Mahabubnagar District Latest News
-
స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలంలో ధరలు సల్పంగా పెరిగాయి. సీజన్ తగ్గడంతో ధరలు పెరగడం ప్రారంభమైంది. గతవారంతో పోల్చితే గరిష్ట కనిష్ట ధరలు రూ.500 వరకు పెరిగాయి. వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్కు తక్కువ మొత్తంలో ఉల్లి అమ్మకానికి వచ్చింది. మార్కెట్లో ఉదయం పది గంటలకు ఉల్లి వేలం ప్రారంభం కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు ఉల్లిని కొనడానికి పోటీ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్కు వచ్చిన ఉల్లి నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో వినియోగదారులు మార్కెట్కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలా మంది రైతులు వేలం వేయకుండానే నేరుగా వినియోగదారులకు బస్తాలుగా చేసి అమ్ముకున్నారు. మార్కెట్ బయట కూడా రైతులు ఉల్లి విక్రయాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లో, మార్కెట్ బయట సందడిగా కనిపించింది. బస్తా ధర రూ.1050 దేవరకద్ర మార్కెట్లో జరిగిన ఉల్లి బహిరంగ వేలంలో గరిష్టంగా రూ. 2100, కనిష్టంగా రూ. 1700 గా ధరలు వచ్చాయి. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. 1050, కనిష్టంగా రూ. 800లకు విక్రయించారు. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. గరిష్టంగా రూ. 2100 కనిష్టంగా రూ. 1700 -
పశువుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఖిల్లాఘనపురం: వ్యవసాయ పొలాల్లోని పశువుల పాకల్లో ఉన్న పశువులను రాత్రివేళలో దొంగలు తీసుకెల్లారు. ఈ కేసును ఖిల్లాఘనపురం పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ఛేదించారు. బుధవారం కొత్తకోట సీఐ రాంబాబు, ఖిల్లాఘనపురం ఎస్ఐ సురేష్గౌడు పట్టుకున్న దొంగలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఖిల్లాఘనపురం మండలంలోని షాపురం గ్రామానికి చెందిన రైతులు కర్నెతండాకు వెళ్లే రోడ్డుకు దగ్గరలో ఉన్న పశువుల పాకలో ఉన్న 8 ఎద్దులు, ఒక ఆవును ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున దొంగలు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన మామిళ్ల మాసయ్య, భీమయ్య, వెంకటయ్య, నాగన్నలు ఎద్దులు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో నాటి నుంచి ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో ఎద్దులను తీసుకెళ్లిన దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం మండలంలోని తిర్మలాయపల్లి గేట్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులను పట్టుకున్నట్లు వారు తెలిపారు. తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానం రావడంతో మహ్మద్ సిరాజ్, మహ్మద్ ఆమెర్ ఖురేషీలను పట్టుకుని విచారణ చేయగా, వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. 27న మరో మారు గ్రామాల్లో దొంగతనం చేసేందుకు మరో ముగ్గురు వ్యక్తులు హస్మత్, రఫీక్ ఉధ్ధీన్, షాహబాజ్లతో కలిసి మండలానికి వచ్చినట్లు తెలిపారు. పశువులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్ కోసం ముగ్గురు వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు. దీంతో సిరాజ్, అమోర్లు బుధవారం మండలం నుంచి వాహనంలో తిరిగి వెళ్తున్న సమయంలో తనిఖీలో పట్టుపడ్డారని చెప్పారు. వీరు షాపురం గ్రామంలో 8 ఎద్దులు, ఒకటి ఆవును తీసుకెళ్లడం జరిగిందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. పశువులను హైదరాబాద్ తీసుకెళ్లి రూ.1.80 లక్షలకు అమ్మినట్లు విచారణలో తెలిపారు. నిందితుల నుంచి దొంగతనానికి వాడిన ఆటోను, ఓ కారు, రూ.1.80 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన ఖిల్లాఘనపురం ఎస్ఐ సురేష్గౌడు, సిబ్బంది పి.లింగం, బి.రాజు, చైతన్యకుమార్, ఎండీ మునావర్లను సీఐ అభినందించారు. -
రుణాలు రూ.600 కోట్లకు పెంచుతాం
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆదాయపు రిటర్న్స్ వందశాతం ఫైల్ చేస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోపే రూ.300 కోట్లు వ్యవసాయ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. భవిష్యత్లో రూ. 600 కోట్లకు వ్యవసాయ రుణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలతో నిర్వహించిన సమావేశానికి చైర్మన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహనారహిత్యం కారణంగా జిల్లాలో ఇంకా 46 సొసైటీలు ఇన్కమ్ టాక్స్ ఫైల్స్ రిటర్న్స్ చేయలేదన్నారు. ప్రస్తుతం వచ్చిన చట్టాలకు అనుగుణంగా రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం సొసైటీల చైర్మన్లు, సీఈఓలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తాము నిర్వహించబోయే బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఈ విషయం గురించి చర్చిస్తామని, భవిష్యత్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు. ఇప్పటికే ఇన్కామ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు అందుకున్న వారు రిటర్న్స్ ఫైల్ చేయడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులకు ఇళ్లు నిర్మించుకోవడానికి, తమ పిల్లలను ఉన్నత చదువు చదివించుకోవడానికి, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన రుణాలను మంజూరు చేస్తామని వెల్లడించారు. రుణ సదుపాయాన్ని పెంచుకోవడం ద్వారానే బ్యాంకుకు ప్రగతి నెలకొంటుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ బ్యాంకు అభివృద్ధికి తమ శాయశక్తులా సహకరిస్తున్నారని, ఇటీవల బ్యాంకును సందర్శించిన నాబార్డు బృందం బ్యాంకు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, ఇన్కామ్ టాక్స్ అదనపు కమీషనర్ వంశీకృష్ణ, మహబూబ్నగర్ వార్డు–1 ఆఫీసర్ మనోజ్కుమార్ పాల్గొన్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ వందశాతం ఫైల్ చేస్తాం డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి -
జాతీయస్థాయి నెట్బాల్లో ధన్వాడ విద్యార్థి ప్రతిభ
ధన్వాడ: జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ధన్వాడకు చెందిన శివకుమార్ ప్రతిభ చాటాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 25 నుంచి 28 వరకు 31వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల నెట్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెంగాణ రాష్ట్రాం తరపున పాల్గొన్న ధన్వాడ గ్రామానికి చెందిన కె.శివకుమార్ ప్రతిభభ కనబరిచి రన్నరప్గా నిలిచి కంచు (బ్రాంజ్) పతకం సాధించినట్లు కోచ్ డాక్టర్.రామ్మోహన్గౌడ్ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి అచ్చంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పల్కపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెర్ముల సురేష్ (30) ఈనెల 24న అచ్చంపేట నుంచి స్వగ్రామానికి స్కూటీపై వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైద్రాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
మహిళపై దాడి: కేసు నమోదు
గద్వాల క్రైం: గేదెలు మేపడానికి తీసుకెళ్లిన ఓ మహిళను అకారణంగా దూషించి, విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో బాధ్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన దళిత మహిళ లక్ష్మి మంగళవారం ఉదయం గేదెలు మేపేందుకు శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి.. సాయంత్రం ఇంటికి వస్తుండగా విష్ణువర్ధన్రెడ్డి వ్యవసాయ పొలంలోకి గేదెలు వెళ్లాయని ఆమెతో అకారణంగా దూషణకు పాల్పడ్డాడు. వారించేందుకు ప్రయత్నం చేసే క్రమంలో సహనం కోల్పోయి లక్ష్మి ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి అసభ్యపదజాలంచ కులం పేరుతో దూషించాడు. దాడి చేసిన క్రమంలో సదరు మహిళ పళ్లు ఊడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే బుధవారం బాధితురాలి భర్త నర్సింహులు ఫిర్యాదు మేరకు శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి దళిత మహిళ లక్ష్మిపై విష్ణువర్ధన్రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని కుల సంఘాల నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మాచర్ల ప్రకాష్ అన్నారు. గతంలోనూ అదే గ్రామానికి చెందిన పలువురితో ఇలాంటి ఘటనలు, పంచాయితీలు జరిగినట్లు పేర్కొన్నారు. అంతకుముందు బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రభుత్వం మహిళ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. చిన్నారిపై కుక్క దాడి వీపగనండ్ల: మండల కేంద్రంలో దీపిక అనే చిన్నారిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తూంకుంట గ్రామానికి చెందిన కడతల విజయ్, నాగమణి దంపతుల కుమార్తె దీపిక వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన వీపనగండ్లకు వచ్చింది. బుధవారం ఇంటి ఆవరణలో తోటి చిన్నారులతో ఆటకుంటుండగా.. సమీపంలోని కుక్క దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద అధికమైందని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మనస్తాపంతో మహిళ బలవన్మరణం
రాజోళి: భర్తను, కుటుంబాన్ని కాదని వెళ్లిపోయిన మహిళ మళ్లీ ఇంటికి వచ్చినప్పటికీ ఆమె జీవింతం అర్ధాంతరంగా ముగిసింది. ఎస్ఐ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం రాజోళికి చెందిన ప్రతాప్ భార్య సుజాతకు గ్రామానికి చెందిన కుర్వ పుల్లన్నతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు ఇద్దరు ఈ నెల 12న కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా ఈ నెల 25న సుజాత స్థానిక పోలీస్స్టేషన్కు రావడంతో పోలీసులు ఆమెతో మాట్లాడారు. గ్రామానికి చెందిన పుల్లన్నతో తన ఇష్టపూర్వకంగా వెళ్లానని, పలు ప్రాంతాల్లో తిరిగిన అనంతరం వరంగల్లో కొన్నాళ్లు ఉన్నామన్నారు. ఈ క్రమంలో 27న ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. కానీ కుర్వ పుల్లన్న అదే రోజు ఎలుకల మందు తాగడంతో ఆయనను చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకవైపు పుల్లన్న ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, మరోవైపు కుటుంబ సభ్యులు బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి 9 ఏళ్ల కుమార్తె చందు ఉంది. ఘటనపై మృతురాలి తల్లి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం అయిజ: ద్విచక్ర వాహనంపై నుంచి పడి వివాహిత మృతిచెంది న ఘటన అయిజ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని కిష్టాపూర్కు చెందిన కుమ్మరి నర్సింహులు, తన కుమారుడు రామాంజనేయులు, కోడలు మంజుల (20)తో పాటు 8నెలల మనవడితో కలిసి బైక్పై బంధువుల గ్రామానికి బైక్పై బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సోముల గూడూరు సమీపంలో మంజుల ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారిపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. మంజుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి దుర్మరణం దేవరకొండ: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈడమోని శ్రీశైలం(44), ఊర్కొండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన ఈరెటి బచ్చయ్య(40) వరుసకు బంధువులు. శ్రీశైలం, బచ్చయ్య వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరు కలిసి పశువులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై మంగళవారం మిర్యాలగూడకు వచ్చారు. త్రిపురారం వద్ద వారికి అవసరమైన పశువులను కొనుగోలు చేశారు. రాత్రి కావడంతో అక్కడే బసచేసి బుధవారం ఉదయం స్వగ్రామాలకు బయల్దేరారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ సమీపంలోకి రాగానే కొండమల్లేపల్లి నుంచి ఐరన్ లోడ్తో కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం, బచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందగా.. బచ్చయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దేవరకొండ సీఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు శ్రీశైలం కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
తెలంగాణ చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి అని ఎంపీ డీకే అరుణ అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ పాల్గొని సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కవులే లేరని హేళన చేసినోళ్లకు అక్షర ఆధారాలతో బదులిచ్చిన మేధావి అన్నారు. 348 కవులతో కూడిన సాహిత్య సంచికను పరిచయం చేస్తూ గోల్కోండ కవుల పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలిసేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తూము ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి వేపూరి రాజేందర్రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, వెంకట్రాంరెడ్డి, సురేందర్రెడ్డి, కోటేశ్వర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, ఎల్లారెడ్డి, రవికిషన్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గోపికాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక చరిత్రలో సురవరం ఒక అధ్యాయం తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు ఏపీ.మిథున్రెడ్డి, సీజే బెనహర్, అవేజ్, గంజి ఆంజనేయులు, రమేష్ యాదవ్, సుధాకర్రెడ్డి, తిరుమల వెంకటేశ్ పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ -
ట్రిపుల్ ఐటీ సొబగులు
ఎడ్యుకేషన్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ మహబూబ్నగర్ఎడ్యుకేషన్/జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పాలమూరు జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారుతోంది. ఇప్పటికే పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయగా.. తాజాగా ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరైంది. ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ ఏర్పాటు కోసం దివిటిపల్లి వద్ద స్థల పరిశీలన సైతం అధికారులు పూర్తి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ చాన్స్లర్ గోవర్ధన్ స్థల పరిశీలనలో పాల్గొని.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మూడు కోర్సులతో ప్రారంభం ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ పూర్తిస్థాయిలో నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బండమీదిపల్లి వద్ద ఉన్న పాతరెడ్డి హాస్టల్ భవనంలో తరగతులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు కోర్సులతో కళాశాల ప్రారంభించనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలో ఒక్కో కోర్సులో 60 మంది చొప్పున 180 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 41.32 ఎకరాల్లో క్యాంపస్ జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ కోసం జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి శివారులోని సర్వే నంబర్ 1లో 21.26 ఎకరాలు, మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని 20.06 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ ఏర్పాటుతో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయి. జాతీయ రహదారికి ముఖద్వారంలా ఉన్న జడ్చర్ల మరింత అభివృద్ధి సాధించే అస్కారం ఉంది. జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలోని జాతీయ రహదారి పక్కన కళాశాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చిట్టెబోయిన్పల్లి శివారు సర్వే నంబర్ 1లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నవాబుపేట మండలానికి తరలించనున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్థులకు విద్యనందిస్తూ వచ్చింది. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడంతో.. గురుకుల పాఠశాల వేరే ప్రాంతానికి తరలించడం అనివార్యమైంది. నవాబుపేట మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు ఈ విద్యా సంవత్సరం మూడు కోర్సులతో ప్రారంభం ప్రస్తుతానికి పాతరెడ్డి హాస్టల్ భవనంలో కళాశాల ఏర్పాటుకు కసరత్తు క్యాంపస్ కోసం జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలో 41.32 ఎకరాల స్థలం కేటాయింపు -
జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూ భారతి చట్టం ద్వారా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తహసీల్దార్లు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించి వెంటనే పంపాలని ఆదేశించారు. తహసీల్దార్, డీటీ ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ లాగిన్లో ఉన్న రేషన్కార్డులకు సంబంధించిన దరఖాస్తులను తనిఖీ చేసి పంపించాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలను పర్యవేక్షించాలని, ధాన్యం రవాణా, మిల్లుకు తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండాచర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వర్షాలకు పడకుండా అన్ని ముందు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. రేషన్కార్డు దారులకు జూన్ 1 నుంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో చౌక ధర దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించాలని, రేషన్షాపుల్లో స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ సువర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19, సీనియర్, వెటరన్ విభాగాల్లో సెలక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్ను రిపోర్టు చేయాలని, మిగ తా వివరాల కోసం 98480 85211, 98660 33377, 96189 75795, 98669 28835 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చేనెల 1వ తేదీ నుంచి 17వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి (ఎఫ్ఏసీ) మధుసూదన్గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఏసీ, ఫోన్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ సంస్థ సర్టిఫికెట్ ఇస్తుందని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలని, దరఖా స్తు వెంట విద్యార్హత, ఆధారు కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోతో జతచేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మిగతా వివరాలకు కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా ‘మహిళా సమాఖ్య’ కార్యవర్గం ఎంపిక జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా స్వాతి(మిడ్జిల్), కార్యదర్శి గా సి.చంద్రకళ(కోయిల్కొండ), కోశాధికారిగా సి.అరుణ (సీసీకుంట)లను ఎంపిక చేశారు. ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులతో పాటు ఐకేపీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత కార్యవర్గం, కొత్త కార్యవర్గాల సభ్యులను సన్మానించారు. ఈ సందర్బంగా డీఆర్డీఓ ఏపీడీ జోజప్ప మాట్లాడుతూ సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఆర్థికంగా బలోపేతం కావడానికి కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా మహిళ సమాఖ్య కొత్త అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతానికి బాటలు వేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. డీపీఎంలు చెన్నయ్య, నాగమల్లిక, సలోమి పాల్గొన్నారు. ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ, బీఎడ్ ఫలి తాలను బుధవారం పీయూ వీసీ శ్రీనివాస్ వి డుదల చేశారు. బీఫార్మసీ మొదటి సెమిస్టర్లో 5.52 శాతం, బీఎడ్ 3వ సెమిస్టర్లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. పీఆర్ ఇన్చార్జి ఎస్ఈగా విజయ్కుమార్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా పంచాయతీరాజ్ ఇన్చార్జి సూపరింటెండెంట్గా నాగర్కర్నూల్ జిల్లా పీఆర్ ఈఈ విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన రామ్మోహన్రావు వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో.. ఆయన స్థానంలో విజయ్కుమార్ను ఇన్చార్జి గా నియమించడంతో బుధవారం ఆయన బా ధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యా లయం సిబ్బంది ఇన్చార్జి ఎస్ఈని సన్మానించి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఈఈలు లక్ష్మణ్రావు, డీఈ ప్రమోద్రావు, ఏఈలు రామకృష్ణ, అజీద్, సూపరిండెంటెంట్ అజిద్, రాఘవేందర్ పాల్గొన్నారు. -
వార్డు ఆఫీసర్లదే కీలక పాత్ర
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వార్డు ఆఫీసర్లదే కీలక పాత్ర అని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్చర్ల, భూత్పూర్, పాలమూరు వార్డు ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్కార్డుల వంటి వాటివి తామే పరిశీలించాలన్నారు. వర్షాకాలం ఆరంభమవుతున్నందున నగరంతో పాటు ఆయా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రోడ్లు, కాల్వల్లో చాలా చోట్ల చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా తాగునీటి సమస్య, సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలన్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, పాఠశాల భవనాలు గుర్తించాలన్నారు. ఎక్కడైనా అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణంలో కొంత భాగం ఖాళీగా ఉంచాలని, అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు చుట్టూ తిరిగేలా, బాధితులను తరలించేందుకు అంబులెన్స్ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయంపై యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఆస్తిపన్ను, నల్లా బిల్లులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. పార్కులు పచ్చదనంతో ఉట్టిపడేలా కృషి చేయాలన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యారణకు అందరూ సిద్ధం కావాలన్నారు. ఫ్రై డే.. డ్రై డే వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇక ప్రతి వార్డులో వార్డు ఆఫీసర్లకు ఒక కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అందులో వారికి అవసరమయ్యే సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మహబూబ్నగర్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, నూరుల్ అహ్మద్తో పాటు ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు2న మంజూరు పత్రాలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. మంజూరు చేసిన యూనిట్ల స్థాపన అనంతరం వాటి పనితీరు, నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు జిల్లాలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీలలో జరిగే ఇన్చార్జి మంత్రుల సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ వెంకటరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారిణి ఇందిర, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలి కలెక్టర్ విజయేందిర బోయి -
స్పోర్ట్స్ అకాడమీలతో క్రీడాకారులకు వరం
● రాష్ట్రంలోని 8 అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు ● జూన్ 1 నుంచి 13 వరకు ఎంపికల కోసం పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: స్పోర్ట్స్ అకాడమీలు ఔత్సాహిక క్రీడాకారులకు వరంలా మారుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలా మంది స్పోర్ట్స్ అకాడమీల నుంచే వచ్చిన వారు. దీంతో ప్రతి ఏడాది రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీలు, వసతి గృహాల్లో ప్రవేశాలకు బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా అకాడమీలు, వసతి గృహాల్లో 2025–26 సంవత్సర ప్రవేశానికిగాను అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్ క్రీడాంశాలకు సంబంధించి ప్రవేశాల్లో బాలబాలికలకు వచ్చేనెల 1 నుంచి 13 వరకు నిర్ణయించిన తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు కళాశాల లేదా పాఠశాల ప్రస్తుత విద్యా సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఎంపికలకు హాజరుకావాలి. అకాడమీ, ఎంపికల షెడ్యూల్ ఇలా.. ● జూన్ 1వ తేదీన సిద్దిపేట వాలీబాల్ అకాడమీ ఎంపికలు అదే అకాడమీలో జరగనున్నాయి. ● జూన్ 10, 11 తేదీల్లో హైదరాబాద్లోని ఓయూ క్యాంపస్ సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ ఎంపికలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో.. ● జూన్ 10, 11 తేదీల్లో హన్మకొండలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహం (అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్) ఎంపికలు డీఎస్ఏ హన్మకొండలో.. ● జూన్ 10వ తేదీన హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్లిలోని వాలీబాల్ అకాడమీ ఎంపికలు వచ్చేనెల 10న రాజన్న సిరిసిల్లలోని మినీ స్టేడియంలో.. ● జూన్ 12వ తేదీన హాకీ అకాడమీ (వనపర్తి) ఎంపికలు వనపర్తి లోని డాక్టర్ బాలకిష్టయ్య మినీ స్టేడియంలో.. ● జూన్ 12న అథ్లెటిక్స్ అకాడమీ (ఖమ్మం) ఎంపికలు.. ● జూన్ 12, 13 తేదీల్లో వాలీబాల్ అకాడమీ (మహబూబ్నగర్) ఎంపికలు మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రంలోని క్రీడా అకాడమీలు, వసతి గృహాల్లో ప్రవేశాల ఎంపికలను జిల్లాలోని అర్హులైన, ఆసక్తిగల బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ఏసీ డీవైఎస్ఓ మధుసూదన్గౌడ్ తెలిపారు. సంబంధిత ఽధ్రువీకరణ పత్రాలతో ఎంపిక స్థలాల్లో ఆయా తేదీల్లో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆదివాసీల ధర్నా
అచ్చంపేట రూరల్: తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 40 ఏళ్లుగా పంటలు పండిస్తున్న భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆదివాసీలు ఆగ్రహం చేస్తూ మంగళవారం అచ్చంపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినా అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆదివాసీలు హెచ్చరించారు. ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ చెంచులు సాగు చేస్తున్న భూములపైకి ఎవరూ కూడా వెళ్లొద్దని సీఎం ఆదేశించారన్నారు. భూముల వద్దకు అటవీశాఖ అధికారులు వెళ్లొద్దని ఆర్డీఓ సూచించారు. భూముల సాగును ఎవరైనా అడ్డుకుంటే తన దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటానని ఆర్డీఓ చెంచులకు భరోసా కల్పించారు. -
తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
వనపర్తి: తీర్ధయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్టీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు.. ప్యాకేజీ 1: (గంగా రామాయణ పుణ్య క్షేత్రయాత్ర– ఇోఆఎ44): ఇందులో (కాశీ) వారణాసి/అయోధ్య/నైమిశారణ్య/ప్రయాగరాజ్ /శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్ 14 వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్టు ధర రూ.16,200, థర్డ్ ఏసీ ధర రూ.26,500, సెకండ్ ఏసీ ధర రూ.35,000 ఉంటుంది. ఈ తీర్థయాత్రలో ట్రైన్ సికి ంద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మఽ దిర, విజయవాడ, ఏలూరు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి ,విజయనగరం, పలాస, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది. . ప్యాకేజీ 2: (ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాల యాత్ర – ఇోఆఎ43): ఉజ్జయిని (మహాకాళేశ్వర్–ఓంకారేశ్వర్– త్రయంబకేశ్వర్–భీమశంకర్–ఘృష్ణేశ్వర్) ఈ యాత్రలో మహాకాళేశ్వర్/ఓంకారేశ్వర్/త్రయంబకేశ్వర్ / భీంశంకర్/ఘృష్ణేశ్వర్/ఎల్లోరా/మోవ్/నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఇది జూలై 05వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.14700గా ఉండగా , థర్డ్ ఏసీ ధర రూ.22,900, సెకండ్ ఏసీ ధర రూ.29, 900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా సాగుతుంది. సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శన స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాల వరకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సాకర్యాలు సమకూరుస్తారు. కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందన్నారు. టికెట్ బుకింగ్ వివరాలకు 97013 60701, 92810 30712, 92814 95845, 92810 30749, 92810 30750 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు www.irctc tourirm.com వైబ్సెట్ని సంప్రదించాలన్నారు. -
