breaking news
Mahabubnagar District Latest News
-
ఎస్వీఎస్ ఆస్పత్రిలో తోరసిక్ సర్జరీలు
పాలమూరు: జిల్లాలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన తోరసిక్ సర్జరీలు ప్రారంభించినట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు. ఎస్వీఎస్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 800 నుంచి వెయ్యి వరకు గుండె సంబంధిత సర్జరీల కోసం హైదరాబాద్ వెళ్తున్నారని అలా కాకుండా ఇకపై అన్ని రకాల సర్జరీలు ఎస్వీఎస్లో చేస్తున్నట్లు తెలిపారు. కార్డియో తోరసిక్ సర్జన్తో పాటు కార్డియో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి 24గంటల పాటు సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు, వంద రకాల ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లో రూ.10 లక్షలు ఖర్చు అయితే స్థానికంగా కేవలం రూ.2 లక్షలతో సర్జరీలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. హార్ట్లాంగ్ మిషన్, స్పెషల్ కార్డియాక్ ఐసీయూ, క్యాథ్ల్యాబ్, అత్యాధునిక మిషనరీ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్డియో తోరసిక్ సర్జన్ అవేన్ సానర్, ప్రిన్సిపాల్ జోషి, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
బావ X బావమరిది
అధికారుల తడబాటు ప్రచారానికి అనుమతి తప్పనిసరి కొండారెడ్డిపల్లి ఉపసర్పంచ్గా వేమారెడ్డి వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత గ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో గురువారం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించారు. పది మంది వార్డుసభ్యులు కలిసి ఉపసర్పంచ్గా వేమారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలాఉండగా.. ఉపసర్పంచ్గా మేఘారెడ్డి ఎన్నికవడం ఇది మూడోసారి. ఎన్నికల అధికారులు వార్డు సభ్యులందరికీ ఎన్నిక పత్రాలను అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య, ఉసర్పంచ్ వేమారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం కొండారెడ్డిపల్లి గ్రామప్రజలకు అందుబాటులో ఉంటూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట: మండలంలోని పోమాల్ క్లస్టర్లో మొదటి విడత నామినేషన్ల అనంతరం గుర్తుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించి మొదట గుర్తులు కేటాయించారు. అర్ధరాత్రి దాటాక తిరిగి గుర్తులను మార్చడంతో అభ్యర్థులకు అయోమయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ క్లస్టర్ పరిధిలో పోమాల్తో పాటు కామారం, తిమ్మయ్యపల్లి, పుట్టోనిపల్లితండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. పుట్టోనిపల్లితండా ఏకగ్రీవం కాగా.. మిగిలిన మూడు గ్రామాల అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా మౌఖికంగా గుర్తులు చెప్పారు. దీంతో పోమాల్లో కొందరు అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత వేరే గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు బుధవారం రాత్రి ఒక గుర్తుపై.. తాజగా గురువారం మరో గుర్తును ప్రచారం చేశారు. ఈ విషయంపై ఆరాతీస్తే అభ్యర్థుల ఇంటిపేర్లు తదితర వాటి విషయాల్లో అధికారులు తడబడ్డారని.. అందుకే జాప్యం జరిగినట్లు సమాచారం. ● సర్పంచ్ స్థానానికి పోటీ కల్వకుర్తి రూరల్: మండలంలోని జీడిపల్లి గ్రామపంచాయతి సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. ఈ పదవి కోసం మంగ మల్లేష్, కెంచె ఆంజనేయులు పోటీ పడుతున్నారు. ఇద్దరూ వరుసకు బావ, బావమరిది. ఒకరింటికి ఒకరు పిల్లను ఇచ్చుకున్నారు. ఇద్దరూ కాంగ్రెస్పార్టీలోనే ఉన్నారు. అయితే పార్టీ అధికారికంగా ఆంజనేయులుకు మద్దతు ఇవ్వగా.. మల్లేష్కు కాంగ్రెస్లోని ఓ వర్గంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సైతం మద్దతుగా నిలిచాయి. ఇద్దరూ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి పోటీపడటం ప్రత్యేకం. మహబూబ్నగర్ క్రైం: ఎన్నిక ఏదైనా సరే.. ప్రచారానికి లౌడ్స్పీకర్లు, మైకులు, అభ్యర్థులతో సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడమేగాక వృద్ధులు, చిన్నారులు, చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యంగా ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం. అభ్యర్థి ఫొటోలతో జెండాలు పాతడం, గోడలపై పోస్టర్లు అతికించడం, స్లోగన్లు రాయొద్దు. రెచ్చగొట్టే ప్రసంగాలు, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయరాదు. ప్రచార సమయంలో లౌడ్స్పీకర్ల వినియోగానికి తప్పక అనుమతి తీసుకోవాలి. నివాస ప్రాంతాల్లో పగలు 55 డీబీ, రాత్రి 45 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో పగలు 65 డీబీ, రాత్రి 55 డీబీ, పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 డీబీ, రాత్రి 70 డీబీ పరిమితితో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లౌడ్స్పీకర్లు వినియోగించాలి. అభ్యర్థుల ప్రచార వివరాలు, ఊరేగింపు సమయం, స్థలం వంటి వివరాలు ముందే తెలియజేయాలి. ట్రాఫిక్, ఇతర సాధారణ ప్రజలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి. గుర్తుల కేటాయింపులో ఆలస్యం -
భార్య విడాకులు తీసుకుందని భ ర్త ఆత్మహత్య
మిడ్జిల్: భార్య విడాకులు తీసుకుందనే మనస్థాపంతో మండలంలోని బోయిన్పల్లికి చెందిన పిట్టల సత్యనారాయణ (28) ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సత్యనారాయణకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య కేవలం వారం రోజులు మాత్రమే ఉండి ఇటీవల విడాకులు తీసుకోవడంతో అతడు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయాడు. గురువారం ఉదయం ఇంట్లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అతడి తల్లి అలివేల తలుపు తెరిచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని కన్పించాడు. గ్రామస్తులు వచ్చి కిందకు దింపగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడును వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
కొనసాగుతున్న ‘నెట్టెంపాడు’ పంపింగ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం 552 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిదిలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్హౌస్ వద్ద నీటి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఆవిరి రూపంలో 24 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కుడి కాల్వకు 390 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,514 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.214 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆర్డీఎస్ కాల్వపై గుర్తు తెలియని మృతదేహం మానవపాడు: మండల కేంద్రం శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ చంద్రకాంత్ వివరాల ప్రకారం.. మానవపాడు శివారు ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గల ఆర్డీఎస్ కాల్వ పక్కనే గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభించిందన్నారు. మృతురాలు పసుపు పచ్చ జాకెట్ ధరించి ఉందని, సూమరు 70 ఏళ్లకు పైగా వయస్సు ఉండొచ్చని, ఎవరైనా గుర్తిస్తే మానవపాడు పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70288 ను సంప్రదించాలని కోరారు. -
కల్యాణం.. కమనీయం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణ వేడుక జరిపారు. అశేష భక్తజనావళి తిలకిస్తుండగా జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత
● బుద్దారంలో రూ..1.95 లక్షలు ● గండేడ్ మండలంలో రూ.1.45 లక్షలు స్వాధీనం మహమ్మదాబాద్/గోపాల్పేట: ఎన్నికల నిబంధనల్లో బాగంగా గురువారం ఎన్నికల అధికారులు ప్లైయింగ్ స్క్వా డ్ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.1.45 లక్షలు లభించాయి. గండేడ్ మండలం రెడ్డిపల్లి గేటు దగ్గర గురువారం ఫ్లైయింగ్స్క్వాడ్ తనిఖీలు చేయగా హన్వాడ మండలంలోని కొగట్టుపల్లికి చెందిన ఇప్పాలపల్లి వెంకటయ్య రూ1.45క్షలు తీసుకుని కోస్గివైపు వెళుతున్నాడు. ఇదే సమయంలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేయగా డబ్బు నగదుతో పట్టుబడ్డాడు. సదరు వ్యక్తి తీసుకెళుతున్న నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని మహమ్మదాబాద్ పోలీసులకు అప్పగించినట్టు అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుద్దారం చెక్పోస్టు వద్ద.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం చెక్పోస్టు వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1.94 లక్షలు పట్టుకున్నామని గోపాల్పేట ఎస్ఐ నరేష్కుమార్తెలిపారు. ఇద్దరు బిజినేపల్లి నుంచి అప్పాయిపల్లికి, ఒకరు బిజినేపల్లి నుంచి ఎర్రవల్లికి డబ్బు తీసుకువెళుతుండగా పట్టుకుని సీజ్ చేశామని పేర్కొన్నారు. -
నేటి నుంచి కబడ్డీ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం మరో రాష్ట్రస్థాయి క్రీడా సంగ్రామానికి వేదికై ంది. శుక్రవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 51వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా జూనియర్ బాలుర కబడ్డీ చాంపియన్షిప్ జరగనుంది. గురువారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పరిశీలించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతికుమార్, ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి సహకారంతో టోర్నీ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తెలిపారు. 476 మంది క్రీడాకారులు.. జూనియర్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు రాష్ట్రంలోని 34 బాలుర జట్లు హాజరుకానున్నాయి. 476 మంది క్రీడాకారులు, 70 మంది అఫిషియల్స్తో కలిపి దాదాపు 800 మంది పాల్గొంటున్నారు. క్రీడాకారులకు మాడ్రన్ స్కూల్, టీఎన్జీఓ భవన్, అంబేడ్కర్ కళాభవన్, బీపీహెచ్ఎస్, స్కౌట్స్ భవన్లో వసతి, భోజన సౌకర్యం కల్పించారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నాలుగు మ్యాట్లపై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో దాదాపు 90 మ్యాచ్లు జరగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, 7న జరిగే పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి పాల్గొననున్నారు. జిల్లా బాలుర కబడ్డీ జట్టు ● రాష్ట్రస్థాయి జూనియర్ టోర్నీలో ప్రతిభచాటేలా జిల్లా బాలుర జట్టుకు కొన్ని రోజుల నుంచి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ● జిల్లా జట్టులో.. పాండు, సురేష్, శివకుమార్, అరవింద్, రాంచరణ్, హేమంత్, కౌషిక్, నందీశ్వర్, చందు, గౌతమ్, దేవ్సింగ్, శివప్రసాద్, హర్షవర్ధన్, మణికంఠ. పోటీలో 34 జట్లు నాలుగు కోర్టులు, 90 మ్యాచ్లు ఏర్పాట్లు చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ -
గగన్చంద్ర పరిశోధనలకు సహ కరిస్తాం
బల్మూర్: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతూ త్రీ ఇన్ వన్ సైకిల్ను రూపొందించిన విద్యార్థి గగన్చంద్రను విజ్ఞాన పరంగా అతను చేసే పరిశోధనలకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి ప్రోత్సాహం అందిస్తామని కమిషనర్ క్షితిజ తెలిపారు. ఈ నెలలో భోపాల్లో జరిగిన జాతీయ స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో త్రీ ఇన్ వన్ సైకిల్ను ప్రదర్శించి యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న విద్యార్థి గగన్చంద్రను గురువారం హైదరాబాద్లో ఎస్సీ డీడీ కార్యాలయంలో కమిషనర్ అభినందించారు. ఏసీడీఓ ఉమాపతి, జేడీ శ్రీనివాస్రెడ్డి, అధికారులు వార్డెన్ కృష్ణయ్య, శ్రీధర్, రమాదేవి, సల్మాభాను, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుల రాజకీయం!
మహబూబ్నగర్: బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్పల్లి, మన్సూర్పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్కు చెందిన వారు సర్పంచ్లుగా ఏకగ్రీవమయ్యారు. ● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కంచన్పల్లిలో కాంగ్రెస్కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పల్లె పోరులో చిత్రవిచిత్రాలు గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’ కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
ఘనంగా మహబూబ్నగర్ అవతరణ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్అలీ ఖాన్ బహద్దూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంఏ రహీమ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ 135వ అవతరణ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలోని మహెబూబియాలో హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నైజాం ప్రాంతం చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మహబూబ్నగర్లో గంగాజమున తహ్జిబ్లా హిందూ–ముస్లింలు కలిసిమెలిసి ఉంటారన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు పాలుపంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం అతిథులను ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంఎ రహీం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షుడు మహ్మద్ జియావుద్దీన్ నాయర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల్లో ధాన్యం డబ్బులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలం 2025–26 సీజన్కు చెందిన రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేసిన మూడు రోజుల్లో అందుకు సంబంధించి డబ్బులను మూడు రోజుల్లో వా రి ఖాతాల్లో జమ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ ఆదేశించారు. గురువా రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల దృష్ట్యా రైతు లకు పేమెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇ లాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. డబ్బులు సకాలంలో చెల్లించేందుకు అడిషనల్ కలెక్టర్లు అందరూ ప్రతి రోజు ఏజెన్సీలతో సమీక్ష చేసి, ట్యాబ్లో నమోదును వేగవంతం చేయాలన్నారు. ఏమై నా సమస్య ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతులకు ఎంఎస్పీ పే మెంట్ విషయంలో నిధుల కొరత లేదన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పొగ మంచులో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: చలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాత్రివేళ పొగమంచు ఏర్పడడం వల్ల వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. మంచు వల్ల రోడ్లపై దృష్టి తగ్గడం, ముందు ఉండే వాహనాల దూరం అంచనా వేయడం ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించడానికి డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళ వాహనాలు ఓవర్ టేక్ చేయడం, స్పీడ్గా వెళ్లడం వంటివి చేయరాదని సూచించారు. ఉపాధ్యాయులకు నోటీసులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నిర్వహించిన శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు తగిన కారణంతో వెంటనే సమాధానం ఇవ్వాలని, సరైనా కారణం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పీయూలో డిజిటల్ సేవల మెరుగుకు ఒప్పందం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో డిజిటల్ సేవలను మరింత మెరుగు పర్చేందుకు అధికారులు సైబర్ హైట్స్ సాఫ్ట్వేర్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అడ్మిన్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్బాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ సేవల్లో భాగంగా విద్యార్థులు సులువుగా వేగవంతంగా యూనివర్సిటీకి సంబంధించిన పలు విభాగాల్లో సేవలు విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు అఽధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే కాన్వకేషన్, మైగ్రేషన్, కన్సాల్డేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫీకెట్లతోపాటు ఎగ్జామినేషన్స్కు సంబంధించిన వాటిని నేరుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్లోనే సర్టిఫికేట్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. దీనిద్వారా విద్యార్థులకు నిర్తీత గడువులోగా కచ్చితత్వంతో సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో ప్రధానంగా రియల్టైం ట్రాకింగ్, డోర్స్టెప్ డెలివరీ, క్యూర్ కోడ్తో పేమెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సదానందం హాజరయ్యారు. హాస్టల్లో రోటీ మేకర్స్ ప్రారంభం హాస్టల్స్ విద్యార్థులకు సకాలంలో చపాతి అందించేందుకు రోటీమేకర్స్ ఇవ్వాలని పీయూ అధికారులు ఎస్బీఐ గణేశ్నగర్ బ్రాంచ్కు విన్నవించారు. ఈ సందర్భంగా స్పందించిన బ్యాంకు అధికారులు కార్పోరేట్ రెస్పాన్స్బిలిటీ కింద పీయూకు రూ.10.17లక్షల విలువైన రోటీమేకర్స్ అందజేశారు. ఈమేరకు బాలికల హాస్టల్లో వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్బాబు బుధవారం రోటీ మేకర్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. పుంజుకున్న ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం జరిగిన బహిరంగ వేలంలో ఉల్లి ధరలు పుంజుకున్నాయి. మూడు వా రాలుగా మార్కెట్కు వచ్చిన కొత్త ఉల్లికి ధర రూ.వెయ్యి కూడా రాలేకపోయేది. కాగా.. ఈ వారం ధరలు రెండింతలకు పెరగడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్కు దాదాపు 500 బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు వేలం వేశారు. క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1,600, కనిష్టంగా రూ. వెయ్యి వరకు ధరలు లభించాయి. వేలం తర్వా త 50కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. -
పాఠశాలలో క్షుద్ర పూజలు
కోస్గి: మండలంలోని మీర్జాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. 10వ తరగతి గది ఎదుట ముగ్గువేసి అందులో నిమ్మ, మిరపకాయలు ఉంచి పసుపు, కుంకుమ చల్లడంతో పాటు తరగతి గది తలుపునకు వేసిన తాళానికి బొట్లు పెట్టారు. బుధవారం ఉదయం పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చిన అటెండర్ కృష్ణయ్య గుర్తించి వెంటనే ప్రధానోపాధ్యాయుడు జనార్దన్రెడ్డికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలంలో ప్రాథమిక విచారణ జరిపారు. డీఈఓకు సైతం సమాచారం ఇచ్చి ఎవరో ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని విద్యార్థులకు సర్దిచెప్పి తరగతులు కొనసాగించారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చారకొండ: మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అక్కి శ్రీనివాసులు గౌడ్(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 28న హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి కారులో ప్రయాణిస్తుండగా వెల్దండ సమీపాన హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ (ఫైల్) -
వైభవం.. లక్ష్మీవేంకటేశ్వరుడి తెప్పోత్సవం
● శేష వాహనంపై ఊరేగిన ఆదిశిలావాసుడు ● పోటెత్తిన భక్తజనం మల్దకల్: ఆదిశిలావాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై ఉంచి భాజాభజంత్రీలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో తెప్పోత్సవంపై విహరించారు. ఆయా వేడుకలను తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై దశమికట్ట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, మండల నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నరేందర్, చంద్రశేఖర్రావు, అర్చకులు, సిబ్బంది, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీ హాస్టల్ను సందర్శించిన న్యాయమూర్తి
గద్వాల క్రైం: మంగళవారం ఉదయం గద్వాల బాలుర ఎస్టీ హాస్టల్ విద్యార్థులు అల్పహారం ఉప్మా తిని 14 మందితీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం గద్వాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి లక్ష్మి హాస్టల్ను సందర్శించి అక్కడి సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు న్యాణమైన ఆహారం అందించే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలుషిత అల్పహారం తిని అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు ధ్రువీకరించారన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ భవనం శిఽథిలావస్థలో ఉండడం, సరైన స్నానపు గదులు, డ్రైనేజీ వ్యవస్థ స్వచ్ఛమైన తాగునీరు తదితర సమస్యలను న్యాయమూర్తి గుర్తించారు. అనంతరం న్యాయమూర్తి వంటగదిని పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర నివేదికలను అందిచాలని వార్డెన్ పవన్కుమార్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై న్యాయ సేవాధికార సంస్థ సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జడ్జి వెంట లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. -
పల్లెకు నిధులు ఇలా!
● పంచాయతీలకు మూడు రకాలుగా ఆదాయం ● సొంత వనరులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆ నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ప్రధానంగా సొంత వనరులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నుంచి నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్సార్ నిధులు కూడా మంజూరవుతాయి. సొంత వనరులు పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి పన్ను, నల్ల పన్ను, వృత్తి (వ్యాపారాలు, వృత్తులపై) పన్ను, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వ సాధారణ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీలు అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. ఖర్చులు ఇలా.. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రెయినేజీ, వీధిదీపాలు, పచ్చదనం నిర్వహణకు, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇండోర్ స్టేడియంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు 51వ అంతర్జిల్లా (రాష్ట్రస్థాయి) జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ టోర్నీలో 32 జిల్లాలతో హైదరాబాద్ నుంచి రెండు జట్లు పాల్గొంటాయని తెలిపారు. క్రీడాకారులు, అధికారులతో కలిసి దాదాపు 800 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. లీగ్ కమ్నాకౌట్ పద్ధతిలో నాలుగు మ్యాట్లపై దాదాపు 90 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారిని జనవరి 14 నుంచి 19 వరకు ఏపీలో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర జట్టుకు జిల్లా కేంద్రంలోనే ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులకు మాడ్రన్ స్కూల్, టీఎన్జీవో భవన్, అంబేద్కర్ కళాభవన్, బీపీహెచ్ఎస్, స్కౌట్స్ భవన్లో వసతి, భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 5న సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, 7న జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి ఉమామహేశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్రెడ్డి, సభ్యులు నర్సింలు, రాంచంద్రయ్య, యూ.శ్రీనివాసులు, బాల్రాజు, పాపారాయుడు పాల్గొన్నారు. -
అన్నదమ్ముల సవాల్
● నర్సింగాపురంలో సర్పంచ్ స్థానానికి పోటీ మదనాపురం: మండలంలోని నర్సింగాపురం గ్రామంలో సర్పంచ్ బరిలో అన్నాదమ్ములు బడుగుల రాములు, బడుగుల ఆంజనేయులు నిలిచారు. గ్రామ సర్పంచ్ స్థానం ఈసారి ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. అన్న రాములు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. తమ్ముడు ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ వీరి విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తమ మధ్య రాజకీయ పోరు ఉన్నా.. అది కేవలం ఎన్నికల ప్రచారం వరకేనని, ఇంటికి రాగానే అన్నదమ్ములమే అంటున్నారు. అమ్మానాన్నలు నేర్పిన సంస్కారం, ఆప్యాయత రాజకీయాల కంటే గొప్పవని చెబుతున్నారు. ప్రచారంలో ఒకరినొకరు విమర్శించుకోకుండా, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలనే విషయంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నా.. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమానురాగాలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. బడుగుల ఆంజనేయులు -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
నవాబుపేట: మండల కేంద్రంలోని పోచమ్మ కుంటలో వ్యక్తి చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన రావుల చంద్రయ్య(54) బుధవారం చేపల వేటకు గ్రామ సమీపంలోని పోచమ్మ కుంటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఆరాతీశారు. పోచమ్మకుంట కట్టపైన చంద్రయ్య చెప్పులు, ఫోన్ లభిచడంతో ఆయన ప్రమాద వశాత్తు కుంటలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమచారం అందించగా ఘజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలిస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వరిధాన్యం కుప్పను ఢీకొన్న బైక్.. ● యువకుడి దుర్మరణం అమరచింత: బైక్పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్పను ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. నాగల్కడ్మూర్కు చెందిన రాజు (35) బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం వద్ద ఉన్న రహదారి మలుపులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై ఆరబోసిన వరిధాన్యం కుప్పను ఢీకొని కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. నాగిరెడ్డిపల్లే నుంచి నాగల్కడ్మూర్ మీదుగా అమరచింత వరకు ఉన్న ప్రధాన బీటీ రహదారిపై రోడ్డుకు సగభాగం వరిధాన్యం కుప్పలు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం బల్మూర్: పంచాయతీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మెన్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గట్టుతుమ్మెన్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం క్లస్టర్ పరిధిలోని మహదేవ్పూర్, మంగళకుంటపల్లి, గట్టుతుమ్మెన్ గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన కార్వంగ శ్రీను (43) నామినేషన్ కేంద్రం వెనకాల ఉండగా.. బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని పరిశీలించగా.. అతడు అప్పటికే మృతి చెందాడని గుర్తించి స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ రాజేందర్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. గట్టుతుమ్మెన్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. వెనక భాగంలో మహాదేవ్పూర్ నుంచి వచ్చిన కార్లు పార్క్ చేశారు. వారే రివర్స్ తీసే క్రమంలో ఢీకొట్టడంతోనే శ్రీను మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. -
నాడుమామ, అత్త– నేడు కోడలు
నవాబుపేట: సర్పంచ్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు. గతంలో తాజాగా పోటీలో ఉన్న మహిళ మామ అంతయ్య 1995లో మండలంలోని అమ్మాపూర్ సర్పంచ్గా గెలుపొందాడు. అనంతరం 2001లో మహిళా రిజర్వేషన్ రావడంతో ఆయన భార్య అరుణమ్మ సర్పంచ్గా బరిలో నిలిచి విజయం సాధించింది. తాజాగా అంతయ్య కోడలు రావలీల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచింది. పంచాయతీ బరిలో మాజీలు పంచాయతీ ఎన్నికలలో మాజీ సర్పంచ్లు బరిలో నిలిచారు. తాజాగా జరుగుతున్న ఎన్నికలలో పోమాల్ నుంచి తాజామాజీ సర్పంచ్గా ఉన్న కృష్ణ తన భార్య లక్ష్మిని బరిలో నిలిపాడు. కారుకొండలో మాజీ సర్పంచ్ ప్రతిపక్ష పార్టీకి చెందిన పురుషోత్తం తాజాగా మరోసారి సర్పంచ్గా రంగంలో దిగాడు. తీగలపల్లి మాజీ సర్పంచ్ నారాయణ తన భార్య మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మను సర్పంచ్గా బరిలో దించాడు. దేపల్లిలో మాజీ సర్పంచ్ దశరత్ తాజాగా మహిళా రిజర్వేషన్ రావడంతో తన భార్యను సర్పంచ్ బరిలో నిలిపాడు. -
నేడు మహబూబ్నగర్ స్థాపన దినోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని మీర్ మహెబూబియా హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ స్థాపన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆరో నిజాం మీర్ మహెబూబ్అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ 135వ స్థాపన వేడుకలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షులు మహ్మద్ జియావుద్దీన్ నాయర్ తదితరులు పాల్గొంటారన్నారు. వేడుకల్లో మహబూబ్నగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి 17 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఇందులో 15,750 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,709, కనిష్టంగా రూ.1,619 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,611, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,901, కనిష్టంగా రూ.1,624, పత్తి గరిష్టంగా రూ.6,681, కనిష్టంగా రూ.5,060 చొప్పున పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,059 చొప్పున ధరలు లభించాయి. కాగా.. దేవరకద్రలో ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల కోసం గురువారం, చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్కు సెలవు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. దివ్యాంగులకు చేయూతనివ్వాలి పాలమూరు/ మహబూబ్నగర్ రూరల్: సమాజంలో దివ్యాంగులు అందరితో సమానం అని, వారి పట్ల దయ, జాలితో కాకుండా చేయూతనిచ్చి గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లాకేంద్రంలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఆర్పీడబ్ల్యూడీ యాక్టు–2016 ప్రకారం దివ్యాంగులను అగౌరవపరిచినా, చిన్నచూపు చూసినా చట్టపరంగా శిక్షలు ఉంటాయన్నారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు విద్యతోపాటు వారికి కావాల్సిన అవసరాలను గుర్తించి సేవ చేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు గన్నోజు చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ సుజాత, డైట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శివన్న, పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అంజనేశ్వరి, దివ్యాంగుల హక్కుల పోరాట రాష్ట్ర కార్యదర్శి నరేందర్, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. -
మహబూబ్నగర్
పాత కొత్త ఒక్కో చోట ఒకలా.. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉమ్మడి జిల్లాలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ పడుతున్న వారిలో ఎక్కువ శాతం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే (పాత) ఆయా నియోజకవర్గాల నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట మాత్రం బెట్టి చరిష్మా, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని గ్రహించిన పలు నియోజకవర్గాల నేతలు నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారిని నేరుగా పిలిపించుకుని భవిష్యత్లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని.. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రేపటి నుంచి కబడ్డీ టోర్నీ మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నుంచి 51వ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది. –8లో u ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు -
అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రభుత్వ శాఖల్లో అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి పాటుపడాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. యాంటీ కరప్షన్ వీక్–2025ను పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించా రు. వారాంతం పాటు జరగను న్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సిద్ధం చేసిన యాంటీ కరప్షన్ అవగాహన వాల్పోస్టర్ను తన చాంబర్లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరి మధ్య అవినీతిని నిర్మూలించేందుకు అవసరమైన అవగాహన, బా ధ్యత, పారదర్శకతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నిరంతర అవగాహన, నైతిక విలువలు, ప్రజల భాగస్వా మ్యం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో నిజాయితీ, సమగ్రత మరింత బలపడుతుందని చెప్పా రు. యాంటీ కరప్షన్ బ్యూరో, మహబూబ్నగర్ రేంజ్ ఈ వారంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల్లో అప్రమత్తతను పెంచడం, అవినీతి రహిత పరిపాలన సమాజ ఆర్థికాభివృద్ధికి కీలకమని తెలియజేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. సీఐలు ఎస్ఏ ఖాదర్ జిలానీ, లింగస్వామి పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం బాలేదని.. విద్యార్థుల ఆందోళన
మహమ్మదాబాద్: మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందిస్తున్నారంటూ మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు తినడంతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం చేయకుండా రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పలుమార్లు మండల అధికారులకు విన్నవించినా ఫలితం లేదని.. స్వచ్ఛమైన తాగునీటిని కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వివరించా రు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని అధికారులకు తెలియజేసి నాణ్యమైన భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని పోలీసులు సర్దిచెప్పి పాఠశాలకు పంపించారు. -
చెక్పోస్టులో రూ.2.64 లక్షల నగదు పట్టివేత
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గండి చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. చెక్పోస్టు వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అచ్చంపేట నుంచి పెబ్బేరుకు వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి కొంత నగదు, బిజ్ఞాపల్లి నుంచి ఇద్దరు వ్యక్తులు వనపర్తి జిల్లాలోకి డబ్బును తరలిస్తుండగా కొంత మేర మొత్తం రూ.2.64 లక్షలు పట్టుకున్నట్లు ఎస్ఐ నరేష్కుమార్ తెలిపారు. పట్టుకున్న డబ్బులను ఎన్నికల నియమావళి మేరకు కలెక్టర్ కార్యాలయంలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. చెక్పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ మండలంలోని బుద్దారం గండి చెక్పోస్టును ఎస్పీ సునీతరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెక్పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వెల్లడించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వారి దృష్టంతా ఉపసర్పంచ్ పదవిపైనే..
