Mahabubnagar District Latest News
-
లక్ష్యం స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు సాధించిన ఈ విజయాలు అత్యంత ప్రేరణత్మకంగా ఉన్నాయని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు మంగళవారం వీఐపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళ ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా వారు తమ కుటుంబాలకు, సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్పై స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందకు సాగాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లను ధైర్య ంగా ఎదుర్కొని, తమ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వీఐపీ ఫౌండేషన్ డైరెక్టర్ నాగేంద్రస్వామి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ● మహబూబ్నగర్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న నవాబ్పేట, కోయిలకొండ, హన్వాడ, రూరల్ పోలీస్ సిబ్బందికి మంగళవారం ఎస్పీ డి.జానకి హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించడంలో పోలీసులే ఇతరులకు రోల్ మోడల్గా నిలిస్తే మార్పు తప్పక వస్తుందన్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంచాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, రామకృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 10న జరిగే అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాలతో పాటు పురుషుల, మహిళల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నీ, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఎంపికలను మంగళవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికై న తుదిజట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు రమేష్బాబు, పి.శ్రీనివాసులు, సి.శ్రీనివాస్, రాజు, దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు. -
ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: ఓ ఫంక్షన్ హాల్ పక్కన చెత్తకు నిప్పు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించి ఫంక్షన్ హాల్ పైభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయిన ఘటన మంగళవారం జరిగింది. మహబూబ్నగర్ ఫైర్ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని పిస్తాహౌజ్ సమీపం బైపాస్ రోడ్డుపై ఉన్న సయ్యద్ జుబేర్ అల్లీకి సంబంధించిన యూబీ బాంకెట్ హాల్ పక్కన ఉదయం చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు ఫంక్షన్ హాల్ పైభాగంలోకి వ్యాపించడంతో పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితుడు ఫిర్యాదు ఇచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. -
శిక్షణ బాగుంది..
ఏడాది నుంచి మెయిన్ స్టేడియంలో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తున్న. 55–60 వెయిట్ కేటగిరీలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ శిక్షణ బాగుంది. ప్రతి రోజు, సాయంత్రం వేళల్లో బాక్సింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న. బాక్సింగ్లో రాణించి భవిష్యత్లో రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల టోర్నమెంట్లో పాల్గొంటాను. నేను నార్సింగ్లోని సోషల్ వెల్లేర్ బాక్సింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న. వేసవి సెలవులతో పాటు మిగతా రోజుల్లో మెయిన్ స్టేడియంలో బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటున్న. ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొని రెండు వెండి పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాను. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో ఆడాలని ఉంది. – మధులత, కొనగట్టుపల్లి (హన్వాడ) – కార్తీక్ యాదవ్, మహబూబ్నగర్ అంతర్జాతీయస్థాయిలో ఆడాలని.. -
అనుమానాస్పదంగా రైతు మృతి
జడ్చర్ల: మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామ శివారు పొలంలో రైతు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశ్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్యగౌడ్(55)కు ఈర్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. సోమవారం పొలంలో చెత్త చెదారానికి నిప్పు పెట్టాడు. ఈ క్రమంలో మంటలు రాజుకొని పక్కనే ఉన్న సపోట తోటకు వ్యాపించాయి. దీంతో రైతు కృష్ణయ్యగౌడ్ మంటలను అదుపులోకి తెచ్చాడు. ఎంతకూ కృష్ణయ్యగౌడ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతుడి కుమారుడు శేఖర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం పాన్గల్: హైదరాబాద్ ఓఆర్ఆర్పై సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బోయిని నాగేష్ (28) మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తన పొలంలోని మామిడికాయలను సోమవారం గ్రామం నుంచి హైదరాబాద్ మార్కెట్కు బొలెరో వాహనంలో తీసుకెళ్తుండగా వాహనం అదుపుతప్పి లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బోయిని నాగేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సర్పంచ్ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటేష్నాయుడు, మాజీ సర్పంచ్ నాగేంద్రం, కాంగ్రెస్ నాయకులు బాలు, ఎర్రంచంద్రయ్య, అంబులెన్స్ గోవింద్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ స్తంభం విరిగి.. యువకుడి మృతి రాజోళి: విద్యుత్ స్తంభం విరిగిపడి యువకుడి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని పెద్ద ధన్వాడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్సన్న కుమారుడు యువరాజు(19)మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో దాన్ని తిరిగి ఏర్పాటు చేసే క్రమంలో ఓ వైపు తాడు పట్టుకుని నిలబడ్డాడు. ప్రమాదవశాత్తు స్తంభం అతనిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అయిజకు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
అంగన్వాడీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మహబూబ్నగర్ రూరల్: అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, సేవల్లో పారదర్శకత కోసం కట్టుబడి పని చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన 334 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను మంగళవారం అంబేద్కర్ కళాభవన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రులు, ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఉచిత ప్రసవ సేవలు పొందవచ్చని, ప్రసవానంతరం అవసరమైన యెన్నం హెల్త్ కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1000 హెల్త్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం పొందాలని సూచించారు.స్మార్ట్ఫోన్ల వినియోగంతో అంగన్వాడీ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడుతుందని, ప్రభుత్వ యాప్ ద్వారా పిల్లల హాజరు, వివరాలు రియల్ టైమ్లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓలు శైలశ్రీ, రాధిక పాల్గొన్నారు. -
రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు. 8న జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 8న (శుక్రవారం) ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎం అసోసియేట్స్, విజయ బయో ఫెరిలైజర్స్, అపోలో కంపెనీల్లో 150 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇంటర్నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయి నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు మూతపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రఘునందన చారి, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురభి విజయ్ కుమార్, గొడుగు నర్సిములు, రామస్వామి, శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ సేన కాదు.. రాక్షస సేన
● కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలు రాజాపూర్: రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత కాళేశ్వరంలో దోచుకుతిన్నారని అప్పుడే ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు తెలంగాణ రక్షణసేన అంటూ కొత్తపార్టీ పెట్టి.. జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన తండ్రి మీదనే కొట్లాడుతున్న కవిత తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచ్చర్కల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి రెండు పార్టీలయ్యాయన్నారు. ‘మీ నాయన పదేళ్లు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఆరోజు ఎందుకు కొట్లాడలేదని, కాళేశ్వరంలో దోచుకుంటున్నారని ఎందుకు మాట్లాడలేదు.’ అని కవితను ప్రశ్నింశారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తమదేమీ సాగడం లేదని కొత్తపార్టీ పెట్టి.. పార్టీ పేరు చెప్పి ఫ్యాక్టరీలు, ఇతరుల దగ్గర దోచుకోవడానికి పార్టీ పెట్టారా అని విమర్శించారు. కవిత పెట్టిన పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదని.. తెలంగాణ రాక్షస సేన అని హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీలో చేరిన వారందరూ ప్రజలను దోచుకుతినే రాక్షసులేనని పేర్కొన్నారు. నాయకులు మోటెసత్యం, సుజయ్ చంద్రారెడ్డి, యాదయ్య, శేఖర్గౌడ్,వెంకటయ్య పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దండ: మండలంలోని పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్త్యావత్ పెంట్యానాయక్(45) మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంట్యానాయక్ కిడ్నిలో నొప్పిగా ఉందని ఈ నెల 1న వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్ చేసే క్రమంలో అకస్మాత్తుగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే వైద్యులు పరీక్షించారు. సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దీంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెంట్యానాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తండావాసులు, బంధువులో ఆస్పత్రికి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తు వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. వెల్దండ ఎస్ఐ కురుమూర్తి సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపుగా 5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ మహిపాల్నాయక్, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ సహకారంతో రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. నిందితుడికి జైలు, జరిమానా విధింపు అలంపూర్: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి కోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాస్రావు, ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. అలంపూర్ పట్టణానికి చెందిన నాగరాజు 2022వ సంవత్సరంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అండర్ గ్రౌండ్ పైప్లైన్పై సిమెంట్ బెడ్ వేయడానికి ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేసినట్లు తెలిపారు. నాలుగు నెలలు పనిచేసినా నాగరాజుకు కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో 2022 ఏప్రిల్ 2న తాను వేసిన సిమెంట్ బెడ్ను పగలగొట్టాడని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది చెప్పినా వినకుండా దాన్ని ధ్వంసం చేయడంతో ఆస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చుక్కా పరశురాం ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 4న అప్పటి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2022 జూన్ 11న ఎస్ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.. ఎస్పీ శ్రీనివాస్రావు ఆదేశాలతో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, అలంపూర్ సీఐ ప్రదీప్కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగిందన్నారు. ఈ మేరకు ఏడీజే కోర్టు, మహబూబ్నగర్ న్యాయమూర్తి కళ్యాణ్చక్రవర్తి నిందితుడికి నెల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. కేసులో విచారణ చేసిన అప్పటి ఎస్ఐ శ్రీహరి, ప్రస్తుత ఎస్ఐ రామకృష్ణ, సీడీఓ కానిస్టేబుల్ మాబాషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్కుమార్రెడ్డి, కోర్టు లైసన్ ఆఫీసర్ ఏఎస్ఐ నరసింహులును ఎస్పీ అభినందించారు. -
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వేసవికాలంలో గ్రామాలలో తాగునీటి సమస్య నివారణకు గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, మండల జిల్లా అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టి నీటి సరఫరా నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ ఖుష్బుగుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను, గ్రామస్థాయిలో పరిష్కారం దొరకనప్పుడు మండల, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. కొంతమంది అధికారులు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికారులు సర్పంచ్లతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ● భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి మాట్లాడుతూ ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే తమ ప్రాంతంలో ఆస్తి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని, వెంటనే తగ్గించాలని కోరారు. జానంపేట సర్పంచ్ మాట్లాడుతూ ఎముకల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్గంధం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, దేవరకద్ర మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి గోవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి సమన్వయం అవసరం గ్రామాల్లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ గ్రామాల్లో తాగునీరు, డ్రెయినేజీ, సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీలు, అంగన్వాడీ భవనాలు.. వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని సందర్శించడం సాధ్యం కాకపోయినా, ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను తెలుసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సమర్థంగా వినియోగించి అత్యవసర పనులను చేపట్టాలని సూచించారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి సమన్వయంతో గ్రామ సమస్యలు పరిష్కరించాలి దేవరకద్ర నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి,కలెక్టర్ ఖుష్బూగుప్తా -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నేను ఐదు నెలల నుంచి బాక్సింగ్ కోచ్గా పని చేస్తున్న. వ్యక్తిగత క్రీడాంశాల్లో బాక్సింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేసవి శిక్షణ శిబిరంలో బేసిక్తో పాటు ఇతర అంశాల్లో శిక్షణ అందజేస్తున్నాం. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు ప్రతి రోజు రెగ్యులర్గా మెయిన్ స్టేడియానికి రావాలి. – డీఎస్ఏ బాక్సింగ్ కోచ్, మహబూబ్నగర్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు, కోచ్లు, ప్రతినిధులు -
విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి, లక్ష్యంపై దృష్టి సారించాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు కలాం డ్రీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొబైల్స్కు అలవాటు పడితే ఏకాగ్రత, సృజనాత్మకత దెబ్బతింటుందని, విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. తాను బీటెక్ చదివిన తర్వాత పలు సంస్థలను సందర్శించేందుకు అవకాశం దొరికిందని, ప్రస్తుతం డ్రీం ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం విద్యార్థులకు దొరికిందన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకుని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు, ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షుడు జనార్దన్, కోశాధికారి నర్సప్ప, వెంకటేశ్వర్లు, శ్రీధర్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి, మల్లప్ప, చక్రవర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డీ–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డీ–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
జిల్లాలో భూగర్భ జలాలు (మీటర్ల లోతులో)
భూగర్భ జలాలను కాపాడుకోవాలి భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అవసరానికి మించి నీటిని విచ్చలవిడిగా వినియోగించరాదు. వర్షపాతం నమోదైనా రీచార్జి ఆశించినంతగా జరగడం లేదు. బోర్ల వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ప్రతి గ్రామంలో రీచార్జి పిట్లు, చెక్డ్యాంలు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టడం అత్యవసరం. రైతులు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించి నీటి వినియోగాన్ని తగ్గించాలి. భూగర్భ జలాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – రవిశంకర్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
బాక్సింగ్ అంటే ఇష్టం
బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. నెల రోజుల నుంచి బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటున్న. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. – అమోఘ్, మహబూబ్నగర్ మొదటిసారిగా వేసవి శిబిరంలో.. టీవీల్లో బాక్సింగ్ను ఎక్కువగా చూసేవాడిని. ఈ క్రీడపై ఉన్న ఆసక్తితో కోచ్ ప్రోత్సాహంతో మొదటిసారిగా వేసవి బాక్సింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. చాలా చక్కగా బాక్సింగ్ శిక్షణ అందజేస్తున్నారు. బాక్సింగ్ గ్లౌజ్లతో ప్రాక్టీస్ చేస్తుంటే ఇంట్రస్ట్గా అనిపిస్తుంది. శిబిరంలో రోజు పాల్గొని శిక్షణ తీసుకుంటాను. – సుశాంత్, కొత్తపేట (హన్వాడ) -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
కారుకు నిప్పంటించిన దుండగులు
దామరగిద్ద: ఇంటి ఎదుట నిలిపిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని వత్తుగుండ్ల గ్రామానికి చెందిన నర్సిములుకు చెందిన ఆల్టో కారును ఇంటి ముందు నిలిపి ఉంచగా.. రాత్రి వేళలో దుండగులు నిప్పంటించారు. మిద్దైపె నిద్రిస్తున్న నర్సిములు గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు వెనకభాగంతో పాటు రెండు టైర్లు కాలిపోయాయి. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కారణం ఏమిటి?
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో నిత్యం చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు 73, ట్రాక్టర్లు 21 వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ కనీసం 107 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను అధికారులు కోయిల్కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందులో కేవలం 8 మెట్రిక్ టన్నుల తడి చెత్త తో సేంద్రియ ఎరువులను, ఏడు మెట్రిక్ టన్నుల పొడి చెత్తతో డీఆర్సీసీలో రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగిలిన 92 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరుబయట పడేయడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. అందులోనూ ఎక్కువశాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అలాగే కొందరు ఇంటి కోసం వినియోగించిన రంగుల ప్లాస్టిక్ డబ్బాలు, ఇతరత్రా వస్తువులు సైతం ఇస్తున్నారు. ఎండాకాలం కావడంతో వేడిమికి రసాయనిక చర్య జరిగి అవి వెంటనే అంటుకుంటున్నాయి. నిత్యం ఉదయం వేళ వచ్చే పొగతో సమీపంలోని వీరన్నపేట, కోయిల్కొండ ఎక్స్రోడ్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలి కోసం వాకర్స్ కొత్త బైపాస్ వెంట వెళ్దామనుకున్నా అక్కడి పరిస్థితిని చూసి జంకుతున్నారు. మరో డంపింగ్ యార్డు, యంత్రం మంజూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో తాజాగా మహబూబ్నగర్కు మరో డంపింగ్ యార్డు, బయో మైనింగ్ యంత్రం మంజూరయ్యాయి. త్వరలోనే స్థలం సేకరించి అక్కడ ఈ యంత్రాన్ని ఏర్పాటు చేస్తాం. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.పది కోట్లు కేటాయించింది. – పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ ● -
పచ్చిరొట్టతో భూసారం
● ఎరువుల వాడకంపై అవగాహన అవసరం ● రసాయనిక ఎరువులు వాడొద్దు మదనాపురం: పంటలు పండించే రైతులకు ఎరువులపై పరిజ్ఞానం లేక ఆశించిన స్థాయిలో పంట దిగుబడి కావడం లేదు. నేలను బట్టి ఎరువుల వాడకం, భూసారాన్ని మెరుగుపర్చేందుకు మదనాపురం కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నేల స్వభావం పంటలు సాగు చేసే ముందు నేల స్వభావం తెలుసుకోవడం తప్పనిసరి. భూమికి తగిన ఎరువులను వాడితే పంట సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు. నేల బాగుంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. మితిమీరిన రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. నేలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పచ్చిరొట్ట ఎరువులు ఒక దివవ్య ఔషధంలా పనిచేస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారాన్ని పెంపొందించుకోవడానికి రైతులు పచ్చిరొట్ట సాగుపై దృష్టి సారించాలి. పచ్చిరొట్లో పోషకాలు మెండు సాధారణంగా మనం భూమి నుంచి పోషకాలను పంటల రూపంలో తీసుకుంటాం. కాని తిరిగి ఇచ్చేటప్పుడు కేవలం యూరియా డీఏపీ వంటి రసాయనిక ఎరువులకే పరిమితమవుతున్నాం. దీనివల్ల నే లలో సేంద్రియ కర్బనం అడుగంటిపోతోంది. పచ్చిరొట్ట పంటలను పెంచి, అవి పూత దశకు రాకముందే భూమిలో కలియదున్నడం వల్ల నేలకు అపారమైన నత్రజని సేంద్రియ పదార్థం లభిస్తుంది. ఏ పంటతో ఎంత బలం? (ఎకరాకు గణాంకాలు) శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఒక ఎకరాకు సుమారు 12–15 కిలోల విత్తనాన్ని వాడి పచ్చిరొట్ట పంటలు పండిస్తే వచ్చే ఫలితాలు ఇలా.. ● జీలుగ: ఇది నేలకు రారాజు వంటిది. దీనివల్ల ఎకరాకు సుమారు 6 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. చౌడు భూములను బాగు చేయడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ● జనుము: ఇది త్వరగా పెరిగే పంట. దీని ద్వారా నేలకు 5 టన్నుల సేంద్రియ బలం చేకూరుతుంది. ● పిల్లిపెసర: వీటి ద్వారా నేలకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట లభించడమే కాకుండా, భూమి కి అవసరమైన సూక్ష్మ పోషకాలను ఇవి అందిస్తాయి. విత్తే సమయం వర్షాకాలం ప్రారంభంలో లేదా ప్రధాన పంట వేయడానికి కనీసం 50 రోజుల ముందు ఈ విత్తనాలను చల్లుకోవాలి. మొక్కలు విత్తిన 30 నుంచి 40 రోజుల మధ్యలో మొక్క కాండం మెత్తగా ఉండి, పూత దశకు చేరుకునే సమయంలోనే పొలంలో నీరు నిలిపి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి గుల్లబారి, వేరు వ్యవస్థకు గాలి ఆడుతుంది. తదుపరి వేసే వరి లేదా ఇతర పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని 25, 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. రైతులు కేవలం దిగుబడి మీదనే కాకుండా, భూమి ఆరోగ్యం మీద కూడా దష్టి పెట్టాలి. పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల నేలలో మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగి భూమి పునర్జీవం పోసుకుంటుంది. ఇది పర్యావరణానికి, రైతు ఆర్థిక స్థితికి ఎంతో మేలు చేస్తుంది. పాడి–పంట -
ఆర్టీసీ బస్సు ఢీకొని గేదెలు మృతి
మన్ననూర్: శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారి బోరెడ్డిపల్లి బావి అటవీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. పూర్తి వివరాలు.. అమ్రాబాద్ మండలం వటువర్లపల్లికి చెందిన గేదెల మంద అటవీ సమీప ప్రాంతం నుంచి వస్తుండగా శ్రీశైలం నుంచి మన్ననూర్ వైపు వస్తున్న మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గేదెలను ఢీకొట్టింది. ప్రమాదంలో గ్రామస్తుడు రంగినేని అశోక్కు చెందిన మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో రెండు గేదెలు తీవ్రంగా గాయపడినట్లు బాధితుడు తెలిపారు. బస్సును రోడ్డుపైనే ఉంచి డ్రైవర్ పరారీ కావడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ: 2 లక్షల వరకు ఉంటుందని బాధితు లు తెలిపారు. బ్రహ్మగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
అథ్లెటిక్స్పై ఆసక్తి
● పాలమూరు మెయిన్ స్టేడియంలో శిబిరం ● చిన్నారులు, యువతకు ప్రత్యేక శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కోచ్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి స్టేడియం మైదానంలో చిన్నారులు, యువతకు అథ్లెటిక్స్పై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు మొదట వార్మప్ చేయించి రిక్రియేషన్ గేమ్స్(షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, కోన్స్) సాధన చేయిస్తున్నారు. అదే విధంగా యువతకు కూడా అథ్లెటిక్స్ శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని అథ్లెటిక్లు జాతీయ, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందారు. జిల్లా క్రీడాకారులు అథ్లెటిక్స్లోని పలు ఈవెంట్లలో పతకాలు సాధించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. జిల్లా స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన వారిలో చాలా మంది జాతీయ, రాష్ట్రస్థాయి పతకాలు తీసుకొచ్చారు. మరి కొంతమంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించడం విశేషం. ప్రత్యేకంగా హిల్ ట్రైనింగ్ మెయిన్ స్టేడియంలో జరిగే వేసవి అథ్లెటిక్స్ శిక్షణ శిబిరంలో భాగంగా 14 ఏళ్లు దాటిన వారికి ప్రతి శనివారం ప్రత్యేకంగా హిల్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో జిల్లాకేంద్రానికి సమీపంలో ని అయ్యప్పగుట్ట, కల్వరికొండలలో దాదాపు కింద నుంచి పై గుట్ట వరకు యువతకు క్రాస్కంట్రీ ప్రాక్టీస్తో పాటు వార్మప్ చేయిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరికల్: ట్రాక్టర్ను బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి పెద్దచింతకుంట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు దేవరకద్ర మండలం నాగారందాడితండాకు చెందిన కిషన్నాయక్ (45) భార్య శాంతమ్మతో కలిసి ధన్వాడ మండలంలోని మందిపల్లితండాలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి రాత్రి 8 గంటలకు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా పెద్దచింతకుంట సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో కిషన్నాయక్ అక్కడిక్కడే మృతి చెందగా.. భార్య శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో క్షతగాత్రురాలిని చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం మన్ననూర్: నల్లమల లోతట్టు ప్రాంతం, అమ్రాబా ద్ మండలం మన్ననూర్ ఆమ్లేట్ గ్రామంగా ఉన్న మల్లాపూర్ పెంటలో ఆదివారం సాయంత్రం చిగుర్ల చిన్న గంగయ్యకు చెందిన పూరిగుడిసె దగ్ధౖ మెంది. మల్లాపూర్ చెంచుపెంటకు చెందిన చిన గంగయ్య భార్య ఇతర గ్రామానికి వెళ్లగా.. చిన్న గంగయ్య అటవీ ఉత్ప త్తుల సేకరణకు అడవిలోకి వెళ్లా డు. ఇంటి వద్ద ఇద్దరు చిన్నారులు మాత్రమే ఆరుబయట ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో అను కోకుండా ప్రమాదవశాత్తు గుడిసెలో అగ్గి రాజుకొని మంటలు రేగాయి దీంతో పెంటలో ఉన్నవారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకీ వీ లు కుదరకపోవడంతో గుడిసె మంటల్లో పూర్తిగా కాలి బూ డిదైంది. వంటపాత్రలు, తిండి గింజలు, దుస్తు లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు
మహబూబ్నగర్ క్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాముఖ్యతతో తీసుకుంటూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఆ తర్వాత ఆయా సమస్యలపై సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజావాణి అనేది ప్రజల సమస్యలను వినడానికి మాత్రమే కాదని, వాటికి తక్షణ పరిష్కారం చూపడానికి అనే బాధ్యతను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక కుటుంబం, ఒక నమ్మకం ఉంటుందని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీస్ బాధ్యత అని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో కళాం డ్రీం ఫోర్సు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారికి జిల్లా న్యాయ సేవ సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వారి హక్కులను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ అండ్ ప్రొటెక్షన్ స్కీం, మానసికంగా వెనుకబడిన పిల్లలకు న్యాయ సేవల పథకం, తప్పనిసరి విద్యాహక్కు చట్టం వంటి వాటిపై అవగాహన ఉండాలన్నారు. వేరుశనగ @ రూ.7,552 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,552, కనిష్టంగా రూ.4,589 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,259, కనిష్టంగా రూ.6,199, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.5,010, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,992, కనిష్టంగా రూ.5,762, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,559, కనిష్టంగా రూ.1,605, రాగులు గరిష్టంగా రూ.2,777, కనిష్టంగా రూ.2,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,600, మినుములు రూ.7,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,001, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి. -
ఎట్టకేలకు మరమ్మతు
మరమ్మతులు పూర్తి చేస్తాం.... జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాల కు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపు లు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపులు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇనుప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్లో ఉంచారు. మంత్రి పర్యటనతో.. జూరాల గేట్లకు రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు తాజాగా 42 ఇనుప రోప్ల పునరుద్ధరణ ఇది వరకే 10 రోప్లకు కొనసాగుతున్న పనులు ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు -
సమ్మర్ క్యాంపుతో క్రీడల్లో ప్రతిభ
● జిల్లాలో ప్రారంభమైన వేసవి క్రీడా శిబిరాలు ● శిక్షణ పొందుతున్న విద్యార్థులు కందనూలు: విద్యార్థులకు చదువుతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనే సంకల్పంతో వేసవి సెలవుల్లో ఇంటికే పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 10వ తేది వరకు సమ్మర్ క్యాంపులను జిల్లా యువజన క్రీడల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 15 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తుండగా ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఇతర క్రీడలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా అధికారులు తెలుపుతున్నారు. క్రీడలే కాకుండా సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు యోగాపై కూడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపులో తమ క్రీడా ప్రతిభను వెలికితీయడంతోపాటు శారీరక, దృఢత్వాన్ని పెంపొందిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడల్లో నైపుణ్యతను ప్రదర్శించి, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనే విధంగా కోచ్ల హాయంలో శిక్షణ పొందాలి. – సీతారాం, డీవైఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
మండుతున్న డంప్యార్డు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్యార్డులో తరుచుగా అగ్గి రాజుకుంటుంది. అసలే వేసవి కాలం.. ఆపై ఎండ వేడిమికి స్థానిక కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్ యార్డులో చెత్తకు మంటలు అంటుకుంటున్నాయి. మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండవేడికి తోడు డంప్యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ వేడి, ఈదురు గాలులకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంక ద్వారా నిత్యం డంప్యార్డులో మాంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఒకచోటు నీటిని కొడితే మరోచోట మంటలు లేస్తున్నాయి. వేడిగాలులు ఎక్కువగా వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. ఇటీవల మూడుసార్లు ఫైరింజన్లను తర్పించి మంటలు ఆర్పివేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బయో మైనింగ్ చేపడితేనే ప్రయోజనం ముఖ్యంగా అక్కడ తడి, పొడి చెత్త వేరుచేసే పెద్ద యంత్రం లేకపోవడంతో కొన్నేళ్లుగా బయో మైనింగ్ కొనసాగక వ్యర్థాలు చాలా వరకు అలాగే కుప్పలుగా ఉండిపోతున్నాయి. దీనివల్ల డంపింగ్ యార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పాటు పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు గాను 2024 డిసెంబర్ 24న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కలబురగి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని, దాని పనితీరును అప్పటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, గురులింగం, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. ఈ యంత్రం కొనుగోలుకు సుమారు రూ.కోటి వెచ్చించాల్సి వస్తుందని, దీని నిర్వహణ, రవాణా ఖర్చులు భారీగా ఉంటాయని అప్పట్లో అంచనా వేశారు. ఒకవేళ దీనిని ఏర్పాటు చేస్తే నిత్యం 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 90 శాతం వరకు రీసైక్లింగ్ అవుతుంది. దీని ద్వారా వెలువడే యాష్ (బూడిద)ను సైతం సిమెంట్ కంపెనీలకు అమ్మి ఆదాయం సమకూర్చుకోవచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తపాలమూరు డంపింగ్ యార్డులో టన్నులకొద్దీ పోగవుతున్న చెత్త వేసవి కావడంతో తరచూ అంటుకుంటున్న మంటలు ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో ఆర్పివేస్తున్న మున్సిపల్ సిబ్బంది పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమీప ప్రాంత ప్రజలు -
రహదారిపైనే పార్కింగ్!