జాగ్రత్తలతో ప్రమాదాలకు దూరం
సూచనలు : ● ఆకాశం మేఘామృమైనపుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి ● వర్షంలో తడవకుండా ఉండటానికి చాల మంది చెట్లను ఆశ్రయిస్తారు. అది సరైన పద్ధతి కాదు ● పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడతాయి. కాబట్టి చెట్లకు దూరంగా ఉండాలి ● ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో వర్షంలో ఉండరాదు ● సెల్ఫోన్లు ఉంటే వాటిని స్విచ్ఆఫ్ చేసుకోవాలి ఇలా పలు జాగ్రత్తల ద్వారా వర్షాకాలంలో సంభవించే ప్రమాదాల నుంచి రైతులు తప్పించుకోవచ్చని సూచనలు, సలహాలు అందజేశారు. అలంపూర్: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జోరు వర్షాలు, ముసురు, మరోవైపు విషసర్పాల సంచారంతో రైతులు ప్రమాదాలతో సావాసం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. విష సర్పాల బెడద.. వర్షాలు కురవగానే పాములు బయటికి వస్తుంటాయి. గట్ల వెంట, చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, గడ్డివాములు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. రైతులు పొలం పనులకు వెళ్లే దారిలోను పనుల్లో నిమగ్నమై గట్ల వెంట నడుస్తూ పాముకాటుకు గురైన సంఘటనలు అనేకం ఉంటాయి. జాగ్రత్తలు.. ● చీకటి సమయాల్లో పూర్తిగా చార్జింగ్ చేసిన టార్చ్లైట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి ● చేతిలో కర్రను వెంట పట్టుకొని వెళ్లాలి. ● తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. బూట్లు ధరిస్తే ఇంకా మంచిది ● పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చప్పుడు చేసుకుంటు వెళ్లాలి ● పాముకాటుకు గురైతే తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించాలి ● నాటు వైద్యంపై ఆధారపడొద్దు వాగులు.. వరద ఉధృతి వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుంటాయి. వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రైతులు పొలాల నుంచి వచ్చే సమయాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించాలి. జాగ్రత్తలు: ● నీటి ఉధృతి ఎలా ఉందో ముందుగా గమనించాలి ● ఒంటరిగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదు ● పశువులను దాటించే సమయాల్లో మరింత జాగ్రత్త అవసరం పిడుగులు, మెరుపులు ● వర్షాకాలంలో పిడుగులు సహజంగా పడుతుంటాయి. చెట్లు ఉన్న ప్రదేశాల్లో పిడుగు పడే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. -
కురుమూర్తిలో అమావాస్య పూజలు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి దర్శనానికి అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగించి గోవింద నామస్మరణ చేశారు. మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాలను భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో స్వీట్లు ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. -
‘హయ్యర్ పెన్షన్ క్లెయిమ్లో జాప్యం వద్దు’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈపీఎస్ పింఛన్దారుల హయ్యర్ పెన్షన్ క్లెయిమ్లో జాప్యాన్ని నివారించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం ఉపాధ్యక్షుడు భగవంతు కోరారు. ఈ మేరకు మంగళవారం ఓ షాపింగ్ మాల్లో ఈపీఎఫ్ఓ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ‘నిధి ఆప్కే నిక్కత్–2’లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి భగవాన్సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్లోని బర్కత్పురా పీఎఫ్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఈ పరిస్థితి నెలకొందన్నారు. సీనియారిటీని అనుసరించి ఈ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం వివిధ ప్రైవేట్ రంగ కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల సుమారు 30 సమస్యలను పరిష్కరించారు. ఇందులో ఈపీఎఫ్ఓ సభ్యత్వం, జీవన్ ప్రమాణ్ పత్రాల జారీ, హయ్యర్ పెన్షన్కు సంబంధించినవి ఉన్నాయి. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల 653 క్యూసెక్కుల వదర చేరుతున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 656 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 53 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 709 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.684 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 4,462 క్యూసెక్కుల ప్రవాహం దోమలపెంట: శ్రీశైలం జలాశయానికి మంగళవారం సుంకేసుల నుంచి 4,462 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 818.1 అడుగుల వద్ద 39.4343 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 1,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 4.758 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి దిగువున సాగర్కు 10,404 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత
●ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశా నా భార్య పద్మావతి పేరున ఉన్న భూమి భారత్మాల రోడ్డు నిర్మాణంలో పోయింది. మొదటి విడత పరిహారం చెల్లించారు. రెండో విడత పరిహారానికి సంబంధింయి నోటీస్ అందలేదని ఫిబ్రవరిలోనే కలెక్టర్కు ఫిర్యాదు చేశా. మూడు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయానికి తిరిగినా అధికారులు స్పందించలేదు. నష్టపరిహారం డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. – వెంకట్రాములు, గట్టు తిరుగుతూనే ఉన్నాం భారత్మాల రోడ్డు నిర్మాణంలో భూములను కోల్పోయినందుకు అందించే నష్టపరిహారం కోసం కార్యాలయాల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగితే సగం మాత్రమే పరిహారం చెల్లించారు. ఆర్భిట్రేషన్ తర్వాత చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదు. గట్టు తహసీల్దార్ కార్యాలయంలో రెండవ విడత నోటిసు గురించి అడితే మాకేం తెలియదంటున్నారు.కలెక్టరేట్లో అడిగితే వస్తుందని చెబుతున్నారు. రెండు నెలలు గడిచాయి. ఇప్పటికి పరిహారం అందించలేదు.రెండవ విడత పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. – కావలి తిమ్మప్ప, గంగిమాన్దొడ్డి గట్టు: మండలంలోని గంగిమాన్దొడ్డి వద్ద ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులను గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మొదటి విడత పరిహారం చెల్లించిన అధికారులు.. ఆర్బిట్రేషన్ తర్వాత చెల్లించాల్సిన డబ్బులను ఇప్పటి దాకా చెల్లించలేదని రైతులు వాపోయారు. ఆర్బిట్రేషన్(భూములను నష్టపోయిన రైతులతో కలెక్టర్ సమావేశమై వారి డిమాండ్ మేరకు నష్టపరిహారం పెంచి, అందించేది) తర్వాత తమకు నోటీసులను ఇవ్వలేదని, అదనంగా తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఇది వరకే కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయినా ఇప్పటికీ రెండో విడత పరిహారం మాత్రం తమకు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. తాము కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే తమకేమి పట్టనట్లు అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయంగా అందించాల్సిన పరిహారం అందించేదాకా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్ తీసుకెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు రైతుల ఆందోళనకు సంఘీబావం తెలియజేశారు. విషయం తెలుసుకున్న సైట్ ఇన్చార్జ్ అఫ్జల్ రైతులు ఘటనా స్థలానికి చేరుకొని.. రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని అందించే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రెండో విడత పరిహారం రాని రైతులతో కలిసి బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలుస్తామని తెలిపారు. అందని రెండో విడత పరిహారం అధికారులకు విన్నవించినాపట్టించుకోలే.. భారత్మాల రోడ్డు సైట్ ఇన్చార్జ్ జోక్యంతో శాంతించిన రైతులు -
గంగాపూర్లో యువతి ఆత్మహత్య
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 24న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నందిని(18) తలకు వేసుకునే రంగు నూనెను తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు ఆమెను చికిత్స కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై నందిని తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా యువతి ఆత్మహత్యకు కడుపు నొప్పి కారణమని కుటుంబ సభ్యులు చెప్పారు.యువకుడు బలవన్మరణంజడ్చర్ల: పట్టణంలోని కావేరమ్మపేటలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోయ మల్లేష్(26) కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.టీవీ చూసేందుకు వెళ్లిన చిన్నారిపై లైంగిక దాడిజడ్చర్ల: అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కావేరమ్మపేటలోని ఓ కాలనీలో సోమవారం చిన్నారి(4) తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు(16) చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి గమనించి ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ కమలాకర్, ఎస్ఐ మల్లేష్ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి పాల్పడిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.ఇద్దరి పిల్లలతో సహాతల్లి అదృశ్యంనవాబుపేట: భర్తతో గొడవ పడి ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో కామారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు చెన్నయ్య కూతురు బంటు స్వప్న (26)ను ఆరేళ్ల క్రితం బోయపల్లికి చెందిన దర్పల్లి కొండయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో ఈనెల 18న స్వప్న కుమారుడు శివకుమార్ (5), కూతురు హర్షిత(4)తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఆమె ఆచూకీ కోసం వెతకగా 22న హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్తానంటూ వెళ్లి మరోసారి అదృశ్యమైంది. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. -
కరోనాపై అప్రమత్తం
● ముందస్తుగా జనరల్ ఆస్పత్రిలో 60 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు ● జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యాధికారులు పాలమూరు: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో జిల్లాలోనూ వైద్య, ఆరోగ్యశాఖతోపాటు జనరల్ ఆస్పత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. దీంతో జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ భవనంలో 60 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, 50 వెంటిలేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్కు మరమ్మతు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు కురుస్తుండటంతో చల్లని గాలుల వల్ల చాలామంది దగ్గు, జలుబు, జ్వరం బారినపడుతున్నారు. ఐసీఎంఆర్తోపాటు ప్రభుత్వ నిబంధల ప్రకారం జనరల్ ఆస్పత్రిలో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్కుమార్ సింగ్ వెల్లడించారు. సీజనల్ వ్యాధులతోపాటు కరోనా వైరస్ కోసం ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు, డ్రగ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్ మరమ్మతు ప్రక్రియ ప్రారంభించామన్నారు. లక్షణాలు ఉన్నవారు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా పరీక్షలు చేసుకోవాలని, దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు వారం కంటే ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. భయపడొద్దు.. ప్రస్తుతం వస్తున్న కరోనా వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ తెలిపారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం, మాస్క్, చేతులు తరుచుగా శుభ్రం చేసుకోవడంతోపాటు వారం రోజుల పాటు లక్షణాలు ఉంటే కరోనా టెస్ట్ చేసుకొని ఐసోలేషన్ ఉంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
కేంద్ర పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో కొనసాగుతున్న పథకాలు ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలన్నారు. రాష్ట్రీ య కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయడానికి 252 యూనిట్లకు రూ.72.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. పథకంపై అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఎంపిక చేయాలన్నారు. జాతీయ ఆయిల్ సీడ్ మిషన్ కార్యక్రమం కింద వంట నూనెల ఉత్పత్తికి 2025– 26 నుంచి వేరుశనగ సాగును కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో 1,250 ఎకరాల్లో మూడేళ్లపాటు రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా వేరుశనగ సాగు చేయడానికి రెండు సంస్థలను ఎంపిక చేశామన్నారు. జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తారని, ప్రత్యామ్నాయ పంటల సాగు కింద భూసారం పెరిగేందుకు డిమాండ్ ఉన్న వేరుశనగ పంట ద్వారా పల్లి నూనె ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న ఒరవడి, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ● వైద్యారోగ్య శాఖ ద్వారా సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, మెదడు వాపు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులపై విస్తృత ప్రచారం చేసి పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా, సీ సెక్షన్ తగ్గించేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ● జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ సాఫీగా నిర్వహించాలని, ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలకు వచ్చే కమీషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ● గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకంతో జీవనాధారం కలిగిన వారికి రూ.20 లక్షల మేర చిన్న యూనిట్గా తీసుకుని లబ్ధి చేకూరే విధంగా బ్యాంకర్లు రుణ సహాయం అందించాలన్నారు. ● అటవీ శాఖ జింకల పార్కు కోసం ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించి సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ● మహిళాశిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న వర్కింగ్ మహిళా హాస్టల్లో అన్ని వసతులు కల్పించి ఎక్కువ సంఖ్యలో చేరేలా చూడాలన్నారు. బ్యాంకర్లు వివిధ ప్రభుత్వ శాఖలు ఎంఎస్ఎంఈఎంపీఎంఎఫ్ ఈ పథకాలకు రుణ సహాయం అందించాలన్నారు. ● జిల్లాలో డీఎంఎఫ్ నిధుల ద్వారా ప్రధానమంత్రి క్షేత్ర కల్యాణ యోజన పథకం అమలు, గనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రసాద్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఏఓ వెంకటేశ్, డీఆర్డీఓ నర్సింహులు, డీఎంహెచ్ఓ కృష్ణ, డీసీఓ శంకరాచారి, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, డీపీఓ పార్థసారధి, ఆర్డీఓ నవీన్, గనుల శాఖ ఏడీ సంజయ్కుమార్, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు. దిశ సమావేశంలో కమిటీ చైర్మన్, ఎంపీ డీకే అరుణ -
ఎన్యుమరేటర్ల ఎదురుచూపులు
● 7 నెలలు గడిచినా అందని సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం ● జిల్లాకు రూ.2,19,14,000 మంజూరు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది నవంబర్లో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. అయితే సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు మాత్రం పారితోషికం ఇవ్వకండా ప్రభుత్వం ముండిచేయి చూపింది. సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్కు రూ.10 వేలు, సూపర్వైజర్కు రూ.12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదు చేసినందుకు గాను రూ.25 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వే ప్రారంభానికి మందే ప్రభుత్వం జిల్లాకు రూ.2,19,14 ,000 వేలు మంజూరు చేసింది. సర్వే ఫారాల ముద్రణ నుంచి పారితోషికాల చెల్లింపు వరకు ఈ నిధులు వినియోగించాలని సూచించింది. అయితే సర్వేతోపాటు డాటా ఎంట్రీ ప్రక్రియ ముగిసి 7 నెలలు దాటినా జిల్లాలో వాటి చెల్లింపులు జరగలేదు. దీంతో తమకు పారితోషికాలు ఎప్పుడు అందుతాయా.. అని ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు చెల్లించాల్సిన పారితోషికాల బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రిజక్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు మళ్లీ బిల్లులు చేస్తున్నాం. గతంలో బిల్లులు ల్యాబ్స్ కావడం, మళ్లీ బిల్లులు చేయడంతో చెల్లింపు ఆలస్యమవుతుంది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికాల బిల్లులన్నీ చెల్లిస్తాం. – రవీందర్, సీపీఓ -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
హత్యనా.. ప్రమాదమా ?
గట్టు: మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. ప్రమాదం కాదు హత్య అని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తు ఆందోళన చేశారు. వివరాలు.. ఆలూరు గ్రామానికి చెందిన కుర్వ నర్సింహ(35) ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో చికెన్ ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లినట్లు భార్య పల్లవి తెలిపారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నర్సింహకు ఫోన్ చేయగా స్విఛాఫ్ వచ్చిందని తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరోమారు చేయగా ఫోన్ స్విఛాప్ రావడంతో ధరూరులో ఉండే మరిది రమేష్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వాయిల్కుంటతండా వాసులు చెరువు గట్టున వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి ఆలూరు గ్రామస్తులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆలూరుకు చెందిన కుర్వ నర్సింహ(35)గా గుర్తించారు. మృతుడు విద్యుత్ తీగలపై పడి ఉంటడాన్ని గమనించి ప్రమాదం కాదు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మృతుని ద్విచక్రవాహనం గ్రామ చావిడి దగ్గరే ఉందని, వాయిల్కుంటతండా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన స్వాములు, తిమ్మప్ప, గోకారన్న, గోవిందు, నరేంద్రనాయక్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మల్లేష్ వివరాలు సేకరించారు. మృతుని భార్య పల్లవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య పల్లవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల అనుమానం చెరువు గట్టున విద్యుత్ తీగలపై మృతదేహం కేసు నమోదు -
చిరుతను బంధిస్తాం
కోయిల్కొండ: మండల కేంద్రంలోని ఫింజర్గుట్టపై వారం రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో సోమవారం అటవీ శాఖ అధికారులు డీఆర్ఓ రాజశేఖర్, రాఘవేందర్రెడ్డి, ఉమేష్ కొండపై చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత సంచారంతో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. చిరుతను బంధించేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని బోను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రిజ్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం మక్తల్: ఫ్రిజ్ సిలండర్ పేలి అగ్ని ప్రమాదం మక్తల్ పట్టణంలో సంగంబండ రోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మక్తల్లో ఆనంద్బాబు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాలుగు రోజుల నుంచి ఇల్లు తాళం వేసి సొంత ఊరుకు వెళ్లాడు. ఇటీవల కరెంటు సరఫరా ఎక్కువ, తక్కువ కావ డంతో ఫ్రిజ్ సిలిండ్ పేలి పెద్దగా పొగలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్ర మాదం తప్పింది. సమస్యలు పరిష్కరించాలని రైతుల ఆందోళన మద్దూరు: మద్దూరు మండలాన్ని భూ భారతిలో ఫైలెట్ మండలంగా ఎంపిక చేశారు. అయినా మా భూ సమస్యలను పరిష్కరిచండం లేదని రెనివట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అంతకుముందే నారాయణపేట కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెనివట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 319, 320, 359, 360, 210, 546, 565లో 66 ఎకరాల 11గుంటల ఇనాం భూమి ఉందన్నారు. ఈ భూమి చిన్నయ్య, మ ల్లప్ప, బాలప్ప, వెంకటప్ప పేర్ల మీద నాలుగు పెద్ద బాగాలున్నట్లు తెలిపారు. వారి వారసుల్లో కొంత మంది భూములు అమ్ముకొని వెళ్లిపోయారు. కానీ రికార్డుల్లో వారి పేర్లే ఉన్నాయి. ఈ సర్వే నంబర్ల భూమి ఇనామ్ రద్దు చేసి మాకు ఓఆర్సీ ఇచ్చి భాగ పరిష్కారం చేయాలన్నారు. భూ భారతిలో పెట్టుకు న్న అధికారులు స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. ఈ భూముల వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టజెప్పిన పనులు కావడం లేదని రైతులు ఆరోపించారు. కొత్త చట్టం ద్వారా మా సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ మహేష్గౌడ్ రైతులు సమస్యను విని రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలన్నారు. పాత రికార్డులను పరిశీలించి, పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కొత్త ఆశప్ప, చిట్టి కన్కప్ప, జగన్, చిన్న కేవప్ప, హన్మంతు, బోడ శ్రీనివాస్, డబ్బ అశోక్, రాసం కన్కప్ప, చెవుల మోహన్, సాయమ్మ, ప్రమీల, మొగులప్ప, లక్ష్మి, గోవిందు, శేఖర్, నీలప్ప, భీమప్ప ఉన్నారు. కందూర్లో గొర్రెల చోరీ అడ్డాకుల: మండలంలోని కందూర్లో 20 గొర్రెలు చోరీకి గురైనట్లు ఎస్ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలయ్య, రమేష్, రవి కలిసి ఆదివారం మహబూబ్నగర్ మండలంలోని జమిస్తాపూర్లో 60 గొర్రెలను కొనుగోలు చేసి కందూర్కు తీసుకొచ్చారు. వాటిని రాత్రి బాలయ్య ఇంటి వద్ద ఉంచారు. వాటికి కొంత దూరంలోనే కాపలా ఉన్నారు. వర్షం రావడంతో సమీపంలో ఉన్న కిరాణం షాపు వద్దకు వెళ్లి అక్కడే ఉన్నారు. అయితే ఉదయం లేచి చూస్తే 40 గొర్రెలు మాత్రమే ఉండటంతో 20 గొర్రెలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రేషన్ కార్డు కోసం..
మహబూబ్నగర్ రూరల్: రేషన్ కార్డు కోసం కరీంనగర్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడికి మహబూబ్నగర్ జిల్లాలో మంజూరు అయింది. అధికారుల తప్పిదం కారణంగా అక్కడ జారీ చేయాల్సిన కార్డు ఇక్కడ రావడంతో లబ్ధిదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ కొత్త రేషన్ కార్డు కోసం తన ఆధార్ కార్డు గుర్తింపుగా స్థానికంగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన కార్డు జారీకి సంబంధించిన ప్రక్రియ నిర్వహించిన సంబంధిత శాఖ సిబ్బంది, అధికారులు కార్డు కోసం కరీంనగర్కు బదులుగా మహబూబ్నగర్ అని కంప్యూటర్లో పొందుపరిచారు. దీంతో ఆయనకు మహబూబ్నగర్లోని 1425022 రేషన్ షాపును కేటాయించారు. తనకు పొరపాటున జారీ చేసిన కార్డును రద్దు చేసి కొత్తది తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అధికారులకు విన్నవించుకోగా.. మహబూబ్నగర్ జిల్లాలో జారీ చేసిన కార్డు రద్దు చేస్తేనే నూతనంగా కరీంనగర్ జిల్లాలో కార్డు జారీ చేస్తామని తిరకాస్తు పెట్టారు. అంతేకాక అధికారులు చేసిన తప్పిదానికి తనను బలి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా తనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్డు జారీ చేయాలని లక్ష్మణ్ కోరుతున్నారు. కార్డును రద్దు చేస్తాం.. కరీంనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నమోదు మేరకు రేషన్ కార్డు మహబూబ్నగర్లో జారీ అయ్యిందని మహబూబ్నగర్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. అక్కడి అధికారుల పొరపాటు కారణంగా ఇక్కడి జారీ అయిన కార్డును రద్దు చేసి లబ్ధిదారుడికి అసౌకర్యం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు అధికారుల తప్పిదంతో లబ్ధిదారుడికి అవస్థలు -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
వంగూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజాభిప్రాయం మేరకే విద్యాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ ఆకునూరి మరళి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కళాశాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నాలుగు పాఠశాలలకు దాదాపు 8 ఎకరాల స్థలం ఉందని, ఈ స్థలంలో తరగతి గదులు, క్రీడాప్రాంగణాలు, ల్యాబ్లు, డైనింగ్ సెక్షన్లను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో లేని వసతులు కల్పించేందుకు రూ.11 కోట్లు దాతల నుంచి సేకరించినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం పేరెంట్స్ కమిటీతో పాటు పాఠశాల అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యావిధానంలో పెనుమార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే వంగూరు పాఠశాలలను నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి సెమిరెసిడెన్షియల్గా మార్చేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 16న ఇదే పాఠశాలలో మరో సమావేశం నిర్వహించిన అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. సమావేశంలో విద్యా కమీషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, జ్యోత్నారెడ్డి, డీఈఓ రమేష్కుమార్, ఎంఈఓ మురళీమనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు వంగూరులో ఒకే గొడుగు కిందకు ప్రభుత్వ పాఠశాలలు రూ.11 కోట్లతో అభివృద్ధి రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి -
వచ్చేనెల 11న రాష్ట్రస్థాయి సెమినార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వచ్చే నెల 11 నుంచి 12 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వర్క్షాప్ బ్రోచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పీయూ పరిధిలో మారిన నూతన సిలబస్, నూతన విద్యావిధానం లక్ష్యాలు, పరిశోధన ఆధారిత బోధన, రీసెర్చి మెథడాలజీ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యాపకులకు అవగాహన కల్పిస్తామన్నారు. నాణ్యమైన ఆవిష్కరణ పద్ధతులను నొక్కి చెప్పే ప్రస్తుత విద్యా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని అధ్యాపకుల సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎంఈడీ కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, హెచ్ఓడీ ఆంజనేయులు, ఓయూ ప్రొఫెసర్ సుజాత, దుర్గేశం, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీయూ నాన్టీచింగ్ ఉద్యోగి బుర్రన్నను వీసీ పరామర్శించారు. సుంకేసులకు 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు సోమవారం ఎగువ నుంచి 4,496 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని అంతే స్థాయిలో రెండు గేట్లను తెరిచి దిగవకు వదిలినట్లు చెప్పారు. అలాగే కేసీ కెనాల్కు మరో 159 క్యూసెక్కులను వదిలినట్లు వివరించారు. -
వికసించిన మే పుష్పం
సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసే అరుదైన మే పుష్పం వికసించింది. కోస్గి పట్టణంలోని వార్ల మల్లేశం ఇంట్లోని టెర్రస్ గార్డెన్లో మే పుష్పం వికసించి అందరినీ అకట్టుకుంటోంది. మే నెలలో మాత్రమే పుష్పించే ఈ మొక్క వృక్షరాజ్యంలో అమరిల్లిడేసి కుటుంబానికి చెందింది. కేవలం మే నెలలో మాత్రమే వికసిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి తాను పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను తెచ్చి కుండీలో నాటానని.. ప్రతి ఏటా మే నెలలో ఒక పువ్వు మాత్రమే వచ్చేదని.. ఈసారి నాలుగు పువ్వులు వికసించాయని మల్లేశం తెలిపారు. జూన్ వరకు ఈ పుష్పాలు ఉంటాయన్నారు. – కోస్గి రూరల్ -
బేస్మెంట్ బిల్లులు అందాయా..