గ్రామసర్పంచ్ను నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉపసర్పంచ్ను వార్డుసభ్యులు తమలో ఒకరిని ఈ పోస్టుకు ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ ఉండేది కాదు. వార్డుమెంబర్కు ఉన్న అధికారాలే ఉపసర్పంచ్కు ఉండడం వల్ల అలంకారప్రాయంగానే మిగిలిపోయేది. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో ఈ పోస్టుకు యమా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఈ పదవికి పోటీ తీవ్రంగా నెలకొంది. ఉపసర్పంచ్ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరిని ఆశించి భంగపడ్డ అభ్యర్థులు (రిజర్వేషన్ కారణంగా రాకపోవడంతో) ఈ పోస్టుపై కన్నేశారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భావిస్తున్న అభ్యర్థులు జనరల్ వార్డుల నుంచి బరిలో దిగారు. తద్వారా వార్డు మెంబర్గా విజయం సాధించి ఉపసర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ నేఫథ్యంలో ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడా సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచి వార్డుల్లో పోటికి దిగిన అభ్యర్థులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఉపసర్పంచ్ పదవిని కూడా ఎన్నుకోవాల్సి ఉన్నందున ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులు ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నారు. అదే సమయంలో తాము పోటీచేస్తున్న వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. మందు, విందు, నగదు ముట్టజెపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ● నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్ ● బాధ్యతలు మాత్రం పూర్తిగా సర్పంచ్కే.. ● పల్లెల్లో ఈ పదవికి తీవ్రపోటీ అచ్చంపేట: గ్రామపాలనలో ఉపసర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఉపసర్పంచ్ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పవర్ఫుల్గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఉపసర్పంచ్ పోస్టును బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరు సాగుతుంది. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
● హైవే నుంచి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు ● ప్రయాణికులు సురక్షితం అడ్డాకుల: మూసాపేట మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మియాపూర్ డిపో–1 కి చెందిన లహరి బస్సు 17 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో జానంపేట పెట్రోల్ పంపు దాటిన తర్వాత ఓ వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పింది. హైవే నుంచి నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచి పోయింది. అందులో ఉన్న 17 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తర్వాత బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులను అదే డిపో నుంచి బెంగళూర్ వెళ్లే మరో బస్సులో ఎక్కించి పంపించారు. మంగవారం ఉదయం మియాపూర్ డిపోకు చెందిన అధికారులు వచ్చి విచారణ చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
అమెరికా నుంచి వచ్చి నామినేషన్
బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన కమతం నందినిరెడ్డి అమెరికా నుంచి సొంతూరుకు వచ్చి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న నందినిరెడ్డి రెండో కుమార్తెకు ప్రసవం కావడంతో కొద్ది నెలల కిందట ఆమె విజిటింగ్ వీసాలో అక్కడి వెళ్లారు. ఇండియాకు రావడానికి మరి కొద్ది వారాల సమయం ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం నోటిపికేషన్ విడుదల చేయడం, ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడం, లట్టుపల్లి గ్రామానికి జనరల్ మహిళ కేటాయించడంతో హుటాహుటిన ఆమె గ్రామానికి తిరిగి వచ్చారు. పరిస్థితులు అన్ని ఒకేసారి తనకు అనుకూలంగా రావడంతో సర్పంచ్ పీఠం కూడా దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు అభ్యర్థి నందినిరెడ్డి తెలిపారు. -
వివాహిత బలవన్మరణం
కల్వకుర్తి రూరల్: భార్యాభర్తల గొడవలో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్వకుర్తి విద్యానగర్లోని భగత్సింగ్కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. వంగూరు మండలం జాజాలకు కానిస్టేబుల్ గౌతం కల్వకుర్తిలో నివాసం ఉంటూ తెల్కపల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య మాధవి (31), అభినవ దీక్షిత్, నిహారిక, ఆదిత్య సంతానం. సోమవారం అర్ధరాత్రి భార్యాభర్తలు గొడవపడి ఆవేశానికి గురైన భార్య పడకగదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొని ఉరి వేసుకుంది. కాసేపటికి భర్త పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహకారంతో తలుపు బద్దలుగొట్టి చూడగా అప్పటికే మృతిచెందింది. మంగళవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. పురుగుమందు తాగి వ్యక్తి మృతి అచ్చంపేట రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మార్లపాడుతండాకు చెందిన సబావత్ లక్ష్మణ్(40) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న లక్ష్మణ్ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా దేవరకొండ ఆస్పత్రికి అక్కడి నుంచి నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీసులు తెలిపారు. బెల్టు షాపుపై కేసు నమోదు అమరచింత: మండలంలోని నాగల్కడ్మూర్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్పై మంగళవారం పోలీసులు దాడి చేసి 4.5 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారని ఎస్ఐ స్వాతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గ్రామంలో అక్రమ బెల్ట్ షాపును కొనసాగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మికంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొనసాగుతున్న నీటి పంపింగ్
ధరూరు: జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్హౌస్ వద్ద నీటి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, హీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 3910 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,229 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 9.542 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7,220 క్యూసెక్కుల నీటి తరలింపు దోమలపెంట: భూగర్భ కేంద్రంలో పంప్మోడ్ పద్ధతిలో శ్రీశైలం ఆనకట్ట దిగువున సాగర్ జలాశయం నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 7,220 క్యూసెక్కుల నీటిని (ఎత్తిపోతల) తరలించారు. విద్యుత్ డిమాండ్ పీక్ అవర్స్ ఉదయం 5.30 గంటల నుంచి 8.30 గంటల సమయంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తర్వాత నుంచి సోలార్ విద్యుత్ అందుబాటులోకి రావడం వలన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి అధికమవుతుంది. దీంతో మిగులు విద్యుత్ను వినియోగించుకుని భూగర్భ కేంద్రంలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంప్మోడ్ పద్ధతిలో సాగర్ జలాశయం నుంచి శ్రీశైలం జలాశయంలోకి నీటిని తరలిస్తున్నారు. సాయంత్రం పీక్ హవర్స్లో విద్యుత్ అవసరమైనప్పుడు కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం శ్రీశైలం జలాశయంలో 882.2 అడుగులు వద్ద 200.1971 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రం -
రాష్ట్రస్థాయి వాలీబాల్లో జిల్లా జట్ల ప్రతిభ
● చాంపియన్గా నిలిచిన బాలికల జట్టు ● మూడోస్థానంలో బాలుర జట్టు మహబూబ్నగర్ క్రీడలు: సిరిసిల్లలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో మంగళవారం ముగిసిన రాష్ట్రస్థాయి అంతర్జిల్లా సబ్ జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా బాలికల జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. చివరి పోరులో మహబూబ్నగర్ బాలికల జట్టు వరంగల్ జట్టుపై 25–19, 25–14, 25–23, 25–21 సెట్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా బాలుర విభాగంలో జిల్లా జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, మహ్మద్ హనీఫ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నవీరయ్య, దస్తగీర్ఖాన్, కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులను అభినందనలు తెలపడంతో పాటు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఉత్సాహంగాహ్యాండ్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగం హ్యాండ్బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 14 వరకు జిల్లాకేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ పోటీలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రజనికాంత్రెడ్డి, జియావుద్దీన్, శంకర్, ఆసిఫ్, ప్రదీప్, బాలు, అర్చన తదితరులు పాల్గొన్నారు. పీజీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పరిధిలో చదువుతున్న పీజీ రెండు, మూడు సెమిస్టర్లకు బ్యాక్ లాగ్, రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు విడుదల చేశారు. ఫలితాలను పాలమూరు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, అనురాధా, చంద్రకిరణ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బాదేపల్లిలో నిలిచిన క్రయవిక్రయాలు జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 21 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు రావడంతో యార్డు ఆవరణ పూర్తిగా నిండిపోయింది. కొనుగోలు చేసిన బస్తాలను వ్యాపారులు సకాలంలో తరలించకపోవడంతో యార్డులోనే ఎక్కడికక్కడ ఉండిపోయాయి. దీంతో మంగళవారం యార్డులో క్రయవిక్రయాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ● దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,692, కనిష్టంగా రూ.2500 ధర పలికింది. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.కాగా.. బుధవారం ఉదయం ఉల్లి పాయల బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఎస్హెచ్వీఆర్కు 8 పాఠశాలల ఎంపిక మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ స్కీం(ఎస్హెచ్వీఆర్)కు సంబంధించి జిల్లాస్థాయిలో 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన జాబితాను డీఈఓ ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి వసతి, టాయ్లెట్లు, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఫైవ్ స్టార్ రేటింగ్ను అధికారులు కేటాయించారు.. రూరల్–1 విభాగంలో కొంరెడ్డిపల్లి మండల పరిషత్ పాఠశాల, కంచన్పల్లి మండల పరిషత్ పాఠశాల, కల్లేపల్లి మండల పరిషత్ పాఠశాల, విభాగం–2లో ఎస్వీకేఎం పోలేపల్లి సెజ్, జెడ్పీ హెచ్ఎస్ వెన్నచేడ్ (బాయ్స్), జెడ్పీహెచ్ఎస్ తాటికొండ, అర్బన్ విభాగం–1లో బాదేపల్లి మండలపరిషత్ పాఠశాల, విభాగం–2లో అర్బన్ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఎదిర ఉన్నాయి. జిల్లాస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1,136 దరఖాస్తులు చేసుకోగా అందులో 343 పాఠశాలలను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీలు చేసి, 8 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయిలో సత్తా చాటితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రూ.లక్ష క్యాష్ ప్రైజ్ను అందజేయనున్నారు. -
హాట్స్పాట్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్మార్చ్ నిర్వహించడం వల్ల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోగలుగుతారని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గాజులపేట, జమిస్తాపూర్, ధర్మపూర్ గ్రామాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధులతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసులు తిరుగుతూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మకంగా గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి బీట్ పెట్రోలింగ్ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటికి భద్రతతో పాటు డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఽఘా పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో బెదిరింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ● స్థానిక ఎన్నికల్లో ఎలాంటి గొడవలు సృష్టించరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ ఎన్బీ రత్నం కోరారు. కోయిలకొండ మండలపరిధిలో ఉన్న 8 ప్రధాన సమస్యాత్మక గ్రామాల్లో మంగళవారం అదనపు ఎస్పీ కోయిలకొండ ఎస్ఐ తిరుపాజీతో కలిసి పర్యటించారు. ప్రతి గ్రామంలో స్థానికులతో ఎలాంటి గొడవలు సృష్టించాం అనే అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. బూర్గులపల్లి, తన్నాయిపల్లి, కోత్లాబాద్, పారుపల్లి, శెరివెంకటాపూర్, సూరారం, ఇంజమూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఫ్లాగ్మార్చ్ -
‘రెబల్స్’ గాయబ్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలిదశ పల్లె పోరు కీలక ఘట్టానికి చేరింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా.. సాయంత్రం ఐదు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనంతరం వెంటనే ఆయా అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. అయితే అధికార కాంగ్రెస్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తం గ్రామపంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నేడు ఉపసంహరణకు తుది గడువు కావడంతో ముఖ్యనేతలు తమను తప్పించే ప్రయత్నాలు చేస్తారని గ్రహించిన పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడంతో నేతలు తల పట్టుకుంటున్నారు. పలుచోట్ల ఇదివరకే బుజ్జగింపు ప్రయత్నాలు చేయగా.. వారు ఉపసంహరణకు ససేమిరా అన్నట్లు సమాచారం. తాజాగా వారు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుండడంతో పోటీలో నిలబడడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘హస్తం’ ముఖ్య నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చేసేదేమీ లేక ఆయా గ్రామాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని దానిపై వారు కాంగ్రెస్ స్థానిక శ్రేణులకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆసక్తికరంగా పోరు.. ప్రస్తుతం తొలి విడత ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. బుధవారం స్కూట్నీ కార్యక్రమం జరగనుంది. దీంతో పాటు చివరిదశలో జరిగే జీపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో పోటీకి సై అంటే సై అంటుండడం ఆ పార్టీ ముఖ్య నేతలను బెంబేలెత్తిస్తోంది. స్వయంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో ఇన్చార్జిలను నియమించి పరిస్థితి చక్కబెట్టేలా ముందుకు సాగుతున్నారు. అయినా ఉపసంహరణ సమయంలో రెబల్ అభ్యర్థులు తప్పించుకుని తిరుగుతుండడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అజ్ఞాతంలోకి పలువురు పోటీదారులు బరిలోనుంచి తప్పుకోవాలనే ఒత్తిళ్లు తప్పవని అండర్ గ్రౌండ్లోకి.. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుది గడువు తల పట్టుకుంటున్న ముఖ్య నేతలు ఆసక్తికరంగా పల్లె పోరు -
పీఓలపైనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో, జెడ్పీ మీటింగ్ హాల్లో పీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అనేక దశల్లో అధికారులు పనిచేసినా, క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర ప్రిసైడింగ్ అధికారులదేనని చెప్పారు. కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు అధికారులు తప్పకుండా సమయానికి హాజరై, సంబంధిత గ్రామ పంచాయతీకి సంబంధించిన స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను అప్రమత్తం సంప్రదించాలన్నారు. వారికి కేటాయించిన ఎలక్షన్ మెటీరియల్ను సక్రమంగా తనిఖీ చేసి, బ్యాలెట్ పేపర్లలో తమ ప్రిసైడింగ్ స్టేషన్కు సంబంధించిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల జారీ వంటి కార్యక్రమాలు అన్నీ స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్ర పరిధిని గుర్తించటం, అభ్యర్థుల వివరాలను ప్రదర్శించడం, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేయడం పూర్తిగా ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని వివరించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ నిఖిత, తదితరులు పాల్గొన్నారు. మూడో విడతకు వెబెక్స్ ద్వారా శిక్షణ.. మూడోదశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులకు వెబెక్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. నామినేషన్ వివరాలను టీ–పోల్ సాఫ్ట్వేర్లో వెంటనే అప్లోడ్ చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఆర్ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లకు నామినేషన్లు వచ్చిన వెంటనే టీ పోల్ లో నమోదు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. నామినేషన్ పత్రాల ప్రాథమిక ఽధ్రువీకరణను కచ్చితంగా చేయాలని, నామినేషన్ రద్దు, గుర్తుల కేటా యింపు వంటి కీలక నిర్ణయాల్లో ఎన్నికల రూల్ బుక్ అనుసరించాలన్నారు. శిక్షణ -
సమస్యాత్మక గ్రామంగా హన్వాడ
మహబూబ్నగర్ క్రైం/హన్వాడ: సమస్యాత్మక గ్రామంగా హన్వాడను గుర్తించామని, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేటట్లు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మంగళవారం హన్వాడల రైతువేదికలో జరుగుతున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. మండలకేంద్రంలో భద్రత ఏర్పాట్లు, బందోబస్తు కట్టుదిట్టంగా ఉండేలా అవసరమైన మార్గదర్శకాలను సూచించారు. ఆమె వెంట రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ వెంకటేష్ , ఇతర సిబ్బంది ఉన్నారు. సైబర్ నేరాల కట్టడికి ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి కోసం రాష్ట్ర పోలీస్శాఖ కీలక చర్యల్లో భాగంగా ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు కొత్తరూపం మార్చుకుంటూ బాధితులను ఆర్థికంగా నష్టం చేకూర్చుతున్నారని తెలిపారు. ఒక్క క్లిక్తో పెద్ద నష్టం చోటుచోసుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రత నియమాలను పాటించాలన్నారు. అనుమానాస్పద లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను, బ్యాంకింగ్ వివరాలు అడిగే ఫోన్కాల్స్కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సైబర్ నేరాల బారినపడినప్పుడు వెంటనే 1930 హెల్ప్లైన్తో పాటు సైబర్ క్రైం వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సైబర్ నేరాల కట్టడి కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. నేటి నుంచి ‘మూడో’ విడత ● 5 మండలాల్లో 133 పంచాయతీలు, 1152 వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ ● 5వ తేదీ వరకు అవకాశం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత నామినేషన్ల ఘట్టం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో అడ్డాకుల, ముసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల పరిధిలోని 133 గ్రామ పంచాయతీలకు, 1152 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 38 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం స్టేజి–1 ఆర్ఓలు 44 మంది, స్టేజ్–1 ఏఆర్ఓలను 43, స్టేజ్–2 ఆర్ఓలను 145 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. పరిశీలన నామినేషన్లు -
పారదర్శకంగా నిర్వహించేందుకు పార్టీలు సహకరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడల్ కోడ్ పాటించాలని కోరారు. జిల్లాలోని మొత్తం 3,674 పోలింగ్ కేంద్రాలలో 999 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ పోలింగ్కేంద్రాలలో ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తిస్థాయి భద్రత కోసం, వెబ్కాస్టింగ్, సీసీ టీవీ కెమెరాలు, సూక్ష్మ పర్యవేక్షకులతో పాటు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో, రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను, నివృత్తి చేస్తూ, వారి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు పరిశీలన సమయంలోనే నమోదు చేయాలని, ఆలస్యంగా ఇచ్చే అభ్యంతరాలు స్వీకరించమని చెప్పారు. రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ)వద్ద తిరస్కరిస్తే అప్పీల్కు వెళ్లవచ్చని, అయితే ఆర్డీఓ వద్ద అప్పీల్ తిరస్కరిస్తే.. అదే తుది తీర్పు అవుతుందని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు వారి తుది జాబితాలోని పేర్ల అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో వివాదాలు లేకుండా ఉండేందుకు మంచి ప్రవర్తన కలిగిన ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా పూర్త య్యేలా తమ అభ్యర్థులకు కూడా మార్గనిర్దేశంచే యాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం -
గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మీకు తెలుసా.. గ్రామ పాలనలో సర్పంచ్ పదవి చాల బాధ్యాయుతమైందని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఉండే అధికారం, విధులు, బాధ్యతలపై ఓ లుక్కెద్దాం. ● సర్పంచ్గా ఎన్నికై తే అయిదేళ్లపాటు గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కుతుంది. ● ప్రొటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఉంటుంది. ● వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందిస్తుంది. ● కనీసం నెలకు ఒకసారి పంచాయతీ, పాలకవర్గ సమావేశం, రెండు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాల ఖాతాలను ఆడిటింగ్ చేయించాలి. ● నిధులను గ్రామాభివృద్ధికి సక్రమంగా వినియోగించాలి. ● గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలి. ● రెండు నెలలకోసారి చొప్పున వరుసగా మూడు పర్యాయాలు గ్రామసభ నిర్వహించకపోతే చట్టంలోని 33 సెక్షన్ ప్రకారం సర్పంచ్ పదవి కోల్పోతారు. ● అవినీతి ఆరోపణలపై నిరూపణ జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 ప్రకారం పదవిపై వేటు పడుతుంది. ● గ్రామ పంచాయతీ ఆడిట్, లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్ 23 ప్రకారం అనర్హత వేటు ఉంటుంది. ● వార్డు సభ్యులంతా పాలకవర్గంగా ఉంటారు. వీరిలో ఒకరు ఉప సర్పంచ్గా వ్యవహరిస్తారు. వీరికి పారితోషికం, గౌరవ వేతనం లేదు. వార్డు సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు, మహిళా సభ్యులు ఆరు సమావేశాలకు గైర్హాజరైతే కలెక్టర్ ద్వారా అనర్హత వేటు పడుతుంది. కోడూర్ గ్రామ పంచాయతీ భవనం -
150 గ్రాముల గంజాయి పట్టివేత
గద్వాల క్రైం: గుట్టుగా గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుని బైక్తో పాటు 150 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు గద్వాల ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్కు చెందిన అవీజ్ సోమవారం ఉదయం బైక్పై గద్వాలకు గంజాయి విక్రేయించేందుకు వస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు ధరూర్ మండలం చిన్నచింతరేవుల గ్రామ శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా 150 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశామని, హైదరాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గంజాయి తీసుకునే వారి వివరాలపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు. నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేష్, వీరేశలింగం, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నెట్టెంపాడు నీటి పంపింగ్ ప్రారంభం
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిదిలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్టు–1 గుడ్డెందొడ్డి పంప్హౌస్ వద్ద నీటి పంపింగ్ను సోమవారం ప్రారంభించారు. సోమవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోలతకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు, కుడి కాలువకు 260 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,448క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.624 టీఎంసీల నిల్వ ఉంది. -
వైఎస్సార్లా నీళ్లిచ్చిన దైవం రేవంత్రెడ్డి
నారాయణపేట/ మక్తల్: ‘మాటలకే పరిమితమైన పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆచరణలో పెట్టాలని ఈ ప్రాంతంలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకానికి శ్రీకారం చుట్టి వెనకబడిన మక్తల్– పేట– కొడంగల్ నియోజకవర్గాల్లో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.5 వేల కోట్లు మంజూరు చేసింది.. అనాడు థర్డ్ కాటన్లా.. జలయజ్ఞ ప్రదాత అయిన మరో వైఎస్ రాజశేఖరరెడ్డిలా.. అపర భగీరథుడిగా నీళ్లిచ్చిన దైవం మన సీఎం రేవంత్రెడ్డి’ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఒక్కసారి ఆలోచించండి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా.. రూ.5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులను ఆదుకోవాలని సీఎంను కోరిన వెంటనే ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. సహచర మంత్రి దామోదర రాజనర్సింహ మక్తల్కు ఊరికే వచ్చి చూసిపోతే ఏం బాగుంటుందని దవాఖానాకు రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. నారాయణపేట నాలుగు లైన్ల రోడ్డు కోసం రూ.210 కోట్లు ఇచ్చిన సీఎంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గుడులు, గోపురాల అభివృద్ధికి రూ.కోట్లు మంజూరు చేశారని వివరించారు. ప్రజాపాలనకు రెఫరెండం ఇటీవల జూబ్లీహిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలనకు రెఫరెండం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు బిడ్డ అయినందుకే మక్తల్– పేట– కొడంగల్ ప్రాంతాలు అభివృద్ధి పరుగులు తీస్తున్నాయన్నారు. ఈనాడు కాదు ఆనాటి నుంచి పేదలకు మేలు చేసేది.. దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. మరో ఐదేళ్లు కాంగ్రెస్సే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో సాగుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ మూడేళ్లు కాదు.. మరో ఐదేళ్లు సైతం అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.11,399 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సన్నబియ్యం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం గత ప్రభు త్వానికి లేకపోయిందని దుయ్యబట్టారు. హై దరాబాద్ తర్వాత మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పనున్నామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్తో ముందడుగు భవిష్యత్లో యువత, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఏవిధంగా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే వెయ్యి బస్సులకు ఓనర్లను చేశామన్నారు. జిల్లాలో పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, వడ్డీ లేని రుణాలు ఇచ్చిందన్నారు. నాణ్యతతో కూడిన విద్య, ఆహార భద్రత కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. -
శంకరాయపల్లి తం(టా)డా!