అడ్డాకుల: జాతీయ రహదారిపై తరుచూ వివిధ రకాల భారీ వాహనాలు నిలుపడటంతో ప్రమాదాలకు కారకులవుతున్నారు. ప్రధాన రోడ్డు పక్కనే ఎక్కువ సంఖ్యలో ఒకేచోట వాహనాలను నిలుపుతున్నారు. అందులో ప్రధాన కూడళ్ల సమీపంలోనే ఇలా వాహనాలను నిలుపుతుండటంతో యూటర్న్ తీసుకునే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రహదారిపై ఒకవైపు ఉండే రెండు వరుసల్లో ఒక వరుసపై ప్రయాణికులను తరలించే క్రమంలో స్టేజీల వద్ద ఆగినప్పుడు ఒకే వరుసలో వాహనాలు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద లారీలను అడ్డుదిట్టడంగా నిలుపుతున్నారు. అడ్డాకుల నుంచి శాఖాపూర్ వైపు వచ్చేచోట టోల్ బూతులు దాటిన వెంటనే భారీ వాహనాలను నిలుపుతున్నారు. టోల్బూతుల నుంచి బయటకు వచ్చే వాహనాలతోపాటు ద్విచక్రవాహనదారులకు తీవ్ర ఆటంకం కల్గుతుంది. కందూరు, మూసాపేట, పోల్కంపల్లి స్టేజీల వద్ద బస్సు షెల్టర్ల ముందు వాహనాలు నిలుపుతున్నారు. రహదారి నిర్వాహకులు స్పందించి రోడ్డు పక్కన వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మొక్కజొన్న కొనకుంటే ఆందోళన
● ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం జడ్చర్ల: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న దిగుబడులను వెంటనే కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొ న్నారు. సోమవారం జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులోని మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పలువురు రైతులు మాజీమంత్రి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. నెలరోజులకుపైగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో తాము రేయింబవళ్లు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చి మొక్కజొన్న మొలకెత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఓ బస్తాలో మొలకెత్తిన మొక్కజొన్నను లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పంటసాగుకు మూడునెలలు పడితే పండిన పంటను అమ్ముకోవడానికి మరో మూడునెలలు పట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు తమది ప్రజాపాలన–రైతుప్రభుత్వంగా చెప్పుకోవడమే తప్పా ఆచరణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు. పంట దిగుబడులను అంచనా వేయకపోవడం, సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, బస్తాలను తరలించక పోవడం తదితర ప్రణాళికలు రూపొదించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక, నాయకులు ప్రశాంత్రెడ్డి, రామ్మోహన్, ఇమ్ము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్ల నుంచి శిక్షణ..
జావెలిన్త్రో, 100 మీటర్ల పరుగు అంశాల్లో ప్రాక్టీస్ చేస్తు న్న. మెయిన్ స్టేడియంలో రెండేళ్ల నుంచి రెగ్యులర్తో పాటు వేస వి అథ్లెటిక్స్ శిబిరంలో పాల్గొంటు న్న. ఇక్కడ శిక్షణ బాగా ఇస్తున్నారు. రెండుసా ర్లు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా పోటీల్లో పాల్గొన్న. పెద్దయ్యాక స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధిస్తా. – అశ్విన్, మహబూబ్నగర్ మొదటిసారి వస్తున్నా.. మా బాబాయ్ సూ చనతో మెయిన్ స్టేడియంలో జరిగే వేస వి అథ్లెటిక్స్ శిబిరంలో మొదటిసారి పాల్గొంటున్న. రన్నింగ్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ స్కూల్ లో సెలక్షన్స్ ప్రతిభ కనబరిచి సీటు సాధిస్తా. – మనోజ్, మహబూబ్నగర్ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తాం... నేను 2007 నుంచి అథ్లె టిక్ కోచ్గా విధు లు నిర్వర్తిస్తున్నాను. అథ్లెటిక్ లో నైపుణ్యం గల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం. డీఎస్ఏ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్లో శిక్షణ అందజేస్తున్నాం. చిన్నారులు, యువకులు అథ్లెటిక్స్పై దృష్టి సారించాలి. శిక్షణ తీసుకుంటే శారీరకంగా చురుగ్గా ఉండవచ్చు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. – సునీల్కుమార్, డీఎస్ఏ అథ్లెటిక్స్ కోచ్ సమ్మర్ క్యాంప్ల నుంచే.. ఆరేళ్ల నుంచి అథ్లెటిక్స్ లో శిక్షణ తీసుకుంటు న్న. మెయిన్ స్టేడియంలో నిర్వహించిన స మ్మర్క్యాంప్ల నుంచే మొదటిసారిగాఅథ్లెటిక్స్లో ప్రవేశించాను. 100 మీ., 400 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేస్తు న్న. ఇప్పటి వరకు మూడుసార్లు రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్టెటిక్స్ పోటీల్లో పాల్గొని మూడు కాంస్య పతకాలు సాధించాను. – వ్రింద యాదవ్, మహబూబ్నగర్ ● -
నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభు త్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్కు వినతి పత్రం అందజేశారు. నాయకులు జలాల్ పాషా, గట్టన్న, బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనీఫా బేగం, లాల్ బి, మహమ్మద్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో అర్జిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదారుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలో దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని, నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ వారం ప్రజావాణికి 116 వినతులు వచ్చాయి. ● కారుణ్య నియామకాలకు సంబంధించి ఖాళీ పో స్టుల వివరాలను మే 10 లోగా పంపించాలని కలెక్ట ర్ తెలిపారు. ఖాళీ పోస్టుల వివరాలను అన్ని శాఖల అధికారులు తమతమ శాఖల్లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఖాళీ పోస్టుల వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీల రోస్టర్ వారీగా నిర్ణీత ఫార్మాట్లో కలెక్టరే ట్ పరిపాలన అధికారికి సమర్పించాలని సూచించా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి బుధవారం దివ్యాంగుల ప్రజావాణి జిల్లాలోని దివ్యాంగుల, వయో వృద్ధుల వెసులుబాటు కోసం ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ ప్రజావాణి ఉంటుందని, దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
అడ్వాన్స్ ఎండోస్కోపితో జీర్ణాశయ క్యాన్సర్ గుర్తింపు
పాలమూరు: అడ్వాన్స్డ్ ఎండోస్కోపి ద్వారా అన్నవాహిక, కడుపు, జీర్ణాశయ పేగుక్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి క్యాన్సర్ను నివారించవచ్చని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సంకల్ప సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీర్ణాశయ క్యాన్సర్పై అవగహన పెంచుకోవడం చాలా ముఖ్యమని, ఎండోస్కోపిలో కొత్తగా వచ్చిన మార్పులతో న్యారో బ్యాండ్ ఇమేజింగ్(ఎన్బీఐ), ఎల్సీఐ, బీఎల్ఐ వంటి టెక్నాలజీ ద్వారా ఇప్పుడు క్యాన్సర్గా మారకముందే వచ్చే ప్రీ క్యాన్సర్ స్టేజీలోనే గుర్తించి సకాలంలో తొలగిస్తే క్యాన్సర్ను నివారించడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి టెక్నాలజీతో కూడిన వైద్యంతోపాటు ఈఆర్సీపీ, ఎంటిరోస్కోపి వంటి సేవలు సంకల్ప ఆస్పత్రిలో అందిస్తున్నట్లు తెలిపారు. కడుపునొప్పి, అజీర్తి, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నవారితోపాటు అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత, మలంలో రక్తపడటం ఇలాంటి సమస్యలున్నవారు తప్పక ఎండోస్కోపి, కొలనోస్కోపి చేసుకోవాలన్నారు. ఐదేళ్లలో మహబూబ్నగర్లో 12వేలకుపైగా గ్యాస్ట్రో కేసులు చికిత్స చేసినట్లు తెలిపారు. కామెర్లు, పిత్తాశయం, పాంక్రియాస్ వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని వీటిని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వడదెబ్బతో పశువుల కాపరి మృతి వీపనగండ్ల: వడదెబ్బతో పశువులు కాపరి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పశువుల కాపరి కుమ్మరి బొడ్డుపల్లి మురళి(45) తండ్రితో కలసి ఆదివారం పశువులను మేపేందకు వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అస్వస్థతకు గురికాగా సోమవారం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడు వడ్డదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విశాదం అలుముకుంది. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు పురస్కరించుకొని సోమవారం వడ్మెమాన్ రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అందుకు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులు తమ పంటల దిగుబడిని పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా శాస్త్రవేతలు, వ్యసాయ అధికారులే రైతుల ముంగిట్లోకి వచ్చి వారి సలహాలు, సూచనలు ఇచ్చేవిధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో డీఏఓ వెంకటేష్, శాస్త్రవేతలు అర్చన, కల్యాణి, ఏఓ రాజేష్ఖన్నా, ఎంపీడీఓ లక్ష్మీనర్సింహులు, తహసీల్దార్ ఎల్లయ్య, సర్పంచ్ ఈశ్వర్సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
అమరచింత:పిన్నమ్మ మందలించిందనే కారణంతో యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసు కున్న ఘటన మండలంలోని సింగంపేట గ్రామంలో సోమవారం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన నరహరి (20) పదో తరగతి అనంతరం ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో తన పిన్నమ్మతో సోమవారం ఉదయం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపంతో పొలానికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. స్థానిక రైతులు గమనించి ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. చెట్టును ఢీకొని యువకుడి దుర్మరణం భూత్పూర్: మున్సిపాలిటీలోని గోప్లాపూర్ సమీపంలో చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొత్త మొల్గర గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తమొల్గరకు చెందిన జో గు మల్లేష్ (22) ఆదివారం రాత్రి ఇంట్లో భోజ నం చేసి 10:30 గంటల ప్రాంతంలో గ్రామసమీపంలో వరి కల్లం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. సోమవారం ఉదయం ఎంతకూ రాకపోగా తల్లిదండ్రులు ఫోన్ చేసినా రింగ్ అవుతున్నా.. ఎత్తడం లేదు. వరి కల్లం వద్ద చూసినా కన్పించలేదు. గోప్లాపూర్ సమీపంలో గొర్ల కాపారులు గొర్రెలను మేపుతుండగా వ్యక్తి మృతిచెందిన విషయాన్ని గమనించి గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మల్లేష్ వేగంగా వచ్చి చెట్టును ఢీ కొనగా.. ద్విచక్రవాహనాం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. యువకుడు తల భాగం చెట్టుకు తగలడంతో చెవుల నుంచి రక్తం కారడంతో మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్లో గుండెపోటుతో వ్యక్తి మృతి రాజాపూర్(బాలానగర్): గుండెపోటు వచ్చి సృహతప్పిన వ్యక్తిని సీపీఆర్ చేసి ఊపిరిపోసేందుకు ప్రయత్నించిన బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ ప్రయత్నం ఫలించలేదు. చిన్నరేవల్లికి చెందిన ఎల్లారెడ్డి(60) సోమవారం బాలానగర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ వద్దకు పనిపై వచ్చి బ్యాంకు వద్ద గుండెపోటు వచ్చి సృహతప్పి పోయాడు. వెంటనే విషయం తెలిసిన బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసిన వెంటనే ఆస్పత్రికి తరలించిన ఆ వ్యక్తి ప్రాణాలు మాత్రం దక్కలేదు. మానవత్వంతో మోసుకెళ్లి వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషిచేసిన ఎస్ఐని అక్కడున్నవాళ్లు శభాష్ అంటూ కితాబిచ్చారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మహమ్మదాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆగ్రహంతో సోమవారం రైతులు రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, బీజేపీ నాయకుడు తిరుపతిరెడ్డి మద్దతు పలికి..రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీఎం నిమ్మల నిర్వాహకులతో మాట్లాడి తూకం వేయించడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా.. కొనుగోలు కేంద్రంలో ఓ మహిళా రైతుకు సంబంధించిన నాలుగు బస్తాల ధాన్యం చోరీకి గురికావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ధర్మ పరిరక్షణ కోసం సంఘటితమవుదాం
స్టేషన్ మహబూబ్నగర్: సనాతన ధర్మపరిరక్షణ కోసం సంఘటితమవుదామని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు రాధామనోహర్దాస్ స్వామి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రం బండ్లగేరిలోని శ్రీరుక్మిణి పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధా మనోహర్దాస్ స్వామిజీ ప్రసంగించారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సమ్మేళనంలో ముఖ్య వక్తలుగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్, సామాజిక కార్యకర్త భార్గవి కల్యాణి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమ్మేళనంలో హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ ప్రతినిధులు జోషి సంతోషాచార్యులు, నరేష్కుమార్తోపాటు పలువురు ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అమ్రాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి పదర మండలం ఇప్పలపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేతావత్ పీక్లానాయక్ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పదరా పీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వ్యక్తం చేసి అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్యాంగ్ రేప్ ఘటనలో ఇద్దరి రిమాండ్ మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో కలకలం రేపిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మూడురోజుల కిందట పరిగి నియోజకవర్గ పరిధిలో ఓ మండల కేంద్రానికి చెందిన 9వ తరగతి చదువుతూ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఇద్దరూ కలిసి హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీప అటవీ ప్రాంతాంలోకి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడున్న ఇద్దరు యువకులు వాహనంపై వారిని అనుసరించి అడవి లోపలికి వెళ్లిన తర్వాత ఇద్దరిని బెదిరించి రూ.6500ఆన్లైన్ ద్వారా వేయించుకున్నారు. అనంతరం ఇద్దరు యువకులు కలిసి ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులపై పోక్సో యాక్ట్తో పాటు గ్యాంగ్రేప్ బీఎన్ఎస్ 70క్లాజ్(2) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గతంలో అనేక ఘటనలు నవాబ్పేట మండలంలోని ఫతేపూర్ అటవీ ప్రాంతంలో కూడా చాలా మంది ప్రేమికులు ఒంటరిగా అడవిలోకి వెళ్లినప్పుడు దాడులు చేసి వారి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, బాలికలు, అమ్మాయిలపై లైంగికదాడి చేసినా.. చాలా వరకు వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయి. నవాబ్పేట మండలంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలపై అడవుల్లో సంచారిస్తూ ప్రేమికులపై దాడులకు పాల్పడుతుంటారు. అదేవిధంగా హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీపంలో ఉన్న అడవిలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని జూరాల కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది ప్రాణాలు కాపాడి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాతూర్కు చెందిన హర్షద్ కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్నారు. భోజనం తయారు చేసుకోవడానికి మార్గమధ్యలో పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి శివారులోని జూరాల కాల్వ దగ్గర ఆగారు. కుటుంబసభ్యులు వంట చేసుకుంటూ ఉండగా హర్షద్ జూరాల కాల్వ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో పిట్స్ రావడంతో కాల్వలో పడిపోయాడు. కాల్వలో ఏదో కదులుతుందని స్థానికులు గమనించి 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఖాజా, మాసుంబాబా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాల్వలోకి దిగి ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బందికి హర్షద్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిప్రమాదంలో రూ. 1.50లక్షల నష్టం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు ప్రార్థన మందిరంలోని స్టోర్ రూంలో షార్టు సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. నిర్వాహకుల కథనం మేరకు.. పట్టణంలోని మోమిన్మహాల కాలనీ సమీపంలోని పార్థన మందిరంలోని స్టోర్ రూంలో ఆదివారం సాయంత్రం షార్టు సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వంట సామగ్రి, సరుకులు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా ద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రామాజిపల్లిలో రెండు తలల మేకపిల్ల జననం బల్మూర్: మండలంలోని రామాజిపల్లిలో ఓ విచిత్ర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ బక్కమ్మ మేక రెండు తలల మేకపిల్లను ఈనింది. ఈ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల తెలియడంతో ప్రజలు వచ్చి ఆసక్తిగా గమనించారు. ఇదిలా ఉండగా జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని పశువైద్యాధికారి తెలిపారు. -
ముగిసిన అంజన్న బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాల నడుమ ఆంజనేయస్వామిని ఆలయం నుంచి పల్లకీలో కృష్ణానది వరకు ఊరేగించారు. అర్చకులు పవిత్ర కృష్ణానదిలో వేదమంత్రాల నడుమ బీచుపల్లి రాయుడికి అమృతస్నానాన్ని వైభవంగా చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు మారుతీచారి, సందీప్చారి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. -
భవిష్యత్కు వేదిక బాలకేంద్రం
● బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం ● మూడు అంశాల్లో ప్రత్యేక తార్ఫీదు ● ప్రతిరోజూ హాజరవుతున్న వందలాది మంది విద్యార్థులు విశేషమైన స్పందన లభిస్తుంది. బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. మూడు అంశాల్లో వందలాది మంది విద్యార్థులు, చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. – రాజేష్ ఖన్నా, పర్యవేక్షకుడు, బాలకేంద్రం, మహబూబ్నగర్ -
ఇక్కడే నేర్చుకున్నా.. ఇక్కడే శిక్షణ ఇస్తున్నా..
రెండేళ్ల నుంచిడ్రాయింగ్లో శిక్షణ . చిత్రాలు గీయడం అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో చిత్రాలు గీయడం ప్రాక్టీస్ చేసేవాడిని. కొన్నిసార్లు పాఠశాలో జరిగిన చిత్రలేఖన కాంపిటేషన్లో పాల్గొన్న. రెండేళ్ల నుంచి బాలకేంద్రంలో చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంటున్నాను. – హార్దిక్, మహబూబ్నగర్ శిక్షణ బాగుంది. గతేడాది నుంచి వేసవి సెలవుల్లో బాలకేంద్రంలో శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ చాలా చక్కగా శిక్షణ బాగుంది. మేము చేసే తప్పులు సరిచేయడంతో పాటు చిన్నచిన్న మెళకువలతో నృత్యం బాగా చేయగలుగుతున్నాం. – సాత్విక, మహబూబ్నగర్ 2002 నుంచి 2010 వరకు బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నా.. 2016 నుంచి వేసవి సెలవుల్లో ఇక్కడే కూచిపూడిలో విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్న. నేను కూచిపూడి నృత్య కళాకారిణిగా ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చాను. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్టతో పాటు హైదరాబాద్లోని రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. – దివ్యశ్రీ, కూచిపూడి డాన్స్ మాస్టర్ ఐదేళ్ల నుంచి వేసవిలో బాలకేంద్రంలో కూచిపూడిలో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి అనంతరం మిగతా రోజుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను.కూచిపూడి నృత్యంలో ఉన్నతస్థాయికి చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న. గతేడాది హైదరాబాద్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న. – అభిఘ్న, మహబూబ్నగర్ శిక్షణ తర్వాత మిగతా రోజుల్లో ప్రాక్టీస్ -
బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
అచ్చంపేట: అమ్రాబాద్ మండలం పరిధిలోని శ్రీశైలం రహదారిలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపిన వివరాలు.. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసముంటున్న రక్షిత్ కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును దోమలపెంటకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్టెక్ చేయబోయి ఢీకొట్టారు. ప్రమాదంలో కారులో ఉన్న జగదాంబ (55) అక్కడికక్కడే మృతి చెందగా, క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవింగ్ సీటులో ఉన్న రక్షిత్ (40) మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 13, 14 తేదీల్లో బ్యాడ్మింటన్ పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు కమ్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, 13, 15, 17, 19 బాల, బాలికలు, పురుషులు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 11లోగా పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 98480 85211, 98669 28835లను సంప్రదించాలని కోరారు. -
అయిజ టు గట్టు
● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు ● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం గట్టుకు తాకింది. ఇక్కడి పైరవీకారులు కొందరు ఏకంగా అయిజలో పట్టుబడిన ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా నకిలీ పత్రాలతో వ్యవహారాలను కొనసాగించినట్లు సమాచారం. అయిజకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ను గట్టు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని నకిలీ పత్రాల సృష్టికి కేంద్రంగా మార్చుకుని వ్యవహారాన్ని కొనసాగించినట్లు తెలిసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని వాటితో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులు పెద్దఎత్తున లబ్ధి పొందేలా చేసి.. వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసులు కూపీ లాగుతున్నారు. 18 స్టాంపుల గుర్తింపు.. అయిజ ప్రింటింగ్ ప్రెస్లో గట్టు మండలానికి సంబంధించి 18 స్టాంపు (ముద్ర)లను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎం ముద్రలు ఉన్నట్లు గుర్తించారు. పైరవీకారుల ద్వారానే నకిలీ పత్రాలతో సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబీమా, కల్యాణలక్ష్మి, భూభారతి పొర్టల్కు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి, వాటి ద్వారా పెద్దఎత్తున లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఇందువాసి గ్రామంలో కొద్దిరోజుల క్రితం భూ యజమానికి వారసులు ఉన్నప్పటికీ వేరే వ్యక్తి తానే వారసుడినని తప్పుడు ధ్రువీకరణ పత్రంలో భూ బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. రైతుబీమా పరిహారంలోనూ నకిలీ ధ్రువీకరణ పత్రాలను జత చేసి, ప్రభుత్వ సొమ్మును పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి పథకంలో ఓ గ్రామంలో నలుగురు పిల్లలున్న వారికి కల్యాణలక్ష్మి చెక్కును పైరవీకారుడు ఇప్పించినట్లు సమాచారం. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను అయిజ ప్రింటింగ్ ప్రెస్లో సృష్టించుకుని పెద్దఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం బయటకు పొక్కడంతో విషయం తెలుసుకున్న కొందరు పైరవీకారులు తమ దగ్గర ఇంకా దాచుకున్న పత్రాలను తారుమారు చేసి జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అనేక వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, నకిలీ దందాను పూర్తిగా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
శిక్షణ అంశాలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని బాలకేంద్రం వేసవి శిక్షణ శిబిరాలకు వేదికగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి బాలకేంద్రంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, విద్యార్థులకు సాంస్కృతిక అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. గతనెల 25వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే ముగింపు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. శిక్షణలో తాము నేర్చుకున్న అంశాలను ఈ ముగింపు వేడుకల్లో విద్యార్థులు చక్కగా ప్రదర్శిస్తున్నారు. బాలకేంద్రంలో శాసీయ్త్ర నృత్యం, గాత్ర సంగీతం, చిత్రలేఖనం అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్యంలో భాగంగా కూచిపూడి దివ్యశ్రీ, భరత నాట్యం హైందవి, జానపద నృత్యం సురేందర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. చిత్రలేఖనం రాజేష్ ఖన్నా, గాత్ర సంగీతం రాధిక శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్య శిబిరంలో దాదాపు 200 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో 150 మంది, గాత్ర సంగీతంలో 50 మంది చిన్నారులు హాజరవుతున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. బాలకేంద్రాన్ని భవిష్యత్లో బాలభవన్గా అప్గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు సమకూరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలకేంద్రంలో ఎక్కువ మంది శిక్షకులు నియమితులవుతారని, సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు బాల కేంద్రాన్ని బాలభవన్గా అప్గ్రేడ్ చేసేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చిత్రలేఖనం శిబిరంలో చిత్రాలు గీస్తున్న చిన్నారులు బాలభవన్గా అప్గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు.. -
పంట మార్పిడితో.. భూమికి ఆరోగ్యం
పంట మార్పిడి చేసే సమయాల్లో అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుంది. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజి, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయచిక్కుడు వేయకూడదు. అలంపూర్ : ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తే చీడపీడల తాకిడి అధికమవుతుంది. భూమి సైతం నిస్సారంగా మారుతుంది. అదే పంట మార్పిడి చేస్తే పంటకు చీడపీడల వ్యాప్తి తగ్గించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ సూచిస్తున్నారు. తరచూ పంట మార్పిడి చేయడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు భూమి సారవంతమవుతుందని పేర్కొంటున్నారు. ఎంపికలో జాగ్రత్తలు : పంట మార్పి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పైరును ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేలలోని పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న వంటి పంటలకు బదులుగా భూమికి పోషకాలను గ్రహించే సమకూర్చే అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్నీ రాల్చి భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. ఆపరాల పైరుల మీద ఉండే బూడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య జరగడం వలన ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయచిక్కుడు వేసుకుంటే పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తోంది. ఇలా చేసుకోవచ్చు......! రబీలో వేరుశనగ వేసుకునే రైతులు తర్వాత వచ్చే ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పైర్లను వరుసగా వేస్తే కాయ తొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మొట్ట వరి వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగ పొద్దుతిరుగుడు సాగు చేసే వారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. ఉల్లి సాగు చేసే వారు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒక సారి పసుపు సాగు చేస్తే మళ్లీ రెండేళ్ల పాటు సాగు చేయకపోవడం మంచిది. వరి, చెరకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలపైన ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందువల్ల చీడ పీడలు ఆశించని పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరిని వరుసగా సాగు చేయకుండా వరి తర్వాత పప్పు ధాన్యాలు లేదా నునెగింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజి, పంటల్ని ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ఉత్తమం. పాడి–పంట -
ధాన్యం.. దైన్యం
ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం –8లో uఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. సన్నాలకే మొగ్గు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కొ .కేం : కొనుగోలు కేంద్రాలుజిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు.. జిల్లా సాగు మొత్తం ప్రారంభించిన కొనుగోలు లక్ష్యం ఇప్పటి వరకు (ఎకరాల్లో) కొ .కేం కొ .కేం (మె.టల్లో) కొన్నవి (మె.టల్లో) మహబూబ్నగర్ 2,01,883 174 174 2,30,000 4,495 వనపర్తి 2,06,348 408 287 3,75,000 5,000 నారాయణపేట 1,90,000 160 160 2,44,813 25,810 నాగర్కర్నూల్ 1,69,128 200 180 2,00,000 70 జో. గద్వాల 66,320 76 76 1,00,000 800 మొత్తం 8,33,679 1,018 877 11,49,813 36,175 సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు -
మరో రెండు రోజుల్లో..