భూత్పూర్: బేస్మెంట్ బిల్లులు అందాయా అని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో సోమవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మండలంలోని భట్టుపల్లిలో 13 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోగా వారికి రూ.లక్ష చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సబావట్ జుమ్ని తనతోపాటు బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన వారికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని, తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రికి వివరించారు. తాను రేకుల షెడ్డులో నివాసం ఉంటూనే తన కుమారుడు బీటెక్, కుమార్తె లా కోర్సు చదివిస్తున్నానని చెప్పడంతో మంత్రి జుమ్నిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో మీలాంటి మహిళలు తమ పిల్లలకు ఉన్నత స్థాయి చదువులు చెప్పించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్, ఎంపీడీఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుతో వీసీలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
నిక్కచ్చిగా భూ సర్వే చేపట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): భూ భారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ల మొదటి విడత శిక్షణలో పాల్గొన్న లైసెన్స్డు సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో లైసెన్స్డు సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం అమలుకు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది లైసెన్స్డు సర్వేయర్లను నియమించారన్నారు. ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్స్డు సర్వేయర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 132 మంది లైసెన్స్డు సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజులపాటు థియరీ, ప్రాక్టికల్గా రిటైర్డు సర్వేయర్లు శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైన వారినే లైసెన్స్డు సర్వేయర్లుగా నియమిస్తామన్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేసేప్పుడు భూ సర్వే తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో భూ సర్వేకు చాలా సమయం పడుతుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు పరిష్కారం కోసం భూ సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్డు సర్వేయర్లు చేసిన భూ సర్వేను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి.. మ్యాప్ రూపొందిస్తారన్నారు. లైసెన్స్డు సర్వేయర్లుగా నియామకమైన వారు భూ సర్వే కచ్చితంగా నిర్వహించి వివాదాలకు తావు లేకుండా నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ పర్వతాలు, రిటైర్డ్ సర్వేర్లు కొండన్న, బషీర్, నాగభూషణం, శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కలుషితమైన నీరు, నీటి నిల్వల ద్వారా దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలంలో పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలని, తాగునీటిపై ఎప్పుడూ మూతలు ఉంచాలన్నారు. నీటిని కాచి చలార్చిన తర్వాత తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణకు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. శరీరాన్ని పూర్తి దుస్తులతో కప్పి ఉంచాలన్నారు. ఎలాంటి జ్వరం వచ్చిన ఆస్పత్రిలో సంప్రదించి తప్పక రక్తపరీక్షలు చేసుకోవాలని సూచించారు. నేడు పీఎఫ్ సమస్యలపై సదస్సు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి గాను మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించనున్నామని రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 తేజ్ప్రతాప్సింగ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సులు మహబూబ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్, నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయం, వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం, నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాలలోని ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ (బీడీ మాన్యుఫ్యాక్చర్స్), గద్వాల పీఏసీఎస్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో, వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతాయన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో, హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ ఆఫీస్–2లో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించి మాట్లాడారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో 60 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. అండర్– 8 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 200 మీ., టెన్నిస్బాల్ త్రో, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్జంప్, కిడ్స్ జావెలిన్, అండర్–12లో బాల, బాలికలకు 60 మీ., 300 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్జంప్, షాట్పుట్, కిడ్స్ జావెలిన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించామన్నారు. ఆయా క్రీడాంశాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వారి వివరాలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
కలుపును ఇలా నివారిద్దాం
అలంపూర్ : వానాకాలం సాగు సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పంటల సాగులో కలుపు సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కలుపు వలన 30 నుంచి 70 శాతం పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే కలుపు నివారణకు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టం జరగకుండా చూడొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచిస్తున్నారు. వరిలో ఊడల నిర్మూలనకు విత్తనాన్ని నాటిన 14 రోజులకు ఎకరా నారుమడికి ప్రిటిలాక్లోర్ 400 మి.లీ లేదా సైహాల్పాప్బ్యూటైట్ 400 మి.లీ ద్రావకాన్ని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. లేదా ఊద వెడల్పాకు కలుపు సమపాళ్లలో ఉంటే నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు బిస్ పైరిబాక్ సోడియం(10) శాతం 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. మాగాణి వరిలో.. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నాటిన 3 లేదా 5 రోజుల్లో పొలంలో పలుచగా నీరుంచి ఎకరాకు 1–1.5 లీ. బుటాక్లోర్ (50 శాతం) లేదా 400 మి.లీ చొప్పున అనిలోఫాస్ (30 శాతం) ప్రిటిలోక్లోర్ (50 శాతం) గానీ 20 కిలోలు పొడి ఇసుకలో కలిపి చల్లాలి. గడ్డి, తుంగ వెడల్పాటి ఆకు జాతీ మొక్కలు సమపాళ్లలో ఉంటే వరి నాటిన 3 లేక 5 రోజుల్లో 4కి బుటాక్లోర్ 5 శాతం గుళికలు+4కి 2.4–డీ ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. నాటిన 20 నుంచి 30 రోజుల్లో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాములు 2.4–డీ సోడియం సాల్ట్ (80 శాతం) లేదా ఇథాక్సి సల్ఫురాన్ 15 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న : మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లో ఎకరాకు 1–1.5 కిలోల అట్రాజీన్ పిచికారీ చేయాలి. తర్వాత 30–35 రోజుల్లో గొర్రు గంటుకతో అంతర్ కృషి చేయాలి. జొన్న : జొన్న విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లో 600 నుంచి 800 గ్రాముల అట్రాజిన్ను విత్తిన 20 రోజుల తర్వాత అలాగే 400 గ్రాముల 2, 4–డీ సోడియం సాల్ట్ 80 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం మంచిది. కంది : కంది విత్తిన వెంటనే 1–2 రోజుల్లో ఎకరాకు 1.1.3 లీ పెండి మిథాలీన్ వాడాలి. విత్తిన 30 లేక 60 రోజుల్లో గొర్ర గుంటకతో అంతర్ కృషి చేయాలి. లేదా ఇమజితాపీర్ ఎకరాకు 200 మి.లీ పిచికారి చేయాలి. మినుము/పెసర : విత్తిన 1–2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండి మిథాలీన్ను విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు నివారణకు 250 మి.లీ పెనాక్స్ ప్రాప్ ఇథైల్ 5 శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి చల్లితే ప్రయోజనం ఉంటుంది. మినుములు : పొలంలో గడ్డిజాతి వెడల్పాకు ఉంటే ఎకరాకు 200 మి.లీ ఇమిజితాపిర్ 10 శాతం పొడితో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు చల్లితే మినుము పెరుగుద ల ఆగినప్పటికీ తిరిగి మాములు స్థితికి వస్తోంది. శనగ : పైర్లు విత్తిన వెంటనే లేదా ఒకటి లేక రెండు రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలీన్ పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో విత్తిన 20 రోజుల సమయంలో 250 మి.లీ ఇమజితాపిర్ మందు కూడ పిచికారీ చేయవచ్చును. కూరగాయ పంటల్లో : వంగ, టామాటో, ఉల్లి, వెల్లుల్లి పంటలు నాటడానికి ముందు ఎకరాకు 1–1.3లీ పెండామిథాలీన్ లేదా 200 మి.లీ ఆక్సీఫ్లోరాపెన్ పిచికారీ చేయాలి. ఉల్లి, వెల్లుల్లిల్లో నాటిన 15–20 రోజులకు నేలలో తేమ చూసుకొని 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ కూడా వాడవచ్చు. బెండలో విత్తిన వెంటనే లేదా 12 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలీన్ లేదా 1.5–2 లీటర్ల అలాక్లోర్ చల్లాలి. క్యాబేజి, కాలీఫ్లవర్లో నాటడానికి 1 లేదా 3 రోజుల ముందు ఎకరాకు 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ చల్లాలి. కంద, చేమ పెండలం వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి వచ్చాక ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలీన్ లేదా ఆక్సీఫ్లోరోఫెన్ పిచికారీ చేయాలి. -
కొత్త పైప్లైన్కు మోక్షమెప్పుడో?
చిన్నచింతకుంట: మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా కోసం కొత్త పైప్లైన్ నిర్మించక పోవడం మండల ప్రజలకు శాపంగా మారింది. పాత పైప్లైన్ తరచుగా లీకేజీలు అవుతుండటంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. మరోవైపు స్వచ్ఛమైన తాగునీరు కలుషితమవుతున్నాయి. కురుమూర్తి గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ సంప్ నుంచి కౌకుంట్ల మండలం ముచ్చింతల వరకు 10 కి.మీ.మేర కొత్త పైప్లైన్ నిర్మించలేదు. పాత పైప్లైన్కే మిషన్ భగీరథ పథకం కనెక్షన్ ఇచ్చారు. దీంతో పాత పైప్లైన్ నిత్యం ఏదో ఒకచోట లీకేజీ ఏర్పడుతోంది. ఫలితంగా చిన్నచింతకుంట మండలంలోని 13 గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తుతోంది. 40ఏళ్ల క్రితం నాటి పైప్లైన్.. సాయిబాబా ట్రస్టు వారు 40ఏళ్ల క్రితం రామన్పాడు నుంచి చిన్నచింతకుంట మండలానికి పైప్లైన్ ఏర్పాటుచేసి తాగునీటిని అందించారు. అయితే, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో కొత్త పైప్లైన్ నిర్మించాల్సి ఉండగా.. సంబంధిత అధికారులు విస్మరించారు. కురుమూర్తి సమీపంలో నిర్మించిన తాగునీటి సంప్ నుంచి ముచ్చింతల వరకు ఉన్న పాత పైప్లైన్కే మిషన్ భగీరథ పైప్లైన్ కలిపారు. దీంతో పాత పైప్లైన్కు తరచుగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు పైప్లైన్ లీకేజీలకు మరమ్మతు చేయించడం.. మళ్లీ ఏదో చోట పైప్లైన్ పగిలిపోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా చిన్నచింతకుంట, కురుమూర్తి, అమ్మాపురం, గూడూర్, మద్దూర్, ఏదులాపురం, కౌకుంట్ల మండలంలోని తిర్మలాపూర్, దాసర్పల్లి, అప్పంప ల్లి, ముచ్చింతల, రాజోళి తదితర గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. తరచుగా సమస్య.. మండలంలోని గ్రామాలకు పాత పైప్లైన్ ద్వారానే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. దీతో తరచుగా లీకేజీలు ఏర్పడుతూ తాగునీటి సమస్య ఏర్పడుతుంది. మరోవైపు తాగునీరు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త పైప్లైన్ నిర్మించాలి. – కాంతారావు, మాజీ సర్పంచ్, గూడూరు ప్రతిపాదనలు పంపించాం.. రామన్పాడు నుంచి 13 గ్రామాలకు నీటిని సరఫరాచేసే పాత పైప్లైన్ తొలగించి కొత్త పైప్లైన్ ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కొత్త పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతాం. ప్రస్తుతం ఎక్కడ లీకేజీలు ఏర్పడినా వెంటనే సరిచేసి గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. – వినోద్, ఏఈ, మిషన్ భగీరథ పథకం పాత పైప్లైన్తోనే 13 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా తరచుగా లీకేజీలు ఏర్పడుతున్న వైనం తాగునీటి సరఫరాలో అంతరాయంతో ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు -
ప్రాధాన్యతా క్రమంలో.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్గౌడ్ పాల్గొన్నారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క -
తాగునీరు కలుషితం..
తాగునీటి పాత పైప్లైన్ స్థానంలో కొత్త పైపులైన్ నిర్మాణానికి ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నాటి పాత పైప్లైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తుండటం.. తరచూగా లీకేజీలు ఏర్పడుతుండటంతో చెత్తాచెదారం, నాసుతో కూడిన నీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యను తాగునీటి సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొత్త పైప్లైన్ నిర్మించాలని కోరుతున్నారు. -
బాధితులు మధ్యవర్తులను తీసుకురావొద్దు
మహబూబ్నగర్ క్రైం: ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత నేరుగా ఆయా స్టేషన్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యల విషయంలో సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని వ్యవహరించాలన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులు మధ్యవర్తులతో కాకుండా.. నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. -
ఒకేసారి మూడు నెలలకు..
మహబూబ్నగర్ రూరల్: వర్షాకాలంలో వచ్చే వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ దిశగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 15,684 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమని భావిస్తున్నారు. జూన్ 1 నుంచి 30 వరకు.. జిల్లాలోని 17 మండలాల్లో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,53,229 మంది కార్డుదారులకు జూన్ 1 నుంచి 30 వరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 17 వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు. కానీ, కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ నెల మొత్తం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ కోటా బియ్యం తీసుకెళ్లాల్సి ఉండగా, అందుకు ఒక్కొక్కరు మూడు సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒక కార్డుదారుడు వరుసగా రెండు, మూడుసార్లు వేలిముద్రలు స్వీకరించే అవకాశం పీఓఎస్లో లేదు. ఈ లెక్కన కార్డుదారులు చౌకధర దుకాణాల్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి వస్తుంది. ఈ విషయమై కేంద్రం పీఓఎస్ (బయోమెట్రిక్ మిషన్)లో ఏమైనా మార్పులు చేస్తుందేమో వేచిచూడాలి. డీలర్లకు ఇబ్బందే.. మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ చేసేందుకు 15,684 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూడు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేపడుతున్నారు. కాగా మూడు నెలల రేషన్ కోటా బియ్యం ఒకేసారి దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. జూన్లో బియ్యం పంపిణీకిఅధికారుల కసరత్తు వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం జిల్లాకు 15,684 మెట్రిక్ టన్నులుఅవసరం దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం దిగుమతికి డీలర్ల తంటాలు -
ఒకేసారి తీసుకెళ్లాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్లోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ప్రతినెలా 2,53,229 మంది రేషన్ కార్డుదారులకు 5,228 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ జరుగుతుంది. జూన్ 1 నుంచి 30 వరకు డీలర్లు బియ్యం పంపిణీ చేయాలి. తర్వాత నెలలో పంపిణీకి అవకాశం ఉండదు. కార్డుదారులు మూడు నెలల కోటా ఒకేసారి తీసుకెళ్లాలి. – రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ ● -
హడలెత్తిస్తున్న చిరుతలు..!
కోయిల్కొండ: మండలంలో వివిధ ప్రాంతాల్లో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులులు అటవీ ప్రాంతాలను వదిలి సమీపంలో ఉన్న పంటచేల వైపు, కొండ ప్రాంతాల వైపు సంచరిస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసి చంపేస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐదేళ్లుగా మండలంలో చిరుతపులల సంచారం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 12పైగా చిరుతపులులు? జిల్లాలో అటవీ ప్రాంతాలలో 12 నుంచి 15కు పైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కోయిల్కొండ మండలంలో 5 నుంచి 6 వరకు చిరుత పులులు ఉన్నాయని, ఇవి ఒకే ప్రాంతంలో కాకుండా 40–70 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేస్తుంటాయని అధికారులు తెలుపుతున్నారు. మండలంలో బూర్గుపల్లి, దమాయపల్లి, ఇబ్రహీంనగర్, భవానిసాగర్, కోయిల్కొండ, కనాయపల్లి, సూరారం, కేశ్వాపూర్ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజల కంటపడ్డాయి. బూర్గుపల్లి, తిర్మలంపల్లి, పల్గుతాండ, కేశ్వాపూర్ గ్రామాలలో ఇప్పటికే అనేక పశువులను హతమార్చాయి. నెలకు ఒక్కసారైన పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడంతో పాటు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. భయాందోళనలో రైతులు చిరుతలు తరచూ పంట చేలవైపు వస్తుండడంతో రైతులు, కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వానాకాలం ప్రారంభంకానుండడంతో సాగు పనులు ముమ్మరం కానున్నాయి. ఈ క్రమంలో పులుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పశువులను మేపేందుకు వెళ్లాంటే కాపరులు హడలిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో పంటచేలకు వెళ్లే రైతులు కూలీలు గుంపులు గంపులుగా వెళ్తూ చీకటి పడకముందే ఇంటికి చేరుకుంటున్నారు. పశువులపై దాడులు.. కోయిల్కొండ, ఇబ్రహీంనగర్లో వరుసగా లేగదూడ, మేక పిల్లలపై చిరుతపులి దాడి చేసింది. బూర్గుపల్లిలో నాలుగు గేదెలపై దాడి చేసేందుకు యత్నించగా గేదెలు తిరగబడడంతో చిరుతపులికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతపులికి జూపార్కులో చికిత్స చేయించగా నెల రోజుల తర్వాత మృతి చెందింది. అదే విధంగా పల్గుతండాకు చెందిన రైతు లేగదూడను, బూర్గుపల్లిలో మరో రైతు గేదెను, కేశ్వాపూర్లో ఎద్దును, చన్మన్పల్లిలో ఆవును ఇలా పలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో పశువులపై దాడి చేసి చిరుతపులులు హతమార్చాయి. అంతేకాక వారం రోజులుగా మండల కేంద్రంలోని ఫింజర్గుట్టపై చిరుతపులి కనిపిస్తుండడంతో యువకులు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. ఫింజర్ గుట్టపై కనిపించిన చిరుత భయాందోళనలో ప్రజలు అడవులకు వెళ్లొద్దని సూచిస్తున్న అధికారులు చిరుతల కదలికలపై నిఘా... మండలంలో చిరుతపులులు సంచరిస్తుండడంతో వాటి కదలికలపై నిఘా పెట్టాం. చిరుతపులుల దాడి చేసి హతమార్చిన పశువుల కళేబరాలతో పాటు వాటి పాదముద్రలను సేకరిస్తున్నాం. ఎటునుంచి ఎటువైపు వెళ్తున్నాయని తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాం. అయినా రైతులు జాగ్రత్తగా ఉండాలి. చిరుతలను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – సత్యనారాయణ, జిల్లా ఫారెస్ట్ అధికారి -
రూ.250 దాటడం లేదు..
ఎంత పనిచేసినా రూ.250 కూలి దాటడం లేదు. ప్రభుత్వం రూ.300 ఇస్తామంటున్న ఇక్కడ మాత్రం అలా వస్తలేదు. ఎండలకు భూమి చాలా గట్టిగా ఉండటంతో ఎంత చేసినా పని సాగక తక్కువే వస్తుంది. అసలే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పని చేస్తున్నాం. ప్రభుత్వం తాము చేసిన కూలీ పనికి అదనంగా కలిపి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – జగత్యానాయక్, పున్యానాయక్తండా, నవాబుపేట పది రోజులుగా పనిలేదు.. నేను ఎండాకాలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లాను. రోజుకు రూ.260 చొప్పున డబ్బులు పడ్డాయి. కానీ, పది రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు పెట్టడం లేదు. ఏ పని లేక ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాం. రోజూ పని కల్పిస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. – లక్ష్మీదేవమ్మ, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం ● -
సకుటుంబ.. సపరివార.. సమేతంగా
కొత్తకోటలో ఆదివారం అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన సుమారు 250 మంది ఒకేచోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆటపాటలతో సరదాగా గడిపారు. కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయుడు పలుస శేఖర్గౌడ్ ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది కుటుంబ సభ్యులు సమ్మేళనంలో పాల్గొని కుటుంబ ప్రాధాన్యతను తెలియజేశారు. మారుతున్న కుటుంబ బంధాలకు దూరమవుతున్న పిల్లలకు కుటుంబ విలువలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శేఖర్గౌడ్ తెలిపారు. అలాగే పెద్దల ఉపన్యాసాలతో కుటుంబ విలువలు, జీవన విధానం గురించి చక్కగా వివరించారు. అనంతరం యువత, చిన్నారులతోపాటు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. – కొత్తకోట -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
బల్మూర్: మండలంలోని కొండనాగుల గ్రామ సమీపంలోని గుడిబండ శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు తరచూ జరుగుతున్నా పోలీసులు దుండగులను పట్టుకోలేక పోతున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి దుండగులు తవ్వకాలు జరిపి అలికిడి కావడంతో సామగ్రి అక్కడే వదిలి పారిపోయిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. శివాలయం ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో నాలుగు గడ్డపారలు, పారలు, సుత్తెలు, మాస్కులు, గ్లౌజ్లతో పాటు పూజ సామగ్రి ఉండటాన్ని పశువుల కాపరి గమనించి గ్రామస్తులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వక సామగ్రిని స్టేషన్కు తరలించారు. తరచూ తవ్వకాలు.. మూడేళ్లలో నాలుగుసార్లు గుప్త నిధుల కోసం గుదిబండ శివాలయంలో తవ్వకాలు జరిపారు. గత మూడు నెలల క్రితం గుర్తు తెలియని దుండగులు శివాలయంలోని బండను తొలగించి తవ్వకాలు జరిపారు. శివాలయం గ్రామానికి దూరంగా రెండు కిలో మీటర్ల దూరంలో వ్యవసాయ పొలాల్లో ఉండటంతో దుండగులు ఎలాంటి భయం లేకుండా తరచూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. గుడిలో భారీ ఎత్తున్న గుప్తనిధులు ఉన్నట్లు ప్రచారం ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన దుండగులు నిత్యం తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దుండగులను పట్టుకొని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమాదేవి తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో సామగ్రి, పూజ వస్తువులు గుదిబండ శివాలయంలో తరచూ గుప్తనిధుల వేట -
వక్ఫ్ సవరణ చట్టం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా రహ్మెని, కర్ణాటక మాజీ ఎంపీ సీఎం ఇబ్రహీం, కోల్కత్తాకు చెందిన మౌలానా అబు తాలిబ్ రహెమాని అన్నారు. మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన సభ నిర్వహించారు. వేలాదిగా ముస్లింలు పాల్గొన్న ఈ సభలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతుందని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన నితీష్కుమార్, చంద్రబాబునాయుడులకు ముస్లింలు తగిన బుద్ధిచెప్పాలని కోరారు. ముస్లిం ప్రముఖులు నిసార్ హుస్సేన్, హమీద్ఖాన్, హుసాముద్దీన్, మతీనుద్దీన్ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు నిర్వహించే నిరసన కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్బలాల, కన్వీనర్ మౌలానా నయీం కౌసర్ రషాది, రజాక్షాఖాద్రీ, మౌలానా ఖాజా ఫైజొద్దీన్, టీజీఎంఎఫ్సీ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, హాఫిజ్ ఇద్రీస్, అబ్దుల్ హాదీ, జాకీర్ అడ్వకేట్, జాబెర్ బిన్ సయీద్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండ్ల పేర్లు ముద్రించి..
నాసిరకం విత్తనాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. గతంలో అనేక సార్లు లూజు విత్తనాలను తీసుకువచ్చి వాటికి రంగులద్ది వివిధ బ్రాండ్ల పేర్లతో ముద్రించిన కవర్లలో ఆయా విత్తనాలను నింపి రైతులకు అంటగట్టేవారు. ఈ క్రమంలోనే పలుమార్లు నకిలీ విత్తనాలు, వాటికి సంబంధించిన కవర్లు అనేకం జడ్చర్లలో పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పత్తి విత్తన కంపెనీలు కలిగిన భూత్పూర్లో సైతం అధికారులు పలుమార్లు సోదాలు చేసి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపర్చుకున్నారు. తక్కువ ధరకు విక్రయం.. కొందరు రైతులు ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను గుట్టుగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లేని బీజీ–3 (హెచ్టీ) పత్తి విత్తనాలను సైతం కొందరు వ్యాపారులు లోగుట్టుగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఇప్పటికే లూజు పత్తి విత్తనాలు గ్రామాలకు చేరాయి. తక్కువ ధరకు (కిలో రూ.వెయ్యి నుంచి రూ.1,500) పత్తి విత్తనాలు అందజేస్తుండటంతో రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీటీ–1, 2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ, బీజీ–3 పత్తి విత్తనాలకు ఇవ్వలేదు. అయితే అంతగా అవగాహన లేని రైతులకు కొందరు వ్యాపారులు వీటిని అంటగడుతున్నారు. రంగులద్ది తయారు చేసిన నకిలీ పత్తి విత్తనాలు(ఫైల్) -
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
ధరూరు/ రాజోళి/ దోమలపెంట: ఉమ్మడి జిల్లా పరిధిలోని కృష్ణానదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,064 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా వస్తున్న ఇన్ఫ్లోలు ఆదివారం స్వల్పంగా తగ్గినటు్ల్ వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.271 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల సుంకేసుల డ్యాంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. రెండు గేట్లను తెరిచి అంతే స్థాయిలో దిగువన ఉన్న శ్రీశైలానికి వదిలారు. అలాగే కేసీ కెనాల్కు 159 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీశైలానికి 8,841 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి సుంకేసుల డ్యాం నుంచి ఆదివారం 8,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 818.2 అడుగుల వద్ద 39.4936 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి దిగువనున్న నాగార్జునసాగర్కు 7,259 క్యూసెక్కుల నీటిని వదిలారు. స్థానికంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తప్పిపోయిన బాలిక అప్పగింత
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ– భగవంతుడు దంపతుల కుమార్తె శివమ్మ ఆదివారం తప్పిపోయింది. అయితే తప్పిపోయిన బాలిక మండలంలోని చిన్న కార్పముల–పెద్దకార్పముల రోడ్డుపై ఓ వ్యక్తికి కనిపించడంతో అతడు పోలీలసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీశ్ స్పందించి సిబ్బందిని పంపి పాప వివరాలు ఆరా తీశారు. బాలిక సమాచారం చెప్పకపోవడంతో గ్రామాల వారీగా వివరాలు తెలుసుకొని చిన్నకార్పముల గ్రామానికి చేరకొని ఎట్టకేలకు తల్లిదండ్రులకు అప్పగించారు. -
గిరిజనులకు భూ పట్టాలు ఇవ్వాలి
ఖిల్లాఘనపురం: జాగిర్దార్ల పేరున ఉన్న భూ పట్టాలను రద్దుచేసి.. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న గిరిజనులకు వెంటనే భూ పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని మామిడిమాడ, షాపురం గ్రామాల రెవెన్యూ శివారుల్లో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా భూ పట్టాల సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో పోరాటం చేస్తున్నారు. వారి పోరాటానికి మద్దతుగా జాన్వెస్లీ ఆదివారం మండలంలో పర్యటించారు. భూములు సాగు చేసుకుంటున్న వెనకితండా, ముందరితండా, బక్కతండా, మేడిబావితండా, కర్నెతండా, ఆముదంబండ తండా, మిట్యాతండా, భీముడితండా గిరిజనులతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట అంజనేయులుతో కలిసి భూములను పరిశీలించారు. వెనకితండా, కర్నెతండాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన గిరిజనులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా తండాల గిరిజనులు సుమారు 150 ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటుండగా, ఇప్పటికీ రాజా శ్యాంకరణ్ బహదూర్, రాజా మోహన్ కరణ్ బహదూర్ల పేర్ల మీద భూ పట్టాలు ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మారినా, ఎన్నో చట్టాలు వచ్చినా గిరిజనులకు పట్టాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజులు గాని వారి వారసులు గాని, వారి పాలేర్లు గాని ఏనాడు ఇక్కడికి వచ్చి సాగుచేసింది లేదన్నారు. షాద్నగర్ జమీందారులైన నాటి రాజుల పేరున నేటికీ 495.7 ఎకరాల భూమి పట్టా ఉందన్నారు. దున్నేవాడికే భూ పట్టాలు ఇవ్వాలని సీలింగ్ యాక్ట్ వచ్చినా ఈ భూములు గిరిజనుల పేరున మారలేదన్నారు. జాగిర్దార్లకు సానుకూలంగా ప్రభుత్వాలు, అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం పేద గిరిజనుల బాధను అర్థం చేసుకొని వారు సాగుచేస్తున్న భూముల ప్రకారం పట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రజెండా నీడలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో భూ పట్టాల సాధన కమిటీ కన్వీనర్ సక్రూ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్, మహిళా సంఘం కార్యదర్శి లక్ష్మి, పరమేశ్వరాచారి, నాయకులు మద్దిలేటి, గిరిజన రైతులు కృష్ణానాయక్, భరత్ నాయక్, శ్రీను నాయక్, దాసు నాయక్, చంద్రు, రాజీ, మన్నీ, చావ్లీ, శిరీష పాల్గొన్నారు. జాగిర్దార్ల పేరుపై ఉన్న వాటిని రద్దు చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సంస్కారంతో కూడిన విద్య అవసరం..
విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి పెంపొందించే విధంగా వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. 3నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల వరకు శిబిరంలో చేర్చుకుని వారికి చదువుతో పాటు వివిధ కళల నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తున్నాం. మొత్తం 16 శిక్షణ శిబిరాల్లో 3వేల మంది విద్యార్థులకు 96 మంది వలంటీర్లచే తరగతులను నిర్వహిస్తున్నాం. నెల రోజులపాటు విద్యార్థులకు ఇంటి పనులతో పాటు స్వచ్ఛభారత్పై అవగాహన కల్పిస్తున్నాం. తల్లితండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించే విధంగా వారిలో ప్రేరణ కలిగిస్తున్నాం. – మాధవరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
ప్రశాంతంగా గ్రామ పాలనాధికారి పరీక్ష
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామ పాలన అధికారి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని చైతన్య హైస్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా.. మొత్తం 152 మంది అభ్యర్థులకు గాను 140 మంది హాజరవగా.. 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగా 1.30 గంటల వరకు కొనసాగింది. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. అలాగే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఈఓ ప్రవీణ్, ఆర్డీఓ నవీన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్, అర్బన్ డీటీ దేవేందర్ తదితరులున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 152 మందికి 140 మంది హాజరు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ విజయేందిర -
భారీగా పట్టివేత..
ప్రభుత్వం బీజీ–3 పత్తి విత్తనాల కట్టడికి ఎంతగా చర్యలు చేపడుతున్నా బహిరంగ మార్కెట్లోకి మాత్రం విచ్చలవిడిగా నిషేధిత విత్తనాలు వస్తున్నాయి. గతేడాది జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర 2.21 క్వింటాళ్ల బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుబడగా తాజాగా ఇదే గ్రామంలో మళ్లీ దొరికాయి. అలాగే సమీపంలోని ఈర్లపల్లి తండాలోనూ ఇద్దరు వ్యక్తుల వద్ద బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుబడటం గమనార్హం. నాలుగేళ్ల క్రితం ఏకంగా జడ్చర్లలోనే ఓ పత్తి విత్తన వ్యాపారి నకిలీ విత్తనాలను తయారు చేసి విక్రయిస్తుండగా అప్పట్లో విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చే నెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్– 8, 10, 12 ఏళ్లలోపు బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని సూచించారు. నేడు లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): భూ భారతి చట్టం అమలులో భాగంగా నియమించనున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు సోమవారం జిల్లా పరిషత్ హాల్లో శిక్షణ నిర్వహించనున్నట్లు సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిర ప్రారంభిస్తారన్నారు. సర్వేయర్లు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. ఇంట్రా టూడే లీగ్లో రాణించాలి మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లో భాగంగా ఆదివారం మహబూబ్నగర్– నాగర్కర్నూల్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్కుమార్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఇంట్రా డిస్ట్రిక్ల్ లీగ్ క్రీడాకారులకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్సీఏ టోర్నమెంట్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లు ప్రారంభించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు అబ్దుల్లా, ఎండీ మన్నాన్, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్కు వర్షం అడ్డంకి సమర్థ స్కూల్ మైదానంలో మహబూబ్నగర్– నాగర్కర్నూల్ జట్ల మధ్య టూడే లీగ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన నాగర్కర్నూల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 37.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయిది. జట్టులో కేతేశ్వర్ 65 పరుగులు చేశాడు. మహబూబ్నగర్ బౌలర్లు కొండ శ్రీకాంత్ 9.5 ఓవర్లలో 33 పరుగులకు 4 వికెట్లు, మహ్మద్ షాదాబ్ అహ్మద్ 12 ఓవర్లలో 33 పరుగులకు 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ జట్టుకు పలుమార్లు వర్షం అడ్డంకిగా మారింది. 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేయగా వర్షం వల్ల మ్యాచ్ను నిలిపివేశారు. ఓపెనర్ ఎ.శ్రీకాంత్ 72 బంతుల్లో 11 ఫోర్లతో 65 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సోమవారం రెండో రోజు మ్యాచ్ కొనసాగనుంది. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం మరికల్: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈక్రమంలోనే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన మన్కీ బాత్ కార్యక్రమాన్ని ఆమె మరికల్లో వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదుల స్థావరాలపై ప్రతీకార దాడి చేసి విజయం సాధించమన్నారు. సైనికుల విజయానికి మద్దతుగా తీరంగా యాత్ర నిర్వహించామని, ఇందుకు దేశ ప్రజల నుంచి కూడా సంపూర్ణ మద్దతు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్లో భారతదేశంపై ఎక్కడ దాడి జరిగిన ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి వేయడం కోసం చేపట్టి ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాగురావు, రతంగపాండురెడ్డి, నర్సన్గౌడ్, వేణు, తిరుపతిరెడ్డి, భాస్కర్రెడ్డి, రాజేష్, శ్రీరామ్, రమేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. -
బీజీ–3 కలకలం..
జిల్లావ్యాప్తంగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు ●అత్యంత ప్రమాదకరం బీజీ–3 విత్తనాలు అత్యంత ప్రమాదకరం కావడంతో ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని లూజ్ విత్తనాలను రైతులకు విక్రయించడం తగదు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. బీజీ–3 పత్తి విత్తన విక్రయాలపై గట్టి నిఘా పెట్టాం. బీజీ–3 విత్తనాల సాగు, దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే కొనుగోలు చేసి బిల్లులు తీసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. నకిలీ విత్తనాలను ఎక్కడైనా విక్రయిస్తే చర్యలు తప్పవు. పత్తి పంట ఆకులను పరీక్షించి బీజీ–3 విత్తనాలు సాగు చేసిన రైతులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్, జిల్లా వ్యవసాయాధికారి ● ఏపీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతి ● గ్రామాల్లో గుట్టుగా రైతులకు విక్రయాలు ● తాజా దాడులతో భారీగా పట్టివేత ● ఆలస్యంగా మేల్కొన్న వ్యవసాయాధికారులు జడ్చర్ల: వానాకాలం (ఖరీఫ్) సీజన్ ఆరంభమవుతున్న వేళ బీజీ–3 నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కలవరపెడుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తన వ్యాపారులు చాపకింద నీరులా అల్లుకుపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముందస్తుగా దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారులు వారికి ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇచ్చే కంపెనీలు సరఫరా చేసే నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది విత్తనాల లేవంటూ కృత్రిమ కొరత సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. విత్తనమే మూలం.. రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ప్రాథమిక స్థాయిలో విత్తన ఎంపిక కీలకం. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చు. జన్యు, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవడం మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భౌతిక స్వచ్ఛతకు సంబంధించి గింజ పరిమాణం, రంగు వంటివి గమనించి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాసిరకం విత్తనాలను ఎంపిక చేసుకోవడం వలన తెగుళ్ల బెడదతోపాటు పంట గిడసబారి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేగాక పంట సస్యరక్షణకు మందులను అధిక మొత్తంలో వాడటం వలన రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రధాన వాణిజ్య పంట ప్రతిఏటా వానాకాలం సీజన్లో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన పత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది సైతం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకుపైగా పత్తిని సాగు చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కువగా పత్తి పంట సాగుకే ప్రాధాన్యత కల్పించడంతో రైతులు సైతం ఆసక్తి చూపుతున్నారు. పత్తి తర్వాత వరి, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పెసర, కంది తదితర పంటలను సాగు చేస్తారు. అయితే ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో కొందరు రైతులు ముందస్తుగా పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈపాటికే విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. అధికారులేమో ఇప్పుడు నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. -
ప్రణాళికాబద్ధంగా పాలమూరు అభివృద్ధి
స్టేషన్ మహబూబ్నగర్: విజన్–2047తో పాలమూరు అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని ఒప్పించి మహబూబ్నగర్ను కార్పొరేషన్గా మార్చామన్నారు. విజన్–2047 లక్ష్యంతో నిర్దిష్టమైన ప్రణాళికలతో మహబూబ్నగర్ను అభివృద్ధి చేయడానికి నిపుణులు, కన్సల్టెంట్లు, సర్వేయర్లతో ఆలోచన చేస్తున్నామని, ముందుగా ప్రధాన సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉందని, ఇందుకోసం బైపాస్ రోడ్డు అవసరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. టీయూఐడీఎఫ్ ద్వారా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా అభివృద్ధి కోసం రూ.220.94 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. భవిష్యత్లో భూత్పూర్, జడ్చర్ల, మహబూబ్నగర్తో కలిపి ట్రైసిటీ నగరంగా మారుతుందన్నారు. ప్రస్తుత జనాభా 3 లక్షలు ఉందని, 2047 వరకు 5 లక్షల వరకు పెరుగవచ్చని, అప్పటి అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. కలలో కూడా ఊహించని విధంగా ప్రాజెక్టులు పాలమూరుకు వస్తున్నాయని, అందులో భాగంగా ఐఐఐటీ కళాశాల ఒకటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలకుపడిన అమృత్ స్కీంలో కదలిక తెప్పించామన్నారు. మయూరీ ఎకో అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తామని, త్వరలో పూలే– అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేస్తామన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు బెనహర్, కృష్ణయ్య, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల పట్టివేత
జడ్చర్ల: ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను శనివారం జిల్లా వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈర్లపల్లితండాలో గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి గుట్టుగా లూజ్ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుని రైతులకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో వ్యవసాయ శాఖ జడ్చర్ల పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, సీఐ కమలాకర్ తాండాలోని పలువురు రైతుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీలలో మేఘనాథ్ చంద్య దగ్గర 30 కిలోలు, మేఘనాథ్ రవి దగ్గర 15 కిలోల బీజీ–3 పత్తి విత్తనాలు దొరికాయి. మొత్తం 45 ప్యాకెట్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు. ఈర్లపల్లితండాలో గుట్టుగా పత్తి విత్తనాల నిల్వలు ఇద్దరు నిందితుల అరెస్ట్ -
ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలం
కల్వకుర్తి రూరల్: ఉగ్రదాడుల నుంచి దేశాన్ని, ప్రజల ప్రాణాలను రక్షించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ జిల్లా నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక యూటీఎఫ్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాపై చైనాతో పాటు చిన్న చిన్న దేశాలు టారిఫ్లు విధిస్తుంటే.. ప్రధాని మోదీ అమెరికాకు మోకరిల్లడాన్ని సీపీఎం ఖండిస్తుందన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం తమవల్లే ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ ప్రధాని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పహల్గాంలో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు. 27 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్పై యుద్ధం ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో 500 మంది నక్సలైట్లను హత్య చేశారని అన్నారు. కాల్పుల విరమణ పాటిస్తామని.. చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు చెబుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే స్పందించి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు ఇస్తే రావని.. పోరాడి సాధించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇతర నిధుల కోసం పోరాటమే శరణ్యమని ఆయన సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై స్పందించాలన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను అణిచివేస్తుందని ధ్వజమెత్తారు. భవిష్యత్లో బీజేపీతో పొత్తు ఉండదనే విషయాన్ని కేసీఆర్ తేల్చి చెప్పాలన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి హక్కుల సాధన కోసం పోరాడుదాం కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
వీపనగండ్ల: మండలంలోని సంగినేనిపల్లికి చెందిన పికిలి శేఖర్ (40) శనివారం సాయంత్రం బైక్పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక హెడ్కానిస్టేబుల్ వెంకటేష్ కథనం ప్రకారం.. శేఖర్ శ్రీరంగాపూర్ మండలంలోని నాగరాల గ్రామంలోని తమ బంధువుల ఇంటి వెళ్లి తన సొంత గ్రామానికి వస్తుండగా సంగినేనిపల్లి, కల్వరాల గ్రామాల మధ్య బైక్ అదుపు తప్పి కిందపడడంతో మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమో దు చేసినట్లు ఆయ న తెలిపారు. మృతుడికి భార్య రేణు క, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
మార్మోగిన అంజన్న నామస్మరణ
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా నెల రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా రెండో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సంద్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలను ఆచరించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
కంపెనీ పనులు నిలిపేయాలని ఆందోళన
వెల్దండ: మండల పరిధిలోని నారాయణపూర్ తాండాలో నిర్మిస్తున్న కంపెనీ పనులు నిలిపివేయాలని తాండవాసులు అందోళనకు దిగారు చెందుతున్నారు. ఈ మేరకు శనివారం పనులు చేపట్టిన కూలీలను అడ్డుకొని బయటికి పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొక్కలను ఉడికించే కంపెనీతో ఈ ప్రాంతంలోని వాతావారణం కలుషితమైపోతుందన్నారు. వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే తమకు కంపెనీ వల్ల తమ భూములు నాశనం అవుతాయన్నారు. హైదరాబా ద్కు చెందిన కొంతమంది వ్యక్తులు భూములు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడో ఉన్న బొక్కల కంపెనీ పరికరాలను తీసుకొచ్చి బిగిస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ పరికరాల్లో కుళ్లిపోయిన బొక్కలు ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి పనులను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు గోపాల్నాయక్, బక్యనాయక్, పాండునాయక్, ఆయా గిరిజన తాండవాసులు, రైతులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో స్టడీ సెంటర్లు లేవని, వాటిలో వెంటనే స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్ఎంలు ముందుకు రావాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాలలో హెచ్ఎంలకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల వంటి మండలాల్లో ఒక్క స్టడీ సెంటర్లు కూడా లేవని వెంటనే ఏర్పాటు చేసుకునేందుకు ముందు రావాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులకు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్మిషన్లను ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు అడిగిన వారికి అనుమతి ఇస్తామన్నారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా సెంటర్లు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యులు ఎస్సెస్సీ, ఇంటర్ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్ పాల్గొన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించండి
బల్మూర్: నల్లమల ప్రాంతంలోని బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం స్టేజ్–1 నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులతో శనివారం బల్మూరులోని జిల్లా పరిషత్ మైదానంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రైతుల అభిప్రాయాల అనంతరం మాట్లాడారు. బల్మూర్ సమీపంలో చేపడుతున్న ఈ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలనే ప్రతిపాదన వినతిపత్రాన్ని సీఎం రేవంత్రెడ్డికి అందజేశామన్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేసి స్థానిక నిర్వాసితులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగావకాశాలతోపాటు చెంచు రైతులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డిజైన్లో అనంతవరం, బల్మూర్ గ్రామాలకు ముప్పు ఉందని, ఇళ్లు కూడా కోల్పోతారని గుర్తించి 2.67 టీఎంసీల నుంచి 2.40 టీఎంసీలకు కుదించి రీడిజైన్ మార్పు చేయించానన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ బాలస్వామి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు పాల్గొన్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూ సేకరణ రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉద్రిక్తల మధ్య కొనసాగినబల్మూరు గ్రామసభ -
మేకలు కాసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి..
గోపాల్పేట: మేకలు కాసేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని నర్సింగాయపల్లి శివారులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నర్సింగాయపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, కృష్ణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకటయ్య ఎనిమిది నెలల క్రితం గ్రామానికి సమీపంలోనే చెట్టు మీద నుండి కిందపడి మృతి చెందాడు. తల్లి కృష్ణమ్మ కూలీ పనులు చేస్తూ.. పిల్లలు మేకలు కాస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం మధ్యాహ్నం పిల్లలు లిల్లి (10), గణేష్ (5) ఇద్దరూ మేకలు మేపుతూ బయటికి వెళ్లారు. శనివారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు మేకలు ఇంటికి వచ్చినా.. పిల్లలు రాలేదు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెతికేందుకు గ్రామానికి సమీపంలోని చెట్ల వైపు వెళ్లి వెతుకుతుండగా నర్సింగాయపల్లికి సమీపంలోని ఓ బావి వద్ద లిల్లి, గణేష్ కు చెందిన చెప్పులు, బట్టలు కనిపించాయి. గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో వెతకగా.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో లిల్లి, గణేష్ మృతదేహాలు లభించాయి. -
రూ.1.45 లక్షలు వసూలుపై కేసు నమోదు
గద్వాల క్రైం: ఓ రైతు అయిదు ఎకరాల వ్యవసాయ పొలాన్ని తన పేరున భూ భారతిలో నమోదు, పాసుబుక్ల జారీ కోసం దళారీకి రూ.1.45లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటనపై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన వెంకటేష్ కేటీదొడ్డి మండలంలోని తన అయిదు ఎకరాల వ్యవసాయ భూమి తన పేరుపై భూ భారతిలో నమోదు, పాసుబుక్లు జారీ చేయాల్సిందిగా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే హైదరాబాద్కు చెందిన ఓ దళారీ ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని మీ పేరుపై భూభారతిలో పేరు నమోదు చేసి వారం రోజుల వ్యవధిలో పాసుబుక్లు జారీ చేస్తామని అందుకు రూ. 5లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దళారి మాటలు నమ్మిన వెంకటేష్ ముందుస్తుగా రూ. 1.45 లక్షలను ఏప్రిల్ 26 తేదీన చెల్లించాడు. అయితే నేటి వరకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో శనివారం బాధిత రైతు మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. మోసపూరితమైన వ్యక్తులపై రైతులు ప్రమత్తంగా ఉండాలన్నారు. 97.91 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నారాయణపేట: అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోటి చందు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చందు ఇంటి వద్ద బొలేరో వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా సివిల్ సప్లయ్ డీటీ కాళప్ప, రూరల్ పోలీస్సులు దాడి చేసి వాహనంతో పాటు 97.91 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీటీ పంచనామా చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ గాయత్రి తెలిపారు. అనారోగ్య సమస్యతో యువతి ఆత్మహత్య వెల్దండ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దండ మండలం మర్రిగుంతతండా పంచాయతీ గాజులోనిబావి తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి వివరాల మేరకు.. తండాకు చెందిన వడ్యావత్ పద్మ (18) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భద్రునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పకడ్బందీగానిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామపాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులను హాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం అలస్యమైన అనుమతి లేదని, పరీక్ష ముగిసే వరకు బయటికి వెళ్లేందుకు వీల్లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టూ పక్కల జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల నుంచి సేకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో చైతన్య హైస్కూల్లో పరీక్షకేంద్రం ఏర్పాటు చేశామని, 152 మంది అభ్యర్థులు రాయనున్నట్లు వెల్లడించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్, కలెక్టరేట్ ఏఓ శంకర్, తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు దేవరకద్ర: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు. శనివారం దేవరకద్ర పోలీసుస్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు గ్రామాల్లో తిరిగి నకిలీ బీజీ పత్తి విత్తనాలు విక్రయిస్తారని, అలాంటి వారి పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గ్రామాలకు వచ్చే నకిలీ విక్రయదారుల సమాచారం పోలీసులకు ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను మోసం చేసే ఏ వ్యాపారి అయినా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. దేవరకద్రలో ప్రతి బుధవారం సంతలో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీటిని అరికట్టడానికి మఫ్టీలో పోలీసులను పెడతామని తెలిపారు. కొత్త మండలాలు కౌకుంట్ల, గండేడ్లలో త్వరలో కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి నేరాలకు సంబంధించి నమోదు అవుతున్న కేసులపై ఆరా తీశారు. అనంతరం దేవరకద్ర రైల్వే స్టేషన్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. ఆమె వెంట ఎస్ఐ నాగన్న ఉన్నారు. 30న ఇంటర్వ్యూలు పాలమూరు: జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి మెడికల్ ఆఫీసర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒకటి పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హులైన బలహీన గిరిజన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. పాలిసెట్లో 42 శాతం ఉత్తీర్ణత మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులు 42శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో మే 13 పరీక్ష నిర్వహించగా 3,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాకేంద్రానికి చెందిన ఉందాల్య కౌశిక్ నారాయణ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. అలాగే ఆవిషెట్టి ధనుష్తేజ 34వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కుటుంబసభ్యులు, మిత్రులు అభినందించారు. -
విశేషమైన స్పందన..
బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. బాల కేంద్రాన్ని బాల భవన్గా మారిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శాశ్వత పద్ధతిన శిక్షకులు నియమితులవుతారు. సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుంది. శిక్షణ అనంతరం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. – రాజేష్ ఖన్నా, ఇన్చార్జి సూపరింటెండెంట్, బాలకేంద్రం, మహబూబ్నగర్ -
మహిళా సంఘాలబలోపేతం: ఎమ్మెల్యే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఆర్పీలకు ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆర్పీలకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని భావించి వారికి ‘మహబూబ్నగర్ ఫస్ట్–నవరత్నాలుశ్రీలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే మహిళా సంఘాల పద్దులు, వారు తీసుకున్న అప్పుల వివరాలు, చెల్లింపులు తదితర సమాచారం ఒక్క క్లిక్తో ఒకేచోట తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా కంప్యూటరీకరణతో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా మహిళా సంఘాల కార్యకలాపాలు జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని కంప్యూటర్పై పూర్తి పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్కుమార్, ‘నవరత్నాలు’ పర్యవేక్షకులు గుండా మనోహర్, కాంగ్రెస్ నాయకులు రామచంద్రయ్య, ర ఘు, జహీర్, ప్రవీణ్కుమార్, అక్బర్ పాల్గొన్నారు. రేపు గిరిజన విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తిలోని తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (టీజీఈఎంఆర్ఎస్– కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జీటీ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీలలో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన గిరిజన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకల్లా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని టీజీఈఎంఆర్ఎస్లో అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94156 06618, 98557 37578, 98857 38387, 8520 041973లలో సంప్రదించవచ్చని సూచించారు. -
ముంపు నివారణకు తక్షణ చర్యలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. ఈ మేరకు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. పెద్దచెరువు పక్క నుంచి నిర్మిస్తున్న వరదకాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎర్రకుంట తూముతో పాటు అలుగు నుంచి వేర్వేరుగా ఇమాంసాబ్కుంట వరకు శాశ్వత ప్రాతిపదికన సుమారు కిలోమీటరున్నర మేర డ్రెయినేజీ నిర్మించాలని అందుకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. మధ్యలోని రాయచూర్ మెయిన్రోడ్డుపై గతంలో రెండు చోట్ల ఉన్న కాజ్వేల వెడల్పును పెంచి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగా ఎక్కడికక్కడ డ్రెయినేజీలలో మురుగు నిల్వ ఉండకుండా శుభ్రం చేయించాలన్నారు. కాగా, ఈనెల 21వ తేదీ ఉదయం, రాత్రి సుమారు 4.30 గంటల పాటు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదే రోజు ఆయా ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి పరిస్థితిని అంచనా వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎంఈ సందీప్వరల్డ్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. పెద్దచెరువు పక్కన వరద కాల్వ పూర్తి చేయాలి ఎర్రకుంట నుంచి డ్రెయిన్ల విస్తరణ తప్పనిసరి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ -
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు ● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి ● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్బజార్లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్లో వృథాగా ఉన్న ఓ భవనంలోకి మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు. ఉత్సాహభరితంగా.. గద్వాల బాలభవన్లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం -
సెర్ప్ బదిలీలకు గ్రీన్సిగ్నల్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎట్టకేలకు సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని, విధివిధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా జిల్లాలో మొత్తం 99 మంది వివిధ కేడర్లలో సెర్ప్ ఉద్యోగులు ఉన్నారు. నిరీక్షణకు తెర.. సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీల ప్రక్రియ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశించారు. డీఆర్డీఏ అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 40 శాతం మేర.. జిల్లావ్యాప్తంగా ఐకేపీలో 99 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వీరిలో 92 మంది బదిలీలకు అర్హత ఉన్న వాళ్లు ఉన్నారని అఽధికారులు చెబుతున్నారు. ఇందులో 40 శాతం వరకు బదిలీ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు రావాలి.. సెర్ప్ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసింది. అయితే మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే వాటి ఆధారంగా బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం. – నర్సింహులు, డీఆర్డీఓ డీఆర్డీఓ కార్యాలయం తప్పని ఎదురుచూపులు.. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్, ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపపో పోస్టులకు జోనల్ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీఓ, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్ ఆర్సీ, డీబీటీ మేనేజర్, సూపర్వైజర్ పోస్టులకు జోనల్ స్థాయిలో, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో సుమారు ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక జీఓ జారీ చేసిన ప్రభుత్వం మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యేఅవకాశం జిల్లాలో 99 మంది ఐకేపీ ఉద్యోగులు -
మళ్లీ రెవెన్యూ సదస్సులు
మహబూబ్నగర్ న్యూటౌన్: గత తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. భూ ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్, ధరణి చట్టం అమలు, తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు, వెంటనే ముటేషన్లు వంటి చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాకపోగా మరిన్ని భూ సమస్యలు పెరిగాయి. ధరణి అమలులో భూ రికార్డుల్లోని తప్పొప్పుల సవరణ, అభ్యంతరాల పరిశీలన వంటి అంశాలకు చోటు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి. ధరణి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ చట్టానికి చట్టబద్ధత కల్పించిన అనంతరం నియమ, నిబంధనలు రూపొందించి.. చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి భూ భారతి చట్టం అమలుపై దృష్టిసారించింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో మళ్లీ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం అమలు, సమస్యల పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని నిర్ణయించింది. కాగా ఇప్పటికే జిల్లాలోని మూసాపేట మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అక్కడ ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 2 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సవరణలకు ఆస్కారం ఆర్ఓఆర్–2025 భూ భారతి చట్టం అమలులో కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తప్పొప్పుల సవరణ చేపట్టనున్నారు. భూమి ఉండి దానికి సంబంధించి రికార్డు లేకపోవడం, పట్టాదారు పాస్ బుక్ ఉన్నా భూమి లేకపోవడం, రికార్డుల్లో విస్తీర్ణాల తేడా, భూమి సంక్రమించిన విధానం, పట్టాదారు పేర్లలో తప్పులు వంటి దరఖాస్తులపై రెవెన్యూ సదస్సుల్లో పరిశీలన, వాస్తవికత ఆధారంగా సవరణ చేస్తారు. భూ ప్రక్షాళన సమయంలో పట్టాభూములు కోల్పోయిన రైతుల భూ సమస్యలను పరిశీలిస్తారు. గతంలో ఇలాంటి సవరణలకు ఆస్కారం ఉండేది కాదు. ధరణిలో తహస్లీల్దార్లకు ఎలాంటి అధికారాలు లేకపోగా.. ప్రస్తుత భూ భారతి చట్టంలో తహసీల్దార్లతోపాటు ఆర్డీఓలు, కలెక్టర్లకు అధికారాలు కల్పించనున్నారు. రీ సర్వేకు చోటు భూ భారతి చట్టంలో క్షేత్రస్థాయి కీలక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రధానంగా భూముల రీ సర్వే జరిగితే క్షేత్రస్థాయిలోనే ఎన్నో సమస్యలకు మార్గం సుగమవుతుంది. రికార్డుల ప్రక్షాళనతోపాటు భూ సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. సర్వే నంబర్ల వారిగా హద్దుల గుర్తింపుతోపాటు సబ్ డివిజన్ సమస్యలకూ చెక్ పడనుంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద పూర్తయిన మూసాపేట మండలం తప్పొప్పుల సవరణతోపాటు ఇతర సమస్యలపై అభ్యంతరాల నమోదు భూ భారతి చట్టం పకడ్బందీ అమలుపై అధికారుల కసరత్తు -
మళ్లీ వరికే మొగ్గు
మహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం వచ్చేస్తోంది. రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సైతం వానాకాలం పంట సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3,46,830 ఎకరాలలో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 15,332 ఎకరాలలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని తేల్చారు. కాగా.. గతేడాది వానాకాలంలో అత్యధికంగా వరి పంటను 1,94,982 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించగా, ఈ ఏడాది 2,00,000 ఎకరాలకు పెంచారు. సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో గత వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు అంచనాలకు మించి వరి పంట వేశారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయ ప్రణాళికలో వరి సాగు లక్ష్యం పెంచారు. వరి తర్వాత అత్యధికంగా 85 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది. 46,700 మెట్రిక్ టన్నులు అవసరం జిల్లాలో వానాకాలం సీజన్లో 46,700 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు అవసరం అవుతాయని అంచనా. అయితే ఇప్పటికే 33,286.64 టన్నులు సిద్ధంగా ఉంచారు. దశల వారీగా అన్ని మండలాల్లో పీఏసీఎస్, డీలర్ల వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే సీజన్ ఆరంభం నాటికి డీఏపీ నిల్వలు సరిపడనంతగా అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. డీఏపీ స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.33,286.646891.933408.6122,335.2 202.35 448.55డీఏపీమొత్తంఎంఓపీఎస్ఎస్పీకాంప్లెక్స్యూరియామార్పిడి పద్ధతి పాటిస్తే మేలు రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటను సాగు చేయకుండా ఏటేటా పంట మార్పిడి విధానాన్ని అమలు పరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసారానికి మేలు చేకూరుతుంది. మిశ్రమ పంటల సాగుతో నష్టాలు జరగకుండా నియంత్రించవచ్చు. ఒక పంట చేజారినా మరో పంట దిగుబడులతో లాభాలు గడించవచ్చు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి లెక్కలు తీస్తున్న వ్యవసాయ అధికారులు ఈ ఏడాది ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఎదురవడంతో ఈ ఏడాది ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎరువుల నిల్వలను తనిఖీ చేస్తున్నారు. సొసైటీలు, డీలర్ల వద్ద డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల లభ్యతపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు, వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువులపై లెక్కలు తీస్తున్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి వ్యవసాయ అధికారులు రోజువారీ పర్యటించి తమ పరిధిలో ఉన్న డీలర్ల దగ్గర ఎరువుల నిల్వలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వాస్తవానికి వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే 50 శాతం విత్తనాలు, ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉంచుతారు. అందులోభాగంగా ప్రైవేట్ డీలర్లతో పాటు సొసైటీల వద్ద తగిన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎరువుల కొనుగోలుకు ప్రతి రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ఒరిజినల్, జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ధ్రువపత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గరిష్ట ధర, సబ్సిడీ వివరాలు ఎరువుల బస్తాపై స్పష్టంగా రాస్తారు. వీటిని గమనించి రైతు తీసుకోవాల్సి ఉంటుంది. రసాయన ఎరువుల నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో) వానాకాలం పంట ప్రణాళిక ఖరారు జిల్లాలో 3.46 లక్షల ఎకరాల్లో పంటలు గతేడాది కంటే 15,332 ఎకరాలు ఎక్కువ వరి, పత్తి పంటలకే పెద్దపీట క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు 33,286 టన్నుల ఎరువులు సిద్ధం -
నకిలీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నరగ్): ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ జానకితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి తర్వాత పత్తి పంటనే ఎక్కువ సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాలు నిల్వ చేయడం, అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం నేరమన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. బీజీ–3 పత్తి విత్తనాల వలన భూసారం దెబ్బ తినడంతో పాటు వాతావరణం కలుషితం అవుతుందన్నారు. శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు 16 టాస్క్ఫోర్స్ బృందాలు జిల్లాలోని 259 డీలర్ ఔట్లెట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ పోలీస్శాఖ తరఫున నకిలీ పత్తి విత్తనాలు నియంత్రణ చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా ముందుగా తెలిపితే పోలీస్శాఖ నుంచి తగిన సిబ్బందిని పంపిస్తామన్నారు. జిల్లాలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీఏఓ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ‘మత్తు’ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. కలెక్టరేట్లో డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, రవాణాను యాంటీ డ్రగ్ కమిటీలు గుర్తించాలని సూచించారు. గంజాయి సాగు చేయకుండా ఎకై ్సజ్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్శాఖ మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, పాన్షాప్లపై దృష్టి పెట్టాలన్నారు. మత్తు పదార్థాల బారిన పడిన ఎంతమంది వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చారని ఆరా తీశారు. పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కాలేజీలు, పబ్లిక్ ఉండే ప్రాంతంలో మత్తు పదార్థాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, సీఎంఓ బాలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు గ్రామ పాలన అధికారుల పరీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డిప్యూటీ నోడల్ ఆఫీసర్, లైజన్ ఆఫీసర్, సీనియర్ మెసేంజర్, చీఫ్ సూపరింటెండెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 25న (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల జిల్లాకేంద్రంలోని చైతన్యహైస్కూల్ (బస్స్టాండ్ పక్కన)గ్రామ పాలన అధికారుల పరీక్ష ఉంటుందని, 152 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని, ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష ముగిసే వరకు బయటకు వెళ్లడానికి అనుమతి లేదని, అభ్యర్థులు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, పనిచేస్తున్న కార్యాలయ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. హాల్టికెట్పై ఉన్న ఫొటోపై సంబంధిత కార్యాలయ అధికారితో సంతకం చేయించుకోవాలన్నారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్నులు (బ్లూ/బ్లాక్), హాల్టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రధానంగా ఆధార్ మాత్రమే తీసుకెళ్లాలని, ఇతర రంగుల పెన్నులు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని పేర్కొన్నారు. మే 25న కలెక్టరేట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ నంబర్ 08542 241165 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నవీన్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఎంహెచ్ఓ కృష్ణ పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు -
రైల్వేస్టేషన్కు నల్లా బిల్లు రూ.5.30 లక్షలు!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఏడాదికోసారి (12 నెలలు కలిపి) నల్లా బిల్లు వసూలు చేయాల్సిన మున్సిపల్ అధికారులు ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత డిమాండ్ నోటీసులిచ్చారు. మహబూబ్నగర్లోని రైల్వేస్టేషన్ (దక్షిణ మధ్య రైల్వే డివిజన్)కు దశాబ్దాల క్రితమే మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ ఇచ్చారు. అక్కడి కార్యాలయంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఆ మేరకు ఒకచోట ట్యాంకుతో పాటు మీటరు సైతం బిగించి, 10 కిలో వాటర్కు గాను రూ.130 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులకు సూచించారు. ఇందుకుగాను 2016 వరకు ఏటా బిల్లు వసూలు చేశారు. ఇదే సంవత్సరంలో అప్పటి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ మిరాజ్ అలీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి మీటరు రీడింగ్ తీసి, బిల్లు వసూలు చేయడం మరిచిపోయారు. ఈ విషయం ఇటీవల ప్రస్తుత ఇంజినీరింగ్ విభాగం (నీటి పన్ను) సీనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య దృష్టికి వచ్చింది. దీంతో ఆయన మూడు రోజుల క్రితమే రైల్వేస్టేషన్కు వెళ్లి తొమ్మిదేళ్ల రీడింగ్తో పాటు ఎంత మొత్తం రావాలో లెక్కగట్టారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్ రెడ్డికి నివేదించారు. ఆయన ఆదేశాల మేరకు రూ.5,30,023కు డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో నల్లా పన్నుల విభాగాన్ని ఉద్యోగి మిరాజ్ అలీ చూసేవారన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మృతితో నల్లా కనెక్షన్లకు సంబంధించి కొన్ని ఫైళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల క్షేత్రస్థాయిలో అన్ని కనెక్షన్లను పరిశీలించి ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయిస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ నల్లా బిల్లు పెండింగ్లో ఉన్న విషయం బయట పడిందన్నారు. దీంతో ప్రస్తుతం మరోసారి మొత్తం బిల్లు చెల్లించాలని డిమాండ్ నోటీసు అందజేశామన్నారు. కాగా.. ఈ నెలాఖరు వరకు బిల్లు చెల్లిస్తామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. తొమ్మిదేళ్ల తర్వాత డిమాండ్ నోటీసు అందజేత -
నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల పట్టివేత
జడ్చర్ల: ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను జిల్లా వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, సీఐ కమలాకర్లు శుక్రవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. మండలంలోని గోప్లాపూర్లో గుట్టుగా లూజ్ పత్తి విత్తనాలను గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని రైతులకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో వ్యవసాయ శాఖ జడ్చర్ల పోలీసులను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయాన్నే వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా 8 టాస్క్ఫోర్స్ బృందాలు గోప్లాపూర్ గ్రామానికి చేరుకుని అనుమానం ఉన్న పలువురు రైతుల ఇళ్లను ఏకకాలంలో సోదా చేశారు. తనిఖీలో రైతు మధుసూదన్రెడ్డి దగ్గర ప్లాస్టిక్ కవర్లలో కిలో చొప్పన ప్యాక్ చేసిన లూజ్ బీజీ–3 పత్తి విత్తనాలు దొరికాయి. మొత్తం 30 ప్యాకెట్లను రైతు నుంచి స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్స్టేషన్లో స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాలను ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించగా బీజీ–3 విత్తనాలుగా నిర్దారించారు. అయితే ఆయా విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఈ సందర్బంగా వారు తెలిపారు. నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే నకిలీ విత్తనాలను అంటగట్టే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో నకిలీ విత్తనాల కేసులలో ఉన్న నిందితులను కూడా బైండోవర్ చేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ లైసెన్స్లు ఉన్న దుకాణాలలోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరిగిన సమయంలో పంటల బీమా, తదితర పరిహారం కోసం బిల్లులు ఉపయోగపడుతాయన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తమ సిబ్బంది రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసుల దాడులు గోప్లాపూర్లో గుట్టుగా పత్తి విత్తనాల నిల్వలు నిందితుడిపై కేసు నమోదు -
పాలమూరుకు రెండో విజయం
మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టూడే లీగ్ అండర్–23లో పాలమూరు జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో శుక్రవారం గద్వాల జట్టుతో జరిగిన మ్యాచ్లో పాలమూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి 25.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో రాహుల్యాదవ్ 53 పరుగులు చేశాడు. పాలమూరు బౌలర్ ఎండీ ముఖీతుద్దీన్ 7 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరో బౌలర్ కొండ శ్రీకాంత్ 9.2 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాలమూరు జట్టు 21 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 44, మహ్మద్ షాదాబ్ 22 పరుగులు చేశారు. జిల్లాకు పేరు, ప్రతిష్టలు తేవాలి క్రికెట్లో క్రీడాకారులు ప్రతిభచాటి జిల్లాకు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్ అన్నారు. అండర్–23 లీగ్ మ్యాచ్ సందర్భంగా ఆయన మహబూబ్నగర్, గద్వాల జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎంతోమంది జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. అండర్–23 లీగ్లో ప్రతిభచాటాలని కోరారు. భవిష్యత్లో జిల్లా క్రీడాకారులు రంజీ, భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గద్వాలపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు -
హైవే నిర్మాణం.. వివాదం
జడ్చర్ల టౌన్: జాతీయ రహదారి–167 నిర్మాణ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారోగాని వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. పట్టణంలో మొదట ఫ్లై ఓవర్ వంతెన మంజూరు కాగా స్థానికుల ఆందోళనలతో నాలుగు వరసల రహదారిగా మార్చారు. ఇందులోనూ ప్రస్తుతం మరో వివాదం మొదలైంది. విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అంబేడ్కర్ చౌరస్తా పూర్తిగా కనుమరుగుకానుంది. పాతబజార్కు వెళ్లాలంటే రైల్వే వంతెన దాటి కల్వకుర్తి రోడ్లో యూటర్న్ తీసుకుని వెళ్లాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ రహదారులశాఖ డీఈ సుమిత్కుమార్ వెల్లడించడంతో పాతబజార్ వాసుల్లో ఆందోళన మొదలైంది. పాతబజార్కు వెళ్లేందుకు సర్వీస్రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పటికీ కేవలం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మాత్రమే పరిమితం కావడంతో ఆందోళన బాట పట్టనున్నారు. ఇందుకోసం శనివారం గౌడ ఫంక్షన్హాల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. నెహ్రూ చౌరస్తాలో 100 మీటర్ల అతి పెద్ద సర్కిల్ నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదారులశాఖ అంబేడ్కర్ సర్కిల్ను తొలగించడంపై స్థానికుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. అంబేడ్కర్ సర్కిల్ను తొలగించి పాతబజార్కు భారీ వాహనాల రాకపోకలు లేకుండా చేస్తున్న అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందుకే శనివారం సమావేశం నిర్వహిస్తున్నాం. సర్వీస్రోడ్డు నిర్మించినా అది కేవలం కార్లు, ఆటోలకే పరిమితం కావడం సరికాదు. ఇపుడున్నట్లుగానే పాతబజార్కు వాహనాల రాకపోకలు సాగించేలా ఎమ్మెల్యే, కలెక్టర్ను కలిసి విన్నవిస్తాం. అధికారుల తప్పిదంతో 20 వేల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. – పి.మురళి, పాతబజార్ డిజైన్ మార్చాల్సిందే.. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాతబజార్కు వాహనాలు వెళ్లకుండా చేయడం సరికాదు. ప్లానింగ్ సరిగా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిజైన్ మార్చేలా చూస్తాం. రోడ్డు విస్తరణ జరగాల్సిందే కాని అందరికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడున్నట్లుగానే యధావిధిగా వాహనాలు పాతబజార్కు వెళ్లేలా చూడాల్సిందే. ఇందుకోసం అఖిలపక్షం వేస్తే పాతబజార్ వాసులందరు సహకరించాలి. – వంశీచారి, పాతబజార్ ఆది నుంచి వివాదాలకు నెలవుగా మారిన ఎన్హెచ్–167 పనులు జడ్చర్లలో కనుమరుగుకానున్న అంబేడ్కర్ సర్కిల్ సర్వీస్రోడ్డు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకే పరిమితం భారీ వాహనాలు రాకపోకలు సాగించేది ఎలా? వ్యతిరేకిస్తూ నేడు పాతబజార్వాసుల అఖిలపక్ష సమావేశం -
శ్రీశైలానికి వరద ప్రవాహం
దోమలపెంట/ రాజోళి: ఎగువ ప్రాంతం సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం 15,602 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 817.7 అడుగుల వద్ద 39.1450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే సుంకేసుల డ్యాంకు శుక్రవారం 2,215 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును 0.5 మేర తెరిచి అదే స్థాయిలో దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. అలాగే కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత నారాయణపేట: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖ డీఎం సైదులు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని అప్పిరెడ్డిపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులతో కలిసి ఇంటిపై దాడి చేసి పట్టుకున్నట్లు డీఎం వివరించారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఎర్రవల్లి: చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామానికి చెందిన బోయ శివకుమార్ (21)ను బాగా చదువుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా శాంతినగర్కు వెళ్లి మద్యం సీసాలో గడ్డిమందు కలుపుకొని తాగి తిరిగి ఇంటికొచ్చి పడుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. చేతికొచ్చిన కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం వెల్దండ: మండలంలోని చెర్కూర్ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని కారు ఆటోని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి చౌదర్పల్లి గ్రామానికి చెందిన చవ్వ మల్లేష్, మంజుల దంపతులు నలుగురు పిల్లలతో కలిసి తమ ఆటోలో కల్వకుర్తికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో చెర్కూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్లేష్ కాళ్లకు గాయాలయ్యాయి. మంజులకు రెండు కాళ్లు విరగడంతో పాటు నడుముకు, తలకు గాయలయ్యాయి. నలుగురు పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని చికిత్స నిమిత్తం వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. ఆరుగురికి గాయాలు -
ముగిసిన షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్: పట్టణంలోని హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు శుక్రవారం ముగిసింది. చివరి రోజు మహిళల ఉర్సుతో ఉత్సవాలు ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 20న గంధంతో ఉర్సు ప్రారంభం కాగా.. 21న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు, 22న దడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు నిర్వహించారు. ఉర్సులో పెద్ద కిస్తీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. భక్తులు కిస్తీలకు ప్రసాదం అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా హాజరై కిస్తీ పోటీలను తిలకించారు. ఉర్సు చివరిరోజు గాజులు, బొమ్మల దుకాణాల వద్ద మహిళల రద్దీ కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగో రోజు మహిళలకు ప్రత్యేకం -
మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్టు
నాగర్కర్నూల్ క్రైం: మద్యం మత్తులో మహిళపై లైంగిక దాడి చేసి హత్యచేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 12న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వెనుక గేటు వద్ద జరిగిన హత్యకేసుకు సంబంధించి సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ గ్రామానికి చెందిన కావలి శాంతమ్మ యాచకురాలిగా జీవనం సాగిస్తోంది. ఈమె ఫిబ్రవరి 12న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వెనుక గేటు వద్ద హత్యకు గురైంది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా హత్య సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి చెత్తకాగితాలు ఏరుకుని జీవనం సాగించే తాడూరు మండలం పాపగల్ గ్రామానికి చెందిన గోవింద్రాములుగా గుర్తించారు. నిందితుడి కోసం మూడునెలలుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం నిందితుడు తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామానికి వచ్చాడనే సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి భార్య పదేళ్ల క్రితమే అతడికి దూరంగా ఉండటంతో మహిళలపై కోపం పెంచుకుని సైకోగా ప్రవర్తించే వాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గోవర్ధన్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మద్దూరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మద్దూరులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. కోయిలకొండ మండలంలోని దమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య(42) కొన్నేళ్లుగా మద్దూరులో వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం కోస్గిలో నూతనంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ నష్టం రావడం, మద్దూరులో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్ అంతంతగానే నడుస్తుండటంతో అప్పులు చేశాడు. తాను చేసినా అప్పులు ఎలా తీర్చాలో అని మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లోని బెడ్రూంలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రామచంద్రయ్య తమ్ముడు సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్రయ్యకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం ● భార్యకు గాయాలు రాజాపూర్: బంధువుల వివాహానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో తన మోటార్ సైకిల్పై వెళ్తుండగా, వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెంది, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామానికి చెందిన కుర్వయాదయ్య(56), భార్య నారమ్మ, కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలు నవాబ్పేట మండలంలోని బంధువుల వివాహకార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్కు బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా బైక్ను వెనకనుంచి లారీ ఢీకొట్టింది. దీంతో యాదయ్య కుడిపైపు కింపడటంతో అతని మీద నుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నారమ్మ ఎడమవైపుకు పడటంతో గాయాలతో బయటపడింది. తన కళ్లముందు కట్టుకున్న భర్త దుర్మరణం చెందడంతో ఆమె రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. విషయం తెలిసి వెంటనే రాజాపూర్ ఎస్ఐ శివానందంగౌడ్ అక్కడికి చేరుకున్నారు. నారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగా లేక మహిళ ఆత్మహత్య మానవపాడు: మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మానవపాడులో చోటుచేసుకుంది. ఏఎస్ఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. మానవపాడుకు చెందిన బోయ సుజాత(45), రాముడు దంపతులు వ్యవసా య పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే మద్యానికి బానిసైన సుజాత మానసిక స్థితి కోల్పోయింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శుక్రవారం పెద్ద కూతురు పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. సుజాతకు భర్తతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వ్యక్తి ఆత్మహత్య మిడ్జిల్: మద్యం మత్తులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేశ యాదయ్య (52) కొంతకాలంగా మద్యానికి బానిసై పొలం పనులు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆలయ సమీపంలో ఉన్నాడని గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు కేశ మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చెరువులో పడి మహిళ మృతి హన్వాడ: మండలంలోని అమ్మాపూర్ గ్రామశివారులోని చెరువులో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన కథనం మేరకు.. మండలంలోని మునిమోక్షం గ్రామానికి చెందిన బుడ్డభాగ్యమ్మ అమ్మాపూర్ శివారులో ఉన్న చెరువు దగ్గరకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఆమె కుమారుడు బుడ్డ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు, -
