానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బైక్పై వెళ్లి సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్కుమార్, జిల్లా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కిషోర్కుమార్, తహసీల్దార్ నర్సింగరావు, ఎంపీడీఓ విజయ్కుమార్ పాల్గొన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్నుంచి అధికారులతో నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కాజ్వేలు, చెరువులు, కుంటలు, రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ప్రవహిస్తున్న చోట అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలన్నారు. మండలాధికారులు ర్యాపిడ్ రెస్క్యూ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి వివరాలను తెలుసుకోవాలన్నారు. జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఎంహెచ్ఓ పద్మజ, డీపీఓ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులపై మాక్ డ్రిల్
తుంగభద్రలో.. మాక్డ్రిల్ను వీక్షిస్తున్న ప్రజలు, విద్యార్థులు అలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో ప్రత్యేక బోట్లతో ఎస్డీఆర్ఎఫ్ బృందాల మాక్డ్రిల్ ప్రకృతి విపత్తలుపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తులు ఎదురైన సమయాల్లో ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు. అలంపూర్లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం సముదాయంలో ఉన్న తుంగభద్ర నదిపై గురువారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసుల సహకారంతో స్థానిక ప్రజలకు, విద్యార్థులకు విపత్తలపై అవగాహన కల్పించారు. ఎన్డీఆఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుంగభద్ర పుష్కరఘాట్ వద్ద తుంగభద్ర నదిలో ప్రత్యేక బోట్ల సహాయంతో మాక్డ్రిల్ నిర్వహించారు. వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. లోతైన నీటి ప్రాంతాల్లో మాక్డ్రిల్ ద్వారా రెస్క్యూ టీం పని విధానాన్ని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్డీఆర్ఎఫ్ కూడా పనిచేస్తున్నట్లు చెప్పారు. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు. నది తీర ప్రాంతంలో ప్రాణనష్టం జరగకుండా ఆలయ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. – అలంపూర్ -
జూరాలకు 84,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 5క్రస్టు గేట్ల ఎత్తివేత ● ప్రాజెక్టు నుంచి 81,547 క్యూసెక్కుల నీరు దిగువకు.. ధరూరు/ఆత్మకూర్: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 78,500క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8.30 గంటల వరకు 84,500 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 5 క్రస్టు గేట్లు ఎత్తి 35,770 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 44,021 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 81,547 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 12 యూనిట్లలో 674 మెగావాట్ల విద్యుదుత్పత్తి జూరాల ప్రాజెక్టు ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం 884.6 అడుగులు దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో గురువారం 884.6 అడుగుల వద్ద 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 35,825, విద్యుదుత్పత్తి చేస్తూ 44,021, సుంకేసుల నుంచి 2,264, హంద్రీ నుంచి 250 మొత్తం 82,360 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,753 మొత్తం 66,068 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.016 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.356 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కోయిల్సాగర్లో.... దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు నుంచి వస్తున్న ఇన్ఫ్లోకు సమానంగా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32.4 అడుగులు ఉండగా, నీటి సామర్థ్యం 2.25 టీఎంసీలుగా ఉంది. రామన్పాడుకు పెరిగిన వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి గురువారం వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కోయిల్సాగర్, సరళాసాగర్ జలాశయాల నుంచి వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై 2 గేట్లు పైకెత్తి 4 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
మల్దకల్: వ్యవసాయ పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన కుమారుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నాగర్దొడ్డిలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలిలా.. నాగర్దొడ్డి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ దంపతులకు కుమారుడు రాఘవేంద్ర(19), కుమార్తె ఉన్నారు. దంపతులు ఇద్దరూ ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈక్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లాలని తండ్రి కుమారుడిని మందలించడంతో మనస్థాపం చెందిన రాఘవేంద్ర పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్సపొందుతూ రాఘవేంద్ర మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం భూత్పూర్: మండలంలోని కప్పెటకు చెందిన పొనకండి సంతోష్ (25) గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ట్రాక్టర్లో ఇసుక నింపడానికి 2025, జూలై 29న ఉదయం గ్రామ సమీపంలోని వాగుకు వెళ్లి మృతిచెందాడు. శరీరంపై గాయాలు ఉండగా.. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే పూడ్చిపెట్టారు. సంతోష్ సోదరుడు శ్రీను ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేరగా గురువారం తహసీల్దార్ కిషన్, పోలీసుల సమక్షంలో వైద్యులు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. సంతోష్ భార్య ఐదేళ్ల కిందటే విడిపోవడంతో కుమారుడు గణేష్ అనాథ ఆశ్రమంలో ఉంటూ 6వ తరగతి చదువుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాక్టర్ యజమానే తన సోదరుడి మృతికి కారణమని శ్రీను ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
కర్ణాటక బస్సుకు తప్పిన ప్రమాదం