65 ఓట్లతో గ్రామ పంచాయతీ ఏర్పాటు ● ఊరంతా బీసీలే.. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు.. ● 8 వార్డులకు 4 వార్డులు ఎస్టీ రిజర్వుడు ● 4 వార్డులకే ఎన్నికల నిర్వహణ జడ్చర్ల టౌన్: రాష్ట్రంలోనే అతిచిన్న గ్రామపంచాయతీగా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా పంచాయతీ రికార్డుల్లోకి ఎక్కనుంది. మూడో విడతలో ఎన్నికలు జరగనున్న జడ్చర్ల మండలంలో మొత్తం 45 జీపీలుండగా శంకరాయపల్లి తండా పంచాయతీ ప్రత్యేకంగా నిలవనుంది. పంచాయతీలో మొత్తం 87మంది జనాభా ఉండగా కేవలం 65మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. జీపీలో మొత్తం 8 వార్డులుగా విభజన చేశారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. వార్డుల విషయానికి వస్తే ఎస్టీ మహిళ (2), ఎస్టీ అన్రిజర్వుడు (2), అన్రిజర్వుడు మహిళ (2), అన్రిజర్వుడు (2) వార్డుస్థానాలుగా కేటాయించారు. వాస్తవానికి గ్రామంలో ఉన్నది మొత్తం యాదవకులానికి చెందిన బీసీలే కావటం గమనార్హం. ఈ కారణంగా సర్పంచ్ స్థానంతోపాటు 4వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో అవి ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో కేవలం 4వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగం మందికే ఓటువేసే అవకాశం గ్రామంలో 65మంది ఓటర్లు ఉండగా.. ఒక్కో వార్డులో 8మంది ఓటర్లు ఉన్నారు. ఒక వార్డులో మాత్రం 9మంది ఓటర్లకు అవకాశం కలిగింది. మొదటి నాలుగు వార్డులు ఎస్టీ రిజర్వుడు కేటాయించారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ కావటం, ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేరు. ఈ కారణంగా మిగిలిన 5, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో గ్రామంలో 65మంది ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం 32మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గ్రామ పంచాయతీగా మారినప్పటికీ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మరెక్కడా లేదనడంలో సందేహం లేదు. బీసీ ఓటర్లయినా.. బీసీ స్థానాలు శూన్యం గ్రామ పంచాయతీలో ఉన్నది మొత్తం బీసీ ఓటర్లే.. అయినప్పటికీ ఒక్క వార్డు స్థానం కూడా బీసీ రిజర్వుడుగా కేటాయించబడలేదు. శంకరాయపల్లి వ్యూ అధికారుల తప్పిదం 2018లో అధికారులు చేసిన తప్పిదం శంకరాయపల్లి తండా పంచాయతీకి శాపంగా మారింది. పంచాయతీ పేరు శంకరాయపల్లి తండా అయినప్పటికీ ఉండేది మాత్రం శంకరాయపల్లి గ్రామం. 2018లో తండా పంచాయతీలు ఏర్పడిన సమయంలో జడ్చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న శంకరాయపల్లి తండాను పంచాయతీగా మార్చారు. అనుబంధ గ్రామంగా శంకరాయపల్లిని చేర్చారు. అయితే ఇదే సమయంలో శంకరాయపల్లి తండాను జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం చేస్తూ అప్పటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పేరుకు శంకరాయపల్లి తండా పంచాయతీ అయినప్పటికీ అనుబంధ గ్రామం పంచాయతీగా మార్చాల్సి వచ్చింది. 2019లో ఈ గ్రామానికి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. గ్రామ పంచాయతీ గడువు పూర్తికాకపోవటమే అందుకు కారణం. ఆ తర్వాత ఉపఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్యదర్శి, ప్రత్యేక అధికారి పాలన కొనసాగించారు. ఇన్నాళ్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓట్లు వచ్చేలా చూస్తాం
అచ్చంపేట రూరల్: పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3 నుంచి నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, చారగొండ మండలాల్లో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యుల ఎన్నిక కోసం అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సిద్ధాపూర్ గ్రామ శివారులోని గుర్రాలబండ వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులైన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారి చేత ప్రమాణం చేయించారు. వార్డు మెంబర్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడుతాయో.. అన్ని ఓట్లు తప్పకుండా సర్పంచ్ అభ్యర్థికి వేయించే బాధ్యత మాదేనంటూ వార్డు మెంబర్ అభ్యర్థులు ప్రమాణం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు గిఫ్ట్గా ఇద్దామనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మహిమాన్వితం.. ఆదిశిలా క్షేత్రం
● వైభవంగా స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ● నేడు స్వామివారి కల్యాణోత్సవం ● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు మల్దకల్: ఆదిశిలా క్షేత్రవాసుడు స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి భక్తజన బాంధవుడిగా విరాజిల్లుతున్నారు. ఇక్కడి ప్రజలు ఆదిశిలా క్షేత్రం వాసుడిగా, తిమ్మప్ప స్వామిగా, శ్రీనివాసుడిగా, మల్దకల్ రాయుడిగా స్వామివారిని సంభోదిస్తుంటారు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గతనెల 25న స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 3న తెప్పోత్సవం, 4న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. గ్రామస్తులు తిరుపతికి వెళ్లరు.. మల్దకల్లోనే స్వయంభూగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి వెలియడంతో ఆ గ్రామస్తులతో పాటు పెద్దొడి గ్రామ ప్రజలు తిరుపతికి వెళ్లరు. ఇక్కడే స్వామివారిని ఆరాధిస్తారు. అదే విధంగా గ్రామస్తులు ఎక్కువశాతం ఆదిశిలా వాసుడి పేరుతో పిల్లలకు నామకరణం చేస్తారు. కులమతాలకు అతీతంగా మల్దకల్, తిమ్మప్ప, శ్రీనివాసులు, గోవిందు అనే పేర్లతో 40 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉంటే, గ్రామంలో రోజు స్వామివారి పల్లకీ సేవను స్థానిక దశమికట్ట వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీంతో స్వామి వారికి పల్లకీ సేవను కింద నుంచే వీక్షించాలనే నమ్మకంతో గ్రామస్తులు రెండో అంతస్తు నిర్మాణానికి ఆసక్తి చూపరు. స్వామివారి పల్లకీ సేవను అంతస్తు పైనుంచి చూస్తే అరిష్టంగా భావిస్తారు. దీంతో గ్రామంలో ఇప్పటి వరకు రెండో అంతస్తు ఎవరూ నిర్మించలేదు. వాల్మీకి పూజారులే.. మల్దకల్లో ఎక్కువగా వాల్మీకి కులస్తులు ఉండటంతో ఆలయంలో జరిగే తొలి పూజల్లో వారే ముందుంటారు. ఆలయంలో పూజలు చేసే వాల్మీకులకు దేవుడి పేరుతో మాన్యాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆలయంలో దేవుడికి సేవలు అందిస్తున్నారు. -
మక్తల్కు బ్రహ్మోత్సవ శోభ
మక్తల్: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విరాజిల్లుతున్న మక్తల్ పడమటి ఆంజనేయస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 8 రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్గశిర మాసం పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు తరలివచ్చి స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మకర్త ప్రాణేశ్ ఆచారి, ఈఓ కవిత తెలిపారు. కోనేరు పునఃప్రారంభం.. ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్న ఆలయ కోనేరు ను ఇటీవల రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఇటీవల ఆధునికీక రించారు. ఇందుకోసం రూ. 60లక్షలు వెచ్చించా రు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించేలా తీర్చిదిద్దారు. కార్యక్రమాలు ఇలా.. ● 2న ఉదయం 7 గంటలకు ఉత్తరాది మఠం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని 7:30 గంటలకు ఉత్సవాలకు అంకుర్పాణ, ధ్వజారోహణ, అలంకారణోత్సవం, 9:30 గంటలకు హనుమద్వ్రతం, సాయంత్రం గజవాహన సేవ నిర్వహించనున్నారు. ● 3న ఉదయం పవన హోమం, సాయంత్రం నెమలి వాహన సేవ, 6 గంటలకు ప్రభోత్సవం ఉంటుంది. ● 4న సాయంత్రం 6 గంటలకు రథోత్సవ ప్రారంభమవుతుంది. ● 5న సాయంత్రం 5 గంటలకు హంస వాహన సేవ, 6:30 గంటలకు పాల ఉట్ల కార్యక్రమం నిర్వహించనున్నారు. ● 6న ఉదయం 10 గంటలకు చక్రతీర్థస్నానం, 11 గంటలకు అశ్వవాహన సేవ కార్యక్రమం ఉంటుంది. ● 7న హంస వాహన సేవ. ● 8న ఉష్ట్ర వాహన సేవ. ● 9న కల్పవృక్ష వాహన సేవ అనంతరం పూలరథం, పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. పడమటి ఆంజనేయస్వామి నేటి నుంచి పడమటి ఆంజన్న ఉత్సవాలు 4న స్వామివారి రథోత్సవం రూ. 60లక్షలతో ఆలయ కోనేరు ఆధునికీకరణ -
రాష్ట్రంలోనే మొదటిస్థానం..
ఐదేళ్లతో పోల్చితే నిరక్షరాస్యులు, మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి.. కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు అడ్మిషన్లు పెంచాం. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మహబూబ్నగర్ జిల్లా మిగతా జిల్లాలతో పోల్చితే రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. అడ్మిషన్లు చేరిన వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చక్కని అవకాశం.. వివిధ కారణాలతో బడిమానివేసిన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదువుకునేందుకు ఒక చక్కని అవకాశం. అడ్మిషన్లు గతంలో కంటే చాలా పెరిగాయి. ఓపెన్ స్కూల్లో ఎస్సెస్సీ వంటివి రెగ్యులర్ తరగతుల కంటే కూడా సరళంగా ఉంటాయి. సలువుగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పెరుగుతుంది. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ ● -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): 2వ విడత జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పక్కాగా ఉండాలని, తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఎంసీసీ, ఎన్నికల వ్యయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించామని, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కూడా సమకూరుస్తున్నట్లు తెలియజేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నట్లు, మెక్రో అబ్జర్వర్లను నియమించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ.. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నట్లు, బైండోవర్ కేసులు 61 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ నిఖిల, ఆర్డీఓ నవీన్, టైటస్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వివరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సాధారణ పరిశీల కురాలు కాత్యాయనీదేవి సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మీడియా సెంటర్ పనితీరును అడిగి తెలు సుకున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారా న్ని సేకరించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించాలన్నారు. ప్రతిరోజూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) వార్తలను గుర్తించి అధికారులకు తెలియజేయాలన్నారు. -
వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం ● దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు ● మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం మక్తల్లో అభివాదం చేస్తున్న సీఎంరేవంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట: ‘పాలమూరు జిల్లాకు వేలకోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత ‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు. -
మరింత చేరువగా దూరవిద్య
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్లు పెంచడంతోపాటు చదువు మధ్యలో మానేసి చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగా ఓపెన్ స్కూల్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున అడ్మిషన్లు ఇస్తుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 4,600 అడ్మిషన్లు ఇవ్వగా.. ఈసారి ఏకంగా 8,641 అడ్మిషన్లు ఇవ్వడం గమనార్హం. పాఠశాలకు వెళ్లలేని వారు.. చాలామంది ఆర్థిక కారణాలు, ఇతర సమస్యల వల్ల మధ్యలో చదువు మానివేసి ఉంటారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ పూర్తిచేయడంతో పాటు ఇంటర్లో బైపీసీ ఇతర ఆర్ట్స్ కోర్సులు కూడా చదువుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. వారం మొత్తం పనులు చేసుకుని వారంలో చివరి రోజు అయిన ఆదివారం మాత్రం తమకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో తరగతులు వినేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం సిలబస్లో 30 తరగతులు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ఫీజులు చెల్లించిన వాటితోనే స్టడీ పుస్తకాలు కూడా అధికారులు అందజేస్తున్నారు. రెగ్యులర్ వారితో సమానంగా.. ఓపెన్ స్కూల్ ద్వారా చదివితే రెగ్యులర్ సర్టిఫికెట్కు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న సర్టిఫికెట్ను అదే స్థాయిలో గుర్తిస్తారు. ఓపెన్లో ఎస్సెస్సీ పూర్తి చేసి ఇంటర్ రెగ్యులర్గా చదువుకోవచ్చు. ఇక ఓపెన్లో ఇంటర్ చదివితే ఐఐటీ, నీట్తోపాటు ఇంటర్స్థాయిలో ఉండే అన్ని ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వీరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ అడ్మిషన్లు కావడానికి ప్రధాన కారణం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువులు మధ్యలో మానివేసిన వారితో అధికారులు ఎక్కువగా అడ్మిషన్లు చేయించారు. వీటితో పాటు వివిధ సమీకృత కంపెనీలు, సంస్థల్లో కూడా మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి అడ్మిషన్లు చేయించారు. ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓపెన్ స్కూల్ సేవలు గతం కంటే ఎక్కువ అడ్మిషన్లు కల్పించిన అధికారులు చదువు మధ్యలో మానేసిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులకు సదావకాశం పనిచేసుకుంటూనే చదువు కొనసాగించే వెసులుబాటు 2,823 అడ్మిషన్లతో మహబూబ్నగర్ రాష్ట్రంలోనే అగ్రస్థానం -
రెండోరోజు భారీగా నామినేషన్లు
● సర్పంచ్కు 340.. వార్డులకు 1,007 దాఖలు ● నేటితో ముగియనున్న రెండో విడత జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించి రెండో రోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 గ్రామపంచాయతీలు, 1,334 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్లకు రెండోరోజు 340, వార్డులకు 1,007 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్కు 476, వార్డులకు 1,165 నామినేషన్లు వచ్చాయి. కాగా.. మూడో విడతకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. -
తెలంగాణకు బీఆర్ఎస్సే అసలైన విలన్
జడ్చర్ల: తెలంగాణకు అసలైన విలన్ బీఆర్ఎస్ పార్టీ అని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలనా.. అంటూ ప్రశ్నించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారో ప్రజలు చూశారని, చివరికి బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ధర్నా చౌక్ను ఎత్తి వేయడం, కేబినెట్లో ఐదేళ్లపాటు మహిళలకు స్థానం లేకపోవడం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు బీఆర్ఎస్కు దక్కకపోగా ఏడు స్థానాల్లో డిపాజిట్లూ కోల్పోయారని విమర్శించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఫలితాలే మున్ముందు వస్తాయని, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అనూహ్యంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్, నాయకులు మినాజ్, ఖాజ, సర్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ మల్లురవి ధ్వజం -
కాకర్జాల్ కా ‘రాజా’
నవాబుపేట: కాకర్జాల్ రాజు అంటేనే ఏకగ్రీవాలకు స్పెషల్. అలాంటి నేత తాజాగా 44 ఏళ్ల అనంతరం సర్పంచ్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని కాకర్జాల్ గ్రామంలో 1154 మంది జనాభా ఉండగా, 459 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈ గ్రామం వరుసగా ఏకగ్రీవాల్లో రెండోసారి నమోదైంది. గతంలో 2019 సంవత్సరంలో ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా మంగమ్మ అనే మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా జనరల్కు కేటాయించటంతో ఇక్కడ మాజీ సర్పంచ్ను తాజాగా ఏకగ్రీవం చేశారు. తాజాగా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న వ్యక్తికి 44 సంవత్సరాల అనంతరం రెండోసారి సర్పంచ్ పదవి దక్కింది. ఆయన గతంలో 1981లో కాకర్జాల్ ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అనంతరం 1995, 2001లో గ్రామ ఉపసర్పంచ్గా రెండుసార్లు ఏకగ్రీంగా ఎన్నికయ్యాడు. తాజాగా మరోసారి సర్పంచ్గా ఏకగ్రీవం కావటం ప్రత్యేకం. 35 ఏళ్లుగా ఉపసర్పంచ్ అమరచింత: అమరచింత మండలంలోని ఈర్లదిన్నె గ్రామ ఉప సర్పంచ్గా గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డి 35 సంవత్సరాలుగా ఉప సర్పంచ్గా పదవీ బాధ్యతలు నిర్వహించడం విశేషం. సర్పంచ్గా చుక్క వంశానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 35 ఏళ్లు పరిపాలనలో ఉండగా, అదే తరహాలో మోరెడ్డి వంశానికి చెందిన ఊసిరెడ్డి సైతం 35 ఏళ్లుగా ఉప సర్పంచ్గా కొనసాగారు. దీంతో 35 ఏళ్లుగా గ్రామంలోని చుక్క, మోరెడ్డి వంశీయులే గ్రామ పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో వయోభారంతో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 44 ఏళ్ల తరువాత మరోసారి సర్పంచ్ -
21 వేల బస్తాల ధాన్యం రాక
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వరి, మొక్కజొన్న కలిసి దాదాపు 21 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో 15,973 బస్తాల వరిధాన్యం రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.2,874, కనిష్టంగా రూ.1,879 ధర వచ్చింది. అలాగే 5,983 బస్తాల మొక్కజొన్న రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,894, కనిష్టంగా రూ.1,550 చొప్పున పలికింది. కాగా.. వరిధ్యానం వారం వారం పెరుగుతూ వస్తుందని, వచ్చేవారం మరింత పెద్ద మొత్తంలో వస్తుందన్న అంచనా మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ లింగం, కార్యదర్శి రమేష్ తెలిపారు. -
‘సంకల్పం గట్టిదైతే విజయం తథ్యం’
జడ్చర్ల టౌన్: సంకల్పం గట్టిదైతే అన్ని సమకూరుతాయని దివంగత అందెశ్రీ నిరూపించారని ప్రముఖ సాహితివేత్త, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో ప్రజాసంఘాలు, టీఎస్యూటీఎఫ్, ఉదయమిత్ర సంయుక్త ఆధ్వర్యంలో అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధారెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ జీవితం, ఆయన పాడిన పాటలు అనేక అనుభవాలను నేర్పుతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలా చేశాయన్నారు. అన్ని సవ్యంగా ఉంటే సాధించటానికి ఏముండదని, విద్యార్థులు సైతం సంకల్పం పెట్టుకుని దానిని సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాహిత్యం చదవాలని, తద్వారా మనుషుల మనస్థత్వాలు తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరిచెట్లు పాడయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్కళ్యాణ్కు దిష్టిలోపం ఏర్పడిందని, తెలంగాణ ప్రజలు ఒకరిని అక్కున చేర్చుకుని ఆదరించే వారే తప్ప, ఇతరులకు దిష్టి తగలాలని కోరుకోరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందెశ్రీ ఉన్నతమైన వ్యక్తి అందెశ్రీ గొప్ప విలువలు ఉన్న వ్యక్తి అని, ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలని ప్రజాకవి ఉదయమిత్ర, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నర్సింములు అన్నారు. అంతకముందు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కృష్ణ, మల్లస్వామి, సైకాలజిస్ట్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాప’ం.. ప్రాణం తీసింది
● ముళ్ల పొదల్లో విసిరేసిన తల్లి ● చికిత్స పొందుతూ చిన్నారి మృతి నారాయణపేట రూరల్: మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. పొత్తిళ్ల నుంచి కళ్లు తెరవని మూడు రోజుల పసికందును ముళ్ల పొదల్లో విసిరేసి కర్కశంగా మారింది. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ధన్వాడకు చెందిన బాల నరసింహులు అప్పక్పల్లి గ్రామానికి చెందిన భారతి భార్యాభర్తలు. భారతి ప్రసవానికి నవంబర్ 24న జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 26న డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో కలిసి ఇంటికి వెళ్లిన భారతి ఆదివారం తెల్లవారుజామున తన తల్లి తాయిలమ్మతో కలిసి గ్రామ శివారులో కాటన్ మిల్లు వద్ద చిన్నారిని ముళ్ల పొదల్లో విసిరేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు చిన్నారి ఏడుపు వినిపించి దగ్గరకు వెళ్లి చూసి 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న టెక్నీషియన్ శిరీష, పైలెట్ రాములు పాపకు ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహేందర్ ఉదయం పరిశీలించి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. అయితే సాయంత్రం పరిస్థితి విషమించి పాప మృతి చెందింది. విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పాప తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కాటేస్తున్న ఎయిడ్స్ భూతం
● ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు ● వ్యాధి నియంత్రణపై దృష్టిసారించని వైద్యారోగ్యశాఖ ● ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్ కేసులు ● నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం ‘యువ’ క్లినిక్లు ఏవి? హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు గాను ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో 19 ‘యువ క్లినిక్శ్రీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఉండే వైద్యులు యువతకు లైంగికపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖవ్యాధుల తీరు, అప్రమత్తతపై అవగహన కల్పించాల్సి ఉంటుంది. అయితే వీటిని అలా ఏర్పాటుచేసి.. ఇలా మూసేశారు. యువతను జాగృతంచేసి వారి ఆరోగ్యాన్ని పదిలపరిచే ప్రక్రియకు మంగళం పాడారు. అవగాహన కార్యక్రమాలు శూన్యం.. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం ప్రపంచ ఎయిడ్స్ దినాన మొక్కుబడి కార్యక్రమాలతో మమ అనిపిస్తున్నారు. దీంతో గ్రామీణా ప్రాంతాల్లో చాలా మంది చికిత్స చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. మరికొందరు ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఉద్దేశంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో చైతన్యం తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. నానాటికీ ఎయిడ్స్ (హెచ్ఐవీ) భూతం పంజా విసురుతోంది. క్షణకాలం సౌక్యం.. కోరి కష్టాలను తెస్తోంది. అవగాహనలేమి భవితను ఆగం చేస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వందల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం.. అక్కడ ఇతర ప్రాంతాలకు చెందిన వారితో కలవడం.. జిల్లా పొడవునా జాతీయ రహదారులు ఉండటం హెచ్ఐవీ–ఎయిడ్స్ బాధితుల పెరుగుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. కొందరు తెలిసీ తెలియక చేసిన తప్పుతో అందమైన జీవితంతో పాటు భార్యాపిల్లల జీవితాలను సైతం అంధకారంలోకి నెడుతున్నారు. నేడు (సోమవారం) అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..! – మహబూబ్నగర్ క్రైం జిల్లా రిజిస్ట్రేషన్ చికిత్స మరణాలు చేసుకున్నవారు పొందుతున్నవారు మహబూబ్నగర్ 8,016 3,125 2,414 నాగర్కర్నూల్ 5,379 2,340 1,446 నారాయణపేట 4,557 1,822 1,418 జోగుళాంబ గద్వాల 2,720 1,320 746 వనపర్తి 3,767 1,751 1,141 ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోనే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత నారాయణపేట నియోజకవర్గంలో ఓ మోస్తరుగా ఉండగా.. గద్వాల నియోజకవర్గంలో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాలను అనుసరించి జాతీయ రహదారులు ఉండటం.. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం.. నిరక్షరాస్యత వంటి కారణాలతో వ్యాధిబారిన పడుతున్నారు. ఆ తర్వాత తమ సతీమణులకు సైతం అంటిస్తున్నారు. మరోవైపు జిల్లా పొడవునా దాదాపు 185 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారికి సమీప గ్రామాల్లో సైతం ఈ వ్యాధి బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. -
విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దేవరకద్ర గురుకుల మైనారిటీ జూనియర్ కళాశాల (బాలుర–1)లో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న నవీన్కుమార్ (16) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని తల్లిదండ్రులు ఆది లావణ్య, విష్ణువర్ధన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నవంబర్ 9న నవీన్కుమార్ ఐదుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. వెతకగా చివరకు తమ కుమారుడి మృతదేహం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల శివారులోని కాల్వలో కనిపించిందన్నారు. అతనికి ఈత వచ్చని, మిగతా నలుగురు స్నేహితులపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. నవీన్కుమార్ తండ్రికి కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నల్లవెల్లి కురుమూర్తి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ డిమాండ్ చేశారు. -
తెలంగాణ జట్టు మేనేజర్గా రవికుమార్
మహబూబ్నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం బాగల్పూర్లో వచ్చేనెల 13 నుంచి 16 వరకు జరిగే 37వ సబ్ జూనియర్ (అండర్–13) నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టుకు మేనేజర్గా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రవికుమార్ తెలంగాణ జట్టుకు మేనేజర్గా ఎంపిక చేసిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి
మిడ్జిల్: ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మిడ్జిల్కు చెందిన శ్రీశాంత్ (17) ట్రాక్టర్ నడుపుకుంటూ ఇంటికి వస్తుండగా కొత్తూర్ రోడ్డు సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యువకుడికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుని తండ్రి శ్రీనువాసులు ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. రైలుకింద పడి యువకుడి దుర్మరణం జడ్చర్ల: జడ్చర్ల రైల్వేస్టేషన్ పరిధిలో ఆలూరు రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి(28) ఆదివారం రైలు కిందపడి దుర్మరణం చెందాడు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెంది ఉంటాడని రైల్వేపోలీసులు భావిస్తున్నారు. చొక్కా కాలర్పై మార్స్ టైలర్స్, కుడిచేతిపై ఓం, మెడపై త్రిశూలం పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నలుపు రంగు షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించినవారు 8712658597 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. నీటిగుంతలో పడి వ్యక్తి మృతి జడ్చర్ల: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం.. పెద్దపల్లికి చెందిన కాగుల కేశవులుకు ఆదే గ్రామానికి చెందిన యశోదతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి బాబు(14) ఉన్నాడు. కేశవులు తాగుడుకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె 8 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. ఆదివారం పెద్దపల్లిలో ఒంటరిగా ఉంటున్న కేశవులు(40) తన ఇంటి ముందున్న నీటి గుంతలో పడి మృతి చెందాడు. తన భర్త తాగిన మైకంలో నీటి గుంతలో పడి మృతి చెందాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం కందనూలు: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నాగర్కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త బంగారయ్య సర్పంచ్ టికెట్ తనకు కాకుండా గ్రామంలోని మరో వ్యక్తికి కేటాయిస్తున్నారని, మనస్థాపానికి గురై క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్న వ్యక్తిని కాదని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కార్యకర్తలు గమనించి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. రెండు ఇళ్లలో చోరీ ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు విరుగొట్టి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీష్రెడ్డి ఇంటి తాళం విరుగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో రూ.5వేల నగదుతో పాటు రెండు తులాల వెండి వస్తువులు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న సుధాకర్రెడ్డి ఇంటి తాళాలు విరుగొట్టి ఇంట్లో ఉన్న రూ.11 వేల నగదు, 15 తులాల వెండి వస్తువులు దోచుకెళ్లారు. బాధితులు పని నిమిత్తం ఇండ్లకు తాళాలు వేసి హైదరాబాద్కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. పరిసర ప్రాంతంలో ఉన్న ఇళ్ల వారు ఉదయం ఇది గమనించి వారికి సమాచారం అందించారు. చోరీలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. మొర్రం ట్రాక్టర్లు సీజ్ హన్వాడ: మండల కేంద్రంలో శివారు నుంచి అక్రమంగా మొర్రం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కలెక్టర్ విజయేందిర సీజ్ చేయించారు. ఆదివారం నామినేషన్ కేంద్రాల పరిశీలన నిమిత్తం వెళ్తున్న కలెక్టర్ మొరం ట్రాక్టర్లను చూసి ఆరా తీశారు. అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం గుర్తించిన కలెక్టర్ ఆ ట్రాక్టర్లను సీజ్ చేశారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్కి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన
● కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ● 800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు నారాయణపేట/ మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రూ.558 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల– కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.210 కోట్లతో మక్తల్– నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. అలాగే మక్తల్– పేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సీఎం చేతులమీదుగా అందించనున్నారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు మొత్తం 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
వారిదే పైచేయి..
ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్విల్తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 54 1,634 49.02 నాగర్కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 -
నేటినుంచి నూతన మద్యం పాలసీ
● ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు ● గుడ్విల్ ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారులు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 27న ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్దారులను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు. ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు బెల్ట్ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్ దుకాణాలతోపాటు పట్టణాల్లో సైతం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి. -
ప్రజావాణి రద్దు : కలెక్టర్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఫిర్యాదులు అందించేందుకు రావొద్దని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర అన్నారు. నోడల్ అధికారులు, ఏఈఓలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, స్టేజ్–1 ఆర్ఓలు, ఏఆర్ఓలు, స్టేజ్–2 ఆర్ఓలు, పీఓలు, ఓపీఓ, లైజన్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలరించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు స్టేషన్ మహబూబ్నగర్: గీతా జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మహిళ సాహిత్య, సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తిపీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని శిశు వికాస్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్లో దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి భగవద్గీత విశిష్టత గురించి వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుందన్నారు. మరో ముఖ్య అతిథి రావూరి సూర్యనారాయణ మాట్లాడుతూ భగవద్గీతను పఠించడం ద్వారా విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మల్లేష్ మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందిన మానసిక వికాసం పెరుగుతుందన్నారు. అనంతరం జూనియర్, సీనియర్ విభాగాల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, మెమోంటోలు, పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి భగవద్గీత పుస్తకం, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా గడ్డం వనజ, పులి జమున, శ్రీలత, డాక్టర్ కె.బాలస్వామి, ప్రాణేష్ వ్యవహరించారు. పాఠశాల యాజమాన్యం సుబ్బయ్య, శ్రీదేవి, శ్రీవాణి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రం పరిశీలన దేవరకద్ర: మండలంలోని గూరకొండ క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవి పరిశీలించారు. రెండో విడతలో భాగంగా ఆదివారం నామినేషన్ల స్వీకారం ప్రారంభం కాగా.. పోలీసు బందోబస్తును పరిశీలించి ఎస్ఐతో మాట్లాడారు. నామినేషన్ కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కేంద్రంలోకి అభ్యర్థితోపాటు బలపరిచిన వారు మాత్రమే రానివ్వాలని, కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక, ఎస్ఐ నాగన్న తదితరులున్నారు. -
ఏకగ్రీవమే..!
మహబూబ్నగర్ఆ జీపీలుకాటేస్తున్న ఎయిడ్స్ భూతం ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. -
మొదలైన రెండో విడత
● 6 మండలాల్లో 151 పంచాయతీలు, 1,334 వార్డులకు ఎన్నికలు ● తొలిరోజే సర్పంచ్కి 136.. వార్డులకు 158 నామినేషన్లు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 గ్రామ పంచాయతీలు, 1,334 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలిరోజే సర్పంచులకు 136, వార్డు స్థానాలకు 158 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 2న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండగా.. 3న స్క్రూట్నీ ఉంటుంది. 4న సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు అప్పీలుకు వెళ్లవచ్చు. 6న మధ్యహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తర్వాత అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. 14న పోలింగ్ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
పకడ్బందీగా నామినేషన్ దాఖలు ప్రక్రియ
మహమ్మదాబాద్/ గండేడ్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన సర్పంచ్, వార్డుసభ్యుల పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆదివారం ఆమె గండేడ్ క్లస్టర్లోని గండేడ్, జంగంరెడ్డిపల్లి, అంచన్పల్లి గ్రామ పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాలను సందర్శించి.. సర్పంచ్, వార్డు సభ్యుల స్క్రూట్నీని పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో మాట్లాడి ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. మహమ్మదాబాద్ రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కంచన్పల్లి, మహమ్మదాబాద్ జీపీలకు సంబంధించిన నామినేషన్ల స్క్రూట్నీని పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గండేడ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాల పత్రాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పడంతో ఆమె వారిపై అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పారు. ప్యాడీ క్లీనర్లను ఉపయోగించి ధాన్యం క్లీన్గా చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓలు నరేందర్రెడ్డి, మంజుల, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి తదితరులున్నారు. -
ప్రారంభమైన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వనపర్తిటౌన్: మేధోపరమైన సాంస్కృతిక క్రీడ చెస్ అని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, ఎంఈఓ మద్దిలేటి, పరీక్షల నిర్వాహణ అధికారి గణేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల రాష్ట్రస్థాయి చెస్ పోటీలను వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలిరోజు మహబూబ్నగర్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ క్రీడాకారులకు రెండు విడతల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రాచుర్యం ఉన్న ఎన్నో ఆటలు శరీర దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడితే.. చెస్ మేధస్సును పెంచేందుకు సహకరిస్తుందన్నారు. చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధానకార్యదర్శి బస్వప్రభు, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి టీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. చదరంగంతో మెదడుకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు ఐక్యూ, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం చెస్ క్రీడాకారుల్లో పెరగడంతో పాటు సృజనాత్మకంగా ఆలోచించడం, గెలుపోటములను సమానంగా స్వీకరించే ధోరణి అలవడుతుందన్నారు. వనపర్తిని చెస్కు కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతున్నామని, రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు వచ్చే నెల అస్సాంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. చెస్ పోటీలు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్బీ టేటర్ చంద్రమౌళి పర్యవేక్షణలో జరిగాయి. కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్, అయోధ్య రాములు, ఫణిభూషణ్, సత్యనారాయణ, పానుగంటి మోహన్బాబు (యేబు) తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నరదిష్టి అంటే సహించం
జడ్చర్ల: తెలంగాణ నరదిష్టి పెట్టడంతోనే కోనసీమలో కొబ్బరిచెట్లు మాడిపోయావన్న సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నరదిష్టితో గోదావరి ప్రాంతం నాశనమయ్యిందని పవన్ ఆరోపణలు చేయడం తగదన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే వారంతా ఏపీకి చెందిన వారేనని, తాము ఆంధ్రప్రదేశ్కు చెందిన వారితో స్నేహపూర్వకంగా ఉన్నాం కాబట్టే తెలంగాణలో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారని అన్నారు. నీటి పారుదల, నిర్మాణ తదితర రంగాలలో ఏపీ వారే ఉన్నారని, తాము నరదిష్టి పెడితే ఇక్కడ మీరంతా ఎలా బాగుపడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుగోలు చేస్తున్నావంటూ మండిపడ్డారు. పవన్ కూడా హైదరాబాద్లో ఆస్తులు కొని అప్పులు తీర్చుకున్నాడట కదా.. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటున్న పవన్కు ఇక్కడేం పని అంటూ నిలదీశారు. ఏపీపై నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడి ఆస్తులు అమ్మేసుకుని విజయవాడలో ఉండి ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. ఇటీవల పవన్ నటించిన ఓ ప్లాప్ అయిన సినిమాను కూడా తాము రూ.800 పెంచి నిర్మాత బాగు కోరి సినిమా చూశామని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలువలేక పోయాడని, 2024 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఉంటే సత్తా తెలిసి ఉండేదని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని గట్టెక్కావన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే నీకు స్థానం ఉందని లేకుంటే ఎక్కడ ఉండేవాడివన్నారు. సామాన్యుడైన తానే మరో పదేళ్ల తర్వాత సీఎం కావాలన్న కోరిక ఉందని, అలాంటిది 15 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయస్సులో పవన్ సీఎం అయ్యి చేసేదేముంటుందని ఎద్దేవా చేశారు. మీ కుటుంబంలో రామ్చరణ్, అల్లు అర్జున్ తెలంగాణ అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారని అలాంటిది తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడితే సహించబోమన్నారు. సినిమా టికెట్ ధరలు పెంచాలంటే అందులో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికులకు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకోవడం హ్యాట్సాప్ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే.. జడ్చర్ల: చట్టం అందరికీ సమానమేనని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జడ్చర్ల పోలీస్స్టేషన్లో భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన ఘటనపై స్పందించారు. పోలీసులపై దాడి చేసే ధైర్యం తెలంగాణలో ఎవరికీ లేదన్నారు. అలా దాడి చేసినట్లు రుజువులు ఉంటే పోలీసులు వెంటనే కేసులు నమోదు చేస్తారన్నారు. తమ పార్టీ కార్యకర్తలు పోలీస్స్టేషన్లో సెటిల్మెంట్లు చేసే పరిస్థితి లేదన్నారు. అలా చేస్తే సీసీ పుటేజీల ఆధారంగా చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు సూచించారు. జడ్చర్ల పీఎస్లో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసకోవాలని ఇప్పటికే ఎస్పీ, డీఐజీని కోరినట్లు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ధ్వజం ఒంటరిగా ఓడి.. పొత్తుతో గెలిచావ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే నీకు స్థానం తెలంగాణ నరదిష్టి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి -
గుర్తుంచుకోవడం కష్టమే!
సర్పంచ్ బ్యాలెట్ గుర్తులు అచ్చంపేట/జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయిస్తున్న గుర్తులు ఒకే పోలికతో ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు ఆ గుర్తులను గుర్తించుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండాలు, చిన్న గ్రామ పంచాయతీల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఓటర్లు ఉంటారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ముద్రిస్తారు. అసలే పరిమితి ఓట్లు కావడంతో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలో ఓట్లు తారుమారైతే.. అభ్యర్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది. పోలికలున్న గుర్తులెన్నో.. గ్రామీణులకు సులువుగా అర్థమయ్యే గుర్తులేన్నో ఉంటాయి. క్లిష్టమైనవి కేటాయిస్తున్నారని పోటీ చేసే అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఒకే పోలికతో పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటిస్థానంలో ఉంగరం, రెండోస్థానంలో కత్తెర ఉన్నాయి. అవీ చూడగానే సులువుగా అర్థమవుతోంది. మూడో స్థానం బ్యాట్, ఆరో స్థానంలో టీవీ రిమోట్, ఏడో స్థానంలో టూత్ పేస్ట్, ఎనిమిదో స్థానంలో సాసర్ ఉన్నాయి. ఆ గుర్తు కేటాయించిన వారికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ఇందులో పలక, బ్లాక్బోర్డు, బిస్కెట్, మంచం వంటి గుర్తులు ఒకేలా ఉండడంతో ఓటరు ఇబ్బందులు పడే అవకాశముంది. దువ్వెన, ఆరటిపండు గుర్తులు కూడా ఒకేలా ఉన్నాయి. గ్యాస్స్టౌ, సిలిండరు వేరువేరుగా ఇవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి గుర్తులతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుర్తులు కొన్నింటిని ఎవరూ గుర్తుపట్టలేకపోతారని పేర్కొంటున్నారు. పోర్క్, చెంచా ఒకేలా ఉండటం, నెక్టై వంటి వస్తువులు కొత్తగా కనిపించడంతో గుర్తపట్టడం ఇబ్బందిగా మారిందనే ప్రచారం సాగుతోంది. పరిమితి ఓట్లతో సాగే పంచాయతీ ఎన్నికల్లో గుర్తలు ఓటర్లు గుర్తించుకునేలా చెప్పడం అభ్యర్థులకు కష్టంగా మారిందనే చర్చ సాగుతోంది. ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్పేస్ట్, బ్యాట్, బ్యాట్స్మెన్, స్టంప్స్, పాన, చెత్తడబ్బా, బ్లాక్బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, డైమండ్, బకెట్, డోర్ హ్యాండిల్, చాయ్ జాలీ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ వంటి గుర్తులు ఉంటాయి. గుబులు పుట్టిస్తున్న గుర్తులు గ్రామీణులకు అంతుపట్టని సింబల్స్ ఒకేమాదిరిగా ఉండటంతో అయోమయం టీవీ రిమోట్.. టూత్పేస్ట్.. సాసర్ ఒకే పోలిక సర్పంచ్, వార్డు సభ్యులకు పెద్దచిక్కు బ్యాలెట్ పత్రాలపై పేర్లు, ఫొటోలు ముద్రించడం లేదు అవగాహన ఉంటేనే అభ్యర్థులకు మేలు -
ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
● నవ వధువు అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం ● వధువు తల్లి పరిస్థితి విషమం ఎర్రవల్లి: అత్తారింటికి పోతున్న ఓ నవ వధువు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఆరుగురు గాయపడగా వధువు తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఉండవెల్లి మండలం ప్రాగటూరుకు చెందిన మహేశ్వరికి పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన చాకలి నరేష్తో ఈ నెల 26న వివాహం జరిగింది. వివాహం అనంతరం నవ దంపతులు ఇద్దరు అత్తారింట్లో పందిరి దించేందుకు వధువు తల్లి పద్మ, కుటుంబ సభ్యులు అనంతమ్మ, సౌభాగ్య, నర్సింహ, చిన్నారి నిహారికతో కలిసి శనివారం షేరుపల్లికి చెందిన ఆటోలో డ్రైవర్తో పాటు మొత్తం ఏడుగురు వెళ్తుండగా జాతీయ రహదారిపై కొట్టం కాలేజీ సమీపంలో టైరు పేలి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధువు మహేశ్వరి, తల్లి పద్మ, చిన్నారి నిహారికలకు తీవ్రగాయాలు కాగా వరుడు నరేష్తో పాటు మరో ముగ్గురు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానిక ఎస్ఐ రవినాయక్ను వివరాణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. మైనర్ బాలికలకు మాయమాటలు మహబూబ్నగర్ క్రైం: మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన 9మంది యువకులను షీటీం పోలీసులు గుర్తించి ఉమెన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారందరికి శనివారం ఉమెన్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు షీటీం బృందం గత వారం రోజులుగా నగరంలోని పార్క్లు, కళాశాలలు, పాఠశాలల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో 9మంది పట్టుబడగా వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్ బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్ ప్రమాదంలో వేసుకున్నట్లే అవుతుందని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళ భద్రతను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అతిపెద్ద శివలింగం
33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువున్న అతిపెద్ద ఏకశిల శివలింగం 96 చక్రాలున్న భారీ వాహనంపై తరలిస్తుండగా.. శనివారం ఎర్రవల్లి కూడలి వద్ద 44వ జాతీయ రహదారిపై కనిపించింది. ఈ నెల 21న తమిళనాడులోని మహాబలిపురం నుంచి బయలుదేరిందని.. బిహార్లోని తూర్పు చంపారన్లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ ఆలయానికి తరలిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. వందల మంది శిల్పులు పదేళ్లపాటు శ్రమించి తయారు చేసినట్లు వివరించారు. సుమారు 2,300 కిలోమీటర్ల దూరం భారీ వాహనంపై తరలిస్తుండగా.. హిందూ బంధువులు శివలింగాన్ని దర్శించుకొని పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకోవడం కనిపించింది. – ఎర్రవల్లి -
నామినేషన్ వేయకుండా అడ్డగింత?