పోలీస్స్టేషన్ వద్ద భూ నిర్వాసితుల ఆందోళన
బల్మూర్: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితుడు గంట కృష్ణయ్యను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అతడి అక్రమ అరెస్టును నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్దఎత్తున స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ సేకరణ కోసం ఈ నెల 24న గ్రామసభ నిర్వహించనున్నారు. అయితే భూ సేకరణకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడానికి గంట కృష్ణయ్య తోటి నిర్వాసిత రైతుల ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్పుస్తకాల జిరాక్స్ సేకరిస్తుండగా.. పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహానికి గురైన భూ నిర్వాసితులు పోలీస్స్టేషన్కు చేరుకొని నిర్వాసిత రైతును అక్రమంగా నిర్బంధించడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. తమ హక్కులను కాపాడుకోవాలనే ప్రయత్నాన్ని పోలీసులతో అడ్డు కోవాలని ప్రభు త్వం కుట్ర పన్నుతుందని వారు మండిపడ్డారు. భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కాగా, ఈ విషయమై ఎస్ఐ రమాదేవిని వివరణ కోరగా. ఈ నెల 24న జరిగే భూ సేకరణ గ్రామసభలో తోటి రైతులతో కలిసి ఘర్షణకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని బేషరతుగా వదిలిపెట్టడం జరిగిందని తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో భూ పోరాట సమితి నాయకులు రఘుమారెడ్డి, నాగయ్య, సీతారాంరెడ్డి, శివశంకర్, తిరుపతయ్య, ఇంద్రారెడ్డి, ఆయా గ్రామాల భూ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. -
రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణానికి చెందిన పరిశోధక విద్యార్థి రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు దక్కింది. జీవ వైవిధ్య మండలి చరిత్రలో అవార్డు పొందిన తొలి మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్లోని బిర్లా మ్యూజియం భాస్కర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి రమాదేవికి అవార్డును బహుకరించింది. స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన రమాదేవి.. అధ్యాపకుడు డా.సదాశివయ్య పర్యవేక్షణలో పరిశోధన లు ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్లో అనేక రకా ల మొక్కలు నాటడంతో పాటు అడవుల్లో పరిశోధనలు చేయడంతో పాటు సర్ప రక్షణలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి అవార్డును రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి డా.సువర్ణ, జీవ వైవిధ్య మండలి ప్రధాన కార్యదర్శి కాళీచరణ్ ప్రదానం చేశారు. రమాదేవికి అవార్డు దక్కడంపై బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య అభినందనలు తెలిపారు. -
కాపురానికి సహకరించడం లేదని.. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
మద్దూరు: కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో నవవధువు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కాపురానికి సహకరించడం లేదని కట్టుకున్న భర్తే నవవధువును హతమార్చాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను నారాయణపేట డీఎస్పీ ఎన్.లింగయ్య వెల్లడించారు. వివరాలిలా.. కొత్తపల్లి మండలం ఎక్కమేడ్కు చెందిన కడపని స్వామితో కొయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన పూజ(19)తో గతనెల 20న వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తల్లిగారింటికి వెళ్లిన పూజ.. అక్కడే 10 రోజులపాటు ఉండి, ఈ నెల 14న అత్తగారింటికి వచ్చింది. 18న రాత్రి భర్త కడపని స్వామి పూజతో శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా.. ఆమె నిరాకరించింది. తల్లిగారింటి నుంచి వచ్చినప్పటి నుంచి తనతో కలవడానికి నిరాకరిస్తుందని.. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకున్నాడు. తనతో ఉంటే ఇక సుఖం ఉండదని.. ఆమెను చంపి మరొకరిని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి పూజ గొంతు నుమిలి హతమార్చాడు. మృతురాలి తండ్రి గుర్రాల కుశలయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మృతదేహానికి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే డాక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం కేసును హత్యానేరం కింద మార్చి.. కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. కడపని స్వామిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నవవధువు మృతి కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎన్.లింగయ్య -
భాస్కర్ కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
గద్వాల క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు భాస్కర్ (41), అతడి భార్య పవిత్ర (38), కుమారుడు అభిరాం (7), కుమార్తె జ్యోత్స్న (9) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విదితమే. గురువారం వారి మృతదేహాలను కర్ణాటక నుంచి స్థానిక బీసీ కాలనీలోని తమ నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకురావడంతో బంధువులు, కాలనీ వాసుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించే వారే లేకపోయ్యారు. ప్రమాదంలోంచి బయటపడిన భాస్కర్ చిన్నకుమారుడు ప్రవీణ్తేజ్ అమ్మానాన్న, అక్క, అన్నయ్య ఎక్కడ ఉన్నారంటూ కంటతడి పెట్టాడు. జరిగిన ప్రమాదంపై ప్రవీణ్తేజ్ తేరుకునే పరిస్థితి లేకపోయింది. మృతుల చివరి చూపుకోసం బంధువులు, స్నేహితులు, కాలనీ వాసులు పెద్దఎత్తున చేరుకున్నారు. అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు. ● భాస్కర్ కుటుంబ సభ్యుల పార్థివదేహాలకు వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని.. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరి త, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, మోహన్రెడ్డి, హన్మంతు, ఆంజనేయులు, వెంకటస్వామి, నర్సింహ తదితరులు ఉన్నారు. -
ఎస్వీఎస్లో రోబోటిక్ సర్జరీ సేవలు
పాలమూరు: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవల్లో ఒకటైన రోబోటిక్ జాయింట్ నీ–రీప్లేస్మెంట్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్వీఎస్ ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు. గురువారం ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై రాబోయే రోజుల్లో అనుభవంతో కూడిన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఈ చికిత్స ఎంతో అవసరమన్నారు. ఎస్వీఎస్లో ఇప్పటి వరకు 500 నీ–రీప్లేస్మెంట్ సర్జరీలు చేశామని.. ఇప్పుడు మొదటిసారి రోబోటిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. ఇకపై అధిక ఖర్చులు చేసి హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే ఇలాంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రోబోటిక్ సర్జరీల్లో ఇన్ఫెక్షన్ శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఎస్వీఎస్లో ఇలాంటి అధునాతన వైద్యంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇలాంటి సర్జరీలు చేయడానికి యువ వైద్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సర్జరీలు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. అన్ని రకాల ఇన్సూరెన్స్ గ్రూప్స్, ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నీ–జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలో సర్జరీతో పాటు ఆ తర్వాత తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన ఉండటం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వైద్యులు వెంకట్రెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉత్సాహంగా పెద్ద కిస్తీలు
అలంపూర్: పట్టణంలో హజరత్ షాఅలీ పహిల్వాన్ ఉర్సులో భాగంగా గురువారం పెద్ద కిస్తీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. షాఅలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద జరిగిన కిస్తీ పోటీల్లో వందలాది భక్తుల మధ్య తబురుక్ (ప్రసాదం) కోసం పహిల్వాన్లు తలపడ్డారు. కిస్తీలో వేసిన ప్రసాదాన్ని భక్తులపైకి విసురుతూ ఉర్సు ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్బంగా అబ్బుర పరిచే విన్యాసాలతో భక్తులను అలరించారు. ముందుగా కిస్తీ పోటీలను దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ సయ్యద్ అహ్మద్ షా ఓవైసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడు దర్గాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కిస్తీ పోటీల వద్దకు చేరుకొని తిలకించారు. నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో పాటు తహసీల్దార్ మంజుల, ఎస్ఐ వెంకటస్వామిని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం సయ్యద్ ఖాదర్ బాషా ఇంటి నుంచి వచ్చిన సర్కారీ కిస్తీని ఊరేగింపుగా దర్గాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు సర్కారీ కిస్తీని సిద్ధం చేశారు. మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ఎమ్మెల్యే కిస్తీ పోటీలను ప్రారంభించారు. పెద్ద కిస్తీల సందర్భంగా సీఐ రవిబాబు, ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. ఊరేగింపుగా కిస్తీలకు ప్రసాదం.. షా అలీ పహిల్వాన్ దర్గాలో పెద్ద కిస్తీ పోటీల కోసం తెచ్చే ప్రసాదాన్ని భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా కాలనీలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి కిస్తీ పోటీలకు ప్రసాదం అందించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సుకు తరలివచ్చిన భక్తజనంతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. ప్రసాదం కోసం పహిల్వాన్ల విన్యాసాలు -
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ మెస్తో పాటు కిరాణ దుకాణం దగ్దమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ మెస్లో ఉదయం 11:30 ప్రాంతంలో భోజనం తయారు చేస్తున్న క్రమంలో సిలిండర్ రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. మెస్లో నుంచి పక్కనే ఉన్న కిరాణ దుకాణంలోకి మంటలు వ్యాపించడంతో కిరాణ వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో దాదాపు రూ. 5లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు. -
చిరుత దాడిలో లేగదూడ హతం
కోయిల్కొండ: లేగదూడపై చిరుత దాడిచేసి హతమార్చిన ఘటన కోయిల్కొండ మండలం ఇబ్రహీంనగర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇబ్రహీంనగర్కు చెందిన రైతు బోయిని ఆనంద్ గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దనున్న తన పొలంలో రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో పశువుల పాకపై చిరుత దాడిచేసి ఓ లేగదూడను ఎత్తుకెళ్లి హతమార్చింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బాధిత రైతును ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన వాటిని నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంపై నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు మొదటి విడతలో 1,244 ఇందిరమ్మ ఇళ్లు కాగా.. 541 ఇళ్లకు మార్క్ అవుట్ చేశారని, 134 బేస్మెంట్, 7 రూఫ్ లెవెల్లో ఉన్నాయని, 73 మందికి బిల్లులు నిర్మాణ దశను అనుసరించి విడుదల చేసినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు వివరించారు. రెండో విడతలో 7,044 మంజూరు కాగా.. 3,796 ప్రొసీడింగ్స్ జనరేట్ చేసినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ప్రజాప్రతినిధులచే పంపిణీ చేయాలని సూచించారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణాలు మొదలుపెట్టని వారిని గుర్తించి వెంటనే పనులు చేపట్టేలా, ఇంటి నిర్మాణం కోసం మహిళా సంఘాల ద్వారా రుణం మంజూరు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓల ఆధ్వర్యంలో గృహ నిర్మాణ ఏఈలు, పంచాయతీ కార్యదర్శి, మేసీ్త్రలు, లబ్ధిదారులతో గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్, లేబర్ అధికారి, గృహ నిర్మాణ ఏఈలతో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీలు భాగస్వామ్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. రాజీవ్ వికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహలు, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు
కొల్లాపూర్: జాతీయ రహదారి–167కెలో భాగంగా మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యన కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ సస్పెన్సివ్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఎన్హెచ్ఏఐ తెలంగాణ ఆర్ఓ కృష్ణప్రసాద్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్యాకేజీ–1 పనుల పూర్తికి నిర్ణీత గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో పనుల పురోగతిపై చర్చించారు. జూలై నెలాఖరు వరకు పనులు దాదాపుగా పూర్తిచేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు ఆయనకు వివరించారు. నాగర్కర్నూల్ నుంచి తాడూరు వరకు బైపాస్ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణ సమస్య ఉందని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్ఓ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్రిడ్జి టెండర్ల ఖరారు వాయిదా పడుతుందన్నారు. అయితే ఇప్పటికే పలు కంపెనీలు బ్రిడ్జి నిర్మాణం కోసం బిడ్లు దాఖలు చేశాయని, వచ్చే నెలలో టెండర్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. బ్రిడ్జికి అనుసంధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మించే రహదారి కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు చెప్పారు. వాటికి సంబంధించిన నివేదికలను ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా పరంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకు ముందు ఆర్ఓ సంగమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్ఓ వెంట ఈఈలు ఆదిత్య, రాజేందర్ తదితరులున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ ఆర్ఓ -
ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు
స్టేషన్ మహబూబ్నగర్: ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇచ్చామని గుర్తుచేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, నాయకులు సురేందర్రెడ్డి, రాములుయాదవ్, అజ్మత్అలీ, అవేజ్, సంజీవ్రెడ్డి, ప్రవీణ్కుమార్, అబ్దుల్ హక్, దేవేందర్ నాయక్, హన్మంతు, చిన్న, ప్రశాంత్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు నీటి ప్రవాహం
గద్వాల/ ధరూరు/ దోమలపెంట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల చివరలోనే కొత్త నీటి రాక మొదలైంది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 8,953, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 8,940 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్, జూలైలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి. జూరాల ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురించారు. మొన్నటి వరకు 3 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం రెండు రోజులుగా వస్తున్న ఇన్ఫ్లోతో దాదాపు 1.25 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. డెడ్ స్టోరేజీ దశలో ఉన్న జూరాలకు స్థానికంగా కురుస్తున్న అకాల వర్షాలు కొంత మేలు చేశాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.175 టీఎంసీల నీరు నిల్వ ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి.. శ్రీశైలం జలాశయానికి గురువారం సుంకేసుల నుంచి 8,690, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 8,940 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని జలాశయం గేజింగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఎగువన రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 1,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 817.2 అడుగుల వద్ద 38.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల స్టాప్లాక్ గేట్ల ఓవర్ఫ్లో జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జూరాలకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో గేట్ల మరమ్మతు చేసే క్రమంలో ప్రధాన గేట్లకు రక్షణగా ఉన్న స్టాప్లాక్ గేట్లపై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లినట్లు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. జూరాలకు 8,953, శ్రీశైలానికి 8,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూన్కు ముందే మొదలైన కొత్త నీటి రాక -
ఉత్తమ ప్రతిభకు ప్రశంస
మహబూబ్నగర్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖలోని నలుగురు అధికారులకు డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. నలుగురు అధికారులు ప్రశంసాపత్రాలు పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లాలో ఉన్న మిగిలిన సిబ్బంది స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్తేజంతో పని చేయాలని సూచించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలిస్తూ, బాధితులకు న్యాయం అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందన్నారు. ప్రతిభ కనబర్చిన అధికారులు.. 60 రోజుల వ్యవధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసుల్లో చార్జిషీట్ నమోదు చేసినందుకు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రూరల్ సీఐ గాంధీనాయక్, అవుట్ స్టాండింగ్ కేసుల డిటెక్షన్లో మూడో స్థానంలో నిలిచిన జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, అండర్ ఇన్విస్టిగేషన్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానం నిలిచిన మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ విజయ్కుమార్, సీఈఐఆర్, క్యూఆర్ కోడ్ వినియోగంలో ఐదవ స్థానంలో నిలిచిన నవాబ్పేట ఎస్ఐ విక్రమ్ను డీజీపీ ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అభినందించిన డీజీపీ జితేందర్ స్ఫూర్తి పొందాలన్న ఎస్పీ జానకి -
కారు బోల్తా.. వైద్య విద్యార్థులకు గాయాలు
బిజినేపల్లి: మండలంలోని మంగనూర్ గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎస్వీఎస్ కళాశాలకు చెందిన నలుగురు పీజీ వైద్య విద్యార్థులుకు గాయాలు కాగా, విఠల్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ నుంచి నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు నలుగురు పీజీ వైద్య విద్యార్థులు విఠల్, స్రవంతి, విష్ణుతో పాటు మరొకరు ఒకే కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగనూర్ గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు 108లో మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో విఠల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం. చెరువులో పడి వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీపురం గ్రామంలో చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాలు.. శ్రీపురం గ్రామానికి చెందిన గుంటి శాంతయ్య(50)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామంలోని ఊరచెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. బుధవారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. ఒకరి పరిస్థితి విషమం -
రెండు కుటుంబాల్లో గుండెపోటు విషాదం
దేవరకద్ర: వదిన అంత్యక్రియలకు వెళ్తూ మార్గ మధ్యలో మరదలు మృతి చెందిన ఘటన బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చాకలి చంద్రమ్మకు (68) రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. చాకలి చంద్రమ్మ అంతక్రియలను ముచ్చింతలలో చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దీంతో మూసాపేట మండలం సంకలమద్దికి చెందిన మృతురాలి మరదలు పేరూర్ నర్సమ్మ (52) అంత్యక్రియలకు హాజరు కావడానికి మరో ఇద్దరు బంధువులతో కలిసి దేవరకద్రకు చేరుకుంది. ముచ్చింతలకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా నర్సమ్మ కిందపడింది. వెంటనే వైద్య పరీక్షలు చేయించగా అప్పటికే నర్సమ్మ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక వైపు తల్లి.. మరో వైపు అత్త దేవరకద్రలో మృతి చెందిన పేరూర్ నర్సమ్మకు ముగ్గురు కుమార్తెలు.. వారిలో శోభారాణి అనే కుమార్తెను ముచ్చింతలలోని చాకలి చంద్రమ్మ కొడుకుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే అత్త చాకలి చంద్రమ్మ శవంతో అంబులెన్స్లో స్వగ్రామానికి వస్తున్న శోభారాణికి తన తల్లి నర్సమ్మ దేవరకద్ర బస్టాండ్లో మృతి చెందిన విషయం తెలిసింది. ఒక వైపు అత్త అప్పటికే మృతి చెందగా.. ఇప్పుడు తల్లి మృతి చెందడంతో శోభారాణి పరిస్థితి దయనీయంగా మారింది. గురువారం ముచ్చింతలలో చాకలి చంద్రమ్మ, సంకలమద్దిలో పేరూర్ నర్సమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. వదిన అంత్యక్రియలకు వెళ్తూ మరదలు మృతి -
లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారిపై నిలిచిన వర్షం నీరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో నిలిచిన నీరు మహబూబ్నగర్లోభారీ వర్షం ● ఉదయం రెండున్నర గంటలు, రాత్రి 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వాన ● పొంగిపొర్లిన ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు ● పరిశీలించిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్,ఆర్డీఓ, ఎమ్మెల్యే ● మహబూబ్నగర్ అర్బన్లో 2.07 సెం.మీ. వర్షపాతం నమోదు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో బుధవారం ఉదయం ఏడు నుంచి 9.30 గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా డివిజన్ల పరిధిలోని ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో ని రోడ్లన్నీ మురుగుమయంగా మారాయి. ముఖ్యంగా డివిజన్ నం.25లోని గోల్మసీదు, గచ్చిబౌలి, డివిజన్ నం.1, 5, 11, 21, 22, 23, 24లలోని వెంకటేశ్వరకాలనీ, లక్ష్మీనగర్కాలనీ, పోచమ్మకాలనీ, పాత పాలమూరు, మర్లు–ఎంప్లాయిస్ కాలనీ, బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్లలో రోడ్లపై వర్షపునీరు ఏరులై పారింది. అలాగే 13 విలీన గ్రామాలలోని మట్టి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. రెండున్నర గంటల పాటు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కూడా చాలా చోట్ల మోకాలు లోతు నీరు ప్రవహించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా గచ్చిబౌలి లోని కొన్ని ఇళ్లు రోడ్డుకు తక్కువ ఎత్తులో ఉండటంతో లోపలికి వర్షపు నీరు చేరింది. ఈ కాలనీలోని రోడ్లన్నీ ఇరుకిరుకుగా ఉండటంతో మధ్యాహ్నం వరకు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వచ్చిన నీటిని బయటకు తోడివేసేందుకు ప్రజలు కష్టాలు పడ్డా రు. వర్షం ఆగిపోయాక గచ్చిబౌలి, గోల్మసీదు ప్రాంతాలను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, పాతపాలమూరులో ఆర్డీఓ ఇ.నవీన్, డీటీ దేవేందర్, ఆర్ఐ సుదర్శన్రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించారు. కాగా.. గచ్చిబౌలిలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. ఇందుకోసం ఎర్రకుంట తూము కాల్వతో పాటు అలుగు నుంచి వేర్వేరుగా వర్షపు నీరు ముందుకు వెళ్లేలా డ్రెయినేజీలను విస్తరించాలని ఆదేశించారు. ఇక మహబూబ్నగర్ అర్బన్ ప్రాంతంలో 2.07 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగా.. మరోసారి సాయంత్రం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో పలుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
ఘనంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్ : అలంపూర్లో వెలిసిన షా అలీ పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో గంధోత్సవం నిర్వహించారు. ఉత్సవాల రెండో రోజు బుధవారం సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు జరిగాయి. గుల్బార్గా నుంచి గంధం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన గంధంను మత పెద్దలు సుగంధ ద్రవ్యాలు కలిపి సిద్ధం చేశారు. అనంతరం మేళతాళాల మధ్య సయ్యద్ ఖాదర్ బాష ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల అనంతరం సర్ ముబారక్ దర్గా తర్వాత దడ్ ముబారక్ దర్గాకు తీసుకెళ్లి గంధోత్సవ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం చిన్న కిస్తీ పోటీలు జరిగాయి. యువకులు వివిధ రకాల విన్యాసాలను చేస్తూ కిస్తీ పోటీల్లో పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్గాలో మొక్కులు చెల్లించి ప్రార్థనలు జరిపించారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో కిస్తీలో పలావ్, మిఠాయిలు వేయగా యువకులు పోటీ పడి వాటిని భక్తులపైకి విసిరారు. ఈ క్రమంలో పోటికి దిగిన పహిల్వాన్లు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేడు పెద్ద కిస్తీలు షా అలీ పహిల్వాన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు దడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీ పోటీలు గురువారం జరగనున్నాయి. పెద్ద కిస్తీ పోటీలను తిలకించడానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో గంధోత్సవం నేడు పెద్ద కిస్తీ పోటీల నిర్వహణ -
హడలెత్తిస్తున్న మొసళ్లు
కృష్ణా: మండలంలో ఒక పక్క భీమానది, మరో పక్క కృష్ణానది ప్రవహిస్తుండడంతో ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైతులు నది నుంచి వ్యవసాయ పొలాలకు నీరు తరలించేందుకు నది ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నీటి మోటార్ల వద్ద మొసళ్ల దాడులతో మృత్యువాత పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం నది బడ్డున నీటిలో మోటార్లు ఏర్పాటు చేసుకున్న చోట రక్షణ కంచె ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. రైతును లాక్కెళ్లిన మొసలి మండలంలోని కుసుమర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పణ్ణను గత శనివారం మొసలి లాక్కెళ్లడంతో ప్రాంత రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు రోజులైన అతని ఆచూకీ లభించక లేదు. మొసలి రక్తం రూచి చూడటంతో అదే ప్రాంతంలో సంచరిస్తుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు నదిలో మొసలి పట్టుకెళ్లిన రైతు తిప్పణ్ణ ఆచూకీ కోసం గత శనివారం మధ్యాహ్నాం నుంచి నేటి వరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, రెస్య్కూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, గజ ఈతగాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆచూకీ లభించడం లేదు. రాత్రీపగలు తేడా లేకుండా సంఘటన ప్రాంతంలోనే అన్నిశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కంచే లేక జాలి నిర్మించాలి ప్రభుత్వం నది ఒడ్డున మోటర్లు ఏర్పాటు చేసుకున్న చోట, నీటి మడుగులు ఉన్నచోట కంచె లేదా జాలిని ఏర్పాటు చేయాలని రైతులు కోరతున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగకుండగా తగు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదా నదుల్లోని మొసళ్లను వేరే ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. భీమానదిలో గత శనివారం నుంచి అధికారులతో కలిసి రెస్య్కూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు, అటవీశాఖ అధికారులుతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ నెల 21న బుధవారం 12 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. – పుష్పలత, తహసీల్దార్, కృష్ణా రక్షణ కల్పించాలి భీమా నదిలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రధానంగా నదిలో రైతుల మోటర్లు ఏర్పాటు చేసుకున్న చోట కంచె ఏర్పాటు చేయాలి. – సూకూర్లింగంపల్లి ఆంజనేయులు, రైతు ఆవేదనలో ఉన్నాం మా కుటుంబానికి చెందిన తిప్పణ్ణను మొసలి లాకెళ్లి నాలుగు రోజులవుతుంది. ఇంత వరకూ ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులమంతా తీవ్ర ఆవేదనలో ఉన్నాం. తిప్పన్న ఆచూకీ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం. – శరణప్ప, బాధిత కుటుంబ సభ్యుడు నిత్యం ప్రమాదాల బారిన ప్రజలు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని వినతులు భీమా, కృష్ణానదిలో వందల సంఖ్యలో మొసళ్ల సంచారం -
దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహబూబ్నగర్ రూరల్: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ 10లోపు మార్చాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 43.02 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది ఉంటే కేవలం 4,90,044 మందికే పెన్షన్లు వస్తున్నాయన్నారు. 2016 ఆర్పీడబ్ల్యూడీ చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులపై చర్యలేవి.. మహిళా దివ్యాంగులపై అత్యాచారాలు, లైగింక వేధింపులు, దివ్యాంగులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు లేకపోవడం వల్ల వారు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని వాపోయారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం రూ. 2 లక్షలకు పెంచడంతో పాటు జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలేశ్వర్, నాయకులు నర్సిములు, రాధమ్మ, భాగ్యలక్ష్మి, కుర్మయ్య, మంగమ్మ, భానుప్రకాష్, తిరుపతయ్య, సురేష్, బాబు, బసప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పోయిందని..