జడ్చర్లలో ముగియనున్న మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం● ఐదేళ్లలో ఇద్దరు చైర్పర్సన్లు, నలుగురు కమిషనర్ల మార్పు ● అవినీతి, అక్రమాల చుట్టే సాగిన పాలన ● అంతంత మాత్రంగానే అభివృద్ధి ● ఎన్నికల నిర్వహణపై స్పష్టత కరువు జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం జడ్చర్ల: బాదేపల్లి, కావేరమ్మపేట మేజర్ పంచాయతీలను కలిపి మొదటిసారిగా ఏర్పడిన జడ్చర్ల మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ నెల 6న ముగియనుంది. జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంగా ఉన్నా గతంలో పంచాయతీలుగా కొనసాగుతున్న జంట పట్టణాల్లో నిధుల లేమి, తదితర అనేక కారణాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని.. రెండు పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా మారిస్తే నిధులు పెరిగి.. అభివృద్ధి చెందుతుందన్న సదుద్దేశంతో ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు కూడా మున్సిపాలిటీగా ఆవిర్భవిస్తేనే అభివృద్ధి పరుగు పెడుతుందని భావించారు. అనేక ఆటుపోట్ల మధ్య ఏర్పడిన మున్సిపాలిటీకి 2021 ఏప్రిల్ 30 పోలింగ్, మే 7న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆది నుంచి ఆరోపణలే.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పుర పాలకవర్గంపై పట్టణవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారిగా ఏర్పడిన పాలకవర్గం ఆదర్శంగా సేవా దృక్పథంతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, పాలకవర్గం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుంది. నాటి నుంచి నేటి వరకు అవినీతి అక్రమాల చుట్టే పాలన కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలక మండలి సభ్యులు ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు వచ్చాయి. అంతేగాక వ్యక్తిగత పైరవీలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ఎంతవరకు అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగపడే స్థాయికి వెళ్లింది. ఇద్దరు చైర్పర్సన్లు జడ్చర్ల మున్సిపాలిటీకి ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగారు. మొత్తం 27 వార్డులలో బీఆర్ఎస్ 23 వార్డులు గెలిచి చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులను దక్కించుకున్నారు. అయితే చైర్పర్సన్గా ఉన్న దోరెపల్లి లక్ష్మిని అనూహ్యంగా సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి తొలగించారు. తర్వాత అదే పార్టీకి చెందిన సభ్యురాలు పుష్పలత చైర్పర్సన్గా ఎన్నికై నా ఆమె తదుపరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం విశేషం. అదేవిధంగా మొదటి పాలకవర్గంలో నలుగురు కమిషనర్లు విధులు నిర్వహించారు. వీరంతా పాలకవర్గం కనుసన్నల్లో పనిచేయని కారణంగానే బదిలీలు జరిగాయన్న ప్రచారం సాగింది. వీడ్కోలుకు రూ.లక్ష కేటాయింపు.. మున్సిపాలిటీ పాలక మండలి సభ్యుల పదవీకాలం ముగియడంతో వీడ్కోలు నిర్వహించేందుకు రూ.లక్ష కేటాయించారు. ఓ శాలువా కప్పి వీడ్కోలు సందర్భంలో కూడా ప్రజల డబ్బును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న అపవాదును పాలకమండలి సభ్యులు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు పాలకమండలి సభ్యులు సైతం రూ.లక్ష కేటాయింపు సరైంది కాదని పేర్కొనడం గమనార్హం. పాలకమండలి గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. గడువు ముగియడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా.. ఆలస్యం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆలోచనలు ఏమిటన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే వెలువడిన రిజర్వేషన్లు నిజమైనా.. మళ్లీ మార్పు ఏమైనా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైర్మన్ స్థానాన్ని జనరల్కు కేటాయించడంతో అన్ని వర్గాల వారు ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇక వార్డుల రిజర్వేషన్లకు కూడా అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో పలువురు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్లో ఎంతమంది సిట్టింగ్లకు టికెట్లు దక్కుతాయని అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైనా స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 6న పాలక మండలి సభ్యులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశాం. ఇందుకోసం రూ.లక్ష కేటాయించాం. జ్ఞాపికలతోపాటు శాలువా, పూలమాలలతో సభ్యులను సన్మానించి వీడ్కోలు పలికే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. గడువు ముగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. – లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల -
నేటినుంచి రైతు వారోత్సవాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు సోమవారం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం– ప్రకృతి వ్యవసాయం, మంగళవారం ఉద్యాన పంటలు, ఆయిల్పాం విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు, బుధవారం బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు– ఎఫ్పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, గురువారం వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు– పీఎం కుసుం వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్, శుక్రవారం పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు– వేసవిలో పశు సంరక్షణ, మత్స్య శాఖ ద్వారా చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, నీటిపారుదల శాఖ ద్వారా సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎతిపోతల పథకాల మరమ్మతు, కాల్వల్లో కంపచెట్లు గుర్రపు డెక్క తొలగింపు, శనివారం నీటిపారుదల శాఖ ద్వారా చెరువులలో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వాములు చేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. -
నీట్గా రాశారు..!
● జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష ● 11.30 గంటల వరకే అనుమతించిన అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. పర్యవేక్షించిన ఎస్పీ, అదనపు కలెక్టర్ జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ సిబ్బందితోపాటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూశారు. ప్రత్యేకంగా సిబ్బంది విద్యార్థులకు సెంటర్ అడ్రస్ చెప్పడంతోపాటు అత్యవసరమైన విద్యార్థులను కేంద్రాలకు చేర్చారు. పీయూలోని పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హరిప్రియ తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంవీఎస్, ప్రభుత్వ మోడల్ బేసిక్ పాఠశాలల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
గన్నీ బ్యాగులు ఇవ్వలేదు..
ఏడెకరాల ధాన్యం ఆరపెట్టి 15 రోజులు అవుతుంది. ఇంత వరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. మా గ్రామానికి 10 వేల బస్తాలు వస్తే కొంతమంది రైతులకు మాత్రమే ఇచ్చారు. మిగతా రైతులు బస్తాలు అడిగిన ప్రతిసారి ధాన్యం తరలించేందుకు లారీలు వస్తలేవు.. అందుకే బస్తాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అకాల వర్షాలు వచ్చి ఆరిన ధాన్యం తడిస్తే తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలి. తర్వగా గన్నీ బ్యాగులు అందజేసి ధాన్యం తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి. – విష్ణుకాంత్రెడ్డి, రైతు, పూసల్పహాడ్, మరికల్ ● -
ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా..
కొనుగోలు కేంద్రానికి ఐదురోజుల క్రితం ధాన్యం తెచ్చినా ఇప్పటికీ కొంటలేరు. ఇక్కడ గతంలో ఐకేపీ వారు ఏర్పాటు చేయగా.. ఈసారి ఈసారి పీఏసీఎస్ చేస్తుందని చెబుతున్నా.. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రమే ప్రారంభించ లేదు. ఇప్పటికే చాలామంది వరి ధాన్యాన్ని తీసుకొచ్చారు. సకాలంలో కొంటే డబ్బులు త్వరగా వస్తాయి. వర్షం వస్తే చేతికొచ్చిన ధాన్యం పాడవుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద నీడ లేదు. తాగడానికి నీరు కూడా లేదు. – దండె రాములు, రైతు, వెన్నాచేడ్, గండేడ్ మండలం -
కేంద్ర మాజీమంత్రి డాక్టర్ మల్లికార్జున్కు అంతర్జాతీయ గౌరవం
స్టేషన్ మహబూబ్నగర్: మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మల్లికార్జున్కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇటలీలోని బొలోనియాలో ఉన్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్) క్యాంపస్లో కొత్తగా నిర్మించిన టెర్రస్కు ‘డాక్టర్ మల్లికార్జున్ టెర్రస్శ్రీగా ఆయన జ్ఞాపకార్థం పేరు పెట్టారు. ఈ టెర్రస్ను ఎస్ఏఐఎస్ యూరప్ క్యాంప్ భవన నిర్మాణ విస్తరణలో భాగంగా నిర్మించారు. డాక్టర్ మల్లికార్జున్ 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితంలో ప్రవేశించారు. రెండుసార్లు మెదక్ లోక్సభకు, నాలుగు సార్లు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రక్షణ, రైల్వే వంటి కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ప్రపంచస్థాయి వైద్య పరిశోధనలో ముందంజలో ఉన్న జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ వంటి సంస్థ ఆయనకు ఈ గౌరవాన్ని అందించడం విశేషం. డాక్టర్ మల్లికార్జున్ కుమారుడు మను మల్లికార్జున్ ఎస్ఏఐఎస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ పూర్తి చేశారు. క్యాంపస్లో జరిగిన ఫలాకావిష్కరణ కార్యక్రమంలో ఎస్ఏఐఎస్ యూరప్ రెక్టర్ రెనోడ్ డెహౌస్ సమక్షంలో మను మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు ● అధికారుల సమీక్షలో కలెక్టర్ ఖష్బూగుప్తా ● జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 4,214 మంది విద్యార్థులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష (నీట్)ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 12 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జామర్లు, బయో మెట్రిక్ హాజరు వ్యవస్థలను ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా నిర్ధారించుకోవాలని తెలిపారు. అలాగే కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల తనిఖీ కోసం అవసరమైన బ్యాక్ అప్ ఏర్పాట్లును కూడా చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, తరగతి గదుల్లో అభ్యర్థులు సరిపడా కుర్చీలు, టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్శాఖ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ను అన్ని కేంద్రాల్లో ఉదయం 9.30 గంటలలోగా సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారికి సూచించారు. వైద్యశాఖ అధికారులు కేంద్రాలలో మెడికల్ క్యాంపులో మందులు, ఓఆర్ఎస్ పాకెట్ల ను అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎక్కువ బస్సులు నడిపేలా చూడా లని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, జిల్లా నీట్ నోడల్ అధికారి వై.సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో మొత్తం 4,214 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 25 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉండగా, వారికి అదనంగా ఒక గంట సమయం ఇచ్చి సాయంత్రం 6.00గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షలను సజావు గా నిర్వహించేందుకు 372 మంది ఇన్విజిలేటర్లును, 13 మంది పరిశీలకులు నియమించారు. అభ్యర్థులకు సూచనలు.. అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఆభరణాలు, పెన్సిల్లు, పెన్నులు, అనుమతి లేని ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. పరీక్ష కేంద్రాల్లోనే అభ్యర్థులకు పెన్నులు అందజేస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకొని రావాలి. నిర్ణీత డ్రెస్ కోడ్ను పాటిస్తూ, ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలి. -
చెరువులను రక్షించేలా..
మహబూబ్నగర్ న్యూటౌన్: చెరువుల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చిత్తడి నేలల సర్వే నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ అంచనా ప్రకారం అడవుల కంటే మూడురెట్లు వేగంగా చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయనే నివేదికల ఆధారంగా చెరువుల పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది. వాతావరణ సమతుల్యత ప్రధానాంశంగా అంతరించిపోతున్న పక్షి జాతులను, జంతు జాతులను కాపాడటమే లక్ష్యంగా ఈ సర్వేను చేపడుతున్నారు. జిల్లాలోని 489 చెరువుల్లో చిత్తడి నేలల సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చెరువు శిఖం సర్వే నంబర్లతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా చేపట్టే ఈ సర్వే మ్యాపులను జియో మ్యాపింగ్ చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా కాలక్రమేనా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలగడంతో పాటు జీవ వైవిధ్యం, నీటి నాణ్యత, నేలల ఆరోగ్యాన్ని కొలవడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. జిల్లాలో అటవీశాఖ, నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, పర్యావరణ శాఖల సమన్వయంతో చిత్తడి నేలల సర్వేను చేపడుతున్నారు. చెరువుల పరిరక్షణతో పాటు మత్స్యసంపద పెంపు, జంతు జాతులు, పక్షి జాతులను కాపాడేందుకు ఈ చిత్తడి నేలల సర్వే ఉపయోగపడతాయి. అలాగే చెరువుల ఆక్రమణను నియంత్రించేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు కలుగనుంది. ఆక్రమణలకు చెక్... చెరువుల్లో శిఖం భూముల ఆక్రమణపై అధికారులకు తరచుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. చిత్తడి నేలల సర్వే ద్వారా చెరువు భూముల ఆక్రమణలకు చెక్ పెట్టనున్నారు. చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీతలు, కాల్వలు, తూములు, అలుగు మరమ్మతులు వంటి వాటిపైనే ఇప్పటివరకు దృష్టి సారించగా.. ప్రస్తుతం ఆక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. చెరువుల్లోని చిత్తడి నేలల సర్వే ద్వారా అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటంతో పాటు పర్యావరణంలోని సహజ వనరులను పెంపొందించేందుకు ఆస్కారముంటుంది. చిత్తడి నేలల ఉపయోగాలు.. సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. ఔషధ గుణాలున్న మొక్కల ఎదుగుదలకు చిత్తడి నేలలు ఉపయోగపడుతాయి. రసాయనిక, జెనెటిక్ పదార్థాలను ఇముడ్చుకొని నేలను సారవంతం చేస్తాయి. అత్యధిక జీవరాశులకు చిత్తడి నెలలు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి. ఎక్కువకాలం నీటి నిల్వకు, భూగర్భంలో నీటి శాతాన్ని పెంచేందుకు చిత్తడి నేలలు దోహదపడుతాయి. సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు చిత్తడి నేలలు నిలయాలుగా ఉంటాయి. ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం సర్వేలు నిర్వహించి మ్యాపులను సిద్ధం చేస్తున్న యంత్రాంగం జియో మ్యాపింగ్ చేయడం ద్వారా సత్ఫలితాలు అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటమే లక్ష్యం జిల్లాలోని 489 చెరువుల్లో కొనసాగుతున్న చిత్తడి నేలల సర్వే -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడం చాలా అవసరం అని, ప్రధానంగా కోర్టు విచారణలో ఉన్న కేసులు ఆలస్యం కాకుండా శిక్షలు పడేవిధంగా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ అధికారులతో పాటు కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణ కేసుల్లో సాక్ష్యులను సమయానికి హాజరుపరచడం, వారితో సమన్వయం కొనసాగించడం, చార్జీషిట్లను సకాలంలో కోర్టుకు అందించాలని సూచించారు. ప్రతి కేసులో ఫాలోఅప్ చర్యలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, కోర్టు తేదీలను కచ్చితంగా ట్రాక్ చేయాలన్నారు. సాక్ష్యుల హాజరు విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు పనుల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుందని, ప్రతి అధికారి తమ విధులను క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కోర్టు లైజన్ అధికారులు, డ్యూటీ అధికారులు పోలీస్స్టేషన్–కోర్టుల మధ్య సమన్వయం బలోపేతం చేయాలన్నారు. అవసరం అయిన పత్రాలు, చార్జిషీట్లు, సాక్ష్యాధారాలు సమయానికి అందేలా టెక్నాలజీ వినియోగంతో కేసుల ప్రగతిని సమీక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ సీఐ నర్సింహులు పాల్గొన్నారు. -
జీవనోపాధి కావాలి..
ఏళ్లుగా అడవిని నమ్ము కుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాల ని అంటున్నారు. ప్రభు త్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నా రు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామ ని, జీవనోపాధి కల్పిస్తా మని చెబుతున్నారు. పరిహారంతో పాటు పిల్లల చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మై దాన ప్రాంతాలకు రీలొకేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
అడవి ‘బయటికి’ బిడ్డలు
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు -
బాధ్యతలు స్వీకరించిన జడ్జి
పాలమూరు: జిల్లా కోర్టు మూడవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా ఆర్.అనిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మారెడ్డి, కోశాధికారి రాజుగౌడ్ ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవం వేసవి శిబిరం ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రెయిన్బో హైస్కూల్ ఆవరణలో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలోత్సవ్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ వేసవి శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సమస్య అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే అతి స్వల్ప రిజిస్ట్రేషన్ ఫీజుతో ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంమోహన్రావు సూచించారు. నృత్యకళాకారుడు అజీమ్ నేతృత్వంలో వెస్ట్రన్స్ డాన్స్, చిత్రకారుడు వేణు చిత్రలేఖన శిక్షణను అందించనున్నారు. కార్యక్రమంలో వీరాంజనేయులు, ప్రమోద్, భరత్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,162 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,162, కనిష్టంగా రూ.4,169 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.6,059, పెబ్బర్లు రూ.4,350, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,942, కనిష్టంగా రూ.5,842, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,570, కనిష్టంగా రూ.1,701, హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,600 ధరలు పలికాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,339, కనిష్టంగా రూ.1989, హంస ధాన్యం గరిష్టంగా రూ.1.771, కనిష్టంగా రూ.1,739గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
3 నెలలకోసారి ఉద్యోగ మేళాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ● ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ● 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు -
ఇక తెలంగాణపైనే ప్రధాని ఫోకస్
పాలమూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చి.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీనికి ఉమ్మడి జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అస్సాం, పాండిచ్చేరి పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్థానాలు పెంచుకోబోతున్నామని, ఈ ఎన్నికలు ముగించుకొని ప్రధాని తెలంగాణలో అడుగుపెడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రధాని తెలంగాణపైనే ఫోకస్ పెట్టనున్నట్లు, ఆయన రాక దీనికి ఒక సంకేతం ఇస్తుందన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, దేశంలో 12 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రీయల్ కారిడార్ మంజూరు చేస్తే అందులో ఒకటి తెలంగాణలోని జహీరాబాద్కు కేటాయించారన్నారు. గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు ఫోర్లైన్ జాతీయ రహదారి రూ.3,175 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని దీనిని కూడా ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, కట్టా సుధాకర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, హరికృష్ణ, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కులు, చట్టాలపై అవగాహన
పాలమూరు: కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి.ఇందిర ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో మొబైల్వ్యాన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, కార్మిక చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు తమ హక్కులను తెలుసుకొని అవసరమైనప్పుడు న్యాయ సేవలను పొందాలని సూచించారు. ప్రతి కార్మికుడు తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. ‘నీట్’కు భారీ భద్రత ● ట్రాఫిక్ నియంత్రణ చర్యలు :ఎస్పీ జానకి మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా అన్ని కేంద్రాల దగ్గర పటిష్ట పోలీస్ బందోబస్తుతోపాటు 163బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండరాదన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలకు జడ్చర్లలో ఒకటి, పాలమూరులో 11 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, వీటి పరిధిలో పెట్రోలింగ్తోపాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక నిఘా బృందాలు పరీక్ష కేంద్రాలపై దృష్టిపెట్టడం జరుగుతుందన్నారు. పోలీస్ యాక్టు అమలు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు 30(ఎ)పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీటీంకు 18 ఫిర్యాదులు జిల్లాలో ఏప్రిల్ నెల రోజుల్లో షీటీం పోలీసులకు 18 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. రెండు కేసులలో కౌన్సిలింగ్ ఇచ్చామని, ఐదు కేసుల్లో రెడ్హ్యాండెడ్గా చర్యలు తీసుకున్నామని, 8 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతోపాటు మూడు ఈపెట్టీ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 23 అవగహన కార్యక్రమాలు, 80 హాట్స్పాట్ ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. అమ్మాయిలు, విద్యార్థినులు ఏదైనా ఇబ్బందులకు లేదా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా సెల్ నం.87126 59365లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
శ్రమజీవుల పర్వదినం మే డే
మహబూబ్నగర్ న్యూటౌన్: శ్రమజీవుల పర్వదినం మేడే అని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు అన్నారు. శుక్రవారం మేడేను పురస్కరించుకొని నగరంలోని సీపీఎం కార్యాలయం వద్ద ఎరజ్రెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. మే డేను దీక్షా దినంగా పాటించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, రష్యా, ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి కోసం డాలర్ నుంచి కాకుండా ఆయా దేశాల డబ్బులు పెట్టి కొనడం ద్వారా ట్రంప్ ఆధిపత్యానికి పతనం మొదలైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతోపాటు కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు యుద్ధం ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాలు హక్కులు ఎవరో పెట్టిన భిక్ష కాదని, కార్మిక, కర్షక, మహిళా ఉద్యమాలతో సాధించుకున్నారని గుర్తు చేశారు. హద్దులు లేని శ్రమ దోపిడిని అరికట్టడం కోసం కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బానిసత్వాన్ని అంతం చేశారని గుర్తు చేశారు. మన దేశంలో నేడు కార్మిక చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు వంటివి తెచ్చి సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాములు, కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, నాయకులు కిష్టయ్య, విజయ్కుమార్, చంద్రకాంత్, ప్రశాంత్, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పండు ఈగను నివారిద్దాం’
అలంపూర్: పండ్లు, కూరగాయల తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రధానంగా మామిడిలో కాయలు పక్వానికి వచ్చే దశలో పండు ఈగ సోకితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ పండు ఈగ వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ వివరించారు. నష్టాలు: తల్లి ఈగలు కాయ పక్వానికి వచ్చే దశలో 150 నుంచి 250 గుడ్లను కాయ లోపలి భాగంలో పెడతాయి. 4 రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల లార్వాలు బయటికి వచ్చి కాయ లోపలి కండ, మాగుతున్న గుజ్జును తింటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉంటాయి. పిల్ల పురుగులు సంచిరించిన ప్రాంతం కుళ్లి మెత్తబడుతుంది. కాయ, పండ్లపై సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. పండ్లు రాలిపోతాయి. పండు ఈగ నివారణ : పండు ఈగ సోకి రాలిన పండ్లు, కాయలను వారానికి ఒకసారి ఏరి నేలలో పూడ్చిపెట్టాలి. దీని వలన పిల్ల పురుగులు చనిపోతాయి. వరుసల మధ్య సేద్యం చేయడం వలన కోశస్థ దశలో పురుగులు బయటపడి పక్షులు తినడం వలన చనిపోతాయి. ఫెరమాను బోనుతో లాభాలు రెండు రంధ్రాలు గల ప్లాస్టిక్ ఫెరమాను బోనులో మగ ఈగను ఆకర్షించే రసాయనాలు పూసిన అట్ట ముక్క ఉంటుంది. ఈ ముక్కపై 8 చుక్కల నువాన్ లేదా మలాథియాన్ పిల్లర్తో వదిలి ఉంచుతారు. తర్వాత ప్లాస్టిక్ డబ్బాకు మూతను బిగించి, చెట్టు కొమ్మకు వేలాడదీయాలి. అట్ట ముక్కకు ఉన్న రసాయనాలకు మగ ఈగ ఆకర్షింపబడి డబ్బాలోకి వచ్చి మందు ప్రభావానికి గురై చనిపోతాయి. ఫెరాబోను వాడే పద్ధతి : ● ఫెరాబోన్లను కాయ పక్వానికి చేరువయ్యే దశకు కనీసం 60 రోజుల ముందు చెట్లకు వేలాడదీయాలి. ● బోన్లను 3 నుంచి 4 అడుగుల ఎత్తులో నీడ ఉండేలా చూసి కొమ్మలకు కట్టాలి. ● దీని వలన మందు ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుంది. ● అప్పుడప్పుడు బోనులో ఉన్న మగ ఈగలను తీసేయాలి. ● అట్ట ముక్కపై వేసిన పురుగు మందు ప్రభావం 12 రోజులు ఉంటుంది. ● 12 రోజుల తర్వాత అట్ట ముక్కపై 5 నుంచి 6 చుక్కల నువాన్ లేదా మలాథియాన్ వేసి మరల ప్లాస్టిక్ డబ్బాకు మూత పెట్టాలి. ఫెరబోను లభించే ప్రదేశాలు రెయిన్బో అగ్రివెట్ టెక్నాలజీ బెంగుళూరు వారు వీటిని సరఫరా చేస్తారు. కావాల్సిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. పాడి–పంట -
భీమానదిపై బ్రిడ్జికం బ్యారేజ్ నిర్మాణం
కృష్ణా: భీమానదిపై బ్రిడ్జికం బ్యారేజ్ ఏర్పాటు చేసి రైతులకు సాగునీటిని అందించుటకు కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని గూడూర్ బ్రిడ్జి కం బ్యారేజీని కృష్ణా మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమానదిపై బ్యారేజీ నిర్మించి సాగునీటిని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు పలుమార్లు పరిశీలించి తగు నివేదికలు తయారు చేశారని, త్వరలోనే నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యారేజీ నిర్మిస్తే సూకూర్లింగంపల్లి, కుసుమర్తి, తంగిడితోపాటు మండలానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక మీదట ఈప్రాంత రైతులు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈయన వెంట నాయకులు రాజప్పగౌడ, నారాయణ, సంతోష్పాటిల్, సోమశేఖర్గౌడ్, దేవేంద్రప్ప, కీరప్పగౌడ, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
కనులపండువగా కల్యాణం
● వైభవంగా శ్రీలక్ష్మీనారసింహస్వామి ఉత్సవాలు ● హాజరైన మంత్రి వాకిటి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనారసింహస్వామి కల్యాణ మ హోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారి ఉత్సవం కనులపండువగా జరిగింది. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందున్న మైదానంలో పూల అలంకరణతో తయారు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ గావించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాలు పోశా రు. ఈ సందర్భంగా బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూ ల మధ్య ఈ దేవతామూర్తుల దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవం అనంతరం దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఘనంగా గరుడవాహన సేవ శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో గురువారం రాత్రి స్వామివారి గరుడవాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై స్వామి దంపతులను ఉంచి ఊరేగించారు. గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న కమాన్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వర్ణాభరణ అలంకరణలో దేవతామూర్తులు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో మన్యంకొండ దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
అప్పు ఇవ్వలేదనే హత్య
కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండలంలోని ఖాజీపూర్లో మూడు రోజుల క్రితం జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించి నిందుతుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నారాయణపేట డీఎస్పీ లింగయ్య మద్దూరు పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహ్మద్ ఖాజా అతని సడ్డకుడు హైమద్ను రూ.5 లక్షలు అప్పుగా ఇవ్వమని అడగగా అతను తిరస్కరించడంతో ఇరువురి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీనిని మనస్సులో పెట్టుకున్న ఖాజా హైమద్ను హత్యచేసి, అతని భార్య, ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని భావించి ముందుగా పథకం రచించాడు. ఈ క్రమంలోనే గత నెల 27న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఖాజీపూర్ శివారులోని తన పొలం వద్ద కొత్తగా నిర్మిస్తున్న కోళ్ల షెడ్డు దగ్గర ఒంటరిగా ఉన్న హైమద్(42)పై దాడి చేసి సిమెంట్ పెల్లలు, రాళ్లతో ముఖం, తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందుతుడు ఘటనా స్థలం నుంచి బైక్పై పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖాజాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్య చేయడానికి ముందు అతని దగ్గరున్న వస్తువులు మోటార్సైకిల్, సెల్ఫోన్, రక్తపు మరకలు గల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండుకు తరలించామని డీఎస్పీ లింగయ్య తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఇన్చార్జి ఎస్ఐ విజయభాస్కర్, కోస్గి ఎస్ఐ బాలరాజు, ఉమెన్ ఎస్ఐ రేవతి, ఏఎస్ఐ బాలయ్య, హెచ్సీలు పెంటయ్య, గోపాల్ తదితరులను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేత రివార్డు అందిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. -
బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం
రమణీయం.. అంజన్న రథోత్సవం కనులపండువగా స్వామివారి రథోత్సవంఎర్రవల్లి: ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే ఆంజనేయస్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు బీచుపల్లి పుణ్యక్షేత్రమంతా అంజన్న నామస్మరణతో మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు అభయాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజను చేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథాంగ హోమం, రాత్రికి బోయ పూజారులు కుంభం పూజలను వైభవంగా నిర్వహించారు. వేలసంఖ్యలో భక్తుల నడుమ రాత్రి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉమ్మడి మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, కర్నూల్, అలంపూర్, కొత్తకోట, కొల్లాపూర్, ఆత్మకూర్, రాయచూర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో మట్టికుండల్లో దాసంగాలతో ప్రత్యేక నైవేద్యాలను వండి అభయాంజనేయ స్వామికి ప్రసాదంగా సమర్పించారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు లు తీర్చుకున్నా రు. జాతర సందర్భంగా చిన్నా రుల కోలాటం, భజనల నడుమ ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్కుమార్, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రత్యేక బోనం తెస్తున్న బోయ పూజారులు, స్వామిని దర్శించుకుంటున్న డీఎస్పీ మొగిలయ్య మార్మోగిన హనుమాన్ నామస్మరణ ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు మట్టికుండల దాసంగాలతో స్వామివారికి ప్రత్యేక నైవేద్యం బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం డీఎస్పీ మొగిలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో పురేందర్కుమార్ శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతీచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను వివరించారు. డీఎస్పీ వెంట సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవిరాథోడ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎస్జీఎఫ్ చాంపియన్ ఢిల్లీ
● తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం ● వాకోవర్తో మూడోస్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ ● క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి చాటారు : డీఈఓ ప్రవీణ్కుమార్ జడ్చర్ల టౌన్: ఎస్జీఎఫ్ 69వ జాతీయ క్రికెట్ చాంపియన్గా ఢిల్లీ జట్టు నిలిచింది. గత నెల 26న ప్రారంభమైన టోర్నమెంట్లో మొత్తం 60 మ్యాచ్లు జరిగాయి. శుక్రవారం జడ్చర్ల మినీ స్టేడియం మైదానంలో ఢిల్లీ– తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. జట్టులో తమిళ్ సెల్వమ్ 46 పరుగులు చేయగా ఆకాష్ 3 వికెట్లు తీశాడు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 148 పరుగులు చేసింది. జట్టులో యువరాజ్శర్మ 59 పరుగులు చేయగా బౌలింగ్లో రిశాంత్ 2 వికెట్లు తీశాడు. 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. దీంతో ఢిల్లీ క్రీడాకారులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని సంబరాలు చేసుకున్నారు. మొదటి సెమీ ఫైనల్లో.. జడ్చర్ల మినీ స్టేడియంలో ఢిల్లీ– ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్లో ఢిల్లీ సత్తాచాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. జట్టులో ఆష్మిత్ 37 బంతుల్లో 65 పరుగులు, రాహుల్ 34 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించేలా కృషిచేశారు. బౌలింగ్లో కునల్, ఆరుష్శర్మ చెరో 2 వికెట్లు తీశారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టు 18.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్లో రాహుల్ 4, ఆకాష్ 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు. తమిళనాడు విజయం.. తమిళనాడు డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్లో తమిళనాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేయగా 121 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన డీఏవీ సీఎంసీ జట్టు 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో విపుల్ 44 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన తమిళనాడు ఫైనల్కు చేరుకుంది. వాకోవర్తో మూడోస్థానం.. టోర్నీలో మూడోస్థానం కోసం ఉత్తరాఖండ్– డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. డీఏవీ సీఎంసీ జట్టు ఫ్లైట్ టైం అవుతుందని వాకోవర్ ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో ఉత్తరాఖండ్ మూడోస్థానం ఖరారైంది. అయితే మ్యాచ్ 10 ఓవర్లు జరిగినప్పటికీ ఇరు జట్లు అంగీకరించడంతో వాకోవర్ ప్రకటించారు. మండుటెండల్లోనూ టోర్నీ విజయవంతమైందని మహబూబ్నగర్ డీఈఓ ప్రవీణ్కుమార్ అన్నారు. టోర్ని ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడేళ్లుగా టోర్నీ నిర్వ హణకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, అలాంటిది జడ్చర్ల ముందుకు రావడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు అందరూ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. చిన్నపాటి పొరపా ట్లు జరిగినప్పటికీ టోర్నీ జయప్రదం అయ్యేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. గెలిచిన వారు భవిష్యత్లోనూ రాణించి దేశానికి పేరు తీసుకురావాలని, ఓడిన వారు గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత మాట్లాడుతూ గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు సభలో టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి, నిర్వాహకుడు మోయిన్, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి బలవర్మరణం
మన్ననూర్: మన్ననూర్లో ని ఉమామహేశ్వర కాలనీకి చెందిన రామావత్ డా కు నాయక్ పెద్ద కుమారు డు జశ్వంత్ నాయక్(17) వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమామహేశ్వర కాలనీకి చెందిన జశ్వంత్ నాయక్ అచ్చంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో గ త విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ చ దువుతుండగా..ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు ఇష్టపడటంతోపా టు పెళ్లి చేసుకునేంత వరకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు రామా వత్ వంశీయులమైన మన కుటుంబానికి ఆ అమ్మాయి వరుసకాదు మర్చిపొమ్మని సర్ధి చెప్పారు. మనస్తాపానికి గురైన యువకుడు గురువారం ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అక్క, తమ్ముడు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాజోళి: ఇటీవల బీచుపల్లి వద్ద చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గాయపడి కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా రు. అయితే మరో సోదరు డు చంద్రమోహన్రెడ్డి (52)కి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతి చెందాడు. ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఇద్దరు చనిపోగా.. మిగిలిన ఒక్కరైన ప్రాణాలతో ఉంటారని ఆశించినప్పటికీ తమకు నిరాశే మిగిలిందని కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత కొత్తపల్లి: మండలంలో రేషన్ మాఫియా జోరుగా కొనసాగుతున్నది. పేదలకు మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంతో అక్రమార్కులు రేషన్షాపుల ముందే లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తూ పేదవాడి ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. రేషన్ బియ్యం ప్రభుత్వం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో దళారులకు కాసుల పంట కొనసాగుతుంది. మండంలో అధికారులు దాడులు జరిపినా.. ఏదో ఒక మూలన పక్కదారి పడుతుంది. మండలంలో బియ్యం వ్యాపారం జోరుగా కొనసాగుతుందనే నమ్మదగిన సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించగా.. గురువారం అర్ధరాత్రి కొత్తపల్లి నుంచి బొలేరోలో 40బ్యాగులు 18క్వింటాళ్ల 60కేజీలు ప్లాస్టిక్ బ్యాగుల్లో పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పీడీఎస్ తరలించే బొలేరో డ్రైవర్ను విచారించగా.. కొత్తపల్లికి చెందిన బియ్యం వ్యాపారి సురేష్గౌడ్పై 6–ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ కాలప్ప తెలిపారు. పట్టుబడిన బియ్యం మున్సిపల్ పట్టణంలోని రేషన్షాపునకు అప్పగించినట్లు తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యం స్థానిక డీలర్ల కనుసైగల్లో అక్రమ వ్యాపారం కొనసాగుతునట్లు స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు అక్రమ బియ్యం వ్యాపారులపై గట్టి చర్యలు తీసుకోవాలని మండల వాసులు అనుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారి కాలప్పను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా పేదలకు అందాల్సిన బియ్యం అమ్మిన, కొనుగోలు చేసినవారిపై బియ్యం తరలించే వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ‘ఎక్స్టెన్షన్లు వద్దు ప్రమోషన్లు కావాలి’ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తాజాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీఈగా రిటైర్డ్ అయిన సత్యనారాయణరెడ్డికి 6 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వడం దుర్మార్గమని టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎక్స్టెన్షన్లో భాగంగా ఆయనకు రెండు పదవులు మహబూబ్నగర్, హైదరాబాద్ సీఈగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల పదోన్నతులలో నలుగురు ఇంజినీర్లు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్టెన్షన్లు మొదటగా ఇచ్చిన గడువు పూర్తి కావడంతోనే మరికొంత సమయాన్ని కూడా అలాగే చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో నాగర్కర్నూల్లో రిటైర్డ్ అయిన ఒక్క ఎస్ఈకి రెండు పోస్టులు ఎక్స్టెన్షన్ ఇచ్చారని విమర్శించారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఎక్స్టెన్షన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఇంజినీర్లను కావాలంటే అడ్వైజర్గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఇంజినీర్ల సమావేశంలో తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ ధోరణిని మార్చుకోవాలని కోరారు. -
సూపర్ ఓవర్లో..
స్వామినారాయణ గురుకులం మైదానంలో జార్ఖండ్తో జరిగిన ఫ్రీ క్వార్టర్ మ్యా చ్లో డీఏవీ సీఎంసీ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన జార్ఖండ్ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జట్టులో స్వస్తిక్ 52 పరుగులు చేశాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీఏవీ సీఎంసీ 7 వికెట్లు కోల్పోయి స్కోర్ను సమం చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ఓవర్లో జార్ఖండ్ 17 పరుగులు చేయగా.. డీఏవీ సీఎంసీ 18 పరుగులు చేసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 57 పరుగులు చేసిన స్వస్తిక్ -
సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టిన కారు
అడ్డాకుల: కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టిన ఘటన 44వ జాతీయ రహదారిపై జానంపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ నుంచి బెంగళూర్కు ఇన్నోవాలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జానంపేట దాటిన తర్వాత అచ్చాయపల్లి స్టేజీ సమీపంలో సర్వీసు రోడ్డు పనులు జరిగే చోట రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టుకుంది. దీంతో కారు రోడ్డు కిందకు దూసుకెళ్లి కల్వర్టు మీదుగా కిందకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా జానంపేట వద్ద అండర్ బ్రిడ్జి పనులు జరిగే చోట సర్వీసు రోడ్డుపై సిమెంటు దిమ్మెలను అడ్డదిడ్డంగా ఉంచడంతో వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వీసు రోడ్డుపై సరైన రక్షణ చర్యలు సైతం చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
తుది అంకానికి చాంపియన్షిప్
● సెమీస్కు చేరిన ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్, డీఏవీ జట్లు ● ఏర్పాట్లు పరిశీలించిన టోర్నీ పరిశీలకుడు సంజయ్కుమార్ జడ్చర్ల టౌన్: ఎస్జీఎఫ్ 69వ జాతీయ క్రికెట్ చాంపియన్షిప్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. జడ్చర్ల, మహబూబ్నగర్లో కలిపి మొత్తం 5 మైదానాల్లో జరుగుతున్న టోర్నమెంట్లో ఇప్పటికే 45 లీగ్ మ్యాచ్లు, 8 ఫ్రీ క్వార్టర్స్, 4 క్వార్టర్స్ మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్లతోపాటు మూడోస్థానం కోసం మరో మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో రాణించిన ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్, డీఏవీ జట్లు సెమీస్కు చేరాయి. ఏర్పాట్లపై ఆరా.. ఎస్జీఎఫ్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా జడ్చర్ల మినీ స్టేడియంలో జమ్ముకాశ్మీర్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్ను జాతీయ పరిశీలకులు సంజయ్కుమార్ వీక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పరిచయం చేసుకుని, వారి కి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో రాణించాలని సూచించారు.అంతకు ముందు ఆయన ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్తో 5 మైదానాల్లో జరిగిన లీగ్, ఫ్రీక్వార్టర్ మ్యాచ్ల వివ రాలను తెలుసుకున్నారు. క్రీడాకారులకు కల్పించిన వసతి, భోజనం తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. క్వార్టర్ ఫైనల్స్లో 20 ఓవర్లు.. లీగ్, ఫ్రిక్వార్టర్ వరకు 15 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించగా.. క్వార్టర్ ఫైనల్లో 20 ఓవర్లతో కొనసాగించారు. సెమీస్, మూడో స్థానం, ఫైనల్ మ్యాచ్లోనూ 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ విజయం మహబూబ్నగర్ బీఎస్ఆర్ గ్రౌండ్స్లో ఒడిశా, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన ఫ్రీ క్వార్టర్ మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ జట్టును విజయం వరించిది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బౌలింగ్లో శుభందాస్ 3 వికెట్లు తీశాడు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 14.3 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్లో విష్ణు, హర్ష్యాదవ్ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించారు. డీఏవీ సీఎంసీ జయకేతనం జడ్చర్ల మినీ స్టేడియంలో జమ్ముకాశ్మీర్, డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో డీఏవీసీఏంసీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన డీఏవీ సీఎంసీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగుల చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్ముకాశ్మీర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. జట్టులో లూబైబ్ 62 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. బౌలింగ్లో దర్శ్, వంశన్లు చెరో రెండు వికెట్లు తీశారు. ఉత్తరాఖండ్ జోరు బీఎస్ఆర్ మైదానంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ జ ట్ల మధ్య జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఉ త్తరాఖండ్ విజయం సాధించి సెమి ఫైనల్ బెర్త్ ఖ రారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌలైంది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో లాంఛ నం పూర్తి చేసింది. ధృవ్ 42 పరుగులు, కృష్ణ 44 ప రుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీలో అత్యధిక స్కోర్ 200.. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో హర్షిల్ 54 పరుగులు, రాహుల్ 35 పరుగులతో రాణించారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో 153 పరుగులకే చాప చుట్టేసింది. కుష్ 36, హేమంత్ 34, ఆయుష్ 32 పరుగులు చేయగా.. బౌలింగ్లో ఆర్యవీర్, ఆకాష్, ఆస్మిత్ చెరో రెండు వికెట్లు తీశారు. సెమీస్కు తమిళనాడు తమిళనాడు– కేరళం జట్ల మధ్య జరిగిన 4వ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు విజయం సాధించి సె మీస్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్యాటింగ్లో తమిళ్ 54 బంతుల్లో 64 పరుగులు చేయగా..బౌలింగ్లో జెవిన్, ఇ షాన్ చెరో రెండు వికెట్లు తీశారు.170 పరుగుల ల క్ష్యంతో బరిలోకి దిగిన కేరళం జట్టు 18.1 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్లో విబి ష్,మావసీం చెరో 3 వికెట్లు తీశారు. 36 పరుగుల తే డాతో గెలుపొందిన తమిళనాడు సెమీస్కు చేరింది.మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో ఢిల్లీ, చండీఘడ్ మధ్య జరిగిన ఫ్రీక్వార్టర్ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో గరువు 37 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చండీఘడ్ 13.3 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌలైంది. బౌలింగ్లో ఆరుష్ 4 వికెట్లు తీశాడు. -
పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లి తల్లి మృతి
ఉప్పునుంతల: పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో తన పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లిన తల్లి నీట మునిగి మృతి చెంది న ఘటన మండలంలోని వెల్టూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వెల్టూరుకు చెందిన రక్త అనూష (35) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్ల లు ధనలక్ష్మి, అక్షితకు ఈత నేర్పేందుకు తమ పొలం పక్కనే ఉన్న లింగస్వామి పొలంలో ఏర్పాటు చేసిన పాంపాండ్ వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె అక్షితకు ప్లాస్టిక్ డబ్బా కట్టి నీటిలోకి దింపగా.. పెద్ద కుమార్తె, తల్లి గట్టుపైనే ఉన్నారు. కొంతసేపటికి అక్షిత నీటిలో మునుగుతూ ఏడ్వడంతో ఈత రాని తల్లి అనూష బిడ్డను రక్షించడానికి నీటిలో దూకి మునిగిపోయింది. గట్టు మీద ఉన్న పెద్ద కుమార్తె పరుగెత్తి పొరుగున వ్యవసాయ పొ లంలో ఉన్న బక్కయ్య అనే రైతుకు విషయం చెప్పి తీసుకొచ్చింది. ఈ క్రమంలో అతడు మొదట పాంపాండ్లో ఉన్న అక్షితను బయట కు తీశాడు. తల్లి అనూష అప్పటికే నీట మునిగి చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు. గతంలోనే మృతిరాలి భర్త మల్లయ్య సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి నీరు పట్టేందుకు వెళ్లి.. ● విద్యుదాఘాతంతో మహిళ మృతి ● రెండేళ్ల క్రితమే భర్త మృతి ● అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు కొత్తపల్లి: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనురాధ (38) గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి గోడలకు క్యూరింగ్ కోసం నీరు పట్టే క్రమంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన ఇంటి పక్కల వారు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బాధిత మహిళకు సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స కోసం మద్దూరు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించినట్లు మద్దూరు ఇన్చార్జి ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. మృతురాలి భర్త రెండేళ్ల క్రితమే మరణించాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉండడంతో ప్రస్తుతం వారు అనాథలుగా మారారు. మృతురాలి సోదరుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి అంత్యక్రియలకు గ్రామస్తులందరూ కలిసి రూ.12,500 సాయమందించి చిన్నారులకు అండగా నిలిచారు. డ్రంకెన్డ్రైవ్లో ఏడురోజుల జైలు శిక్ష మహబూబ్నగర్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపన వాహనదారుడికి న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో మొత్తం ఐదుగురు వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శశిధర్ నలుగురు వాహనదారులకు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించగా అధిక మొత్తంలో మద్యం తాగి డీసీఎం నడిపిన డ్రైవర్కు ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపటంతో ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతతో ఉండాలని సూచించారు. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం ధరూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ర్యాలంపాడులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండమీది నర్సింహులు దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో రెండో కుమారుడు బాలు (19) ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మల్దకల్ మండలం ఎల్కూరులో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యా.. మరేదైన ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. పెళ్లి ముగించుకొని సాయంత్రం పొద్దుపోయాక వచ్చిన కుటుంబ సభ్యులు ఇల్లు తెరిచి చూడగా కుమారుడు విగత జీవిగా కనిపించడంతో నిర్ఘాంతపోయారు. అందరితో కలిసి మెలిసి ఉండే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై ఎస్ఐ నందీకర్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
గత చరిత్ర తెలిసిన వారే అసలైన హిందువు
భూత్పూర్: గత చరిత్ర తెలుసుకొని భవిష్యత్లో దేశం ఏవిధంగా ఉంటుందో గ్రహించి నాడు.. నేడు హిందువుల స్ధితిగతులను గుర్తించి పలువురికి పురాణ ఇతిహాసాల గురించి తెలియజేసిన వారే అసలైన హిందువుగా భావించాలని భాగ్యనగర్కు చెందిన ప్రథమేశానందస్వామి అన్నారు. గురువా రం రాత్రి భూత్పూర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 500 నుంచి 2 వేల సంవత్సరాలుగా ఎన్నో తరాలుగా హిందువులను నాశనం చేశారో ఒకసారి భగవద్గీత, రామాయణం, మహాభారతంతోపాటు శాస్త్రాలను చదివి తమ పిల్లలు, బంధువులు, హిందు ప్రజలకు చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి జ్ఞానోదయం కల్పించాలని సూచించారు. వర్తమానంలో హైందవ సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలని, హిందువులు శారీరక శక్తి, నైతిక శక్తి, ధనశక్తి, జనశక్తి, రాజకీయ శక్తి, రాజ్యాంగ శక్తి, దైవీయమైన శక్తులతో నిండి ఉన్నారని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో మహిళా ప్రవక్త బలగం సింధూజ, నిర్వాహకులు బాలరాజుగౌడ్ పాల్గొన్నారు. -
జాతీయ ఫుట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు
మహబూబ్నగర్ క్రీడలు: ఛతీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో శుక్రవారం నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు జరిగే స్వామి వివేకానంద అండర్–20 పురుషుల జాతీయస్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగా ణ జట్టులో జిల్లాకు చెందిన మంజునాథ్ చోటు దక్కించుకున్నాడు. మంజునాథ్ గతేడాది జమ్ముకాశ్మీర్లో జరిగిన అండర్–19 జాతీయస్థాయి టోర్నీమెంట్లో పాల్గొని ప్రతిభ చాటాడు. జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటున్న మంజునాథ్ను జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, సంఘం సభ్యులు రంగారావు, రమేష్, శంకర్లింగం, గజానంద్కుమార్, నందకిషోర్, కేఎస్ నాగేశ్వర్, ఇమ్మాన్యుయెల్ జేమ్స్, రామకృష్ణ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవంగా బీచుపల్లి ఉత్సవాలు ఎర్రవల్లి: మండల పరిధిలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు స్వామివారికి పంచామృతాభిషేకం, ఉప నయనం, పల్లకీసేవ వంటి క్రతువులు నిర్వహించారు. రాత్రి ప్రభోత్సవం (చిన్నతేరు) కార్యక్రమం భక్తుల కోలాటం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్కుమార్, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
దేవరకద్ర/మరికల్: దేవరకద్ర మండలంలోని బస్వాపూర్, మరికల్ మండలం రాకొండ మధ్యలో ఊకచెట్టు వాగుపై రూ.6 కోట్లతో 2021లో నిర్మించిన చెక్డ్యాంను ఇసుక మాఫియా ధ్వంసం చేసేందుకు యత్నించిన ఘటన మంగళవారం అర్ధరాత్రి తరువాత జరిగింది. చెక్డ్యాంలో నీరు ఉండడంతో ఇసుకను తీయడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో బరి తెగించి హిటాచీతో చెక్డ్యాంను ధ్వంసం చేస్తుండగా పెద్దరాజమూర్కు చెందిన మొగిలయ్య అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వారు హిటాచీతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మొగులప్ప ఇసుక మాఫియా విషయాన్ని రాకొండ సర్పంచ్ పెద్ద పుల్లప్ప, బస్వపూరం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు దేవరకద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్డ్యాం నుంచి ఇటాచీ జాడలపై దర్యాప్తు చేయగా పెద్ద రాజమూరులో జాడ కనిపెట్టారు. చెక్డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దొంగనే దొంగ దొంగ అన్నట్లు పరిస్థితి ఉందని, ఇసుక మాఫియాకు చెందిన వారే చెక్డ్యాంను ధ్వంసం చేసేందుకు యత్నించి మళ్లీ వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం చెక్డ్యాంను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఏడు వాహనాల్లో ఇసుకను నింపుకుని పోతున్న వీడియో తనకు వచ్చిందని వెంటనే ఎస్పీకి పంపిచానని తెలిపారు. అయినా చర్యలు తీసుకోలేదన్నారు. చెక్డ్యాంను ధ్వంసం చేసేందుకు యత్నించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని కోరారు. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే ఇందులో మీకు భాగస్వామ్యం ఉన్నట్లు భావిస్తామని పేర్కొన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోయి ఏకంగా చెక్డ్యాంలను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం చెక్డ్యాం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ధర్నాను చేపట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో దేవరకద్రకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొగులప్పను అభినందించిన ఆల రైతు మొగులప్ప ధైర్యం వల్లే చెక్డ్యాం నిలబడిందని ఆయన లేకుంటే పూర్తిగా ధ్వంసమయ్యేందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రైతు మెగులప్పను అభినందించారు. అర్ధరాత్రి చెక్డ్యాం ధ్వంసం చేసేందుకు యత్నం పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: విద్యుదాఘాతంతో మండలంలోని హమ్యతండాకు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కందిరీయతండా ఆమ్లేట్ గ్రామం హమ్యతండాకు చెందిన కేతావత్ దేవుడుకు ఇంట్లో ఫ్యాన్కు ఉంచిన కరెంట్ వైరు ప్రమాదవశాత్తు తగిలి షాక్తో కిందపడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు కేతావత్ పెంటయ్యనాయక్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామని ఎస్ఐ హృశికేష్ తెలిపారు. మనువడి చేతిలో నానమ్మ హతం తిమ్మాజిపేట: తన ఆలనాపాలనా చూసుకుంటున్న నానమ్మను మనువడే హత్య చేసిన ఘటన మండలంలోని మరికల్లో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సిద్దోటం రాంచంద్రమ్మ (70) కు ఇద్దరు కుమారులు ఉండగా వారు గతంలోనే చనిపోయారు. కోడలు హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మనవడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. అతడిని కోడలు అత్త వద్దే ఉంచి 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో లైట్ వేయమని రాంచంద్రమ్మ మనువడు శివకు చెప్పడంతో కోపోద్రిక్తుడై అతడు నానమ్మను బండరాయితో మోదాడు. నొప్పితో వృద్ధురాలు కేకలు వేయడంతో మరోమారు రాయితో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. మహిళ బలవన్మరణం తిమ్మాజిపేట: మండలంలోని బాజీపూర్లో అల్వాల సుజాత (35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడినట్లు హెడ్కానిస్టేబుల్ రాజశ్యామ్ తెలిపారు. ఆయన కథనం మేర కు.. ఐదేళ్ల క్రితం బిజినేపల్లి మండలంలోని వడ్డెమాన్కు చెందిన సుజాతకు బాజీపూర్కు చెందిన నాగరాజుతో వివాహం చేశారు. ఈ క్ర మంలో భర్త నాగరాజు చనిపోవడంతో సుజా త కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తుంది. ఇదే అదునుగా బాజీపూర్కు చెందని బాలయ్య కొన్ని రోజులుగా తన కుమార్తెను వేధిస్తుండడంతో తను ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి గౌండ్ల బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహా న్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అంబేడ్కర్ బాటలో నడుద్దాం
వెల్దండ: ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహరాజ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలంలో చల్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్గౌడు, మాజీ ఎంపీపీ జయప్రకాష్, చెర్కూర్ సర్పంచ్ శ్రీనివాస్, రాచూర్ సర్పంచ్ శ్రీనివాసులు, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, బైరి నరేష్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి జోగు రమేష్, నాయకులు హన్మంత్నాయక్, తిర్మల్రావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బసవయ్య, సామేలు, మల్లేష్, వెంకటయ్య, శశికుమార్, ఆనంద్, రమేష్, వెంకటయ్య, తదితరులు ఉన్నారు. -
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ నీరు ఎక్కువగా తాగాలి ఎండల తీవ్ర త కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ ● -
భానుడి విలయతాండవం
పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏటా పెరుగుదల.. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఇవీ వడదెబ్బ లక్షణాలు శరీర నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. విపరీతమైన దాహం వేయడంతోపాటు శరీరం వేడెక్కుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం, వాంతులు, కాళ్లు, కండరాలు పట్టేసి నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు ఇలా.. వడదెబ్బ లక్షణాలున్న బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీరు ముఖంపై చిలకరించాలి కూలర్ లేదా ఏసీల వద్ద విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాలి. చల్లని నీరు లేదా ఐస్ ముక్కలతో నుదురు, శరీరంపై తుడవాలి. అరచేయి, కాళ్లకు రక్తప్రసరణ మెరుగుపడేలా రుద్దాలి. వీలైనంతా త్వరగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఉమ్మడి పాలమూరులోతీవ్రమవుతున్న ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
వేరుశనగ క్వింటా రూ.7,130
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,130, కనిష్టంగా రూ.5,090 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,337, కనిష్టంగా రూ.6,091, ఉలువలు రూ.3,609, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,889 హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,838, కనిష్టంగా రూ.1,601 ధరలు వచ్చాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,319, కనిష్టంగా రూ.1,949 ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
దత్తత చట్టబద్ధంగా తీసుకోవాలి
మహబూబ్నగర్ రూరల్: పిల్లలు లేని వారు చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఎదురుకావని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని స్టేట్హోం హాల్లో దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేనివారు లేదా ఒక సంతానం ఉన్నవారు దత్తత కోసం కారా (సీఏఆర్ఏ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులకు కారా సీనియారిటీ ఆధారంగా పూర్తిగా చట్టబద్ధమైన విధానంలో దత్తత కల్పిస్తామని చెప్పారు. ఆస్పత్రులు లేదా ప్రైవేట్ వ్యక్తుల వద్ద నేరుగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పిల్లలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తాజాగా కారా ద్వారా పోస్టర్ కేర్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 8 నుంచి 18 ఏళ్ల వయస్సు గల చిన్నారులను రెండేళ్లపాటు పోస్టర్ కేర్లో తీసుకుని, అనంతరం పోస్టర్ అడాప్షన్గా మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ విధానంలోనే చట్టపరమైన అన్ని హక్కులు వర్తిస్తాయని వివరించారు. అనంతరం డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ నయీమొద్దీన్, సీడీపీఓలు శైలశ్రీ, రాధిక, డీసీపీఓ నర్మద, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాములు, 1098 కోఆర్డినేటర్ శివ, శిశుగృహ సిబ్బంది రాంమ్మోహన్, పద్మ, జగదీశ్వరి, అనిత తదితరులు పాల్గొన్నారు. -
మెగా జాబ్మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు మంత్రుల రాక.. మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధం
రాజోళి: వడ్డేపల్లి మండలంలోని జక్కిరెడ్డిపల్లెలో షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేష్ నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. బుధవారం విద్యుత్షార్ట్ స ర్క్యూట్ కారణంగా పంట పూర్తిగా కాలిపోయింది. అప్పులు తెచ్చి పంట సాగుచేస్తే చివర కు బూడిదే మిగిలిందని రైతు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు. మహిళ మృతి: కేసు నమోదు ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్ శివారులోని వ్యవసాయ పొలంలో మంగళవారం సాయంత్రం వంగూరు మండలంలోని చాకలిగుడిసెలు గ్రామానికి చెందిన పసుపులేటి మణె మ్మ (42) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. దీంతో బుధవారం మృతురాలి భర్త పసుపులేటి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. చెరువులో పడి బాలుడి మృతి దామరగిద్ద: ప్రమాదవశాత్తు చెరువులో పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని నర్సిములు, తిరుపతమ్మ దంపతుల కుమారుడు నర్సింహ (15) రోజులాగే గ్రామ సమీపంలోని చిన్నచెరువు పరిసర ప్రాంతానికి మేకలను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చెరువు సమీపంలో మేకలను నిలిపి ఈత పడేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. కానీ నర్సింహకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. గుర్తించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రాజు చొరవతో గజ ఈతగాళ్లు చెరువును గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. -
రేపు మెగా జాబ్మేళా
● శిల్పారామంలో ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ● 10,000 మంది నిరుద్యోగులు పాల్గొనే అవకాశం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెగాజాబ్ మేళా మే 1న శుక్రవారం మహబూబ్నగర్ పట్టణం పెద్దచెరువు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తెలిపారు. శిల్పారామంలో నిర్వహించనున్న జాబ్మేళా స్థలాన్ని ఆయన బుధవారం సందర్శించారు. తెలంగాణలోనే తొలిసారి నిర్వహించనున్న మెగాజాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొంటాయన్నారు. దాదాపు 120 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మంది నిరుద్యోగ యువతి, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాబ్మేళా ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీశాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మ, ఉపాధి కల్పన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని జాబ్మేళాకు సంబంధించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే స్టేజీ ఏర్పాటు, స్టాల్లలో కావాల్సిన ఏర్పాట్లను రెవెన్యూ, జిల్లా విద్యాశాఖ అధికారులు చూసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ 120 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తారని, రిజిస్ట్రేషన్ నమోదు అనంతరం ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు తెలిపారు. ఇంటర్వ్యూ అనంతరం ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామకపత్రం అందజేస్తారని అన్నారు. పోలీసు శాఖ జాబ్మేళా సందర్భంగా రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. జాబ్మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానుననట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, జిల్లా యువజన, క్రీడల అధికారి రాజశేఖర్రెడ్డి, డీఎంహెచ్ఓ కృష్ణ, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు -
ఆతిథ్య జట్టుకు నిరాశే..