మరికల్: రాయిచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తు న్న కర్ణాటక బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం రాయిచూర్ నుంచి వచ్చిన కర్ణాటక బస్సు ఎమ్మోనోనిపల్లి, ఎలిగండ్ల శివారు సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే ఎదురు గా వచ్చిన పశువులను తప్పించబోయి బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 50కి పైగా ప్రమాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఉపిరి పిల్చుకున్నారు. అనంతరం ప్రొక్లెయిన్ సాయంతో బస్సును రోడ్డుపైకి లాగడంతో తిరిగి ప్రయాణికులతో హైదరాబాద్కు తరలివెళ్లింది.చింతరేవులలోమొసలి కలకలంధరూరు: మండలంలోని చింతరేవుల గ్రామ శివారులోని గాదె చెరువులో గురువారం ఓ మొసలి ప్రత్యక్షం అయ్యింది. గ్రామానికి చెందిన రైతు గోవిందుకు చెందిన మేకలు మేత కోసం చెరువు పక్కన తీసుకు వెళ్లగా చెరువులోంచి ఓ మోసలి వచ్చి మేత మేస్తున్న ఓ మేకను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టు పక్కల రైతులు గమనించి మేకను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చెరువులో మొసలి సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కీళ్ల ఆరోగ్యంతో మెరుగైన జీవన ప్రమాణం
పాలమూరు: కీళ్ల ఆరోగ్యంతోనే మనిషి జీవణ ప్రమాణ కాలం పెరుగుతుందని ఎస్వీఎస్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ కేజేరెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కోట్ల మంది నీ–జాయింట్(మోకాళ్ల నొప్పులు) సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ప్రపంచ అర్థరైటీస్ డే సందర్భంగా ఉదయం 7 గంటలకు ఎస్వీఎస్ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ పట్టణంలోని పద్మావతి కాలనీ కమాన్ నుంచి ఎస్వీఎస్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎస్వీఎస్లో తెలంగాణ ఆర్థో సర్జన్స్ అసోసియేషన్(టీవోఎస్ఏ) 400 నుంచి 450 మంది ప్రతినిధులతో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా రివిజన్ సర్జరీలపై చర్చ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ రెసిడెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, వైద్యులు కె.ఎల్ జగదీశ్వర్రావు, ఆంజనేయులు, రవితేజ, శ్రీధర్రెడ్డి, జయరాంరెడ్డి, దివ్య, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఫాంహౌజ్లో హన్వాడ మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ కార్డులు ఇచ్చి చేసిన మోసాన్ని వివరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో గ్రామం, మండలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు చెన్నయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అన్నంలో మెరికలు ఉండడం ఏమిటి ● వంట నిర్వాహకులపై కలెక్టర్ విజయేందిర ఆగ్రహం జడ్చర్ల: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మంచి భోజనం అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం మండలంలోని కోడ్గల్ గ్రామంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా.. అన్నంలో మెరికలు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి భోజనం వండాలని, మెరికలు లేకుండా చూడాలని, భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీ పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంట పాత్రలు శుభ్రంగా వినియోగించాలని, ఆకుకూరలు, కూరగాయల ఎంపిక నాణ్యతగా ఉండాలని సూచించారు. నిబంధనల మేరకు వ్యవహరించాలి నిబంధనల ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని, కోడ్గల్ క్లస్టర్లో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని, హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్కుమార్, తహసీల్దార్ నర్సింగరావు, ఎంఈఓ మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలకు పునాది
కీలక మైలురాయి.. పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్ ఫెసిలి టీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్మెంట్ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్ సెంటర్లో స్టార్టప్ల ఎంటర్ ప్రెన్యూరర్స్ ప్రొటోటైప్ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టిసారించవచ్చు. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ఎంతో ఉపయోగం.. రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పి ంచనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ రూ.25 కోట్ల వ్యయం.. రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్లు, రెండు సెమినార్ హాళ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఇంక్యూబేషన్ సెంటర్ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్, ఇతర ఎక్విప్మెంట్ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో 7 రోజులు.ఇంక్యూబేషన్ సెంటర్.. ల్యాబ్తోపాటు ఇంక్యూబేషన్ సెంటర్ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నూతనంగా ఆవిష్కరణలు చేసే స్టార్టప్లు ప్రారంభించే వారు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాల్లో ప్రొటోటైప్ ఆవిష్కరణలు చేసేందుకు, చేర్పులు, మార్పులు చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఫార్మాలు సైతం అత్యంత ఖరీదైన ప్రయోగాలను ఇక్కడ కొద్దిపాటి ఫీజులు చెల్లించి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అత్యంత ఖరీదైన ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండటంతో ఎలాంటి ప్రయోగాలనైనా తక్కువ ఖర్చుతో చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల యూనివర్సిటీకి సైతం ఆదాయం సమకూరనుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ సైతం ఇందులో ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్ ఫెసిలిటీ భవనం రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం రూ.14 కోట్లతో పరికరాల కొనుగోలుకు అనుమతి ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల ఇంక్యూబేషన్ సెంటర్తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం -
బండరాయి పైనుంచి పడి ఇద్దరు కూలీల మృతి
మహబూబ్నగర్ క్రైం: జీవనోపాధికి వచ్చి.. ప్రమాదవశాత్తు రాయి మీదనుంచి కిందపడి ఇద్దరూ వడ్డెర కూలీలు మృతిచెందినట్లు కోయిలకొండ ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన పెద్ద మౌలాలీ(50), వనపర్తి మండలం కిష్టగిరికి చెందిన వడ్డె కురుమూర్తి(28) కుటుంబాలతోపాటు మరో రెండు కుటుంబాలు కలిసి మూడేళ్ల కిందట కోయిలకొండ మండలం అమరనాయక్తండా సమీపంలో ఇళ్లను అద్దెకు తీసుకుని పంట పొలాలు, గుట్టలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పెద్ద మౌలాలీ, కురుమూర్తి పెద్దగుండుపై రాళ్లు తొలుస్తుండగా.. గుండుజారీ కిందపడడంతో పెద్దమౌలాలీ తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కురుమూర్తిని జిల్లా ఆస్పత్రికి తరలించగా రాత్రి 8:30ప్రాంతంలో మృతిచెందాడు. పెద్దమౌలాలీకి భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. కురుమూర్తికి భార్య ఉన్నది. బుధవారం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ముంబైలో వలస కూలీ మృతి నారాయణపేట రూరల్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన కూలీ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. గ్రామస్తులు కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన కావలి యాదప్ప(45) రెండు దశాబ్దాలకుపైగా ముంబైలో కూలీ పనిచేస్తున్నాడు. సోదరుడు నర్సింహులు వెంట వెళ్లి పని నేర్చుకుని అక్కడే ఉంటున్నాడు. 