ఇటిక్యాల: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ కఽథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ నగర్కు చెందిన భరత్ కుమార్ (22) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో భరత్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇటిక్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. విద్యుత్షాక్తో మూడు ఎద్దుల మృతి మాగనూర్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మూడు ఎద్దులు మృతి చెందిన ఘటన మండలంలోని కోల్పూర్లో బుధవారం జరిగింది. మందిపల్లికి చెందిన రైతు రంగప్ప వరి కోతలు ముగియడంతో మేత కోసమని ఎద్దులను కృష్ణ నది సమీపంలో వదిలేశారు. మేత మేసే క్రమంలో ఎద్దులు నది దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమీపంలోకి వెళ్లగా విద్యుదాఘాతానికి గురై ఒకే సారి మూడు ఎద్దులు మరణించాయి. ఎద్దులు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని అధికారులను కోరారు. -
ఎల్ఎల్బీ సెమిస్టర్ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్సైట్లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, కోఆర్డినేటర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. 430 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 4వ సెమిస్టర్కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో సెమిస్టర్–5 బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు. నేటినుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా మొత్తం 19 పరీక్ష కేంద్రాలలో ఈనెల 22 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆరంభం కానున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 9,069 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సులకు సంబంధించి 5,280 మంది, ఒకేషనల్లో 507 మంది ఉన్నారు. ఇక రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో 2,899 మంది, ఒకేషనల్లో 383 మంది పరీక్షలు రాయనున్నారు. మొదటి సెషన్ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయి. కాగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ కౌసర్ జహాన్ తెలిపారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా కవిత మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ఆర్ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్షాప్లో మేనేజర్గా పని చేస్తున్నారు. కాగా, 2012లో మహబూబ్నగర్ డిపో మేనేజర్గా వ్యవహరించారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ పదోన్నతిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆర్ఎంగా వెళ్లారు. నేడు హనుమత్ జయంతి కార్యక్రమాలు స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో గురువారం హనుమత్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సంయోజకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి, మహబూబ్నగర్లోని బండ్లగేరి, కిసాన్నగర్లోని ఆంజనేయస్వామి దేవాలయం, షాద్నగర్ వెంకట రమణకాలనీలో, నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల, ఊర్కొండ మండలం నర్సాపూర్, వంగూరు, నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామం, ఉట్కూర్ మండలం బిజ్వార్, ధన్వాడ మండలం కిష్టాపూర్, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల, పెద్దమందడి మండలం చిన్నమందడిలో, వనపర్తి మండలం కడుకుంట్ల, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూరులో, వడ్డేపల్లి మండలం పైపాడు, గద్వాల మండలం బీరెల్లి గ్రామాల్లోనిఆంజనేయస్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మహబూబ్నగర్లోని టీటీడీ కల్యాణ మండపంలో వివిధ సత్సంగ మండళ్ల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని తెలిపారు. -
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు ప్రవీణ్ తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంతోషంగా స్వరాష్ట్రానికి వెళ్తున్నామనే ఆనందంతో గడిపారు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకొని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతడి తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు -
శతాధిక వృద్ధుడు మృతి
కొత్తకోట రూరల్: మండల కేంద్రంలోని 12వ వార్డులోని విద్యానగర్ కాలనీకి చెందిన వయోవృద్ధుడు బకెట పెద్ద బాలయ్య (104) వృద్ధాప్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. 1921లో జన్మించిన పెద్ద బాలయ్య పట్టణంలోనే కాక మండలంలోనే అత్యధిక వయస్సు గల వ్యక్తిగా జీవించారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన పలువురు నాయకులు నివాళులర్పించారు. నివాళ్లు అర్పించిన వారిలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గౌనికాడి రాములు యాదవ్, లాల్కోట రవి, పీఏసీఎస్ డైరెక్టర్ చాపల భాస్కర్, గట్టున్న, చిలుకటి బుచ్చన్న తదితరులు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలంలోని గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన చటమోని రాములు (38) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న రాములును కొల్లాపూర్ క్రాస్రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బుధవారం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. న్యాయం చేయాలని ధర్నా కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చటమోని రాములు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు బుధవారం మధ్యాహ్నం జనరల్ ఆస్పత్రి ఎదుట ఽరాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సీఐ కనకయ్యగౌడ్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పలువురు మాట్లాడుతూ మృతుడిని ఢీకొన్న కారులో బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ ఉన్నప్పటికీ తీవ్రంగా గాయపడిన చటమోని రాములును పరామర్శించకుండా వెళ్లడం దారుణమని మండిపడ్డారు. ఎద్దు పొడవడంతో వ్యక్తి మృతి మానవపాడు: ఎద్దులను కళ్లెంలో కట్టెయడానికి వెళ్లగా ఓ ఎద్దు పొడవడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జల్లాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. మానవపాడు మండలం జల్లాపురానికి చెందిన చిన్న గోపాల్నాయుడు (72) ఈ నెల 17న ఎద్దులను కట్టెయడానికి కళ్లానికి వెళ్లాడు. ఈ క్రమంలో గోపాల్నాయుడు కాలుకు తాడు చుట్టుకొని ఉండగా ఓ ఎద్దు వచ్చి అతడిని పొడిచింది. తీవ్రగాయాలు కాగా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోయిన బాలింత వీపనగండ్ల: మండలంలోని గోపల్దిన్నె గ్రామానికి చెందిన జ్యోతిబాయి (30) మూడు రోజులుగా ప్రసవ వేదనతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. జ్యోతిబాయి మూడో కాన్పు కోసం వనపర్తి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఆమెను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రసవం అయిన కొద్దిసేపటికే పసిబిడ్డ చనిపోగా.. రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత బాలింత జ్యోతిబాయి కూడా మృతి చెందింది. చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినా భార్య, కుమార్తె మృతి చెందారని మృతురాలి భర్త శివాజీ వాపోయారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కసాయి తల్లికి రిమాండ్ లింగాల: మండలంలోని చెన్నంపల్లికి చెందిన మేకల ఎల్లమ్మను బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్గౌడు తెలిపారు. ఈ నెల 20న ఎల్లమ్మ తన చిన్న కూతురు నవిత(6)ను నీటి సంపులో వేయడంతో మృతి చెందిన విషయం విధితమే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రవీందర్, ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ ఎల్లమ్మను అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ కోర్టులో హాజరు పరిచగా రిమాండ్ విధించడంతో మహబూబ్నగర్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి ‘దోస్త్’
నేటితో ముగియనున్న మొదటి దశ దరఖాస్తుల గడువు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2025–26 విద్యా సంవత్సారానికి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి దశలో భాగం 21 వరకు నేరుగా ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 29న అలాట్మెంట్, 30 నుంచి వచ్చే నెల 6 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. పీయూ పరిధిలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉండగా.. 31వేల డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకే ప్రైవేటు కళాశాలల్లో ర్యాటిఫికేషన్, అఫ్లియేషన్ ప్రక్రియ చేపట్టాం. దీంతో ప్రతి విద్యార్థి మంచి బోధన, వసతులు పొందగలుగుతారు. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వం రెండేళ్లు కళాశాలలో చదవడం, మూడో సంవత్సరం అప్రెంటిషిప్ చేసుకునే విధంగా కొత్త కోర్సులను తీసుకొచ్చింది. ప్రభుత్వం కొత్త డిగ్రీ, గురుకుల కళాశాలలు తీసుకొచ్చింది. కొన్ని కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచింది. వాటిలో చేరితే ఆర్థిక భారం తగ్గుతుంది. – శ్రీనివాస్, వీసీ , పీయూ దరఖాస్తు చేసుకోలేదు పీయూ పరిధిలోని పలు కళాశాలలు ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకునేందుకు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అడ్మిషన్లకు అవకాశం కల్పించాం. మారుమూల ప్రాంతాల విద్యార్థులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, గురుకుల కళాశాల్లో అడ్మిషన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ ఉపాధి ఆధారిత కోర్సులు.. కొన్నేళ్లుగా పీయూ పరిధిలో మొత్తం ఉన్న సీట్లలో కనీసం 65శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం సాంప్రదాయ బీఏ, బీకాం వంటి కోర్సుల చదవడం వల్ల పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదనే వాదనలు ఉన్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీ కాలంలో రెండేళ్లు కళాశాలలో తరగతులు.. చివరి సంవత్సరం అప్రెంటిషిప్ ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థికి వేతనం సైతం లభిస్తుంది. ఇటువంటి కోర్సులు ఎంవీఎస్లో 5, ఎన్టీఆర్లో 2, బీఆర్ఆర్తో పాటు మరిన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. అందులో బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్కు ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు, బీఎస్సీ మార్కెటింగ్, ఫార్మా సేల్స్, బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్కు బైపీసీ, బీకాం బీఎఫ్ఎస్ఐకి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మూతబడ్డ 24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దరఖాస్తు చేసుకోని 12 కళాశాలలు 74 కళాశాలల్లో 31వేల అడ్మిషన్లకు అవకాశం -
పశ్చిమ బెంగాల్కు తల్లి, బిడ్డ తరలింపు
పాలమూరు: జడ్చరలోని సఖి కేంద్రంలో ఉంటున్న సంజన అలాగే ఆమె బిడ్డను సఖి కేంద్రం నిర్వాహకులు పశ్చిమబెంగాల్కు పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్కు చెందిన సంజన భర్తతో కలిసి కూలి పనులు చేసుకోవడానికి జడ్చర్ల వచ్చారు. అయితే గొడవ జరగడంతో భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు. గర్భిణిగా ఉన్న ఆమె గత జనవరిలో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక సమస్యలతో పుట్టిన బిడ్డను అమ్మే ప్రయత్నం చేయగా గమనించిన ఆస్పత్రి సిబ్బంది సఖి కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో వారు నాలుగు నెలల పాటు తల్లిబిడ్డకు ఆశ్రయం కల్పించారు. అయితే సంజన పూర్తి వివరాలు తెలియడంతో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి మంగళవారం స్వగ్రామానికి పంపించారు. ప్రత్యేక బృందంతో తల్లి, బిడ్డను పశ్చిమ బెంగాల్కు తరలించినట్లు సఖి కేంద్రం కో–ఆర్డినేటర్ సౌజన్య తెలిపారు. -
అంబేడ్కర్ అడుగుజాడలే దిశానిరే ్దశం
రాజోళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన ఆశయాలను నెరవేర్చాలని ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. మండలంలోని పెద్ద దన్వాడలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యం వైపు వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయని, వాటిని దీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. యువతకు మహనీయులు అంబేడ్కర్, పూలే జీవితాలే ఆదర్శమన్నారు. కలిసికట్టుగా పోరాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ రఘు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ప్రారంభం అలంపూర్ : అలంపూర్ పట్టణంలో వెలసిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు మంగళవారం రాత్రి గంధోత్సవంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాలను ముస్తాబు చేశారు. ఉత్సవాలను తిల కించడానికి వచ్చే భక్తులకు నిర్వాహక కమిటీ తగు సౌకర్యాలు కల్పించింది. ఉత్సవాల నాలుగు రోజుల పాటు పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. తరతరాల సంప్రదాయాలకు స్వాగతం పలుకుతూ ఉత్సవాలను కొనసాగించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజ బందేనవాజ్ దర్గా నుంచి వచ్చిన గంధంతో ఉత్సవాలను ప్రారంభించారు. -
సిగ్నల్గడ్డ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్జాం
పట్టణంలోకి వెళ్లే మార్గంలో నిలిచిన వాహనాలు హైస్కూల్ సమీపంలో రోడ్డుపై నిలిచిన వాహనాలు బ్రిడ్జిపై అడ్డుగా నిలిచిన లారీ జడ్చర్ల సిగ్నల్గడ్డ బ్రిడ్జిపై మంగళవారం ఓ లారీ ఆకస్మికంగా బ్రేక్ డౌన్ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే సిగ్నల్గడ్డ బ్రిడ్జి విస్తరణ పనుల నిలిపివేసిన క్రమంలో ఇరుకుగా ఉన్న బ్రిడ్జిపై లారీ మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, చిన్న చిన్న వాహనాలు బాదేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందుగా వెళ్లినా.. భారీ వాహనాలు మాత్రం బ్రిడ్జిపై నిలిచిపోయాయి. అనంతరం లారీకి మరమ్మతు చేసి తొలగించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. – జడ్చర్ల/జడ్చర్లటౌన్ -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహబూబ్నగర్ క్రీడలు: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో జరుగుతున్న అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ రెండోరోజు మంగళవారం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా క్రికెట్ సంఘం ఎంతో పాటుపడుతున్నట్లు తెలిపారు.క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అనంతరం కొత్వాల్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రెండో రౌండ్ లీగ్ మ్యాచులు జరుగుతాయని అన్నారు. క్రీడాకారులు లీగ్ మ్యాచుల్లో తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్ గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఇన్నింగ్స్ విజయం ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూడే లీగ్లో మహబూబ్నగర్ జట్టు శుభారంభం చేసింది. మహబూబ్నగర్ జట్టు ఇన్నింగ్స్ 49 పరుగుల తేడాతో జడ్చర్ల జట్టుపై విజయం సాధించింది. 255 పరుగుల ఆధిక్యంతో మహబూబ్నగర్ ఉండగా రెండో రోజు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులకు చేసింది. కేతన్కుమార్ యాదవ్ అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 106 బంతుల్లో 16 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మహబూబ్నగర్ బౌలర్లు షాదాబ్ 2, శశాంక్ 2, డేవిడ్ క్రిపాల్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ను ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందడంతో మహబూబ్నగర్ జట్టు బోనస్పాయింట్తో కలిపి ఆరు పాయింట్లు సాధించింది. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ శుభారంభం చేసిన మహబూబ్నగర్ జట్టు -
‘దేశం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ సహించలేదు’
వనపర్తిటౌన్: ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని, దేశం అభివృద్ధి చెందితే ఆ పార్టీ సహించలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవిలత ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు విడివిడిగా నిర్వహించడంతో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండి సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల పేరుతో ఏటా రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఈ ఆటంకాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకే దేశంలో ఒకే ఎన్నిక చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఓటుకు ఎలక్షన్ కమీషన్ రూ.1,475 ఖర్చు చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికలకు రూ. 6లక్షల కోట్లు, శాసనసభ ఎన్నికలకు రూ.3లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇవే కాకుండా శాసనమండలి, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, సర్పంచ్, సింగిల్విండో ఎన్నికల నిర్వహణకు లెక్కలేనంత డబ్బులు ఖర్చవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్ అహన్యరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్, ఓబీసీ మోర్చా నాయకుడు బి.శ్రీశైలం, రామన్గౌడ్, జ్యోతిరమణ, సుమిత్రమ్మ, కుమారస్వామి, సీతారాములు, పెద్దిరాజు, మనివర్ధన్, బోయల రాము, రాజశేఖర్గౌడ్, అశ్వినిరాధ, రాఘవేందర్ గౌడ్, వారణాసి కల్పన, ఎండీ ఖలీల్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రజాధనం వృథాను అరికట్టేందుకే జమిలి ఎన్నికలు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవి లత -
హరీశ్రావు ఆరోపణలు అవాస్తవం
అచ్చంపేట: అమ్రాబాద్ మండలం మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎంను కలిసేందుకు వచ్చిన చెంచులను నిర్భందించి, ఆరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2016లో మన్ననూర్లో చెంచుల మరణాలపై పుస్తకం ఆవిష్కరించినా హరీష్రావు.. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెంచుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెంచులకు హైదారాబాద్లో కార్పొరేట్ వైద్యసేవలు అందించేవారని, బీఆర్ఎస్ హయంలో ఎందుకు అందించలేదని మండిపడ్డారు. జీవీవీకేలు, జీసీసీలను గత ప్రభుత్వం ఊపిరి తీస్తే.. తమ ప్రభుత్వం ఊపిరి పోస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చెంచులకు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను లాక్కునే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా చెంచులను ఆదుకోనేందుకు రూ.12,600 కోట్లతో పండ్ల తోటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. చెంచులకు పక్కా ఇళ్లు కట్టించేందుకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించడం చెంచుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతుందన్నారు. త్వరలోనే సలేశ్వరం లింగమయ్యను టూరిజం స్పాట్గా తీర్చిదిద్ది విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, కౌన్సిలర్ గౌరీ శంకర్, మాజీ ఎంపీపీ రామనాథం, నర్సయ్య యాదవ్, బాబా తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ సందర్భంగా ఎవరిని అరెస్టు చేయలేదు సభ విజయవంతం కావడంతోనే విమర్శలు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ -
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోనీ వీసీ హాల్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పనులను, కోయిల్ సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జడ్చర్ల మండలంలోని వల్లూర్, ఉదండపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు. దీంతో జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, ఉదండాపూర్, వల్లూరు, పోలేపల్లి, కిస్టారం రెవెన్యూ గ్రామాలు, నవాబ్ పేట మండలం లోని తీగలపల్లి, కార్కొండ, సిద్ధోటం రెవెన్యూ గ్రామాల్లో 4887.035 ఎకరాల వ్యవసాయ భూముల భూ సేకరణకు గాను 4876.185 ఎకరాలు భూసేకరణ చేసినట్లు, ఉదండపూర్ రెవెన్యూ గ్రామంలో 1453.33 ఎకరాలకు గాను 1443.09 ఎకరాలు సేకరించామని ఇంకా 10.24 ఎకరాలు భూ సేకరణ చేయవలసి ఉందని వివరించారు. వల్లూర్, ఉదండాపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్ట తండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండా, పోలేపల్లి ఆవాస ప్రాంతాల్లో 1954 గృహాల కోసం 60.26 ఎకరాల భూ సేకరణకు నోటిఫై చేసినట్లు తెలిపారు. 667 గృహాలకు అవార్డ్ పాస్ చేసినట్లు, 510 గృహాలకు టోకెన్లు జనరేట్ చేసినట్లు ఇంకా బ్యాలెన్స్ 161 గృహాలకు టోకెన్లు జనరేట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్అండ్ఆర్ కింద తుమ్మల కుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటిగుడిసెతండా, పోలేపల్లి నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. జడ్చర్ల మండలంలోని నిర్వాసితులకు పోలేపల్లిలో 125.13 ఎకరాలను, జడ్చర్లలో 149.19 ఎకరాలు మొత్తం 274.32 ఎకరాలను పునరావాస కాలనీలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఆర్అండ్ఆర్ లోకేషన్ 1, 2 లలో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు వివరించారు. అనంతరం కోయిల్సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణ పనులను సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ బి.వి.రమణారెడ్డి, ఎస్ఈ చక్రధరం, ఆర్డీఓ నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు, పీఆర్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్ -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
● మద్యం తాగొదన్నందుకు.. చెట్టుకు ఉరేసుకొన్న వైనం రాజాపూర్: మద్యం తాగొద్దని తనయుడు తల్లికి చెప్పినందుకు మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నవెల్లి గ్రామానికి చెందిన పొట్ట పద్మమ్మ(62) మద్యానికి బానిస కావడంతో హైదరాబాద్లో ఉన్న కుమారుడు శ్రీనివాసులు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి తల్లితో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పద్మమ్మ మద్యం తెచ్చుకుని తాగుతుండగా కుమారుడు శ్రీనివాసులు మందలించి ఇంటిపై నిద్రించాడు. మధ్యరాత్రి లేచి చూచేసరికి తల్లి కనిపించక పోవడంతో చుట్టు పక్కల గాలించాడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టుకు పద్మమ్మ ఉరేసుకొని వేలాడుతున్న విషయాన్ని గమనించి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. ప్రసవానికి వస్తే ప్రాణం పోయింది కల్వకుర్తి టౌన్: ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీకి చెందిన రేణుక (25)కు వెంకటేష్తో 2024లో వివాహాం జరిగింది. పురిటి నొప్పులతో పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రికి ఆదివారం రాత్రి తీసుకురాగా వైద్య సిబ్బంది ప్రసవం చేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం అవుతుండటంతో సోమవారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ నేపథ్యంలో రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతదేహాన్ని తిరిగి కల్వకుర్తిలోని శ్రీసాయి ఆస్పత్రికి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ నాయకుడు, మరో పోలీస్ అధికారి రాజీ కుదిర్చి బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిర్చినట్లు తెలిసింది. పట్టణంలోని ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవటం, నాయకులు వెంటనే రాజీ కుదర్చటం పరిపాటిగా మారిందని పట్ట ణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. -
టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్లో చేరేలా చూడాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్):ప్రభుత్వపాఠశాల లో పదవ తరగతి చదివిన వారందరూ ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోనీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించి వారు ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ఇంటర్మీడియట్లో చేర్పించాలన్నా రు. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఇంటర్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడంపై ఆరా తీసిన కలెక్టర్.. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. చదవడం, రాయడం రాని విద్యార్థుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల లో రాయడం, చదవడం రావాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు ల నమోదును పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించి వారిని సమీపంలోని భవిత కేంద్రాల్లో చేర్పించాలన్నారు. బడులు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించాలన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి నిర్లక్ష్యం చేయండా నిర్వహించాలన్నారు. రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లడానికి వీలుకాని వారు తెలంగాణ ఓపెన్ పాఠశాల ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) వాల్ పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, డీఐఈఓ కౌసర్ జహాన్, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, డీడబ్ల్యూయూఓ జరీనా బేగం, సీఎంఓ బాలుయాదవ్, ఆర్సీఓలు, డీసీఓలు పాల్గొన్నారు. -
కోర్టును ఆశ్రయిస్తాం..
జడ్చర్ల పరిధిలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ గుట్టలపై కన్నేసిన మట్టి మాఫి యా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి టిప్పర్లలో తరలిస్తున్నారు. అలాగే గుట్టలను బ్లాస్టింగ్ పెట్టి పేల్చి పిప్పి చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం. – అనిల్కుమార్, సామాజికవేత్త, జడ్చర్ల చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలించిన సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలించడం చట్టవిరుద్ధం. మట్టి తరలింపును అడ్డుకునే విధంగా సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తాం. గుట్టలను బ్లాస్టింగ్ చేసి తొలగించడంపై కూడా విచారిస్తాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల -
స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డితో కలిసి కుట్టుమిషన్లు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. -
ఎక్కడెక్కడంటే..?
