Mahabubnagar District Latest News
-
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
అలంపూర్: వానాకాలం పంటకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులు ఏ పొల్లాల్లో ఏ పంట వేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలతో పంట సాగు చేస్తే ఏ పంటలోనైనా అధిక దిగుబడి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన విత్తనాలు నాలుగు రకాల్లో లభ్యమవుతాయని ఏఓ వివరించారు. విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బ్రీడర్, సర్టిఫైడ్, టూత్ ఫూల్ లేబుల్స్లో లభిస్తాయని ఇందులో ఏ రకాన్ని సాగు చేసినా విత్తనంగా మార్చుకోవచ్చని తెలిపారు. బ్రీడర్ విత్తనం.. ఇది అన్నీ రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు తయారు చేసేది ఇలాంటి విత్తనాలే. ఈ విత్తనం వంద శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ ఉంటుంది. ఒక్కో రైతుకు రెండు కిలోల చొప్పున సరఫరా చేస్తారు. ఫౌండేషన్ విత్తనం.. ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు. సర్టిఫైడ్ (ధ్రువీకరించిన) విత్తనం దీన్ని ఫౌండేషన్ విత్తనం నుంచి వేరుగా ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంటుంది. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. ట్రూత్ ఫూల్ లేబుల్ విత్తనం సర్టిఫైడ్ విత్తనం నుంచి ఉత్పత్తి చేసిన ఈ విత్తనాన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ విత్తనాలను ట్రూత్ ఫూల్ లేబుల్ కింద రైతులకు విక్రయిస్తారు. ట్రూత్ ఫూల్ లేబుల్ విత్తనానికి ఆకు పచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్పై ఉండే వివరాలు విత్తన పరీక్ష చేయబడిన తేదీ, ఆ తేది నుంచి 9 నెలల కాల పరిమితిలోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు. గమనించాల్సిన అంశాలు విత్తనం కొనేముందు కనీస మొలక శాతం, జన్యు స్వచ్ఛత, గరిష్ట తేమ శాతం తదితర వివరాలు చూసుకోవాలి. విత్తన సంచిపై లేబుల్తోపాటు సరిగ్గా సీల్ లేకున్నా, విత్తనాలు కొనొద్దు. తేమ అధికంగా ఉన్న చోట, మిర్చి విత్తనాల దగ్గర, సిమెంట్, క్రిమి సంహారక మందులు, ఎరువుల సంచుల వద్ద, సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో నిల్వ చేసిన విత్తనాలు కొనుగోలు చేయొద్దు. అడ్వాన్స్గా విత్తనాలు బుకింగ్ చేయొద్దు రాత్రికి రాత్రి విక్రయించే అపరిచిత వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. అనుమానం వస్తే ఆయా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. పాడి–పంట -
కారులో చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం
చారకొండ: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి సమీపాన జడ్చర్ల–కోదాడ జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్ బీఎన్రెడ్డి నగర్కు చెందిన కారు శుక్రవారం హైదరాబాద్ నుంచి దైవదర్శనానికి కారు డ్రైవింగ్ చేస్తున్న కృష్ణకూమార్తోపాటు ముగ్గురు కుటుంబ సభ్యులు మహిళలు శ్రీశైలం వెళ్తుండగా వంగూరు మండలం శ్రీశైలం ఎక్స్ రోడ్డును గమనించకుండా ముందుగా కోదాడ వైపు మళ్లించారు. రాంగ్రూట్ వెళ్తున్నామని గమనించిన కృష్ణకూమార్ జూపల్లి శివారులో వాహనం నెమ్మది చేయగా.. కారులో నుంచి పొగలు రావడం గుర్తించి అప్రమత్తమై మిగతా ముగ్గురితో సహ కారునుంచి దిగారు. వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి. సమీపాన ఉన్న వ్యక్తులు చూసి ఘటనా స్థలానికి చేరుకొని కల్వకుర్తి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రయాణిస్తున్న వారు పెద్ద ప్రమాదం నుంచి బయట పడడంతో ఊపిరిపీల్చుకున్నారు. అకస్మాత్తుగా బైక్ నుంచి మంటలు వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ సమీపంలోని పెట్రోల్ వద్ద హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి యువకుడు సాయి పెద్దాపూర్కు వచ్చి పనులు ముగించుకొని శుక్రవారం స్వగ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. యువకుడు అప్రమత్తమై బైక్ ఆపి దూరంగా వెళ్లాడు. మంటలు వ్యాపించి ద్విచక్ర వాహనం పూర్తిగా కాలింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. -
ముంపు ముప్పు తప్పేదెన్నడో?
● ముక్కిడిగుండం గ్రామానికి మళ్లీ పొంచి ఉన్న ముప్పు ● ప్రతిఏటా వర్షాకాలంలో గ్రామం చుట్టూ పొంగిపొర్లే వాగులు ● అసంపూర్తి వంతెన నిర్మాణాలతో ప్రజల ఇక్కట్లు కొల్లాపూర్: నల్లమల అటవీ సమీపంలో ఉండే గ్రామం అది. చుట్టూ వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రతిఏటా వర్షాకాలంలో ఆ వాగులు కాస్తా ఉప్పొంగుతుంటాయి. వారం నుంచి పక్షం రోజుల పాటు ముక్కిడిగుండం గ్రామంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న గేమ్యానాయక్ తండాకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతుండంతో దశాబ్దాలుగా తీవ్ర ఇ బ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి రెండు వైపులా ప్రవహించే వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ ఇంజినీర్ల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా నేటికీ ఆ గ్రామానికి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. రెండు బ్రిడ్జిలు నిర్మించారు కానీ.. ముక్కిడిగుండం– మొలచింతలపల్లి గ్రామాల మఽ ద్య ఉడుముల వాగు, ముక్కిడిగుండం– నార్లాపూర్ గ్రామాల మధ్యన పెద్దవాగు ప్రవహిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ రెండు వాగులు రోజుల తరబడి పొంగి పొర్లుతుంటాయి. పెద్దవాగుపై పంచాయతీరాజ్ శాఖ ఎస్డీఎఫ్ నిధులు రూ.9 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో పక్కా ప్రణాళికలు లేకపోవడంతో సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. నార్లాపూర్ నుంచి ముక్కిడిగుండం వెళ్లేదారిలో పెద్దవాగు కంటే ముందుకు దాని పక్కనే మాల వోడికే(చిన్నవాగు) ప్రవహిస్తుంటుంది. రెండు వాగుల మధ్య వంద మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంది. పెద్దవాగు బ్రిడ్జిపైకి చేరాలంటే ముందు చిన్నవాగును దాటాల్సి ఉంటుంది. వర్షాలు వస్తే చిన్నవాగు కారణంగా ప్రజలు ఈ దారి గుండా రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఉడుములు వాగుపై నిర్మించిన బ్రిడ్జికి సరైన అప్రోచ్ లేకపోవడంతో అటువైపుగా వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముక్కిడిగుండం– నార్లాపూర్ గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించాం. అయితే వర్షాకాలంలో చిన్నవాగు(మాలవోడికె) ప్రవాహం కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి రెండేళ్ల క్రితం అధికారులు కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – వెంకటేశ్ పంచాయితీరాజ్ శాఖ ఏఈ మాలవోడికె(చిన్నవాగు) పైన మినీ వంతెన లేదా కల్వర్టు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆ వంతెనను పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జికి అనుసంధానించేలా డిజైన్లు చేశారు. వంతెన నిర్మాణం కోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారుచేశారు. కానీ ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఈ నిర్మాణం పూర్తయితేనే ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండా గ్రామాలకు పూర్తిస్థాయిలో రవాణా సమస్యలు తీరుతాయి. -
ఎరువుల సమతుల్యత పాటించాలి
జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పంటల సాగులో ఎరువుల సమతుల్యతను పాటించి అధిక దిగుబడులను సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ ఆండ్ రీసర్చ్ మేనేజ్మెంట్(ఎన్ఏఏఆర్ఎం)సంస్థ శాస్త్రవేత్త రమేశ్నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్టెబోయిన్పల్లిలో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడిగా అవగాహన లేకుండా రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల ఖర్చుల భారం పెరగడంతోపాటు పంట దిగుబడులు తగ్గడం జరుగుతుందన్నారు. అంతేగాక వాతావరణ కాలుష్యం కలుగుతుందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. రసాయనిక ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక పంట దిగుబడులు, కూరగాయలు సహజత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. రైతులు ఎరువుల వినియోగంపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గోప్యనాయక్, ఏఈఓ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల బీభత్సం
● అలంపూర్ నుంచి పందుల బొలెరో అపహరణ ● శాంతిగనర్లో పోలీసులపై ఖాళీ సీసాలతో ఎదురుదాడి ● మరో కోళ్ల బొలెరోతో కర్ణాటక వైపు పరారీ రాజోళి/అలంపూర్ రూరల్: అర్ధరాత్రి వేళ వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతిగనర్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కర్నూల్–రాయచూరు ప్రధాన రహదారి దద్దరిల్లేలా వారు చేసిన బీభత్సంతో ఒక్కసారిగా అటు అలంపూర్, ఇటు వడ్డేపల్లి మండలాలు ఉలిక్కిపడ్డాయి. సినిమా ఫక్కీలా జరిగిన చేజింగ్లో పోలీసులను సైతం లెక్కచేయకుండా ఎదరుదాడికి దిగి, కోళ్లకు చెందిన బొలేరోతో పరారయ్యారు. సినిమాలోని ఫైట్ సన్నివేశాలను తలపించేలా జరిగిన ఈ ఘటనపై అలంపూర్ ఎస్ఐ రామకృష్ణ, శాంతిగనర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి అలంపూర్ పట్టణంలోని విక్రమ్కు చెందిన పందులతో ఉన్న బొలేరోను అపహరించి శాంతిగనర్ వైపు వస్తున్నారు. విషయం తెలసుకున్న బాధితుడు అలంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శాంతిగనర్ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వాహనం కోసం కాపు కాశారు. శాంతిగనర్లోని పోలీస్స్టేషన్ సమీపానికి వచ్చాక వాహనం టైర్ పంచర్ కావడంతో వారిని గమనించిన పోలీసులు, ఇతరుల సహాయంతో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఖాళీ సీసాలు, రాళ్లతో పోలీసులపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు తేరుకునేలోగా, అదే వాహనాన్ని తీసుకుని శాంతిగనర్లోని పలు కాలనీల్లోకి వెళ్తూ రామాపురం రోడ్డు వైపు వెళ్లి నిలిపేశారు. ఆ వాహనం అక్కడే వదిలేసి అక్కడి నుంచి పొలాల గుండా పరారై ఉంటారని పోలీసులు భావించినప్పటికీ, వారి అంచనాలు తలకిందులు చేశారు. ఎనిమిది మందితో కూడిన దోపిడి దొంగల ముఠా, సమీపంలో ఉన్న మంజుల చికెన్ సెంటర్ దగ్గర కోళ్లను షెడ్డులోకి దించుతున్న బొలేరోను గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ పని చేస్తున్న యువకులపై దాడికి దిగారు. అనుకోకుండా జరిగిన దాడితో వారు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కోళ్ల లోడ్తో ధర్మ అనే వ్యక్తికి చెందిన బొలేరోను తీసుకుని కర్ణాటక వైపు పరారయ్యారు. కాగా, వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను పంపినట్లు ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపారు. ఉలిక్కి పడిన గ్రామాలు ఘటనతో పలు గ్రామాలు ఉలిక్కి పడ్డాయి. ప్రధాన రోడ్డుపై అరుపులు, కేకలతో జరిగిన ఛేజింగులు గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులనే లెక్క చేయకుండా దాడులకు తెగపడే వారి గురించే శుక్రవారం అందరూ మాట్లాడుకోవడం కనిపించింది. కోళ్ల లోడ్తో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లిన దుండగులు అందులో ఉన్న కొన్ని కోళ్లను, బిల్లు బుక్కులను కర్ణాటక పరిధిలోని ఉండ్రాలదొడ్డి శివారులో వదిలేశారు. కాగా, స్థానికులు వాటిని గమనించగా, అప్పటికే చాలా కోళ్లను కుక్కులు తినేశాయని, బిల్లు బుక్కులు ఇక్కడ వదిలేశారని ఆ గ్రామస్తులు మంజుల చికెన్ సెంటర్ యజమాని ధర్మకు ఫోన్ చేశారు. దీని ఆధారంగా కూడా వారు కర్ణాటక వైపు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఎస్పీ శ్రీనివాస్రావుతో సాక్షితో మాట్లాడగా.. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని, ఇలాంటి ఘటనలు గతంలో వనపర్తి జిల్లాలో జరిగాయని, జిల్లాలో చోటుచేసుకోలేదని, త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
ఇటిక్యాల: విద్యుత్ షాక్ త గిలి ప్రమాదవశాత్తు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఉదండాపురంలో జరిగింది. స్థానికులు తెలి పిన కథనం మేరకు.. గ్రా మానికి చెందిన బీసన్న (35) వృత్తిరీత్యా కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఓ రైతు పొలంలో ఉన్న మోటారు పనిచేయకపోవడంతో బీసన్నను సంప్రదించగా రిపేరు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం గద్వాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీసన్నకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు వనపర్తి రూరల్: పట్టణానికి చెందిన యువతి శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో తండ్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన సంధ్య ఇంటర్ సెకండియర్ చదువుతుంది. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువుల దగ్గర, చుట్టుపక్కల తెలిసిన వారి దగ్గర గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై విచారణ గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు నరేష్చారి వ్యక్తి చేసిన సంఘటన గురువారం తెలిసిందే. అయితే బాధితుడు పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులపై ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో సదరు పోలీసులపై ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. బాధితుడు చేసిన ఆరోపణలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ విషయంపై సాక్షి ఉన్నతధికారులను సంప్రదించగా ప్రస్తుతం విచారణ దశలో ఉందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి ఇటిక్యాల: మండల పరిధిలోని వావిలాల గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్ఐ రవిరాథోడ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో 10 మంది పేకాట రాయళ్లతో పాటు, రూ.12,440తో పాటు 10 ద్విచక్ర వాహనాలు పేక ముక్కలు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడిలో సిబ్బంది మహేష్, రాజశేఖర్, దాసునాయుడు, మునర్పాష పాల్గొన్నారు. ఫోర్జరీ సంతకాలతో తీర్మానం మక్తల్ (కృష్ణా): మండలంలోని ముడుమాల్ సర్పంచ్ సభ్యులకు తెలియకుండానే తీర్మానం చేస్తున్నాడని, తమ సంతకాలు తీసుకోకుండానే పేర్లు రాసి ఫోర్జరీ చేస్తున్నాడని ఉప సర్పంచ్ రంగమ్మ, వార్డు సభ్యులు ఆరోపించారు. ఇటీవల చెరువులో పూడిక తీర్మానానికి సంబంధించిన విషయంలో తమకు పేర్లు రాసి సంతకాలు కూడా ఫోర్జరీ చేశాడన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి రాజును వివరణ కోరగా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. -
లైంగికదాడి కేసులో పదేళ్ల జైలుశిక్ష
మహబూబ్నగర్ క్రైం/హన్వాడ: మండలంలో ని సల్లోనిపల్లికి చెందిన అతినమోని వెంకట య్య 2023లో ఓ మహిళపై లైంగికదాడికి పా ల్పడినట్లు కేసు నమోదైంది.ఈకేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన మహబూబ్నగర్ ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కమ్ ఉమెన్స్ కోర్టు జడ్జి అఫ్రోజ్ శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నిందితుడు వెంకటయ్యపై మోపబడిన నేరారోపణలు నిజమని సాక్ష్యాధారాలతో నిరూపితం కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్వపు సీఐ స్వామిగౌడ్, ఎస్ఐ రవినాయక్ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేద్దాం అలంపూర్: విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ పిలుపునిచ్చారు. పట్టణంలో జోగులాంబ అమ్మ వారి సన్నిధిలో విజయ సంకల్ప యాత్ర సభ స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ జోగుళాంబ అమ్మవారి పుణ్య క్షేత్రంలో 29న మహా సంకల్పయాత్ర 101 కార్లతో చేపడుతున్నట్లు తెలిపారు. మహా సంకల్ప సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యదర్శి గుమ్మ గోవర్ధన్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గార్లపాడు భూషణం, నియోజకవర్గం అధ్యక్షుడు తుమ్మల రవికుమార్, జిల్లా కార్యదర్శి చెన్నుపాటి సుబ్బన్న, ఉద్యమకారులు తదితరులు ఉన్నారు. -
మైసమ్మ కటాక్షం ఎవరికో..
ఐదు నెలలుగా కొత్త చెర్మన్ ఎంపికపై ఉత్కంఠ ● వారసత్వానికి జైకొట్టనున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నవాబుపేట: జిల్లాలో ప్రసిద్ధి చెందిన, మండల ప్రజల ఇలవేల్పు పర్వతాపూర్ మైసమ్మ ఆలయ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. జనవరిలో గత పాలకవర్గం పదవీకాలం పూర్తి కాగా.. నాటినుంచి కొత్త చైర్మన్ ఎంపికపై ఊహాగానాలు కొనసాగాతున్నాయి. కాగా, మండలంలోని కాకర్లపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోనే పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఉండగా ఏళ్ల తరబడి అదే గ్రామానికి చెందిన వ్యక్తులకే చైర్మన్ పదవి దక్కుతూ వచ్చింది. కాగా, అదే గ్రామంలో అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులను ఆ పదవి వరిస్తూ వచ్చింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కాకర్ల పహాడ్ కు చెందిన జగన్మోహన్రెడ్డిని చైర్మన్గా నియమించారు. ఆయన పదవి కాలం జనవరిలో ము గిసింది. తాజాగా అదే ఆనవాయితీ ఎమ్మెల్యే కొ నసాగించి అదే గ్రామానికి చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో కొత్త చైర్మన్ కోసం గ్రా మంలో అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ తరుణంలో అదే గ్రామా నికి చెందిన గోపాల్ పేరు తెరపైకి వచ్చింది. కాగా, ఇదే తరుణంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజు పేరు తాజాగా చైర్మన్ రేసులో కొనసాగుతుంది. దీంతో చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెకొంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎలాంటి నిర్ణ యం తీసుకున్న సంచలనంగా మారుతుంది. ఇదే తరుణంలో తాజాగా మైసమ్మ ఆలయ చైర్మన్ పీఠంపై నెలల తరబడి ఉత్కంఠ నెలకొనడంతో ఎమ్మెల్యే సంచలనంగా ఎలాంటి నిర్ణ యం తీసుకుంటారోనని అందరు హడలిపోతున్నారు. ప్రధానంగా మండంలో రెండు నా మినేటేడ్ పదవులు ఉండగా.. ఒకటి మార్కెట్ చైర్మన్, రెండోది మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పదవి. కాగా, మైసమ్మ ఆలయం గ్రేడ్ సైతం పెరగడంతో దాని హోదా పెరిగింది. దీంతో తాజాగా చైర్మన్ విషయం నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో ఆలయం చైర్మన్ పదవి విషయంలో మండల స్థాయిలో ఆలోచించాలని ఎమ్మెల్యే తర్జనబర్జన పడుతున్నాడన్న సందేహం మండల ప్రజల్లో మొదలైంది. దీంతో మైసమ్మ చైర్మన్ పదవిపై ఎన్నడూ లేనంతగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, మైసమ్మ కటాక్షం, ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.. -
తవ్వారు.. వదిలేశారు
జిల్లా జనరల్ ఆస్పత్రి ప్రధాన ముఖద్వారా గేట్ దగ్గర ఇనుప గ్రీల్స్ వేయడానికి భారీ గుంత తవ్వి దాదాపు వారం రోజులు గడుస్తున్న ఇంకా పనులు ప్రారంభించలేదు. ఆస్పత్రి లోపలికి పందులు, కుక్కలు రాకుండా ఉండటం కోసం ఈ ఇనుప గ్రీల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి రోగులు రావడానికి అదే ప్రధాన ద్వారం కావడంతో వారం నుంచి మూసివేయడంతో ఇబ్బందిగా మారింది. దీంతో సెకండ్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఆటోల ద్వారా ఆస్పత్రికి వచ్చే రోగులను బయట గేట్ దగ్గర వదిలివెళ్తున్నారు. – పాలమూరు -
‘గోకారం’ నిర్వాసితులకు న్యాయం చేయాలి
చారకొండ: గోకారం రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని శుక్రవారం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు హైదరాబాద్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు నుంచి మినహాయించాలని 200 రోజులుగా రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పొ ల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ వైస్ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వా సితులు ప్రకాశ్, పర్వతాలు, పెద్దయ్య, శ్రీరా మ్, సంజీవ, రవి, బిక్కు పాల్గొన్నారు. -
క్రికెటర్ల టాలెంట్ వెలికితీసేలా కోచింగ్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా క్రికెటర్ల టాలెంట్ వెలికితీసేలా ప్రత్యేక కోచింగ్ ఇస్తామని హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో పాలమూరు స్రైక్టర్స్ జట్టు క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ చాలా మంది క్రీడాకారులు క్రికెటే జీవితంగా భావించి ఆడుతూ సరైన వసతులు లేక జిల్లాస్థాయిలోనే ఆగిపోతున్నారన్నారు. క్రికెట్ను నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లడానికి టీజీ టీ–20 ప్రారంభించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నుంచి 8 మంది క్రీడాకారులు వేరే ఇతర జట్లకు ఎంపికయ్యారని గుర్తుచేశారు. బాల, బాలికలకు అకాడమీ ఏర్పాటు చేసి మెరుగైన శిక్షణ అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ 13, 14 ఎకరాల్లో మరో గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి కలెక్టర్, ఎమ్మెల్యేను కోరామని, భూమి కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ పాలమూరు స్రైక్టర్స్ జట్టు పరిచయం కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది టీజీటీ–20లో పాలమూరు స్రైక్టర్స్ జట్టు ఇక్కడి మైదానంలో మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నట్ల చెప్పారు. పాలమూరు స్రైక్టర్స్ టీం హెడ్ కోచ్ బెన్జాన్సన్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్న క్రీడాకారుడు పైకి ఎదుగుతాడు అని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడి ప్రతిభచాటాలని కోరారు. కార్యక్రమంలో పాలమూరు స్రైక్టర్స్ ఫ్రాంచైసీ ఓనర్స్ ఫృథ్వీరెడ్డి, చిరంజీవి, వెంకటాద్రిరెడ్డి, అర్జున్, ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, మన్నాన్, ముఖ్తార్అలీ తదితరులు పాల్గొన్నారు. మైదానంలో జట్టు సందడి.. టీజీ టీ–20 లీగ్లో పాల్గొంటున్న ‘పాలమూరు స్రైక్టర్స్ జట్టు’ ఎండీసీఏ మైదానంలో సందడి చేసింది. జట్టు పేరుతో కూడిన ప్రత్యేక బస్సులో క్రీడాకారులు వచ్చారు. జట్టు క్రీడాకారులు మైదానంలోకి రాగానే వందలాదిమంది విద్యార్థులు, క్రీడాకారులు వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. జట్టు క్రీడాకారులు మైదానంలో తిరిగి సందడి చేశారు. వేదికపై పాలమూరు స్రైక్టర్స్ జట్టు ఒక్కోక్క క్రీడాకారుడిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెటర్ షాదాబ్ అహ్మద్ ఆకర్షణగా నిలిచాడు. -
సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
మదనాపురం: మండలంలోని తిరుమలయ్యపల్లి సమీపంలో రాజీవ్భీమా ఫేస్–1 పంప్హౌస్లో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి శనివారం మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతాంగానికి సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, భీమా ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందంలే చూస్తామని హామీ ఇచ్చారు. మోటార్ల ప్రారంభంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మార్కెట్ చెర్మన్ పల్లెపాగు ప్రశాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు పోతుగంటి రాములు, శారద, కొత్తకోట, మదనాపురం మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 29, 30న షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ (పురుషుల డబుల్స్) పోటీలు ఉంటాయని జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో విజేతలకు మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 25లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.98480 85211ను సంప్రదించాలని సూచించారు. ఉపాధి కూలీల సరదా పెళ్లి.. పాన్గల్: ఉపాధికూలీకి వెళ్లిన మహిళలు ఖాళీ సమయంలో మహిళలతో మహిళకు పెళ్లి తంతు జరిగిన ఘటన నిజామాబాద్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు తమ పని ముగించుకొని అందరూ ఒక్క దగ్గర కూర్చున్నప్పుడు ఇద్దరు మహిళలు పెళ్లి తంతు నిర్వహించారు. చెట్ల ఆకులతో అలంకరణ చేసిన పూలదండలు మార్చుకుంటూ పెళ్ళి జరిపించారు. వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పాలమూరు: నషా ముక్త్ భారత్ అభియాన్– వికసిత్ భారత్కి పేహచాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాలమూరు మెడికల్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై చర్చ పోటీ నిర్వహించారు. ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని డ్రగ్స్ నియంత్రణపై బృంద చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ సమయంలో తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులు కాకుండా లక్ష్యం వైపు ప్రయాణం సాగించాలన్నారు. ప్రధానంగా మెడికోలు డ్రగ్స్, గంజాయి వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వారిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, వైద్యులు పావని, సుధాకర్, ప్రియాంక, జిషాన్, నెహ్రూ, అనూష తదితరులు పాల్గొన్నారు. ● నగరంలోని పాత అర్బన్ హెల్త్ సెంటర్ను శుక్రవారం డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సందర్శించారు. ఫ్రైడే– డ్రైడేలో భాగంగా పలు ఇళ్లను సందర్శించి ఇంటి పరిసరాల శుభ్రతతోపాటు నిల్వ ఉన్న నీరు, సంపులు పరిశీలించి అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించాలని డీపీఆర్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. 12ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజాసంక్షేమం పేరిట దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ విభాగం శుక్రవారం స్థానిక ఓ కన్వెంషన్ హాల్లో ప్రత్యేక వార్తాలాప్ మీడియా వర్కుషాపు నిర్వహించారు. జ్యోతిప్రజ్వల చేసిన డీపీఆర్ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృత్రిమ మేధ, డిజిటల్ సమాచార యుగంలో వాస్తవ నిర్ధారణ, బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించారు. పీఐబీ హైదరాబాద్ విభాగం మీడియా, కమ్యూనికేషన్ అధికారి గాయత్రి వార్తాలాప్ కార్యక్రమ విశిష్టత గురించి వివరించారు. అలాగే డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్–చెకింగ్, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంపై ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్చారి, పాత్రికేయులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా చెట్లకొమ్మల కొట్టివేత