● ముగిసిన లీగ్ మ్యాచ్లు ● ఫ్రిక్వార్టర్స్లో తెలంగాణ జట్టు ఓటమి జమ్ముకాశ్మీర్, ఐబీఎస్ఓ జట్లు తలపడగా.. జమ్ముకాశ్మీర్ గెలుపు జెండా ఎగురవేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జమ్ముకాశ్మీర్ జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. షాహిద్ 56 పరుగులతో సత్తాచాటాడు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐబీఎస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది. ఖబీర్ 56 పరుగులు చేసినా.. సహచరుల నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో ఓటమి తప్పలేదు. జడ్చర్ల టౌన్: జడ్చర్ల, మహబూబ్నగర్లో జరుగుతున్న ఎస్జీఎఫ్ 69వ అండర్ 17 జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో లీగ్ మ్యాచ్లతోపాటు 4 ఫ్రిక్వార్టర్ మ్యాచ్లు బుధవారంతో ముగిశాయి. లీగ్లో 3 వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆతిథ్య తెలంగాణ జట్టు ఫ్రిక్వార్టర్స్లో తమిళనాడు జట్టుపై ఓటమిని చవిచూసింది. కేవీఎస్ విజయం గుజరాత్, కేవీఎస్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కేవీఎస్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 14.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేవీఎస్ జట్టు 11.4 ఓవర్లలోనే విజయం సాధించింది. తెలంగాణ– తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఫ్రిక్వార్టర్స్లో తమిళనాడు ఘన విజయం సాదించింది. టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులు మాత్రమే చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 10.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి విజయం సాదించింది. తమిళసెల్వం 34 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. -
‘పది’లో రిషి విజయభేరి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాల విద్యార్థులు విజయభేరీ మోగించారు. ఈ మేరకు పాఠశాల కు చెందిన విద్యార్థు లు కార్తికేయరెడ్డి 594, శ్రీకర్ 586, దివ్యశ్రీ 582, జశ్వంత్ 580, సాయికీర్తన 580 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశా ల చైర్మన్ చంద్రకళావెంకట్, డైరెక్టర్లు పూజితామోహన్రెడ్డి, శిరీష, ప్రవీణ్కుమార్, సుశాంత్రెడ్డి, ఇన్చార్జి మాలతి తదితరులు పాల్గొన్నారు. అపెక్స్ విద్యార్థుల ముందంజ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలో ని అపెక్స్ పాఠశాల విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు శ్రేష్ట 588, సాయి అక్షర 583, మహవీష్ మనాల్ 581 మార్కులు సాధించగా పాఠశాలలో మొత్తం 100శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం శివజ్యోతి తెలిపారు. ‘పంచవంటి’ విజయదుందుభీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సె స్సీ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని పంచవటి విద్యాల య విద్యార్థులు విజయదుందుభీ మోగించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు అజ్రాతబస్సుమ్ 592, అనన్యశ్రేష్ట 590, ప్రణీత్రెడ్డి 588, అభిరామ్ 588 మార్కులతో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబర్చారు. వీరితోపాటు మ్యాథ్స్ లో 33, తెలుగులో 12, సోషల్లో 8మంది విద్యార్థులు 100కు 100మార్కులు సాధించారు. 550కిపైగా 146మంది విద్యార్థులు సాధించారు. ఈ మేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ అనితారెడ్డి, చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరమణ అభినందించారు. ఎస్సెస్సీ ఫలితాల్లో శ్రీ‘ప్రతిభ’ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీప్రతిభ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు అనీకఅయిమన్ 588సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చింది. మొత్తం 71మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా 100శాతం ఫలితాలు సాధించారు. 49మంది విద్యార్థులకు 500లకుపైగా మార్కు లు సాధించారు. ఇంతటి విజయానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రుల కు పాఠశాల యాజమా న్యం కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో ఆనంద్రెడ్డి, కమలాకర్, వెంకటరమణ, శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్ హారిక పాల్గొన్నారు.సత్తాచాటిన ‘లిటిల్ స్కాలర్’ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటా రు. ఈ మేరకు పాఠశాల విద్యార్థు లు శ్రీవర్షిణి 576, జుబియా గౌహర్ 564, ఫర్హా అహ్లమ్ 557, అబూబాకర్ సిద్ధికి 557 మార్కులు సాధించడంతోపాటు పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతను సా ధించినట్లు కరస్పాడెంట్ అరుంధతిరాయ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
రోడ్లపైనే ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉల్లివేలం నిర్వహించలేదు. దీంతో రైతులు మార్కెట్కు ఉల్లిని తీసుకురాకుండ సొంతంగా విక్రయాలు సాగించారు. మార్కెట్లో ప్రస్తుతం యాసంగి సీజన్ ఽకావడంతో పెద్ద ఎత్తున ధాన్యం అమ్మకానికి వస్తున్నది. మార్కెట్లోని రెండు ఆవరణలతోపాటు షెడ్లు ధాన్యం కుప్పలతో నిండిపోతున్నాయి. దీంతో మార్కెట్లో ఉల్లిని కుప్పలుగా పోయడానికి స్థలం ఖాలీగా లేకపోవడంతో రైతులు సొంత ట్రాక్టర్లపై ఉల్లిబస్తాలతో వచ్చి రోడ్లపైనే నేరుగా విక్రయాలు సాగించారు. కొందరు రైతులు మార్కెట్కు ఉల్లిని తెచ్చినా వేలం వేయకపోవడంతో వారు కూడా బయటకు వచ్చి వినియోగదారులకు నేరుగా అమ్ముకున్నారు. ఉదయం 8గంటల నుంచి రైతులు మార్కెట్ బయట కోయిల్సాగర్ రోడ్డుకు రెండు వైపులా వాహనాలను నిలిపి వాటిలో తెచ్చిన ఉల్లిని నేరుగా అమ్మకాలు సాగించారు. నాణ్యమైన ఉల్లిని బస్తాకు రూ.550నుంచి రూ. 500వరకు అమ్మకాలు సాగించడంతో వినియోగదారులు జోరుగా కొనుగోళ్లు సాగించారు. -
పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరై.. సత్తా చాటారు
అమరచింత: తండ్రి చనిపోయిన విషయం తెలిసినా.. దుఃఖంలోనూ పది పరీక్షకు హాజరైన బుధవారం విడుదల అయిన ఫలితాల్లో విజయం సాధించారు. మండలంలోని నందిమళ్ల ఎక్స్రోడ్కు చెందిన విద్యాసాగర్ ఈర్లదిన్నె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షలకు హాజరవుతున్నాడు. అప్పుడే విద్యాసాగర్ తండ్రి హరిజన జలంధర్ అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మృతదేహం ఇంట్లో ఉన్నా.. బాధను దిగమింగుకుని విద్యాసాగర్ అమరచింతలోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశాడు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులు అభినందించారు. పాంరెడ్డిపల్లిలో.. మండలంలోని పాంరెడ్డిపల్లికి చెందిన మున్నూరు వెన్నెల హైదరాబాద్లోని బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ పరీక్షలకు హాజరయ్యేది. పరీక్షల సమయంలో వెన్నెల తండ్రి పూల వెంకట్రెడ్డి వ్యాపారం నిమిత్తం బైక్పై వెళ్తుండగా నర్వ మండలంలోని బెక్కర్పల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెన్నెల బాధలోనూ పరీక్ష హాజరై ఉత్తీర్ణత సాధించింది. -
‘విదేశీ ఒప్పందాలతో రైతాంగానికి ముప్పు’
మహబూబ్నగర్ (వ్యవసాయం): విదేశీ వాణిజ్య ఒప్పందాల ను దొడ్డిదారిన కాకుండా ప్రజా సమక్షంలో పారదర్శకంగా చేసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఒప్పందాల వల్ల దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం ‘భారత వ్యవసాయంపై ప్రభావం’ అంశంపై బుధవారం జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ ఉత్పత్తులను సున్నా సుంకంతో దిగుమతి చేసుకోవడం వల్ల స్వదేశీ రైతులు నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా పత్తి దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల సుమారు 40 లక్షల మంది పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి నష్టపోతున్నారని వాపోయా రు. పాల ఉత్పత్తులపై సుంకాలు తొలగించి విదేశి దిగుమతులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా పాడి రైతులకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం తప్పదు అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్రెడ్డి వాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధం వల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. మిగులు ఉత్పత్తులను విక్రయించేందుకు యుద్ధాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని విమర్శించారు. యుద్ధాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, యుద్ధ నైతికతను పక్కనబెట్టి దాడులు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాములు, కిల్లె గోపాల్, జగన్, కడియాల మోహన్, రాంరెడ్డి, మల్లెల మాణిక్యంరాజు, మీసాల కుర్మయ్య, చంద్రకాంత్, సత్తయ్య, రాజ్కుమార్, రామదాస్, ఖమర్ అలీ, ప్రశాంత్, భానుప్రసాద్, ఆది విష్ణు, గాలన్న, రాములు, శివలీల, ఖయ్యూం, సురేష్, ఈశ్వర్ పాల్గొన్నారు. -
పదిలో 26వ సా్థనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా ర్యాంకు కాస్త మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో గతేడాది 92.07 శాతంతో 29వ స్థానంలో ఉండగా.. ఈసారి 94.57 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానానికి ఎగబాకింది. అలాగే ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. దీంతోపాటు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. మూడు స్థానాలు పెరిగి.. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 13,199 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 6,602 మంది.. 6,597 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 12,482 మంది (94.57 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 6,325 మంది (95.88 శాతం) బాలికలు, 6,157 మంది (93.26 శాతం) బాలురు ఉన్నారు. బాలురతో పోల్చితే బాలికలు మెరుగైన ఫలితాలు రాబట్టారు. నేటినుంచి.. 14 వరకు జవాబుపత్రాలను రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టు కోసం రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించింది. గురువారం నుంచి వచ్చేనెల 14 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీరితోపాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల వారీగా.. ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 6,415 మంది పరీక్ష రాయగా.. 5,807 మంది (90.52 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీల్లో 646 మంది బాలికలు పరీక్ష రాయగా.. 628 మంది (97.21 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. మోడల్ స్కూళ్లకు సంబంధించి 67 మంది అందరూ పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ గురుకులాల్లో 493 మంది పరీక్ష రాయగా 491 మంది (99.59 శాతం), రెసిడెన్సియల్ 76 మంది (100 శాతం), సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 382 మందికి గాను 379 మంది (99.21 శాతం), ట్రైబల్ వెల్ఫేర్లో 158 మందికి గాను 152 మంది (96.20 శాతం), రెసిడెన్సియల్ మినీ గురుకులాల్లో 508కి గాను 494 మంది (99.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 94.57 శాతం ఉత్తీర్ణతతో మెరుగుపడిన జిల్లా ర్యాంకు 13,199 మందికి గాను 12,482 మంది పాస్ పలు పాఠశాలలు, గురుకులాల్లో వందశాతం ఫలితాలు నేటినుంచే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు మెరుగుపడ్డాయి.. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలకు సంబందించిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఇక రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్, సఫ్లిమెంటరీ పరీక్షల కోసం సూచించిన తేదీల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. – ప్రవీణ్కుమార్, డీఈఓ -
తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వచ్చే మే నెలలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో జిల్లా లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో మండల స్థా యిలో తరచూ సమావేశాలు నిర్వహించి నీటి సరఫరా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను పర్యవేక్షించి నిరంతర సరఫరా చేయాలని సూచించారు. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, గతే డాది నీటి ఎద్దడి ఎదుర్కొన్న గ్రామాలను గుర్తించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్త బోర్ల అనుమతులు కేవలం అత్యవసర, నీటి అవకాశం ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఇస్తామన్నారు. ● సమావేశానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల ప్రత్యేకాధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జయాబాయి తదితరులు పాల్గొన్నారు. -
నూతన డీఎఫ్ఓగా శివ్ ఆశిష్ సింగ్
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లా నూతన అటవీ శాఖ అధికారిగా 2018 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి శివ్ ఆశిష్ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు అటవీ శాఖ అధికారిగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న శివ్ ఆశిష్ సింగ్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 108లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు పాలమూరు: జిల్లాలోని 108 అంబులెన్స్లలో మేనేజర్, ఈఎంఈ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 విభాగం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తిచేసి ఆటోమొబైల్ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 2న జనరల్ ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.94912 71103ను సంప్రదించాలని కోరారు. -
ఆరోగ్య శాఖ విస్తృత కార్యక్రమాలు
పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని మోతీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 119 మందికి ఎక్స్రే, 21 మందికి తెమడ పరీక్షలు చేయగా.. నలుగురికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా జిల్లాలోని పలు పీహెచ్సీల పరిధిలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు. మిడ్జిల్ పీహెచ్సీ పరిధిలో 595 ఇళ్లు సందర్శించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. నీటి నిల్వలలో లార్వాలను గుర్తించి నిర్మూలన చర్యలు చేపట్టారు. 19 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. -
కేంద్ర పథకాలు పక్కాగా అమలుచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎంపీ, దిశ చైర్మన్ డీకే అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ నిధులు, రాష్ట్ర వాటా నిధులతో అమలుచేస్తున్న కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలులో లోపాలు ఉంటే సవరించుకొని ఎవరికి చేరాలో వారికి లబ్ధి జరిగినప్పుడు లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.2.40 కోట్లు కేటాయించగా.. రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని, ఇందులో రూ.1.35 కోట్లు ఖర్చు చేసి గ్రూప్లు, వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు రెంట్, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా అందచేశామని డీఏఓ వెంకటేష్ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, పెద్ద రైతులకు కాకుండా.. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యూరియా, ఎరువులు తగ్గించి సహజ వ్యవసాయం ప్రోత్సహించేందుకు నేషనల్ మిషన్ మిషన్ ఫర్ నేషనల్ ఫార్మింగ్ కింద 20 క్లస్టర్లలో 2,500 ఎకరాలు, క్లస్టర్కు 125 ఎకరాల్లో 2,500 మంది రైతులు ఈ సంవత్సరం సహజ వ్యవసాయం ద్వారా వరి, మొక్కజొన్న, కూరగాయలు రైతులు పండిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కమ్యూనిటీ సోక్ పిట్స్ వెంటనే పూర్తిచేయాలన్నారు. భారత్మాల రోడ్డు మహబూబ్నగర్ నగర పరిధిలో అలైన్మెంట్ మార్చడంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, అలైన్మెంట్ రెవెన్యూ, ఎన్హెచ్ అధికారులు సర్వే చేసి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్కు సూచించారు. మున్సిపాలిటీలలో అమృత్ కింద చేపట్టిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించి, వీటి పురోగతిపై స్థానిక ఎంపీగా తనకు సమాచారం అందించాలని, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన మిగిలిన నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పిస్తాహౌస్ నుంచి పాలకొండకు వెళ్లే దారిలో ఫ్రెష్మీట్ వద్ద డివైడర్ తొలగించారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ● చేవెళ్ల ఎంపీ, దిశ కోచైర్మన్ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గండేడ్, ముహమ్మదాబాద్ మండలాల్లో నీటి సమస్య లేదని, ఆయిల్పాం సాగుపై ఆదర్శ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారికి సూచించారు. గండేడ్ మండలం సల్కర్పేట పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, వెంటనే క్షేత్రస్థాయిలో మైనింగ్ అధికారులు పర్యటించి అరికట్టేలా చూడాలన్నారు. ● కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, మేయర్ మమత, తదితరులు పాల్గొన్నారు. లైనింగ్ పనులు చేపట్టాలి.. భూ సేకరణ వేగవంతం చేసి లైనింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి రైల్వే అధికారులతో ఎంపీ సమీక్షించారు. మహబూబ్నగర్– డోన్ రైల్వేమార్గం డబ్లింగ్ పనులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ త్వరగా చేయాలన్నారు. మహబూబ్నగర్ నగరంలోని టీడీగుట్ట వద్ద నూతనంగా మంజూరు చేసిన పనులు త్వరగా మొదలుపెట్టాలన్నారు. రైల్వే ద్వారా చేపట్టిన అండర్ పాస్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంజయ్ కుమార్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఖాజీపూర్లో వ్యక్తి హత్య
● బండరాయితో మోది దారుణంగా.. ● ఆనవాళ్లు లేకుండా నీటితో శుభ్రం కొత్తపల్లి(మద్దూరు): బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మద్దూరు మండల పరిధిలోని ఖాజీపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఎండీ అహ్మద్(37) వృత్తిరీత్యా మద్దూరు పట్టణంలో మెకానిక్ పని చేస్తున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలోని పొలంలో ఫౌల్ట్రీఫాం నిర్మాణ చేపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫాంలో పడుకొని ఉండగా గుర్తు తెలియని దుండగులు దాడిచేసి బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం దాడి జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కనిపించకుండా బోరు మోటార్ నీటితో శుభ్రం చేసి అహ్మద్ శవంపై ఉన్న రక్తపు మరకలు లేకుండా చేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లున్న రైతులు నీరు వృథాగా పోతుందని దగ్గరకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ ఘటనా స్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్, బయోమెట్రిక్ ఆనవాళ్లు తీసుకున్నారు. మృతుడి భార్య సాహిబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు మద్దూరు ఇన్చార్జి ఎస్ఐ రేవతి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. మార్లబీడులో వ్యక్తి మృతి ధరూరు: మండల పరిధిలోని మార్లబీడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (37) గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కాళ్లకు రక్తగాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నందికర్ డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించాలి
అలంపూర్: షాఅలీ పహిల్వాన్ ఉర్సును అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు నిర్వాహణపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్ఐ రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాముడు, ఆయా శాఖల అధికారులు, దర్గా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు హాజరై మాట్లాడారు. మే 9 నుంచి 12వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 9న రాత్రి గంథోత్సవం, 10న సర్ ముబారక్ దర్గాలో చిన్నకిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్దకిస్తీ పోటీలు, 12న చివరి రోజు మహిళలకు ప్రత్యేక ఉర్సు ఉంటుందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగు సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ ఆయా శాఖల అధికారులను సూచించారు. మున్సిపాలిటీ అధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు, రవాణ సౌకర్యం, తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు, దర్గా నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘సింగిల్ విండో’ల్లో సిబ్బంది అక్రమాలు
● రికవరీ పేరుతో డబ్బులు స్వాహా ● రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి.. గండేడ్: కంచె చేను మేసిందనే చందంగా రికవరీ పేరుతో డీసీసీబీ, పీఏసీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రికవరీ చేసిన డబ్బును రెతుల ఖాతాల్లో జమచేయకుండా స్వాహా చేశారు. పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా బాధిత రైతుల డబ్బులు సర్డుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి గండేడ్ (గండేడ్, మహమ్మదాబాద్ మండలాలు) మండలంలో పీఏసీఎస్తో పాటు డీసీసీ బ్యాంకుల పరిధిలో 24 పంచాయతీలతో పాటు 33 అనుబంధ గ్రామాలు ఉండగా.. రైతులకు పంట, దీర్ఘకాలిక, పీటీ ట్రేడర్స్ రుణాలు ఇచ్చారు. అక్రమాలకు నెలవు.. ఆయా గ్రామాల్లో రుణాల రికవరీకి గాను బ్యాంకు సిబ్బందితో పాటు పీఏసీఎస్ సిబ్బంది కూడా వెళ్లేవారు. ప్రతి మార్చి నెలలో రుణాలు రికవరీ చేసి లక్ష్యం పూర్తి చేయాలనే ప్రభుత్వం సూచిస్తుండడంతో సిబ్బంది నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి రుణా లు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. అలా వసూలు చేసిన డబ్బును బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయకుండా సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గండేడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి, గోవింద్పల్లి పగిడ్యాల్, బల్సుర్గొండ, రెడ్డిపల్లి, మహమ్మదా బాద్ తదితర గ్రామాల్లో బాధిత రైతులు ఉన్నారు. రశీదుల్లో మాయాజాలం... రైతుల నుంచి రుణాలు రికవరీ చేసినప్పుడు పీఏసీఎస్ ముద్ర, సీఈఓల సంతకాలు లేకుండా చేతితో రాసిన రశీదులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది వాటిని దారి మళ్లించి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది. గతంలో మహమ్మదాబాద్ డీసీసీబీ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి బదిలీపై పక్క మండలానికి వెళ్లాడు. ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూడడంతో సదరు మేనేజర్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. దాదాపు ఈ తతంగం జరిగి పది రోజులు గడుస్తున్నా.. విషయం బయటపడకుండా గోప్యంగా ఉంచారు. ఆయన సస్పెండ్ కావడంతో దాని నుంచి బయట పడేందుకు వాడుకున్న డబ్బులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. పగిడ్యాల్లో ఓ రైతు, జక్లపల్లిలో ఓ రైతు, కొంరెడ్డిపల్లిలో కొంతమంది రైతులు కట్టిన డబ్బులు స్వాహా చేశారు. వ్యవహరం బయటపడడంతో అధికారులు వాటిని కట్టినట్లు తెలియవచ్చింది. మిగతా వాటిని కూడ సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే డీసీసీబీ, పీఏసీఎస్ సిబ్బంది బాగోతం మరింత బయటపడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
‘రైతులపై ప్రభుత్వ కపట ప్రేమ’
● ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతల నిరసన ● పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అన్నారు. మంగళవారం స్థానిక గాంధీచౌక్లో జూరాల గ్రామానికి చెందిన రైతులు బీఆర్ఎస్ నాయకుడు శివ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. లారీలు రావడం లేదని, బ్యాగులు లేవని ధాన్యం కాంటా చేయకుండా చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన కాస్త పంటను కాపాడుకుని తీసుకొస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ జేకే మోహన్, ఎస్ఐ జయన్న ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతల మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గంట పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు కిష్టన్న, గోవిందు, రవి, మాసన్న తదితరులు ఉన్నారు. -
అకాల వర్షంతో అవస్థలు
● స్వల్పంగా తడిసిన మొక్కజొన్న బస్తాలు ● ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు ● ధాన్యం తడవకుండా రైతుల అవస్థలు జడ్చర్ల/వెల్దండ/అమ్రాబాద్/లింగాల: జడ్చర్లలో మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. వర్షం కురువడంతో బాదేపల్లి మార్కెట్లో ఆరుబయట ఉన్న మొక్కజొన్న బస్తాలు స్వల్పంగా తడిశాయి. గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి భారీగా రైతులు మొక్కజొన్నను తీసుకొచ్చారు. అయితే అక్కడ కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పగా.. వర్షం కొద్దిసేపు కురువడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా వస్తే తడిసిపోయే ప్రమాదముండేదని, చిరుజల్లులు కురువడంతో ఎలాంటి నష్టం కలుగలే దని రైతులు తెలిపారు. త్వరితగతిన మొక్కజొన్న ను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ● వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని మొక్కజొన్న బస్తాలు మంగళవారం సాయంత్రం కురుసిన వర్షానికి తడిసిపోయాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి సింగిల్ విండో అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మూడురోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం బస్తాలను నిల్వ చేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 6వేల బస్తాలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం బస్తాలు వర్షంలో తడిసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు ట్రాక్టర్లలో మొక్కజొన్న పంటను తీసుకురాగా.. బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అకాల వర్షానికి మరో వేయి బస్తాల ధాన్యం తడిసినట్లు తెలిపారు. ● లింగాల మండలంలో మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, లైన్లకు ప్రమాదం పొంచి ఉండడంతో విద్యుత్తు శాఖవారు ముందస్తుగా సరఫరాను నిలిపి వేశారు. దీంతో మండల వ్యాప్తంగా కొన్ని గంటలపాటు సరఫరాకు అంతరాయం కలిగింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడ్డారు. ధాన్యంపై కవర్లను కప్పి ఉంచారు. ● అమ్రాబాద్, పదర మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం గంటపాటు అకాల వర్షం కురిషింది. వర్షం రాకతో అక్కడక్కడ వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. వేసవి దుక్కులు దున్నుకునేందుకు వర్షం సకాలంలో పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిలలో హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలు పై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టు ను ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణంపై హైకో ర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయి తే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలో సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలీకాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరోరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరి జం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైల ం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీపంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
12 రోజులుగా పడిగాపులు
జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి 140 బస్తాల మొక్కజొన్న తీసుకువచ్చాను. కొనుగోలు చేయకపోవడంతో కుప్ప వద్దే 12 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా. పొలం దగ్గర వరిచేను కోసి కుప్ప వేశాను. ఇంటి వద్ద గొర్లను కాసే దిక్కులేదు. ఇక్కడేమో కొనుగోలు చేయడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – నారాయణ, రైతు, మద్దిగట్ల కలెక్టరే న్యాయం చేయాలి.. మొక్కజొన్న అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. 25 రోజులుగా ఆరబెట్టడం, కుప్పగట్టడం, తూర్పార బట్టడమే సరిపోయింది. ప్రతిరోజు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై కాలుకు తీవ్ర గాయమైంది. అయినా కొనుగోలు చేయడం లేదు. వర్షం వచ్చే పరిస్థితి ఉన్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ మాకు న్యాయం చేయాలి. – హిర్మన్, రైతు, మొరంబాయితండా గోస పడుతున్నాం.. అనేక కష్టనష్టాలకు గురై పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకుపోయేందుకు పడుతున్న గోస అంతా ఇంతా కాదు. తిండి.. తిప్పలు మాని నెలరోజులుగా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా.. పట్టించుకునే దిక్కులేదు. రేపు.. మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత అన్యాయం ఎప్పుడూ చూడలే. అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. – టోక్య, రైతు, గోప్లాపూర్ ● -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మహబూబ్నగర్ క్రైం: చించోళి బైపాస్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. వీరన్నపేట ఎర్రమన్నుగుట్ట సమీపంలోని చించోళి బైపాస్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం నగరంలోని మోనప్పగుట్టకు చెందిన వేణుగోపాల్తోపాటు నిరంజన్, శషాంక్ ముగ్గురు కలిసి అయిల్ డబ్బాలు తీసుకుని బొలేరోలో వస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న తాహేర్(40) దుర్మరణం చెందగా కారులో ఉన్న ఇమ్రాన్, రెహాన్కు తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్కు తరలించారు. బొలేరోలో ఉన్న వేణుగోపాల్, నిరంజన్, శషాంక్ను జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● చించోళి బైపాస్ రోడ్డుపై ఎర్రమన్నుగుట్ట సమీపంలో కొంత మేర మలుపు ఉండడంతో ముందు వచ్చే వాహనం దగ్గరకు వెళ్లే వరకు కన్పించదు. దీంతో కారు చాలా వేగంగా ఉండడంతో అదుపు కాకపోవడంతో ఎదురుగా వచ్చిన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు స్టీరింగ్ ఊడిపోయి బయటపడింది. అయితే వీరన్నపేట సమీపంలో బైపాస్ రోడ్డుపై అధికంగా దాబాలు ఉండటంతో మద్యం మత్తులో తరచూ ప్రమాదాలకు చోటుచేసుకుంటున్న తెలుస్తోంది. -
కందనూలులో భారీ వర్షం
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ప్రధాన రోడ్డుపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చెట్లు నేలకొరిగిగాయి. విద్యుత్ పూర్తిగా గంటపాటు నిలిచిపోయింది. నెల్లికొండ మార్కెట్ యార్డులో కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు తడిసిపోయాయి. వారంరోజుల నుంచి రైతులు మార్కెట్కి అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం ఒక్కసారి వర్షం రావడంతో తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేసినా భారీ వర్షానికి చేసేదిలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. ఆకాల వర్షం రైతన్నలను నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వేగవంతంగా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు. -
ఇక ప్రత్యేక పాలనేనా..?