18ఏళ్ల కిందట నర్సింగమ్మతో పెళ్లి కాగా కూతురు, కూమారుడు ఉన్నారు. కూతరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కూమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. భార్యాపిల్లలు స్వగ్రామంలో ఉండగా పెళ్లి తర్వాత ముంబైలోని అంధేరిలో ఉంటూ మేస్త్రి కింద భవన నిర్మాణ పనులకు వెళ్తుండేవాడు. బుధవారం 14వ అంతస్తులో ప్లాస్టర్ పనిచేస్తుండగా పరంచ కర్ర విరిగి కిందపడ్డాడు. సేఫ్టీబెల్ట్ లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబై వెళ్లారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎనిమిది నెలల క్రితమే కూతురు న్యూరో సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా రూ.3లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పు తీర్చేందుకే మళ్లీ ముంబై వెళ్లాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సంక్షేమం అమలులో ప్రభుత్వం విఫలం
● వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు మహబూబ్నగర్ న్యూటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం అమలులో విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద రూ.12వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఇందిరా మహిళా శక్తి కింద లబ్ధిదారుల ఎంపికలోనూ తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు 120 గజాల ప్రభుత్వ స్థలం కేటాయించడంతోపాటు ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలన్నారు. ఆసరా పింఛను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల చరిత్ర తలదించుకోవడం తప్పా.. తలెత్తుకునేలా లేదన్నారు. కోర్టులో న్యాయమూర్తిని చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడం వారి నైతికతకు నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, మోహన్, హన్మంతు, రాములు, పాండు, శివలీల, యాదయ్య పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇటిక్యాల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన ఇటిక్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవినాయక్ కథనం ప్రకారం.. మండలంలోని సాతర్లకు చెందిన ఈడిగి దేవెందర్ (35) మత్తిస్థిమితం బాగలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుంటుంబ సభ్యులు కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతోయువకుడి ఆత్మహత్యమహబూబ్నగర్ క్రైం: పెళ్లయి ఏడాది.. భార్య గర్భిణి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. రూరల్ 2వ ఎస్ఐ భూపాల్రెడ్డి కథనం ప్రకారం.. నవాబ్పేటకు చెందిన నరేందర్(20) పాలమూరులోని లక్ష్మీనగర్కాలనీ ఫ్యారడైజ్ ఫంక్షన్ హాల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈనెల 7న అర్ధరాత్రి ఫంక్షన్ హాలులో అతను నివాసముండే గదిలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఏడాది కిందట దేవి అనే యువతితో పెళ్లికాగా.. ప్రస్తుతం గర్భిణి. కాన్పునకు తల్లిగారింటికి వెళ్లింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు భార్యకు ఫోన్ చేసి ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా.. దేవి వెంటనే కుటుంబసభ్యులను ఫంక్షన్ హాల్ వద్దకు పంపగా.. అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.రైతు ఆత్మహత్యాయత్నంకోస్గి రూరల్: వ్యవసాయ పొలానికి వెళ్లే దారి విషయంలో దాయాదుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుండుమాల్ మండలంలోని అమ్లికుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. అమ్లికుంటకు చెందిన మాల అంజిలయ్య తమ వ్యవసాయ పొలంలో కూరగాయల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పక్క పొలం దాయాదులు పొలంలోకి వెళ్లేదారిని మూసివేశారు. నాలుగు రోజులు గడుస్తున్నా.. వెళ్లనీయకపోవడంతో పొలం దగ్గరున్న గడ్డిమందును తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి కోస్గి ఆస్పత్రికి తరలించారు. అంజిలయ్య భార్య అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు.ఎనిమిది పాడిఆవుల మృతివెల్దండ: మండలంలోని రాచూర్తండాలో పాత్లావత్ పర్షనాయక్కు చెందిన ఎనిమిది పాడిఆవులు మృతిచెందాయి. రైతు కథనం ప్రకారం.. ఈనెల 3వ తేదీనుంచి ఆవులు ఒక్కొక్కటి మృతి చెందినట్లు వాపోయాడు. రూ.5లక్షలకుపైగానే నష్టం జరిగిందని.. ప్రతిరోజూ పాలుసేకరించి జీవనం సాగిస్తుండగా.. ఒక్కసారిగా ఎనిమిది ఆవులు మృతిచెందడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని తండావాసులు పేర్కొన్నారు. ఈ విషయంపై పశువైద్యాధికారి శ్యామ్సుందర్ను వివరణ కోరగా.. బీరుపిట్టు, కలుషితదాన, అధిక మోతాదులో ముదురు గడ్డి ఇవ్వడంతోపాటు లవణలోపాల కారణంగా మృతిచెంది ఉండవచ్చని పేర్కొన్నారు. మృతికి కారణాల నిర్ధారణకు మహబూబ్నగర్ పశువ్యాధి నిర్ధారణ సంస్థకు రక్తం, పేడ, ధాన, గడ్డి నమూనాలను సేకరించి పరిశీలనకు పంపినట్లు తెలిపారు. మృతిచెందిన ఆవులను పోస్టుమార్టం చేసి పరిశీలించగా కడుపులో జీర్ణంకాని గడ్డి, రక్తంలో మార్పు గమనించినట్లు వివరించారు.అరుదైన వ్యాధితోచిన్నారి మృతిగోపాల్పేట: ఏదుల మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రంజిత్, హైమావతి దంపతుల పెద్దకూతురు కోడిగంటి విహాన(4) అరుదైన వ్యాధితో మృతిచెందింది. విహాన నెల క్రితం ఆటలు ఆడుకుంటూ కింద పడిపోయింది. తల్లితండ్రులు కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాపకు మైటోకాండ్రియా అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. తల్లితండ్రులు విరాళాలు సేకరించి వైద్యం చేయించారు. 15రోజుల క్రితం నిమ్స్లో చేర్పించి ఇటీవల ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది. రూ.25లక్షల వరకు ఖర్చు పెట్టినా పాప బతకలేదని తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం సాయంత్రం ఏదులలో నిర్వహించిన అంత్యక్రియలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజుతోపాటు కొత్తకుమార్, గ్రామస్తులు హాజరై విహాన తల్లిదండ్రులను ఓదార్చారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ కబడ్డీ జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల, బాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. డీఐఈఓ కౌసర్ జహాన్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి అండర్–19 కబడ్డీ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ.. ఎంపికల్లో 80మంది బాల, బాలికలు పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో 12మంది బాలుర, 12మంది బాలికలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈనెల 10నుంచి 12వరకు రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్జీఎఫ్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు బాల్రాజు, జగన్మోహన్గౌడ్, వేణుగోపాల్, మేరీపుష్ప, శ్రీనివాసులు, రమేశ్, మోహన్, భారతి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అండర్–19 బాలుర జట్టు వి.చందు (కెప్టెన్), బి.ఆంజనేయులు, బి.హర్షవర్ధన్, ఎన్.శ్రీకాంత్, ఎస్.దత్తాత్రేయ, ఎం.రాంచరణ్, జె.అనిల్కుమార్, హన్ముంతు, వి.గౌతం, విక్రమ్ నాయక్, ఎస్కె.రాజు, సి.భాస్కర్. ● బాలికల జట్టు: జె.గంగ (కెప్టెన్), కె.భవాని, ఎం.నందిని, పి.సింధూజ, పి.శివానీ, బి.జ్యోత్స్న, ఎస్.సింధు, నాగప్రత్యూష, పి.ఇందేశ్వరి, గాయత్రి, గౌరి, మౌనిక. -