కేటీదొడ్డి: తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మండలంలోని చింతలకుంట సర్పంచ్ స్థానానికి జంగం భద్రి నామినేషన్ వేయడానికి శనివారం క్లస్టర్ గ్రామమైన ఎర్సందొడ్డికి వెళ్తుండగా.. గ్రామానికి చెందిన కొందరు అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్లారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సర్పంచ్ అభ్యర్థి, ప్రతిపాదకుడిపై దాడికి పాల్పడ్డారంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా చింతలకుంట సర్పంచ్ స్థానాన్ని గ్రామపెద్దలు ఏకగ్రీవం చేస్తూ తీర్మానం చేశారని.. గ్రామాభివృద్ధికి రూ.38.50 లక్షలు ప్రకటించడంతో ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎస్ఐ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. ఎలాంటి గొడవ జరగలేదని, అక్కడే ఉన్నామని, ఎవరైనా నామినేషన్ వేయవచ్చని గ్రామస్తులకు తెలియజేశామని చెప్పారు. సర్పంచ్ కోసం అంగన్వాడీ టీచర్ రాజీనామా గోపాల్పేట: సర్పంచ్గా పోటీలో నిలిచేందుకు అంగన్వాడీ టీచర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన సింగాయిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. ఏదుల మండలంలోని సింగాయిపల్లికి చెందిన బత్తుల హరిత 28 ఏళ్లుగా మొదటి అంగన్వాడీ సెంటర్ టీచర్గా పనిచేస్తోంది. సర్పంచ్ స్థానం జనరల్ ఉమెన్కు రిజర్వ్ కావడంతో మొదట పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సర్పంచ్కు పోటీలో ఉండాలన్న ఉద్దేశంతో బత్తుల హరిత శనివారం కొల్లాపూర్లోని ఐసీడీఎస్ ఆఫ్స్కు వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం సింగాయిపల్లి గ్రామానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. పోలీసుల ముమ్మర తనిఖీలు వనపర్తి: జిల్లా సరిహద్దు ప్రతి చెక్పోస్ట్లో ప్రత్యేక బృందాలతో అక్రమ రవాణా, డబ్బు పంపకాలు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని వనపర్తి ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీ నిర్వహించామని.. అనుమానాస్పదంగా తీసుకెళ్తున్న రూ.11.50 లక్షలు పట్టుబడగా సీజ్ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో ప్రభావితం చేసే ఏ ప్రయత్నాన్ని సహించమన్నారు. ఎన్నికల సమయంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లరాదని.. ఎక్కువ నగదు ఉంటే స్పష్టమైన ఆధారాలు చూపించాలని, లేదంటే తక్షణమే స్వాధీనం చేసుకొని ఎన్నికల నియమావళి ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ, రవాణా, ప్రలోబాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్ననారు. ఎన్నికలు శాంతియుత, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. రూ.11.50 లక్షలు స్వాధీనం -
రిజర్వేషన్లలో తారుమారు
మానవపాడు: మూడో విడతలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మండలంలోని చెన్నిపాడుకు, గోకులపాడుకు సంబంధించి ఈ నెల 23న గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ విడుదల జేసిన జాబితాలో చెన్నిపాడుకు జనరల్ కేటాయించగా శనివారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబితాలో బీసీ జనరల్గా ఉంది. అదే విధంగా గోకులపాడుకు జనరల్ కేటాయించగా ప్రస్తుతం జనరల్ మహిళ అని అధికారులు నోటీసు బోర్డులో జాబితా ఉంచి అనంతరం తొలగించారు. దీంతో ఆయా గ్రామాల్లోని అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. గతంలో విడుదల చేసిన జాబితాకు ప్రస్తుతం ఉన్న జాబితాలో మార్పులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ రాఘవను సాక్షి వివరణ కోరగా.. చెన్నిపాడు జనరల్, గోకులపాడు జనరల్ మహిళకు రిజర్వుడ్ అయినట్లు పేర్కొన్నారు. ● గతంలో జనరల్.. ప్రస్తుతం జనరల్ మహిళ ● గందరగోళానికి గురవుతున్న అభ్యర్థుల -
గగన్చంద్ర ప్రతిభ గర్వకారణం
బల్మూర్: విద్యార్థి గగన్చంద్ర విద్యుత్ బ్యాటరీ, సోలార్, పెడలింగ్తో నడిచే సైకిల్ను రూపొందించి వివిధ ప్రదర్శనల్లో ఉంచి జాతీయస్థాయిలో యంగ్ సైంటీస్ట్ అవార్డు అందుకొని రాష్ట్రం, జిల్లా, పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత సంతోష్ అభినందించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. అలాగే బల్మూరులో శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గగన్చంద్ర కీర్తిని చాటుతూ అభినందన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత విద్యార్థి బాల్యంలోనే తన విజ్ఞానంతో త్రి ఇన్ వన్ సైకిల్ను రూపొందించారని, త్వరలోనే పేటెంట్ హక్కు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం గగన్చంద్రతో పాటు గైడ్ టీచర్ సీతారాం, తండ్రి భాస్కర్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ ఉమాపతి, అధికారులు పాండు, కృష్ణయ్య, ఎస్ఐ రాజేందర్, ఉపాధ్యాయు లు, గ్రామపెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ ఆరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ ఆరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్లీడర్గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గగన్చంద్ర ప్రతిభ గర్వకారణం జాతీయస్థాయిలో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న గగన్చంద్ర ప్రతిభ గర్వకారణమని కలెక్టర్ సంతోష్ అన్నారు. –8లో uఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టండి
మహబూబ్నగర్ క్రైం: గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రత్యేక బలగాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ డి.జానకి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ చివరి రోజు సందర్భంగా మహబూబ్నగర్ మండల పరిధిలోని గాజులపేట, కోడూర్ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉండే వారు మరింత అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎవరూ గుంపులు, గుంపులుగా ఏర్పడకుండా నిరోధించాలన్నారు. ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడుతూ పోలీసుల నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రశాంత వాతావరణంతో పాటు భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. -
సీపీఆర్పై అవగాహన అవసరం
పాలమూరు: గుండెపోటు లక్షణాలతో మనిషి ఆకస్మాత్తుగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీపీఆర్ చేసే విషయంలో అందరికీ అవగహన ఉండాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నా రు. జిల్లా జనరల్ ఆస్పత్రి సహకారంతో శనివారం జిల్లా కోర్టు ఆవరణలో సీపీఆర్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తులను గమనించిన వెంటనే ప్రాథమిక చికిత్సలో భాగంగా సీపీఆర్ చేయడంతోపాటు గాలివెలుతురు తగిలే ప్రదేశంలో ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా ఆజ్మీరా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో 27ఏళ్ల యువకుల దగ్గరి నుంచి 80ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు వస్తుందని, మారుతున్న జీవణశైలి ఆహార అలవాట్ల వల్ల ఈ సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఉదయం నడకతోపాటు సరైన ఆహారంతోపాటు మద్యం, సిగరేట్, కూల్డ్రింక్స్, ఫాస్ట్ఫుడ్ వంటి ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం ప్రత్యేక వైద్యులు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, వైద్యులు మాధవి, ప్రేరణ, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ● డిసెంబర్ 13న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా డిసెంబర్ 21కి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కక్ష్యిదారులు వారి కేసులు పరిష్కారించుకోవాలని సూచించారు. -
సామగ్రి సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోండి
మహబూబ్నగర్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ మెటీరియల్ అన్ని గ్రామపంచాయతీలకు సక్రమంగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీఓ కరుణశ్రీతో కలిసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఐదు జిల్లాలకు ఇన్చార్జీల నియామకం పాలమూరు: బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కొత్తగా ఇన్చార్జీలను నియమిస్తూ శనివారం జాబితా విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాకు రంజిత్ మోహన్, వనపర్తికి బొక్క బాల్రెడ్డి, నాగర్కర్నూల్కు కేవీఎల్ఎన్ రెడ్డి (రాజు), గద్వాలకు బాపురెడ్డి, నారాయణపేటకు బండ కార్తీకరెడ్డిలను నియమించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలను సైతం ఇతర జిల్లాలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బి.శాంతికుమార్కు కరీంనగర్, పడకుల శ్రీనివాస్కు సంగారెడ్డి, సుధాకర్రావుకు వికారాబాద్కు, కట్టా సుధాకర్రెడ్డికు జనగాం జిల్లాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. 12,651 క్వింటాళ్ల దిగుబడుల రాక జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 12,651 క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 11,451 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,637 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,637, సోనామసూరి రూ.1,901, మొక్కజొన్న 882 క్వింటాళ్ల యార్డుకు రాగా.. గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,669, పత్తి 316 క్వింటాళ్లు రాగ గరిష్టంగా రూ.6561,కనిష్టంగా రూ.5211 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,644, కనిష్టంగా రూ.2109గా, సోనామసూరి ధాన్యం గరిష్టంగా రూ.2,301, కనిష్టంగా రూ.2,089, హంస గరిష్టంగా రూ.1,940, కనిష్టంగా రూ.1,909గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు మక్తల్: పట్టణ కేంద్రంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్థానిక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో సీఎం సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాలను శనివారం వారు పరిశీలించారు. మున్సిపల్, ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్, అత్యవసర సేవలు, ఫైర్ సేఫ్టీ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సభా వేదిక సమీపంలో భారీకేడ్లు ఉంచి, సీఎం మీటింగ్కు అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, కమిషనర్ శ్రీరామ్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ నరదిష్టి అంటే సహించం ● ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ధ్వజం ● ఒంటరిగా ఓడి.. పొత్తుతో గెలిచావ్ ● మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే నీకు స్థానం ● తెలంగాణ నరదిష్టి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి – వివరాలు 8లో.. -
నేటి నుంచి ‘రెండో’ విడత
● 6 మండలాల్లో 151 గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ ● డిసెంబర్ 2 వరకు చివరి గడువు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత నోటిషికేషన్ విడుదల కానుంది. హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలకు సంబంధించి 151 గ్రామ పంచాయతీలకు, 1,334 వార్డులకు ఎన్నికలు జరనున్నాయి. ఆరు మండలాల పరిధిలో 44 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం స్జేజి–1 ఆర్ఓలు 50 మంది, స్జేజి–1ఏఆర్ఓలు 49, స్జేజి–2 ఆర్ఓలు 165 మంది సిబ్బందిని నియమించారు. ఆదివారం నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్లోనీ వీసీ హాల్ నుంచి స్టేజ్–1 రిటర్నింగ్ అధికారుల (ఆర్ఓ)కు వెబెక్స్ శిక్షణ నిర్వహించారు. నామినేషన్ స్వీకరణ సమయంలో ఎన్నికల మార్గదర్శకాలు, పారదర్శకత, నిజాయితీ అత్యంత ప్రాధాన్యత గల అంశాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు, మాస్టర్ ట్రైనర్లు ఆర్ఓలకు నామినేషన్ స్వీకరణ, పరిశీలన, పత్రాల ధ్రువీకరణ వంటి విధానాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డ్రెయినీ డీపీఓ నిఖిలశ్రీ, డీఈఓ ప్రవీణ్కుమార్, మాస్టర్ ట్రైనర్లు బాలు యాదవ్ బైకాని, శ్రీకాంత్, శ్రీనివాస్గౌడ్, సాయిబాబా, పాండు రంగ పాల్గొన్నారు. పీఓ, ఓపీఓలను నియమించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పీఓ, ఓపీఓల నియామక ఉత్తర్వులు అధికారులు వారికి అందజేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పీఓ, ఓపీఓ మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. మొదటి ర్యాండమైజేషన్ ద్వారా పీఓ, ఓపీఓ నియామక ఉత్తర్వులు జెనరేట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం–14 జతచేసి అందజేయాలని, ఫారం–14 పూరించిన వాటిని డీపీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, ట్రైనీ డీపీఓ నిఖిల, ఆర్డీఓ నవీన్ ఉన్నారు. -
కేసీఆర్ తాగ్య ఫలితమే తెలంగాణ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యమ నేత కేసీఆర్ తాగ్య ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దీక్ష దివాస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 టీఆర్ఎస్ పెట్టి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, అప్పటి నుంచి తాను కేసీఆర్ వెంట నడిచారని చెప్పారు. కేసీఆర్ అడిగిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. ఆ పరిస్థితుల్లో ఎంపీగా మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ గెలవడం, తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, కష్టపడే వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. రాష్ట్రం వద్దని అన్న వాళ్లు ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని 15 ఏళ్లు పార్టీ అధికారంలో ఉండడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు నర్సింహులు, వెంకన్న, నరేందర్, శివరాజు, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి రోజు భారీగా నామినేషన్లు
● సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలైన్లో అభ్యర్థులు ● కొన్ని క్లస్టర్లలో అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. చివరిరోజు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ఐదు మండలాల్లో 139 గ్రామపంచాయతీలు, 1,188 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 27న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి రెండు రోజులు నెమ్మదిగా సాగగా.. చివరి రోజు వేల సంఖ్యలో దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ఉండగా.. అంతలోపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి... అర్ధరాత్రి వరకు వారితో నామినేషన్లు స్వీకరించారు. నవాబుపేట మండలంలో రాత్రి 9.40 గంటలకు ప్రకియ ముగియగా... చివరి రోజు సర్పంచ్కు 228, వార్డులకు 804 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలో మొత్తం 42 సర్పంచ్ స్థానాలకు 292, 354 వార్డులకు 865 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్నగర్ రూరల్ మండలంలో అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. 24 గ్రామపంచాయతీలకు 184, 222 వార్డులకు 618 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు చివరి రోజు సర్పంచ్కు 119, వార్డులకు 527 నామినేషన్లు వచ్చాయి. రాజాపూర్, గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో అర్ధరాత్రి దాటినా తర్వాత కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కాగా...నవాబుపేట మండలంలో కాకర్జాల్, దొడ్డిపల్లి, గండేడ్ మండలం అంచన్పల్లి గ్రామపంచాయతీ, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయా జీపీలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే అత్యధికంగా రుద్రారంలో 13, నవాబుపేట, కొండాపూర్, కూచూర్, కాకర్లపహడ్లలో 11 చొప్పున సర్పంచ్స్థానాలకు నామినేషన్లు దాఖలు కావడం విశేషం -
ఈర్లదిన్నె ‘చుక్క’ సొంతం
ఊరంతా పచ్చని చెట్లు ఈర్లదిన్నె గ్రామంలో మొత్తం జనాభా 1,600 ఉండగా 8 వార్డులు, 900 మంది ఓటర్లు ఉన్నారు. జూరాల బ్యాక్ వాటర్ వెనుక ఉండటంతో గ్రామంలో పచ్చదనానికి కొదవలేదు. గ్రామంలోని అన్ని కాలనీలతో పాటు ఇంటింటికి మొక్కలు నాటించడంతో ప్రస్తుతం పచ్చని చెట్లతో గ్రామం ఆహ్లదకరంగా మారింది. వీటికి తోడు ఎప్పడికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చెత్తను మురుగుకాల్వలో వేయకుండా అప్పట్లోనే రిక్షాలను తెప్పించడంతో గ్రామాన్ని బెస్ట్ విలేజ్గా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ గ్రామం ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అమరచింత: పంచాయతీ ఎన్నికలంటే గ్రామంలో పోటీ చేసేందుకు ఎందరో ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడు సర్పంచ్ పదవిని చేపట్టాలని ఆశగా ఎదురు చూస్తంటారు కానీ మండలంలోని ఈర్లదిన్నె గ్రామంలో మాత్రం 35 ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచ్లుగా ఎన్నికల్లో గెలిచి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. సర్పంచ్గా గెలవడమే కాదు గ్రామానికి ఏంచేస్తే బాగుంటుంది. గ్రామ ప్రజలు ఎలా బాగుంటారు అన్న ఆలోచనలతో ముందకు వెళ్తూ గ్రామ పరిపాలనపై తమదైన ముద్ర వేసుకున్నారు చుక్క వంశీయులు. మొదటిసారి.. చుక్క కుటుంబం నుంచి మొదటిసారిగా చుక్క లింగారెడ్డి సర్పంచ్గా ఎన్నిక తరువాత అదే కుటుంబం నుంచి చుక్క ఆశిరెడ్డి, చుక్క లక్ష్మమ్మ సర్పంచ్లుగా గెలుపొంది గ్రామ పరిపాలనలో తమదైన శైలితో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామ ప్రజలను మెప్పించారు. కేవలం పరిపాలనే కాకుండా గ్రామస్తుల్లో ఎవ్వరికి ఎలాంటి ఆపద వచ్చిన తామున్నమంటూ ఆదుకొంటున్న కుటుంబాన్నే గ్రామ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఈ సారి సర్పంచ్ పదవి సైతం అదే కుటుంబానికి వరిస్తున్నా.. చుక్క కుటుంబం మాత్రం ఎంపీపీ పదవిపై మక్కువ చూపున్నట్లు తెలిసింది. గ్రామానికే పరిమితం కాకుండా తమ పరిపాలన మార్క్ను మండలానికి విస్తరించే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈర్లదిన్నె వ్యూ చుక్క లక్ష్మమ్మ, మూడో సర్పంచ్ సర్పంచ్ల పదవీ కాలం చుక్క లింగారెడ్డి ఈర్లదిన్నె సర్పంచ్గా 1989లో ఎన్నికై రెండు పర్యాయాలు అంటే 1999 వరకు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం చుక్క లింగారెడ్డి తమ్ముడు చుక్క ఆశిరెడ్డి 1999లో సర్పంచ్గా గెలిచి రెండు పర్యాయాలు 2009 వరకు కొనసాగారు. అనంతరం చుక్క ఆశిరెడ్డి సతీమణి చుక్క లక్ష్మమ్మ 2009లో సర్పంచ్గా గెలిచి మూడు పర్యాయాలు 2024 వరకు సర్పంచ్గా కొనసాగారు. చుక్కవంశీయుల ఆస్థానంగా.. 35 ఏళ్లుగా ఆ కుటుంబ సభ్యులే సర్పంచ్లు 1989 నుంచి 2024 వరకు బాధ్యతలు గ్రామ పరిపాలనలో మమేకమైన వైనం -
పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం
చారకొండ: ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రద్దు చేసి, గ్రామాన్ని ముంపు నుంచి మినహాయించే వరకు పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని ఎర్రవల్లి అంబేడ్కర్ సర్కిల్లో గ్రామస్తులు, తండావాసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాను ముంపు నుంచి కాపాడాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వద్దు అని ఎన్నో సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఈ నెల 26న ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిని నిరసిస్తూ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్లు సాయి కుమార్, రెడ్యానాయక్తో పాటు పెద్దయ్యగౌడ్, పర్వతాలుగౌడ్, శేఖర్గౌడ్, నేనావత్ నాగయ్య, మునావత్ సంజీవా, గోపినాయక్, వెంకటయ్య, రాంపాల్, ప్రకాష్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక బ్యాలెట్లో నోటా
నోటాతో ఫలితాలు తారుమారు అవగాహన అవసరం పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తును ముద్రించనుండటంతో పల్లెల్లో అఽధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా గుర్తుపై ప్రజలకు వివరించారు. పల్లెలో ఎక్కవగా నిరక్షరాస్యులు ఉన్నందున నోటా గుర్తుపై క్షేత్రస్థాయిలో మరింతగా ప్రచారం చేయాల్సి ఉంది. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు..! పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తారు. లాటరీ ఏ అభ్యర్థికి అనుకూలంగా వస్తుందో ఆ అభ్యర్థికి ఒక అదనపు ఓటు వచ్చినట్లుగా భావించి విజేతగా ప్రకటిస్తారు. సరిసమాన ఓట్లు పొందిన అభ్యర్థుల పేర్లను సమాన రంగు, పరిమాణం కలిగిన ఐదేసి చీటీలపై ఆర్ఓ రాసి వాటిని గుర్తించకుండా కలపాలి. ఆర్ఓ ఒక చిటీని డ్రా తీయగా దాంట్లో ఎవరి పేరైతే వస్తుందో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు. జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/పాలమూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ ఈసారి ఓటర్లకు కల్పించింది. తొలిసారిగా అమలు చేస్తున్న నోటాపై పల్లె ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకం, బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ప్రతీ ఓటు కీలకమే. ఒకటి, రెండు ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు అనేకం. అయితే ఈసారి బ్యాలెట్ పేపర్లో ఎన్నికల కమీషన్ నోటాకు సైతం అవకాశం ఇవ్వడంతో పలువురు అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశ పెడుతున్న నోటా గుర్తు వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయి. నోటా కూడా ఓ అభ్యర్థి గుర్తుగానే భావించే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు తెలియక ఓటు వేస్తే అది నోటా కిందకు వెళ్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో 300 నుంచి 10 వేల వరకు ఓటర్లు గల పంచాయతీలు ఉన్నాయి. వెయ్యి మంది ఓటర్లు గల పంచాయతీలు 60 శాతానికి పైగా ఉన్నాయి. వార్డుల్లో 50 నుంచి 200కు పైగా ఓటర్లు ఉంటారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ఒకటి, రెండంకెల ఓట్ల తేడాతో ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటా గురించి గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించకపోతే గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం ఉంటుందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఈ–పోల్ యాప్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ప్రభుత్వం టీఈ– పోల్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ స్లిప్పులు, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదులను యాప్లో చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల స్టేటస్ తనిఖీ, ఓటర్ స్లిప్, పోలింగ్ స్టేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటిసారిగా స్థానిక ఎన్నికల్లో -
భూమి కబ్జా చేశారని.. పెట్రోల్ సీసాతో కుటుంబసభ్యుల నిరసన
కల్వకుర్తి టౌన్: తన వ్యవసాయ పొలాన్ని కబ్జా చేసేందుకు పక్క పొలం వారు యత్నిస్తుంటే నిలువరించేందుకు కోర్టుకు వెళ్లి అనుకూల తీర్పు వచ్చినా ఇబ్బందులు పెడుతున్నారని ఓ రైతు కుటుంబం కుటుంబంతో కలిసి కొట్ర శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆందోళన చేపట్టిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన బచ్చు సుగుణమ్మ కొట్ర శివారులో 2 ఎకరాల భూమిని యాదమ్మ వద్ద కొనుగోలు చేసింది. పక్క పొలం వారు ధన్రాజ్రెడ్డి, రూపేశ్కుమార్రెడ్డి ఆ పొలం తమది అంటూ వారిస్తుండటంతో కోర్టును ఆశ్రయించగా 2025లో అనుకూల తీర్పు వచ్చింది. కాగా ధన్రాజ్, రూపేశ్ ఆ భూమిని ఇతరులకు విక్రయించగా.. వారు వచ్చి కంచె వేస్తుండటంతో శుక్రవారం కుటుంబసభ్యులంతా అక్కడకు చేరుకొని పెట్రోల్ సీసాతో తమకు న్యాయం చేయాలంటూ మూడు గంటలకుపైగా ఆందోళన చేపట్టారు. భూమిని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఎనుముల రాజవర్ధన్రెడ్డికి విక్రయించారని.. అతడి అండతోనే భూ కబ్జా చేశారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారును ఆశ్రయిస్తే సహకరించడం లేదని తెలిపారు. స్థానిక పోలీసులను రక్షణ కోసం ఆశ్రయిస్తే చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో అధికారులంతా వారికే సహకరిస్తున్నారని.. తమకు అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు. బాదేపల్లి మార్కెట్ కిటకిట జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డు శుక్రవారం ధాన్యంతో కిటకిటలాడింది. మార్కెట్కు 13 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు వచ్చాయి. ఇందులో ఆర్ఎన్ఆర్ ధాన్యం11,580 క్వింటాళ్లు రాగా.. గరిష్టంగా రూ.2,819, కనిష్టంగా రూ.1,646, హంస గరిష్టంగా రూ.1,816, కనిష్టంగా రూ.1646 పలికింది. మొక్కజొన్న 1,163 క్వింటాళ్లు మార్కెట్కు రాగా.. గరిష్టంగా రూ.1,866, కనిష్టంగా రూ.1,652 ధర లభించింది. దేవరకద్ర మార్కెట్కు దాదాపు 3 వేల క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి వచ్చింది. ఇందులో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,636, కనిష్టంగా రూ.2,169, సోనామసూరి గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.2,039, హంస గరిష్టంగా రూ.1,922, కనిష్టంగా రూ.1,769 ధరలు నమోదయ్యాయి. -
ప్రభుత్వ ఆస్పత్రి.. బినామీ వైద్యుడు!