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల కొట్టివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు గాను వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు ప్రక్రియ శుక్రవారం రెండోరోజు కొనసాగింది. ఇందులో భాగంగా బాలాజీనగర్, భూలక్ష్మీకాలనీ, ఆదర్శ్ నగర్, డబుల్ బెడ్రూం కాలనీ, మధురానగర్, శ్రీకృష్ణకాలనీ, బీకేరెడ్డి కాలనీ, ఫాతిమా స్కూల్, జేపీఎన్సీఈ కాలేజీ, బైపాస్ రోడ్డు, నాగిరెడ్డి కాలనీ, నాగేంద్రనగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్కో నగర ఏడీ థావుర్యానాయక్ నేతృత్వంలో చెట్ల కొమ్మల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాలకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అలాగే లోఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని, లోఓల్టేజీ ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
ఆకట్టుకుంటున్న చేనేత ప్రదర్శన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కళా సిల్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన రంగురంగుల వస్త్రాలు ఒకేచోట ఉండటంతో కొన్ని రోజులుగా కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత అల్లికలతో తయారు చేసిన సిల్క్, కాటన్ వస్త్రాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ, మూగా, కోసా, ఎరి, బాగల్పూర్ సిల్క్, టస్సర్ ఉన్నాయి. అలాగే హర్యానా బెడ్, కుషన్ కవర్లు, డోర్ కర్టెన్లు, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. కాగా, చేనేత వస్త్రాలు, హస్తకళలను అందరూ ప్రోత్సహించాలని ఎగ్జిబిషన్ మేనేజర్ బిజు మండల్ ఒక ప్రకటనలో కోరారు. -
అద్దెకార్ల ‘ఓనర్ల’ గోస
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకార్ల యజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలనే ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుండటం, ఆ అరకొర బిల్లులు కూడా సకాలంలో విడుదల కాక పోవడంతో వాహన యజమానులు అప్పుల ఊబీలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవసరాల కోసం సుమారు 130కి పైగా అద్దె వాహనాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్లు, ఇతర కీలక శాఖల అధికారులు అద్దె వాహనాలనే వాడుతున్నారు. అయితే, అద్దె గిట్టుబాటు కాకపోవడం, నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కొందరు యజమానులు తమ కార్లను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో చేసేదిలేక కొన్నిశాఖల అధికారులు సొంతంగా వాహనాలను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అధికారుల కార్ల అద్దెకు సంబంధించిన ధరలను చివరిగా 2017 జులైలో నిర్ణయించారు. ఒక్కో వాహనం నెలకు 2500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం నెలకు కేవలం రూ.33 వేలు మాత్రమే చెల్లిస్తోంది. 2017లో లీటర్ డీజిల్ ధర కేవలం రూ.58, ప్రస్తుతం ధర రూ.104 ఉంది. కానీ ఆనాటి అద్దెనే ఇప్పటికీ చెల్లిస్తోంది. ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.33 వేలలోనే డీజిల్ ఖర్చు, డ్రైవర్ వేతనం, కారు మెయింటెనెన్స్ (రిపేర్లు, టైర్లు, సర్వీసింగ్) అన్నీ చూసుకోవాలి. డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో, ప్రభుత్వం ఇచ్చే అద్దెలో సగానికి పైగా ఇంధనానికే సరిపోతోంది. కారు కరెక్ట్గా తిరిగితే యజమానికి రూపాయి కూడా మిగలని పరిస్థితి ఉంది. సంబంధిత శాఖ అధికారుల దయాదాక్షిణ్యాలపైనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 నాటి అద్దెలే నేటికీ కొనసాగింపు నాడు లీటర్ డీజిల్ రూ.58, ఇప్పుడు రూ.104 ధరల పెంపును పట్టించుకోని ప్రభుత్వం.. సంవత్సరాలుగా బిల్లులు కూడా పెండింగ్ వాహనాలనుఉపసంహరించుకుంటున్న యజమానులు అప్పుల్లో యజమానులు.. పెరిగిన ధరలతో ఒకవైపు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రభుత్వం గడిచిన 8 నెలలుగా.. ఎస్సీ అభివృద్ధి శాఖలో 32నెలల నుంచి, ఈజీఎస్లో 36నెలల నుంచి అద్దె బకాయిలను విడుదల చేయలేదు. దీంతో డీజిల్ పోయించడానికి, డ్రైవర్లకు జీతాలు ఇవ్వడానికి, చివరికి తమ కుటుంబాలను పోషించుకోవడానికి కూడా యజమానులు భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు ఇస్తే, అప్పుడు ఆ డబ్బును తెచ్చిన అప్పులకే కట్టేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యావసరాలు, వాహన విడి భాగాలు, ఇంధన ధరలు భారీగా పెరిగినందున.. అందుకు అనుగుణంగా కార్ల అద్దెను పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
సారూ.. ఇదేం తీరు
● మిషన్ భగీరథ నీటిని తాగని అధికారులు ● స్వచ్ఛమైన నీరు అని చెప్పేవారే తాగకపోవడమేంటి? ● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ● అధికారులు, సిబ్బంది తీరుపైసర్వత్రా విమర్శలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి.. పలుమార్లు శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం.. ఈ నీటిని తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారని చెప్పే అధికారులు.. వారే ఆ నీటిని తాగకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతుండటం గమనార్హం. దీనిపై చెప్పేవారే పాటించకపోతే ఎలా అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 423 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 1,214 ఓవర్హెడ్ ట్యాంక్ల నుంచి 1,58,134 నల్లాల ద్వారా ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఆ నీటిని కార్యాలయ అధికారులు, సిబ్బంది తాగకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని తెప్పిస్తున్నారు. ఇలా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను అధికారులే వినియోగిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా ఆ నీరు తాగడం లేదంటే.. భగీరథ నీటిపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లిస్తున్నారో.. సొంత డబ్బులు వెచ్చిస్తున్నారో తెలియాల్సి ఉంది. కలెక్టరేట్లో సైతం.. జిల్లా సమీకృత కలెక్టరేట్లో దాదాపు 44 శాఖలకు సంబంధించిన జిల్లా ప్రధాన కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో కలెక్టరేట్కు నిత్యం ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నుంచి ఆటో ట్రాలీ వస్తుంది. పెద్ద ట్యాంకర్లో నీటిని తీసుకువచ్చి క్యాన్లలో నింపి కార్యాలయాల్లోకి పంపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ మినరల్ వాటర్నే అధికారులు, సిబ్బంది తాగుతున్నారు. అలాగే కలెక్టరేట్లోని అధికారిక నివాసాలకు సైతం భగీరథ వాటర్ కనెక్షన్లు ఇచ్చినా వినియోగించకపోవడం గమనార్హం. కలెక్టరేట్లో మినరల్ వాటర్ను క్యాన్లలో నింపుతున్న నిర్వాహకుడు -
కొనసాగుతున్న నీటి పంపింగ్
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపుల ద్వారా నీటి పంపింగ్ కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోలు పూర్తిగా తగ్గిందందని పీజేపీ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రాజెక్టుకు కేవలం 267 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, భీమా లిఫ్టు –1 ద్వారా 893 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 157 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2 వేల 593 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.481 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఒక గేటు ద్వారా నీటి విడుదల రాజోళి: సుంకేసుల డ్యాంలో ఒక గేటు ద్వారా నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శుక్రవారం ఎగువ నుండి 3050 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, ఒక గేటును అరమీటర్ మేర తెరిచి 2,248 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్ కు 150 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల బాట
మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ, ఎస్టీ యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఆర్థికంగా బలపడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, అవకాశాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ (ఎన్ఎన్ఎస్హెచ్), డిక్కీ తెలంగాణ చాప్టర్ సంయుక్తంగా శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన పారిశ్రామికవేత్తల అవగాహన, ప్రత్యేక వెండర్ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీవర్గాల యువత పారిశ్రామిక రంగంలో ముందుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అనంతరం పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధి, విధానాలను నిపుణులు వివరించారు. కార్యక్రమంలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ తెలంగాణ– ఏపీ ప్రతినిధి సురేష్, డిక్కీ తెలంగాణ అధ్యక్షుడు సీతారాం, నెక్ట్స్ జెన్ కోఆర్డినేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం సూచించారు. డీఐసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ యువత అర్హతలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ సేవలు, రిటైల్ వ్యాపారాలు, నెట్ వర్కింగ్ సేవలు తదితర రంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి అవకాశాలను సృష్టించడమే గాక ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. యువత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. -
వేదిక మార్చేశారు!
పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. 15 కమిటీల ఏర్పాటు.. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు . ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. సీఎం సారూ.. ఇటు చూడండి పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీయూలో జాతీయ సెమినార్నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మొదట్లో యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు -
క్రమం తప్పకుండా జీతాలు
● మల్టీపర్పస్ వర్కర్లకు మంచి రోజులు ● సీఎం ప్రకటనపై కార్మికుల హర్షం ● జిల్లావ్యాప్తంగా 1,577 మందికార్మికులకు మేలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మల్టీపర్పస్ వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా ఒకటో తేదీనే వేతనం చేతికి అందనుంది. ఈ విషయం స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలకోసారి జీతాలు రావడంతో కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడేవారమని, ఇకపై ఆ ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. 500 మంది జనాభాకు.. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు ఉండగా.. 1,577 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి 500 మంది జనాభాకు ఒకరు చొప్పున గత ప్రభుత్వం వీరిని నియమించింది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి ప్రతినెలా రూ.9,500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా.. వీరు చెత్త సేకరించడం, మురుగు కాల్వలు శుభ్రం చేయడం, తాగునీటి మోటార్లు నడిపించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయడం, గ్రామాల్లోని పాఠశాలలతోపాటు రోడ్లను శుభ్రం చేయడం, రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పట్టడం వీరు చేస్తారు. గడియ తీరిక లేకుండా పనులు చేస్తున్నా వీరికి నెలకు రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. అంటే రోజుకు రూ.316 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రెండు, మూడు నెలలకోసారి అందజేస్తున్నారు. దీంతో పండుగలు, ఇతర శుభకార్యాలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కార్మికులకు సైతం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో కార్మి కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల నుంచే.. కార్మికులకు ప్రతినెలా ఒకటిన వారి అకౌంట్లలో వేతనాలు జమ చేయాలని ప్రభుత్వం నుంచి గతంలో ఆదేశాలు రావడంతో అధికారులు మల్టీపర్పస్ వర్కర్ల బ్యాంకు ఖాతాలను తీసుకొని ఆన్లైన్ చేశారు. అయితే వివిధ కారణాలు చూపుతూ ఆర్థికశాఖ కార్మికుల అకౌంట్లలో జీతం వేయడం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో పంచాయతీ నిధుల్లో జమ అయిన డబ్బులను డ్రా చేసి కార్మికులకు ఇచ్చే బాధ్యత కార్యదర్శులకు అప్పగించినట్లు సమాచారం. కాగా.. మే నెలకు సంబంధించి విధులు నిర్వర్తించిన కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖకు ఆర్థికశాఖ అధికారులు పంపించారు. దీంతో ఈ నెల నుంచే కార్మికులకు ప్రతినెలా వేతనాలు రానున్నాయి. వచ్చేనెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతినెల ఒకటిన వేతనాలు చెల్లిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
మాదకద్రవ్యాల కట్టడికి సమష్టిగా కృషి
● ఎస్పీ జానకి పిలుపుమహబూబ్నగర్ క్రైం: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్ను శుక్రవారం ఆమె సందర్శించి.. వైద్య సేవలు, ఇతర సమస్యలపై ఆరాతీశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురై చికిత్స కోసం ఎంతమంది వస్తున్నారు..? ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు..? చికిత్స తర్వాత వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయని తెలుసుకున్నారు. అనంతరం కొద్దిమంది రోగులతో ఎస్పీ మాట్లాడి వైద్యసేవలతోపాటు కౌన్సిలింగ్ విధానం, కుటుంబ సభ్యుల సహకారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారినపడిన వారిని నేరస్తులుగా కాకుండా సరైన మార్గదర్శనం, చికిత్స, కౌన్సెలింగ్ అవసరమైన బాధితులుగా చూడాలన్నారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వారిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వంటి సరఫరా లేదా వినియోగం చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా ఆజ్మీ రా, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిల్రాజ్, ఆర్ఎంఓ దుర్గ, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, వాహనదారులు అన్ని రకాల డాక్యుమెంట్స్ వెంట పెట్టుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి వివరాలు పరిశీలించడంతోపాటు సరైన పత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఆరు ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘ట్రేడ్ లైసెన్స్’పై దృష్టి ఏదీ?
● 2017 నాటి అద్దెలే నేటికీ కొనసాగింపు ● నాడు లీటర్ డీజిల్ రూ.58, ఇప్పుడు రూ.104 ● ధరల పెంపును పట్టించుకోని ప్రభుత్వం.. పాలమూరు స్ట్రైకర్స్ జట్టుతో హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి, ఓనర్లు, ఎండీసీఏ ప్రతినిధులు – వివరాలు10లో.. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు దుకాణదారులు తమ వ్యాపారం సరిగా నడవడం లేదని మధ్యలోనే శాశ్వతంగా మూసేసినా అధికారులకు మాత్రం సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పాత బకాయిల పేరిట అలాగే ఉండిపోతోంది తప్పా వసూలు కాక మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కరోన కాలం (2020–21)లో నష్టాలు వచ్చాయని, ఆ తర్వాత కూడా సరిగా వ్యాపారం నడవడం లేదంటూ నగరంతో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల పరిధిలో కొన్ని దుకాణాలు శాశ్వతంగా మూసివేశారు. ఇందులో కొందరు మాత్రమే ఆయా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఈ ఫీజు వసూళ్లలో తగ్గుదల కనిపిస్తోంది. వాస్తవానికి ఈ మూడేళ్లలో వందలాది కొత్త దుకాణాలు వెలిశాయి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తేనే ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫీజు వసూళ్ల తీరు ఇలా.. ● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5,285 దుకాణాలు నమోదు కాగా 2026–27కు గాను రూ.1,12,40,000 తో పాటు పాత బకాయిల కింద రూ.2,04,33,000 కలుపుకొని మొత్తం రూ.3,16,73,000 రావాల్సి ఉంది. ఇందులో 1,046 మంది నుంచిరూ.53,91,000 అలాగే పాత బకాయిల కింద రూ.8,02,000 కలుపుకొని మొత్తం రూ.61,93,000 (19.56 శాతం) మాత్రమే రాబట్టారు. ఇక 2025–26కు గాను 5,276 దుకాణాల నుంచి మొత్తం రూ.3,71,44,000 రావాల్సి ఉండగా.. రూ.1,33,06,000 (35.83 శాతం) మాత్రమే వసూలు చేశారు. అలాగే 2024–25లో 4,779 దుకాణాల నుంచి రూ.2,29,67,000 రావాల్సి ఉండగా.. కేవలం రూ.75,34,000 (32.81 శాతం) రాబట్టారు. ● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 816 దుకాణాలు నమోదు కాగా 2026–27కు గాను రూ.27,52,000తో పాటు పాత బకాయిల కింద రూ.28,50,000 కలుపుకొని మొత్తం రూ.56,02,000 రావాల్సి ఉంది. ఇందులో 279 మంది నుంచి రూ.15,55,000 అలాగే పాత బకాయిల కింద రూ.2,99,000 కలుపుకొని మొత్తం రూ.18,54,000 (33.1 శాతం) మాత్రమే వసూలుచేశారు. 2025–26లో 925 దుకాణాల నుంచి మొత్తం రూ.65,06,000 రావాల్సి ఉండగా.. రూ.32,39,000 (49.78 శాతం) మాత్రమే రాబట్టారు. ● భూత్పూర్ పరిధిలో 266 దుకాణాలు నమోదు కాగా 2026–27కు రూ.10,78,000తో పాటు పాత బకాయిల కింద రూ.12,36,000 కలుపుకొని మొత్తం రూ.23,14,000 రావాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం రూ.5,01,000 (21.61శాతం) మాత్రమే రాబట్టారు. 2025–26లో 268 దుకాణాల నుంచి రూ.18,71,000 రావాల్సి ఉండగా.. రూ.6,10,000 (32.60 శాతం) మాత్రమే వచ్చింది. అద్దెకార్ల ‘ఓనర్ల’ గోస – వివరాలు 10లో.. క్రికెటర్ల టాలెంట్ వెలికితీసేలా కోచింగ్ హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి పాలమూరు స్రైక్టర్స్ జట్టు క్రీడాకారులకు ఘన స్వాగతం – మహబూబ్నగర్ క్రీడలు ఏటేటా అంతంత మాత్రమే ఫీజు వసూలు నగరంలో దుకాణదారుల అవగాహన లోపం శాశ్వతంగా మూసేసినా సమాచారం ఇవ్వని తీరు క్షేత్రస్థాయిలో సరిగా తనిఖీలు చేయని మున్సిపల్ అధికారులు -
నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు మార్గనిర్ధేశం చేయాలని ఓయూ ప్రొఫెసర్ పద్మావతి సూచించారు. పీయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాజెక్టులకు సంబంధించిన వైవోస్ గురువారం పూర్తయ్యాయి. ఈ మేరకు పీయూలో విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించగా.. ఓయూ ప్రొఫెసర్ పద్మావతి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజం అవసరం మేరకు ప్రాజెక్టులు, పరిశోధనలు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన, శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకునే విధంగా ఎదగాలని సూచించారు. పలువురు విద్యార్థులు ప్రాజెక్టులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, హెచ్ఓడీ నూర్జహాన్, కోఆర్డినేటర్ రామ్మోహన్, సిద్ధమారగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ కార్మికుల మహాసభల సందడి
● పాలమూరులో 20 నుంచి రాష్ట్ర మహాసభలు ● రాష్ట్ర నలుమూలల నుంచి 700 మంది ప్రతినిధులు ● రేపు బహిరంగ సభ.. హాజరుకానున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ మహబూబ్నగర్ రూరల్: వ్యవసాయ కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్నగర్ పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు తెలిపారు. మహాసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంతో పాటు దేశ నలుమూలల నుంచి సుమారు 700 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా 20 న భారీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ ఉంటుందన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1934లో ఏర్పడ్డ తమ సంఘం వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల్లో కోతలు విధించడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నప్పటికీ, పేదల సమస్యల పరిష్కారంపై సరైన దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. మహాసభల్లో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీల సమస్యలు, పేదల సంక్షేమ అంశాలపై మొత్తం 22 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆహ్వాన సంఘం కోశాధికారి ఎ.రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, నాయకులు హన్మంతు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని మయూరి ఎకో అర్బన్ పార్కులో మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రకృతి సందపను రక్షించాలన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలో పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో కనీసం లక్ష మొక్కలు నాటేటా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, నగర స్థాయిలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు నియోజకవర్గంలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రజలో చైతన్యం కల్పించాలన్నారు. అలాగే మయూరి పార్కును పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబడతామన్నారు. పార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, జోగుళాంబ జోన్ అటవీ సంరక్షణ అధికారి శివాల రాంబాబు, డీఎఫ్ఓ శివ ఆశీష్సింగ్, శిక్షణ అదనపు కలెక్టర్ సాయి శివాని, నగర మేయర్ జి.మమత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
ట్యాంకర్ డ్రైవర్కు 14 రోజుల జైలుశిక్ష
అడ్డాకుల: మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. మూసాపేట ఎస్ఐ ఎం.వేణు వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం తూముకూరు జిల్లా గర్రాని గ్రామానికి చెందిన జీవీ.శివకుమార్ (29) గాయత్రి డెయిరీకి చెందిన మిల్క్ ట్యాంకర్ను నడుపున్నాడు. బుధవారం కర్ణాటకలోని బల్లూర్ నుంచి మిల్క్ ట్యాంకర్ను హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్రైవర్ శివకుమార్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో తేలడంతో కేసు నమోదు చేసి గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధించారు. ఆరు నెలలు జైలు శిక్ష కొల్లాపూర్ రూరల్: భూతగాదాల ఘర్షణలో ముగ్గురు దోషుల కు ఆరు నెలలు జైలు శిక్ష రూ.18వేలు జరిమానా విధిస్తూ గురువారం కొల్లాపూర్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ నాయమూర్తి ఆర్ శరణ్య తీర్పు వెలువరించారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పెంట్లవెల్లి ఎస్ఐ పవన్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిరిష, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ అభిషేక్ రెడ్డి, కోర్డు కానిస్టేబుల్ హనుమంతును ఎస్పీ అభినందించారు. -
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
కందనూలు: ‘‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పదేళ్ల పాలనలో తెలంగాణ ఎట్లుండే.. రెండున్నరేళ్లలో తెలంగాణ ఎట్లయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు’’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిల్లాకు మెడికల్ కాలేజీ, నూతన కలెక్టరేట్, పోలీసు కార్యాలయం ఇలా జిల్లా అభివృద్ధి పథంలో పయనించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పడకేసిందని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగి.. అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలోనూ అదే జరుగుతుందని అన్నారు. పోలింగ్ బూత్ల వారీగా బలమైన కేడర్, కమిటీలు నిర్మాణమై ఏ ఒక్క ఓటు చోరీ కాకుండా చూడాలన్నారు. పార్టీ పరంగా నియామకమయ్యే బీఎల్ఏలు, ఎన్నికల సంఘం నియమించే బీఎల్ఓలకు సహకారం అందించాలని సూచించారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నీటి కేటాయింపులు సరిగ్గా జరగలేదని.. ప్రాజెక్టులకు భూసేకరణ చేయలేదని మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 25వేల ఎకరాల భూసేకరణ జరిగిందని.. ఇంకా 300 ఎకరాల భూ సేకరణ మాత్రమే మిగిలి ఉందన్నారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీ నివాసులు, రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యా దవ్, సభ్యత్వ ఇన్చార్జి జహంగీర్ ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
వాటర్ ట్యాంక్ పై నుంచి యువకుడి ఆత్మహత్యాయత్నం
గద్వాల క్రైం: ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకంపై జిల్లా కేంద్రంలోని ఓ బాధితుడు వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి బలవన్మరణానికి యత్నించిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడు కథనం మేరకు.. బీసీ కాలనీకి చెందిన నరేష్ కుటుంబ వ్యవహారంలో ఏఆర్ కానిస్టేబుల్ బాలు తీరు వివాదస్పదంగా మారిందని కలత చెందినట్లు తెలిపాడు. కొన్ని రోజులుగా వ్యక్తిగత విషయాల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితుడు నరేష్ జిల్లా ప్రభుత్వాస్పత్రి వెనకాల ఉన్న వాటర్ ట్యాంక్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ శ్రీను అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు క్షేమంగా కిందకు వచ్చాడు. ఈ విషయంపై విచారణ చేపట్టి ఏఆర్ కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
రైతులకు సాగునీరందించడమే లక్ష్యం
చిన్నచింతకుంట: రైతులకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉంధ్యాల సమీపంలోని జూరాల ఫేస్–1 పంప్ హౌస్ వద్ద పూజలు చేసి ఒక పంప్ను ఆన్చేసి 315 క్యూసెక్కుల నీటిని కోయిల్సాగర్కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై దేవుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. అందుకు ముందస్తు వర్షాలు కురిసి జూరాలకు నీరు చేరడంతో కోయిల్సాగర్ ప్రాజెక్ట్ను నీటితో నింపేందుకు పంప్ ఆన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఆన్లైన్ యాప్ ద్వారా యూరియాను అందిస్తుందన్నారు. కాని, దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే రైతులను తప్పుదోవ పట్టించేందుకు యాప్ ద్వారా రైతులకు కష్టాలు ఏర్పడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లలాగ రైతులను మోసం చేసి అడ్డగోలుగా సంపాదించేవాలం కాదని రైతుల పక్షాన ఉంటూ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, ఉంధ్యాల సర్పంచ్ ఆంజనేయులు, ఇరిగేష్న్ ఈఈ ప్రతాప్సింగ్, డీఈ నైమోద్ధీన్, ఏఈ సాయినాథ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని..