అచ్చంపేట: జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం మరో 9 రోజుల్లో ముగియనుంది. మే 7 నుంచి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా.. సమయం తీసుకుంటారా.. అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదని పాలక వర్గాల సభ్యులు నిరాశలో ఉన్నారు. మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే వార్డుల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చొరువ తీసుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా.. మొత్తం 20 వార్డు స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 5 స్థానాలు బీసీ, 10 జనరల్కు రిజర్వ్ అయ్యాయి. 6 వార్డులు మహిళలకు కేటాయించారు. జడ్చర్ల మున్సిపల్ పీఠాన్ని జనరల్కు రిజర్వు చేశారు. వేధిస్తున్న నిధుల కొరత 2023 జూన్ నుంచి ఆయా మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతినెలా జనాభా ప్రకారం రూ. 30 నుంచి 60లక్షలు వరకు నిధులు వచ్చేవి. అవి ఇప్పుడు నిలిచిపోవడంతో సమస్యలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు తప్ప జనరల్ ఫండ్ కార్మికుల జీతాలకే సరిపోని కారణంగా ఇతర అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి మున్సిపాలిటీల్లో నెలకొంది. ఎన్నికలపై కానరాని కసరత్తు పాలకవర్గానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. మే 4న జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పాలకవర్గానికి సన్మానం అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశాన్ని మే 4 లేదా 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కుమారుడి వివాహా వేడుకల్లో బిజీగా ఉండటంతో వచ్చే నెల మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. మారిన రాజకీయ ముఖచిత్రంతో.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పాలన ప్రారంభం కావడంతో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్పై 2024 జూన్12న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీతో కలిపి 15 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో.. కాంగ్రెస్ కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు జూలై 6న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. జడ్చర్ల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ డి.లక్ష్మిపై అదే ఏడాది సెప్టెంబరులో అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్కే చెందిన పుష్పలత చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అచ్చంపేట, జడ్చర్ల ‘పుర’ పాలనకు కౌంట్డౌన్ 9 రోజుల్లో ముగియనున్న పదవీకాలం వచ్చే నెల మొదటి వారంలో చివరి కౌన్సిల్ సమావేశం ఎన్నికలపై సర్వత్రా చర్చ నిరాశలో మున్సిపల్ పాలక వర్గాలు -
2 నుంచి బాలోత్సవ్ వేసవి శిబిరం
స్టేషన్ మహబూబ్నగర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సృజనను పెంపొందించుకునేందుకు పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 22 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రెయిన్బో హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 రోజులపాటు జరగనున్న శిబిరాలను రెయిన్బో హైస్కూల్లో నిర్వహిస్తామని, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాల, బాలికలకు జానపద నృత్యం, వెస్ట్రన్ డాన్స్, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. పిల్లలు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి సృజనాత్మకత కార్యక్రమాల వైపు మళ్లేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. శిక్షణలో పాల్గొనాలనుకునే వారు సెల్ నం.93983 05993ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం వేసవి శిబిరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. -
బీచుపల్లికి బ్రహ్మోత్సవ శోభ
● నేటి నుంచి ఉత్సవాలు ● హాజరుకానున్న వేలాది మంది భక్తులు ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఐదురోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పంచామృతాభిషేకం, వాస్తు పూజహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం, 30న ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, మే 1న ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, 2న ఉదయం పంచామృతాభిషేకం, చౌకీసేవ, ప్రభోత్సవం, 3న అమృతస్నానం, పంచామృభిషేకం, పల్లకిసేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం 7: 30లకు ఆకుపూజ, అభిషేకం జరుగుతుంది. ప్రతిఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా (నెలరోజుల పాటు) భక్తులు స్వామివారికి దాసంగాలను సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానది ఉంది. భక్తులు నదిలో పుణ్యనాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు అధికంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ప్రతి అమావాస్య నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేస్తారు. అదే విధంగా దేవస్థానం వద్ద దాసంగాలు, వివాహాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, పుట్టు వెంట్రుకలు తీయుట, నామకరణం వంటి కార్యక్రమాలను అధికంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో సీతారామ కల్యాణానికి ఆలయ వ్యవస్థాపక వంశీయులు, ఎంపీ డీకే అరుణ, భరతసింహారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైంది. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆంజనేయస్వామి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు ఆలయ ఈఓ పురందర్కుమార్ తెలిపారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. -
తెలంగాణకు రెండో విజయం
తెలంగాణ జట్టు ఆడిన రెండో మ్యాచ్లోనూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన చండీఘడ్ మొదట బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. జట్టులో ఆహన్ 47 పరుగులు, సూరజ్ 42 పరుగులు చేశారు. సాయి తనిష్క్ 2 వికెట్లు తీశారు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలంగాణ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. షాన్ విన్సెంట్ 41 బంతుల్లో 76 పరుగులు చేయగా హర్షిత్ 33 పరుగులు చేసి విజయంలో కీలకం అయ్యారు. బౌలింగ్లో అర్వదీప్ 2 వికెట్లు తీశాడు. ● ఉత్తరప్రదేశ్– డీఎన్హెచ్డీడీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. జట్టులో ఆయుష్మాన్ 43 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి.. త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీఎన్హెచ్డీడీ జట్టు 76పరుగులకే ఆలౌట్ అయి 134 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ● ఢిల్లీ– ఎన్వీఎస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగా జట్టులో రాహుల్ 21 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్వీఎస్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. హర్షిల్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ● హర్యానా– మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 109 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ చేపట్టిన మహారాష్ట్ర 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్యానా జట్టులో నకుల్, ప్రియాంషు చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు. -
భోజన ఏర్పాట్లపై అసంతృప్తి
జడ్చర్ల టౌన్: జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో భోజన ఏర్పాట్లపై ఆయా రాష్ట్రాల కోచ్లు, మేనేజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో క్రీడాకారుడికి రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తున్నా సరైన భోజనం అందించడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా సమయపాలన లేదంటూ వాపోతున్నారు. స్వామినారాయణ గురుకులంలో బస ఏర్పాటు చేయగా జడ్చర్లలో రెండు, మహబూబ్నగర్లో మూడు మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భోజనాలు మాత్రం బాదేపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. బస చేసిన ప్రాంతం, మైదానం నుంచి రావడానికి బస్సులు ఏర్పాటు చేసినా సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. అలాగే భోజనం చేసేందుకు ముందుగా క్రికెట్ మ్యాచ్లు ఉన్న జట్లను పిలవడంతో మిగిలిన జట్లు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా మధ్యాహ్న భోజనం ఏకంగా 3 గంటలకు చేస్తుండటంతో క్రీడాకారులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్ని జట్లకు భోజనం వడ్డించేందుకు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కొందరు క్రీడాకారులు బయటి హోటళ్లలో అల్పాహారాలు, భోజనం చేస్తున్నారు. నార్త్– సౌత్ల మధ్య.. భోజనాలు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఉండటంతో ఉత్తర భారతదేశానికి చెందిన జట్లు రుచిలేక ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని జట్లు సైతం తమ ప్రాంత భోజనం లేదంటూ వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ రాష్ట్రానికి చెందిన కోచ్, మేనేజర్లు వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు క్యాటరింగ్ వారితో చర్చించి రెండు ప్రాంతాలకు సరిపోయేలా భోజనం చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
లీగ్ మ్యాచుల్లో హోరాహోరీ
జడ్చర్ల టౌన్: జడ్చర్ల, మహబూబ్నగర్ మైదానాల్లో జరుగుతున్న ఎస్జీఎఫ్ 69వ జాతీయ అండర్ 17 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ టోర్నీలో రెండో రోజు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. మొత్తం 5 మైదానాల్లో జరిగిన మ్యాచుల్లో ఆయా రాష్ట్రాల జట్లు ప్రతిభ కనబర్చి విజయాలు నమోదు చేశాయి. జడ్చర్ల మినీ స్టేడియంలో.. జడ్చర్ల మినీ స్టేడియంలో పంజాబ్– గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన పంజాబ్ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ జట్టులో అరవింద్ 3 వికెట్లు తీయగా, గుజరాత్ జట్టులో పృథ్వీ పటేల్ 28 పరుగులు చేసి టాపర్గా నిలిచాడు. 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కేవలం 4 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. జట్టులో రన్వీర్ 14 బంతుల్లో 45 పరుగులు చేశాడు. జమ్మూకశ్మీర్ విజయం మినీ స్టేడియంలోనే జమ్మూకశ్మీర్– సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో జమ్మూకశ్మీర్ విజయం సాధించింది. టాస్ గెలిచిన సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన జమ్మూకశ్మీర్ 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మూసేబ్ 20 బంతుల్లో 58 పరుగులు, హర్ష్ 26 బంతుల్లో 44 పరుగులు చేయటంతో అధిక స్కోరు చేయగలిగారు. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్టు లక్ష్య చేధనలో డీలా పడింది. 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్లో పైస్, సుబబ్, ప్రదీప్లు చెరో రెండు వికెట్లు తీశారు. టోర్నీలోనే అఽత్యధిక స్కోరు జమ్మూకశ్మీర్ జట్టు నమోదు చేయటం గమనార్హం. 49 పరుగుల తేడాతో బిహార్ విజయం స్వామినారాయణ గురుకుల మైదానంలో పాండిచ్చేరి– బిహార్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో బిహార్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బిహార్ నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బౌలింగ్లో పృథ్వీరాజ్ 2 వికెట్లు తీయగా రిషివర్మ, దివాకర్, టోనిలు ఒక్కో వికెట్ తీశారు. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. బిహార్ బౌలర్ ఓంకార్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో.. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో జార్ఖండ్– చత్తీస్ఘడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన జార్ఖండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన చత్తీస్ఘడ్ 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆకాష్ 45 పరుగులు చేయగా హర్షిత్ 3 వికెట్లు తీశాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాదించింది. మహబూబ్నగర్ బీఎస్ఆర్ మైదానంలో ఢిల్లీ– సీబీఎస్ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. సీబీఎస్ఈ జట్టు టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ ఇచ్చింది. ఢిల్లీ జట్లు 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో ఆరుష్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్ఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో కుశాల్ 41 పరులుగు చేశాడు. దీంతో 65 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఐపీఎస్సీఈ విజయం స్వామినారాయణ్ గురుకుల మైదానంలోనే కర్ణాటక– ఐపీఎస్సీఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఐపీఎస్సీఈ జట్టు విజయం పొందింది. టాస్ గెలిచిన కర్ణాటక జట్టు 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో శ్రీజేష్ 24 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐపీఎస్సీఈ జట్టు చివరి బంతి మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో ధృవ్సోకిన్ 19 బంతుల్లో 42 పరుగులు, శ్లోక్వర 25 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయానికి కారణమయ్యారు. బీఎస్ఆర్ మైదానంలో.. కొనసాగుతున్న ఎస్జీఎఫ్ జాతీయ క్రికెట్ టోర్నీ -
స్కూల్ తరలించాలనడం సరైందికాదు
దేవరకద్ర: నియోజకవర్గానికి ఎంతో కృషి చేసి తెచ్చిన ఇంటిగ్రేటేడ్ స్కూల్ను తరలించాలనడం సరైంది కాదని, దీని కోసం సంతకాల సేకరణ చేసే ముందు తనను కలిస్తే వివరించేవాడినని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. 25 ఎకరాల భూమి ఎక్కడా లభించకపోవడం వల్లనే అక్కడి వాతవరణం బాగుండడంతో ఎంపిక చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఖండిస్తూ సోమవారం ఎమ్మెల్య క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ కంపెనీ వచ్చిందని దీంతో 26 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీదే ఇథనాల్ కంపెనీ అని దీన్ని ఆనాడే వ్యతిరేకించామన్నారు. కొల్లూరు వద్ద రూ. వంద కోట్లు పెట్టి భూమి కొన్నానని ఆరోపించడంలో నిజం లేదని, అక్కడ భూమి కొన్నట్లు నిరూపిస్తే అక్కడే వదిలేస్తానని సవాల్ చేశారు. తనకు కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. ఎవరిని అక్రమ కేసులు పెట్టి బెదిరించి తీసుకోలేదని బీఆర్ఎస్కు చెందిన వారే స్వచ్ఛందంగా వచ్చి చేరితేనే తీసుకున్నామన్నారు. 2014 నుంచి 2024 వరకు ఎన్ని కేసులు పెట్టారో లెక్కతీద్దామన్నారు. సంతోష్రెడ్డిపై మీరే 9 కేసులు పెట్లారనే విషయం గుర్తించాలన్నారు. మా తమ్ముడిని అనవసరంగా ఇందులోకి లాగవద్దన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 50 వేల మెజార్టీతో గెలుస్తానన్నారు.ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్లు కథలయ్య, ప్రశాంత్, మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, టీపీసీసీ నాయకులు అరివింద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి మహబూబ్ నగర్ న్యూటౌన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లకు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఆస్పత్రి ఎస్ఆర్(సీనియర్ రెసిడెన్స్) డాక్టర్లకు ఆరునెలల పెండింగ్ ఉపకారవేతనం తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డితో కలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగాఅజ్మీరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్లతో సమానంగా తమ ఆరోగ్యాలు, ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం మూడునెలల వేతనాలు పెండింగ్లో ఉంచడం సబబు కాదని పేర్కొన్నారు. సీనియర్ రెసిడెన్స్ సిబ్బందికి ఆరునెలలుగా స్టైఫండ్ పెండింగ్లో ఉందని, విధులకు వచ్చేందుకు కనీసం రవాణా ఖర్చులకు కూడా అప్పులు చేసే దుస్థితి నెలకొన్నదన్నారు. ఆస్పత్రిలోని ఎన్హెచ్ఎం సిబ్బందికి ఆరునెలల వేతనాలు బకాయి ఉందన్నారు. ప్రభుత్వం పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ వైద్యులు, డాక్టర్ రోహిత్ పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
మహమ్మదాబాద్: విద్యుత్ ట్రాన్స్పార్మర్ను పట్టుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి(40) అన్నారెడ్డిపల్లి రోడ్డు సమీపంలో గేటుకు 100మీటర్ల దూరంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడే తాను వేసుకున్న చెప్పులను వదిలి నేరుగా ట్రాన్స్పార్మర్ను పట్టుకున్నాడు. వెంటనే ఫీజులు ఎగిరి పెద్దగా శబ్ధం వచ్చి అక్కడే పడిపోయాడు. దీంతో నిప్పులు వచ్చి మంటలు చెలరేగి అక్కడే మృతిచెందాడు. అక్కడే పొలాల్లో పనిచేస్తున్న మహిళలు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది మంటల్లో చిక్కుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి స్థానికుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గుర్తుతెలియని వ్యక్తి కావునా గులాబిరంగు చొక్కా జీన్స్ ప్యాంటు ధరించినట్టు గుర్తులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు మహమ్మదాబాద్ పోలీసులను సందర్శించాలని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని కోరారు. వ్యక్తి బలవన్మరణం నవాబుపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కామారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడిగే చంద్రయ్య(61) కుటుంబ పోషణ భారంగా మారండంతో తరుచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఈనెల 26న ఆదివారం తన భార్యతో తగాదా పెట్టుకున్నాడు. అనంతరం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రించగా.. చంద్రయ్య ఒక్కడే ఇంటిపై ఉన్న మరో గదిలో నిద్రించాడు. రాత్రి సమయంతో ఆయన నిద్రించిన గదిలో నుంచి శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు లేచిచూసే సరికి ఇంటి పైకప్పునకు పంచెతో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తలిరించారు. చికిత్స ిపొందుతూ సోమవారం మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. రెండు బైకులు ఢీ..రైతు మృతి ● కుమార్తెకు తీవ్ర గాయాలు దామరగిద్ద: పొలం దగ్గరకు తన కుమార్తెతో కలిసి బైకుపై వెళ్లిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. మద్దూర్ మండలానికి చెందిన రైతు తిరులమలప్ప (56) అయ్యవారిపల్లి శివారులోని తన పొలానికి బైకుపై కుమార్తె జ్యోతి కలిసి వెళ్తుండగా మార్గమధ్యలో అయ్యవారిపల్లి మలుపు సమీపంలో వెనుక నుంచి అతివేగంగా బైకుపై వస్తున్న మోమినాపూర్కు చెందిన వెంకటేష్ ఢీకొట్టాడు. ప్రమాదంలో తిరుమలప్ప, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు మద్దూర్ ఆస్పత్రికి తరలించారు. తిరుమలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. జ్యోతికి చికిత్స పొందుతుంది. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి కృష్ణా: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని టైరోడ్డులో ఆదివారం జరిగింది. ఎస్ఐ నవీద్ వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి టై రోడ్డుపై వడదెబ్బ కారణంగా సొమ్మసిల్లి కిందపడ్డాడు. అటువైపుగుండా వెళ్తున్న పోలీసులు గమనించి చికిత్స నిమిత్తం రాయచూర్లోన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు. బావిలో పడి వ్యక్తి మృతి గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శ్రీను (45) మున్సిపల్ కార్యాలయంలోని బావి వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణానికి చెందిన పావని(43) జాతీయ రహదారిపై జమ్జమ్ హోటల్ సమీపంలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందింది. ఈ విషయంలో మృతురాలి కుమారుడు జస్వంత్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
ఉప్పొంగిన శివభక్తి
నవాబుపేట: ఓం నమఃశివాయ.. ఓం వీరభద్రాయ అంటూ నిప్పు కణికలపై నడిచి భక్తి పారవశ్యంతో పొంగిపొర్లారు భక్తులు. మండల పరిధిలోని లోకిరేవు వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవాలయంలో అగ్నిగుండంలో భక్తులు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. నాడు దక్షయజ్ఞం వీరభద్రుడు భగ్నం సందర్భంగా అగ్నిలో దూకి వీరంగం సృష్టించిన నేపథ్యంలో స్వామి దేవాలయాల్లో అగ్ని గుండాలు నిర్వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శివ భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామంలో పురవీధుల గుండా ఏర్పాటు చేసిన రథోత్సవం అందరిని ఆకట్టుకుంది. అనంతరం గురుస్వాములకు సత్కారం చేసి రథయాత్రలో ఊరేగించారు. కార్యక్రమంలో పూజారి లింగయ్య, వీరభద్రయ్యస్వామి, అర్చక సంఘం రాష్ట్ర నాయకుడు వీరన్న, యాదయ్య, మాజీ సర్పంచ్లు వెంకటేష్, సత్యం, కృష్ణయ్య, నర్సింహచారి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అగ్నిగుండంలో నడిచిన భక్తులు -
నిప్పంటుకొని మొక్కజొన్న పంట దగ్ధం
మిడ్జిల్: మండల కేంద్రం సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటకు నిప్పు తగులడంతో దాదాపు 6ఎకరాలలో సాగు చేసిన పంట కాలీ బూడిదైందని కౌలు రైతులు రాములు, రవి తెలిపారు. వారు మిడ్జిల్ సమీపంలో దాదాపు 8ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు సకాలంలో జరుగకపోవడంతో మరోవారం రోజుల తర్వాత పంటను కోద్దామనుకునేలోగా సోమవారం సాయంత్రం పంటకు నిప్పంటుకుంది. మంటలు వ్యాప్తించడంతో చుట్టుపక్కలవారు గమి నించి సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే 80 శాతం పంట కాలిపోవడంతో మంటలను అదుపు చేయగా.. రెండు ఎకరాల్లో మాత్రమే మి గిలిందని దాదాపు రూ.4నుంచి 5లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
వ్యసనాలకు బానిసై చోరీలు
జడ్చర్ల: ఆన్లైన్లో బెట్టింగ్లు తదితర వ్యసనాలకు బానిసులగా మారిన ఇద్దరు యువకులు చోరీలకు అలవాటు పడి జైలుపాలయ్యారు. ఇందుకు సంబంధించి సోమవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెళ్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన యువకుడు అబ్దుల్మతిన్ ఐఐటీ సంగారెడ్డిలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తించేవాడు. అలాగే ఏపీలోని నంద్యాల జిల్లా ఎరగుడూరుకు చెందిన దేవరశెట్టి శివకృష్ణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరు ఆన్లైన్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారి డబ్బు కోసం ఇద్దరు చేతులు కలిపి చోరీలకు పాల్పడ్డారు. వీరు పగటి వేళల్లో పట్టణాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కి నిర్వహిస్తారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి వెళ్లి చోరీలకు పాల్పడుతారు. ఈ కోవలోనే ఈనెల 11న జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి వెనుకవైపు తాళం వేసి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు లాకెట్, కమ్మలు, చైన్ చోరీ చేశారు. అదేవిధంగా ఈనెల 21న హౌజింగ్బోర్డు కాలనీలో తాళం వేసిన ఇంటిలోకి వెళ్లి బంగారు కమ్మలు, చైన్ నగదును అపహరించారు. మహబూబ్నగర్ బైపాస్ సమీపంలోని ఇంటిలో 15తులాల వెండి గొలుసులు అపహరించారు. ఆయా దొంగతనాలకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం జడ్చర్ల కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహణాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారు నగలతోపాటు 15 తులాల వెండి గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్, సీసీఎస్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిబిరాల సందడి
మహబూబ్నగర్ క్రీడలు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ శిబిరాల ఏర్పాటు కోసం జిల్లా యువజన, క్రీడలశాఖ దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఈ ఏడాది 24 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరం నిర్వాహకులకు (కోచ్లు) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపున రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు. ఎక్కడెక్కడంటే.. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎం.మల్లేష్– కబడ్డీ, జి.నరేష్– బ్యాడ్మింటన్ (అల్లీపురం), శ్రీకాంత్– అథ్లెటిక్స్ (మహమ్మదాబాద్), జి.రాఘవేంద్ర– సాఫ్ట్బాల్ (కొత్లాబాద్), ఎం.జంగయ్య– వాలీబాల్ (రాజాపూర్), డి.చరణ్– హ్యాండ్బాల్ (వస్పుల), ఎం.విజయ్– హ్యాండ్బాల్ (నల్లకుంటతండా), కనకప్ప– వాలీబాల్ (కోయిల్సాగర్), ఎస్.లింగం– అథ్లెటిక్స్ (పోతులమడుగు), నరేష్ కాట్రావత్– ఫెన్సింగ్ (దేవునిగుట్టతండా)లో ఏర్పాటు చేయనున్నారు. ● అర్బన్ పరిధిలో జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలో సునీల్కుమార్– అథ్లెటిక్స్, ఎం.రాజగోపాల్– బ్యాడ్మింటన్, ఎండీ ఖలీల్– బాస్కెట్బాల్, డి.నికేష్– ఫుట్బాల్, వి.శంకర్– బాక్సింగ్, ప్రదీప్కుమార్– హ్యాండ్బాల్, ఎం.బాలమణి– యోగా, నాగరాజు– సాఫ్ట్బాల్, పర్వేజ్పాష– వాలీబాల్, అబ్దుల్ రహెమాన్ఖాన్– వాలీబాల్ (క్రిస్టియన్పల్లి), ప్రణయ్కుమార్– హ్యాండ్బాల్ (మహబూబ్నగర్ హైస్కూల్, భగీరథకాలనీ), అబ్దుల్ ఫయూం– అథ్లెటిక్స్ (క్రిస్టియన్కాలనీ), వడెన్న– ఫుట్బాల్ (జడ్చర్ల), ఎం.శంకర్నాయక్– కబడ్డీ (బాలానగర్)లో కొనసాగనున్నాయి. కోచ్లకు దిశానిర్దేశం మెయిన్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సోమవారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై కోచ్లతో డీవైఎస్ఓ సన్నాహక సమావేశం నిర్వహించి కోచ్లకు దిశానిర్దేశం చేశారు. శిబిరాల్లో సమయపాలన పాటించాలని, వేసవి తాపం దృష్ట్యా శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా క్రీడల కోచ్లు సునీల్కుమార్, ఎండీ ఖలీల్, రహెమాన్, అంజద్, నికేష్, శంకర్, రాజ్గోపాల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో 24 శిక్షణ శిబిరాలు అర్బన్లో 14, గ్రామీణ ప్రాంతాల్లో 10 చొప్పున ఏర్పాటు మే 1 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ -
మామిడీలా..!
మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు ● టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు ● కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ● ఆందోళనలో మామిడి రైతులు కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29 వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. -
అక్రమ నిర్మాణాలకు షోకాజ్ నోటీసులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఇంటి, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ విషయమై ఈ నెల 16న ‘అతిక్రమణలు కోకొల్లలు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పది రోజుల వ్యవధిలోనే 34 మంది ఇంటి యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సరైన వివరాలు అందించాలని, లేనిపక్షంలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, వందలాది మంది నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడితే అధికారులు కొందరికి మాత్రమే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలు సకాలంలో పరిష్కరించాలి మహబూబ్నగర్ క్రైం: ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో అధికంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపైనే ఉంటున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె పోలీస్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం లేకుండా చూడాలన్నారు. జిల్లావాసులు తమ సమస్య లు చెప్పుకోవడానికి ప్రజావాణి ఉత్తమ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సమస్యలు సకాలంలో పరిష్కరించడం వల్ల ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతుందన్నారు. 3,052 మందికి టీబీ పరీక్షలు పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 28 టీబీ క్యాంపులు నిర్వహించగా.. సోమవారం భూత్పూర్ మండలంలోని తాడిపత్రి, ఎల్కిచర్ల గ్రామాల్లో క్షయ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో 105 మందికి ఎక్స్రే, 12 మందికి తెమడ పరీక్షలు, ఎల్కిచర్లలో 118 మందికి ఎక్స్రే, 8 మందికి తెమడ పరీక్షలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,052 మందికి ఎక్స్రే, 222 మందికి తెమడ పరీక్షలు చేయగా 9 మందికి క్షయ పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో టీబీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లిఖార్జున్ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో క్షయ లక్షణాలు ఉన్నవారు తప్పక పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం -
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమం, భూసర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 102 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అలాగే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 2 వరకు బాలల భద్రత, డ్రగ్స్ నిరోధం, మే 4 నుంచి 9 వరకు వ్యవసాయ శాఖ ద్వారా రైతు వారోత్సవాలు, మే 2న నియోజకవర్గ స్థాయిలో చేపట్టే కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆమె చాంబర్లో ఆవిష్కరించారు. ● కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు ఉదయం 10 గంటలకు హాజరై, జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంరెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు -
డీజిల్.. నో స్టాక్
● తీవ్రమైన కొరతతో జిల్లాలో పలుచోట్ల బంకుల మూసివేత ● అక్కడక్కడ తెరిచి ఉన్న వాటి వద్ద వాహనాల బారులు నగరంలోని జిల్లా జైలు పెట్రోల్ బంకు వద్ద ఇలా..పెట్రోల్ బంక్ వద్ద వాహనాల బారులు డీజిల్ కోసం ఆగిన ప్రైవేట్ అంబులెన్స్ మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ఇంధన కొరత ఒక్కసారి గా తీవ్రమవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగి క్యూలు ఏర్పడగా.. గంటల తరబడి వాహనదారులు బారులుదీరారు. జిల్లావ్యాప్తంగా హెచ్పీ, భార త్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందిన 112 బంకులు ఉండగా.. సోమవారం ఉదయం నుంచే మూతబడ్డాయి. ఇంధన కొరత మరింత తీవ్రంగా ఉంటుందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరుతున్నారు. సాధారణంగా ఒకటి, రెండు లీటర్లు పోయించుకునే వాహనదారులు ట్యాంకు ఫుల్ చేయించుకుంటుండటంతో బంకుల్లో ఇంధన నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మహబూబ్నగర్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం ఉదయం నుంచి నోస్టాక్ బోర్డులే దర్శనమివ్వడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడకక్కడ తెరిచి ఉన్న బంకుల వద్ద బారులుదీరినా చివరికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లాలో కొరత లేదు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో జిల్లాస్థాయి ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్షించారు. జిల్లాలో రెండు వారాల నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ స్టాక్, సరఫరా, నిల్వలపై ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెండు వారాల్లో కొంత సరఫరా పెరిగిందని, జిల్లాలో డిమాండ్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు వివరించారు. జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
వేరుశనగ @ రూ.6,899
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.5,688 ధర పలికింది. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.6,239, జొన్నలు రూ.2,177, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,256, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,786, పొద్దుతిరుగుడు రూ.5,690, కందులు రూ.6,276 చొప్పున లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,959, హంస గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,719, ఆముదాలు గరిష్టంగా రూ.6,080, కనిష్టంగా రూ.6,050 చొప్పున నమోదయ్యాయి. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి ● చదువు, క్రీడల్లో యువత రాణించాలి : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పిలుపు ● అట్టహాసంగా 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం ● తొలిరోజు శుభారంభం చేసిన తెలంగాణ జట్టు ● ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జడ్చర్ల టౌన్: యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని క్రికెట్లో రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల మినీ స్టేడియంలో నిర్వహించిన 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత మూడేళ్లుగా జాతీయ టోర్నీ నిర్వహించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, అలాంటిది జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ఇందుకు ముందుకు వచ్చిన విద్యాశాఖను అభినందించారు. టోర్నీ నిర్వహణకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. క్రికెట్, ఇతర ఏ క్రీడ అయినా ఫ్యాషన్గా తీసుకుని ముందుకు సాగాలని, తద్వారా అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఇదే సమయంలో క్రీడలతోపాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం విస్మరించరాదన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. ప్రారంభ కార్యక్రమానికి క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కావాల్సి ఉండగా.. ఖేలో ఇండియాలో పాల్గొనడానికి వెళ్లినందున రాలేకపోయారని చెప్పారు. అంతకు ముందు డీఈఓ ప్రవీణ్కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారద, ఎంఈఓ మంజులాదేవి ప్రసంగించారు. టోర్నీ ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. 77 పరుగుల తేడాతో తమిళనాడు విజయం రెండో మ్యాచ్లో తమిళనాడు ఎన్వీఎస్ జట్లు పోటీ పడగా తమిళనాడు 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జట్టులో ధీరజ్ 14 బంతుల్లోనే 51 పరుగులు చేయగా ధరినేష్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్వీఎస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 82 పరుగులు చేసింది. జట్టులో ఆర్యన్ 32 బంతుల్లో 28 పరుగుల అత్యధికంగా చేయగా బౌలింగ్లో రిసిమ్ 3 వికెట్లు తీశాడు. ఏపీపై కేరళం బోణి ఆంధ్రప్రదేశ్– కేరళం జట్ట మధ్య జరిగిన మ్యాచ్లో కేరళం జట్టు గెలుపు బోణి కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళం జట్టు 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు సాధించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే రెండు జట్లలోనూ బౌలర్లు రాణించడం విశేషం. ఆంధ్ర జట్టులో అభిమన్యు 4 వికెట్లు తీయగా కేరళం జట్టులోనూ సంకేత్ 4 వికెట్లు తీశాడు. ఉత్తరాఖండ్ గెలుపు ఉత్తరాఖండ్– ఐబీఎస్ఎస్ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో ఉత్తరాఖండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. శ్లోక్ 20 బంతుల్లో 40 పరుగులు చేయగా బౌలింగ్లో అరవ్, ఉదయ్విర్ చెరో 3 వికెట్లు తీశారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐబీఎస్ఎస్ఓ జట్టు 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్లో వన్ష్ఉంగ్లే 24 పరుగులు చేయగా బౌలింగ్లో ఆరుష్ 3 వికెట్లు తీశాడు. మధ్యప్రదేశ్ విజయం గుజరాత్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టును విజయం వరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ జట్టులో ప్రియావరాత్ 2 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి కేవలం 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జట్టులో ప్రియావరాత్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 30 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్.. మహబూబ్నగర్ బీఎస్ఆర్ గ్రౌండ్లో జరిగిన ఉత్తరప్రదేశ్– ఛత్తీస్గడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టులో ఓంప్రియ 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బౌలింగ్లో విష్ణు 2 వికెట్లు తీశాడు. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చత్తీస్ఘడ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో అన్మోల్ 39 పరుగులు చేయగా బౌలింగ్లో అలోక్జన్ 2 వికెట్లు తీశాడు. తమిళనాడు– ఎన్వీఎస్ జట్ల మధ్య మ్యాచ్ జాతీయ క్రికెట్ టోర్నీలో మొదటిరోజు నలుగురు బ్యాట్స్మెన్లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరంతా అటు బౌలింగ్లోనూ రాణించడం విశేషం. తెలంగాణ– పాండిచ్చేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాండిచ్చేరికి చెందిన జీవిత్ బౌలింగ్లో 2 వికెట్లు పడగొట్టగా బ్యాటింగ్లో 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక ఏపీ– కేరళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేరళంకు చెందిన అభిమన్యు బౌలింగ్లో 4 వికెట్లు తీశాడు. గుజరాత్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లలో అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. గుజరాత్ జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ జట్టులో ప్రియావరాత్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. తమిళనాడు జట్టుకు చెందిన ధీరజ్ 14 బంతుల్లోనే 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కర్ణాటక జట్టులోనూ శ్రీజేష్ 38 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఉత్తరప్రదేశ్జట్టులో ఓంప్రియ 36 బంతుల్లోనే 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసింది సైతం ఇతడే. కర్ణాటక– మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కర్ణాటక 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా శ్రీజేష్ 38 బంతుల్లో 65 పరుగులు చేశాడు. బౌలింగ్లో ధృవీ 2 వికెట్లు పడగొట్టాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 106 పరుగులకే కుప్పకూలింది. క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. పాండిచ్చేరి జట్టుతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 18 పరుగుల తేడాతో రాష్ట్ర జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కేతన్ 29 బంతుల్లో 42 పరుగులు చేయగా, సిద్ధార్థ్ 22 పరుగులు చేశా రు. జీవిత్ 2 వికెట్లు పడగొట్టాడు. 123 పరు గుల లక్ష్యంతో దిగిన పాండిచ్చేరి జట్టు 14.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో జీవిత్ 29 బంతుల్లో 50 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. బౌలింగ్లో దేవా, రాంచరణ్ చెరో రెండు వికె ట్లు పడగొట్టారు. దీంతో 18 పరుగుల తేడాతో తెలంగాణ జట్టు విజయం సాధించింది. జడ్చర్ల మినీ స్టేడియం గుజరాత్– పంజాబ్ జమ్మూకశ్మీర్– సీబీఎస్ఈ (డబ్ల్యూఎస్ఓ) యూపీ– డీహెచ్ఎన్డీడీ జడ్చర్ల స్వామినారాయణ గురుకులం మైదానం పాండిచ్చేరి– బిహార్ ఐపీఎస్సీఈ– కర్ణాటక ఎన్వీఎస్– ఢిల్లీ మహబూబ్నగర్ సమర్థ గ్రౌండ్ ఒడిశా– సీఐఎస్సీఈ ఆంధ్రప్రదేశ్– రాజస్థాన్ మహారాష్ట్ర– హర్యానా మహబూబ్నగర్ బీఎస్ఆర్ గ్రౌండ్ తెలంగాణ– సీబీఎస్ఈ మధ్యప్రదేశ్– కేవీఎస్ డీఏ– గోవా మహబూబ్నగర్ ఎండీసీఏ గ్రౌండ్ సీజీ– ఝార్ఖండ్ తమిళనాడు– సీబీఎస్ఈ తెలంగాణ– చండీఘడ్ జాతీయ టోర్నమెంట్ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. మ్యాచ్లు ఆడుతున్న మైదానాల్లో మైక్ లేకపోవడం పట్ల క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కామెంటరీ సైతం లేకపోవడంతో మ్యాచ్లో ఎన్ని పరుగులు, ఎన్ని ఓవర్లు, ఎవరు గెలిచారు అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది. మ్యాచ్లు ముందుగా 20 ఓవర్లుగా ప్రకటించినప్పటికీ 15 ఓవర్లకు కుదించారు. ఇక భోజనాలు సైతం అంతగా బాగోలేవని క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రిక్కితేజ్లో అసాధారణ ప్రతిభ
వంగూరు: చిన్న వయసులోనే చిత్రకారుడు రిక్కి తేజ 100కుపైగా చార్కోల్ చిత్రాలు గీసి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అతను గీసిన అనేక చిత్రాలు ఎంతోమందిని ఆకర్శిస్తున్నాయని సినీ దర్శకుడు, చిత్రకారుడు నర్సింగరావు అన్నారు. వంగూరు మండలం తుమ్మలపల్లి ప్రాథమిక పాఠ శాలలో 8వ తరగతి చదువుతున్న రిక్కితేజ గీసిన చిత్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్ను హైదరాబాద్లోని లమాకాన్ వేదికగా ఆదివారం ప్రదర్శించగా.. రిక్కితేజ్ గీసిన చిత్రాల్లో ముసలి రైతు చిత్రం తనకెంతో నచ్చిందని నర్సింగరావు పేర్కొన్నారు. అలాగే అతను గీసిన చిత్రంలో కళ్లలో జీవం, చర్మంలోని ముడతలు, ముఖంపై చెమట చుక్కలను గీసిన విధానం పట్ల ఆయన రిక్కితేజను ప్రశంసించారు. పౌరాణిక చిత్రాలు, పోట్రేట్లు ఎలాంటి గీతల ఆధారం లేకుండా గీయడం రిక్కితేజ ప్రత్యేకత అన్నారు. ఈ ప్రతిభ వల్ల రిక్కితేజకు వచ్చే ఆదాయంతో తాను చదువుతున్న పాఠశాలలో ప్రతిరోజు అల్పాహారం, స్నాక్స్ అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిత్రకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన కోరారు. రిక్కితేజ గీసిన వృద్ధ రైతు, యువతి చిత్రాలు సినీ దర్శకుడు నర్సింగరావు -
రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం
ఉప్పునుంతల: మండలంలోని శ్రైలం–హైదరాబాద్ ప్రధాన రోడ్డులో అయ్యవారిపల్లి స్టేజీ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్కు చెందిన జటగోని రాజేష్(15) ఏళ్ల బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిర్మలాపూర్ చెందిన మృతుడు రాజేష్తోపాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు జటగోని శివాజీ ఇద్దరు కలిసి బైక్పై డిండివైపు వెళ్తున్నారు. వీరి ముందు మరో బైక్పై నల్గొండ జిల్లా డిండి మండలం తవకలాపూర్ సమీపంలోని తండాకు చెందిన ధర్మనాయక్ వెళ్తూ అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ స్లో చేశాడు. అది గమనించకుండా వేగంగా వెనకనుంచి బైక్పై వస్తున్న బాలుడు ముందు వెళ్తున్న బైక్ను ఢీకొని పక్కనే ఉన్న హోటల్కు సంబంధించిన బోర్డుకు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి జటగోని అంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. పాముకాటుతో మహిళా రైతు మృతి కృష్ణా: పాము కాటుతో మహిళా రైతు మృతి చెందిన ఘటన మండలంలోని గుడెబల్లూర్ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్ల మహాదేవి (56) శనివారం ఉదయం రోజు మాదిరిగానే పొలానికి వెళ్లింది. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బాధిత మహిళను వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త భీంషప్పతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిది ఇరుపేద రైతు కుటుంబమని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞిప్తి చేశారు. తప్పిన ప్రమాదం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కారు ఇంజిన్లో మంటలు వ్యాప్తించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, ఫైర్ సిబ్బంది కథనం మేరకు.. మల్దకల్ మండలం మేకలసోంపల్లికి చెందిన హరినాథ్గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి ఎర్రవల్లి నుంచి గద్వాల వైపునకు కారులో వస్తున్నారు. అయితే పూటాన్పల్లి స్టేజీ సమీపంలో కారు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన యజమాని కారును సైడ్కు తీసుకెళ్లి నిలిపివేశాడు. మంటలు వ్యాప్తి చెందడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీంతో ఊపిరీ పీల్చుకున్నారు. ట్రాక్టర్, బైక్ ఢీకొని యువకుడి మృతి ఊట్కూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ట్రాక్టర్, బైక్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుమ్మరి బాలప్ప (27) సొంత పనులపై బైక్పై మల్లేపల్లికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని కుమ్మరి బస్వరాజ్ పొలం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టడంతో బాలప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమార్తె ఉన్నాది. -
పోషకాల గని కొర్రలు
మదనాపురం: ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాల (ముతక ధాన్యాలు) ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిత తెలిపారు. ముఖ్యంగా కొర్రలు వాడటం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. అద్భుతమైన పోషక విలువలు కొర్రల్లో కేవలం పిండి పదార్థాలే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నా యి. ప్రతి 100 గ్రాములకు సుమారుగా 357.44 కిలో కేలరీలు శక్తి, మాంసకృత్తులు (ప్రోటీన్లు) 14.00% పీచు పదార్థం 10.53% కాల్షియం 737.50 మి.గ్రా. ఇనుము 99.30 మి.గ్రా. జింక్ 53.60 మి.గ్రా. ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు మధుమేహ నియంత్రణ వ్యాధిగ్రస్తులకు కొర్రలు ఒక వర ప్రసాదం. దీని గ్లైసిమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. వరి బియ్యానికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. మెరుగైన గుండె ఆరోగ్యం కొర్రలు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. రక్తంలోని చక్కెరలను, కొవ్వును నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు చురుకుదనం వీటిలో ఉండే అధిక ఇనుము మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ బీ కాంప్లెక్స్ నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు సౌందర్యం కొర్రల్లో ఉండే కొల్లాజెన్ ప్రోటీన్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతూ యవ్వనంగా ఉంచుతుంది. ఇందులోని అధిక ప్రోటీన్ కంటెంట్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. జీర్ణక్రియకు మేలు అధిక పీచు ఉండటం వల్ల మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఇందులోని ఫినోలిక్ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. శరీర దారుఢ్యానికి, కండరాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ దైనందిన ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాలి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. గుండె వ్యాధులకు చెక్ పాడి–పంట -
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
● ఇద్దరికి తీవ్రగాయాలు ● తప్పిన పెను ప్రమాదం ఎర్రవల్లి: జాతీయ రహదారి పై లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి రాథోడ్ కథనం మేరకు.. సీఎంఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు శనివారం రాత్రి పీలేరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున మునుగాల శివారులో వెళ్తుండగా బస్సు డ్రైవర్ సుబ్రమణ్యం అతివేగంగా నడుపుతూ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టెక్ చేయబోయి బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో బస్సు క్యాబిన్తో పాటుగా కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు అంజలి, శిరీషకు తీవ్రగాయాలు కాగా మిగిలిన ప్రయాణికులు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలు అంజలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. హైవేపై అదుపుతప్పి కారు బోల్తా ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబ తమ కారులో తిరుపతికి వెళ్తుంది. ఈ క్రమంలో పదవ బెటాలియన్ సమీపంలో జాతీయ రహదారి–44పై కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుభద్రకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్ తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేత అయిజ: తుంగభద్ర నది నుంచి ఆదివారం తెల్లవారుజామున టిప్పర్తో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మేడికొండ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. టిప్పర్ యజమాని సంగాల రాజశేఖర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
భూత్పూర్: రైతులకు అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, ఇందుకు సంబంధించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ పట్టణంతోపాటు మండలంలోని కొత్తమొల్గర, పాత మొల్గర, ఎల్కిచర్ల గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కాబట్టి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి నష్టపోరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలకోటి, నాయకులు విజయ్గౌడ్, వెంకట్ నర్సింహారెడ్డి, ఏఓ మురళీధర్, సర్పంచులు ఆనంద్రెడ్డి, రమేష్, వెంకటేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి ● చదువు, క్రీడల్లో యువత రాణించాలి : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పిలుపు ● అట్టహాసంగా 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం ● తొలిరోజు శుభారంభం చేసిన తెలంగాణ జట్టు ● ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు –8లో u– జడ్చర్ల టౌన్ -
జనగణనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ జనాభా గణనలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆదివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియం కమాన్ వద్ద ‘హ్యాపీ సండే’ నిర్వహించారు. అలాగే యాప్ ద్వారా స్వీయ జనగణనకు సంబంధించిన నమోదును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత, వేగం పెరిగిందన్నారు. దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, కచ్చితమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు ఇంటికి వస్తే సరైన సమాచారం ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా వెనకబాటుతనం, విద్యాస్థాయి, జీవన ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. ఇక ‘హ్యాపీ సండే’లో భాగంగా చిన్నారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్ హరిప్రియ, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
ఇదేం శిక్షణ..!
● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు న్యూటౌన్లో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ రాజేంద్రనగర్లోని నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. గతంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ ఇచ్చిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని, సిలబస్ పూర్తి చేయలేదని, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలు కోచింగ్ సెంటర్ల యజమానులు వాటి స్థానంలో కొత్త పేర్లతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంతోపాటు హాస్టల్స్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తిలోనూ చాలా కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడం విశేషం. టెట్, డీఎస్సీ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టుకుని శిక్షణ ఇస్తుండగా.. మరికొంత మంది ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు. -
సమాజాన్ని సంస్కరించడమే కవి పని
స్టేషన్ మహబూబ్నగర్: సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లోని కాళోజీ హాల్లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్గౌడ్ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా హాజరై మాట్లాడారు. లక్ష్మణ్గౌడ్ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశారన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం సమకాలిన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్, జాన్కిట్స్, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్గౌడ్ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఆయన కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రారెడ్డి, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ అరుంధతీరాయ్, సంయుక్తరాయ్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
ఎదురుచూపులు..