● అర్హత లేని వ్యక్తితో వైద్య సేవలు ● రోగుల ప్రాణాలతో చెలగాటం ● నిర్లక్ష్యంగా వైద్యశాఖ అధికారులు నారాయణపేట రూరల్: వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఓ మహిళ వైద్యురాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికే కళంకం తెస్తుంది. అర్హత లేని వ్యక్తిని ఆస్పత్రిలో ఏర్పాటు చేసి వైద్యం చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఊట్కూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యరాలిగా సంతోషిని ప్రభుత్వం నియమించింది. మొదటి నుంచి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పలు ఆరోపణలు ఎదుర్కుంటూ వస్తోంది ఆ మహిళ వైద్యురాలు. పీజీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నందున ఆస్పత్రిలో అర్హత లేని వ్యక్తితో వైద్య సేవలు చేయిస్తూ ఆస్పత్రిలోనే చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజు అత్యధికంగా ఓపీ ఉండటంతో వారంలో ఒక రోజు పగిడిమరి వైద్యురాలిని రప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు అర్హత లేని ఆ బినామీ వ్యక్తే గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలకు వైద్యం చేస్తున్నాడు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సదరు బినామీ డాక్టర్ అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం కుమారుడు, కర్ణాటకలో బీఏఎంఎస్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా బినామీ వైద్యుల చేతిలో రోగుల ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సొంత ఆస్పత్రికి రెఫర్.. అదే విధంగా జిల్లాలో మరో వైద్యురాలు తమ కుటుంబ సభ్యులకు చెందిన ప్రైవేటు ఆస్పత్రికి రోగులు, గర్భిణులను పంపాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మక్తల్ పట్టణంలోని పల్లె దవాఖానాలో ఇటీవల నియమితులైన వైద్యురాలు శ్రీచందన కుటుంబ సభ్యులకు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఉంది. అయితే వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన చికిత్సలు అవసరమైతే దగ్గరలోని సీహెచ్సీకి పంపాలి. కానీ వారిని కుటుంబ సభ్యుల ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ప్రసవాలకు సైతం ప్రభుత్వ ఆస్పత్రికి కాకుండా సొంతంగా ఉన్న ప్రైవేటు దవాఖానాకు పంపించాలని వైద్య సిబ్బందికి సూచించినట్లు తెలుస్తోంది. వీటిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా ఈ వైద్యురాలి తల్లి గతంలో జిల్లాలో వైద్యశాఖ ఉన్నత అధికారిగా పనిచేయడం కొస మెరుపు. -
వార్డుల రిజర్వేషన్లు తారుమారు
● బీసీలు అధికంగా ఉన్న చోట ఎస్టీకి కేటాయింపు ● ఎస్టీలు ఉన్న చోట అన్రిజర్వుడ్ ● న్యాయం చేయాలంటూ గ్రామస్తుల వినతి గండేడ్: ఆ గ్రామ పంచాయతీలో బీసీ జనాభా సంఖ్యనే ఎక్కువగా ఉంది. అయినా పంచాయతీ ఎన్నికల్లో ఒక్క వార్డుకు కూడా బీసీ రిజర్వేషన్ రాలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని బీసీ అభ్యర్థులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గండేడ్ మండల పరిధిలోని చెన్నాయిపల్లి తండా గ్రామ పంచాయతీ ఉంది. దీని పరిధిలో చెన్నాయిపల్లి, పూలపల్లి కూడా వస్తాయి. తొమ్మిది వందలకు పైగా జనాభా ఉండగా 649 మంది ఓటర్లు ఉన్నారు. ఎనిమిది వార్డులు ఉండగా 1, 2, 3 వార్డులో 220 మంది బీసీ ఓటర్లు, 4వ వార్డులో ఎస్సీలు, 5, 6, 7, 8 వార్డుల్లో ఎస్టీలు అధికంగా ఉన్నారు. అయితే 1, 2, 3, 4 వార్డుల్లో ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వగా 5, 6, 7, 8 వార్డులు జనరల్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ వేయడానికి వెళ్లిన బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ స్థానాలు చూసి ఖంగుతిన్నారు. తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఒక్క వార్డు కూడా బీసీకి కేటాయించకపోవడం ఏంటని, న్యాయం చేయాలంటూ ఎంపీడీఓ మంజులకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయపై ఎంపీడీఓ మంజులను వివరణ కోరగా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు. అన్ రిజర్వుడ్ కోటాలో బీసీలు, ఎస్టీలు కూడా నామినేషన్ వేయవచ్చని పేర్కొన్నారు. -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి
● సాధారణ ఎన్నికల పరిశీలకురాలుకాత్యాయనీదేవి గండేడ్/మహమ్మదాబాద్: జీపీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయ నీదేవి పేర్కొన్నారు. శుక్రవారం గండేడ్, మహమ్మదాబాద్ మండలంల్లో నామినేషన్ క్లస్టర్లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియపై ఆరా తీశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల అన్ని వివరాలతో నామినేషన్లు తీసుకోవాలని, వారికి తగిన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు సిబ్బంది అన్నిరకాలుగా సహకరించాలని సూచించారు. ఓటింగ్ గదులు, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు రకాల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిభందనల మేరకు పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారమే కొనసాగాలన్నారు. ఆమెవెంట ఎంపీడీఓలు మంజుల, రేందర్రెడ్డి తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎస్ఐ శేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
రంగంలోకి నిఘా బృందాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల ప్రచార సరళి, నేతల అనుసరిస్తున్న తీరు గ్రామాల పర్యటన వంటి అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు పట్టించుకోకుండా తీసుకెళుతున్న నగదు, బంగారంతో పాటు మద్యం పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా, గ్రామాల సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మొదట విడత నామినేషన్ల ప్రకియ శనివారంతో ముగుస్తుండడంతో ప్రధాన అభ్యర్థుల ప్రచారాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 32 రంగంలోకి నిఘా బృందాలు (ఎఫ్ఎస్టీ) ఏర్పాటు చేస్తూ తేదీన జిల్లా ఎన్నికల అఽధికారి విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బృందాలు పని చేస్తాయి. ఒక్కొ మండలానికి రెండు టీంలను ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో ఇద్దరు ఉద్యోగులుంటారు. వీరు మోడల్ కోడ్ ఉల్లంఘన చర్యల ఫిర్యాదులను పరిశీలిస్తారు. మద్యం, నగదు ఇతర వస్తువులతో ఓటర్లను ప్రభావితం ఏమైనా చేస్తున్నారో ఆరా తీస్తారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున ఖర్చుల వివరాలు నమోదు చేస్తారు. ర్యాలీలు, బహిరంగసభల్లో వ్యయాలపై వీడియో తీసి నిఘా ఉంచుతారు. ఫిర్యాదు వచ్చిన అరగంటలోపు ఈ బృందాలు చేరుకుంటాయి. 24 గంటలూ పని చేసేలా విడతల వారీగా బృందాలను నియమించారు. ● జిల్లాలో రెండు ఎస్ఎస్టీ (స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీం)లను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు నవాబ్పేట మండలం కొల్లూర్, బాలానగర్ టోల్ప్లాజా వద్ద రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంలో రెండు విభాగాలుగా, ఒక్కొక్క విభాగంలో ముగ్గురు ఉద్యోగుల చొప్పున 12 మంది సిబ్బంది ఉంటారు. రూ.50 వేలకు పైగా నగదు రూ.10 వేలకు పైగా ఎన్నికల సామగ్రి వాహనాల్లో లభ్యం అయితే సీజ్ చేస్తారు. పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లయితే ఆదాయ పన్ను శాఖ ద్వారా జప్తు చేస్తారు. నోడల్ ఆఫీసర్ల నియామకం గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వహణకు అధికార యంత్రాంగానికి కలెక్టర్ విజయేందిర ఒక్కొక్క పని అప్పగించారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలతో కలిపి అఖిల పక్ష సమావేశాలు చేశారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కొ అధికారికి ఒక్కొ పని పర్యవేక్షించే విధంగా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు మొత్తం 32 ఎఫ్ఎస్టీ, రెండు ఎస్ఎస్ బృందాల ఏర్పాటు 12 మంది నోడల్ అధికారులనియామకం -
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పంచాయతీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి అధికారి విధి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారి కొత్త సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏ పార్టీకి, అభ్యర్థికి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలను సందర్శించి, పోలింగ్స్టేషన్లను తనిఖీ చేయాలని, కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సమగ్రమైన శిక్షణ అందించాలని సూచించారు. పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా తనిఖీ చేసి, సిబ్బందికి సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును నిబంధనల ప్రకారం నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను గ్రామపంచాయతీ ప్రత్యేక సమావేశంలో పకడ్బందీగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ట్రెయినీ డీపీఓ నిఖిల, డీఎల్పీఓ రామ్మోహన్, మాస్టర్ ట్రైనర్ బాలుయాదవ్, రతంగపాణిరెడ్డి, పాండురంగ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
172
207సర్పంచ్కువార్డులకు● రెండో రోజు దాఖలైన నామినేషన్లు ● తొలి విడతకు నేటితో ముగియనున్న గడువు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శుక్రవారం రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 40 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 139 సర్పంచ్ స్థానాలకు 172, 1,188 వార్డులకు 207 నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్ల దాఖలకు శనివారమే చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు పడే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రెండో రోజు నామినేషన్లు ఇలా.. మండలం సర్పంచ్ వార్డు స్థానాలు మహబూబ్నగర్ 30 57 నవాబుపేట 43 43 మహమ్మదాబాద్ 24 18 గండేడ్ 57 37 రాజాపూర్ 18 52 -
వేలంతో ‘ఏకగ్రీవ’ తీర్మానాలు
నవాబుపేట/‘సాక్షి’నెట్వర్క్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన హెచ్చరికలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో బేఖాతరు చేస్తున్నారు. గ్రామాభివృద్ధి అంటూ సర్పంచ్, వార్డు స్థానాలను వేలం వేస్తూ స్థానిక పెద్దలే ముందుండి నడిపిస్తున్నారు. ● నవాబుపేట మండలంలోని మండలంలోని దొడ్డిపల్లి జీపీకి సంబంధించి సర్పంచ్, ఉపసర్పంచ్లు ఏకగ్రీవంగా చేసుకునేందుకు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని... ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారితోనే శనివారం నామినేషన్లు వేయించనున్నట్లు సమాచారం. దొడ్డిపల్లిలో 684 మంది ఓటర్లు ఉండగా.. ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం అప్పాయపల్లి తండాలో సర్పంచ్తో పాటు 8 వార్డులకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందేకు తీర్మానం చేశారు. ● గద్వాల మండలం కుర్వపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళాకు రిజర్వ్ కాగా..గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తన భార్యను సర్పంచ్ చేయడం కోసం గుడి నిర్మాణానికి రూ.45 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. వీరాపురం గ్రామంలో సైతం సర్పంచ్ పదవికి జరిగిన పోటాపోటీ వేలంలో ఓ రైతు ఏకంగా రూ.50 లక్షలకు పాటపాడినట్లు సమాచారం. ఇదే మండలం ఈడిగోనిపల్లి రూ.35 లక్షలకు వేలం పాట పాడి ఓ యువకుడు సర్పంచ్ స్థానాన్ని పొందారని తెలిసింది. ● గట్టు మండలంలో మిట్టదొడ్డి సర్పంచు స్థానం రూ.90లక్షలకు వేలంపాట పాడి కొనుగోలు చేశారు. పెంచికలపాడు గ్రామ సర్పంచ్ స్థానాన్ని రూ.31.50 లక్షలు, ఉపసర్పంచ్ పదవికి సైతం వేలం వేయగా రూ. 8.50 లక్షలకు దక్కించుకున్నారు. అరగిద్ద సర్పంచు స్థానం రూ.31 లక్షలు, తుమ్మలపల్లి రూ.30 లక్షలు, తారాపురం రూ.16.50 లక్షలు, కేటీదొడ్డి మండలం రంగాపురం రూ.15 లక్షలు, సుల్తానపురం రూ.8 లక్షలులకు వేలం పాడినట్లు సమాచారం.మల్లాపురం గ్రామంలో కూడా వేలం ద్వారా ఏకగ్రీవం చేసినట్లు తెలుస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో రూ.42 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణానికి ముందుకొచ్చిన సీడ్ ఆర్గనైజర్ సర్పంచ్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే మండలంలో మగ్గంపేట, బిజ్వారం, పెదొడ్డి గ్రామాలలో సైతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిజ మండలం కుర్వపల్లి రూ.7.50 లక్షలకు, కిష్టాపురం రూ.10.35 లక్షలకు వేలం ద్వారా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
మహబూబ్నగర్ క్రైం: పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ డి.జానకి అన్నారు. నవాబ్పేట, కారుకొండ, గురుకుంట నామినేషన్ కేంద్రాలను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఉండే భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉంటాయని తెలిపారు. నవాబ్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలపై సమీక్షించారు. శాంతి భద్రతల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల రోజు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు పోలీసు బలగాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. -
నామినేషన్ చిక్కులు..
నవాబుపేట: గతంలో నామినేషన్ అనగానే ఒక కాగితంపై చిన్న డిక్లరేషన్ ఇచ్చి సంతకం చేసి ప్రపోజల్తో వెళ్తే సరిపోయేది. తాజా ఎన్నికల్లో అలాంటి వాటికి తావు లేకుండా వివిధ రకాల అంశాలు అడగడం విశేషం. దీంతో నామినేషన్ పత్రం నింపడం సైతం చాలామందికి గగనమైంది. పైగా ఆధార్, ఓటరు ఐడి, బ్యాంకు ఖాతా పుస్తకం తదితర జిరాక్స్ ప్రతులు సైతం జత చేయాల్సి ఉంటుంది. సర్పంచ్కు మాత్రమే ఈ నిబంధనలు అనుకుంటే పొరపాటే.. వార్డు సభ్యుడికి సైతం ఇదే తతంగం. కాగా పోటీదారులు అంరూ ఒకేసారి బ్యాంకు ఖాతా తెరవాల్సి వచ్చింది. మండలంలోని 42 గ్రామాలకు నవాబుపేట, కొల్లూర్లో ఎస్బీ ఐ బ్యాంకులు, నవాబుపేటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, కారుకొండలో కెనరా బ్యాంకు మొత్తం 4 మాత్రమే ఉన్నాయి. దీంతో చాలామంది పోటీదారులు గురువారం ఖాతాలు తెరిచేందుకు బ్యాంకుల ఎదుట పడిగాపులు పడటం కనిపించింది. -
లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం
మహబూబ్నగర్ క్రైం/ హన్వాడ: ఎదురుగా వస్తున్న లారీని ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి పల్టీలు కొట్టి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. తమిళనాడు రాష్ట్రం చైన్నె నుంచి ముంబాయికి స్టీల్లోడ్తో వస్తున్న లారీని గుల్బర్గా నుంచి బెంగుళూరుకు ఇథనాల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ బుధవారం అర్ధరాత్రి మండలంలోని పిల్లిగుండు ప్రాంతంలో ఢీకొట్టింది. దీంతో స్టీల్ లోడ్తో వస్తున్న లారీ రోడ్డుకు ఎడమ పక్కకు పల్టీకొట్టగా ఆయిల్ ట్యాంకర్ కుడి పక్కకు పల్టీ కొట్టగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ అందులో ఇరుక్కొని మంటల్లో సజీవ దహనం అయ్యాడు. ఈ క్రమంలో భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిద్రలేచారు. ఎగసిపడుతున్న మంటలను గమనించి ఘటనా స్థలానికి చేరుకొని స్టీల్లోడ్తో ఉన్న లారీలో ఇరుక్కున డైవర్ లవకుష ప్రసాద్ మిశ్రాను అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో కాపాడారు. మరోవైపు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని దాదాపు మూడు గంటలపాటు శ్ర మించి భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. పోలీసు లు ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రించి మంటలు అదుపు చేసే వరకు వాహనాలు అనుమతించలేదు. ఈ సందర్భంగా ఎస్పీ అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చి అప్రమత్తం చేశారు. ఆయి ల్ ట్యాంకర్ డ్రైవర్ నిరంజనప్ప(36) చించోలి తాలుకా పరిధిలోని హటుగల్లీకి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు స్టీల్లోడ్ లారీ డ్రైవర్ లవకుష ప్రసాద్ మిష్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ● ఎస్పీ పర్యవేక్షణలో మంటలార్పిన ఫైర్ సిబ్బంది ● మూడు గంటల పాటు నిలిచిన వాహనాల రాకపోకలు -
ముహూర్తం దాటిపాయే..
మహబూబ్నగర్ రూరల్: మొదటి విడత ఎన్నికలు జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలు క్లస్టర్ కేంద్రాలకు తరలించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. మండలంలోని ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్కు గురువారం ఉదయం 11 గంటలైనా నామినేషన్ పత్రాలు రాలే దు. అదే సమయంలో మంచి ముహూర్తం ఉండటంతో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సుముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● సాధారణ ఎన్నికల పరిశీలకురాలుకాత్యాయనీదేవి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు, సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనీదేవి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్బాబుతో కలిసి నోడల్ అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు నియమించిన స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓ, ఏపీఓలకు నిర్దేశిత సమయం ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రీవెన్స్సెల్ ద్వారా ఎన్నికల నియమావళి అమలులో వచ్చే ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి మండలాలు, గ్రామాలకు చేరిందా ఆరా తీశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్శాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలకు రూట్ల వారీగా పోలింగ్ సిబ్బంది, సామగ్రి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. అభ్యర్థుల ఎన్నికలల్లో ప్రచార వ్యయం పర్యవేక్షణకు సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు తగిన రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. ● కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మొదటి విడ త గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఎన్నిక ల ప్రవర్తన నియమావళి అమలు, ఇతర నివేదికలను ఎప్పటికప్పుడు టీపోల్ ద్వారా పంపిస్తున్నా మని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల నియామకానికి సంబంధించిన వివరాలను, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు తదితర వివరాలను వివరించారు. -
పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతల రచ్చ
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్స్టేషన్లో భూత్పూర్ మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం వీరంగం సృష్టించగా.. చివరికి పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. ఈ నెల 15న జడ్చర్ల మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి–44పై భూత్పూర్ వైపు వెళ్తున్న చెన్నకేశవులుకు చెందిన కారును వెనుక నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయమై కారు యజమాని చెన్నకేశవులు జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ పుటేజీ ద్వారా కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ను గుర్తించి సంబంధిత యజమానికి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. అయితే తన కారును ఢీకొట్టిన ట్యాంకర్ యజమాని నుంచి పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరగా.. యజమానిని హైదరాబాద్ నుంచి బుధవారం పిలిపించి మాట్లాడుకోవాలని పోలీసులు సూచించారు. ఇరువురి మధ్య చర్చలు విఫలం కావడంతో ట్యాంకర్ యజమాని హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గురువారం కారు యజమాని చెన్నకేశవులు కొంతమందితో కలిసి పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్ఐ మల్లేష్ను సంప్రదించారు. దీంతో మరోసారి ట్యాంకర్ యజమానికి ఫోన్ చేయగా తనను కారు యజమాని బెదిరించారని, తన ట్యాంకర్ను కాల్చివేస్తామంటూ హెచ్చరించారని, తమపై ఎలాగో కేసు అయినందున తాను లాయర్తో వచ్చి ట్యాంకర్ను విడిపించుకెళ్తానంటూ ఫోన్లో ఎస్ఐకి చెప్పాడు. ఇదే విషయాన్ని ఎస్ఐ మల్లేష్ వారికి వివరిస్తుండగా.. లంచం తీసుకుని తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నావంటూ ఎస్ఐపై వారు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదేసమయంలో ఈ తతంగాన్ని వారి వెంట వచ్చిన ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ భీమేష్ వీడియో తీయవద్దంటూ అడ్డుకుని ఫోన్ లాక్కున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఫోన్ను తిరిగి ఇవ్వగా బయటకు వెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ భూత్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చి.. కానిస్టేబుల్ భీమేష్ను దుర్బాషలాడుతూ కాలర్ పట్టుకోవడంతో గొడవకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ లక్ష్మప్ప వారించే ప్రయత్నం చేయగా ఆయనను సైతం తోసివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్న మరో ఎస్ఐ జయప్రసాద్ వారిని సముదాయించి బయటకు పంపే ప్రయత్నం చేయగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని స్టేషన్ నుంచి బయటకు పంపగా అక్కడ కూడా తీవ్రస్థాయిలో పోలీసులను దూషించారు. దీంతో ఎస్ఐ జయప్రసాద్ బయటకు రాగా తోపులాట చోటుచేసుకోవడంతో ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్రెడ్డిని లాక్కొచ్చి లాకప్లో వేశాడు. ఎమ్మెల్యే జీఎంఆర్ రాక విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జడ్చర్ల పోలీస్స్టేషన్కు చేరుకుని విచారించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. కాగా లాకప్లో ఉన్న శ్రీనివాస్రెడ్డిని బయటకు తీసుకువచ్చి సీఐ కమలాకర్ విచారించి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించి పరస్పర ఫిర్యాదులు చేసుకోగా.. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు సీసీ పుటేజీలను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జడ్చర్ల పోలీసులను దుర్బాషలాడిన కాంగ్రెస్ భూత్పూర్ మండలాధ్యక్షుడు లాకప్లో వేసిన ఎస్ఐ.. ఠాణాకు వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు.. డీఎస్పీ విచారణ -
అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు
గద్వాల క్రైం: రాజకీయాలు.. భూ పంచాయితీ.. వ్యా పార వ్యవహారం.. ఇలా అన్నింటా అడ్డొస్తున్నాడని.. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు(40)ని హత్య చేయించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన బైక్ను గూడ్స్వాహ నం ఢీకొట్టిన ఘటనలో చిన్న భీమరాయుడు మృతిచెందాడు. మొదట ఇది రోడ్డు ప్రమాదని అందరూ అనుకోగా.. కుటుంబసభ్యుల అనుమానం మేరకు ద ర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. ప్రధా న నిందితుడు మిల్లు వీర న్న సుపారీ గ్యాంగ్కు రూ. 25 లక్షలు ఇచ్చి హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని మాస్టర్ప్లాన్ వేశాడని తేల్చారు. ఈమేరకు 10 మంది నిందితులను అరెస్టు చేయడంతోపాటు రూ. 8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు 11 మొబై ల్స్, 13 సిమ్కార్డులను సీజ్ చేసినట్లు తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కర్ల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. మొదటి నుంచి రాజకీయ వైరం.. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్ కుర్వ వీరన్నకు.. చిన్న భీమరాయుడికి మధ్య మొదటి నుంచి రాజకీయ వైరంతో పాటు మిల్లు వ్యాపార వ్యవహారాల విషయంలో విభేదాలు ఉన్నాయి. అలాగే, చిన్న భీమరాయుడికి ఆయన బంధువైన బోయ వీరన్న అలియాస్ గబ్బర్ వీరన్నకు సైతం భూ పంచాయితీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్న భీమరాయుడు సమస్యగా మారడంతో ఎలాగైన అతడిని అడ్డు తొలగించాలనే ద్వేషం పెంచుకున్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా కర్నూ లు జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ సభ్యులైన ఈశ్వర్గౌడ్ను మిల్లు వీర న్న, ఆయన కుమారుడు కుర్వ సురేందర్ కలిసి రూ.25 లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా రూ.8 లక్షలు అందజేశారు. రెక్కి నిర్వహించి.. గూడ్స్ వాహనంతో ఢీకొట్టి.. చిన్న భీమరాయుడును హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ సభ్యులు ఈశ్వర్గౌడ్, తెలుగు మధుబాబు(కర్నూలు జిల్లా పంచలింగల), తెలుగు కృష్ణ(తాండ్రపాడు, కర్నూలు జిల్లా), సంజీవులు(మదనపల్లి గద్వాల మండలం), బైరి సుంకన్న, బైరి కేశన్న అలియాస్ సంపోస్(పోలకల్, కర్నూలు జిల్లా), కుర్వ ప్రభుస్వామి అలియాస్ ప్రౌస్వామి (కేటీదొడ్డి మండలం నందిన్నె) హరిజన్ రాజేష్(పుట్టపాశం, కర్నూలు జిల్లా)లు కొన్నిరోజులుగా రెక్కీ నిర్వహించారు. ఈమేరకు బొలెరో గూడ్స్ వాహనం ముందు ఇనుప చువ్వలతో కూడిన గ్రిల్ను అమర్చుకున్నారు. పలుసార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినా.. పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెల 21వ తేదీన చిన్న భీమరాయుడు గద్వాల నుంచి బైక్పై స్వగ్రామమైన నందిన్నెకు వెళ్తుండగా.. డ్రైవర్ తెలుగు కృష్ణ గూడ్స్ వాహనంతో వచ్చి ధరూర్ మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో బైక్ను ఢీ కొట్టాడు. కొద్ది దూరం వాహనం సహా లాక్కెళ్లింది. దీంతో చిన్న భీమరాయుడు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ గూడ్స్ వాహనం ముందు గ్రిల్లో ఇరుక్కుపోవడంతో ఆ వాహనాన్ని అక్కడే వదిలేశారు. గూడ్స్ వాహనం వెనుక మరో కారులో తెలుగు మధుబాబు ఫాలో అవుతూ వచ్చి అందులోని డ్రైవర్ను కారులో ఎక్కించుకుని పారిపోయారు. సుపారీ గ్యాంగ్ సభ్యులంతా కొత్త సిమ్ కార్డులు తీసుకొని.. వివిధ ప్రాంతాల్లో ఉంటూ సమాచారం చేరవేస్తూ వచ్చారు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రమాదంపై మృతుడి సోదరుడు పెద్ద భీమరాయుడు అనుమానం వ్యక్తం చేస్తూ అదే రోజు ధరూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీహరి, విచారణ అధికారి గద్వాల సీఐ శ్రీను కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వెలుగులోకి నిజాలు.. తన సోదరుడు చిన్న భీమరాయుడి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. అయితే గురువారం ఉదయం ఎర్రవల్లి మండల శివారులో సుపారీ గ్యాంగ్ సభ్యులు హత్యకు కుదుర్చుకున్న ఒప్పంద నగదు రూ.8.50 లక్షలు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు సమాచారం మేరకు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా నేరం అంగీకరించారన్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారులు మిల్లు వీరన్న, కుర్వ సురేందర్, బోయ వీరన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ హత్య కేసులో 10మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్ వాహనం, రెండు బైక్లు, 11 మొబైల్స్, 13 సీం కార్డులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులైన ఏ–1 మిల్లు వీరన్న, ఆయన కుమారుడు ఏ–2 కుర్వ సురేందర్పై కేటీదొడ్డి పోలీసు స్టేషన్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి రివార్డు నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న బీమరాయుడు హత్య కేసు ఛేదనలో సిబ్బంది సమష్టి కృషి ఉందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, ఎస్ఐలు శ్రీహరి, శ్రీకాంత్, కళ్యాణ్కుమార్, మల్లేష్, నందికర్, అబ్దుల్షుకుర్, సిబ్బంది నాగరాజు, దామోదర్రెడ్డి, రమేష్, చంద్రయ్య, కిరణ్కుమార్, వీరేష్ తదితర సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేశారు. సుపారీ గ్యాంగ్లోని ప్రధాన నిందితుడు ఈశ్వర్గౌడ్ పరారీలో ఉన్నాడని, త్వరలో అదుపులోకి తీసుకుంటామని, అరెస్టు చేసిన నిందితులను గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. సుపారీ గ్యాంగ్ చేతిలో మాజీ సర్పంచ్ భీమరాయుడు హత్య రాజకీయాలు, పాత కక్షలు, వ్యాపార వ్యవహారాల్లో విభేదాలే కారణం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రధాన నిందితుడు మిల్లు వీరన్న మాస్టర్ప్లాన్.. రూ.25 లక్షలకు డీల్ 10 మంది నిందితుల అరెస్టు రూ.8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్ వాహనం స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు -
వనపర్తి : అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు..