ప్రఽదానంగా ఈ అక్రమ వ్యాపారం జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలాల్లో విచ్చలవిడిగా సాగుతుంది. బాదేపల్లి, బూరెడ్డిపల్లి, మల్లెబోయిన్పల్లి, చర్లపల్లి శివార్లలోని గుట్టలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అలాగే హౌసింగ్బోర్డు, శంకరాయపల్లి తండా సమీపంలో గుట్టలను సైతం హరిస్తున్నారు. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్టకు సైతం ఎసరు పెట్టారు. చర్లపల్లి శివారులో గుట్టను నామరూపాలు లేకుండా చదును చేసి వెంచర్కు సిద్ధం చేశారు. శంకరాయపల్లి తండా సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో గల బొంగురాల తిప్ప గుట్ట ఇప్పటికే పిట్టగూడుగా మారింది. అలాగే శంకరాయపల్లి తండా సమీపంలోని సర్వే నం.385లో గుట్టను తవ్వేశారు. జడ్చర్లలోని హౌసింగ్బోర్డు కాలనీ వెనుక ప్రాంతంలో జాతీయ రహదారి–44 పక్కన గుట్టను బ్లాస్టింగ్ పెట్టి ఆనవాళ్లు లేకుండా చేశారు. హౌసింగ్బోర్డు పక్కనే గల మరో గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. గత కొన్ని నెలలుగా భారీ యంత్రాలను పెట్టి గుట్టలను తవ్వి ఓ వైపు మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడంతోపాటు వెంచర్ ఏర్పాటుకు చదును చేస్తున్నారు. అలాగే మిడ్జిల్ మండలంలోని కేఎల్ఐ కాల్వ కట్ట నుంచి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. -
విస్తరణకు గ్రీన్సిగ్నల్
మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు ● హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ ● రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం ● మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు ● స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ● మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ..శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు డీపీఆర్ రూపొందించారు.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. అత్యంత కీలక మార్గం హైదరాబాద్– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్హెచ్–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, మైసిగండి, ఆమనగల్, డిండి, మన్ననూర్ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రమాదాలకు నెలవు.. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అనుసంధానంగామరో రెండు.. ఎన్హెచ్–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆదర్శనగర్లోని దివ్యాంగుల కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని, వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఆదేశించారు. పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హౌసింగ్బోర్డు కాలనీలో నిర్మించిన పోచమ్మతల్లి ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణ లో, అలాగే క్లాక్టవర్ వద్ద ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లతో పాటు వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్–షాపులను ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీ పరీక్షల కోసం స్థానిక అంబేడ్కర్ కళాభవన్లో శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రానున్న పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో స్థిరపడాలని యువతకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, నాయకులు హన్మంతు, శివశంకర్, ఎం.రాజు, జె.చంద్రశేఖర్, కావలి కాశీం, బేదురి యాదయ్య, తిరుపతయ్య, ఫయాజ్, శ్రీనివాస్యాదవ్, గుండా మనోహర్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
పాలమూరు: పెహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ప్రతీకారం తీర్చుకున్న భారత సైనికులకు సంఘీభావంగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పాత గ్రంథాలయం నుంచి క్లాక్టవర్ వరకు మహిళలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహిళ కార్యకర్తలు, పట్టణ మహిళలతో కలిసి ఎంపీ జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో నడిచారు. మహిళా సైనికులు అయిన ఖురేషి, వ్యోమికా సింగ్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ధర్మంతోనే జగతికి శాంతి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అందరూ ధర్మం పాటిస్తే జగతికి శాంతి చేకూరడమే గాక నైతిక విలువలు పెంపొందుతాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వచ్చే నెల 16న జరిగే ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవం, మహాత్మా బసవేశ్వర జయంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవాళి విశ్వశాంతి కోసం ఆది జగద్గురు పంచాచార్యులు పట్టణానికి రానుండటం శుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ముక్తా శ్రీశైలం, సంఘం నాయకులు ఎం.కె.గాంధీ, జంగం శివరాజయ్య, గాజుల మృత్యుంజయ, రాజశేఖర్, శరణ్కుమార్, శివకుమార్, గురుపాదస్వామి, బసప్ప, శివప్రసాద్, గురుపాదయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ,మహిళలు -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుంది
జెడ్పీసెంటర్(హహబూబ్నగర్): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీ సత్తా చాటుతుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా క్లబ్ మీటింగ్హాల్లో ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాల వారీగా కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ తరుపున అభ్యర్థులను పోటీలో పెట్టునున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎజెండాల్లో ముఖ్యమైనది రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ ఉచిత విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులను అనుసంధానం చేసి సాగు, తాగు నీళ్ల సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జై మహాభారత్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి చెన్నప్పగారి రఘోత్తంరెడ్డి, కో ఇన్చార్జి అనుప రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నిజామొద్దీన్, కో ఆర్డినేటర్లు చెన్నయ్య, జిల్లా ఆర్గనైజర్ వహీద్ పాల్గొన్నారు. 119 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ పోటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు -
48 గంటలైనా లభించని ఆచూకీ
కృష్ణా: భీమానదిలో మొసలి దాడికి గురైన రైతు ఆచూకీ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు వృథా అయ్యాయి. మండలంలోని కుసుమర్తిలోని భీమానదిలో రైతు జింకల్ తిప్పన్నపై శనివారం మొసలి దాడి చేసి ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, మక్తల్ సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో , రెవెన్యూ అధికారులు సోమవారం స్థానిక జాలర్ల సాయంతో నదిలో తిప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటలైనా తిప్పన్న ఆచూకీ లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్గౌడ్, నాగేంద్ర, సంతోష్పాటీల్, సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర ఆవేదనలో కుటుంబ సభ్యులు అటవీ అధికారులకు వినతి -
గిరిజనులకు ప్రత్యేక హక్కులు : మంత్రి సీతక్క
నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కలు లభించాయని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఐటీడీఏలను నిర్వీర్యం చేసిందన్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని సీఎంను కోరారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వం సౌర విద్యుత్ కల్పిస్తూ పండ్ల తోటలకు అవకాశం కల్పించిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గిరిజనుల భూమలు లాక్కొని కేసులు పెట్టారని ఆరోపించారు. ● -
భూవివాదంపై తల్లీకూతుళ్ల ఆందోళన
● న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు గట్టు: భూవివాదంపై తల్లీకూతుర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన ఘటన సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. ఆలూరు గ్రామానికి చెందిన రాణి తన భర్త సవారన్న మరణాంతరం గ్రామ శివారులో సర్వే నంబర్ 183/డీ1, 188/డీ1, 189/జీలో 1.32 ఎకరాల పొలాన్ని తన పేరున మార్చుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇట్టి పొలాన్ని సాగు చేసేందుకు వెళ్లగా తన మరిది మల్లేష్ సాగు చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాణి కుమార్తె మంజుల, మనవళ్లతో కలసి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు చేరుకోగా, పోలీసులు పట్టించుకోక పోవడంతో గట్టు– మాచర్ల రోడ్డుపై బైటాయించి సోమవారం ఆందోళన చేశారు. అదే విధంగా తన వాటాకు రావాల్సిన మరో 7.18 ఎకరాల భూమిని మరిది మల్లేష్ తన పేరున మార్చుకొని అన్యాయం చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, మరిది మల్లేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భూ వివాదంపై విచారణ చేపడుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఐదుగురిపై పిచ్చికుక్క దాడి పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానికంగా నివాసముంటున్న మెకానిక్ రాముడు, రంజాన్బీ, గౌరమ్మ, లక్ష్మయ్య, వేణుగోపాల్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పిచ్చికుక్కను కర్రలతో దాడి చేసి చంపేశారు. అనంతరం బాధితులు ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నిరుద్యోగులకు ఉపాధి
నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కొలమానం నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూశాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దరఖాస్తుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. 50 రోజులపాటు శిక్షణ ఇంటర్లో గణితం ఓ సబ్జెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), బీటెక్ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ కోర్సులు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మీసేవ ద్వారా ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించారు. వీరిలో నుంచి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేసి 50 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. థియరీ, టిప్పన్, ప్లాటింగ్, ఫీల్డ్ వర్క్ తదితర మూడు విభాగాల్లో శిక్షణ తీసుకొని తదుపరి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ సర్టిఫికెట్ అందజేస్తారు. భవిష్యత్లో భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులు సర్వేకు సంబంధించిన సమస్య పరిష్కారానికి, నక్ష వేయించుకోవడానికి ఈ ధ్రువపత్రం కలిగిన వారు ఇచ్చేవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సర్వేయర్ల కొరత తీరనుంది భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ ఇవ్వనుంది. ఎంపికై న సర్వేయర్లతో ప్రైవేట్ భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించునున్నారు. భూ కొలతలకు వారిని వినియోగించుకోనున్నారు. – గిరిధర్, జిల్లా సర్వే అధికారి, నారాయణపేట ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు -
నేటి నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు
అలంపూర్: మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాలకు షా–అలీ పహిల్వాన్ దర్గాలు ముస్తాబు అవుతున్నాయి. పట్టణంలో వెలిసిన షా–అలీ–పహిల్వాన్ సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండటంతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధికారికంగా జరిగే ఈ ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. 23 వరకు ఉత్సవాలు.. షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు నాలుగు రోజుల పా టు జరగనున్నాయి. ఈ నెల 20న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయం గంధం తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక ప్రార్ధనల అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంధంను సర్ ముబారక్ దర్గాకు భక్తజనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధంను తీసుకెళ్లి ప్రార్ధనలు చేయడం ఆనవాయితీ. 21న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు జరగనున్నాయి. 22న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీలు నిర్వహిస్తారు. పెద్ద కిస్తీపోటీలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 23న ప్రత్యేక ఉత్సవాలతో ముగుస్తాయి. రేపు దర్గాలలో గంధోత్సవం 21 చిన్న కిస్తీలు, 22న పెద్ద కిస్తీలు -
పులకరించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రెండోసారి రావడంతో గ్రామస్తులు పులకరించిపోయారు. సోమవారం సాయంత్రం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎంకు గజమాలతో ఘనస్వాతం పలికారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో సామూహికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి దంపతులు ఆంజనేయస్వామి, శివుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పండితులు ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశీర్వచనం చేసి శాలువాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి సొంత నిధులతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడం అభినందనీయమని పలువురు మంత్రులు కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేకంగా చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రులు హైదరాబాద్కు బయల్దేరి వెళ్లగా.. కొంత ఆలస్యంగా ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. వంగూరు మండల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొండారెడ్డిపల్లిలో సీఎంను ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్రెడ్డి, నరేందరర్రెడ్డి, రమేశ్గౌడ్ కలిసి మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. రూ. 100కోట్లతో కొండారెడ్డిపల్లి నుంచి హాజీపూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం, పలు గ్రామాల్లో రూ. 12కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడంతో పాటు విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అన్నింటినీ పరిశీలించి నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, కొండారెడ్డిపల్లికి చెందిన వందన గీసిన ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, వేమారెడ్డి, కృష్ణారెడ్డి, లాలూ యాదవ్, వంశీ తదితరులు ఉన్నారు. మండల అభివృద్ధికి నిధులు.. సీఎం రేవంత్రెడ్డికి ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు, మంత్రులు -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(హహబూబ్నగర్): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వారం 103 అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం త్వరితగతిన పూర్తి చేసి జూన్ 2వ తేదీన అర్హులకు మంజూరు చేయాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖలకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. మండల స్పెషల్ అధికారులు ఎంపీడీఓలతో కలిసి దరఖాస్తులను ఫైనలైజ్ చేసి, ప్రతిపాదనలు పంపాలన్నారు. మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మార్క్ ఔట్ చేసి గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాందేడ్లో చెంచు మహిళ మృతి
బల్మూర్: ఆదివాసి చెంచు మహిళ వలస వెళ్లి మహారాష్ట్రలోని నాందేడ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని బాణాలకు చెందిన నల్లబోతుల లింగస్వామి లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన కవిత (26)ను రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు అప్పాయిపల్లికి చెందిన గుంపు మేసీ్త్ర అర్జున్తో రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకొని బాణాలకు చెందిన మరికొందరితో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్కు పనికి వెళ్లారు. ఈ నెల 15న పని ప్రదేశంలో కవిత బావిలో పడి మృతి చెందడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. భర్త, అత్త చిట్టెమ్మ అక్కడ పని చేస్తున్న మరో ఇద్దరు మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకొచ్చి ఈ నెల 17న శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కవిత తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా 12 ఏళ్ల సోదరుడు గణేష్ ఉన్నారు. అతడి సంరక్షణకుగాను రూ.75 వేలు గుంపుమేసీ్త్ర ఇచ్చేలా మధ్యవర్తులు ఒప్పందం కుదుర్చారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గుంపు మేసీ్త్ర తమను పట్టించుకోవడం లేదని.. ఇస్తానని రూ.75 వేలు కూడా ఇవ్వడం లేదని లింగస్వామి, అతడి తల్లి చిట్టెమ్మ వాపోతున్నారు. గుంపు మేసీ్త్ర చెరలో 33 మంది చెంచులు.. అప్పాయిపల్లికి చెందిన గుంపు మేస్త్రి అర్జున్ లింగాల మండలంలోని శ్రీరంగాపూర్, బల్మూర్ మండలంలో ని బాణాల నుంచి 33 మంది చెంచులను అడ్వాన్సు లు ఇచ్చి మహారాష్ట్రలోని నాందేడ్లో ఓ కంపెనీలో సిమెంట్, కాంక్రీట్ పనులు చేసేందుకు తీసుకెళ్లాడని బాధితులు విలేకర్లకు తెలిపారు. వెళ్లే సమయంలో రోజు కూలి రూ.500 ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్లాక నెలకు కేవలం రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు. అంతేగాకుండా నెలలో రెండ్రోజులు మాత్రమే సెలవులిస్తూ.. నాసిరకంగా భోజనం అందిస్తున్నారని వివరించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి కవిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు గుంపు మేస్త్రిపై కఠిన చర్యలు తీసుకోని అక్కడి చెంచులను స్వగ్రామాలకు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అలస్యంగా వెలుగు చూసిన ఘటన -
జాతీయ గోగేమ్ టోర్నీలో క్రీడాకారులకు పతకాలు
మహబూబ్నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం ఆరాలో ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి మూడు బంగారు పతకాలు సాధించారు. సబ్ జూనియర్ సింగిల్స్లో జిల్లా క్రీడాకారుడు పి.రాజేష్ ఫైనల్ మ్యాచ్లో 40–30 స్కోర్తో బిహార్ క్రీడాకారుడిపై, మరో క్రీడాకారుడు మహ్మద్ బషీరుద్దీన్ ఫైనల్ మ్యాచ్లో 16–03 స్కోర్తో ఒడిశా క్రీడాకారుడిపై, జూనియర్ సింగిల్స్లో మహ్మద్ రయ్యన్ నజం ఫైనల్ మ్యా చ్లో తమిళనాడు క్రీడాకారుడిపై 17–9 స్కోర్తో గెలుపొంది బంగారు పతకలు సాధించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ గోగేమ్ అసోసియేషన్ నసరుల్లా హైదర్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, కోశాధికారి వినోద్కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్, సభ్యులు అభినందించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు ఓవైపు ప్రచారం చేస్తున్నప్పటకీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియక రక్షించాలంటూ కేకలు వేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కడప నుంచి సికిందరాబాద్కు 37మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలోని పాలెం సమీపంలోకి బస్సు రాగానే ఒక్కసారిగా అదపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులు నారాయణ, శిల్ప, తరుణ్కు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. బస్సు సా ధారణ స్పీడ్లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నవ వధువు అనుమానాస్పద మృతి మద్దూరు/కొత్తపల్లి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతిచెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కడపని స్వామితో కోయిలకొండ మండలం మల్కాపూర్కు చెందిన జ్యోతి(19)కి గత నెల 20న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జ్యోతి తల్లి గారింటికి వెళ్లి అక్కడ పదిరోజులు ఉండి ఈ నెల 14న ఎక్కమేడ్కు వచ్చింది. ఈ నెల 18న రాత్రి పడుకున్న తర్వాత ఆకస్మికంగా మృతిచెందగా ఈ విషయాన్ని స్వామి చిన్నాన్న చంద్రప్ప మృతురాలి బంధువులకు సమా చారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు పెద్దఎత్తున ఎక్కమేడ్లోని స్వామి ఇంటికి చేరుకోగా కోస్గి ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమార్తె మృతిపై అనుమానం ఉందని తండ్రి గుర్రాల కుశలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఉస్మాన్ వివరించారు. -
ఇంట్రా టూ డే లీగ్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్కు భారీ ఆధిక్యం ● డేవిడ్ క్రిపాల్ డబుల్, షాదాబ్ సెంచరీలు సమర్థ స్కూల్ మైదానంలో మహబూబ్నగర్–జడ్చర్ల మధ్య జరగిన టూడే లీగ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు తొలి ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయిది. జట్టులో సంజయ్ 70, కేతన్ కుమార్ 32 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్ ముఖిత్ 15 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు షాదాబ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 50 ఓవర్లలో 420 పరుగుల భారీ స్కోర్ చేసి 255 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ రాయ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 13 సిక్స్లు, 16 ఫోర్లతో 220 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మెన్ షాదాబ్ అహ్మద్ 72 బంతుల్లో 10 సిక్స్లు, 7 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 270 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. నేడు (మంగళవారం) రెండో రోజు మ్యాచ్ కొనసాగనుంది. మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారుల కోసం మొదటిసారిగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లు ప్రారంభించిందని, ఈ టోర్నీల్లో క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ సోమవారం ప్రారంభమైంది. రాజశేఖర్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లలో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్సీఏ టోర్నమెంట్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామని అన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లు ప్రారంభించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ -
సత్వర న్యాయం అందేలా చూడాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఫిర్యాదులు చేసే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా పలువురు బాధితులు సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులు అందించారు. ఆ తర్వాత ఆయా పోలీస్స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, సీఐలతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల భద్రత, న్యాయం, నమ్మకాన్ని పెంపొందించేందుకు పోలీస్శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు నమ్మకంతో ముందుకు రావాలని సూచించారు. బాధితులకు న్యాయం ఆలస్యం అవుతున్నా.. సమస్యలు ఎదురవుతున్నా వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ట్రాన్స్కో అధికారులఫోన్ నంబర్లు మారాయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఫోన్ నంబర్ల స్థానంలో కొత్తవాటిని కేటాయించారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) 87124 72097, డీఈ 87124 72155, టౌన్ ఏడీ 87124 72156, టౌన్–1 ఏఈ 87124 72160, టౌన్ –1 ఫ్యూస్ ఆఫ్ 87124 72215, టౌన్–2 ఏఈ 8712472161, ఫ్యూస్ ఆఫ్ 8712472219, టౌన్–3 ఏఈ 8712472162, ఫ్యూస్ ఆఫ్ 87124 72221 కేటాయించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముగ్గురు డీఎస్పీల బదిలీ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేయడంతోపాటు ఒకరికి పోస్టింగ్ ఇస్తూ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సుదర్శన్ను హైదరాబాద్ గోషామహల్ ఏసీపీగా, సీసీఎస్ డీఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణను షాద్నగర్ ఏసీపీగా బదిలీ చేయడం జరిగింది. అలాగే గాంధీనగర్ ఏసీపీగా పనిచేస్తున్న వై.మొగిలయ్యను గద్వాల డీఎస్పీగా బదిలీ చేయగా.. గద్వాల డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న వెంకట్రెడ్డిని కుషాహిగూడ ఏసీపీగా బదిలీ చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆముదాలు @ రూ.5,906 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన ఈ టెండర్లలో ఆముదాలు క్వింటాల్ సరాసరిగా రూ.5,906 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతోపాటు చాలామంది రైతులు ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయిస్తుండటంతో మార్కెట్కు అమ్మకానికి ధాన్యం రాలేదు. -
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య
హన్వాడ: క్షణికావేశం.. కన్నవారి ప్రేమానురాగాన్ని మరిపించింది. జీవితం అంటే ఇంతేనా అనే రీతిలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చాడు. హన్వాడ మండలం టంకరలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. టంకరకు చెందిన మెండె పెద్దరాములు – గౌరమ్మలకు ఇద్దరు సంతానం. కుమారుడు మల్లేష్ (13) నారాయణపేటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేసుకొని సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కూతురు స్వగ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. అయితే వేసవి సెలవుల్లో ఇంటి పట్టున ఉంటున్న మల్లేష్ బయటి వ్యక్తులు, ఇతరులతో కలివిడిగా కలిసిపోకపోగా.. ఎవరితోనూ మాట కలపకుండా స్తబ్దుగా ఉండేవాడు. ఇంట్లో కేవలం టీవీ, మొబైల్ ఫోన్ చూస్తూ ఉండే వాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమారుడి శైలిపై పలుమార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం గౌరమ్మ పొలం వద్ద చిన్నపని ఉంది.. వెళ్లొద్దామని కోరగా అయిష్టంగానే వచ్చి, మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు కళలైపోయాయి. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఇసుక టిప్పర్ల పట్టివేత
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వనపర్తి జిల్లా రంగాపురం పరిధిలోని నదీ పరివాహాక ప్రాంతం నుంచి ఉండవెల్లి మండలం కల్లుగోట్ల గ్రామానికి చెందిన ఆర్వీ శేషుకు చెందిన టిప్పర్ల ద్వారా ఆదివారం ఇసుక గద్వాలకు తరలిస్తున్నారన్నా సమాచారం మేరకు జమ్మిచెడ్ శివారులో దాడి చేసి టిప్పర్లను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించామన్నారు. అదే విధంగా జమ్మిచెడ్ శివారులోని అక్రమంగా ఆరు టిప్పర్ల ఇసుకను నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు టిప్పర్ల యాజమాని ఆర్వీ శేషుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. సీఎం సొంత గ్రామంలోనూ పర్యటన.. మాచారంలో ‘ఇందిరా సౌర జల వికాసం’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకోనున్నారు. గ్రామంలో సీఎం రేవంత్రెడ్డి సొంత ఖర్చుతో ఇటీవల నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయల్దేరుతారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 3 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. -
విద్యార్థి ప్రాణం తీసిన పిడుగు
దేవరకద్ర రూరల్: ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. బాగా చదువుకొని తమకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్న తరుణంలో.. పిడుగుపాటు రూపంలో వచ్చిన మృత్యువు వారి ఆశలను కబళించింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చిన ఈ ఘటన ఆదివారం దేవరకద్ర మండలం గద్దెగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గద్దెగూడెం గ్రామానికి చెందిన రైతు బత్తుల కృష్ణయ్య వ్యవసాయం, పాడి ఉత్పత్తితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం తనకు పొలం వద్ద పని ఉండటంతో వెళ్లాడు. ఇంటర్ పూర్తిచేసుకుని వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన అతడి కుమారుడు ఉదయ్కుమార్ (18) పశువులను మేపేందుకు వెళ్లగా.. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో ఉదయ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక కుమారుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లాకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడకక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ జీలుగ 4,000 క్వింటాళ్లు, జనుము 1,000 క్వింటాళ్లు కావాలని ఇండెంట్ ఇవ్వగా.. ఇప్పటివరకు జీలుగ 2,000 క్వింటాళ్లు, జనులు 1,000 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. జిల్లాలోని పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, టీజీఎస్డీఎల్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు. ● సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగ విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.5 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. పంపిణీకి విత్తనాలు సిద్ధం ఇప్పటికే జిల్లాకు చేరుకున్న జీలుగ, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకంతో సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలి. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జిల్లాలో 3వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం 50 శాతం సబ్సిడీతో విక్రయం -
పోడు భూములకు మహర్దశ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంతో పోడు భూములకు మహర్దశ పట్టనుంది. గిరిజన, చెంచు రైతులు ఉద్యాన పంటలు పండించి ఆదాయం పొందేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు, మార్గదర్శకాలను గిరిజన సంక్షేమశాఖ విడుదల చేసింది. వందశాతం రాయితీతో ఒక్కో యూనిట్కు రూ. 6లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. పోడు భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు రానున్న ఐదేళ్ల పాటు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి వసతి కల్పిస్తారు. మొదటి మూడేళళ్లు అంతర పంటలు సాగుచేస్తూ.. ఆదాయం పొందే విధంగా రైతులను ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత పండ్ల తోటల నుంచి దిగుబడులు వచ్చి రైతులకు ఆదాయం సమకూరనుంది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 27 మందికి చెందిన 50 ఎకరాల భూముల్లో సౌర విద్యుత్తో పాటు ఉచితంగా బోరుడ్రిల్లింగ్, 5హెచ్పీ మోటార్లు, స్పింకర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు రైతులకు ఒకటి చొప్పున 16 బోర్లు వేయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 114 గ్రామాల్లో 3,410 మంది చెంచు, గిరిజనులకు 7,765.12 ఎకరాల పోడు భూములకు అటవీ హక్కుల చట్టం కింద భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలిలా.. నియోజకవర్గం గ్రామాలు రైతులు పోడు భూములు అచ్చంపేట 58 1,827 4,612.4 కొల్లాపూర్ 24 1,083 2.531.1 కల్వకుర్తి 3 8 24.5 మహబూబ్నగర్ 12 77 116.12 వనపర్తి 17 415 481 క్షేత్రస్థాయి పర్యటన.. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద చేపట్టే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, దానిమ్మ, వెదురు, కొబ్బరి ఇతర తోటలను పరిశీలించడానికి మాచారం గ్రామ చెంచు రైతులను దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పండ్ల తోటలు, మొక్కల పెంపకం, వాటికి ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పోడు భూములను చదును చేసి పండ్ల తోటలు పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’తో సౌర విద్యుత్తో పాటు సాగునీటి వసతి గిరిజన, చెంచు రైతుల సుస్థిర సాగుకు పక్కా ప్రణాళిక -
టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం
మరికల్: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాము కథనం మేరకు.. ధన్వాడ మండలం కంసాన్పల్లికి చెందిన కొల్లంపల్లి ఉప్పరి నారాయణ (48) పెద్దచింతకుంట నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మరికల్ చౌరస్తాలో బైక్ను మలుపుతుండగా ఒడిస్సా నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొని ఆయన తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నారాయణ రియల్ వ్యాపారం చేస్తుండటంతో ఆయన బైక్లో విలువైన డాక్యుమెంట్లు, రూ.లక్ష నగదు ఉండటంతో పోలీసులు వాటిని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. బైక్ అదుపుతప్పి మరొకరు మృతి వెల్దండ: మండలంలోని బైరాపూర్ సమీపంలో వెల్దండ–చారకొండ రహదారిపై బైక్ అదుపుతప్పి భూత్కురి రమేశ్ (30) మృతి చెందినట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కొట్ర గ్రామానికి చెందిన రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్పై బయలుదేరాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోగా ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆదివారం రోడ్డు పక్కన గుంతలో బైక్, వ్యక్తిని గుర్తించిన బైరాపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ వివరాలు సేకరించగా కొట్ర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ వివరించారు. రమేశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి మానవపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ సమద్ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఏఎస్ఐ సమద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కంట్రోల్రూమ్లో విధులు నిర్వర్తించేవాడు. గత నెల 27న విధులు ముగించుకొని తిరిగి వస్తూ మానవపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతదేహానికి అలంపూర్ ఆరోగ్య కేంద్రంలో పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమద్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్పీ ఆదేశానుసారం సమద్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంత్యక్రియలకుగాను రూ.20 వేలు అందించినట్లు ఏఎస్ఐ వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలులో చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. మండలంలోని ఔరాసిపల్లికి చెందిన ప్రభాకర్ (39) హైదరాబాద్లో మేసీ్త్ర పని చేసుకొని జీవనం సాగించే వాడు. ఈ నెల 13న స్వగ్రామానికి వచ్చిన అతడు తిరిగి వెళ్లలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నాగనూలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య బలన్మరణం వంగూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వంగూర్ మండలం నర్సంపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేందర్ వివరాల మేరకు.. నర్సంపల్లికి చెందిన పార్వతమ్మ (45) భర్త వెంకటయ్య అనారోగ్యంతో 20 రోజుల క్రితం మృతిచెందాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొంత సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
హైవేపై తప్పిన పెను ప్రమాదం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణిస్తున్న భారీ కంటైనర్లోని మిషనరీ కారుపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లకు చెందిన పుస్యహాసారెడ్డి తన కారులో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై పదో బెటాలియన్ సమీపంలో ముందుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో దానికి స్వల్పంగా వెనకనుండి ఢీకొట్టారు. ఈ క్రమంలో రెండు కార్ల యజమానులు వాహనాలను రోడ్డు పక్కన ఆపి గొడవ పడుతుండగా.. అదే దారి గుండా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ను నిలువరించేందుకు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బెల్ట్ తెగిపోయి దానిపై ఉన్న మిషనరీ కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కారుపై పడిన కంటైనర్లోని మిషనరీ భారీగా నిలిచిన వాహనాలు -
పాలమూరులో తిరంగా ర్యాలీ
పాలమూరు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధా న స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్టవర్ వరకు జాతీ య జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాజీ సైనికులు, బీజేపీ నే తలు, యువకులతో కలిసి జాతీయ జెండాలు చేతి లో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ సైనికల్లో ధైర్యం నింపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదుల స్థావ రాలపై దాడులు చేసి పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపించామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు సాహితీరెడ్డి, జయశ్రీ, బాలత్రిపుర సుందరి పాల్గొన్నారు. -
ఆదివాసీ చెంచులకు వరం
అచ్చంపేట/మన్ననూర్: ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ఆదివాసీ చెంచులకు వరంలాంటిదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్లతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దశాబ్ధాలుగా నిరాధారణకు గురైన ఆదివాసీ చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. పోడు భూముల్లో ఎకరాకు రూ. 6లక్షల నుంచి రూ. 8లక్షల వరకు ఖర్చుచేసి ఉద్యాన తోటలను అభివృద్ధి చేసి ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది ఆదివాసీ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గిరిజన రైతుల కోసం ప్రవేశపెడుతున్న కొత్త పథకాన్ని నల్లమల ప్రాంతంలో ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ చెంచుల అభ్యున్నతి కోసం బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సీఎం సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి అధికారి, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీపీఓ రామ్మోహన్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ మాధవి, జిల్లా ఉద్యానశాఖ అధికారులు జగన్, వెంకటేశ్, రాజేందర్, మల్లేష్, వెంకటయ్య తాహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండలం ముచ్చింతలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పెద్ద గొల్ల చంద్రన్న (56) ఇంటి ఎదుట ఉన్న కట్టెలు వర్షానికి తడవకుండా లోనికి తరలిస్తున్నాడు. అదే సమయంలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగ తెగి అతడిపై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రన్నకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఏఎస్ఐ వెంకటస్వామి వివరించారు. -
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
వనపర్తిటౌన్: కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీలో తోటి చిన్నారులతో కలిసి డింపుల్ అనే చిన్నారి ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమేస్తున్న క్రమంలో ఓ కుక్క డింపుల్పై దాడి చేయడంతో ముఖం, చేతిపై గాయాలయ్యాయి. స్థానిక మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ సహకారంతో చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కుక్కకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో లేవని వైద్యులు చెప్పడంతో.. స్థానికంగా ఉన్న ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ప్రకాశ్, స్రవంతి తెలిపారు. పట్టించుకోని మున్సిపాలిటీ.. జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువైందని మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ అన్నారు. వీధి కుక్కలను ఎనిమల్ కేర్కు తరలించి తగిన చర్యలు చేపడతామని పుర అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని, కుక్కల నివారణకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.