నేటి నుంచి నెట్బాల్ సమరం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం మరో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికకానుంది. స్థానిక మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి నెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. మూడు విభాగాల్లో జూనియర్ విభాగం పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ ట్రెడిషనల్, 3వ ఫాస్ట్–5, మొదటి మిక్స్డ్ బాల, బాలికల పోటీలు జరగనున్నాయి. 9, 10 తేదీల్లో ట్రెడిషనల్ విభాగం, 10, 11 తేదీల్లో ఫాస్ట్–5, 11, 12 తేదీల్లో మిక్స్డ్ విభాగం పోటీలు నిర్వహించనున్నారు. 1200 మంది క్రీడాకారుల రాక ఈ మూడు విభాగాలకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా 1200 మంది బాల, బాలికలు హాజరుకానున్నారు. 130 మంది కోచ్లు, మేనేజర్లు, 80 మంది టెక్నికల్ అషీషియల్స్ రానున్నారు. మహబూబ్నగర్, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మేడ్చల్, జగిత్యాల, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, జనగాం, సిరిసిల్ల, వికారాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, సంగారెడ్డి పాల్గొంటున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఉదయంతోపాటు సాయంత్రం వేళల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్లు జరగనున్నాయి. ఈనెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు టోర్నమెంట్ను ప్రారంభించనున్నారు. క్రీడాకారుల వసతి టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు అంబేడ్కర్ భవన్, స్కౌట్స్ గైడ్స్ భవనం, చైతన్య స్కూల్, లిటిల్ స్కా లర్స్ స్కూల్, మహబూబ్నగర్ హై స్కూల్, మా డ్రన్ పాఠశాలలో వసతి, మెయిన్ స్టేడియంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. టోర్నమెంట్ నిర్వహ ణకు మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. మరో రాష్ట్రస్థాయి క్రీడలకు పాలమూరు ఆతిథ్యం మెయిన్ స్టేడియంలో నిర్వహణ మూడు విభాగాల్లో టోర్నీ హాజరుకానున్న 1200మంది క్రీడాకారులు -
జూరాలకు నిలకడగా వరద
● ప్రాజెక్టుకు 85 వేలక్యూసెక్కుల ఇన్ఫ్లో ● 5గేట్ల ద్వారా శ్రీశైలానికి81వేల క్యూసెక్కుల విడుదల గద్వాల: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో వరదనీరు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పట్టికీ నిలకడగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టులోకి 85,000 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతుండగా 5గేట్లు ఎత్తి 81,804 క్యూసెక్కులను దిగువనున్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి 44,310 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు (1044.488అడుగులు)కాగా ప్రస్తుతం 9.255టీఎంసీల నీటిని నిల్వ చేశారు. సాగునీటి ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్–1, 2, కోయిల్సాగర్, ఆర్డీఎస్, సమాంతర కాల్వలకు నీటిని నిలిపి వేశారు. జూరాల ఎడమ కాల్వకు 1030క్యూసెక్కులు, కుడికాల్వకు 600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుంకేసులకు స్వల్పంగా ఇన్ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 11,250 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును మీటర్ మేర మరో గేటును అరమీటర్ మేర తెరిచి 6,710 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన తెలిపారు. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులు వదలడంతో డ్యాం నుంచి మొత్తం 9,155 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నిర్వీరామంగా విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 393.855 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 381.838 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 775.693 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. శ్రీశైలం గేట్లు మూసివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తిన ఆరు గేట్లను బుధవారం మూసివేశారు. జూరాలలో స్పిల్వే ద్వారా 35,794, విద్యుదుత్పత్తి చేస్తూ 44,310, సుంకేసుల నుంచి 6,710, హంద్రీ నుంచి 250 మొత్తం 87,064 క్యూసెక్కుల వదర శ్రీశైలం జలాశయానికి వస్తున్నది. శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,833 మొత్తం 66,148 క్యూసెక్కుల నీళ్లను సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల వద్ద 212.4385 టీఎంసీల నిల్వ ఉంది. గత 24గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకి 1,390 క్యూసెక్కులను విడుదల చేశారు. భూగర్భకేంద్రంలో 17.097 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.304 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
తాగి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
● వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు ● భార్య, బామ్మర్దులు, అత్త రిమాండ్ వనపర్తి: తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య కేసును రేవల్లి పోలీసులు ఛేదించినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో భార్య, ముగ్గురు బామ్మర్దులు, అత్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. రేవల్లి మండలం చెన్నారానికి చెందిన శివలీలతో పాన్గల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గడ్డం నర్సింహ(35)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూరుతు ఉంది. నర్సింహ ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. శివలీల వనపర్తిలోని ఓ క్లాత్స్టోర్లో పనిచేస్తోంది. భార్య సంపాదనను తాగడానికి ఇవ్వాలని ప్రతిరోజూ గొడవ పడేవాడు. 20రోజుల క్రితం నర్సింహ శివలీలను ఇంటి నుంచి పంపించేయడంతో బామ్మర్ది లోకేశ్ శివలీల, కూతురు దీప్తిని చెన్నారానికి తీసుకెళ్లాడు. శివలీల అక్కడే తల్లితో ఉంటోంది. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన శివలీల తమ్ముళ్లు శశికిరణ్, గంగాధర్, లోకేశ్కు భర్త వేధింపుల విషయం చెప్పడంతో నర్సింహను హత్య చేయాలని పథకం వేశారు. ఈనెల 3న రాత్రి 10గంటల సమయంలో నర్సింహను చెన్నారం గ్రామానికి పిలిపించి ఫుల్లుగా మద్యం తాగించారు. తర్వాత కళ్లలో కారంపొడి చల్లి, చీపురు కట్ట, డంబెల్తో తలపై, వీపుపై బలంగా కొట్టి చంపేశారు. బయటకు అరుపులు వినిపించకుండా ఇంటి బయట స్పీకర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారినుంచి సెల్ఫోన్లు, కారు, బైక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