జిల్లా కాంగ్రెస్లో నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడం.. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా తన వర్గానికి సముచిత స్థానం దక్కకపోవడంపై చిన్నారెడ్డి కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత పార్టీ, ముఖ్య నేతల తీరు పట్ల ఆయన మనోవేదనకు గురై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన ఇంట్లోనే 2018 నుంచి కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా.. బోర్డు తీసేసి పక్కకు వేయించారు. ఆ తర్వాత అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. మరో వైపు వనపర్తిలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమానికి ఆయనతో పాటు చిన్నారెడ్డి హాజరుకాకపోవడం హాట్టాపిక్గా మారింది. ఈ సందర్భంగా శివసేనారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. తనకు ఆహ్వానం ఉందని, బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేదని వెల్లడించారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతామని చెప్పారు. 1980లో యువజన కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ వంటి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఆయనకు పేరుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ను మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శివసేనారెడ్డి ఆశించారు. పెద్దమందడి ఎంపీపీగా ఉన్న తూడి మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా.. ఎమ్మెల్యే టికెట్ లొల్లి తారస్థాయికి చేరింది. తొలుత ‘హస్తం’ అధిష్టానం చిన్నారెడ్డి పేరు ప్రకటించినా.. చివరలో మేఘారెడ్డికే బీఫాం ఇచ్చింది. అధిష్టానం నచ్చజెప్పడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంలో ఇరువురి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. తన వర్గానికి చెందిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ చిన్నారెడ్డి తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని, గన్మెన్లను ఉపసంహరించుకున్నారు. తాజాగా రాజుకున్న చిచ్చు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇటు మేఘారెడ్డి, అటు చిన్నారెడ్డి నేరుగా దరఖాస్తు చేసుకోలేదు. కానీ మేఘారెడ్డి తన వర్గానికి చెందిన లక్కాకుల సతీష్.. చిన్నారెడ్డి తన అనుచరుడైన డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కోసం యత్నించారు. అధిష్టానం ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న శివసేనారెడ్డిని ఎంపిక చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో చిచ్చు రాజుకున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బోర్డుఎత్తివేయడంతో.. -
డీపీఓగా జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇన్చార్జి జిల్లా పంచాయతీ అఽధికారిగా జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డిని నియమించారు. ఈ మేరకు కలెక్టర్ విజయేందిర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న డీపీఓ నిఖిల గ్రూప్–1 నుంచి డైరెక్ట్గా రావడంతో ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడంతో ట్రెయినీ డీపీఓగా కొనసాగనున్నారు. వెంకట్రెడ్డి స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్అండ్బీ ఈఈగా సంధ్య జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రోడ్లు భవనా ల శాఖ ఈఈగా సంధ్య నియమితులయ్యారు. గురువారం కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె దేవరకద్ర డీఈ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈఈ గా ఉన్న దేశ్యానాయక్ బదిలీ కావడంతో పూర్తిస్తాయి ఇన్చార్జి ఈఈగా సంధ్యను నియమించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్ కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 28 మంది ఉద్యోగులు గురువారం కోర్టుకు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తమపై కేసులు ఉండడం దుర్మర్గమని అన్నా రు. ఉద్యోగ ఉద్యమకారులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు చదువుపైదృష్టి సారించాలి పాలమూరు: అమ్మాయిలకు బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలని, బాలికలు చదువులపై ప్రత్యే క దృష్టి సారించాలని డీడబ్ల్యూఓ జరీనా బేగం అన్నారు. మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో నగరంలోని ఏనుగొండ కేజీబీవీ జాతీయస్థాయి బాల్య వివాహాల వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోవద్దన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ చిన్న వయసులో జరిగే పెళ్లి వల్ల బాలికల శరీర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కౌమార దశలో గర్భధారణ వస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని, శిశువుల అవయవాల ఎదుగుదలలో కూడా సమస్యలు వస్తాయని తెలిపారు. ఆకర్షణలకు లోనై చిన్న వయసులో వివాహాలు చేసుకోరాదన్నారు. పుస్తకాలతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందించారు. సఖి కో–ఆర్డినేటర్ సౌజన్య, సీడీపీఓలు, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. -
సర్పంచ్ 441.. వార్డులు 174
● తొలి దశ జీపీ ఎన్నికల్లో తొలిరోజు దాఖలైన నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో తొలి దశలో 550 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి దశలో జరిగే ఎన్నికలకు సంబంధించి 550 సర్పంచ్ స్థానాలు ఉండగా.. తొలి రోజు 441 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 4,840 వార్డు స్థానాలు ఉండగా... 174 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ● మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి తొలి విడతలో మొత్తం 40 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 139 సర్పంచ్ స్థానాలకు 108, 1,188 వార్డులకు 73 నామినేషన్లు వచ్చాయి.ఇందులో మహబూబ్నగర్ రూరల్ మండలంలో సర్పంచ్కు 35, వార్డులకు 34, నవాబుపేట మండలంలో సర్పంచ్కు 21, వార్డులకు 18, మహమ్మదాబాద్లో 13 సర్పంచ్, 8 వార్డులకు, గండేడ్లో 28 సర్పంచ్, ఒకటి వార్డుకు, రాజాపూర్ మండలంలో 11 సర్పంచ్కు, 12 వార్డులకు నామినేషన్లు ఉన్నాయి. కాగా నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. 29వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అయితే శుక్రవారం అష్టమి కావడంతో నామినేషన్లు తక్కువగానే వచ్చే అవకాశం ఉంది. శనివారం రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు రావొచ్చు. -
అర్హులకే అవకాశం
పాలమూరు/అచ్చంపేట/జడ్చర్లటౌన్/ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పోటీకి అర్హతలపై అభ్యర్థులకు అనేక సందేహాలు ఉండవచ్చు. అలాంటి వారి కోస మే ఈ కథనం. ప్రస్తు తం నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసేందుకు పలు వురు ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఎన్ని కల్లో పోటీ చేయాలనుకునే వారికి ఈసీ నిబంధనల మేరకు అన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ● స్వీయ ప్రకటన కీలకం.. అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన (అఫిడవిట్) నామపత్రంతో పాటు దాఖలు చేయాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అభ్యర్థి తనతో పాటు కుటుంబ సభ్యులైన భార్య, భర్త, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలను అఫిడవిట్లో పొందుపర చాలి. నామపత్రంలో గడులు ఖాళీగా వదలరాదు. అందులో తనకు వర్తిందని.. లేదా నదారత్ అని రాయాలి. లేకుంటే నామపత్రం తిరస్కరణకు గుర య్యే ప్రమాదం ఉంది. అఫిడవిట్ తప్పుగా ఇచ్చి నట్లు రుజువైతే క్రిమినల్ కేసు నమోదు అవుతుందని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అన్ని అర్హతలు తప్పనిసరి 21 ఏళ్లు నిండి.. గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి అమలు -
వేలం.. ‘ఏకగ్రీవం’!
సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ ● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ ● చక్రం తిప్పుతున్న పెద్దలు.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి ● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం ● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరమంటున్న అధికారులు.. పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నారు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడిన వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాట పాడి.. వాయిదా వేసి.. గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాటను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధలన మేరకు ఖర్చు చేయాలని పంచాయతీ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి టైటస్పాల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు ఎన్నికల ప్రచార ఖర్చు నిర్వహించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏదేని బ్యాంకులో జిల్లాలో ఎక్కడైనా తెరవాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి లేక అతని/ఆమె ఎన్నికల ఏజెంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. ప్రచారానికి చేసే ప్రతి ఖర్చు కూడా బ్యాంకు అకౌంట్ నుంచి విత్డ్రా చేసి నిర్వహించాలని పేర్కొన్నారు. రూ.5వేలకు మించి ఎన్నికలు ప్రచార ఖర్చు నగదు లావాదేవీలు జరపరాదని తెలిపారు. పోటీ చేయు అభ్యర్థి లేదా అతని ఏజెంట్ దగ్గర రూ.10వేల నగదు కలిగి ఉండరాదని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు స ర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు రూ.2లక్షల50వేల వరకు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేల వరకు గరిష్ట పరిమితి వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. 5వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో రూ.లక్షా50 వేల వరకు, వార్టు మెంబర్ అభ్యర్థి రూ.30వేల గరిష్ట పరిమితి వరకు ఖర్చు చేయ వచ్చని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నిర్ధారించిన నమూనా ఫారాలతో అనుమతించిన ఖర్చును మాత్రమే నమోదు చేయాలని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులందరు ఎన్నికల కొరకు ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, క్రాస్ చెక్కుతో చెల్లింపులు జరపాలని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, సెక్షన్ 237 ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల్లోగా సంబంధిత ఎంపీడీఓ నిర్ణయించిన ఫార్మాట్లో సమర్పించాలని, లేకుంటే ఎన్నిక రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క క్లిక్తో ఓటరు జాబితా ప్రత్యక్షం పాలమూరు: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్లైన్లో ఉంచింది. సదరు వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితాను చూడవచ్చు. డౌన్లోడ్ సైతం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. tsec.gov.in వెబ్సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09-2025 ఆప్షన్ను క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చా కోడ్ను సక్రమంగా ఎంటర్ చేసి వార్డు వైజ్ డేటాపై క్లిక్చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్గా ఓట రు లిస్ట్ వస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు. సర్పంచ్ నామినేషన్ ఫీజు రూ.2వేలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్):సర్పంచ్కి పో టీ చేసే అభ్యర్థులు(జనరల్) రూ.2వేల నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజర్వ్డ్ స్థానాల్లో (ఎస్సీ, ఎస్టీ) పోటీ చేసే అభ్యర్థులు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అదే జనరల్ స్థానంలో పోటీ చేసే వార్డు సభ్యులు రూ.500 నామినేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వ్డ్ స్థానంలో రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. -
నల్లచట్టాలు అమలు చేస్తే గద్దె దింపుతాం
మహబూబ్నగర్ న్యూటౌన్: దొడ్డిదారిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు చేస్తే గద్దె దింపుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎ.రాములు హెచ్చరించారు. ప్రతీ రైతు నుండి ఎకరాకు 14 క్వింటాళ్ల పత్తి పంటను కొనుగోలు చేయాలని, విదేశీ పత్తి దిగుమతులపై సుంకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టౌన్ హాలు నుంరి క్లాక్ టవర్ వరకు ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను అమలు మరిచి రైతు వ్యతిరేక చట్టాలను అమలును చాపకింద నీరులా అమలు చేస్తుందని మండిపడ్డారు. దేశ రాజధాని సరిహద్దులో దాదాపు 13 నెలల పాటు రైతులు చేపట్టిన విరోచిత పోరాటంలో 750 మంది రైతుల చావుకు ప్రభుత్వం కారణమైందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అమలవుతున్న 29 చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లేబర్ కోడ్లను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశా రు. తక్షణమే ఉపాధి హామీలో తొలగించిన 55 లక్షల జాబ్కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకు లు కిల్లెగోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, సి.వెంకటేశ్, దేవదానం, సాంబశివుడు, కృష్ణ, సురేష్, రాములు యాదవ్, రామ్మోహన్ పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో మామ, అల్లుడి దుర్మరణం
వనపర్తి రూరల్: బైక్ వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా కా రు ఢీకొని మామ, అల్లుడు దుర్మరణం చెందిన ఘటన పెబ్బేరు మండలంలో ఎన్హెచ్ 44పై రంగాపురం బైపాస్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ యుగేందర్రెడ్డి కథనం ప్రకారం.. పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేశ్(50), అల్లుడు ప్రవీణ్ కుమార్(32) బైక్పై బుధవారం మధ్యాహ్నం డబ్బులు తీసుకోవడానికి పెబ్బేరు వెళ్తున్నారు. జాతీయ రహదారిపై కర్నూల్ బైపాస్ వద్ద పెబ్బేరులోకి క్రాస్ అవుతుండగా.. హైదరాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో మామ, అల్లుడికి బలమైన గాయాలు కావడంతో హైవే అంబులెన్స్లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. రమేశ్కు భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లు, ప్రవీణ్కుమారుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మామ, అల్లుడి మృతితో గ్రా మంలో విషాఛాయలు అమలుకున్నాయి. ఘటనపై రమే శ్ భార్య అలివేల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ మెట్టుగడ్డ: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట తప్పిందని, బీసీలను మరో మారు మోసం చేసిందని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్సాగర్ అన్నారు. బీసీ సమాజ్ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నేడు మాట తప్పి బీసీలను నయ వంచనకు గురి చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పి ంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని, నేడు 46జీఓను తీసుకొచ్చి 17.8 శాతానికి పరిమితం చేసి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం తగిన బుద్ది చెప్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, మహబూబ్నగర్ కన్వీనర్ దుర్గేష్, దేవరకద్ర కన్వీనర్ శేఖర్ పాల్గొన్నారు. -
కొత్త ఉల్లి రాక.. మరోసారి పడిపోయిన ధరలు
దేవరకద్ర: మార్కెట్కు విక్రయానికి కొత్త ఉల్లి రావడంతో ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్కు వివిధ గ్రామాల నుంచి వానాకాలం సాగు చేసిన కొత్త ఉల్లి అమ్మకానికి వచ్చింది. గతంలో మార్కెట్కు చాలారోజులపాటు పాత ఉల్లి వచ్చినా ధరలు నిలకడగా సాగాయి. కానీ, గత రెండు వారాలుగా కొత్త ఉల్లి మార్కెట్కు అమ్మకానికి వస్తుండడంతో ధరలు అమాంతం పడిపోయాయి. మార్కెట్కు వచ్చిన ఉల్లిని ఉదయం 10 గంటలకు వేలం వేయగా క్వింటాల్కు గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.300 లుగా ధరలు పలికాయి. ఈ ధరలతో పెట్టిన పెట్టుబడి పక్కన పెడితే.. ఉల్లి తీసిన కూలీలు, రవాణా ఖార్చులు కూడా రావడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్టంగా రూ.300, కనిష్టంగా రూ.150 వరకు విక్రయించారు. ఉల్లి చాలామటుకు పచ్చిగా ఉండడంతో కేవలం హోటల్, ఇతర వ్యాపారులు అధికంగా కొనుగోలు చేశారు. -
త్రియుండ్ పర్వత శిఖరానికి సాహస విద్యార్థులు
గద్వాలటౌన్: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్లో నిర్వహించే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికై న అధికారి, విద్యార్థి బృందం త్రియుండ్ పర్వత శిఖరానికి చేరకున్నారు. ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ అధికారి భాస్కర్, విద్యార్థి వీరేశ్నాయక్ జాతీయ సాహన శిక్షణ శిబిరానికి ఎంపికై న విషయం తెలిసిందే. సాహస శిక్షణ శిబిరంలో వీరు అనేక సాహస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అందులో భా గంగా బుధవారం 2,875 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో ఉన్న త్రియుండ్ పర్వత శిఖారాన్ని ట్రెక్కింగ్ చేస్తూ చేరుకున్నారు. సాహోసోపేతమైన శిక్షణలో పాల్గొన్న విద్యార్థి, అధ్యాపకుడిని ప్రిన్సిపాల్ షేక్కలందర్బాషా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో సాహస యాత్రను విజయవంతం చేయాలని ఆకాక్షించారు. నిలిచిన విద్యుదుత్పత్తి ధరూరు: జెన్కో జలవిద్యుత్ కేంద్రం ఒక యూనిట్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని నీటి కొరత కారణంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 8గంటల వరకు కేవలం వెయ్యి క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు తెలిపారు. ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, కుడి కాల్వకు 416క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 464 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.624 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. -
యువకుడి బలవన్మరణం
మహబూబ్నగర్ క్రైం: ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఓ యువకుడు బుధవారం అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. అన్నాసాగర్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన కపిల చరణ్ (20) ఆరు నెలలుగా జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటూ ట్రాక్టర్ వర్క్షాప్ దుకాణంలో రోజు కూలీగా పని చేస్తుండేవాడు. కొంతకాలంగా చరణ్ వెన్నుముక సమస్యతో ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒంటరిగా గడపడంతో మనస్థాపానికి గురై బుధవారం తాను అద్దెకు ఉన్న గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. మొక్కజొన్న కుప్పకు తగిలి వ్యక్తి మృతి తాడూరు: బైక్పై వస్తుండగా రోడ్డుపైనే ఉంచిన మొక్కజొన్న కుప్పకు తగిలి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన తాడురు మండలం గుంతకోడూరు శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గురుస్వామి కథనం ప్రకారం.. తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన మీసాల రాములు(40), మీసాల బాలస్వామి కల్వకుర్తి మండలం జాజలలోని బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా గుంతకోడూరు సమీపంలో రోడ్డుపైనే వేసిన మొక్కజొన్న కుప్పకు తగిలి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో మీసాల రాములు అక్కడిక్కడే మృతిచెందగా, బాలస్వామి గాయాలతో బయటపడ్డాడు. రాములుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ కిందపడి వలస కూలీ మృతి తాడూరు: మండల కేంద్రం శివారులో వలస కూలీ మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గురుస్వామి కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన హుస్సేన్(30) భార్య లలితతో కలిసి పత్తి తీసేందుకు తెలకపల్లి మండల తాల్లపల్లి, పుల్జాల, మల్కాపూర్ వెళ్లేవారు. వలస కూలీ కావడంతో హుస్సేన్ తాల్లపల్లి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఎక్కుతుండగా.. అదుపుతప్పి వెనుక టైర్ కిందపడి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నదిలో దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం ఎర్రవల్లి: అయ్యప్ప మాలధారణతో ఉన్న ఓ యువకుడు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్ కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లాకు చెందిన సూర్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురై బుధవారం బీచుపల్లి వద్ద కృష్ణానదిలోకి దూకాడు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు పుట్టీల సహాయంతో నదిలో కొట్టుకుపోతున్న సూర్యను ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారికి అప్పగించారు. యువకుడి ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను పోలీసులతోపాటు పలువురు అభినందించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు బిజినేపల్లి: మండలంలోని వెంకటాపూర్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ను జ్జునుజ్జయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నందివడ్డెమాన్కు చెందిన శ్రీనివాసులు నాగర్కర్నూల్ నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. వెంకటాపూర్ వద్ద వెనకాలే వస్తున్న కారు ప్రమాదశావత్తు బైక్ను ఢీ కొట్టడంతో కిందపడిపోయాడు. అదేక్షణంలో వెనకాలే వచ్చిన డీసీఎం శ్రీనివాసులును ఢీకొట్టింది. కారు, డీసీఎం ప్రమాదంలో తలకు గాయమై, నడుము భాగం నుజ్జునుజ్జయింది. తీవ్రగాయాలైన క్షతగాత్రుడిని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్య లక్ష్మి, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మద్యం పట్టివేత గద్వాల క్రైం: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. గద్వాల మండలం అనంతపురానికి చెందిన నాగశేషు, శేఖర్ సూచన మేరకు బుధవారం సాయంత్రం ఆటో డ్రైవర్ నారాయణకు గద్వాల జమ్మిచేడ్ జములమ్మ ఆయల సమీపంలోని రేణుక వైన్షాపు నుంచి 18 కాటన్ల మద్యం తరలిస్తున్నట్లు సమాచా రం వచ్చింది. ఆయల శివారు ప్రాంతంలో ఆటోను అదుపులోకి తీసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.47లక్షలు ఉంటుందన్నా రు. ఆటో, మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. -
54 జీపీలకు ఒకే పీహెచ్సీ
నవాబుపేట: మా కూతరు డెలివరీకి వచ్చింది.. పదా పాలమూరుకు అనే రోజులు నవాబుపేట మండలంలో కనిపించవు.. డెలివరీ వచ్చిందంటే చాలు నవాబుపేట పీహెచ్సీ అన్నట్లు మారింది పరిస్థితి. నవాబుపేట పీహెచ్సీలో గతేడాదిలో 291 డెలివరీలు చేసి జిల్లాలోనే రికార్డు సృష్టించి మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా ఈ ఏడాది సైతం ఇప్పటికే 250 డెలివరీలు దాటేసింది. దీంతో ఇక్కడి సిబ్బంది పనితీరు జిల్లాస్థాయిలో నిలిచింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మండలంలో ఒకే ఒక్క పీహెచ్సీ ఉండటం సిబ్బందికి భారంతోపాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. 54 గ్రామాలకు 76, 981మంది జనాభాకు ఒకేఒక్క పీహెచ్సీ ఉండటం విడ్డూరం. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పీహెచ్సీకి ఎటూ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు చిన్నచిన్న వాటికి 12 కిలోమీటర్ల దూరం రావాల్సిందే. పైగా ఇక్కడ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడంతో ప్రతిదానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. 25ఏండ్ల క్రితం ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలోనే రికార్డుస్థాయిలో ఆపరేషన్లు చేసి మొదటిస్థానంలో నిలిచిన చరిత్ర ఉంది. కాని కుని నిలిపివేయడంతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉన్న తండాలు, మారుమూల గ్రామాల పరిస్థితి మరింత దారుణం. ఇలాంటి పరిిస్థితుల్లో ఏండ్ల తరబడి ఒకేఒక్క పీహెీచ్సీతో కాలం గడుపుతున్న మండలం దినదినం అభివృద్ధి చెందుతున్నా.. అదనపు పీహెచ్సీ మాత్రం నోచుకోలేదు. నిబంధనల ప్రకారం 25వేల జనాభాకు ఒక్క పీహెచ్సీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అట్టి నిబంధనల ప్రకారం మండలంలో మరో 3పీహెచ్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ● గ్రామాల్లోని సబ్సెంటర్లను సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తోంది. సబ్సెంటర్లలో సిబ్బంది లేకుంటే చాలా ఆందోళన కలిగించే అంశం. మొత్తం 11 సబ్సెంటర్లలో ఆరుగురు ఏఎన్ఎంలు లేకపోవడంతో 2వ ఏఎన్ఎంలతో కాలం గడుపుతున్నారు. ప్రధానంగా కొల్లూర్, రుద్రారం, ఇప్పటూర్, చౌడూ ర్, లింగంపల్లి, నవాబుపేట సబ్సెంటర్ల పరిధిలోని ఇన్చార్జీలు ఖాళీగా ఉన్నారు. ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన పీహెచ్సీలో ఒకేఒక్క కాంట్రాక్టు డాక్టర్ ఉన్నాడు. అలాగే ఒక ఎంపీహెచ్ఓ, ఒక సూ పర్వైజర్, ఒక స్టాఫ్నర్స్ ఫోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాన్పుల్లో రికార్డు.. కు.ని ఆపరేషన్లకు నో చాన్స్ దూరాభారంతో తండాలు, మారుమూల ప్రజలకు ఇక్కట్లు గ్రామాల్లోని సబ్సెంటర్లనూ వేధిస్తున్న స్టాఫ్నర్సులు, సిబ్బంది కొరత కారుకొండలో పీహెచ్సీ ఏర్పాటు చేయాలి మండలంలోని మేజర్ గ్రామాల్లో ఒకటైన కారుకొండలో పీహెచ్సీ చాలా అవసరం. చాలా ఏండ్ల నుంచి ఇక్కడ సబ్సెంటర్ కొనసాగుతుంది. కాగా జనాభా ప్రకారం ఇక్కడ చాలా మారుమూల గ్రామాలకు మధ్యలో పెద్ద గ్రామం కావడంతో అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి. లేకుంటే ప్రతి విషయానికి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. – పాండురాజ్, హజిలాపూర్ పీహెచ్సీల ఏర్పాటుపై దృష్టిసారించాలి మండలంలో జనాభాను దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీల ఏర్పాటుపై జిల్లా అధికారులు దృష్టిసారించాలి. అలాగే ఇక్కడ పీహెచ్సీలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు వివరించాం. ఆస్పత్రిలో సదుపాయలు, సిబ్బంది తదితర ఏర్పాట్లు చేసి ఆపరేషన్లకు సిద్ధం చేయాలి. ప్రతినెలా కుటుంబ నియంత్రణ శిబిరాల కోసం వైద్యసిబ్బందికి కొంత ఇబ్బంది తప్పదు. డెలవరీలు మాత్రం టార్గెట్కు మించి జరిగేలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. – శ్రావణ్కుమార్, మండల వైద్యాధికారి -