అమరచింత: సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని ఓ దళిత మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మాజీ సర్పంచ్ వేధిస్తున్న ఘటన మండలంలోని సింగంపేటలో చోటు చేసుకుంది. బాధితురాలు చిన్నపాగ రుక్కమ్మ తెలిపిన వివరాలు.. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైస్.రాజశేఖరరెడ్డిఽ మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఒకొక్కరికి 35 గుంటల భూమిని పంపిణీ చేసేలా పథకం ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగానే గ్రామంలో మహిళా సంఘాల్లో పనిచేస్తున్న 55 మంది నిరుపేద వ్యవసాయ కూలీలకు 35 గుంటల చొప్పున గ్రామసభలో తీర్మానం చేసి పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సర్పంచ్గా ఉన్న విజయలక్ష్మి మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. 55 మందికి పంచేందుకు గ్రామ సభలో తీర్మాణం చేసి భూమిని కేటాయించారు. అందులో రుక్కమ్మకు 35 గుంటల భూమి మంజూరైంది. రుక్కమ్మకు వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి 2013లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఓటమిపాలైంది. తన ఓటమికి రుక్కమ్మ, లక్ష్మి, రాములమ్మ కారణమని వారికి ప్రభుతం అందించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. 55 మందిలో 52 మందికి విజయలక్ష్మి రిజిస్ట్రేషన్ చేసి భూ పంపిణీ చేశారు. 19 ఏళ్లు కావస్తున్న తమకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధితులు మాజీ సర్పంచ్ని ప్రశ్నించగా.. తనకు మీరు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని అందుకు కారణం మీరేనని స్పష్టం చేసినట్లు భాధితురాలు ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధితులు పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, అధికారులు వచ్చి పిలిచినా మాజీ సర్పంచు విజయలక్ష్మి నుంచి ఎలాంట సమాధానం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకు కేటాయించిన 35 గుంటల పొలంలో కాస్తులో ఉన్నామని, రూ.2 లక్షల ఖర్చు చేసి పొలాన్ని చదును చేసుకున్నామని వాపోయారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకోంటున్నారు. డీఆర్డీఓ ఆదేశాల మేరకు.. అప్పట్లో వ్యవసాయ పొలాన్ని పంపిణీ చేసే క్రమంలో బాధితురాలు రుక్కమ్మ తన వంతుగా పొలం కొనుగోలు కోసం రూ.7,100 చెల్లించిన రశీదు పరిశీలించాలని డీఆర్డీఓ పీడీ ఆదేశించారు. దీంతో గురువారం గ్రామ సంఘం సమావేశం నిర్వహించి రుక్కమ్మతో పాటు అప్పటి సభ్యుల వివరాలను తెలుసుకున్నాం. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు సమర్పిస్తాం. – వెంకటప్ప, ఏపీఎం, అమరచింత -
తక్కెడ మోసాలపైతనిఖీలు
మహబూబ్నగర్ క్రైం: నగరంలోని కూరగాయల మార్కెట్ ఏరియాలో ఉన్న మటన్ దుకాణాలతోపాటు కూరగాయలు, ఎరువుల దుకాణాలు, సూపర్ మార్కెట్లలో గురువారం జిల్లా తూనికల కొలతల శాఖ బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో ఉపయోగిస్తున్న తక్కెడలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొంతమంది వినియోగదారులు తీసుకున్న మటన్ బరువును మళ్లీ అధికారుల వారి సమక్షంలో తనిఖీ చేశారు. వినియోగదారులకు మోసం చేసి తక్కువగా ఇవ్వడం, తక్కెడలో మోసాలు చేస్తే చర్యలు ఉంటాయని తూనికల కొలతల అధికారి రవీందర్ సూచించారు. తనిఖీల్లో రెండు కేసులు నమోదు చేసి సదరు దుకాణాల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పోగొట్టుకున్నబ్రాస్లైట్ రికవరీ మల్దకల్: ఓ మహిళ బంగారు ఆభరణాన్ని గురువారం మధ్యాహ్నం పోగొట్టుకోగా.. 4 గంటల్లోపే రికవరీ చేసి అప్పగించినట్లు ఎస్ఐ కొండాశ్రీహరి తెలిపారు. మల్దకల్ ఉపాధి హామీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్ను ఉమేరా గురువారం మధ్యాహ్నం గద్వాల నుంచి మల్దకల్కు వచ్చింది. బస్సులోంచి దిగి నడుచుకుంటూ వెళ్తుండగా.. టెంపుల్ రోడ్డులో తన చేతికున్న బ్రాస్లైట్(1.8 తులాలు) పడిపోయింది. కార్యాలయానికి వెళ్లి చూసుకోగా, చేతికున్న బ్రాస్లైట్ పడిపోయిన విషయాన్ని గుర్తించింది. వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రోడ్డుమార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.., పెద్దదొడ్డికి చెందిన మహిళ రోడ్డుపై పడిపోయిన బ్రాస్లైట్ను తీసుకున్నట్లు గుర్తించారు. సదరు మహిళ ద్వారా బంగారు బ్రాస్లైట్ను స్వాధీనం చేసుకుని, ధ్రువీకరణ అనంతరం బాధితురాలికి అప్పగించినట్లు తెలిపారు. -
టెంకాయలు, పూజ సామగ్రిల దుకాణాల మూసివేత
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయిస్తున్న దుకాణాలను గురువారం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ నిబంధనల ప్రకారం 2025–26 సంవత్సరానికి టెంకాయలు, పూజసామగ్రి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కోన రాజశేఖర్, రాకేష్ ఆలయ నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ దుకాణాలను గురువారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తుల బాల్రాజు, ఈఓ మదనేశ్వరెడ్డి మట్లాడుతూ.. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించి భక్తులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. అందుకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట బురిడీ
ధరూరు: తాను రైల్వే ఉద్యోగినంటూ నమ్మించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేసిన ఒక ఘరానా మోసం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో వెలుగు చూసింది. ఉద్యోగాలు రాకపోగా.. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మొహం చాటేసిన వ్యక్తిపై ఓ బాధితుడు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం వివరాలను ఎస్ఐ నందికర్ వివరించారు. గద్వాల మండలం పూడరుకు చెందిన పుల్లన్న తాను రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నానని, ఆయా గ్రామాల్లోని నిరుద్యోగుల తల్లిదండ్రులను నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన మండలంలోని అల్వలపాడుకు చెందిన కొందరు నిరుద్యోగుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తే తమ జీవితాలు బాగు పడతాయని ఆశపడ్డారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకున్నాడు. నిందితుడు సుమారు 16.80లక్షలు వసూలు చేశాడన్నారు. డబ్బులు తీసుకుని చాలాకాలం కావడంతో తమ ఉద్యోగాలపై ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. రేపు, మాపు అంటూ నెలల తరబడి కాలయాన చేస్తూ వచ్చాడు. చివరకు మొహం చాటేసి తిరుగుతుండడంతో.. తాము మోసపోయామని గ్రహించి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్ఐ కోరారు. త్వరలోనే నిందితున్ని అరెస్టు చేస్తామని తెలిపారు. -
భార్య, కుమారుడు, అత్త ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ బాలుడి మృతి కల్వకుర్తి టౌన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా.. జిల్లాలోని ఉప్పునుంతల మండలానికి చెందిన శ్రీనుకు వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్నతో 2020లో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న భర్తపై కోపంతో రెండేళ్ల క్రితం కూతురు, కుమారుడికి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగించగా, హైదరాబాద్లోని నీలోఫర్లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో మళ్లీ భర్తతో గొడవ జరగడంతో పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే గత ఆదివారం లక్ష్మీప్రసన్న, కుమారుడు రిత్విక్ (2), లక్ష్మీప్రసన్న అమ్మ తిరుపతమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే మహబూబ్నగర్లోని ఆస్పత్రికి తరలించారు. రిత్విక్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లో ని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా బుధవారం అర్ధరాత్రి చనిపోయాడు. ఘటనపై తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య వనపర్తి రూరల్: చెట్టుకు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అయిజయ కాలనీకి చెందిన కుమ్మరి బాలవర్దన్ (34) ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు. ఈ నెల 13న షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య సునిత అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం మండలంలోని రాజపేట గ్రామ శివారులోని బాపనోని గుట్ట దగ్గర చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందాడని సమాచారం రావడంతో పోలీసులు వెళి్ల్ పరిశీలించారు. బాలవర్ధన్ కుటుంబసబ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కుమ్మరి బాలవర్ధన్గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన గుండుమాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గుండుమాల్కు చెందిన ఖాజా(35) మూడునెలల క్రితం ఇంట్లో రాత్రి సమయంలో దీపం కాలుపై పడటంతో శరీరానికి నిప్పు అంటుకున్నది. మంటలను అర్పి కోస్గి ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి గుండుమాల్కు తీసుకొచ్చారు. ఏడురోజల క్రితం పరిస్థితి విషమించడంతో మరోమారు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా కోలుకోలేక బుధవారం రాత్రి మృతిచెందాడు. చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి వనపర్తి రూరల్: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ గౌడ్ వివరాల ప్రకారం పెబ్బేరు మండలంలోని గుమ్మడం తండాకు చెందిన రుక్మిణి ప్రసన్న(28) అదే గ్రామానికి సేనావత్ లక్ష్మిదాస్తో ఎనిమిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అనుమానంతో అత్తామామ, భర్త ఆమెను శారీరకంగా వేధించారు. ఈ నెల 17న వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యు లు చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం ఉదయం గంటల కు మృతి చెందింది. ఘటనపై మృతురాలి తండ్రి ముడావత్ పాప్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేవామని ఎస్ఐ తెలిపారు. ఇసుక లారీలు పట్టివేత అలంపూర్: అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు పట్టుబడినట్లు ఉండవెల్లి ఎస్ఐ శేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున కానిస్టేబుల్స్ రవి, చంద్రబాబునాయుడు బ్లూకోర్ట్ విధులు నిర్వహిస్తుండగా.. తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో టోల్ప్లాజా వద్ద ఓ లారీ రాగా.. అనుమానం వచ్చి పరిశీలించగా అందులో ఇసుక లోడ్ ఉంది. నందికోట్కూరుకు చెందిన నరేష్ లారీ డ్రైవర్ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మంత్రాలయం నుంచి హైదరాబాద్కు ఇసుకను తరలిస్తున్నాడు. అదేవిధంగా 5గంటల సమయంలో టోల్ప్లాజా వద్దకు మరో లారీ వచ్చింది. దాన్నీ తనిఖీ చేయగా అందులోనూ ఇసుక లోడ్ ఉంది. నందికోట్కూరుకు చెందిన లారీ డ్రైవర్ రాజేష్ ఎలాంటి పత్రాలు లేకుండా మంత్రాలయం నుంచి హైదరాబాద్కు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పిల్లల భద్రత, సంరక్షణకు సమగ్ర ప్రణాళిక
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో పిల్లల భద్రత, సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సమాజంలో సుమారు 30 నుంచి 40 శాతం జనాభా పిల్లలేనని, అయితే రహదారులు, ఆస్పత్రులు, తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా పెద్దల అవసరాల చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల అవసరాలు, వారి భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి ఇందిర మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్ మాట్లాడుతూ బాలల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడం లక్ష్యంగా గతేడాది నవంబర్ 21న 1,268 మంది పిల్లలతో ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని పాలమూరును బాలల సంరక్షణ వ్యవస్థ అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్ఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు. కాలేజీల్లో మరమ్మతు పూర్తిచేయాలి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టి పురోగతిలో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతు పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీఆర్, విద్య, మౌలిక వసతుల ఇంజినీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మరమ్మత్తు పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలని, రాబోయే 15 రోజులపాటు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా ప్రక్షాళణ విజయవంతం అయ్యేలా సహకరించాలన్నారు. బూత్స్థాయి అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఆదాయంపైనే ధ్యాస.. పట్టని రైతు గోస
ఆదాయంపైనే ద్యాస.. పట్టని రైతు గోసవ్యవసాయ పంట దిగుబడుల క్రయవిక్రయాలకు మూలకేంద్రాలైన మార్కెట్ యార్డుల నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఒకవైపు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుండగా.. మరోవైపు మార్కెట్లలో కనీస వసతులు కరువవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని బాదేపల్లి, మహబూబ్నగర్, దేవరకద్ర, నవాబ్పేట, బాలానగర్ మార్కెట్ యార్డులు అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. ఆయా మార్కెట్లకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్లు ఆదాయం లభించగా.. నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. భారంగా నిర్వహణ.. మార్కెట్ యార్డుల నిర్వహణ భారంగా మారింది. కరెంటు బిల్లులు రూ.లక్షల్లో పేరుకుపోగా.. మున్సిపాలిటీల పన్నులు సైతం చెల్లించకపోవడంతో అపరాధ రుసుం పెరుగుతోంది. అలాగే యార్డులలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు డబ్బులు లేక మురికి కూపాలుగా మా రుతున్నాయి. గోదాంల భద్రతకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. సీసీ కెమెరా ల నిర్వహణ, తూకాలు వేసే కాంటాలతోపాటు తేమ శాతాన్ని గుర్తించే యంత్రాలను కూడా మ రమ్మతు చేయించడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. స్టేషనరీ లేక టెండర్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నా చేబదుళ్లతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మికంగా తాగునీటి బోరుకు కొత్త మోటారు బిగించాల్సి వచ్చింది. అయితే మోటారు కొనుగోలు బిల్లు చెల్లించలేక మొహం చాటేసే పరిస్థితి నెలకొందని పాలకమండలి పేర్కొంది. శుద్ధజలానికీ దిక్కు లేదు.. రైతుల ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తున్నా వారికి మార్కెట్ యార్డులలో కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. శుద్ధజలం, విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు వంటివి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల వెలుతురు కూడా లేక భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రహరీల మరమ్మతు, గేట్ల బిగింపు వంటి పనులకు నిధులు లేకుండాపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులు, పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులని చిన్నచూపో.. లేక మట్టి మనుషులు అని అలుసో.. కానీ, అధికార యంత్రాంగం అన్నదాతలకు కనీసం సదుపాయాలు కూడా కల్పించలేకపోతోంది. మార్కెట్ యార్డుల ద్వారా ధాన్యం క్రయవిక్రయాలతో రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వం.. వాటిని విక్రయించడానికి వచ్చే రైతులకు కనీస వసతులు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. అపరిశుభ్ర వాతావరణంలో ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. వీటికి తోడు కరెంట్ బిల్లులు, ఆస్తిపన్నుల బకాయిలు పేరుకుపోగా.. గోదాంల బీమా ప్రీమియం చెల్లింపులు సైతం నిలిచిపోవడం గమనార్హం. – జడ్చర్ల జిల్లాలోని ప్రధాన మార్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా జిల్లాలో అస్తవ్యస్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులు ధాన్యం క్రయవిక్రయాలతో రూ.కోట్లలో సమకూరుతున్న ఆదాయం నిర్వహణ కోసం ఒక్క రూపాయి విదిల్చని ప్రభుత్వం అరకొర వసతుల మధ్య అన్నదాతల అగచాట్లు మరోవైపు కరెంట్ బిల్లులు,ఆస్తిపన్ను పేరుకుపోయిన వైనం -
వసతులు కల్పించాలి..
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడులు విక్రయించేందుకు వచ్చిన రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి. రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు ఇతర వసతులతోపాటు విశ్రాంతి గది నిర్మించాలి. రాత్రివేళలో విశ్రాంతి గదిలో వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలి. – పాండునాయక్, రైతు, యాసాయికుంటతండా రక్షణ చర్యలు చేపట్టాలి.. బాదేపల్లి మార్కెట్ యార్డులో పంట దిగుబడులు విక్రయించే సమయంలో ధాన్యం ఇతర పంట ఉత్పత్తులకు రక్షణ లేకుండా పోతుంది. వర్షం వచ్చినప్పుడు ఆరుబయట పోసిన పంట తడిసిపోయి నష్టం వాటిల్లుతోంది. యార్డులో అదనంగా షెడ్లు నిర్మించాలి. అలాగే రైతులకు భోజన వసతి ఏర్పాటు చేయాలి. – శ్రీనివాస్రెడ్డి, రైతు, మిడ్జిల్ ప్రభుత్వానికి నివేదించాం.. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్వహణకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బాదేపల్లితోపాటు ఇతర మార్కెట్ యార్డులకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు సుమారు రూ.5 కోట్లు విడుదల చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై ఇప్పటికే బిల్లులను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఆయా పనులు చేపడుతాం. – బాలామణి, జిల్లా మార్కెటింగ్ అధికారి ● -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నగరంలోని చిల్లింగ్ ఫీడర్ 11 కేవీ పరిధిలో చెట్ల కత్తిరింపు కారణంగా శుక్రవారం నగరంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏడీ థావుర్యా నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో బాలాజీనగర్, భూలక్ష్మీకాలనీ, ఆదర్శ్ నగర్, డబుల్ బెడ్రూం కాలనీ, మధురానగర్, శ్రీకృష్ణకాలనీ, బీకేరెడ్డి కాలనీ, ఫాతిమా స్కూల్, జేపీఎన్సీఈ కాలేజీ, బైపాస్ రోడ్డు, నాగిరెడ్డి కాలనీ, నాగేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈవీఎం గోదాం తనిఖీ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీలో భాగంగా గురువారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు ఎప్పటికప్పుడు ఈవీఎం గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదిక పంపిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ హరిప్రియ, శిక్షణ కలెక్టర్ సాయిశివాని, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు పాలమూరు: ఆరోగ్య శాఖ పరిధిలోని 7 ఆర్బీఎస్కే బృందాలు ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలోని 932 ప్రభుత్వ పాఠశాలలతోపాటు 1,255 అంగన్వాడీ కేంద్రాలు, 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2,26,647 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. నగరంలోని రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం ఆర్బీఎస్కే బృందాలు వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సెక్టార్లో చదువుతున్న బాల బాలికలకు ప్రణాళిక ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించాలని, మరింత మెరుగైన చికిత్స కోసం ఆర్బీఎస్కే బృందాలు జనరల్ ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. గతేడాది కాలంలో 52మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. అలాగే సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలని, ప్రధానంగా డయేరియాపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు శైలజ, రాజు, పులివిద్య, వైద్యాధికారులు విజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో శనివారం వివిధ ప్రైవేట్ సంస్థల్లో 250 ఉద్యోగాల భర్తీ కోసం తమ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ ఫర్టిటైజర్స్ కంపెనీ, అపోలో ఫార్మసీ, ట్రాక్స్ అండ్ ఆర్డరైజ్డ్ సర్వీస్ డీలర్ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్ల డించారు. 18–30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.89193 80410ను సంప్రదించాలని సూచించారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నగరంలో ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్కో నగర ఏడీ థావుర్యానాయక్ అన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన చెట్ల తొలగింపు ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, రాజేంద్రనగర్, సద్దలగుండు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లకు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించినట్లు చెప్పారు. దీంతోపాటు లోఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
మచ్చుకు కొన్ని..
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని గోదాంలలో నిల్వ చేసే పంట దిగుబడులు, ఇతర నిల్వల భద్రతకు సంబంధించి బీమా సంస్థలకు ప్రీమియం రూ.9 లక్షల చెల్లింపునకు బిల్లులు సమర్పించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. అలాగే బాదేపల్లి యార్డు విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3 లక్షలు, పత్తి మార్కెట్ యార్డు విద్యుత్ బకాయి రూ.1.60 లక్షలపైనే ఉండగా.. ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదిల్చలేదు. తూకాలు వేసే కాంటాలు, తేమ శాతాన్ని సరిచూసే యంత్రాల మరమ్మతు బకాయిల చెల్లింపులు చేయకపోవడంతో అవి మూలకుపడ్డాయి. అలాగే జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన గోదాంలో అగ్నిప్రమాదం జరగగా మంటలు ఆర్పేందుకు గోదాం గోడలను కూల్చారు. ఆ తర్వాత వీటికి మరమ్మతు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో ప్రతినెలా వచ్చే అద్దెను సైతం కోల్పోవాల్సి వస్తుంది. -
సర్.. ఉన్నారా.. లేరా?
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనుమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు -
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
మహబూబ్నగర్ క్రైం: వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం భద్రతకు అత్యంత కీలకం అని ఎస్పీ డి.జానకి అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కన్వెన్షన్ హాలులో గురువారం వ్యాపారవేత్తలకు సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యాపార సంస్థ, షాపింగ్ కాంప్లెక్స్, గోదాం, వాణిజ్య సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరంగా మారిందన్నారు. సీసీటీవీలు నేరాల నివారణలో నేరస్తులను గుర్తించడం, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆయా వాణిజ్య సముదాయాల దగ్గర ఉన్న కెమెరాలను జిల్లా పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేయవచ్చని, ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా స్పందించడానికి అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో కూడా అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారులు తమ సంస్థల భద్రతను మరింత బలోపేతం చేయడంతోపాటు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. ● అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతోపాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడమే ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశ్యం అని ఎస్పీ డి.జానకి అన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ను ఆమె ప్రారంభించారు. ఈ ప్లాగ్ మార్చ్ టూటౌన్ నుంచి డీఈఓ కార్యాలయం, రైల్వే స్టేషన్ చౌరస్తా, ఎర్రసత్యం చౌరస్తా, బోయపల్లి గేట్, తెలంగాణ కూడళి, బస్టాండ్, న్యూటౌన్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ అధికారుల మెరుపుదాడులు
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, చారగొండ తదితర మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. ఏడుగురిని బైండోవర్ చేశారు. కల్వకుర్తి మండలం తర్నికల్, పర్నికల్ తండా, రాచూర్ తండా, చారగొండలో దాడులు చేశారు. తర్నికల్లో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. ఏడుగురి మహిళలను కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్ర హీం ఎదుట బైండోవర్ చేశారు. రాచూర్ తండాలో నిర్వహించిన దాడు ల్లో 180 కేజీల నల్లబెల్లం 20 కేజీల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. చారకొండలో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు. ఈ దాడుల్లో డీటీఎఫ్ టీం ఎస్ఐ అరుణ, కల్వకుర్తి ఎస్ఐ శ్రావణి, ట్రైనీ ఎస్ఐ చంద్రకిరణ్, సిబ్బంది జనార్దన్రెడ్డి, మునీందర్, తేజశ్రీ పాల్గొన్నారు. ● సారా అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్, ఏడుగురి బైండోవర్ -
నిలిచిన తుంగభద్ర ఎక్స్ప్రెస్
గాలి దుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో దేవరకద్ర స్టేషన్లో తుంగభద్ర ఎక్స్ప్రెస్ గంటన్నరపాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్నూలు వెళ్లే తుంగభద్ర ఎక్స్ప్రెస్ దేవరకద్ర స్టేషన్ చేరుకోగా.. అప్పుడే గాలి దుమారంతో కూడిన భారీ వాన కురవడంతో రైలు కొద్దిసేపు ఆగింది. ఈ క్రమంలోనే గాలి దుమారానికి రైల్వేస్టేషన్లోని చెట్టు కూలి రేకుల షెడ్డుపై పడటంతో చెట్టుకొమ్మలు రైలుకు విద్యుత్ సరఫరా చేసే తీగలపై పడి అంతరాయం ఏర్పడింది. దీంతో తుంగభద్ర ముందుకు కదలలేక నిలిచిపోవాల్సి వచ్చింది. గంటన్నర తర్వాత జిల్లాకేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక సిబ్బంది విద్యుత్ వైర్లను సరిచేయడంతో దాదాపు 7 గంటల ప్రాంతంలో రైలు ముందుకు కదిలింది. అయితే దేవరకద్ర పేరుతో ఉన్న బోర్డు కిందపడి కనిపించింది. -
భర్త అనుమానాస్పద మృతిపై కేసు నమోదు
జడ్చర్ల: తన భర్త మృతి అనుమానాస్పదంగా ఉందని మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ సింగజోగి పెద్ద అంజయ్య(62)కు ఇద్దరు భార్యలు. ఇటీవల పదవీ విరమణ తర్వాత జడ్చర్లలోని చిన్న భార్య రేణుక వద్ద ఉంటున్నాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైనట్లు సమాచారం రావడంతో పెద్ద భార్య సువార్తమ్మ జడ్చర్లకు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసి వెళ్లింది. తదుపరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా.. అక్కడ ఆస్పత్రిలో తన భర్తను చూసేందుకు మంగళవారం వెళ్లిన పెద్ద భార్యను చిన్న భార్య అనుమతించలేదు. అదేరోజు రాత్రి అంజయ్య మృతిచెందాడు. అయితే తన భర్తకు విషప్రయోగం జరిగిందా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి మక్తల్: విద్యుదాఘాతంతో లారీపైనే డ్రైవర్ మృతి చెందిన ఘటన మక్తల్ పట్టణంలో బుధవారం చో టుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల్ మండలం దాదర్పల్లి గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్ (30) గద్వాల్కు చెందిన షాబాద్ అనే వ్యక్తి దగ్గర లారీ డ్రైవర్గా పని చేసేవాడు. బుధవారం కూడా ఎప్పటి లాగానే గద్వాల్ నుంచి మక్తల్కు మసాల లోడ్ తెచ్చా డు.లారీపైకి ఎక్కి కవరు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు హమాలీలు వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. వెంకటేశ్కు భార్య, ఓ పాప ఉంది. మృతుడి కుటుంబసభ్యులు ఘటనపై మక్తల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఇంట్లో గొడవ పడి వ్యక్తి బలవన్మరణం ఉండవెల్లి: కుటుంబ కల హాలతో మనస్థాపానికి గు రైన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారమునగాల–2 గ్రామానికి చెందిన రాజశేఖర్ (51) కర్నూల్లోని జీజీహెచ్ లో అవుట్ సోర్సింగ్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తుండేవాడు. మూడేళ్లుగా భార్య జానకమ్మ, ముగ్గురు కుమారులతో కలిసి ఉండవెల్లిలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. అనంతరం ఇంట్లోనే ఒక గదిలో చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలకొట్టి అతడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అలంపూర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మృతుడి భార్య జానకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బంగారం, నగదు అపహరణ కొల్లాపూర్ రూరల్: మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కటిక నిరంజన్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షలు నగదును దొంగిలించుకుపోయినట్లు ఇంటి యాజమాని నిరంజన్ తెలిపాడు. ఇంటికి తాళం వేసి మిద్దైపె నిద్రిస్తుండగా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
సంఘం బలోపేతానికి కృషి చేయాలి
అలంపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘాన్ని అన్ని విధాల బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంపూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బడిచౌడి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘం ప్రథమ సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలపించారు. అలాగే తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. సంఘం పటిష్టంగా ఉంటే ప్రభుత్వం మన డిమాండ్లను త్వరగా ఆమోదిస్తుందన్నారు. హెల్త్ కార్డులు, దసరా కానుకగా పీఆర్సీ మంజురు, పెండింగ్ 5 డీఏలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం విజయవంతం చేసేందుకు కృషి చేసిన వెంకట్రామయ్య, స్థానిక ఉద్యోగులను రాష్ట్ర కార్యవర్గ సంఘం నాయకులు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సీతారామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ప్రహ్లాదరావు, గద్వాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు వెంకట్రామయ్య శెట్టి, కృష్ణమూర్తి, మద్దిలేటి, గోపాల కృష్ణయ్య, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
వానాకాలంలో వరినారు యాజమాన్యం
● వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే మేలు ● మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి కొత్తకోట రూరల్: ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వరినారు మడ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే వరిలో సాగు చేసే రకాలు, పంట కాలం అనుగుణంగా నీరు పోసుకోవాలి. ప్రస్తుత దీర్ఘకాలిక రకాలు (140–150)ను జూన్ 20వ తేదీ వరకు మధ్య కాలిక రకాలను (135 రోజులు) జూన్ 20 నుంచి జులై 10 వరకు, స్వల్ప కాలిక రకాలను (125 రోజులు) జులై 20వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు నారు పోసుకోవచ్చని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● నారు పోసుకునే పొలంలో నీరు ఆగకుండా ఉండే మరియు చౌడు లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వరి నారు పోసుకోవాలి. ● నారు పోసుకొనే పొలాన్ని 15–20 రోజుల ముందే 2–3 సార్లు దున్నుకొని తరిమడా తయారు చేసుకోవాలి. ● నారు పోసుకొనే పొలంలో ఎక రా నారు మడి ప్రాంతానికి 200 కిలోల కుళ్లిన పశువుల ఎరువును వేసుకోవాలి. ● కిలో విత్తనానికి 1గ్రా. కార్భండిజియం లేదా 2.5 గ్రా థైథినియం యం–45 మందును కలుపుకోవాలి. ● విత్తనాన్ని 1–24 గంటలు నానబెట్టి మరియు 24–36 గంటలు మండెకట్టి తర్వాత మొలక విత్తనాన్ని పొలంలో చల్లుకోవాలి. ● ఎకర నారు మడికి 2.2కిలోల యూరియా, 6.25 కిలోల సూఫర్ మరియు 1.25కిలోల పొటాష్(ఎంఓపీ) మొదటలో చల్లుకోవాలి. తర్వాత 8012 రోజులకు 2.2కిలోల యూరియాను వేసుకోవాలి. ● ఎకరాకు 15–20 కిలోలు మొలక వచ్చిన గింజలను రకాలను బట్టి చల్లుకోవాలి. ● పొలంలో మొలక విత్తనాన్ని సమానంగా చల్లుకొని పలుచగా నీరు మడ్లు నీళ్లు కట్టి తర్వాత రోజు ఉదయాన్నే నీరు తీసివేయాలి. ● పొలంలో అడపదడప నీళ్లు పెడుతూ నారు మొలక ఆకుల దశ వచ్చిన తర్వాత 2–3 సెం.మీ మందంలో నీళ్లు ఉంచాలి. ● కలుపు బట్టి నారు మడుల్లో 12–15 రోజుల మధ్యలో బిస్ఫైరిబాక్ సోడియం మందును 0.5మి.లీ మరియు 15–20 రోజులకు సైహలోఫాస్ బ్యూటైల్ మందును 1.5మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● నారు మడుల్లో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 800గ్రా ఎకరా నారుమడిలో నారు పీకే 5–7 రోజుల ముందు వేయడం వల్ల ఉల్లికోడు మరియు కాండం తోలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చును. ● నారులో జింక్ లోపం కనబడితే జింక్ సల్ఫెట్ 2.5గ్రా లీటరు నీటిలో కలిపి నారుపై పిచికారీ చేసుకోవాలి. పాడి–పంట -
దేవరకద్ర అతలాకుతలం
● బీభత్సం సృష్టించిన వాన, గాలిదుమారం ● బొలెరోపై గోడ కూలి ఇద్దరి దుర్మరణం ● నేలకొరిగిన భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు ● నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో దేవరకద్ర దేవరకద్ర: మున్సిపాలిటీలో బుధవారం సాయంత్రం భారీ వర్షంతో కూడిన గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఒక్కసారి సృష్టించిన విధ్వంసంతో దేవరకద్ర చిగురుటాకులా వణికిపోయింది. తీవ్రమైన గాలివాన వీయడంతో గోడ పక్కన బొలెరో ఆపి అందులోనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు గోడ కూలి మృతిచెందారు. పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీనికితోడు బుధవారం వారాంతపు సంత కావడంతో రోడ్లపై కూరగాయలు, ఇతరత్రా చిరు వ్యాపారాలు భీకరమైన గాలులకు వేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. పానీపూరి బండ్లు, శీతల పానియాలు విక్రయించే బండ్లు కొట్టుకుపోగా.. నిలిపిన ద్విచక్రవాహనాలు కిందపడ్డాయి. దేవరకద్ర సంత అంతా అతలాకులంగా మారడంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ పరుగులు తీశారు. ఇదే సమయంలో వడగాళ్ల వాన కురవడంతో పట్టణమంతా భయంతో భీతిల్లిపోయింది. ఇంతటి గాలివాన దుమారం ఎప్పుడూ చూడ లేదని పలువురు చర్చించుకున్నారు. చాలాచోట్ల చెట్లు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గాలివాన బీభత్సంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ అంధకారంలో ఉండిపోయారు. దేవరకద్రలో గాలివాన సృష్టించిన బీభత్సాన్ని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి బుధవారం రాత్రి పరిశీలించారు. అదేవిధంగా భారత్మాలలో పనిచేసే సివిల్ ఇంజినీర్, డ్రైవర్ మృతిచెందిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.సంతలో నష్టపోయిన వారితో మా ట్లాడారు. జరిగిన నష్టంపై అంచనాలు రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. -
కన్హాశాంతి వనంలో పీయూ నేషనల్ సెమినార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించే నేషనల్ సెమినార్ను హైదరాబాద్ సమీపంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు పేర్కొన్నారు. ఈమేరకు పీయూ అడ్మి నిస్ట్రేషన్ భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణ కోసం పలు కమిటీలను ప్రకటించారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రాన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధసూదన్రెడ్డి కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్ప, ఆహ్వాన పత్రా ల తయారీ, అకాడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్య వహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి, రాజ్కుమార్, రవికాంత్ పాల్గొన్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను సర్వాంగసుందరంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. కల్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లి -
మంత్రి ఇలాఖాలో కళాభారతి ఇలానా..?