ప్రియాంక మృతిపై న్యాయ విచారణ చేయాలి
గద్వాల క్రైం: కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన చెందిన ప్రియాంక మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని బుధవారం కుటుంబ సభ్యులు ఆదిలక్ష్మి, రాంబాబు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4న ప్రియాంక విషపు గుళికలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతురాలి నడుము వద్ద మత్తు లేదా పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడంతోనే మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈ విషయమై డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ ప్రియాంక కేసు విషయంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. గద్వాలకు వస్తున్న క్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా.. రోడ్డు మార్గంలో ఆలస్యం తదితర విషయాలపై ఆరా తీస్తామన్నారు. ప్రియాంక ఆత్మహత్యకు ఎవరైన ప్రేరేపించారా.. లేక రఘునాథ్గౌడు కు టుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారా.. మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తుల చేతుల్లో మోసపోయిందా.. ఆర్థికపరమైన రాజీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనలు జరిగాయా.. అనే కోణాల్లో విచారణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం, ఫోరె న్సిక్ ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉందని, వాటి ఆ ధారంగా విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రిమాండ్లో ఉన్నాడని, త్వ రలోనే మరికొందరిపై విచారణ చేపట్టి వారిని సైతం రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ చెప్పారు. -
అనుమానం పెనుభూతమై..
● కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త ● నిందితుడి అరెస్టు.. రిమాండ్ ● డీఎస్పీ లింగయ్య వెల్లడి మక్తల్: అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి హతమార్చిన భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నారాయణపేట డీఎస్పీ ఎన్.లింగయ్య తెలిపారు. బుధవారం మక్తల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మక్తల్ మండలం సత్యవార్కు చెందిన వినోద (35)కు, కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఏడాది గడవకముందే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ కూడా తరచుగా గొడవ పడుతుండే వారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో వినోద తండ్రి సత్యారెడ్డి ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేది. అయితే వినోద భర్త కృష్ణారెడ్డి వారం, పది రోజులకోసారి భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పుడైనా వినోద ఫోన్ బిజీ వస్తే అనుమానం వ్యక్తంచేస్తూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతమై తన భార్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. రెండు, మూడుసార్లు హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. గత నెల 27న దసరా పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్కూటీపై సత్యవార్కు వచ్చిన అతడు.. పథకం ప్రకారం పదునైన కత్తి తీసుకొచ్చాడు. ఈ నెల 3న దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి పొలం వద్ద భోజనాలు చేసేందుకు బయలుదేరారు. అయితే తన స్కూటీ టైరులో గాలి తక్కువగా ఉందని పేర్కొంటూ తన కుమారుడు అక్షిత్రెడ్డిని అత్తగారి వెంట పంపించాడు. ఆ తర్వాత వినోదను స్కూటీపై ఎక్కించుకొని బయలుదేరిన అతడు.. ఫోన్లో తరచుగా ఎవరితో మాట్లాడుతున్నావంటూ మార్గమధ్యంలో గొడవ పడ్డాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడవటంతో పాటు గొంతుకోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి సబ్బు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బుధవారం మహబూబ్నగర్లో నిందితుడి ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన స్కూటీ, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతడిపై హైదరాబాద్లోని పలు పోలీస్స్టేషన్ల్లో కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రాంలాల్, ఎస్ఐలు భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్బాబు, సిబ్బంది అశోక్, నరేశ్, శ్రీకాంత్, శశిధర్గౌడ్, శ్రీహరిగౌడ్ ఉన్నారు. నాలుగు రోజుల్లో నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పిచ్చికుక్క దాడిలోఐదుగురికి గాయాలు
మల్దకల్: మండలంలోని నాగర్దొడ్డిలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన బుధవారం చోటుచేసుకున్నది. బుధవారం ఉదయం గ్రామంలో ఓ పిచ్చికుక్క వీధుల వెంట వెళ్లి ఇళ్ల పరిసరాల్లో ఉన్న షాలిని, తిమ్మప్పతోపాటు మరో ముగ్గురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. గాయపడిన వారిని వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. గాయపరిచిన పిచ్చికుక్కను గ్రామస్తులు దాడిచేసి చంపేశారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద లేకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొనసాగుతున్న ఐటీ దాడులు ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి పక్కనున్న వీకేర్ సీడ్స్ కంపెనీపై ఏపీ, తెలంగాణకు చెందిన ఐటీ అధికారుల మంగళవారం నిర్వహించిన దాడులు బుధవారం కొనసాగాయి. రెండోరోజు ఏకథాటిగా దాడు లు కొనసాగుతున్నాయని, అధికారులు ఎలాంటి సమాచారం తెలుపకపోవడం గమనార్హం. మహిళ మృతిపై కేసు నమోదు గోపాల్పేట: మహిళ మృతిచెందిన విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేశ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ఏదులకు చెందిన కాతోజు గీత(32), రామాచారి భార్యాభర్తలు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటివద్ద భార్యాభర్తలకు చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. క్షనికావేశానికి గురైన గీత ఇంట్లోకి వెళ్లి టర్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక అరుస్తూ బయటికి వచ్చింది. గమనించిన భర్త, పక్కన ఉన్నవారు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయంపై మృతురాలి అన్న నర్సింహాచారి బుధవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని తెలిపారు. -
దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
● డీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐసీసీ నేతృత్వంలో ఓటు చోరీపై సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రతి గ్రామంలో 100 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకుందామని, ఓటు చోరీని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్కుమార్, జహీర్ అఖ్తర్, ఎన్పీ.వెంకటేశ్, వసంత, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, సాయిబాబా, ఫయాజ్, అజ్మత్అలీ, అవేజ్, అబ్దుల్ హక్ పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలకు రాకపోతే బీఫాంలు రావు పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని డీసీసీ అధ్యక్షుడు అన్నారు. కార్యక్రమాలకు కొంతమంది డుమ్మా కొడుతున్నారని, భవిష్యత్లో కాంగ్రెస్ తరపున సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా నిలబడాలనుకునే వారు పార్టీ కార్యక్రమాలకు రాకుండా ఇంట్లో కూర్చొని బీఫాంలు వస్తాయన్నది పగటికల అని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా బీఫాంలు వస్తాయనుకుంటే జరగని పని అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొంటున్నారనే వివరాలను ఏఐసీసీ పరిశీలకులు గమనిస్తున్నట్లు తెలిపారు. అందరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. -
పోలీస్ వ్యవస్థను మెరుగైన స్థితిలో ఉంచాలి
● డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మహబూబ్నగర్ క్రైం: పోలీస్ వ్యవస్థను ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రతి ఒక్క రూ బాధ్యతతో పని చేయాలని జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం డీఐజీ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఉండే అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఇందులో ప్రధానంగా డీపీఓ, ఎస్బీ, డీసీఆర్బీ, ఏఆర్ హెడ్క్వార్టర్స్లలో ఉన్న అన్ని రకాల రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, పారదర్శకత తదితర అంశాలపై తనిఖీ చేపట్టారు. పోలీసు రికార్డులు, రిజిస్టర్లు, ఆఫీస్ ఫైల్స్, బలగాల హాజరు రికార్డులు, ఆయుధ నిల్వలు, వాహనాల సంరక్షణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం డీఐజీ మా ట్లాడుతూ ప్రజలతో అనుసంధానంగా ఉంటూ సకాలంలో సమస్యలపై స్పందించి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్డేట్ చేయాలన్నారు. జిల్లా లో నేరాల నివారణ చట్ట వ్యవస్థ కాపాడటంలో పోలీసులు చూపుతున్న కృషి భవిష్యత్లో మరింత మెరుగైన స్థితిలో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసు లు, ఏవో, ఆర్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే ఎంపీటీసీ స్థానాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మొదటివిడత జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ విజయేందిర రిటర్నింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్ఓ, ఏఆర్ఓలతో వీసీ నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న 8 జెడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఎలాంటి విరుద్ధచర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నోటీస్ జారీ చేసి నిర్దేశిత ప్రాంతంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్తో వీసీ నిర్వహించారు. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసుదన్ నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీపీఓ పార్థసారధి, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి గండేడ్ 10బాలానగర్ 12భూత్పూర్ 10మహమ్మదాబాద్ 10మిడ్జిల్ 9జడ్చర్ల 15రాజాపూర్ 8నవాబుపేట 15 -
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
● రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్నగర్ రీజియన్లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
మన్యంకొండ ఆదాయం రూ.30.36 లక్షలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మన్యంకొండలోని శ్రీలక్షీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కించగా రూ.30,36,630 ఆదాయం వచ్చింది. మూడు నెలల కాలం (జూలై 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు)లో ఈ ఆదాయం దక్కినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరాజు, ఇన్స్పెక్టర్ వీణాధరణి, పాలక మండలి సభ్యులు అలహరి రామకృష్ణ, వెంకటాచారి, అలివేలమ్మ, సుధ తదితరులు పాల్గొన్నారు.తైక్వాండోకు 15 మంది ఎంపికమహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికల తైక్వాండో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 25 మంది హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి తెలిపారు. గురువారం గద్వాలలో ఉమ్మడి జిల్లాస్థాయి తైక్వాండో పో టీలకు 15 మందిని ఎంపిక చేశామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో డీఐఈఓ కౌసర్ జహాన్, పీడీలు వేణుగోపాల్, జగన్మోహన్గౌడ్, తైక్వాండో కోచ్ సురేందర్బాబుపాల్గొన్నారు.రేపు ఎస్జీఎఫ్ వాలీబాల్ జట్ల ఎంపికజడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీహైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఎస్జీఎఫ్ జిల్లా అండర్–17 వాలీబాల్ బాలబాలికల టోర్నీ కమ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి తెలిపారు. హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు, బోనఫైడ్ జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. వివరాలకు పీడీ కల్యాణ్ (94923 53037)ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెల 13వ తేదీన ఇదే ప్రాంగణంలో నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టోర్నీ కమ్ సెలక్షన్స్ పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.స్వల్పంగా పెరిగిన ఉల్లి ధరదేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. రెండు వారాలుగా మార్కెట్కు సెలవుల కారణంగా ఉల్లి వేలం నిర్వహించలేదు. ఈ వారం ఉల్లి వేలం దాదాపు వేయి బస్తాల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. వేలంలో ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,950 ధర పలికింది. రెండు వారాల క్రితం కంటే రూ.250 ఎక్కువ ధర వచ్చింది. కనిష్టంగా రూ.1000 వరకు పలికింది. కాగా.. మధ్యాహ్నం మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్కు రూ.5,622, హంస ధాన్యం క్వింటాల్కు రూ.1,719గా ఒకే ధర నమోదయ్యాయి. -
వినూత్న ఆలోచన..!