‘చంద్రగఢ్’ మరమ్మతుకు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? ●చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం సంప్హౌజ్ నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్నవించడంతో నిధులు మంజూరయ్యాయి. -
1న లక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీనరసింహా (ఓబులేశు) స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిపారవశ్యంతో జరగనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొననున్న దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. మొదటిరోజు ఈ నెల 30న పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. మే 1న ప్రధాన ఆకర్షణగా స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో దేవతా మూర్తులను అలంకరించి, సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రోజు 2న వసంతోత్సవం, అభిషేకోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ముందుగా టికెట్లు పొందవచ్చని, విరాళాలు కూడా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలు భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని, ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైభవంగా వాసవీమాత జయంతి ఉత్సవాలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వాసవీమాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వాసవీమాత చిత్రపటానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తా పూలమాల సమర్పించారు. త్యాగ నిరతి, ధర్మ నిష్ట, సమాజ హిత భావనకు ప్రతిరూపం, ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సువర్జరాజ్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. నేడు ఎరువుల దుకాణాల బంద్ జడ్చర్ల: జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తెరవకుండా సోమవారం బంద్ పాటిస్తున్నట్లు ఎరువుల దుకాణాల డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచని పాండయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఎరువుల దుకాణాలను బంద్ చేసి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాలపై ఎఫ్ఓఎల్ విధానం రవాణా చార్జీలు అమలు చేయాలన్నారు. అదేవిధంగా లింక్ ప్రొడక్ట్లు లేకుండా ఎరువులను సరఫరా చేయాలని, డీలర్లకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే విధంగా అటు ప్రభుత్వం.. ఇటు ఉత్పత్తిదారులు చర్యలు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్, ఉపాధ్యక్షుడు భరత్, కోశాధికారి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచ్చులో చిక్కుకొని చుక్కల దుప్పి మృతి
లింగాల: మండల రేంజ్ పరిధిలోని దారారం బీట్లోని ఓ వ్యవసాయ పొలం చుట్టూ ఏర్పాటు చేసిన ఉచ్చులో చుక్కల దుప్పి చిక్కుకొని చనిపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఈ వ్యవసాయ పొలం చుట్టూ అటవీ జంతువుల వేటకోసం ఉచ్చును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా చుక్కల దుప్పి మృతిచెందిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటన బయట పడకుండా దుప్పిని కాల్చివేసినట్లు తెలిసింది. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలో జరుగుతున్నప్పటికీ వెలుగులోకి రాకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చుక్కల దుప్పి మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వివరణ కోరేందుకు ప్రయత్నించగా అటవీశాఖ వారు అందుబాటులో లేరు. బల్మూర్లో పిచ్చికుక్కల సైర్యవిహారం ● ఒకే రోజు ఎనిమిదికి కాటు బల్మూర్: మండల కేంద్రంతో పాటు కొండనాగులలో శనివారం పిచ్చి కుక్కల సైర్యవిహారం చేశారు. ఒక్కరోజులోనే ఎనిమిది మందిపై దాడి చేశాయి. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, 1వ వార్డులలో బాలయ్య, రత్నమ్మ, నాగమణి, శివకుమార్, పవన్కుమార్, సాయి, ధర్మతేజతో పాటు కొండనాగుల మణికంఠలపై కుక్కకాటు గురై గాయపడ్డారు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ సిబ్బంది స్పందించి కుక్కలను అటవి ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు, బాధితులు కోరుతున్నారు. కోనేరులో ఇద్దరు చిన్నారులపై దాడి... అలంపూర్ రూరల్: గద్వాల జిల్లా కోనేరులో శనివారం ఇద్దరు చిన్నారులపై ఓ వీధి కుక్క దాడి చేసింది. అలంపూర్ మండలంలోని ముక్కాపూర్ గ్రామానికి చెందిన తిమ్ములమ్మ, స్వాముల తన కుమారుడు జీవన్బాబు (6) కుమార్తె మధుకుమారి (4) కలిసి కోనేరు గ్రామానికి వచ్చారు. చిన్నారులపై కుక్క దాడి చేయగా.. జీవన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అంబులెన్స్లో బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అక్కడ చికిత్స చేయిస్తున్నారు. -
అక్రమ నిల్వ బియ్యం సీజ్
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లిలో పట్టుబడిన 101 క్వింటాళ్ల బియ్యంలో 73 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హేమ్లానాయక్ తెలిపారు. బిజినేపల్లి స్టాక్ పాయింట్ నుంచి వచ్చిన నిల్వల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కాగా కొందరు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదని, వాటిని అక్రమ నిల్వ చేశారని అధికారులు చెబుతున్నారు. 73 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాటిని బిజినేపల్లి స్టాక్ పాయింట్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణం–355 ద్వారా పంపిణీ చేయాల్సిన మిగిలిన బియ్యాన్ని అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్యామలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
గొర్రెలకాపరులకు అటవీ భూములు కేటాయించాలి
పెద్దకొత్తపల్లి: జీవాల మేతకోసం గొర్రెల కాపారులకు అటవీ భూములను కేటాయించాలని యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.అజయ్కుమార్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చెన్నపురావుపల్లిలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కురుమ, యాదవుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదన్నారు. బీసీ సర్పంచులు ఉన్న గ్రామాల్లో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేసి బీసీలనంతా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా యాదవులను అవమానపర్చి మోసం చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో యాదవులు అత్యధిక శాతం ఉన్నారని వచ్చే ఎన్నికలల్లో సంఘటితంగా ఉండి అన్నిపార్టీల వారికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్యాదవ్, మల్లేష్యాదవ్ పాల్గొన్నారు. -
పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం
కొల్లాపూర్ రూరల్: పోడు భూములకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్టాలిచ్చే వరకు గిరిజనులతో కలిసి పోరాటాలు చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. శనివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో ఆయన పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో కలిసి భూములను పరిశీలించారు. అనంతరం అక్కడ ఫారెస్టు అధికారులు పెడుతున్న ఇబ్బందుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న ఎకరం నుంచి 10ఎకరాల వరకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముక్కిడిగుండంలో 70మంది రైతులు 300 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని అట్టివారికి వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ భూములకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచి సాగునీరు సరఫరా చేయాలని కోరారు. షెడ్యూల్డు ట్రై ప్రకృతి ఆరాధికులకు జనగణనలో ఒక కాలాన్ని పెట్టాలన్నారు. అనంతరం గిరిజన సంఘం కొల్లాపూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు బాల్యనాయక్, సర్పంచ్ లాలి, మండలాధ్యక్షుడు శ్రీనునాయక్, తిరుపతినాయక్, గోపాల్నాయక్, బాల్నాయక్, హనుమంతు నాయక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ విచారణలో ఆధారాలే కీలకం
మహబూబ్నర్ ఎడ్యుకేషన్: న్యాయ విచారణలో ఆధారాలే కీలకం అని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ సహకారంతో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయపరమైన విచారణలో భౌతికపరమైన, సాంకేతికపరమైన సాక్ష్యాల ద్వారా త్వరితగతిన కేసు విచారణ చేసేందుకు అవకాశం ఉంటుందని, వీటిపై విద్యార్థులు పూర్తిస్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉందని, అప్పుడే న్యాయవాది వృత్తిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పుస్తకపఠనం, ప్రాక్టీస్తోపాటు ఇలాంటి వర్క్షాప్లలో విద్యార్థులు పాల్గొని మంచి నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ డైరెక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ న్యాయ విచారణలో ఎవిడెన్స్ అనేది అత్యంత కీలకమైన అంశమని, విద్యార్థులకు మాక్ డెమానిస్ట్రేషన్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, లీగల్ అప్లికేషన్ వంటి అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాల్ మాళవి, వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య, వెంకటసాయి ప్రసాద్, రాధాకృష్ణ, అనిల్సింగ్, అశోక్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య పరుగు
● మే 3న జడ్చర్లలో పాలమూరు రన్ ● ఆరోగ్యకరమైన జీవనశైలికే అంటున్న నిర్వాహకులు తెలంగాణ రన్నర్స్ సహకారంతో పాలమూరు రన్ పేరుతో 10కే రన్ నిర్వహిస్తున్నాం. మే 3న బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లో తెల్లవారుజామున జుంబా డాన్స్, యోగ, ధ్యానంతో సభ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి గూర్చి ప్రముఖులు అవగాహన కల్పిస్తారు. రన్లో 2.5కె, 5 కే, 10కే ఉంటాయి. డిగ్రీ కళాశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. – గోపాల్, పాలమూరు రన్ నిర్వహకుడు, జడ్చర్ల రన్నర్స్ సభ్యుడు నిత్యం రన్నింగ్ చేయటంతో 64 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ఇప్పటివరకు మారథాన్, 10కే, 5కే రన్లో పాల్గొన్నా. అందరు నాలా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే పాలమూరు రన్ నిర్వహించేందుకు ముందుకొచ్చాం. నాలాంటి ఎంతోమంది తమ అనుభవాలను ఆరోజు పంచుకుంటారు. రన్నింగ్ చేయటంతో కలిగే ప్రయోజనాలు అందరు తెలుసుకోవడానికి పాలమూరు రన్ విజయవంత చేయాలి. – రామకృష్ణ, జడ్చర్ల రన్నర్స్ సభ్యుడు జడ్చర్ల టౌన్: తెలంగాణ రన్నర్స్ సహకారంతో జడ్చర్ల రన్నర్స్ మే 3న జడ్చర్లలో పాలమూరు రన్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాధారణంగా మెట్రో నగరాల్లో మారథాన్, ఆఫ్మారథాన్, 10కే, 5కే రన్ పేరిట జాతీయ, అంతర్జాతీయ స్థాయి రన్లు నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ రన్నర్స్ పేరిట హైదరాబాద్లో 40కిపైగా స్థానిక రన్నర్స్ ఏర్పాటు చేసుకు ని ప్రతివారం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి తరహాలోనే తెలంగాణ రన్నర్స్ పేరిట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాల్లో రన్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్చర్లలో మే 3న పాలమూరురన్ నిర్వహించనున్నారు. రన్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా, నేరుగా జడ్చర్ల మినీ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేందుకు జడ్చర్ల రన్నర్స్ సదుపాయం కల్పించారు. ఇప్పటికే 400మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో 200మంది వరకు నమోదుకు అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు, హైదరాబాద్ నుంచి సైతం రన్నర్స్ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యులతో సలహాలు, యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించనున్నారు. రన్నింగ్లో పాల్గొన్న వారికి టీషర్ట్, అల్పాహారం, రన్నింగ్ మధ్యలో స్నాక్స్ అందించనున్నారు. రన్నింగ్తో గుండె ఆరోగ్యం మెరుగుపడటం, ఊపిరితిత్తులను బలపర్చటం, గుండె జబ్బు ల నివారణను 45శాతం తగ్గిస్తుంది. వేగంగా క్యాలరీలను కరిగించటంతో బరువు తగ్గటం, ఎముకల బలం పెరగటం, ఒత్తిడి తగ్గటం, ఒత్తిడిని తగ్గించి మానసికస్థితిని మెరుగుపర్చటం, రన్నింగ్తో ఆందోళనను తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు 5–10నిమిషాలు పరుగెత్తటంతో గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పై అంశాలపై రన్లో అవగాహన కల్పించనున్నారు. -
జాతీయ షూటింగ్బాల్లో ముగ్గురు పాలమూరు క్రీడాకారులు
మహబూబ్నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జరిగే సౌత్జొన్ జాతీయస్థాయి సబ్ జూనియర్ షూటింగ్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు వరుణ్, మేఘన, సంగీత పాల్గొంటున్నారు. వీరిని శనివారం జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించి శాలువాలతో సత్కరించారు. వారు మాట్లాడుతూ క్రీడాకారులు ఈ ఏడాది జనవరిలో తాండూర్లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్జోన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, మహబూబ్నగర్ షూటింగ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆడమ్స్, పుష్ప, కోశాధికారి రవి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రెడ్డి, డాక్టర్ విజయ్ మోహన్గౌడ్, బస్వరాజ్, వెంకటేశ్, రమేష్, జానకిరాములు పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూం కోసం మహిళ హత్య?
● కన్న కూతురు, అల్లుడే హత్య చేశారని బంధువుల ఫిర్యాదు జడ్చర్ల: డబుల్ బెడ్రూంలో కూతురు, అల్లుడితో కలిసి ఉంటున్న ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. పట్టణంలోని కావేరమ్మపేటకు చెందిన సాహిదాబేగం(80) తన కూతురు ఫహిమ్ ఉన్నీసాబేగం, అల్లుడు మహ్మద్ ఫాజిల్తో కలిసి నివాసం ఉంటుంది. అయితే కొన్నిరోజుల నుంచి డబుల్ బెడ్రూం ఇంటిని తమకు ఇవ్వాలంటూ భార్యాభర్తలు గొడవ పడి ఆమైపె దాడి చేసి గాయపరిచినట్లు మృతురాలి మేనల్లుడు వాహిద్పాష తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న కూతురు, అల్లుడు కలిసి ఆమైపె దాడి చేసి గాయపరిచారని, మరుసటి రోజు 24న ఆమె మృతి చెందిందని సమాచారం వచ్చిందని ఆయన వివరించారు. దీంతో ఇంటి కోసమే కన్న తల్లిని హత్య చేసిన కూతురు, అలుడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి మేనల్లుడు వాహిద్పాష శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలం అమ్మపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ జలేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మోల్గరి హన్మంత్రెడ్డి(65) ఇంటి దగ్గర నీళ్ల మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు భాస్కర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్ ఆవరణలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(60) మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. బస్టాండ్ స్టేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి వనపర్తి రూరల్: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ–2 దివ్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెబ్బేరు మండల కేంద్రంలోని కొత్తకోట బైపాస్ దగ్గర కర్నూల్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై జై గురుదత్తా దాబా సమీపంలో ఓ వాహనం శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తిని(42) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పెబ్బేరు పట్టణ వార్డు ఆఫీసర్ గొల్ల అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి మక్తల్: ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్లో సిమెంట్ తీసుకొస్తుండగా ట్రాలీ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచలింగాల్ భగవాన్పల్లి మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి భగవాన్పల్లికి వెంకటేష్ (57), తిమ్మప్ప తీవ్రగాయాల పాలయ్యారు. వెంకటేష్ను మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తిమ్మప్ప కర్నాటక రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పిడుగుపడి యువకుడు మృతి బల్మూర్: మండలంలోని మైలారం సమీపంలో శనివారం సాయంత్రం ఆకాల వర్షంతో పిడుగుపాటుకు గురై ఓ యువకుడితోపాటు గేదె మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు సలేశ్వరం(19) శనివారం తన గేదెను మేపడానికి సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావండతో సమీపంలో ఉన్న తాటి చెట్టుకిందికి గేదెతోపాటు వెళ్లి తలదాచుకోగా.. పిడుగు పడి గేదెతోపాటు సలేశ్వరం అక్కడికక్కడే మృతిచెందాడు. వర్షం వెలిసిన తర్వాత గమనించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వచ్చి పరిశీలించగా మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతుడి తల్లి చెన్నకిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడి తండ్రి ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందగా తల్లి, సోదరి ఉన్నారు. -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపైపెరిగిన శ్రద్ధ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు ధాతు ఆయుర్వేదం సహకారంతోసెంటర్ల ఏర్పాటు -
నగరంలో తాగునీటి సమస్య రావొద్దు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి ఆదేశించారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కావడంతో మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు రోజులకోసారి సరఫరా అయ్యే తాగునీటిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా, అలాగే వృథా కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పైపులైన్లకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే బాగు చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా పవర్ మోటార్ల ద్వారా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా గణనపై అవగాహన నగర ప్రజలకు జనాభా గణనకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్పై అవగాహన కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం వార్డు ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెప్మాకు చెందిన ఆర్పీల సహాయంతో మొబైల్ యాప్లో ఏ విధంగా వివరాలు నమోదు చేయాలో వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా నోడల్ ఆఫీసర్ శివరామకృష్ణ, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఎంఈ మురళీమోహన్రెడ్డి, ఏసీపీ జ్యోత్స్నాదేవి, డీఈఈ హేమలత, ఏఈ రాగవినతి, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, టీపీబీఓ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటా రూ.6,761
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ. 6,761, కనిష్టంగా రూ.5,129 ధర లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,290, కని ష్టంగా రూ. 6,267, జొన్నలు గరిష్టంగా రూ. 5,127, కనిష్టంగా రూ.5,124, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,471, కని ష్టంగా రూ.1,847, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కని ష్టంగా రూ.1,661, హంస రూ.1,601, పొద్దుతిరుగుడు గరి ష్టంగా రూ.5,629, కనిష్టంగా రూ. 5,310, మినుములు గరిష్టంగా రూ. 7,600, కనిష్టంగా రూ.7,560, చింతగింజలు రూ.2,860, కందులు రూ. 6,27 5, రాగులు రూ. 2,777, పెబ్బర్లు రూ.4,700 ధరలు లభించాయి. దేవరకద్రలో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,909, హంస గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి. -
వందేళ్లు గుర్తుండేలా కోర్టు భవన నిర్మాణం
జడ్చర్ల టౌన్: వందేళ్లపాటు గుర్తుండేలా జడ్చర్ల కోర్టు భవనాల సముదాయం నిర్మించుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. శనివారం ఆమె జడ్చర్ల జూనియర్ సివిల్కోర్టును సందర్శించి.. కోర్టు కోసం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలం ప్రస్తుత కోర్టు సముదాయాల ప్రహరీకి ఆనుకుని ఉండటాన్ని న్యాయవాదులు వివరించారు. జాతీయరహదారి–167కి ఆనుకుని స్థలం రావడంతో ప్రధాన ద్వారం అక్కడ నిర్మించాలని కోరారు. అనంతరం కోర్టుకు చేరుకుని భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. అన్ని గదుల్లోనూ వర్షపు నీరు వస్తుందని, దీంతో బార్ అసోసియేషన్ కోసం నిర్మించిన భవనాన్ని అదనపు కోర్టు కోసం కేటాయించి.. తాము చిన్నపాటి గదిలో నిర్వహణ సాగిస్తున్నామని న్యాయవాదులు వివరించారు. ఆ తర్వాత కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిరెడ్డి, న్యాయవాది మహేశ్వర్రెడ్డి కోర్టులో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ స్థల పరిశీలన కోసం వచ్చానని, అయితే భవనం మంజూరు విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు భవనాల నిర్మాణాలకు ఒకే రకమైన డిజైన్ ఉంటుందని, జడ్చర్ల కోర్టు అదే తరహాలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్లో మరిన్ని కోర్టులు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకుందామన్నారు. కోర్టుకు వచ్చిన న్యాయమూర్తికి న్యాయమూర్తి నీహారిక, అదనపు కోర్టు న్యాయమూర్తి ముదసిర్ స్వాగతం పలికారు. ఆమె పర్యటన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. -
జీపీఓలకు రక్షణ కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లావ్యాప్తంగా ఇసుక విధుల్లో ఉన్న జీపీఓలకు రక్షణ కల్పించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల తహసీల్దార్ ఆదేశం మేరకు ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయడంలో భాగంగా విధుల్లో ఉన్న రంగాపూర్, కోడ్గల్ గ్రామాలకు చెందిన జీపీఓలపై కొంతమంది ఇసుక మాఫియా దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని పారిపోయారని ఆరోపించారు. దాడి చేసిన దుండగులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీపీఓలకు రక్షణ కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు చంద్రనాయక్, దేవేందర్, శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాలొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జడ్చర్ల టౌన్: అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ హెచ్చరించారు. శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, నర్సరీల నిర్వహణ, ఉపాధి హామీ లేబర్ సమీకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఉపాధి పనులకు కనీసం వందమంది కూలీలను సమీకరించాలని, నర్సరీ బెడ్స్లో మొక్కలు మొలకెత్తే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు మొదలు పెట్టని వాటిని త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఉద్యోగులు అందరూ సకాలంలో విధులకు హజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్కుమార్, ఏపీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దోమకాటుతో అప్రమత్తంగా ఉండాలి పాలమూరు: దేశవ్యాప్తంగా మలేరియాను 2030 వరకు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కుమ్మరివాడీ అర్బన్ హెల్త్సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అనాథిలిస్ అనే దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుందని, జ్వరం, చలి, చెమటలు పట్టడం, ఒళ్లు నొప్పులు ఉండటం ఈ వ్యాధి లక్షణాలు అన్నారు. మలేరియా రక్త పరీక్షల ద్వారా వ్యాధి పాజిటివ్ అనేది నిర్ధారణ చేయవచ్చని వెల్లడించారు. దోమల సంతతి పెరగకుండా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వేసవిలో బయట నిద్రించే వారు తప్పక దోమ తెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జ్వర లక్షణాలు కనిపిస్తే స్థానిక పీహెచ్సీల్లో చికిత్స తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి విద్య, మెడికల్ ఆఫీసర్ తస్లీమా ఫర్హాత్, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజుశెట్టి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం
నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ● పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు ● ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు ● ఆరు రోజుల పాటు ఐదు మైదానాల్లో మ్యాచ్ల నిర్వహణ వాతావరణం వాతావరణం ఉదయం కాస్త చల్లబడుతుంది. మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం కొంత ఆహ్లాదంగా ఉంటుంది. జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. డీఈఓ పరిశీలన.. మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి ఉన్నారు. ఆరోగ్య పరుగు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలో వచ్చే నెల 3న రన్ నిర్వహించనున్నారు. –8లో uతెలంగాణ జట్టు జి.కేతన్కుమార్, పి.రామ్కుమార్ చారి, కె.మాన్విత్, వెంకటాభిరామ్ శ్రీచరణ్, ఎం.సిద్దార్థ, అహ్మద్ ఆజముద్దీన్, సి.సిద్దార్థ, లిఖిత్రెడ్డి బైరెడ్డి, మునగాలశెట్టి శాన్ విన్సెంట్ రాజ్, అకరామ్ హర్షిత్, అజ్మీరా ద్విపద్నాయక్, డి.అభినవ్, కె.సాయితనిక్ష్, మహ్మద్ అనస్, ఎ.దేవశివ్త్ యాదవ్, బి.మణివర్ధన్. నేటి మ్యాచ్లు.. జడ్చర్ల మినీ స్టేడియంలో తెలంగాణ వర్సెస్ పుదుచ్చేరి, తమిళనాడు వర్సెస్ ఎన్వీఎస్, స్వామినారాయణ గురుకుల మైదానంలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కేరళ, యూపీ వర్సెస్ ఐబీఎస్ఓ, సమర్థ స్కూల్ మైదానంలో మధ్యప్రదేశ్ వర్సెస్ గుజరాత్, కర్ణాటక వర్సెస్ మహారాష్ట్ర, బీఎస్ఆర్ మైదానంలో ఉత్తరప్రదేశ్ వర్సెస్ చత్తీస్ఘడ్ జట్లు తలపడనున్నాయి. -
హెల్ప్డెస్క్ బ్యానర్ ఆవిష్కరించిన డీఈఓ
జడ్చర్ల టౌన్: పట్టణంలో ఆదివారం నుంచి జరగబోయే 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీకి సంబంధించిన హెల్ప్డెస్క్ బ్యానర్ను డీఈఓ ప్రవీణ్కుమార్ శుక్రవారం జడ్చర్లలో ఆవిష్కరించారు. ముందుగా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాలని కమిటీలకు సూచించారు. అనంతరం బాలుర పాఠశాలలో భోజన ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. క్యాటరింగ్కు సంబంధించి సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా వంటకాలను వడ్డించాలని అలాగే స్వచ్చమైన మంచినీరు అందించాలన్నారు. తర్వాత మినీ స్టేడియంలో క్రీడల ప్రారంభోత్సవానికి సంబంధించిన వేదిక ఏర్పాట్లను పరిశీలించి ఎండల దృష్ట్యా టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాల్గొనే జట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రిజిస్ట్రేషన్, రవాణాకు సంబంధించి ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి సమస్యలను నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదా, మోయిన్ పాల్గొన్నారు. -
కానరాని దేవుళ్లు.. పశువైద్యులు
నేడు ప్రపంచ వెటర్నరీ దినోత్సవం ● సమాజ ఆరోగ్యంలోనూ కీలక పాత్ర మహబూబ్నగర్ (వ్యవసాయం): గ్రామీణ జీవనానికి అండగా నిలిచే పశుసంపదను కాపాడేవారు.. రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి బలంగా నిలిచేవారు.. మనం నిత్యం వినియోగించే పాలు, గుడ్లు, మాంసం వంటి ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే వారే వెటర్నరీ వైద్యులు. కనిపించకుండా సేవలు అందిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్న ఈ అజ్ఞాత సైనికుల సేవలు అపారమైనవి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం నిర్వహించే ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రైతు–జీవాలు–ప్రజారోగ్యం జంతు సంరక్షణ అంటే కేవలం పశువుల వైద్యం మాత్రమే కాదు.. ప్రజారోగ్యానికి కూడా సంబంధించిన అంశం. పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా అరికట్టడం ద్వారా మానవులకు వచ్చే అంటువ్యాధులను నివారించడం కూడా వీరి బాధ్యతలో భాగమే. ఒక ఆరోగ్య సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు చేస్తూ పశు, మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా కాపాడుతున్నారు పశు వైద్యులు. జిల్లాలో విస్తృత సేవలు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాలీక్లీనిక్లు, పశువైద్యశాలలు నిర్వహిస్తూ రైతులకు చేరువవుతున్నారు. గ్రామ స్థాయిలోనే చికిత్సలు అందిస్తూ అత్యవసర సమయాల్లో పశువులను రక్షిస్తున్నారు. జిల్లా జాయింట్ డైరెక్టర్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, 27 మంది పశువైద్యులు, 52 మంది పాలీ సిబ్బంది, 60 మంది అటెండర్లు కలిసి సమన్వయంతో పని చేస్తున్నారు. వీరంతా గ్రామీణ స్థాయిలోనే పశువులకు టీకాలు, క్రిమినాశన చర్యలు, గర్భధారణ సేవలు, పోషణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీరేబీస్ టీకాలు వేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తమ పరిధిలో టీకాల నమోదు, పర్యవేక్షణ, నివేదికల సమర్పణ వంటి చర్యలను క్రమబద్ధంగా కొనసాగిస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువులను సంరక్షణపై చర్యలు తీసుకుంఉటన్నారు. ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు.. పశువుల ఆరోగ్యం బాగుంటేనే మనకు సురక్షిత ఆహారం అందుతుంది. పాలు, మాంసం, గుడ్ల నాణ్యతను కాపాడడంలో వెటర్నరీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫర్మ్ టు ఫోర్క్ విధానంలో ఆహార భద్రతను కాపాడడంలో వెటర్నరీ వైద్యుల పాత్ర కీలకం. జిల్లా గోజాతి గేదె జాతి గొర్రెలు మేకలు కుక్కలు పిల్లులు మహబూబ్నగర్ 89,500 79,102 8,01,847 1,13,798 10,200 1,000 జో,గద్వాల 56,298 52,124 5,77,444 66,817 9,300 390 నాగర్కర్నూల్ 2,39,523 1,06,373 6,62,717 1,95,745 14,917 1,200 జిల్లాల వారీగా పశుసంపద ఇలా.. ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు వెటర్నరీల సేవలు పశువుల ఆరోగ్యం అంటే రైతు ఆర్థిక భద్రత మాత్రమే కాదు, సమాజ ప్రజారోగ్యానికి కూడా ఎంతో కీలకం. జిల్లాలో పశువైద్య సేవలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. టీకాల పంపిణీ, వ్యాధి నిరోధక చర్యలు, మొబైల్ వెటర్నరీ సేవల ద్వారా రైతులకు సమయానుకూలంగా సేవలు అందిస్తున్నాం. వన్ హెల్త్ దృక్పథంతో పశు–మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా చూసే విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కూడా పశువుల సంరక్షణలో జాగ్రత్తలు పాటిస్తూ, టీకాలు తప్పనిసరిగా వేయించాలి. – డాక్టర్ మధుసూదన్గౌడ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఆర్థిక వ్యవస్థకు అండ పశుసంపద రైతు కుటుంబాల ఆదాయానికి ప్రధాన వనరు. ఒక పశువు అనారోగ్యం పాలైతే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వెటర్నరీ వైద్యులు వేగంగా స్పందించి పశువులను రక్షించడం ద్వారా రైతు నష్టాలను తగ్గిస్తున్నారు.