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాఖాలో కళాభారతిని పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని, దీనిని ఎప్పటికి పూర్తిచేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన కళాభారతి పనులను పరిశీలించి మాట్లాడారు. గతంలో కళా ప్రదర్శన ప్రారంభించేందుకు వస్తే టౌన్హాల్ శిథిలావస్థలో ఉందని కళాకారులు చెబితే కేసీఆర్ను ఒప్పించి ఐలమ్మ కళాభారతికి రూ.7 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన వసతులు కల్పన, నాట్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, చిన్నపాటి వేడుకలు చేసుకునేందుకు కళాభారతి నిర్మాణం పూర్తిచేసినట్లు వివరించారు. పూర్తిచేసిన కళాభారతిని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. టౌన్ హాల్ శిథిలావస్థలో ఉందని వెంటనే దాన్ని తొలగించి.. కార్పొరేషన్ కొత్త భవనం ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యాటక శాఖ పరిధిలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వీటిపై మంత్రి సమీక్షా చేసి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కళాభారతలో చిన్నపాటి పనులు పూర్తి చేస్తే అందుబాటులోకి వస్తుందని, వెంటనే పనులు పూర్తి చేసి కళాకారులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణాధ్యక్షుడు శివరాజ్, నాయకులు నవకాంత్, ఈశ్వరయ్య, జహంగీర్, నరేందర్, గణేష్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో 10 రోజుల్లో కల సాకారం
దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర అనుమతులు రావాల్సి ఉంది.. ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నా యి. దీంతో ఎస్సీ, బీసీ వ సతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాలు పెంచాలి.. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్ర భుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరా. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవ డంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకు న్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్ -
పల్లెగడ్డ పిల్లలంతా.. ప్రభుత్వ బడికే
నవాబుపేట మండలంలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన 64 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా కేవలం 24 మంది మాత్రమే చదివేవారు. మిగతా 71 మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తల్లిదండ్రులను ఒప్పించడంతో బుధవారం 64 మంది విద్యార్థులు ఒకేసారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. మిగతా వారిని సైతం ఇక్కడే చేర్పించి ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే నినాదాన్ని చాటిచెబుతామని పల్లెగడ్డ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాంనాయక్, ఎంఈఓ నాగ్యనాయక్, సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. – నవాబుపేట -
ప్రతి బాధితురాలికి న్యాయం జరగాలి
మహబూబ్నగర్ క్రైం: భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలికి అవసరమైన న్యాయ, వైద్య, మానసిక, పునరావాస సేవలు ఒకే వేదికపై అందేలా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని ఎస్పీ జానకి అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భరోసా కేంద్రంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. మొదట భరోసా కేంద్రానికి అనుసంధానంగా పనిచేసే మహిళాశిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, న్యాయ సేవా సంస్థ, చైల్డ్ లైన్, సామాజిక సంక్షేమ శాఖ, సఖి, ఎన్జీఓలు శాఖలకు సంబంధించిన వారు కేంద్రం నిర్వహణతోపాటు బాధితులకు అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సంక్షేమం విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా స్పందించాలని, ప్రతి కేసును సున్నితంగా పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణకు సంబంధించిన కేసుల్లో శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, సీఐలు, ఐసీడీఎస్, భరోసా కేంద్ర సిబ్బంది, ఎన్జీఓలు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్పై అవగాహనకు 2కే రన్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను బుధవారం జిల్లా ప్రధాన స్టేడియం మైదానంలో 2కే రన్ను రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జేఎల్బీ హరిప్రియతో కలిసి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, అర్బన్ మండల తహసీల్దార్ ఘాన్సీరాం, డీటీ దేవేందర్ పాల్గొన్నారు. -
48 గంటలపాటు భగీరథ నీళ్లు బంద్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామం వద్ద బ్లాక్స్పాట్ రోడ్ వైండింగ్ కారణంగా మిషన్ భగీరథ పైపులైన్ మార్చడం కారణంగా 48గంటలపాటు మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డాకుల మండలలోని 19 గ్రామాలకు, భూత్పూర్ మండలం లోని 11 గ్రామా లు, మూసాపేట మండలంలో 19 గ్రామాలకు మొత్తం 49 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయము కలుగుతుందని తెలిపారు. అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నగరంలోని 11 కేవీ పరిధి రైల్వే స్టేషన్ రోడ్డు ఫీడర్లో చెట్ల తొలగింపు కారణంగా గురువారం నగరంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ థావుర్యానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైల్వేస్టేషన్ రోడ్, బాలుర కళాశాల, న్యూటౌన్, సద్దలగుండు, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు. హెల్త్ క్యాంపు సెంటర్కు శంకుస్థాపన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో సుమారు రూ.30 లక్షలతో నిర్మించే హెల్త్ క్యాంపు సెంటర్కు బుధవారం మేయర్ మమత శంకుస్థాపన చేశారు. అలాగే డివిజన్ నం.14 పరిధిలోని మున్సిపల్ ఓల్డ్ క్వార్టర్స్, నల్బౌలి, ఖలీల్చౌక్, టీడీగుట్ట కమ్యూనిటీ హాల్, క్యూబా, బిల్లా మసీదు సమీప ప్రాంతాలను బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈ మురళీమోహన్రెడ్డి, ఏఈ రాగవినతి, ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వజ్రకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది. ఆర్ఎన్ఆర్ @ రూ.2,756 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,756, కనిష్టంగా రూ.1,706 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,056, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి. -
మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపుపై శిక్షణ
రాజాపూర్ (బాలానగర్): రైతులు మామిడి తోటలో కొమ్మలు కత్తిరించేందుకు యంత్రాలను వినియోగించడం ద్వారా పని సులువవుతుందని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ప్రొఫెసర్, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, సైంటిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి, జాలుగడ్డతండాలోని రైతు కృష్ణారెడ్డి మామిడి తోటలో యంత్రాలను ఉపయోగించి శాసీ్త్రయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించడంపై అవగాహన కల్పించారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణం చెట్టు లోపలి భాగాలకు గాలి, వెలుతురు సరిగ్గా తగలకపోవడం, కొమ్మలు ముదరక పోవడమే అన్నారు. జూన్, జూలై నెలల్లో సరైన క్యానోి ప, ఫ్రూనింగ్ చేయడం ద్వారా వచ్చే ఏడాది మంచి పూత, కాపు చేయవచ్చన్నారు. దిగుబడి తగ్గిన చెట్లలో పోషకాల నిల్వలు ఎక్కువగా ఉంటాయని, ఇప్పుడు కత్తిరింపు చేయకపోతే వర్షాకాలంలో చెట్టు విపరీతంగా పెరిగి శీతాకాలంలో పూత రాకుండా కేవలం ఆకులు మాత్రమే వస్తాయని వివరించారు. అధిక సాంద్రత గల మామిడి తోటల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ట్రాక్టర్తో నడిచే ట్రీపూనర్, పెట్రోల్తో నడిచే ప్రూనింగ్ మెషిన్తో కత్తిరింపు పద్ధతులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమ అధికారి వేణుగోపాల్, జడ్చర్ల ఉద్యానవన అధికారి మహేందర్, మామిడి క్లస్టర్ అధికారి ఆసీఫ్, మామిడి రైతులు పాల్గొన్నారు. తెలంగాణ బోట్లను అడ్డుకున్న ఆంధ్ర పోలీసులు కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్ర సరిహద్దులో ఉన్న సంగమేశ్వరాలయానికి భక్తులను తరలిస్తున్న స్థానిక మరబోట్లను మంగళవారం అవతలి ఒడ్డున ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారని బో టు యజయానులు తెలిపారు. ఇటీవల ఆంధ్ర ప్రాంతంలోని నదిలో మరబోటులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రమాదానికి గురైన నేపథ్యంలో నాటు పడవలు నడపకుండా నిలువరించారని పేర్కొన్నారు. దాదాపుగా రెండు గంటలు బోట్లు ఆగడం వల్ల సోమశిల నుంచి సంగేమేశ్వరం వెళ్లే భక్తులు, పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం యథావిధిగా నాటు పడవల ప్రయాణం కొనసాగించారు. -
బర్త్డే రోజే.. దోస్త్ల డెత్ డే
భూత్పూర్: పట్టణ సమీపంలోని జాతీయ రహ దారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.., మరో యువకుడు తీవ్రగాయాలపాలైన ఘటన చోటుచుసుకుంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్కు చెందిన పెద్దగొల్లరాజు (21), ఇమ్రాన్ (23)తోపాటు హైదరాబాద్కు చెందిన అఖిల్తో కలిసి అఖిల్ బర్త్డే వేడుకలు సోమవారం రాత్రి భూత్పూర్ సమీపంలో ఓ వెంచర్లో జరుపుకొన్నారు. బర్త్డే వేడుకలు జరుపుకొని తిరిగి అమిస్తాపూర్కు వస్తుండగా భూత్పూర్ సమీపంలోని బ్రిడ్జికి దగ్గర హైదరాబాద్ వెళ్లేదారిలో మరమ్మతు నిమిత్తం ఆగిన డీసీఎంను వెనకు నుంచి మోటర్సైకిల్తో వేగంగా ఢీకొట్టారు. మోటర్ సైకిల్పై ఉన్న పెద్దగొల్లరాజు, ఇమ్రాన్ అక్కడిక్కడే మృతిచెందగా.. అఖిల్కు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. పెద్ద గొల్లరాజు మహబూబ్నగర్ రూరల్ మండలం బోయపల్లి.. కాగా 15ఏళ్ల క్రితం అమిస్తాపూర్లో ఉంటున్నాడు. రాజు తండ్రి బుచ్చన్న 10ఏళ్ల క్రితం మృతిచెందగా తల్లి భాగ్యమ్మ, చెల్లెలితోపాటు అమిస్తాపూర్లో ఉంటూ సెంట్రింగ్ పనులు చేసేవాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లి భాగ్యమ్మ రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి. రాజుతోపాటు ఇమ్రాన్ సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. మైబు, బేగంకు ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. ఇమ్రాన్ చిన్నకుమారుడు. అఖిల్, రాజు, ఇమ్రాన్ ముగ్గురు మిత్రులు కావడంతో బర్త్డే జరుపుకునేందుకు సోమవారం హెదరాబాద్ నుంచి అమిస్తాపూర్కు వచ్చాడు. బర్త్డే వేడుకలు జరుపుకొని తిరిగి వెళ్తామనుకున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రాజు తల్లి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వ హించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్ఐ చెప్పారు. కొరవడిన హైవే పెట్రోలింగ్ పర్యవేక్షణ జాతీయ రహదారిపై ప్రతినిత్యం ఎల్అండ్టీ కంపెనీ పెట్రోలింగ్ వాహనాల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవా రం సాయంత్రం మరమ్మతు కోసం ఆగిన డీసీఎం పార్కింగ్ లైట్లు వేయకపోవడంతో పాటు స్టాపర్స్ ఏర్పాటు చేయకపోడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రివేళలో వాహనాలు జాతీయ రహదారిపై నిలపడంతోపాటు పార్కింగ్ లైట్లు వాహనాలకు లేకపోవడంతో ముందు వాహనం వెళ్తుందా, ఆగి ఉందా గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ క్రైం: భూత్పూర్ దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ జానకి పరిశీలించారు. బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే మృతిచెందగా.. మరో యువకుడు చికిత్స పొందుతున్నాడనే విషయాన్ని భూత్పూర్ ఎస్ఐ నాగన్న ద్వారా ఎస్పీ తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు రాత్రి వేళల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, అ తివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ చేయరాదన్నారు. ప్రధా నంగా హెల్మెట్ తప్పక వాడాలని సూచించారు. నగరంలో ఎస్వీఎస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఇద్దరూ వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ సమాచారం తెలుసుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ జానకి ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై కొందరు వ్యక్తులు వాస్తవాలకు విరుద్ధంగా మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రమాదం తర్వాత జరిగిన వ్యక్తిగత వివాదానికి మతపరమైన కోణం లేదని తెలిపారు. కొందరు నిర్ధారణ కానీ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే వాటిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి వందతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మరాదని, సోషల్ మీడియాల్లో తప్పుడు పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
సమతుల్య ఎరువులతోనే దిగుబడులు
● నేలలో దాగున్న పోషకాలను వెలికితీసే భాస్వర జీవన ఎరువులు ● భూసారం సంరక్షణ కోసం 30 వరకు ఖేత్ బచావో మదనాపురం: నేటి ఆధునిక వ్యవసాయంలో కొందరు రైతులు రసాయన ఎరువులు లేకుండా పంటల సాగును ఊహించలేకపోతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇలా పంట ఏదైనా సరే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల రూపంలో భాస్వరాన్ని గుట్టలు గుట్టలుగా పొలాల్లో పోస్తున్నారు. అయిలే పొలాల్లో చల్లే భాస్వర ఎరువుల్లో కొంత భాగాన్ని మాత్రమే మొక్కలు తీసుకోగలవు. మిగిలినదంతా నేలలోని రసాయనిక చర్యలతో కరగని రూపంలో స్థిరపడిపోతుంది. ఇలా ప్రతి సీజన్లో ఎరువులు వేస్తూ పోవడంతో నేలలో భాస్వరం నిల్వలు పెరిగిపోవడమే కాకుండా.. జింక్ వంటి రసాయనిక సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి. ఫలితంగా పెట్టుబడి దండగ అవ్వడమే కాకుండా, భూమి పోషకాల అసమతుల్యతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డా.భవాని సూచిస్తున్నారు. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా: భూమిలో కరగని రూపంలో గడ్డకట్టుకుపోయిన భాస్వరాన్ని కరిగించి వేర్లకు అందేలా చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. బాసిల్లస్ సూడోమోనాస్ ఆస్పర్జిల్లస్ పెనిసల్లియం వంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇందులో ఉంటాయి. హెక్టార్కు సుమారు 25 కిల్లోల భాస్వరాన్ని ఇవి మొక్కలకు అందిస్తాయి. మొక్కల పెరుగుదలకు కావాల్సిన హర్మోన్లు విడుదల చేస్తాయి. వీటిని వాడటం వల్ల రసాయన భాస్వర ఎరువుల వాడకాన్ని 20 నుంచి 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ● ఎకరానికి 200 కిలోల సేంద్రియ ఎరువు లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువులో 1 లీటర్ పీఎస్బీ కల్చర్ను కలిపి తేమ ఉండేలా చూస్తూ 15 రోజులు నీడలో ఉంచాలి. ఆ తర్వాత దుక్కిలో చల్లుకోవాలి. బెల్లం ద్రావణంలో 10 మి.లీ. పీఎస్బీ కలిపి విత్తనాలకు పట్టించి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఒక లీటర్ నీటిలో 10 మి.లీ. పీఎస్బీ కలిపి నారు వేర్లను 15–20 నిమిషాలు ముంచి ఆ తర్వాత నాటుకోవాలి. భాస్వరాన్ని గ్రహించే శిలీంధ్రం (మైకోరైజా): ఇది మొక్కల వేర్లతో కలిసి జీవించే ఒక మైత్రి శిలీంధ్రం. వేర్ల చుట్టూ విస్తృతంగా వ్యాపించి, అందనంత దూరంలో ఉన్న భాస్వరాన్ని లాగి మొక్కకు అందిస్తుంది. భాస్వరంతో పాటు జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలను, నీటిని కూడా గ్రహిస్తుంది. ఇది మొక్కకు వాతావరణ ఒడిదుడుకులు, కరువును తట్టుకునే శక్తిని ఇస్తుంది. అన్ని రకాల పంటలు, నేలలకు ఇది అనుకూలం. క్షేత్రస్థాయిలో ప్రచారం.. సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో (వ్యవసాయ క్షేత్ర రక్షణ) కార్యక్రమం నిర్వహిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించి.. జీవన ఎరువుల ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పాడి–పంట ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థల ద్వారా లభించే నాణ్యమైన జీవన ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలి. జీవన ఎరువులను నేరుగా రసాయన, శిలీంధ్రనాశకాలు లేదా పురుగుమందులతో అస్సలు కలపకూడదు. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను ఎండలో కాకుండా కచ్చితంగా నీడలోనే ఆరబెట్టాలి. అలాగే వీలైనంత త్వరగా విత్తుకోవాలి. జీవన ఎరువులు వేసేటప్పుడు, వేసిన తర్వాత నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. -
వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీహాల్లో అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. వర్షాలు పడే సమయంలో మండల, గ్రామస్థాయి అధికారుల ఫోన్నంబర్లు ప్రజలకు అందుబాటలో ఉంచాలని సూచించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, తహసీల్దా ర్, ఎంపీడీఓలు గ్రామాల్లో గజ ఈతగాళ్ల వివరాలు సేకరించాలని, ఎక్కడైనా అనుకోకుండా సంఘటనలు జరిగితే తక్షణమే వారి సహాయం తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండలస్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కంట్రోల్రూం ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,936 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం భారీగా ధా న్యం విక్రయానికి వచ్చింది. ఆర్ఎన్ఆ ర్ క్వింటా గరిష్టంగా రూ.2,936, కనిష్టంగా రూ.1,651 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,067, కనిష్టంగా రూ.1,657, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.5,456, పొద్దుతిరుగుడు రూ.6,512, ఆముదాలు గరిష్టంగా రూ.6,325, కనిష్టంగా రూ.6,230, రాగులు గరిష్టంగా రూ.3,509, కనిష్టంగా రూ.2,827 ధరలు పలికాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని వినతి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తమకు 2017 నుంచి పీఆర్సీ అమలు పరిచి ఎనిమిదేళ్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మహబూబ్నగర్ రీజియన్ అధ్యక్షుడు వి.భాస్కరచారి, కార్యదర్శి టి.సత్యశీలారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్ఎం సంతోష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 పీఆర్సీ యాజమాన్య కంట్రిబ్యూషన్ బకాయిలను బర్కత్పురలోని పీఎప్ కార్యాలయంలో చెల్లిస్తేనే ప్రయోజనం దక్కుతుందన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మరణించినప్పుడు దహన సంస్కారాల కోసం బాధిత కుటుంబాలకు రూ.30 వేల ఆర్థికసాయం అందజేయాలన్నారు.నాయకులు రెహ్మాన్ సోఫీ, సత్యన్నాచారి, దమాయపల్లి శ్రీను, బసన్న, రాజన్న, సుల్తాన్, రెహమాన్, కోడూరు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. పథకాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి భూత్పూర్: గ్రామీణ ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్సీసెస్ అథారిటీ కార్యదర్శి డి.ఇందిరా అన్నా రు. మంగళవారం కప్పెటలో జరిగిన రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిరా మాట్లాడుతూ రైతు చట్టా లు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, సీనియర్ సిటిజన్ చట్టం, ఎన్ఏఎల్ఎస్ఐ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ తదితర విషయాలను వివరించారు. రైతులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన సమయాల్లో ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీడీఓ ఉమాదేవి, డీటీ గీత, సర్పంచ్ మాసగౌడ్, ఎస్ఐ నాగన్న, ఆర్ఐ వెంకటేష్, ఎంఈఓ ఉషారాణి, జీపీఓ వెంకటేష్, గ్రామ కార్యదర్శి పి.శేఖర్, హెచ్ఎం వెంకట్నారాయణ, పార లీగల్ వలంటీర్ కె.రవికుమార్ పాల్గొన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
జడ్చర్ల టౌన్: మహబూబ్నగర్ న్యాయవాది నరేందర్ నాయక్పై దాడి, రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదును వ్యతిరేకిస్తూ మంగళవారం జడ్చర్ల కోర్టులో న్యా యవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు యాదిరెడ్డి ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు జరగటం, బాధిత న్యాయవాదిపైనే కేసు నమోదు చేయటం సబబుకాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాములు, న్యాయవాదులు తిరుపతి, జంగయ్య, లక్ష్మీనారాయణ, పాండు, పురుషోత్తం, శ్రీశైలం పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘సర్’ నిర్వహించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్లెవల్ సూపర్వైజర్లు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్ల ధ్రువీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు నమోదులు, అనవసర తొలగింపులు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను ధ్రువీకరించిన తర్వాతే జాబితాలో మార్పు లు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈఆర్లు, నియోజకవర్గస్థాయిలో ఏఈఆర్ఓలు సమర్థవంతంగా పనిచేయాలని, ఇపిక్ డిప్యూటీ తహసీల్దార్లు కూడా అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు తమ గుర్తింపు పత్రాలను సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియలో సహకరించాలని కోరారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, ద్వంద్వ నమోదులు కలిగిన వారి పేర్లను తొలగించి, కొత్తగా అర్హత సాధించిన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, జేఎల్బీ హరిప్రియ, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు -
ఓట్ల చోరీపై అప్రమత్తత అవసరం
● టీపీసీసీ ఆధ్వర్యంలో బీఎల్ఏలకు శిక్షణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీ యత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అప్రమత్తం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఎల్ఏలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపుల వంటి అంశాలపై పూర్తి అవగాహనతో పనిచేసి ప్రజలకు సహాయపడాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచు కోవాలన్నారు. అంతకుముందు బీఎల్ఏల శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు బీఎల్ఓలు వచ్చినప్పుడు వారితో కలిసి ఎస్ఐఆర్లో తప్పక పాల్గొనాలన్నారు. నెల రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ వారిచ్చే ఫారాలను ప్రజలతో సరిగ్గా పూర్తి చేయించి అధికారులకు ఇవ్వాల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీకి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతుతో వాటిని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యంగా వలస వెళ్లిన వారి వివరాలను ఓటరు జాబితాలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నగర మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, ప్రత్యేక ట్రైనర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సత్తూర్ చంద్రకుమార్గౌడ్, సాయిబాబా, రాములుయాదవ్, పసుల రాజు, వి.మహేందర్, ఫయాజ్, అజ్మత్అలీ అవేజ్ పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ బహిష్కరిస్తున్నాం
● తప్పుడు కేసు పెట్టిన ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలి ● పాలమూరు బార్ అసోసియేషన్ డిమాండ్ పాలమూరు: జిల్లా కోర్టులో పని చేసే న్యాయవాదిపై అక్రమ కేసు పెట్టిన రూరల్ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకునే వరకు నిరసన కొనసాగుతుందని, ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను న్యాయవాదులు మొత్తం బహిష్కరించినట్లు తీర్మానం చేశామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు వెల్లడించారు. రూరల్ పోలీసుల వైఖరికి నిరసనగా రెండో రోజు మంగళవారం న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యాయవాది నరేందర్నాయక్పై పెట్టిన అక్రమ కేసు తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా సదరు రూరల్ ఇన్స్పెక్టర్ అవతలి వ్యక్తులతో కలిసి బాధితుడైన న్యాయవాదిని భయాందోళనకు గురి చేసి అక్రమ కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ ఘటనలో పూర్తిగా నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటయ్య, నర్సింహ్మారెడ్డి, చంద్రమౌళి, బెక్కెం జనార్దన్, అనంతరెడ్డి, అనిల్కుమార్, టి.కృష్ణ మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఫలితాల్లో ‘ఆదర్శం’..