● టెండర్లు పెంచడానికి దుకాణాల వారీగా అమ్మకాల వివరాలు వెల్లడి ● సోషల్మీడియాలో వివరాలు పెట్టి.. వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నం మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు బుధవారం 41 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో మహబూబ్నగర్లో 17, నారాయణపేటలో 4, వనపర్తిలో 2, నాగర్కర్నూల్లో 17, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒక టెండర్ వచ్చాయి. 12 రోజుల తర్వాత వనపర్తి, గద్వాల జిల్లాలో దరఖాస్తుల ఖాతా ప్రారంభం కావడం విశేషం. ఇప్పటి వరకు మహబూబ్నగర్, పేటలో కలిపి 21, నాగర్కర్నూల్లో 41, వనపర్తిలో రెండు, గద్వాల జిల్లాలో ఒకటి కలిపి.. మొత్తం 65 టెండర్లు వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని ఎకై ్సజ్ అధికారులు మద్యం వ్యాపారుల్లో టెండర్లు వేయడంలో ఆసక్తి పెంచడానికి వినూత్నంగా ఆలోచనలు మొదలుపెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో దుకాణాల వారీగా జరిగిన మద్యం అమ్మకాల వివరాలను సోషల్ మీడియా, వాట్సప్లలో షేర్ చేస్తున్నారు. దీంతో దుకాణాల వారీగా రెండేళ్ల కాలంలో జరిగిన మద్యం అమ్మకాల ఆధారంగా వచ్చిన లాభాలపై లెక్కలు వేసుకుని టెండర్లు వేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వీడని సందిగ్ధం.. తొలి విడతకు సమాయత్తం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. తుది గడువు అక్టోబర్ 11 అప్పీల్కు చివరి తేదీ అక్టోబర్ 13ఉపసంహరణ అక్టోబర్ 15షెడ్యూల్ ప్రకారం నిర్వహణ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారిగా జిల్లాస్థాయి అధికారి, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరించనున్నారు. మూడు రోజులే గడువు.. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేటినుంచి నామినేషన్ల పర్వం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ ఈ నెల 11 వరకు తుది గడువు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ -
మహోన్నత వ్యక్తి సురవరం
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన జీవితం, ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని, పేదరికం లేని సమాజం కోసం తుదిశ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన ఆలోచనలు, లక్షణాలు, జీ వన విధానాలను అనుసరించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బుధవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో సురవ రం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబీకులు, బంధువులు నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ కొల్లాపూర్లో సురవరం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కుచట్టం సాధించడంలో సురవరం పాత్ర ఎంతో ఉందన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తి.. ఆ సమస్యకు పరిష్కారం కోసం పోరాడిన గొప్ప నాయకుడు అన్నారు. తెలంగాణ సాధనలోనూ కూడా ఆయన పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, సురవరం సుధాకర్రెడ్డి సతీమణి విజయలక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్నర్సింహ, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకేంద్రంలో భారీ వర్షం
● ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు పద్మావతికాలనీలో విరిగి నేలకొరిగిన పెద్ద చెట్టు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి. దీంతో పద్మావతికాలనీలో ఓ పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చి దానిని జేసీబీతో ఒక పక్కకు నెట్టేశారు. ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామయ్యబౌలి, శివశక్తినగర్, బాలాజీనగర్, భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, నాగేంద్రనగర్, గచ్చిబౌలి, గణేష్నగర్, రాయచూర్రోడ్, వల్లభ్నగర్, లక్ష్మీనగర్కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు నిండి పొంగిపొర్లాయి. మెయిన్ రోడ్డు (ఎన్హెచ్–167) పై వరద ఏరులై పారింది. కొత్తబస్టాండు ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులు, వీధుల్లో మురుగుతో వరద కలిసి ఏరులై పారాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
సరళాసాగర్ను సందర్శించిన ఢిల్లీ బృందం
మదనాపురం: ప్రసిద్ధ సరళాసాగర్ ప్రాజెక్టును మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ అధికారుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం, ప్రస్తుతం కొనసాగుతున్న లీకేజీలు, ఉడ్ సైఫన్ భాగంలో నీటి లీకేజీలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్షించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించింది. లీకేజీల నివారణకు అవసరమైన మార్గాలను చర్చించారు. ప్రాజెక్టు ఉడ్ సైఫన్ భాగం, గ్రావిటీ డ్యాంపై ప్రత్యేక దృష్టి సారించి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డ్యామ్ సేఫ్టీ నిపుణులు అశోక్ కుమార్ గంజూ, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ డాక్టర్ పి.రామరాజు, చీఫ్ ఇంజినీర్ టి.ప్రమీల, సీనియర్ ఇంజినీర్ చంద్రశేఖర్తోపాటు జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
11న పీయూలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూని వర్సిటీలో ఈ నెల 11న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అడ్మినిస్ట్రేషన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో బల్క్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామన్నారు. వివిధ ఫార్మా కంపెనీల్లో ఖాళీల భర్తీకి డ్రైవ్ చేపడుతున్నామని.. 2021 నుంచి 2025 విద్యాసంవత్సరం వరకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మ, బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు ఇంటర్మీడియట్, ఐటీఐ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను గూగుల్ ఫాంలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే 200కు పైగా యువత తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ప్లేస్మెంట్ అధికారి అర్జున్కుమార్ (సెల్నంబర్ 98494 45877) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీఆర్వో గాలెన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు మేనేజర్, కోచ్గా జిల్లావాసులు మహబూబ్నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని కలింగ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 40వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ బాలుర అథ్లెటిక్స్ జట్టుకు మేనేజర్గా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర, కోచ్గా సునీల్కుమార్ ఎంపికయ్యారు. వీరు జట్టు క్రీడాకారులతో కలిసి బుధవారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. వీరి ఎంపికపై జిల్లా అథ్లెటిక్స్ సంఘం, సీనియర్ అథ్లెట్లు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ రిమాండ్ గద్వాల క్రైం: దళిత యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, ఆమె మృతికి కారకుడైన కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్ను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కొత్తగూడెం పాల్వంచకు చెందిన దళిత యువతి కోలెటి ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్లో ఉదోగ్యం కోసం శిక్షణ కేంద్రంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందన్నారు. ఈ క్రమంలో రఘునాథ్గౌడ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉదోగ్యం పొందాడు. దీంతో ప్రియాంక తనను వివాహం చేసుకోవాల్సిందిగా రెండు నెలల క్రితం రఘునాథ్గౌడ్, వారి కుటుంబ సభ్యులను కోరగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రియాంక మాత్రం తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చి చిన్నోనిపల్లిలో వారి ఇంట్లోనే ఉంటుంది. రెండు నెలలు అయినప్పటికీ రఘునాథ్గౌడ్, వారి కుటుంబ సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఈ నెల 4న విషం గుళికలను తీసుకొని, గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. యువతి మృతికి కారకులైన కానిస్టేబుల్, వారి కుటుంబ సభ్యులపై గట్టు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఏ–1 రఘునాథ్గౌడ్ను పోలీసుశాఖ సర్వీస్ నుంచి తొలిగించిందన్నారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని అలంపూర్ కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలో మరి కొందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. వారందరిపై ఎస్సీ, ఎస్టీ తదితర బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. కోచ్గా సునీల్కుమార్ మేనేజర్గా శరత్చంద్ర -