● వెన్నాచేడ్ మోడల్ స్కూల్లో అడ్మిషన్ల జోరు ● ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ● పాఠశాలలో వసతులు లేకపోయినా చేరేందుకు ఆసక్తి గండేడ్ మండలం వెన్నాచేడ్ గ్రామానికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఆదర్శ పాఠశాల ఉంటుంది. ఉమ్మడి గండేడ్ మండలంతో పాటు మిగతా కోయిల్కొండ, నవాబుపేట, జడ్చర్ల, మహబూబ్నగర్ తదితర మండలాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 636 మంది చదువుతున్నారు. మొదట్లో 100 మంది దాటని విద్యార్థుల సంఖ్య.. ప్రతి ఏడాది ఊహించని విధంగా పెరుగుతోంది. సమస్యలను అధిగమించి.. వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో చదివే విద్యార్థులు నానా కష్టాలు పడుతూ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. గ్రామానికి బస్సు సరిగ్గా లేకపోయినా ఓపికతో పాఠశాలకు వస్తున్నారు. జానంపల్లి ప్రధాన రహదారి నుంచి పాఠశాలకు 2 కి.మీ. దూరం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు విద్యార్థుల కోసం వస్తున్నా.. అది మిస్సయితే కాలినడకే శరణ్యం. ఒక్కోసారి ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లి.. తిరిగి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లడానికి రాత్రి 9 గంటలైనా సందర్భాలు లేకపోలేదు. హాస్టల్ వసతి కూడా పూర్తిస్థాయిలో లేదు. కేవలం 100 మందికి మాత్రమే ఉంది. అది అమ్మాయిలకు మాత్రమే. బాలురకు అసలే వసతి లేదు. మధ్యాహ్న భోజనం మాత్రం ఉంటుంది. అయినా విద్యార్థుల సంఖ్య తగ్గడం లేదు. రెండేళ్లుగా వందశాతం ఉత్తీర్ణత.. 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో 92 మంది విద్యార్థులకు గాను వందశాతం ఉత్తీర్ణులయ్యారు. 2025–26లో 87 మందికి గాను 87 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్లోనూ అదే ఫలితాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్లో ఎంపీసీ విద్యార్థిని అశ్విని స్టేట్ 5వ ర్యాంకు సాఽధించి.. పాఠశాలకు మరింత వన్నె తెచ్చింది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఇక్కడ చక్కటి విద్యా భోదన చేయడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనికితోడు పాఠశాలలో ల్యాబ్లు, కంప్యూటర్లు, సరిపడా తరగతి గదులు ఉన్నాయి. క్రీడా ప్రాంగణం కూడా ఉంది. అటు చదువుతో పాటు ఈ పాఠశాల విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. సీట్ల కోసం ఆరాటం.. వెన్నాచేడ్ మోడల్ స్కూల్లో ప్రతి ఏటా అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే ఎలాగైనా పాఠశాలలో సీటు పొందాలని విద్యార్థులు తహతహలాడుతున్నారు. ప్రవేశాల కోసం వందలకొద్దీ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో 100 సీట్లు ఉండగా.. 192 దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్లో 40 సీట్లకు గాను 126 దరఖాస్తులు వచ్చాయి. ఆయా తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి 336 దరఖాస్తులు రాగా.. ఇంటర్ ఆయా గ్రూపులకు గాను 256 దరఖాస్తులు వచ్చాయి. తమ పిల్లలను మోడల్ స్కూల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు నానాపాట్లు పడుతున్నారు. రాజకీయన నాయకులు, అధికారులతో ఫోన్లు చేయిస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా వెన్నాచేడ్ మోడల్ స్కూల్ అంటేనే ఉత్తమ విద్యలో ప్రత్యేకత చాటుతోంది. ఆ పాఠశాల ఊరికి దూరంగా ఉండటంతో పాటు బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. బాలికలకు హాస్టల్ వసతి సైతం పూర్తిస్థాయిలో లేదు. బాలుర హాస్టల్ అసలే లేదు. అయినా ఆ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. తమ పిల్లలకు సీటు కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. అదే మహబూబ్నగర్ జిల్లాలోని గండేడ్ మండలం వెన్నాచేడ్ మోడల్ స్కూల్. 2013లో ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చొరవతో ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. – గండేడ్ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం ఉంది. డిజిటల్ క్లాసులు నడుస్తున్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యాబోధన చేస్తున్నాం. తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించి.. విద్యార్థుల ప్రగతిపై చర్చిస్తున్నాం. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడమే లక్ష్యం. విద్యార్థులు కష్టపడటంతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. – రైసీ ఫాతిమా, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, వెన్నాచేడ్ మోడల్ స్కూల్లో విద్యా బోధన బాగుందని విన్నా ను. ఎలాగైనా అక్కడ చేరా లని అనుకున్నా. మా స్నేహితుల సహకారంతో సీటు సంపాదించాను. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో చేరాను. అక్కడే హాస్టల్ సీటు కూడా దొరికింది. దీంతో కష్టపడి చదివాను. ఉపాధ్యాయులు కూడా చక్కగా ప్రోత్సహించారు. మొత్తం 470 మార్కులకు గాను 465 మార్కులతో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించాను. – టి.అశ్విని, వేపూర్, హన్వాడ మండలం -
నెట్టెంపాడుకు నీటి పంపింగ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం వరకు 3,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఒక్కో పనికి.. ఒక్కో రేటు
ధరూరు: తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారని, ఏ చిన్న పని జరగాలన్నా అధికారులకు పైసలు ముట్టజెప్పాలని ఓ రైతు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మన్నాపురం గ్రామానికి చెందిన రైతు గోవిందు తన కొడుకు, కోడలు పేర్లు రేషన్ కార్డుల్లో ఎక్కించాలని నెల రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయంలో అధికారులు రూ.200, మరోచోట రూ.500 తీసుకున్నారని, అయినా పని చేయడం లేదని, నెల రోజులు గడిచినా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యాలయ సిబ్బందిపై విసుగు చెందిన సదరు రైతు ధరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వచ్చారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. తహసీల్దార్ నందిని, కార్యక్రమానికి వచ్చిన ప్రజల ముందే ఎమ్మెల్యే తన గోడును వెళ్లగక్కాడు. ఇప్పటికే పలుమార్లు డబ్బులు ఇచ్చానని, పని చేయిడం లేదని, ఇంకా డబ్బులు ఇవ్వడం తన వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న తహసీల్దార్కు విషయం ఏంటో చూడాలని.. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ● తహసీల్దార్ ఎదుటే అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు -
‘డైవర్షన్’లోనే రాజోళిబండ
గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్వర్క్స్ నిర్మాణం చేపట్టారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేల లోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ● తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్తో కూడిన అధికారుల బృందం మంగళవారం కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను సందర్శించింది. ఆనకట్ట, స్లూయిస్ నిర్మాణాలు, ప్యాకేజీ–1, 2 పరిధిలో అసంపూర్తి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆయకట్టుదారులతో కలిసి కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ను కలిసి.. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా వివరించారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ ప్రాంతంలో 30 టీఎంసీల రిజర్వాయర్, అలాగే రాజోళి వద్ద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ‘‘ఆర్డీఎస్కు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. దీనిపై తాను రైతులతో కలిసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చూపాలంటే 30 టీఎంసీల హెడ్వర్క్స్ వద్ద రిజర్వాయర్, మల్లమ్మకుంట రిజర్వాయర్, సుమారు 75 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టను పునర్నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.’’ అని సీతారామిరెడ్డి పేర్కొన్నారు. ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ఏళ్లతరబడిగా తేలని నడిగడ్డ రైతుల నీటివాటా తాజాగా హెడ్వర్క్స్ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి -
మహబూబ్నగర్
స్నేహితుడి బర్త్డే రోజే.. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొన్న ఇద్దరు మిత్రులు ఆ తర్వాత బైక్పై వెళ్తుండగా డీసీఎం ఢీకొని మృతిచెందారు. బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026–8లో u నియంత్రణ చట్టం తేవాలి.. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. దీనివల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన వి ద్య అందుతుంది. యాజమాన్యాలు వి ద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా రు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవే టు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. – సీతారాముడు, పీడీఎస్యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి నిబంధనలకు విరుద్ధం.. ప్రభుత్వ అనుమతి లేకుండా మహబూబ్నగర్లోని నారాయ ణ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుంటే వాటిని పట్టుకున్నా ం. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేశాం. ఎంఈఓకు ఫోన్ ద్వా రా సమాచారం ఇస్తే నాకు మీటింగ్ ఉందని చెప్పి రాలే దు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలను తనిఖీ చేయాలి. – శివసాగర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రు లు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితో పాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవే టు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నా రు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూని ఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
● గద్వాలలో నదిఅగ్రహారం వెళ్లే మార్గంలో వెలసిన రెండు ప్రైవేటు పాఠశాలలు రూ.35 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాగే యూనిఫాంలు, పుస్తకాలు, ఇతరత్రా వారి పేరిట మరో రూ.15–20 వేల వరకు అదనంగా లాగుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ని పోలీస్స్టేషన్ వెనకాల ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు పాఠశాల 6, 7 తరగతులకు అడ్మిషన్ ఫీజు, ఐఐటీ, నీట్, మెటీరియల్, యూనిఫాం ఇతరత్రా వాటి పేరుతో రూ.40–70 వేల వరకు వసూలు చేస్తున్నారు. ● పాలమూరు నగరంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో కేవలం ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి విద్యార్థులకు రూ.35– 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, అక్కడే కొనాలి. దీంతో ఒక్కొక్కరిపై కనీసం రూ.8 వేల వరకు అదనపు భారం పడుతుంది. ● నగరంలోని క్రిష్టియన్పల్లి సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పాఠశాలలో 5, 6, 7 తరగతుల ఫీజులు రూ.45–65 వేల వరకు వసూలు చేస్తున్నారు. సదరు పాఠశాలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ● ఏనుగొండ సమీపంలో ఇటీవల ప్రారంభించిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. 6, 7 తరగతి విద్యార్థులకే రూ.70–95 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు యూనిఫాం, పుస్తకాలు అదనం. మయూరి పార్కు వద్ద ఇటీవల ప్రారంభించిన పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థికి రూ.50– 70 వేలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజికసేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల లోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూ లు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐ టీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో దోపిడీ ఇలా.. నారాయణపేట కలెక్టరేట్కు దగ్గరలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులకు రూ.45వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి బస్సు ఫీజు అదనం. తల్లిదండ్రులు ఎవరైనా తెలిసిన వారితో రికమండ్ చేస్తే.. ఫీజులు తగ్గిస్తాం కానీ మీ పిల్లలు చదువులో వెనకబడితే మాకు తెలవదంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ చెబుతున్నాడు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు.. స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, షూ పేరుతో నిలువుదోపిడీ పాఠశాలల్లోనే విక్రయిస్తున్నా పట్టింపులేని విద్యాధికారులు -
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా విచారణ పూర్తి చేయాలి
మహబూబ్నగర్ క్రైం: ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్శాఖను ఆశ్రయించినప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా విచారణ పూర్తి చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కొక్కరికి సంబంధించిన ఫిర్యాదులు పరిశీలించి ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడారు. బాధితులు ఎవరైనా తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉదండాపూర్ ఆలస్యం జడ్చర్ల టౌన్: గత ప్రభుత్వ పూర్తిగా నిర్లక్ష్యం వహించటం వల్లే ఉదండాపూర్ ప్రాజెక్టు ఆలస్యమైందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఓటరు జాబితా, సర్పై బూత్ లెవల్ పార్టీ ఏజెంట్ల శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ నాడు హామీలు ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రూ.631 కోట్ల నిధులు మంజూరు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు టీఎంసీ కేటాయింపుల సమయంలో అప్పటి పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదండాపూర్ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, ప్రాధాన్యం తీసుకురావడంతో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఉదండాపూర్ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. జడ్చర్ల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని, బైపాస్రోడ్డు, రెవెన్యూ డివిజన్లు సాధిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రంగనాయకస్వామి గుట్టపై భారీ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించగానే కొందరు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. సర్పై నిర్వహిస్తున్న శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. హిందుత్వ ఎజెండాను అమలు చేస్తున్న బీజేపీ మహబూబ్నగర్ న్యూటౌన్: దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందుత్వ ఎజెండాను అమలు చేస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ ఆరోపించారు. సీపీఎం మాజీ ఎంపీ మధు సతీమణి సుమతిని పరామర్శించేందుకు సోమవారం మహబూబ్నగర్కు వచ్చిన ఆయన మీడియాతో పమాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 12ఏళ్లు అవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, సామాన్యుడు బతకడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెంచేసిందన్నారు. ప్రజా ఆగ్రహంతో బంగ్లాదేశ్, శ్రీలంక నేపాల్ ప్రభుత్వాలు కుప్పకూలాయని, మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను ప్రజలు మట్టికరిపిస్తూ టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, సీబీఐ వ్యవస్థల పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెడితే రానున్నకాలంలో బీజేపీని, రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ప్రజలు పక్కకు పెట్టే తరుణం ఆసన్నమైందని వారు జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, నాయకులు పరమేశ్ గౌడ్, పద్మావతి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియతో కలిపి ప్రజల నుంచి 119 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికీ చాలా శాఖలలో ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించి పోర్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై సమీక్ష అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, నషాముక్త్ భారత్పై జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగంతో కలిసి సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల చేరికలను పెంచేందుకు ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట’ పై అవగాహన కల్పించాలన్నారు. దీనిని విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సహకరించాలన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలనే లక్ష్యంగా ’నషాముక్త్ భారత్ అభియాన్.. వికసిత్ భారత్కి పహచాన్’ని ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, ఎకై ్సజ్, ఎన్ఎస్ఎస్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శ్రీసే నో టు డ్రగ్స్శ్రీపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాలలో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్మధుసూదన్ నాయక్ ప్రజావాణిలో 119 వినతుల స్వీకరణ -
మొదటి రోజు డీఈఓ తనిఖీలు..
పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు డీఈఓ విజయకుమారి పాఠశాలలను తనిఖీలు చేశారు. జడ్చర్ల మండలం పోలేపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, గంగాపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, రామస్వామిగుట్ట తండా ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ పెద్ద ఆదిరాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉదయం పోలేపల్లి ప్రాథమిక పాఠశాలల ప్రార్థనకు హాజరైన ఆమె విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. పాఠశాలలకు రాని వారి తల్లిదండ్రులకు ఫోన్లో సంప్రదించి విద్యార్థులను పాఠశాలకు పంపే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమెతో పాటు ఎంఈఓ మంజూలాదేవి ఉన్నారు. ● జడ్చర్ల మండలంలోని రామస్వామిగుట్టతండా పాఠశాలలో 43 మంది విద్యార్థులుండగా.. మొదటి రోజున 38 మంది విద్యార్థులు, వారి పేరెంట్స్ హాజరయ్యారు. ఎక్కువ మంది హాజరుకావడంపై డీఈఓ అభినందించారు. ఇక్కడ తొలిరోజే విద్యార్థులతో వివిధ వేషాధారణ, టీఎల్ం బోధన ప్రారంభించారు. -
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు జిల్లా విద్యార్థులు సోమవారం ఇక్కడి నుంచి బయలుదేరారు. అమ్మాయిల విభాగంలో వినూత్న 28 కేజీ, అన్విత రెడ్డి 33 కేజీ, అర్ఫా ఫాతిమా 37కేజీ, రిత్విక 36కేజీ, అబ్బాయిల విభాగంలో రాహుల్ 37 కేజీ, దీక్షిత్ 42 కేజీ, శివప్రసాద్ 63 కేజీ, రేవంత్ 37 కేజీ, విశాల్ 47 కేజీ విభాగంలో పాల్గొంటారు. అంతకుముందు వీరిని జిల్లా కేంద్రంలోనని ప్రధాన స్టేడియంలో జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్ఓ) రాజశేఖర్ రెడ్డి అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనంద్, అథ్లెటిక్ కోచ్ సునీల్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడురవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, కోచ్లు యా మిని, జయదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణలో చలనం
గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. ● నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ● 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. ● 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. వేగవంతంగా చేస్తున్నాం.. జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రిజ్వాన్బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి మౌలిసదుపాయాల కల్పనకు చర్యలు -
తొలి రోజు అంతంతే
నవాబుపేట పాఠశాలను ప్రత్యేకంగా అలంకరించి..విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు పాఠశాలలు సోమవారం పునః ప్రారంభం కాగా.. తక్కువమంది విద్యార్థులు హాజరుకవాడంతో తరగతి గదులు ఖాళీగా కనిపించాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 850కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు ఉండగా మొదటి రోజు హాజరు శాతం అంతంతే నమోదైంది. దాదాపు 72 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లలో చదువుతుండగా.. కేవలం 5,266 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం అమావాస్య కారణంగా తక్కువ మంది విద్యార్థులు వచ్చినట్లు తెలుస్తోంది. ● చిన్నచింతకుంట ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ముగ్గురు, కురుమూర్తి పాఠశాలలో పది మంది, మద్దూరు ప్రైమరీ స్కూల్లో 11, అల్లీపూర్లో 56, అమ్మాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 50 మంది మాత్రమే హాజరయ్యారు. మహమ్మదాబాద్ మండలం నంచర్ల ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు 11 మంది విద్యార్థులే వచ్చారు. జిల్లాకేంద్రంలోని 700–800 మంది విద్యార్థులు ఉండే పాఠశాలల్లోని మాడ్రల్ స్కూల్లో 30 మంది, షాబజార్లో 50 మంది, పీఎస్ వెంకటేశ్వరకాలనీ స్కూల్లో 40 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గండేడ్ మండలంలోని వెన్నచేడ్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాథమిక పాఠశాల, నవాబుపేట పాఠశాల, జడ్చర్ల మండలం పోలేపల్లి పాఠశాలలను పూలతో అలంకరించి.. విద్యార్థులకు స్వాగతం పలికారు. ● జిల్లావ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులు ఆన్లైన్లో వేసే అటెండెన్స్ యాప్ పని చేయలేదు. ఫేషియల్ రికగ్నిషన్ లేటెస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ నెట్వర్క్ సమస్యని చూపించడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. మోగిన బడిగంట పాఠశాలల పునఃప్రారంభానికిఅమావాస్య ఎఫెక్ట్ మొదటి రోజు తక్కువ సంఖ్యలో హాజరైన విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 5,266 మంది విద్యార్థులు మాత్రమే హాజరు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కుల అందజేత, కనిపించని యూనిఫాం పంపిణీ -
పాలమూరులో దంచికొట్టిన వాన
● నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగు ● విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం మహబూబ్నగర్ (వ్యవసాయం)/ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన గణేష్నగర్, రామయ్యబౌలి, శివశక్తినగర్, గచ్చిబౌలి, బీకేరెడ్డి కాలనీ, కుర్హినిశెట్టికాలనీ, కిసాన్నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా గల్లీ రోడ్లపైకి మురుగుతోపాటు వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే 12 విలీన గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. ఊరటనిచ్చిన వానలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 15.3 మి.మీ., నమోదైంది. సాయంత్రం పలు మండలాల్లో కొనసాగింది. దీంతో ఎండల తీవ్రత తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా అధికారుల గణాంకాల ప్రకారం ఆదివారం జిల్లాలో సగటున 15.3 మి.మీ., వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాలానగర్ మండలంలో 36.8 మి.మీ., అత్యల్పంగా హన్వాడలో 5.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. గండేడ్, మూసాపేట, మహమ్మదాబాద్ మండలాల్లోనూ వర్షం కురిసింది. ఇప్పటికే వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతుండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో తేమ శాతం పెరిగింది. మరోవైపు వాతావరణ శాఖ రానున్న రోజుల్లోనూ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
క్రికెట్లో ఆణిముత్యాలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో విద్యార్థుల్లో దాగిన ఉన్న క్రికెట్ నైపుణ్యాలను వెలికితీసి వారు క్రికెట్లో రాణించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్, మహబూబ్నగర్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గతనెల 12వ తేదీన కోచ్ అజయ్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిచారు. ఈ శిక్షణ శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ రియాజ్, ఉమ్మడి పాలమూర్ జిల్లా క్రికెట్ అసోషియేషన్ సెక్రెటరీ రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ సురేష్కుమార్ ప్రారంభించారు. 100మందికి శిక్షణ స్థానికి మినీ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో కోచ్ అజయ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని గ్రామా ల్లో ఉండే క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి 100మందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ అండర్–12,14,19 విభాగా ల్లో ఇచ్చి 100మందిలో సత్తా చాటిన క్రీడాకారులను నారాయణపేట జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా దీనికోసం అండర్–16 ఇంట్రో డిస్ట్రిక్ క్రికెట్ మ్యాచ్లను హెచ్సీఏ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల మధ్య జిల్లా కేంద్రంలోని స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాల గ్రౌండ్లో నిర్వహించి జిల్లాస్థాయిలో సత్తా చాటిన వారిని ఉమ్మడి మహబూబ్నగర్కు ఎంపిక చేసి అక్కడ సత్తా చాటిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించి కిట్లు అందజేస్తున్న రాజశేఖర్(ఫైల్) ఎంతో ఉపయోగం గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి శిబిరాలు ఎంతోగానో ఉపయాగపడతున్నాయి. నారాయణపేటకు చెందిన అఫాన్ గతంలో ఈ సమ్మర్ క్యాంపు ద్వారానే రాష్ట్రస్థాయికి ఎంపికై జడ్చర్లలో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా శ్రీహరి కూడా ఈ క్యాంపు ద్వారానే శిక్షణ తీసుకొని నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. వేసవి శిక్షణ శిబిరం నుంచి రాష్ట్రస్థాయికి.. జూన్ 10న ముగిసిన వేసవి శిక్షణ శిబిరం మే 12నుంచి జూన్ 10వరకు నిర్వహణ హెచ్సీఏ, ఎంసీఏ ఆధ్వర్యంలో 100మందికి తర్ఫీదు -
పంటల సాగు.. జాగ్రత్తలతో మేలు
● విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి ● లేదంటే నష్టపోయే అవకాశం అలంపూర్ : వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. విత్తనాలు, ఎ రువులు, పురుగుల మందులు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీల బెడద అధికంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి సూచిస్తున్నారు. అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల కొనుగోళ్లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే సాగు కష్టం బూ డిదలో పోసిన పన్నీరుగా మారుతుందని పేర్కొంటున్నారు. విత్తన, ఎరువుల కొనుగోళ్లలో రైతులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాల కొనుగోళ్లలో... ● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులో విత్తనం రకం, నెంబర్, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలరు సంతకం, రైతు సంతకం బిల్లులో ఉండే విధంగా చూసుకోవాలి. ● లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరచిన డబ్బాల నుంచి కొనకపోవడం మంచిది. గడవు దాటిన విత్తనాల జోలికి వెళ్లవద్దు. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నెంబర్, రైతు పేరు, గ్రామం పేరు,విక్రయదారుడి సంతకం, తేదీలు, రకం పేరు, బ్యాచ్ నెంబర్, గడువ తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి. ● విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలను తీసుకోని వాటిలో పేర్కొన్న అంశాలను పరిశీలించాలి. ● మొలకెత్తే దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన బి ల్లును పంట కాలంపూర్త య్యే వరకు దాచి పెట్టుకోవాలి. ● అరువు పద్ధతిలో కొనుగో లు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని తీసుకోవాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న విత్తనాలను వాడాలి. పురుగు మందుల కొనుగోలు సమయంలో... ● చీడ పీడల నివారణకు వినియోగించే క్రిమి సంహారక మందుల కొనుగోలు సమయాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ● వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే వాడాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడవద్దు. ● లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. ● పురుగు మందుల డబ్బాపై వజ్రాకారంలో పురుగుల మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విష పూరితమైతే నీలం రంగు, స్వల్ప విష పూరితమైతే ఆకు పచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగుల మందులు రెండు మూడు రకాలు కలిపి వాడరాదు. ●వాడిన డబ్బాలు, సీసాలు, ధ్వంసం చేసి గుంతల్లో పూడ్చి పెట్టాలి. పురుగుల మందులు వాడటానికి వినియోగించిన పాత్రలను ఇతర అవసరాలకు వినియోగించ రాదు. ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు : ● లైసెన్స్ దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన బిల్లులు, ఖాళీ సంచులు పంట కాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలి. ●మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే వాడాలి. ఒక వేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ● ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు ఖచ్చితంగా ఉండాలి. ● కొనుగోలు సమయంలో డీలర్ రశీదులో రైతు విధిగా సంతకం చేయాలి. ● ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపాలి. ● చిల్లుపడిన, చిరిగిన బస్లాల్లోని ఎరువుల బస్తాలను కొనుగోళు చేయరాదు. అన్య పదార్థాలు కనిపిస్తే ఆ ఎరువులను కల్తీలుగా గుర్తించాలి. పాడి–పంట -
బహుజన బలం.. అధికార పీఠం వైపు
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం ద క్కడం లేదని, జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాలు అధికారానికి దూరంగా ఉండటం సామా జిక న్యాయానికి విరుద్ధమని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లో నిర్వహించిన సామాజిక న్యాయం–రాజ్యాధికారం సభలో ఆయ న ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం మేర ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పటికీ రాజకీయ నిర్ణయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ వర్గాలను గుర్తు చేసుకుంటున్న ప్రధా న రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వా త వారి సమస్యలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధనలో వెనుకబడిన వర్గాలు కీలక పాత్ర పోషించినప్పటికీ, రాష్ట్ర నిర్మాణం అనంతరం వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదన్నారు. సామాజిక సమానత్వం సాధించాలంటే రాజకీయ అధికారం కూడా సమానంగా పంచబడాలని పేర్కొన్నారు. ఈ దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక మార్పు కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు ప్రజలను చైతన్యపరుస్తూ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పా రు. సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు సంయుక్త కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ప్రజల్లో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెస ర్ రామయ్య యాదవ్, తోట్ల రాఘవేంద్ర, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్ పాషా, రాష్ట్ర కార్యదర్శి బాలయ్య పాల్గొన్నారు. -
చేపల వలకు చిక్కిన మొసలి
ఎర్రవల్లి: మండలంలోని తిమ్మాపురం పెద్ద చెరువులో చేప ల వలకు ఓ మొసలి చిక్కింది. మత్య్సకారుల సంఘం సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో స్థానిక మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతుండగా ఆదివారం వలకు మొసలి చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. అనంతరం మత్స్యకారులు వలను ఒడ్డుకు తీసుకొచ్చి ఫారె స్ట్, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారి మన్యమయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మొసలిని బంధించి, బీచుపల్లి సమీపంలోని కృష్ణానది మడుగులో వదిలారు. ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధం కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధమైన ఘటన మ ండల పరిధిలో ఆది వారం చోటుచేసు కుంది. నాచారం గ్రా మంలోని శ్రీ వెంకటసాయి ఇండస్ట్రీస్–పారాబాయిల్డ్ రైస్మిల్లో జనరేటర్ రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైస్మిల్ యజమాని చల్లా శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపుచేయగా అప్పటికే జనరేటర్ కాలిపోయింది. సుమారు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. -
కోచింగ్ బాగుంది
జాతీయ జట్టుకు ఆడాలని ఉంది గతేడాది సమ్మర్ క్రికెట్ శిబిరం ద్వారా శిక్షణ తీసుకొని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని సత్తా చాటా. అదేవిధంగా క్రికెట్లో మెళకువలు నేర్చుకొని జాతీయ జట్టుకు ఆడాలని ఉంది. – అఫాన్, అండర్–17 స్టేట్ ప్లేయర్, నారాయణపేట నెలరోజులుగా నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు శిక్షణ చాలా బాగుంది. మా కోచ్ అజయ్ ఎంతో ఓపికతో టెక్నిక్స్ నేర్పుతున్నాడు. మా లాంటి ఆర్థిక పరిస్థితి బాలేని వారికి ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగకరం. – సాత్విక్, అండర్–12 డిస్ట్రిక్ ప్లేయర్, నారాయణపేట. -
జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 1,972 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు సంబంధించి రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొ డ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఒక గేటు ద్వారా నీటి విడుదల సుంకేసుల డ్యాంలో ఆదివారం ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ఎగువనున్న వాగులు, వంకల నీరు వచ్చి చేరడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డ్యాం అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎల్లికల్ యువకుడి మృతి
కల్వకుర్తి రూరల్: నాగర్కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన దాదా మోని బాలకృష్ణ (21) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. బాలకృష్ణ తండ్రి చంద్రయ్య వీఆర్వోగా తెలకపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబమంతా తెలకపల్లిలో నివాసముంటున్నారు. మృతుడు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన కారును వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎల్లికల్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి ఇద్దరు సోదరీమణులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో.. మక్తల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్కు చెందిన రాఘవేందర్రెడ్డి (30), తన అన్నకు మధ్య భూతగాదాలు ఉన్నా యి. ఈ క్రమంలో రాఘవేందర్రెడ్డి మృతి చెందడంలో అన్న వదినల ప్రమేయం ఉంద ని అనుమానం వ్యక్తం చేస్తూ.. మృతుడి అక్క నర్వకు చెందిన తిలేటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, మృతికి గల కారణాలు తెలుసుకుంటామని ఎస్ఐ తెలిపారు. పిడుగు పాటుకు పశువులు మృతి పెద్దకొత్తపల్లి: మండలంలోని మరికల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుతో దేవరపాగా జపాన్ తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న నాలుగు పశువులు మృతిచెందాయి. పశువుల విలువ దాదాపుగా రూ.1.50లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. వ్యవసాయ పొలం పనులు చేసే పశువులు మృతి చెందడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ రాముడు, వార్డుసభ్యుడు ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన పశువులను పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి రైతును ఆదుకోవాలని వారు కోరారు. రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి వనపర్తి రూరల్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ వినోద్కుమార్పాల్ (46) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. హత్య ఘటనపై కేసు నమోదు గోపాల్పేట: వుండల కేంద్రంలో శనివారం ఉదయం గొర్రెల కాపరిపై కొందరు దాడిచేసి, హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామని గోపాల్పేట ఎస్ఐ శశిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదుల మండలంలోని మాచుపల్లికి చెందిన బూత్కూరి బాల్చంద్రి (50) గొర్రెల కాపరిగా మండల కేంద్రానికి చెందిన లక్ష్మి వద్ద జీతం కుదుర్చుకున్నాడు. వారి మంద వెంట తిరిగే మరో మందకు చెందిన మల్లేష్, ఆయన తల్లి నీలమ్మ, భార్య సుమతి వారి గొర్రెల కాపరిగా పనిచేయాలని కోరగా.. బాల్చంద్రి ఒప్పుకోలేదు. ఇది మనసులో పెట్టుకోవడంతో పాటు అప్పుడప్పుడు గొర్రెల దొంగతనం చేసే మల్లేష్ గురించి బయట చెబుతాడనే అనుమానంతో శనివారం ఉదయం గోపాల్పేట, చెన్నూరు శివారులో గొర్రెలు మేపుతున్న బాల్చంద్రి వద్దకు మల్లేష్, సుమతి, నీలమ్మ ముగ్గు రూ కలిసి కట్టెలతో కొట్టారు. అనంతరం మల్లే్ ష తన వెంట తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్తో బాల్చంద్రి మర్మాంగాలపై దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బూత్కూరి వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ వివరించారు. -
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో పార్టీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడి వద్దకు చేరుకుని సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. అంతకు ముందు దివ్యాంగులతో ముఖాముఖి సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. కొందరు దివ్యాంగులు తమకు ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి కోసం మోటారు వాహనాలు కావాలని, సదరం ధ్రువపత్రాల కోసం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు వెంకటేష్, కార్యదర్శి వీరేష్కుమార్, నాయకులు శ్రీనివాస్, బురానప్ప, ఇప్పటి నర్సింహులు పాల్గొన్నారు. -
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అధికారులతో ఆయన వీసీ నిర్వహించి.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. మండల స్థాయిలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని, గతేడాది ఎదురైన సవాళ్లను ముందుగానే పరిష్కరించుకునేలా అప్రమత్తం కావాలన్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్రామ స్థాయిలో టాం టాం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, తహసీల్దార్, ఎంపీడీఓలు గ్రామాల్లో గజ ఈతగాళ్లు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు, సెల్ నంబర్లు సేకరించాలని, ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే తక్షణమే వారి సహాయం తీసుకొని ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో రోడ్ల మీద వర్షపు నీరు పారకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిష్కరించేలా బాధ్యత వహించాలన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున, పరిసరాలను ఎంపీడీలు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయి నుంచి ఏమైనా సమాచారం వస్తే వాటిని మండల, డివిజన్ స్థాయి అధికారులకు చేరవేసి సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శిథిలబడినవే..!
●ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సమకూరని వసతులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకోనున్నాయి. 45 రోజులపాటు వేసవి సెలవులు గడిపిన విద్యార్థులు ఇక పాఠశాలల బాట పట్టనున్నారు. అయితే మరో విద్యా సంవత్సరం 2026– 27 ప్రారంభమవుతున్నా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం వసతులు, సౌకర్యాలు మెరుగుపడటం లేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 851 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రాథమిక 616, ప్రాథమికోన్నత 83, ఉన్నత పాఠశాలలు 152 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే 2023– 24 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం ద్వారా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటివి నిర్మించినా.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వాటిని అప్పగించకుండా తాళాలు వేశారు. బహుభాష బోధనా సమస్యే.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో తెలుగు మీడియంలో ఎక్కువగా బోధన జరుగుతుండగా.. గత ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ మీడియం సైతం ప్రవేశపెట్టారు. వీటికి తోడు కొన్ని పాఠశాలల్లో ఉర్దూ మీడియం కూడా బోధిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ బేసిక్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7 వరకు తరగతులు ఉండగా ఇందులో తెలుగు, ఇంగ్లిష్తోపాటు ఉర్దూ మీడియం విద్యార్థులు చదువుతున్నారు. మూడు భాషలలో కలిపి సుమారు 190 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. తరగతి గదులు మాత్రం 6 ఉన్నాయి. దీంతో ఒకే గదిలో పలు తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది. తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేక ఇక్కట్లు ఇంగ్లిష్, తెలుగు మీడియంతో తీవ్రమైన గదుల కొరత జిల్లాలో 851 పాఠశాలలు, 72 వేల మంది విద్యార్థులు నేటినుంచి పునఃప్రారంభం కానున్న విద్యాసంస్థలు -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు ● 188 మంది విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్పేటలో స్కాలర్షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు. -
పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి
పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. రాజీ కేసుల సంఖ్య పెరగాలి మహబూబ్నగర్ క్రైం: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్ష్యిదారులు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివిధ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదిక అన్నారు. ట్రాఫిక్ చలానాలు, క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, రాజీకి అనుకూలంగా ఉన్న ఇతర కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ నుంచి రాజీ చేసుకోవడానికి వీలున్న ప్రతి కక్షిదారుడు లోక్ అదాలత్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందికి సూచించారు. మార్కెట్కు తగ్గిన వరి ధాన్యం రాక నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు నెల రోజులపాటు భారీగా వచ్చిన వరిధాన్యం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గత వారం వరకు 15 వేల బస్తాలకు తగ్గకుండా ప్రతి ఆదివారం ధాన్యం వచ్చేది. కాగా ఈసారి కేవలం 4,882 బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. అయితే ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,912, కనిష్టంగా రూ.2,892 ధర లభించిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు. -
వసతులు మెరుగుపర్చాలి..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల బడులు శిథిలావస్థకు చేరాయి. ఏఐ, ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించినా.. తరగతి గదులు లేకుంటే విద్యార్థులు ఎక్కడ కూర్చొని తరగతులు వినాలి. పూర్తిస్థాయిలో టీచింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు అధికారులు వెంటనే స్పందించి పాఠశాలల్లో వసతులు కల్పించాలి. – అర్జున్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బయటికి వెళ్లే దుస్థితి నెలకొంది. దేవరకద్ర, చిన్నచింతకుంట, వడ్డెమాన్, మాడల్ బేసిక్ పాఠశాలల్లో సమస్యలపై గతంలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. తరగతి, వంట గదులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. అధికారులు స్పందించకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యమంలో ఉద్యమిస్తాం. – సీతారాం, పీడీఎస్యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు
అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి -
అయిజలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి
అయిజ: ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అయిజలో సందడి చేశారు. శనివారం తన మేనమామ ఆంధ్ర శేఖర్ ఇంట్లో బసచేసిన ఆయనను.. పలువురు మిత్రులు, బంధువులు మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో కొత్త సినిమా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తాను దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్–2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్–3, భగవంత్ కేసరి, సంక్రాతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ సినిమాల చిత్రీకరణకు ముందు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించానని.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయని చెప్పారు. ప్రతి సినిమా చిత్రీకరణకు ముందు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించడం సెంటిమెంట్ అని.. అది ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. త్వరలో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మోదీ పాలన
వనపర్తిటౌన్: ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ వికసిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ స్థాయిలో భారత దేశానికి గుర్తింపు పెంచిన నాయకుడిగా మోదీ దేశ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రంలో 2500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం డోర్నకల్ టు గద్వాల వయా వనపర్తి 290 కి.మీ దారుల నిర్మాణం ప్రారంభం కాబోతుందని, మహారాష్ట్ర నుండి నిజాంబాద్ మేడ్చల్ మీదుగా డోన్ వరకు 417 కిలోమీటర్లు రూ.4,686 కోట్ల నిధులతో డబ్లింగ్ పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ కూలి రూ.155 నుంచి రూ.307 పెంచాడని, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు మేరకు పెట్టుబడి రూ.100 ఉంటే రూ.150 మద్దతు ధర కల్పించాలన్న నిర్ణయాన్ని మోదీ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 54 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులతో 70 ఏళ్ల వరకు ప్రతి వ్యక్తికి రూ.ఐదు లక్షలు 70 ఏళ్లు దాటిన వ్యక్తికి అదనంగా రూ.ఐదు లక్షల బీమా లభిస్తుందని, దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, కేతూరి బుడ్డన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
కొత్తకోట రూరల్: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన ఘటన కొత్తకోట మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు రామనంతపురం గ్రామానికి చెందిన పసుపుల మన్నెమ్మ కొంత కాలంగా కొత్తకోట పట్టణంలో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
రక్తదాతలకు సలాం
● అత్యవసర సమయంలో రక్తమిచ్చి ప్రాణాలు కాపాడుతున్న దాతలు ● ఏడాదికి రెండు, మూడుసార్లు రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న వైనం ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి.. సర్జరీ కావాల్సిన రోగికి.. ప్రసవమయ్యే గర్భిణికి.. తలసేమియా బాధితులకు.. ఇలా అత్యవసరంగా రక్తం కావాల్సిన ప్రతి ఒక్కరికీ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు రక్తదాతలు. కొందరు ఒకటి, రెండుసార్లు ఇచ్చి.. ఇక ఆ తర్వాత రక్తదానం చేయడం ఆపేస్తారు. కానీ మరికొందరు ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర సమయంలో రక్తం కొరత లేకుండా చూస్తూ.. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – పాలమూరు/కందనూలు -
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
● డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై నిఘా పెట్టాలి ● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్ వారీగా ఉన్న పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, కోర్టు ట్రయల్ ఉన్న కేసుల పురోగతిపై నిత్యం అప్డేట్ చేస్తుండాలని పోలీస్ అధికారులను ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట స్టేషన్ వారీగా నమోదైన కేసులు, పనితీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో కేసులు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య సంస్థల పరిసరా ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ డ్రగ్స్, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచడంతో పాటు రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. వారెంట్ల అమలు, పరారీలో ఉన్న నిందితుల అరెస్టులు, కమ్యూనిటీ పోలీసింగ్పై కూడా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, మహేష్, రామకృష్ణ. మోతీరాం, ఎస్ఐలు పాల్గొన్నారు. ● ఇటీవల జిల్లాలో బదిలీపై నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐలు శనివారం ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే సీసీఎస్ సీఐగా ఉన్న కృష్ణయ్య నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతో పని చేయాలని సూచించారు. -
కొమ్ము పురుగును ఇలా నివారిద్దాం
● సలహాలు సూచనలు పాటిస్తే అధిక లాభాలు ● మధనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి కొత్తకోట రూరల్: జిల్లాలో ఆయిల్ పాం పంట సాగు క్రమేణా పెరుగుతుంది. అయితే పంటలో కొమ్ము పురుగు వ్యాపించే అవకాశం ఉండడంతో మదనాపురం కేవీకే శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి పురుగు నివారణకు పలు సూచనలు చేశారు. కొమ్ము పురుగు (రైనోసిరస్ బీటిల్) 30–50 మి.మీ పొడవుతో ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉంటుందని, పురుగు 100–150 వరకు తెలుపు రంగు గుడ్లను 5–10 సెం.మీ లోతులో పశువుల పెండ కుప్పలో లేదా చనిపోయిన చెట్ల మొదళ్లలో సముదాయాలుగా పెరుగుతుందని సూచించారు. ఈ గుడ్లు 2–3 వారాలలో పొదుగుతాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలు 30సెం.మీ లోతులో ఉండి కోశస్థ దశలుగా వృద్ది చెంది 3–4 వారాల తర్వాత రెక్కల పురుగు (బీటిల్స్)గా మారుతాయి. తల్లి రెక్ల పురుగులు 200 రోజులు బతికి ఉంటూ సంవత్సరానికి ఒకేసారి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ బీటిల్స్ ఎక్కువగా మొక్క మొదలు దగ్గర అప్పుడే ఏర్పడుతున్న మొవ్వ, ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల చివర గ ఆకారపు ఖాళీలు ఏర్పరుస్తాయి. మొవ్వ భాగంలోని ఆకులు కురసగా మెలికలు తిరిగినట్టు అవుతాయి. లేత మొవ్వభాగం ఆశించి లోపలికి చొచ్చుకొపోయి రంధ్రాలు చేసి మొవ్వ కుల్లిపోయేటట్లు చేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. నివారణ... ● తోటల్లో చనిపోయిన చెట్లను తొలగించాలి. ఆయిల్పాం తోటలను కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో పశువుల ఎరువు(పేడ)ను నిల్వ ఉంచకూడదు. ● పశువుల ఎరువు టన్నుకు కిలో కార్పప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా 2 కిలోల మలాథియాన్ పొడిని కలుపుకొని మొదలు దగ్గర చల్లాలి. ● మొవ్వలో రంధ్రాలు గుర్తించిన వెంటనే కిలో మట్టికి 30 గ్రాముల మ్యాంకోజోబ్, 100 గ్రాముల క్లోరోఫైరిపాస్ పొడి మందును కలిపి రంధ్రాలు పూడ్చాలి. ● సోలార్ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. ● థైనోల్యూర్ కలిగిన లింగాకర్షక బుట్టలు (బకెట్ ఫిర్మోన్ ట్రాప్స్) ఎకరానికి 1–2 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి. ● బీటాల్స్ ఎక్కువగా ఆకర్షించడానికి చెరుకు రసం, ఫైన్ యాపిల్ రసం, ఈస్టును బాగా పులియబెట్టి ఎకరం పొలంలో 5–6 చోట్ల అమర్చుకోవాలి. ● మెటారైజియం అనైసోప్లియా అనే జీవ సంబంధిత శిలీంద్రనాశిని 5గ్రా. లీటరు నీటిలో కలిసి మొవ్వ తడిచేలా పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. ● పురుగు నివారణకు తొలిదశలో వేప మందు 10,000 పీపీఎం, 1మి.లీ ల్యామ్దా సైహలోత్రిన్, 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రిన్ ప్రోల్ 0.3 మి.లీ లేదా స్పైనోశాడ్, 0.3 మి.లీ లేదా ట్రెట్రా టింనిప్రోల్ 1.మి.లీ నీటిలో కలిపి మొక్క సుడిలో పోసుకోవాలి. ● తేట తోటల్లో 10–20 గ్రా 3జీ కార్పోప్యూరాన్ గుళికలు లేదా 10గ్రాముల క్లొరాంట్రిన్ఫోల్ గుళి కలు కవర్లలో ఉంచి ఒక చెట్టుకు 4 కవర్లు మొవ్వ భాగంలో కడితే పురుగును నివారించవచ్చు. -
అనుకున్న జీపీ రాలేదనే..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన బదిలీల్లో తాము అనుకున్న జీపీలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో బదిలీలు జరిగి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనుకున్న, లాభసాటి కలిగిన జీపీల్లో పోస్టింగ్ రాకపోవడంతో పలువురు కార్యదర్శులు డిప్యుటేషన్ల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీఓ) చుట్టూ తిరుగుతున్నారు. ఇలా కాదంటే పరస్పర బదిలీలు చేయాలని అధికారులను కోరుతున్నారు. మే చివరి వారంలో 151మంది కార్యదర్శుల బదిలీలకు కలెక్టరేట్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈనెల 1నుంచి ఆర్డర్ కాపీలతో కొత్త జీపీల్లో బాధ్యతలు చేపట్టారు. కొంతమందికి జీపీలు నచ్చకపోవడం, సర్పంచులతో కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం, విధులకు జీపీ దూరంగా ఉండడంతో వారం తిరగక ముందే డిప్యుటేషన్ల రాగం అందుకున్నారు. జీపీలను మార్చాలని డీపీవో ఆఫీసులో అధికారులను కలుస్తున్నారని సమాచారం. ఇటు బదిలీలపై కొత్తగా వచ్చిన కార్యదర్శులను తమకు వద్దంటూ కొందరు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తమకు అనుకూలంగా ఉండే వారికే పోస్టింగ్ ఇవ్వాలని లేదా పాతవారినే కొనసాగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే బదిలీలు పూర్తయిన ఏడాది వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండడం, కలెక్టర్ ఖుష్బూగుప్తా కూడా అధికారులకు స్పష్టంగా చెప్పడంతో డిప్యుటేషన్లను ముట్టుకోవడానికి వెనకాడుతున్నారు. డిప్యుటేషన్లు చేయలేమని డీపీవో అధికారులు సదరు కార్యదర్శులు, సర్పంచులకు సూచిస్తున్నారు. బదిలీ స్థానాల్లోనే కార్యదర్శులు పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పడంతోనేనా..? తమ నియోజకవర్గంలో పనిచేసే చాలామంది పంచాయతీ కార్యదర్శులను తప్పించి పక్క నియోజకవర్గంలో పనిచేసేవారిని రప్పించుకోవాలని ఆయా ఎమ్మెల్యేలు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు బదిలీలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బదిలీల నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు చెప్పడంతో కనీసం ఇతర మండలానికై నా బదిలీలు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా బదిలీలు జరిగినట్లు సమాచారం. కార్యదర్శుల ఇబ్బందులు తాము అనుకున్న జీపీ రాలేదనే భావనలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నట్లు తెలుస్తుంది. బదిలీల సమయంలో తాము పనిచేస్తున్న మండలంలోనే చాలామంది ఆప్షన్లు ఇచ్చారు. తీరా కౌన్సెలింగ్ సమయంలో ఉన్న మండలం కాకుండా వేరే మండలాల్లోని జీపీలు కోరుకోవాలని అధికారులు చెప్పడంతో చేసేది లేక హడావుడిగా పక్క మండలాల్లోని జీపీలను కోరుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. బదిలీ ఉంటే తాము కోరుకున్న స్థానాన్ని కోరుకునే హక్కు ఉద్యోగులకు ఉందని ప్రశ్నిస్తున్నారు. అందుకు భిన్నంగా బదిలీలు జరిగాయనే ఆరోపిస్తున్నారు. బదిలీ కాగానే కార్యదర్శుల డిప్యుటేషన్ రాగం నచ్చినచోట పోస్టింగ్కు పలువురి పావులు కొత్తవారు వద్దంటూ కొందరు సర్పంచుల సిఫార్సులు -
రక్తదాతలకు సలాం
మనుషుల మధ్య ఎన్నో బంధాలు ఉంటాయి.. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా కేవలం మానవత్వంతో రక్త బంధాన్ని ఏర్పరుచుకునేవారే రక్తదాతలు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి ఏటా రెండు నుంచి మూడుసార్లు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ.. మరణం అంచుల్లో ఉన్నవారికి పునర్జన్మను ఇస్తున్నారు. కొందరు పదులు సంఖ్యలో రక్తదానం చేసి ఎందరికో జీవనదానం చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... – పాలమూరు– వివరాలు 8లో.. -
ఇరువురి ఘర్షణలో గొర్లకాపరి హత్య
● కర్రతో విచక్షణారాహితంగా దాడి ● అనంతరం ఠాణాలో లొంగిపోయిన నిందితుడు గోపాల్పేట: ఇరువురి ఘర్షణలో గొర్లకాపరిని కర్రతో కొట్టిచంపి అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయిన ఘటన మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన మందడి లక్ష్మి వద్ద ఏదుల మండలం మాచుపల్లికి చెందిన బాల్చంద్రయ్య(55) గొర్లు మేపేందుకు రూ.2.20లక్షలకు జీతం కుదిరాడు. శుక్రవారంతో సంవత్సరం అయిపోగా.. శుక్రవారం రాత్రి పొద్దున్నే సొంతూరుకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్చేసి చెప్పాడు. శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో వర్షం కురిసి తగ్గిన తర్వాత గోపాల్పేట–చెన్నూరు శివారులో గొర్లు నిలిపిన వద్ద బాల్చంద్రయ్యకు గోపాల్పేటకు చెందిన పుట్టీల నీలమ్మ కుమారుడు మల్లేష్కు గొడవ చోటుచేసుకుంది. గొడవలో భాగంగా బాల్చంద్రయ్యపై మల్లేష్ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాల్చంద్రయ్య అక్కడికక్కడే హత్యకు గురయ్యాడు. అనంతరం మల్లేష్ గోపాల్పేట పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం సీఐ రత్నం, గోపాల్పేట ఎస్ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీంను పిలిపించి బాడీని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య వరమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని.. తమకు రూ.50లక్షలు నష్టపరిహారం చెల్లిస్తేవరకు కదిలేదిలేదని బాధిత కుటుంబ సభ్యులు భీష్మించుకూర్చున్నారు. శనివారం రాత్రి 7గంటలకు పోలీసులు కల్పించుకొని మృతదేహాన్ని వనపర్తికి తరలించారు. -
ఇప్పటికీ 32 సార్లు..
మొదట 2010లో ఒకరికి ఓ–పాజిటివ్ రక్తం అవసరం ఉందని తెలిస్తే వెంటనే రెడ్క్రాస్ వద్దకు చేరుకొని రక్తదానం చేశాను. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది రెండుసార్లు రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశాను. మా పిల్లల పుట్టి న రోజుతో పాటు ప్రతి ఏడాది డిసెంబర్లో నేను పనిచేసే బ్యాంకులో రక్తదాన శిబిరంలో తప్పక చేస్తుంటాను. ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వల్ల అత్యవసరంగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది. – రజినీకాంత్, మహబూబ్నగర్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు.. మా నాన్నకు డయాలసిస్ రావడం.. అత్యవసరంగా రక్తం లభించకపోవడంతో చనిపోయారు. దీంతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ రక్తం అందించడానికి 2018లో సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. ఇప్పటి వర కు 5వేల మందికి రక్తం అందించాం. ఐదు రాష్ట్రాల్లో మా ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు అత్యవసరం వస్తే అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తారు. – టంకర శివప్రసాద్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు.. నాది ఓ–నెగిటివ్ గ్రూప్. ఇది కొంత అరుదుగా లభిస్తుంది. దీంతో అత్యవసరం ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. రెడ్క్రాస్ నుంచి కూడా ఫోన్ చేస్తారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి, రెడ్క్రాస్, హైదరాబాద్ ఇలా అవసరం ఉన్నచోటకు వెళ్లి ఇచ్చి వస్తాను. నేను మొదట వాసవీమాత ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్తదానం చేశాను. ●– సుంకు రామ్మోహన్, బ్రాహ్మణవాడి -
పాముకాటుతోరైతు మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలోని చంద్రబండ తండాకు చెందిన రైతు కేతావత్ శంకర్నాయక్ (47)ను శనివారం పాముకాటు వేయడంతో మృతి చెందాడు. తండావాసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తన పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇంటి యజమాని అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని భార్య మంగమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని సర్పంచ్ చిట్టిశకంర్నాయక్, ఉప సర్పంచ్ శంకర్నాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని కూచూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కూచూర్కు చెందిన కర్రె ప్రభాకర్ (34) లారీ నడుపుతూ జీవనం సాగించేవాడు. లంబాడి కులానికి చెందిన పద్మమ్మ అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా వీరికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ మరో మహిళతో సహజీవనం చేస్తుండటంతో గొడవలు జరిగి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం కలిసి ఉంటున్న మహిళతో కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్ శనివారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కర్రె ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధితుల కథనంం ప్రకారం.. గ్రామానికి చెందిన హరిజన్ రాములు(58) శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద కరెంట్ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్కు గురై కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జానంపేట పీహెచ్సీకి తీసుకెళ్లి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాములును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోధనలు కలచి వేశాయి. మృతుడికి భార్య నాగమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాములు మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇంటిపై తాటిచెట్టు కూలి వృద్ధురాలు మృతి ● మరో ఇద్దరికి గాయాలు మీర్పేట: ఈదురు గాలులకు తాటిచెట్టు కూలి ఇంటిపై పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా, లింగాల మండలం షాన్పేటకు చెందిన సభావత్ లక్ష్మీసేవ్య ఇద్దరు కుమారులు, కోడలుతో కలిసి కొంత కాలంగా జిల్లెలగూడ రాఘవేంద్రనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బలమైన ఈదురు గాలులు వీయడంతో వెనకాల ఉన్న తాటిచెట్టు విరిగి ఇంటిపై పడింది. దీంతో పైకప్పు రేకులు విరిగి నిద్రిస్తున్న లక్ష్మి(75), కుమారుడు వెంకట్రాం, కోడలు లలితపై పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు చెట్టుతో పాటు రేకులు, శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన లక్ష్మి చనిపోయింది. కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. పని నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లిన చిన్నకొడుకు రమేశ్కు ప్రమాదం తప్పింది. రమేశ్ ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు అమరచింత: మండలంలోని ఓ గ్రామంలో మైనర్ను ప్రేమ పేరుతో వేధించడంతో బాలుడితో పాటు మరో ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు తరలించామని ఎస్ఐ స్వాతి తెలిపారు. గ్రామానికి చెందిన బాలికను బాలుడు గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక దృష్టి ● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్ -
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. మాకు పరిహారం అందే వరకూ మా పొలంలో పనులు చేయొద్దని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం చేయాలి. – వైజునాధ్, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి.. కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
మన్యంకొండ సూపరింటెండెంట్కు గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నిత్యానందచారికి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–1 హోదాతో పదోన్నతి కల్పించింది. కౌకుంట్ల గ్రామానికి చెందిన నిత్యానందచారి 1993లో జూనియర్ అసిస్టెంట్గా దేవాదాయ శాఖలో సేవలు ప్రారంభించి, వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. పదోన్నతి సందర్భంగా దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిత్యానందచారి మాట్లాడుతూ తనకు లభించిన పదోన్నతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సహచర ఉద్యోగులు, అధికారులు, భక్తుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకోగలికానని అన్నారు. భవిష్యత్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో శనివారం సగటున వర్షపాతం 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గండేడ్ మండలంలో 78.9 మి.మీ., నమోదు కాగా, మహ్మదాబాద్లో 52.5 మి.మీ., కోయిలకొండలో 44.6 మి.మీ, మిడ్జిల్లో 31.3 మి.మీ, రాజాపూర్లో 27.2 మి.మీ, బాలానగర్లో 17.9 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వాన పంటల దుక్కులకు దోహద పడుతుండడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్నుంచి ఇందిరమ్మ ఇళ్ల మెటీరియల్ కాంపోనెంట్ ఎస్టిమేషన్ ప్రిపరేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రపోజల్స్ స్టేటస్ రిపోర్ట్పై వీసీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 90 రోజుల లోపల ఉపాధి హామీ పథకంలో భాగంగా పేమెంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 5,972 ఇళ్లకోసం 3,493 ఉపాధి హామీ పథకం కింద పేమెంట్ కోసం మస్టర్డ్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా 2,478 ఇళ్లకు ఈ నెలాఖరి వరకు ఎస్టిమేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సిములు, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, హౌసింగ్ డీఈ విజయ్కుమార్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. -
రక్తదానంపై విస్తృత ప్రచారం
ఒక వైద్యుడిగా ఉంటూ రక్తదానంపై విస్తృతంగా ప్రచా రం చేయడంతో పాటు నేను కూడా స్వతహాగా ఇప్పటి వరకు 21సార్లు రక్తదానం చేశాను. రెడ్క్రాస్తో పాటు అత్యవసరంగా ఉన్న సందర్భంలో నా దృష్టికి వచ్చిన ప్రతిసారి రక్తదానం చేస్తూ వచ్చాను. భవిష్యత్లో కూడా అవసరమైన వారికి రక్తం ఇస్తాను. – డా.అశ్విని నవదీప్, మహబూబ్నగర్ ప్రాణాలు కాపాడాలి.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకోసారి రక్తాన్ని ఇవ్వవచ్చు. నేను 21 ఏళ్ల వయసు నుంచి ప్రతి సంవత్సరం వరుసగా రక్తదానం చేస్తున్నాను. ఇప్పటివరకు 70 సార్లు రక్తదానం చేశాను. నా మిత్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నా. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. కేవలం దాతల ద్వారానే సేకరిస్తాం. ప్రతి ఒక్కరూ రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలవాలి. – రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్, నాగర్కర్నూల్ ఏ సమయంలోనైనా.. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా రక్త దానం చేయడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసినవారమవుతారు. నేను ఇప్పటి వరకు 10 సార్లు రక్తం ఇచ్చాను. ఏ సమయంలోనైనా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. – కొట్ర గోపాల్రెడ్డి, లెక్చరర్, కల్వకుర్తి ● -
భక్తిశ్రద్ధలతో శని త్రయోదశి పూజలు
కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు పూజలు భక్తితో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. జేష్టమాత సమేత శనేశ్వరస్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ జ్యేష్ఠ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరు జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య పాల్గొన్నారు బల్మూర్ ఎంపీడీఓ రాఘవులు సస్పెన్షన్ బల్మూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓ రాఘవులు సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైన విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నూతన ఎంపీడీఓగా రేవతిరెడ్డి బాధ్యతలు బల్మూర్ మండల నూతన ఎంపీడీఓగా అమ్రాబాద్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న రేవతిరెడ్డిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వూలు అందజేశారు. ఈ మేరకు ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
అతివేగానికి నిండుప్రాణం బలి
● ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి ● రామస్వామి మృతికి పోలీసుల దిగ్భ్రాంతి కొత్తకోట రూరల్: ముందు వెళ్తున్న ఆటోను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అమడబాకుల సమీపంలోని జాతీయ రహదారి–44పై శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్ఐ శివానందంగౌడ్ కథనం ప్రకారం.. అమడబాకులకు చెందిన రామస్వామి(55) సొంత ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ పనిలో భాగంగా గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ను ఆటోలో తీసుకెళ్లి దించిన అనంతరం సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు కింద బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా.. స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే రామస్వామి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, కొత్తకోట పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తు మరణాలు సంభవించినప్పుడు తరచుగా పోలీసులకు సేవలందించేది రామస్వామి ఆటోనే కావడం గమనార్హం. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే రామస్వామి ప్రమాదంలో మృతి చెందడంతో పోలీసులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామస్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పాలమూరు రైతుకు ‘అభ్యుదయ’ పురస్కారం
మహబూబ్నగర్(వ్యవసాయం): వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు రైతుకు అరుదైన గౌరవం దక్కింది. మహబూబ్నగర్ మండలం కోటకదిర గ్రామానికి చెందిన రైతు జ్ఞానేశ్వర్రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ’అభ్యుదయ రైతు పురస్కారం ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా జ్ఞానేశ్వర్రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న విశేష కృషి, ముఖ్యంగా సేంద్రియ సాగులో అనుసరిస్తున్న ప్రయోగాత్మక విధానాలను గుర్తించి విశ్వవిద్యాలయం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జ్ఞానేశ్వర్రెడ్డి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల పంటలను పండిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేస్తున్న కృషి విశేషమని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన రైతు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకోవడంపై రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతులకు ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
జిల్లా అథ్లెట్కు సిల్వర్ మెడల్
వనపర్తిటౌన్: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వ హించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ సిల్వర్ పథాకాన్ని సాధించారు. జావెలిన్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాఽ దించడంతో జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ అథ్లెట్కు మెడల్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా కార్యదర్శులు శరత్, రమణ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ నారాయణపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్లోని ఉస్మానియా మీట్లో శుక్రవారం జరిగిన సీనియర్, జూనియర్ మెన్, ఉమెన్ విభాగంలో నారాయణపేట క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు నారాయణపేట జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. మెన్ సీనియర్ విభాగంలో జనార్ధన్కు హై జంప్లో గోల్డ్ మెడల్ అలాగే 400 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఉమెన్ విభాగంలో అండర్–16 విభాగంలో పూజ సిల్వర్ మెడల్ సాధించింది. రాష్ట్ర సెక్రెటరీ, ప్రెసిడెంట్, సారంగపాణి, స్టాలిన్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో శరత్ కుమార్, వెంకటేశ్వర్లు, అథ్లెటిక్ కోచ్ హారిక దేవి పాల్గొన్నారు. -
డీలర్లు వ్యవసాయ సలహాదారులుగా మారాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): వ్యవసాయ రంగంలో డీలర్ల పాత్ర రోజురోజుకూ పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ బి.వెంకటేష్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదక డీలర్లను నైపుణ్యవంతమైన పారా ఎక్స్టెన్షన్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న డీఏఈఎస్ఐ (డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) కోర్సును పూర్తి చేసిన 40 మంది డీలర్లకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. హైదరాబాద్లోని మేనేజ్ సంస్థ ఆధ్వర్యంలో, మహబూబ్నగర్ రైతు శిక్షణ కేంద్రం (ఎఫ్టీసీ) ద్వారా నిర్వహించిన 2024–25 బ్యాచ్ (టీపీ నం 2969) శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు శాసీ్త్రయ సలహాలు అందించడంలో డీఏఈఎస్ఐ శిక్షణ పొందిన డీలర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వ్యవసాయ సంబంధిత చట్టాలు, పంటల యాజమాన్య పద్ధతులు, ఎరువులు, పురుగు మందుల వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లు పొందేందుకు, పునరుద్ధరించుకునేందుకు డీఏఈఎస్ఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారిందని అన్నారు. డీలర్లు రైతులకు కేవలం ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులుగా కాకుండా వ్యవసాయ సలహాదారులుగా మారాలని సూచించారు. పంటలలో చీడపీడల నివారణ, సమతుల్య ఎరువుల వినియోగం, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ముందుండాలని కోరారు. డీఏఈఎస్ఐ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతుల ప్రయోజనాలకు వినియోగిస్తే వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఎ మాధవి, ఏడీఎ (ఆర్) రాంపాల్, ఏఓలు మీనా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
గద్వాల క్రైం: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోక్సో కోర్టు న్యాయమూర్తి వి శ్రీనివాస్ శుక్రవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమాన విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలికపై పింజరి పెద్దహుస్సేన్ అత్యాచారానికి పాల్పడాడ్డు. ఈ ఘటనపై 2021లో అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో చార్జ్షీట్ దాఖాలు చేశారు. అయితే కేసులోని సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధించారన్నారు. కేసు విచారణలో పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకున్నారన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు దోషిని మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు నవాబుపేట: మండలంలోని కాకర్లపహడ్ గ్రామంలో మే నెలలో 16 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో గ్రామానికి చెందిన యువకుడు సురేష్పై నవాబుపేట పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.తాజాగా గురువారం బాలిక, యువకుడి ఆచూకీ గుర్తించి న పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా మైనర్ బాలికను పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా యువకుడిపై గతంలో ఉన్న కిడ్నాప్ కేసుతో పాటు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి ఉండవెల్లి: మండలంలోని ప్రాగటూరుకు చెందిన విద్యార్థిని బోయ చామంతి (17) చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని గణితంలో ఫెయిల్ అయింది. సప్లిమెంటరీ రాయగా మళ్లీ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుమందు తాగింది. వాంతులు చేసుకోవడంతో తల్లి రామేశ్వరమ్మ గ మనించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి బోయరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మన్ననూర్: చెంచు, గిరిజనుల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం మన్ననూర్లోని ఐటీడీఏ కార్యాలయం సమావేశం హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత వెనుకబాటు తనంలో ఉన్న చెంచు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో నేరుగా చెంచులకే అందించేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా చెంచుపెంటల్లోని బడీడు, డ్రాప్ ఆవుట్స్ పిల్లలను బడిలో చేర్పించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ, గిరిజన సంక్షేమ, జీవీవీకే పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు చెంచు, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యశించే విధంగా ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్యం, టీకాలు, పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలన్నారు. చెంచుపెంటల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఐటీడీఏ, అనుబంధ శాఖల సహకారంతో చెంచు యువతకు ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే చెంచుల జీవనోపాధులు మెరుగుపడేందుకు లైవ్లీహుడ్, సౌర గిరిజల పథకం, అందరికి ఆధార్ అప్డేట్, ఆధార్కు మొబైల్ అనుసంధానం వంటి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న అటవీ లోతట్టు ప్రాంత చెంచుపెంటలను గుర్తించి అక్కడే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్, రేషన్ కార్డులు అందించే ఏర్పాటు చేయాలన్నారు. చెంచుపెంటలు, గ్రామాలు, గూడాల్లో ఇప్పటికే చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, ఇన్చార్జి డీటీడీఓ ఉమాపతి, డీఆర్డీఏ పీడీ చిన్నఓబులేష్, మిషన్ భగీరథ డీఈ హేమలత, ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ జాఫర్ హుస్సేన్, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ యాదమ్మ, సీడీపీఓ దమయంతి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
జడ్చర్ల: మండల పరిధిలోని నల్లకుంటతండా కు చెందిన సక్రిబాయి (53) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ జయప్రసాద్ తెలిపారు. సక్రిబాయికి గత కొంత కాలంగా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగగా కుటుంబసభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.మృతురాలి భర్త చందర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం ఉండవెల్లి: మండలంలోని మారమునగాల–2 గ్రామానికి చెందిన చాంద్ బాషా (26) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చాంద్బాషా, షబానా దంపతుల కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈనె 7న కూడా గొడవ జరగగా చాంద్ బాషా పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి మృతి జడ్చర్ల: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. గురువారం జడ్చర్ల–గొల్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి (50) రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో గూడ్సు రైలు రావడంతో అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మర ణించాడు. మృతుడి చేతిపై ఎల్లమ్మ అనే పేరు పచ్చబొట్టుగా ఉంది. మృతుడి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే 87126 58597 నంబరును సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు. పాన్షాప్లలో విస్తృతంగా తనిఖీలు మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మాద క ద్రవ్యాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కళాశాలలు, పాఠశాలల సమీపంలో ఉన్న పాన్ షాప్లు, ఇతర దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్ప య్య ఆధ్వర్యంలో దుకాణాలు తనిఖీ గుట్కా లు, పొగాకు ఉత్పత్తులు, ఈ–సిగరేట్లను తదితర వాటిని పరిశీలించారు. ఆ తర్వాత దుకాణదారులకు, స్థానికులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఖమ్మం ఘటనలో నిందితుడికి శిక్ష విధించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఓ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు ఎన్.లక్ష్మీనారాయణ, రాచాల జనార్దన్, లావణ్య, చాపల హనుమంతు, దర్శి గోవిందరెడ్డి, రెబ్బ విగ్నేష్, మిట్టె శ్రీశైలం, గుబ్బా భరత్ తదితరులు పాల్గొన్నారు. డ్రంకెన్డ్రైవ్లో 8రోజుల జైలుశిక్ష మహబూబ్నగర్ క్రైం: అధికంగా మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. టూటౌన్ పోలీసులు ఈనెల 8న నగరంలోని బోయపల్లి గేట్ దగ్గర చేసిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చాకలిపల్లికి చెందిన తిరుపతయ్య అధికంగా మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. సదరు వాహనదారుడిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శశిధర్ మద్యం తాగి పట్టుబడిన తిరుపతయ్యకు 7రోజుల జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించనందుకు మరోరోజు అదనంగా జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా టూటౌ న్ సీఐ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులుగా మిగలడంతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు. టూటౌన్ పరిధిలో నిత్యం డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
టీజీ టీ–20 లీగ్లో పాలమూరు ఆటగాళ్లు
● వేలంలో మెరిసిన నలుగురు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● ఆల్రౌండర్ గణేష్కు రూ.3.25 లక్షలకు దక్కించుకున్న హైదరాబాద్ చాంపియన్స్ ● పాలమూరు స్ట్రైకర్కు షాదాబ్ అహ్మద్, హైదరాబాద్కు జశ్వంత్, రంగారెడ్డికి అరుణ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్కు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఇటీవలే దీనికి సంబంధించి నిర్వహించిన క్రీడాకారుల వేలం పాటలో పాలమూరు నగరానికి చెందిన ఆల్ రౌండర్ జి.గణేష్ రూ.3.25 లక్షలకు హైదరాబాద్ చాంపియన్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గణేష్.. కొన్నేళ్లుగా హెచ్సీఏ లీగ్ మ్యాచ్లలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. టూడే, త్రీ డే లీగ్లలో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సంచరీలు చేశారు. అలాగే మహబూబ్నగర్కే చెందిన ఎడమచేతి బ్యాట్స్మన్ షాదాబ్అహ్మద్ రూ.75 వేలకు పాలమూరు స్ట్రైకర్ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల హెచ్సీఏ టీ–20 లీగ్లో జిల్లా జట్టు తరఫున షాదాబ్ సెంచరీ చేయడం విశేషం. నాగర్కర్నూల్ జిల్లా తాడూరుకు చెందిన బౌలర్ జి.జస్వంత్ ఈ వేలంలో హైదరాబాద్ చాంపియన్స్ జట్టు రూ.75 వేలకు దక్కించుకుంది. ఇతడి ప్రతిభను గుర్తించిన ఎండీసీఏ (మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి ఉచిత శిక్షణ ఇప్తిస్తున్నారు. అలాగే చదువుకయ్యే ఖర్చును సైతం ఎండీసీఏ కొంతవరకు భరిస్తోంది. దీంతో అనతి కాలంలోనే మెరుగైన బౌలర్గా ఎదిగారు. గద్వాల పట్టణానికి చెందిన ఆల్ రౌండర్ అరుణ్కుమార్ రూ.లక్షకు రంగారెడ్డి రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అనంతరం ఈ నలుగురు క్రీడాకారులను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. నాగర్కర్నూల్, గద్వాల వంటి ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఈ లీగ్ అవకాశం దక్కడం.. వేలాది గ్రామీణ ప్రాంత యువకులకు సరికొత్త నమ్మకాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్లో అద్భుతంగా రాణించి ఐపీఎల్తో పాటు జాతీయ జట్టు రేసులోకి దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. -
నిధులున్నా.. నత్తనడకే!
అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్ ప్రధాన పైప్లైన్, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్ పైప్లైన్ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైప్ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత ఎత్తిపోతల.. అమరచింత ఎత్తిపోతల పథకాన్ని 1999–2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎత్తిపోతల ఆయకట్టు 2,200 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో రైతులు వరి, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. 24 ఏళ్లుగా సాగునీటిని పంపింగ్ చేస్తున్న సెక్షన్ పైపులు తుప్పు పడుతుండటంతో వీటిని మార్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. ఐదు సెక్షన్ పైపులను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్కు ముందుకు రాకపోవడంతో ఆలస్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎత్తిపోతల ఆయకట్టు కింద మూలమళ్ల, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. 1,099 మంది రైతుల భాగస్వామ్యంతో ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. చిన్న చిన్న మరమ్మతులు తప్ప చెప్పుకోదగిన పనులు ఏవీ లేవని.. సెక్షన్ పైపులు మాత్రమే త్వరగా మార్చేస్తే సాగునీరు సకాలంలో రైతులకు అందించవచ్చని ఆయకట్టుదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెబుతున్నారు. రైల్వే పనులతోనే ఆలస్యం.. రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడ్ జలాశయం అగ్రిమెంట్ పూర్తి కాలేదు.. అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ, ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం ముందుకుసాగనిఎత్తిపోతల మరమ్మతు సరళాసాగర్ ప్రధాన పైప్లైన్.. ‘అమరచింత’ సెక్షన్ పైపుల ఏర్పాటులో ఆలస్యం మొదలైన వానాకాలం పంటల సాగు పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల -
ఎన్నటికో..?!
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో పార్కుకు సమీపంలోనే అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.50 కోట్ల నిధులను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించారు. ఈ పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టారు. రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్కు వెళ్లే రోడ్డు కోతలకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వర కు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్ఫిల్మ్ షూటింగ్లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ కనువిందు చేసే అందాలు.. కొల్లాపూర్లోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు ఆగస్టు నుంచి మార్చి నెల వరకు పర్యాటకులు వస్తుంటారు. సోమశిలకు వెళ్లే మార్గంలో కొల్లాపూర్ పట్టణానికి దగ్గరలోనే ఉన్న ఎకో పార్కు, నల్లమల వ్యూ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. వ్యూ పాయింట్ వద్ద నుంచి చూస్తే సోమశిల గ్రామం, సమీపంలోని కృష్ణానది, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలు, నల్లమల అభయారణ్యం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పక్షులు, జంతువుల కదలికలు కూడా పర్యాటకులను ఆహ్లాదపర్చనున్నాయి. సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలుతిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
జైల్లో ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి
పాలమూరు: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్ని రకాల ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలోని జిల్లా జైలును శుక్రవారం న్యాయమూర్తి సందర్శించించారు. మొదట ఖైదీలు ఉండే అన్నిరకాల బ్యారక్లను పరిశీలించి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోలేని ఖైదీలు సమాచారం ఇస్తే న్యాయసేవ అధికార సంస్థ ద్వారా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. కేసులు నమోదై జైలుకు వచ్చిన పలువురు యువతతో ప్రత్యేకంగా మాట్లాడి కే సుకు దారి తీసిన వివరాలపై అడిగి తెలుసుకు న్నారు. అనంతరం కిచెన్ సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట న్యాయమూర్తి ఇందిర, జైలు సూపరింటెండెంట్ శశికాంత్ ఉన్నారు. అటెండర్లకు పోస్టింగ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఆరుగురు అటెండర్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు శుక్రవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 317 జీఓ ప్రకారం ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వీరికి జిల్లాను కేటాయించడంతో పాటు మండలాలను కేటాయించారు. వనపర్తి నలుగురు, నాగర్కర్నూల్ నుంచి ఇద్దరు జిల్లాకు వచ్చారు. శ్రీకాంత్ను కోయిల్కొండ తహసీల్దార్ కార్యాలయం, లక్ష్మీనారాయణకు నవాబ్పేటతహసీల్దార్ కార్యాలయం, కల్పనకు అడ్డాకుల తహసీల్దార్ కార్యాలయం, నర్సింహులును డీసీఎస్ఓ కార్యాలయం, ఇలియాస్, అబ్దుల్ ఖాదర్కు కలెక్టరేట్ అటెండర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇజ్రాయిల్ దేశంలో సంరక్షకుడు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ కార్యాలయంలో కానీ, 94400 52081, 94400 51763 నంబర్లకు సంప్రదించాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్ఎం జగన్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్టీసీ మహబూబ్నగర్ డిప్యూటీ ఆర్ఎం (మెయింటెనెన్స్) గా జగన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల హైదరాబాద్లోని వర్క్షాపు నుంచి ఇక్కడికి బదిలీ అయిన విష యం విదితమే. అనంతరం ఆర్ఎం సంతోష్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ధాన్యం @ రూ.2,926 జడ్చర్ల: బాదేపల్లిలో శుక్రవారం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,926, కనిష్టంగా రూ. 1,741 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,051, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,956, కనిష్టంగా రూ.4,611, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,950, కనిష్టంగా రూ.6,640 ధరలు పలికాయి. -
సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక ప్రణాళిక
● ఈ నెల 28న పల్స్ పోలియోకుసిద్ధం కావాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పాలమూరు: రాబోయో వర్షకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు మలేరియా, డెండీ, చికెన్గున్యా, అతిసార వ్యాధుల కట్టడి కోసం నివారణ ప్రణాళికలతో మెడికల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు సీజన్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్లతో పాటు పీహెచ్సీల నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉండాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, సురక్షితమైన తాగునీరు మొదలైన వాటిపై అవగాహన పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలను త్వరగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కావాల్సిన పరీక్షలు, అనిమియా నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సురక్షిత కాన్పు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయ్యేటట్లు ప్రణాళిక చేసి దానిని అమలు చేయాలన్నారు. కుష్టు, క్షయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులుభంగా వ్యాధి చికిత్సలతో నివారించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శైలజ, రాజు, శివకాంత్, డీపీఓ సీతరామ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ, అద్దె స్థలాల్లో నర్సరీలు..