రాష్ట్రస్థాయిలో జిల్లాపేరు నిలబెట్టాలి
జడ్చర్ల టౌన్: అండర్–19 ఫుట్బాల్ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నీలో రాణించి జిల్లాపేరు నిలబెట్టాలని ఎంఈఓ మంజులాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మినీ స్టేడియం మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపికలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈనెల 10 నుంచి 12వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికై న 18మందిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శారదభాయి, పీడీ, పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు వడెన్న, కృష్ణయ్య, పీడీలు భానుకిరణ్, మోయిన్, జ్యోతి పాల్గొన్నారు. -
జూరాలకు పెరిగిన ఇన్ఫ్లో
గద్వాల/ఆత్మకూర్: జూరాలకు ఎగువ ప్రాంతాలైన మహరాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. మంగళవారం జూరాలకు 1.33 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 37,206 క్యూసెక్కుల నిటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.83 టీఎంసీల నిల్వ ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్–1, 2, కోయిల్సాగర్, ఆర్డీఎస్, సమాంతర కాల్వలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు. జూరాల ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జోరుగా విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ కేంద్రాల్లో మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. శ్రీశైలం ఆరు గేట్లు ఎత్తివేత దోమలపెంట: జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 77,462, విద్యుదుత్పత్తి చేస్తూ 37,206, సుంకేసుల నుంచి 8,892, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,23,810 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఆరు గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,325 మొత్తం 65,640 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.9 అడుగుల వద్ద 215.3263 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకు 642 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.107 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.350 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. 1.33లక్షల క్యూసెక్కుల వరద 11 గేట్లు ఎత్తివేత శ్రీశైలానికి 1.12 లక్షల క్యూసెక్కులు విడుదల -
నెరవేరనున్న చిరకాల స్వప్నం
జడ్చర్ల: జడ్చర్ల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరేందుకు బీజం పడింది. జడ్చర్లలో ట్రాఫిక్ దిగ్భందనం ఛేదించేందుకు పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనల అడుగులు ముందుకు కదిలాయి. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, జా తీయ రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎంపీ డీకే అరుణతోపాటు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కలిసి జడ్చర్ల బైపా స్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సానుకలంగా స్పందించిన కేంద్రమంత్రి నుంచి తమకు ఓ లేఖ అందిందని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మంగళవారం తమకు వచ్చి న లేఖను విడుదల చేశారు. జడ్చర్ల చుట్టూ, ఓవైపు 44వ నంబర్ జాతీయ రహదారి మరోవైపు 167వ నంబర్ జాతీయ రహదారి ఉండడంతో ఆయా రహదారులను కలిపి జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డును నిర్మించే విధంగా డీపీఆర్(డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించడానికి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా జడ్చర్ల మీదుగా వెళ్తున్న 167 నంబర్ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ను తయారు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళికను రూపొందించి నిధులు మంజూరు చేసేవిధంగా కృషిచేస్తామన్నారు. రెండు జాతీయ రహదారుల ట్రాఫిక్తోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించడంపై ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర ఆఆర్అండ్బీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి, స్థానిక ఎంపీ డీకే అరుణ తదితరులు ఇందుకు సహకరిస్తున్నారని కొనియాడారు. బైపాస్ రోడ్డుతోపాటు నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణతో జడ్చర్ల ముఖచిత్రం మారిపోతుందన్నారు. జడ్చర్లకు బైపాస్ డీపీఆర్కు రంగం సిద్ధం 4 లైన్లుగా 167జాతీయ రహదారికి కూడా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నుంచి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి లేఖ -
రూ.9.77 లక్షలు కాజేశారు
పాన్గల్: సైబర్ క్రైమ్ మోసంలో మండలంలో ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి రూ.9,76,995 నగదును పోగొట్టుకున్న ఘటనపై మంగళవారం కేసు నమోదైనట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండపల్లికి చెందిన కొమారి సరితకు పాన్గల్ ఎస్బీఐలో ఖాతా ఉంది. ఏప్రిల్ 20, 2024న ఆమె మొబైల్ వాట్సాప్కు ఒక లింక్ వస్తే దానిని ఓపెన్ చేసి లింక్ స్క్రీన్ను షేర్ చేసింది. దీంతో ఫోన్పే ద్వారా ఆమె తెలియకుండానే ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 4, 2024 వరకు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.3 వేలు, రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.9,76,995 వరకు డ్రా అయ్యాయి. ఘటనపై ఎస్బీఐ కస్టమర్ కేర్, బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన బ్యాంకు ఖాతా నుంచి నగదును డ్రా చేసిన సైబర్ నేరగాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కొమారి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ మోసంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.మసీద్లో చోరీచిన్నంబావి: మండలంలోని బెక్కం గ్రామంలోని మసీద్లో 14 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని బెక్కం గ్రామంలోని పీర్ల మసీద్ తాళాలు పగులగొట్టి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన స్వీపర్ మసీద్ను శుభ్రం చేసేందుకు వెళ్లగా.. మసీద్లో పీర్ల సామగ్రి లేకపోవడంతో గమనించిన ఆమె వెంటనే గ్రామస్థులకు విషయం తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్ఐ ఘటన స్థలాన్ని డాగ్స్క్వాడ్తో పరిశీలించారు. చోరీపై కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నామన్నారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ కృష్ణ పరిశీలించారు.