జిల్లాలోని ఆయా గ్రామ పంచాయితీల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు రైతుల పొలాలను అద్దెకు తీసుకొని నర్సరీలు ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు బోరు బావులు, నీటి సదుపాయం కలిగిన రైతుల పొలాలను ఎంపిక చేశారు. మొక్కల పెంపకానికి మట్టి, ఇతర సామగ్రి రైతుల నుంచే సమీకరిస్తున్నారు. అద్దెల భారం తగ్గించుకునేందుకు గ్రామ కంఠం, ప్రభుత్వ స్థలాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధిహామీ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు నాటి.. వాటి నిర్వహణను రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తున్నారు. -
అర్బన్ చాలెంజ్ ఫండ్తో అండర్ డ్రెయిన్
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం ● వాల్యూఫర్ మనీ కింద ప్రజల భాగస్వామ్యం జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు స్థానికంగా వనరుల సమీకరణ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. అయితే పథకం ద్వారా వాల్యూఫర్ మనీ కింద ప్రజలను భాగస్వాములు చేసి ప్రతినెలా తక్కువ మొత్తంలో వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వివిధ పథకాల్లో అభివృద్ధికి నోచుకుంటున్న మున్సిపాలిటీలు, కా ర్పోరేషన్లను మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ.. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్రం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం నిధులు కేటాయిస్తాయి. మిగిలిన 25శాతం నిధులను మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానికంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా వాల్యూఫర్ మనీని ఆశిస్తున్నారు. పెట్టిన ఖర్చులకు కొంతైనా రాబడి రావాలన్న ఉద్దేశం ఉంది. రూ.15కోట్లతో ప్రతిపాదనలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం కోసం జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అంతా ఓపెన్ డ్రెయిన్ ఉండటం దీనికి ఆటంకంగా మారింది. రూ.15కోట్లతో మున్సిపాలిటీ అంతా అండర్ డ్రెయిన్ నిర్మించడం సాధ్యం కాదు. ఈ కారణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేయా లని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం అయ్యాక అండర్ డ్రెయిన్ నిర్మాణాలు జరిగితే సంబంధిత కాలనీలో ప్రతిఇంటి నుంచి నామమాత్రంగా కొంత వసూలు చేయా లని భావిస్తున్నారు. వాల్యూ ఫర్ మనీగా కేంద్రం ఆశిస్తుండటంతో తప్పనిసరి చేయాల్సి వస్తుంది. -
కూలిన వాటర్ట్యాంక్ పైకప్పు
కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు పట్టణంలోని మూ డో వార్డులో వాటర్ ట్యాంక్ పైకప్పు గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ట్యాంక్ను 20 ఏళ్ల క్రితం నిర్మించగా పైకప్పు ఉన్నట్టుండి కూలిపోయినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. పై కప్పు కూలి వాటర్ ట్యాంక్లోనే పడిపోయినా అధికారులు మిషన్ భగీరథ నీటిని వాటర్ ట్యాంకులోకి అలాగే వదిలి కొళాయిలకు సరఫరా చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్యాంక్ పైకప్పు కూలిన విషయాన్ని వార్డు కౌన్సిలర్ మౌనిక ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించి కమిషనర్ శ్రీకాంత్కు తెలియజేయగా ట్యాంకులో కూలిపోయిన పైకప్పును సిబ్బందితో తొలగింపజేశారు. వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో ట్యాంకు కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు స్పందించి నూతన ట్యాంకును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధిలో కొత్త పుంతలు
● ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఈనెల 10వ తేదీ నాటికి దేశానికి అత్యధిక కాలం 4,399 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన మోదీపై ఉన్న విశ్వాసంతో కాషాయ జెండాను ప్రజలు ఎగురవేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి పరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు కల్పించారని, 11 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. జనధన్ యోజన కింద 58 కోట్ల మందికి జీరో ఖాతాలు తెరవడంతో పాటు చిరు వ్యాపారులకు రూ.57 వేల కోట్ల రుణాలు, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి కింద రుణాలిచ్చినట్లు గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6 వేల నగదు, ఎరువులపై 90 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. జిల్లాలో గుడెబల్లూర్ నుంచి మహబూబ్నగర్కు నాలుగు లైన్ల రోడ్లు మంజూర, ఇతర జాతీయ రహదారులు, రింగ్రోడ్డు, బైపాస్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, పద్మజారెడ్డి, అంజయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మా ణం చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.మున్సిపాలిటీలో చాలామటుకు ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. ప్రతిపాదిత డబ్బులతో అంతా అండర్ డ్రెయిన్గా మార్చటం సాధ్యం కాదు. అందుకే ఎక్కడ సాధ్యపడుతుందో, అవసరం ఉందో అక్కడ నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. వాల్యుఫర్ మనీగా కొంత ప్రజల భాగ స్వామ్యం అవసరం పడవచ్చు. – గిరీష్, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ ● -
ఉత్తీర్ణత సాధించలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
మహబూబ్నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు.ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మక్సూద్కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు. -
పెట్రోల్ బంక్ యజమానిపై దాడి
● నగదు, బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడు ● పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఘటన అమరచింత: పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో కొంతమంది నిందితులు పెట్రోల్ బంక్ యాజమానిపై దాడిచేసి రూ.2.50లక్షలు, రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కళకళం రేపింది. అమరచింత పట్టణానికి చెందిన బిలకంటి రామ్మోహన్శెట్టి తన పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి వర్కర్స్ నుంచి కలెక్షన్కు సంబంధించి రూ.2.50లక్షల నగదును తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. రామ్మోహన్ శెట్టి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో అదే గ్రామానికి చెందిన డీసీ.రాజశేఖర్ తన తమ్ముళ్లను వెంటపెట్టుకుని కాపు కాశా డు. కారు ఇంటి వద్దకు రాగానే డీసీ రాజశేఖర్ రాడ్డు, కత్తితో అకస్మాత్తుగా రామ్మోహన్శెట్టిపై దాడి చేసి గాయపర్చాడు. బ్యాగ్లో ఉన్న రూ.2.5లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు గొ లుసు ను లాకెళ్లాడని బాధితుడు రాత్రికిరాత్రే పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రామ్మోహన్శెట్టి ఇంటికి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరమే ఉన్నా.. నిందితులు ఇ లా మారణాయుధాలతో దాడి చేయడం పట్టణంలో కళకళం రేపింది. ఈ ఘటనపై బాధితుడు రామ్మోహన్శెట్టి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కొనుగోలు చే యనని రాజశేఖర్కు తెలుపగా.. రేషన్ బియ్యం మీ రైస్మిల్లులో ఉంచి నీపై కేసు అయ్యేటట్లు చేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. ఇదే తరహాలో రాయచూరు, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, దేవరకద్ర, కొత్తకోటలోని రైస్మిల్ల యాజమానులపై బ్లాక్ మెయిల్ చేస్తూ తనను కూడా బ్లాక్ మె యిల్ చేశాడని ఆరోపించారు. తన రైస్మిల్లో రేషన్ బియ్యం దందా చేయనని పలుమార్లు చెప్పినా.. నిందితుడు రాజశేఖర్ దందా చేయకుంటే తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వ ని పక్షంలో పలుమార్లు తన ఇంటిపై రాత్రిపూ ట రా ళ్లు రువ్వి భయపెట్టినా పట్టించుకోకపోవడంతో ఇలా కత్తితో దాడిచేసినట్లు ఆరోపించారు. డీసీ రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు విలేకరులకు తెలిపారు.ఈ వ్యవహారంలో డీసీ రాజశేఖర్ పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపా రి కాడ్గి గణేష్ ద్వారా తాము కొనుగో లు చేసిన ప్లాట్ల వ్యవహారంలో నష్టపోయామని తమకు రూ.36లక్షలు ఇవ్వాలని పలుమార్లు డీసీ రాజశేఖర్ తనను బెదిరించినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పోలీసులను అడుగగా.. ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామని ఎస్ఐ స్వాతి తెలిపారు. -
అక్రమంగానే.. యథేచ్ఛగా
‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరా తీరంలో యథేచ్ఛగా దందా.. జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కేసీతండా, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, వంగూరు మండలం ఉల్పర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ సరఫరా కన్నా రెట్టింపు స్థాయిలో అక్రమ రవాణా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇందిరమ్మ ఇళ్లకూ కొరతే.. జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరా సక్రమంగా అమలుకాక ఇళ్ల నిర్మాణదారులకు తీవ్రమైన ఇసుక కొరత నెలకొంది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా ఎక్కడా అమలుకావడం లేదు. సంబంధిత తహసీల్దార్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సమయానికి ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక సరఫరా సక్రమంగా సాగడం లేదు. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక సరఫరాను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఇసుక సరఫరా కోసం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తే ఎన్ని రోజులైనా బుకింగ్ దొరకడం లేదు. మరోవైపు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను సంప్రదిస్తే మాత్రం క్షణాల్లో ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అందుబాటులో ఆరు రీచులు.. జిల్లాలోని దుందుభీ వాగు పొడవునా ఇసుక సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 17 వరకు రీచుల నుంచి ఇసుక సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలులో మాత్రం ఆరు రీచుల్లోనే ఇసుక సేకరణకు ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. ఇందు లో కల్వకుర్తి మండలం లింగసానిపల్లి, వంగూరు మ ండలం పోతిరెడ్డిపల్లి, ఉల్పర, తాడూరు మండలం ఏటిదారిపల్లి, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామాల్లో ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇసుక సేకరణతోపాటు సరఫరాలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ప్రభుత్వ ఇసుక కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు మరోవైపు అక్రమార్కుల ద్వారా పెద్దఎత్తున తరలుతున్న వైనం అక్రమ రవాణాను అరికడితేనే ప్రభుత్వానికి ఆదాయం -
డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన
● శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి శాలివాహనుల ధర్నా ● ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ ఉప్పునుంతల: మండలంలోని లత్తీపూర్ శివారు పరిధి డిండి ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ ఆలయం వద్ద గురువారం లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొంతసేపు ఆలయం ముందున్న శ్రీశైలం–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 1947లో డిండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైసమ్మ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము పూజారులుగా వ్యవహరిస్తుండగా ఇటీవల ఆలయ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయ కమిటీలో కూడా తమకు సరైన స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తూ మమ్ములను ఆలయం వద్దకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా కుమ్మర కులస్తులను నియమించాలని, ఆలయం వద్ద పూజారులతోపాటు అన్ని హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, గౌరవ సలహాదార్లు రామచంద్రయ్య, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, వీరయ్య, సహాయ కార్యదర్శి శంకరయ్య, జిల్లా సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సుల్తాన్, జంగయ్య, మండల సీనియర్ నాయకులు బాలయ్య, మల్లయ్య, రమేష్, అంజి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి కులస్తులపై కేసు నమోదు కట్ట మైసమ్మ ఆలయం వద్ద అన్ని హక్కులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కల్గించినందున లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు దేవర్ల మల్లయ్య, రమేష్, రవి, వెంకటేష్, అంజనమ్మ తదితర మొత్తం 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. -
ఐకేపీనుంచి పాతవడ్లు తరలింపు!
పాన్గల్: మండలంలోని మాందాపూర్లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా.. మిల్లు యజమాని పరిశీలించి పాత వడ్లు ఉన్నట్లు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచార ణకు ఆదేశించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్తీక్రావు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ఆంజనేయులు, టెక్నికల్ అధికారులు మాందాపూర్లోని ఇషాన్ రైస్ మిల్లుకు చేరుకొని లారీలో లోడ్ చేసిన ధాన్యం, రైస్మిల్లులో నిల్వ ఉ న్న ధాన్యం ఒక్కటేనా అనే విషయాలను పరిశీలించి ధాన్యం శాంపిల్ తీసుకొని విచారణ చేస్తున్నామ ని పూర్తి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తామ ని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మాందాపూ ర్ నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలో ని కేతేపల్లి రైస్మిల్లు, లేకుంటే గద్వాల రైస్మిల్లు కు పంపాల్సి ఉండగా శ్రీరంగాపూర్ రైస్ మిల్లుకు పంపడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ట్రక్ షీట్లో ధాన్యం కొనుగోలు చేసే కమి టీ సభ్యుల సంతకాలు లేకుండా పంపించడం కూ డా అనుమానాలకు తెరలేపింది.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యంపై ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన మిల్లు యజమాని, జిల్లా అధికారులకు సమాచారం విచారణ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశం మిల్లును సందర్శించిన రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ● ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఊరుగొండ వద్ద ఘటన దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా యువతి బలవన్మరణం
చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యు లు నిద్రిస్తుండగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొ ని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
విత్తన శుద్ధితోనే అధిక దిగుబడి
అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో విత్తన శుద్ధితో పంటసాగులో ఎదురయ్యే సమస్యలను కొంత వరకు అధికమించడానికి అవకాశం ఉందని ఏఓ నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. విత్తన శుద్ధి చేయకపోతే పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి మొక్కల సాంద్రతను, దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది. ఖరీఫ్లో పంటసాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. లాభాలు: విత్తన శుద్ధితో మొలక శాతం పెరిగి సాంద్రత సిఫా ర్సు మేరకు ఉంటుంది. తొలి దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుతుంది. దీంతో మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చీడపీడల ఉధృతిని తగ్గించి, తర్వాత దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాక వాతవరణ కాలుష్యం తగ్గి మిత్ర పురుగులు రక్షించబతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధిలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి సరైన మందులు ఎంపిక చే సుకోవాలి. విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సరైన మోతాదు మందులు వాడాలి. విత్తనం పై పొర ఊడిపోకుండా చూసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువుల దాణాగా వాడకూడదు. వివిధ పంటల విత్తన శుద్ధి : విత్తన శుద్ధికి ఒక్కొక్క పంటకు ఒక విధానం ఉంటుంది. వాటిని గమనించి రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. వరి: ఒక కిలో వరి విత్తనంలో ఒక గ్రామ్ కార్టింజమ్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు మండె కట్టి నారు మడిలో చల్లడం వలన అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగుళ్లను అదుపు చేయవచ్చు. మొక్కజొన్న: ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్ కలిపి శుద్ధి చేస్తే ఎండు తెగులు, కాటక తెగులు, మచ్చ తెగుళ్లను అదుపు చేయవచ్చును. వేరుశనగ: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజేబ్తో శుద్ధి చేస్తే తిక్కాకు, ఆకుమచ్చ, తుప్పు, కాంత కాళ్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పత్తి: బ్యాక్టీరియా వల్ల నల్లమచ్చ ఆశించే ప్రాంతాల్లో లీటర్ నీటిలో 100 మిల్లీ గ్రాముల వైంసన్ లేదా ప్లాంటామైసిన్ గాని, ఒక గ్రామ్ బ్లైటాన్స్ కలిపిన ద్రావణంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టుకొని విత్తుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిరప : మిరపలోని వైరస్ తెగుళ్ల నివారణకు ఒక లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రై సోడియం, ఆర్థ ఫాస్సేట్లో ఒక కిలో మిరప విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి తర్వాత చల్లటి నీటిలో కడిగి విత్తుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు మంచిది చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా.. వాటిని ముందుగానే విత్తన శుద్ధితో అదుపు చేసుకోవాలి. దీని వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందవచ్చు పాడి–పంట -
ఎడమ కాల్వ వెలవెల.. సమాంతర కాల్వ కళకళ
నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వతో పాటు సమాంతర కాల్వలకు సాగునీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కాల్వల షట్టర్లను మూసివేశారు. అయితే సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ లీకేజీ కారణంగా నీరు పారుతూ కళకళలాడుతోంది. మరోవైపు ప్రధాన ఎడమ కాల్వ మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. అతి సమీపంలో ఉన్న రెండు కాల్వలను చూస్తున్న రైతులు ఎంత తేడా.. ఇది ఎంత తేడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – అమరచింత -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు.. చిత్తనూర్కు చెందిన బండ రాంరెడ్డి (50) తన బైక్లో పెట్రోల్ పోయించుకునేందు కు రాంపూర్ గేట్ సమీపంలో ఉన్న బంక్కు వెళ్తుండగా.. పత్తి మిల్లు వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 అంబులెన్స్లో మరికల్కు, అటు నుంచి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సీజన్కు అవసరమైన యూరియా సిద్ధం
● ‘యూరియా యాప్’ను ప్రారంభించినఅదనపు కలెక్టర్ ● జిల్లాలో 8,513 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్: డీఏఓ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలం–2026 సీజన్కు సంబంధించి రైతులు యూరియా ను సులభంగా పొందేందుకు రూపొందించిన ‘యూరియా యాప్’ను రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకుని అవసరమైన ఎరువును పొందే అవకాశం కల్పించామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 250 అధీకృత ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎక్కడైనా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం 14,759 యూరియా బ్యాగులు (664 మెట్రిక్ టన్నులు) యాప్ ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అదనంగా మార్క్ఫెడ్లో 5,868 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోదాముల్లో 2,339 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్ల వద్ద 306 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. మొత్తం 8,513 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. కౌలు రైతులు, ఆర్ఎఎఫ్ఆర్ రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బి.మాధవి, వ్యవసాయ అధికారి ఎంఎ బాసిత్, తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ సేవలు మరింత చేరువ చేస్తాం: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: డీజీపీ ఆదేశాల మేరకు ఇకపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిదినాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు తదితర అంశాలను దృష్టికి తీసుకు రావచ్చునని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కూడా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీస్సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ● అడ్డాకుల ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న మురళి గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. మురళి ఎస్ఐ ఉద్యోగం కంటే ముందు 18 ఏళ్ల పాటు భారత సైన్యంలో పని చేసి 2020లో తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్ఐగా ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు మదనాపురం, మరికల్, కోదండపూర్లలో పని చేశారు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
ధాన్యం పంచాయితీ.. రాజధానికి
వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. ● 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. ● కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం తూతూమంత్రంగా వనపర్తి అధికారుల చర్యలు చేసేది లేక రాష్ట్రస్థాయిఉన్నతాధికారులకు ఫిర్యాదులు -
మహాకేఫ్తో ఎంతో లబ్ధి
15 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలి ఉన్నాను. ఈ క్రమంలోనే ఇటీవల టీఎల్ఎఫ్కు అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మూడు నెలల క్రితమే నాకు ఆర్అండ్బీ జంక్షన్లోని మహాకేఫ్ నిర్వహణ బాధ్యతలను మెప్మా అధికారులు అప్పగించారు. ఇందులో బేకరీ ఐటమ్స్తో పాటు వివిధ తిను బండారాలు, కూల్డ్రింక్స్ తదితరాలు అమ్ముతున్నాను. దీనికోసం సీ్త్రనిధి నుంచి రూ.మూడు లక్షలు రుణం తీసుకున్నాను. అలాగే నా వంతుగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. ప్రతిరోజూ ఖర్చులు పోను కనీసం రూ.వేయి ఆదాయం వస్తోంది. – వందన, అధ్యక్షురాలు, నవభారత్ పట్టణ సమాఖ్య, మహబూబ్నగర్ టైలరింగ్తో ఉపాధి నేను 12 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. మూడేళ్ల క్రితం ఇంటి వద్దే టైలరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాను. దీని కోసం మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రూ.లక్ష చొప్పున రుణం తీసుకున్నాను. క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం ఈ బకాయిలు వూర్తి కావచ్చాయి. ఈ డబ్బులతో స్టిచ్చింగ్కు అవసరమయ్యే కుట్టు మిషన్లు 5 కొన్నాను. నాతో పాటు మా గ్రూపులోని మరో నలుగురికి ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్లో స్కూల్ యూనిఫాం కుట్టి ఇస్తున్నాం. ప్రైవేట్గా జాకెట్లు, మిడ్డీలు తదితరాలను కుడుతున్నాం. ఈ యూనిట్ ద్వారా మాకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. – ఇమ్మడి సుమతి, వైఎస్ఆర్ మహిళా సంఘం సభ్యురాలు, పాతతోట, మహబూబ్నగర్ ● -
ఫస్టియర్లో 67.37%, సెకండియర్లో 47.37%
● ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గత నెల రెండో వారంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,568 మంది పరీక్షలకు హాజరైతే 67.37శాతంతో 3,751 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 566 మంది హాజరైతే 74.38 శాతంతో 421 మంది ఉత్తీర్ణతను నమోదు చేశారు. రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 2,571 మంది హాజరు కాగా.. 1,218 మంది ఉత్తీర్ణులై 47.37 శాతం నమోదు చేశారు. ఒకేషనల్ కోర్సుల్లో 362 మంది పరీక్షలు రాయగా 55.80 శాతంతో 202 మంది ఉత్తీర్ణులయ్యారు. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించండి పాలమూరు: శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. నగరంలో ఉన్న బాలసదన్, బాల రక్ష భవన్, శిశు గృహను గురువారం సందర్శించి స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ప్రధానంగా శిశు గృహలో ఉంటున్న చిన్నారులకు అందిస్తున్న ఆహారం, వారి ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. వర్షకాలం నేపథ్యంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. డీఏఓగా గోవింద్ నాయక్ మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా గోవింద్ నాయక్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఏఓగా బి.వెంకటేష్ రైతు శిక్షణ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ)గా పనిచేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిస్థాయి డీఏఓ నియమించడంతో వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల ప్రణాళిక, రైతులకు సాంకేతిక సూచనల అమలులో మరింత సమన్వయం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. గురువారం గోవింద్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ధాన్యం @ రూ.2,891 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,891, కనిష్టంగా రూ.1,666 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,045, కనిష్టంగా రూ.1,747, ఆముదాలు క్వింటా గరిష్టంగా రూ.6,295, కనిష్టంగా రూ.6,280, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,710, కనిష్టంగా రూ.6,680 ధరలు లభించాయి. -
జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్ను చేస్తున్నారు. రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. -
మినీ స్టేడియానికి 4 ఎకరాల భూమి
కోడేరు/వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలకేంద్రం సమీపంలో మినీ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ పేరుపై నాలుగెకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. స్థానిక యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీపనగండ్ల సమీపంలోని సర్వేనంబర్ 532లో దా దాపు రూ.1.50 కోట్ల విలువజేసే తన భూమి లో మినీ స్టేడియం నిర్మాణానికి స్పోర్ట్స్ అథారిటీ నుంచి రూ. 2కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. అయితే సమయాభావం వల్ల వీపనగండ్ల తహసీల్దార్ డిజిటల్ లాగిన్ను కోడేరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఓపెన్ చేయించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఇందుకు సాక్షులుగా జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాళ్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపి ఉన్నారు. రూ.కోట్ల విలువైన భూమిని క్రీడా అభివృద్ధి కోసం ఇవ్వడంతో యువకులు మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ● మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పాముకాటుతో మహిళ మృతి
ఽదన్వాడ: పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బొక్కి తిరుపతమ్మ (56) ఇంటి వద్ద తెల్లవారుజామున పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అగ్నికి ఆహుతైన ఇల్లు ధరూరు: గ్రామానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో వరికొయ్యలను అంటించగా నిప్పురవ్వలు ఎగిసిపడి ఓ ఇంటిపై పడి ఇల్లు దగ్ధమైన ఘటన మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివారలు.. బుధవారం గ్రామానికి ఆనుకొని పొలంలో వరికొయ్యలకు నిప్పంటించారు. రాత్రి వీచిన గాలులకు నిప్పరవ్వలు ఎగిసిపడి వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఇంటిపై పడ్డాయి. దీంతో ఇంటి ముందు భాగంలో ఈతమట్టలు, ఈతవాట్లు ఇతర సామాగ్రి పూర్తి దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఇల్లు పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. -
వర్షాకాలంలో రైతులు అప్రమత్తం
అలంపూర్: నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకడంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పిడుగులు పడటం, ఈదురు గాలులు, పాములు వంటి ఆపదల్లో అన్నదాతలు చిక్కుకుంటున్నారు. వీటి నుంచి బయట పడటానికి రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ సూచిస్తున్నారు. వానకాలం పంట సాగులో రైతన్నలకు కింది జాగ్రత్తలు సూచించారు. నడకదారిలో విష సర్పాలు: వర్షాలు కురవగానే పాములు బయటికి వస్తాయి. గట్ల వెంట, చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, గడ్డి వాములు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువ గా ఉంటుంది. రైతులు పొలం పనులకు వెళ్లే దారిలోనూ, పనుల్లో నిమగ్నమై గట్ల వెంట నడుస్తూ పా ముకాటుకు గురైన ఘటనలు అనేకం ఉంటాయి. జాగ్రత్తలు : ● చీకటి సమయాల్లో టార్చి లైట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ● చేతిలో కర్ర పట్టుకొని వెళ్లాలి. ● తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. బూట్లు ధరిస్తే ఇంకా మంచిది. ● పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి. ● పాము కాటుకు గురైతే తక్షణమే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాలి. ● మంత్రాలు, నాటు వైద్యంపై ఆధారపడొద్దు వాగులు.. వరద ఉధృతి : వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు పొలాల నుంచి వచ్చే సమయాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించాలి.వరద ఉధృతి ఎక్కు వగా ఉంటే వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దు. జాగ్రత్తలు ● నీటి ఉధృతి ఎలా ఉందో ముందుగా గమనించాలి. ● ఒంటరిగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు. ● జట్టుగా తోటి రైతులతో కలిసి వెళ్లాలి. ● పశువులను దాటించే సమయాల్లో మరింత జాగ్రత్త అవసరం పిడుగులు, మెరుపులు : వ్యతిరేక విద్యుత్ అవేశాలు ఉన్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు విద్యుత్ జనించి తక్కువ విద్యుత్ అవేశం ఉన్న మేఘం నుంచి ఎక్కువ ఆవేశం ఉన్న మేఘంలోకి విద్యుత్ ప్రవాహం వేగంగా జరుగుతుంది. అది వెంటనే ఉరుములు, మెరుపుల రూపంలో బయటికి వస్తోంది. కాంతికి వేగం ఎక్కువ కావడం వలన మెరుపు ముందుగా కనిపించి ఆ తర్వాత ఉరుము వినిపిస్తోంది. ఎక్కువ విద్యుత్ ఆవేశం ఉన్న మెరుపు తక్కువ ఆవేశం గల భూమి వైపుకు వస్తుంది. తేమ విద్యుత్ వాహకంగా పని చేయడం వలన అది పిడుగుగా మారి ఎత్తైన ప్రదేశాల వైపు దూసుకపోయి భూమిలోకి తటస్థంగా వెళ్తుంది. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటంతో వాటిపై పిడుగు పడుతుంది. పాడి–పంట వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు పిడుగులు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆకాశం మేఘామృతం అయినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. వర్షంలో తడవకుండా ఉండటానికి చాల మంది చెట్లను ఆశ్రయిస్తారు. అది సరైంది కాదు. పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు. సెల్ఫోన్లు ఉంటే వాటిని స్విచ్చాఫ్ చేసుకోవాలి. -
రేర్ ఎర్త్ మూలకాలపై పరిశోధనకు ప్రశంస
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూని ర్సిటీ భౌతికశాస్త్రం విభాగంలో బేగరి ఉదయ్కుమార్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు భౌతికశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ ఆధ్వర్యంలో ఆయన ‘సింథసిస్, క్యారెక్టరైజేషన్, డైలెక్ట్రిక్ ఆండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్ డోప్డ్ జింక్ ఫెర్రిటైట్స్’ అనే అంశంపై కొన్నేళ్లుగా విస్తృత ప్రయోగాలు చేశారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని బీఓఎస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఓఎస్ నిర్వహించడంతో ఆయన పరిశోధన పూర్తయింది. ఈ సందర్భంగా ఉదయ్కుమార్ను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు.యూనివర్సిటీలో అ రుదైన అంశాలపై పరిశోధన చేయడం గొప్ప విషయమని, పరిశోధనల వల్ల యూనివర్సిటీతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమ న్నారు. పరిశోధన రంగంలో ఇది ఒక కీలక పరిశోధనగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రర్ రమేష్బాబు, చెన్నయ్య పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి భూత్పూర్: మండలంలోని చౌళ్లతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పి.తవుర్య(49) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పూర్తి వివరాలు.. ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండాకు చెందిన తవుర్యా ఈ నెల 6న పత్తి విత్తనాలు కొనుగోలు కోసం మోటర్సైకిల్పై వెళ్తుండగా చౌళ్లతండా మలుపు వద్ద అదుపుతప్పి కిందపడటంతో తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్లో వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గద్వాలలో భారీ చోరీ
● 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.6వేల నగదు అపహరణ ● గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గద్వాల క్రైం: పట్టణంలో భారీ ఎత్తున దొంగతనం జరిగిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని భీంనగర్ కాలనీలో నివాసం ఉటుంన్న రహిమ్మత్పాష వృత్తిరీత్యా ట్రావెల్స్ (కారు అద్దె)కు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉదయం వ్యక్తిగత పనులపై ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరచిన 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి, రూ.6వేల నగదును అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కల్యాణ్కుమార్, క్రైం విభాగం, క్లూస్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది చోరీ జరిగిన ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. కాలనీలో సీసీ కెమెరాల ఫుటేజీలను సాంకేతిక విభాగ సిబ్బంది పరిశీలించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులతో మాట్లాడి కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. స్థానికుల్లో ఆందోళన జిల్లా కేంద్రంలో నిత్యం పోలీసు నిఘా, పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని నెలలుగా జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం ఇదే అని స్థానికులు చెబుతున్నారు. చోరీ ఘటనపై పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ తీరును బట్టి చూస్తే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతుంది. ఘటనపై బాధితుడు రహిమ్మత్పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. త్వరలో నిందితులను గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.