జాతీయ స్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
నర్వ: మండలంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన విద్యార్థిని టి.అర్చన జాతీయస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్లు విశ్రాంత పీఈటీ గోపాలం తెలిపారు. గ్రామానికి చెందిన కీ.శే వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమార్తె అర్చనను 2018లో విశ్రాంత పీఈటీ గోపాలం చేరదీసి వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో మెరుగైన శిక్షణ అందించారు. దీంతో అర్చన తొమ్మిది క్రీడాంశాల్లో మెరుగైన శిక్షణ పొంది హకీంపేట క్రీడా పాఠశాలకు ఎంపికై ంది. అక్కడ నాలుగో తరగతిలో ప్రవేశం పొంది వెయిట్లిఫ్టింగ్ కోచ్ సంపత్కుమార్ పర్యవేక్షణలో 2022 నుంచి 2024 వరకు రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 48 కేజీలు, 53 కేజీలు, 58 కేజీల విభాగంలో ప్రతిభ చాటి ప్రశంసాపత్రాన్ని పొందిందన్నారు. ప్రస్తుతం హకీంపేట క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. ఈ నెల 2న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి జూనియర్ వెయిట్లిఫ్టింగ్ పోటీలో 63 కేజీలు ఎత్తి జాతీయ స్థాయికి ఎంపికై ందని, ఈ నెల 26 నుంచి 30 వరకు అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో జరిగే జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లినట్లు గోపాలం పేర్కొన్నారు. ఈ విద్యార్థిని అక్క అనూష సైతం గోపాలం దగ్గరే శిక్షణ పొంది సైక్లింగ్ పోటీల్లో గోల్డ్మెడల్ సాధించింది. క్రీడారంగంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు రాణిస్తూ బంగారు పథకాలను సాధించడంపై రాయికోడ్ గ్రామస్తులు, నర్వ మండల క్రీడాభిమానులు వారిని అభినందించారు. అర్చన -
మహిళల ఉన్నతే తెలంగాణ అభివృద్ధి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మన్ననూర్: రాష్ట్రంలోని మహిళల ఉన్నతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిగా సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, పీడితవర్గాల ఆశాజ్యోతి ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఇంటి వద్ద వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, పీఆర్ఓ మీడియా చైర్మన్ రామ్మోహన్రావు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ డైరెక్టర్ సంభు శోభతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అందరికి రాజ్యాంగ ఫలాలు అందని దుస్థితి ఉందన్నారు. ఈ క్రమంలో నల్లమల బిడ్డ రేవంత్రెడ్డి అంబేడ్కర్, నెహ్రూ కలలను సాకారం చేసేందుకు తనవంతు ప్రయత్నం వచ్చిరాగానే పేదల అభ్యున్నతే ధ్యేయంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగించే క్రమంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల తర్వాత మళ్లీ ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్న సంపదను పంచుకునే విషయంలో వారి కుటుంబంలోని ఆడబిడ్డ రొడ్డెక్కే పరిస్థితి దాపురించిందన్నారు. ఒకే కుటుంబంలోనే పొంతనలేకపోగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ఆవాకులు చివాకులు పేల్చుతుంటే ప్రజలు గమనిస్తున్నారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తి, భారత రాజ్యాంగం విలువలను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమ్రాబాద్ మండల నాయకులు హరినానాయణ, ఎంఏ రహీం, సురేశ్, వెంకటరమణ, సంతోష్, హన్మంత్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజారాం, శంకరయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025పల్లె పోరు.. కసరత్తు జోరు!విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు గెలుపు గుర్రాల కోసం వడబోత సర్పంచ్ ఆశావహుల చరిష్మా, సేవలపై ఆరా పలు గ్రామాల్లో ముందస్తుగానే ఇంటింటి ప్రచారం గ్రామాల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం -
ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఎస్ఎస్టీ బృందాలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలానికి రెండు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో రెండు ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, గోడరాతలు, హోర్డింగులు, జెండాలు ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ ప్రదేశాల్లో తొలగించాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సెలవులు లేవని, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే పౌరులు వాటికి సరైన ఆధారాలు చూపించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ నిఖిల పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో నార్కోటిక్ జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు చురుగ్గా పనిచేయాలన్నారు. ఉపాధ్యాయులు, యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షించి పోలీస్లకు సమాచారం అందించాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించాలని, గ్రామస్థాయి అధికారులతో నిఘా ఉండేలా పోలీసు శాఖ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్ఓ కష్ణ, ఎకై ్సజ్ అధికారి నర్సింహారెడ్డి, డీఏఓ వెంకటేశ్, మహిళ శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం, ఇంటర్మీడియట్ అధికారిణి కౌసర్ జహాన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అల్లుడిగా వచ్చా.. మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పాటు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ముంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకాలు, చెక్డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా తదితరులు పాల్గొన్నారు. రూ.42.70 కోట్లతో అనుగొండ పునరావాస కేంద్రం సంగంబండ వద్ద బండను తొలగించి రైతులకునీరందించినఘనత మాదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైంది
● బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్టాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని, పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఉద్యమ సమయంలో అనేక బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన నవంబర్ 29వ తేదీని దీక్ష దివాస్గా జరుపుతున్నామని, దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతి తెలంగాణ బిడ్డ దీక్షలో పాల్గొ నాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినందుకే కరెంట్, సాగు, తాగు నీళ్లు, రూ.2వేల పింఛన్లు వచ్చాయన్నారు. ● బీసీలకు 42 శాతం ఇస్తామని మాట తప్పి.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం హడావుడిగా ముందుకు పోతున్న కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. గ్రామాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకొని గెలిచే అభ్యర్థులను సర్పంచ్లుగా బరిలో నిలపాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే వారు, ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికి భవిష్యత్లో గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని, కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఈ విషయాన్నీ ప్రజలే కాదు.. సొంత పార్టీ నాయకులే చెప్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఇంతియాజ్, రాజేశ్వర్గౌడ్, యాదయ్య, బస్వరాజ్, గంజి వెంకన్న, శివరాజ్, బాలరాజు, దేవేందర్రెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
భారత రాజ్యాంగమే సర్వోన్నతమైంది
● జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్,రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రపంచంలో భారత రాజ్యాంగమే సర్వోన్నతమైందని మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రాజ్యాంగానికి తిరుగులేదని, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని భారతపౌరులు తప్పప పాటించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానులే అన్న నిబంధన ఉందని, దాన్ని ఆధారంగా ప్రతిపౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు వర్తిస్తాయని, అటువంటి విలువైన అంశాల ఆధారంగా రాజ్యాంగం నిర్మించారన్నారు. అన్ని అంశాల్లో ప్రతిఒక్కరూ సమానంగా ఎదగాలని, సమాన అవకాశాలు రావాలన్న ప్రాథమిక హక్కులతోపాటు పౌరులు చేయాల్సిన విధులను కూడా రాజ్యాంగం ఇచ్చిందన్నారు. సమాజంలో బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించిందని, శాసన కార్యనిర్వాహకవర్గ, న్యాయ వవ్యవస్థలపై పూర్తి అధికారం రాజ్యాంగం కలిగి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థలు సరైన విధానంలో పనిచేయకపోవడం విచారకరమని, ప్రజాస్వామ్యంలో నిజమైన సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, అందువల్ల వారు తమ ఓటుహక్కును సద్వినియోగపర్చుకోవాలన్నారు. ప్రజలు శాసీ్త్రయ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దేశాభివృద్ధిపై తమ కర్తవ్యాలను నిర్వహించాలన్నారు. ప్రస్తుతం భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రభుత్వాలు పటిష్టంగా ఉండి సరైన విధానంలో పనిచేస్తేనే దేశం సర్వోన్నతంగా వెలుగొందుతుందన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగం పీఠికతో మొదలవుతుందని, ఈ దేశానికి ప్రజలే మూలం అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలకు ప్రాతిపదికగా మారుతుందన్నారు. సార్వభౌమత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రాలతో కూడి భారత రాజ్యాంగం పౌరులకు రక్షణ కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, ప్రిన్సిపాల్ మాళవి, అధ్యాపకులు నూర్జహాన్, ఎస్సీ ఎస్టీసెల్ డైరెక్టర్ కుమారస్వామి, వైస్ ప్రిన్సిపాల్ భూమ య్య, రవికుమార్, బసీర్అహ్మద్, పర్వతాలు, నాగసుధ, జావెద్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా సిద్ధం..
● నేటి నుంచి తొలి విడత నామినేషన్లు ● 40 క్లస్టర్ జీపీల్లో ఏర్పాట్లు సాక్షి ప్రతినిది, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలివిడతలో జిల్లాలోని గండేడ్, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్ మండలాల పరిధిలో 139 గ్రామపంచాయతీ స్థానాల్లో సర్పంచ్లు.. 1,188 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకనుగుణంగా ఆయా జీపీలను 40 క్లస్టర్లుగా విభజించి నామినేషన్లు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ● తొలి విడతలో 40 క్లస్టర్ల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కోసం స్టేజి–1 ఆర్ఓలు 48 మంది, స్టేజి–1 ఏఆర్ఓలను 48, స్టేజి–2 ఆర్ఓలను 157 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరు వారికి కేటాయించిన క్లస్టర్లలో అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అచ్చంపేట: పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డులో నివాసముంటున్న నేనా వ త్ లక్ష్మణ్ మంగళవారం అ నుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్ఐ సద్దాం హుస్సేన్ కథనం ప్రకారం.. అచ్చంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ లక్ష్మన్(38)కు బల్మూర్ మండలం బాణాలకు చెందిన పద్మతో వివాహ మైంది. వీరికి ఇద్దరు పిల్లలు.. భార్య పద్మ ఉప్పునుంతల మండలం గట్టకాడిపల్లి ప్రాథ మిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. లక్ష్మణ్ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అదేక్రమంలో ప్రా ణాలు కోల్పోయి ఉంటారని కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు. మృతుడి ఒంటిపై రక్తపు మరకలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మల్దకల్లో మృతి మల్దకల్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘట న మంగళవారం మండలంలోని మద్దలబండలో చోటు చేసుకుంది. ఎస్ఐ నందికర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ హన్మన్న (31) వ్య వసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం రాత్రి కుటుంబ సమస్యలతో కలిసి ఇంట్లో నిద్రించా డు. మంచంపై పడుకున్న బోయ హన్మన్న మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హన్మన్నకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు ఆరోపించడంతో అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. పాముకాటుకు మహిళ బలి నాగర్కర్నూల్ క్రైం: పాముకాటుకు గురైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఔరాసిపల్లికి చెందిన వంగ లక్ష్మమ్మ (45) ఈ నెల 11న గ్రామంలో కూలీ పనులకు వెళ్లగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారం రోజుల చికిత్స అనంతరం నెల 19న డిశ్చార్జ్ అయింది. మరలా ఈ నెల 22న ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఊట్కూర్: మండలంలోని ఎడివెళ్లికి చెందిన సాయిలు (36) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. పోలీసుల కథ నం మేరకు .. సాయిలు ఈ నెల 19న పొలం నుంచి వ చ్చి కుంటుబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు ఉదయం నిద్రలేపగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా పరిస్థితి విషమంగా ఉండడంతో మహాబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందా డు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
నవంబర్లోనే.. ముసుగేసింది
బల్మూరులో.. మానవపాడులో.. మానవపాడులో..బాలానగర్లో..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకొని కనిపించింది. తెల్లవారుజామున మంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ఉదయం 8 గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. రహదారులతోపాటు పంట పొలాలు ఊటీని తలపించాయి. ఉదయం వివిధ పనులకు వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సాధారణంగా డిసెంబర్ ఆఖరు, జనవరిలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. కానీ, ఈసారి నవంబర్లోనే మంచు ముసుగేయడం చలి తీవ్రతను చాటుతోంది. – జడ్చర్లటౌన్/మానవపాడు/బల్మూర్ మానవపాడు రైల్వేస్టేషన్ వద్ద పొగమంచులో వస్తున్న రైలు -
‘బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర’
మెట్టుగడ్డ: బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర జరుగుతుందని, బీసీలంతా ఏకమై తిప్పికొడదామని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం బీసీలను రాజకీయంగా అణిచివేయాలన్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికలలో 23 శాతం రిజర్వేషన్ల అమలును ఎందుకు అడ్డుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా వారి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన హామీ మేరకై నా రాహుల్గాంధీ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో పోరాడి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి రేవంత్రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేకుంటే బీసీలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వెంకటేష్యాదవ్, రాజేందర్, రామ్చరణ్, శివ, భరత్, రాఘవేందర్, శ్రీకాంత్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి కల్చరల్ పోటీలకు ఎంపిక
జడ్చర్ల టౌన్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే జాతీయ స్థాయి కల్చరల్ పోటీలకు జడ్చర్ల ఉపాధ్యాయులు ప్రదర్శించిన లఘునాటిక భు వన విజయం ఎంపికై ంది. ఈనెల 6, 7 తేదీల్లో అఖిల భారత సివిల్ సర్వీ సెస్, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వ ర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన పోటీల్లో జడ్చర్ల ఉపాధ్యాయు లు నాటి కలో శ్రీకృష్ణదేవరాయలుగా వెంకటరమణాచార్యులు, అల్లసాని పెద్దనగా కృష్ణమోహన్, నందితిమ్మనగా రాఘవేంద్రచారి, దూర్జటిగా రత్నశేఖర్, తెనాలి రామకృష్ణుడుగా భాస్కర్, రామరాజభూషణుడుగా శ్రీనివాసులు, పింగళి సూరనగా నర్సింహులు, అయ్యరాజు రామభద్రుడుగా నిమ్మయ్యగౌడ్, మాదయగారి మల్లనగా దార్ల రాఘవేంద్రచారి, నరసకవిగా నరేశ్గౌడ్, కవి శిఖామణిగా అనంతరాములు నటించారు. వీరి ప్రతిభకు ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేస్తున్నాయి. -
భూసేకరణే సమస్య
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డంకులు ● పరిహారం చెల్లింపులో జాప్యం ● ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ● కల్వకుర్తి–కొల్లాపూర్ జాతీయ రహదారిదీ అదే పరిస్థితి అచ్చంపేట: జిల్లాకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు భూసేకరణ సమస్యతో ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల (కేఎల్ఐ), పాలమూరు–రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మార్కండేయ, సింగోటం లింక్ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పెడింగ్లో ఉంది. చాలా రోజుల నుంచి భూసేకరణకు నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నతున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది జూన్లో కేఎల్ఐకి రూ.25 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ.24 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేసినా అధికారుల ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన 14 ప్యాకేజీల పరిధిలో 11,930.22 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 11,899.07 పూర్తయ్యింది. మిగిలిన 31.15 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 142.98 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 129.52 ఎకరాలు సేకరించారు. ఇంకా 18.48 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 27లో 18.46 ఎకరాలు, ప్యాకేజీ 28లో 27.20 ఎకరాలు, ప్యాకేజీ 29లో 242 ఎకరాలు, ప్యాకేజీ 30లో 256.5 ఎకరాలు, కర్నెతండా లిఫ్ట్లో 23 ఎకరాలు, మార్కండేయ ఎత్తిపోతల పథకంలో 104.42 ఎకరాలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలో 244.15 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు బల్మూర్ మండలంలోని మైలారం శివారులో 2.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ కాల్వ కోసం గుర్తించిన 730 ఎకరాల్లో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. రిజర్వాయర్ ఆనకట్టకు 147 ఎకరాలు, నీటి నిల్వ ప్రాంతం 2,038 ఎకరాలు మొత్తం 2,185 ఎకరాలకు సర్వే చేయాల్సి ఉంది. ముంపు భూముల రైతుల నుంచి వ్యతిరేకత రావడం, కోర్టును ఆశ్రయించడం వంటి సమస్యలతో రెండేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం వారం రోజుల క్రితం జీఓ 42ను తీసుకొచ్చింది. ● పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి అచ్చంపేట ఎత్తిపోతల పథకం కింద రెండు దశల్లో లిఫ్ట్ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా తొలి దశ పనులకు రూ.1,534.5 కోట్ల అంచనా వ్యయంతో 2023 మే 3న ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ పనికి టెండర్ పిలువగా రూ.1,105.97 కోట్లకు బీఐపీఎల్, ఎఇపీపీఎల్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. 2023 సెప్టెంబర్ 22న టెండర్ ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ 30 నెలల్లో పని పూర్తి చేయాలి. 4,142 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రెండేళ్లయినా ఇంత వరకు భూసేకరణనే పూర్తి కాకపోవడంతో తట్టేడు మట్టి కూడా తీయలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2018లో ప్రభుత్వం సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్కు శ్రీకారం చుట్టారు. 2022లో రూ.147.7కోట్ల నిధులు మంజూరు చేయగా.. 2023లో పనులు ప్రారంభమైనా భూసేకరణ సమస్య కారణంగా నిలిచిపోయాయి. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ కెనాల్ తవ్వకాలు చేపట్టారు. ఇందులో వనపర్తి జిల్లా పరిధిలో 18 కి.మీ, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ కాల్వ తీయాల్సి ఉంది. వనపర్తి పరిధిలో 200 ఎకరాలు, నాగర్కర్నూల్ పరిధిలో 100 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు నిర్ణయించడంతో కాల్వ పనులు రెండేళ్లు క్రితం నిలిచిపోయాయి. గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5కి.మీ మేర మాత్రమే కాల్వ పనులు చేపట్టారు. రెండేళ్లయినా.. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి 167కె నిర్మాణ పనులు మొదలై రెండేళ్లవుతున్నా నేటికీ భూసేకరణ పూర్తి కాలేదు. కల్వకుర్తి (కొట్రగేట్), నాగర్కర్నూల్–కొల్లాపూర్లోని మండలం చౌటపల్లి వాగు మీదుగా సోమశిల వైపు 79.3 కిలోమీటర్ల రహదారి పనులు మొదలయ్యాయి. 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 77.5 హెక్టార్ల భూసేకరించారుది. కొల్లాపూర్ బైపాస్ మినహా ఇంకా 29.2 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇదే మార్గంలో 3వ ప్యాకేజీలో భాగంగా సోమశిల, సిద్ధేశ్వరం గుట్టల మధ్య వంతెన నిర్మించే నదీ తీరం వరకు 8 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 132 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 44 హెక్టార్ల భూసేకరణ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ కింద చేపట్టే కాల్వ హద్దులు నిర్ణయించి సర్వే పూర్తి చేశాం. రిజర్వాయర్ నిర్మించే ప్రాంతంలో కొంత భాగం సర్వే చేయాల్సి ఉంది. రైతుల నుంచి భూసేకరణకు అడ్డంకులు ఎదురువుతున్నాయి. మొత్తం 2,700 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కలెక్టర్ నుంచి భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వస్తే ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం అందజేస్తాం. – అమర్సింగ్, ఈఈ, ఇరిగేషన్శాఖ, అచ్చంపేట -
మైనర్లకు వాహనాలిస్తే సీజ్ చేస్తాం
మహబూబ్నగర్ క్రైం: తల్లిదండ్రులు మైనర్లకు ఎ లాంటి పరిస్థితిలో వాహనాలు ఇవ్వరాదని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవా రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీంట్లో మైనర్ డ్రై వింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారితోపాటు ర్యాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్ వంటి 35మంది వాహనదారులకు స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రధానంగా మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్క వాహనదారుడు పాటించాలన్నారు. భవిష్యత్లో మైనర్లు డ్రైవ్ చేస్తే వాహనాలు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
సమష్టి కృషితోనే ఆర్టీసీ మనుగడ
కందనూలు: అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధిస్తుందని నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడి అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ లోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రీజినల్ త్రై మాసిక ప్రగతి చక్ర అవార్డులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ గోపిడి హాజరై మా ట్లాడారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు ఆర్టీసీకి వెన్నెముఖ లాంటివారని, అందరూ టీంవర్క్గా పనిచేసి మహబూబ్నగర్ రీజియన్ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూ చించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, డిపో మేనేజర్ యాదయ్య, సిబ్బంది పాల్గొన్నారు. రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ఽదరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు కేవలం వెయ్యి క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. విద్యుదుత్పత్తి నిమిత్తం 5, 598 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 24 క్యూసెక్కు లు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 496 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 6,508 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు లో 9.398 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దిగువ, ఎగువ జూరా ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో కేవలం రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఎగువలో 1 యూనిట్లో 39 మెగావాట్ల ద్వారా 510.531 ఎంయూ, దిగువలో 1 యూనిట్లో 40 మెగావాట్ల ద్వారా 503.408 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 1013.939 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. -
తెలంగాణ గోల్డ్ కప్లో ప్రతిభచాటాలి
● టీసీఏ జోనల్ ఇన్చార్జీ జీకే ప్రేమ్కుమార్ ● ఉత్సాహంగా జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో వచ్చేనెలలో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని టీసీఏ జోనల్ ఇన్చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీకే ప్రేమ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం శ్రీనివాసకాలనీలోని జీకే క్రికెట్ అకాడమీలో తెలంగాణ గోల్డ్కప్కు సంబంధించి జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీకే ప్రేమ్కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ.. తెలంగాణ గోల్డ్కప్ పోటీలు జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిల్లో జరుగుతాయని తెలిపారు. క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఫేరోజ్, దినేశ్యాదవ్, భాను తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాకారులు వివరాలు మోతీలాల్ (కెప్టెన్), శ్రీరామ్రెడ్డి (వైస్ కెప్టెన్), జి.భాను, వినీత్, నందకిశోర్, అమర్ నాయక్, ఇమ్రాన్, అభిలాశ్, తరుణ్, యశ్వంత్, వంశీకృష్ణ, నితిన్నాయక్, ఆనంద్, ఉమేశ్, ఉదయ్, నితిన్రెడ్డి, స్టాండ్బైగా అఖిల్, కె.భాను, సాత్విక్. -
జాతీయ ‘గో గేమ్’లో క్రీడాకారుల ప్రతిభ
మహబూబ్నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలోని పూరిజగన్నాథ్లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మూడు బంగారు, మూడు రజత పతకాలు సాధించి సత్తాచాటారు. సింగిల్ విభాగం సబ్ జూనియర్లో సిటి.లలితేష్ (గద్వాల) బంగారు పతకం, మహ్మద్సోబానుర్దిన్ (మహబూబ్నగర్) రజత పతకం, జూనియర్లో పి.రాహుల్ (మహబూబ్నగర్) బంగారు పతకం, ఎం.చేతన్చంద్ర (మహబూబ్నగర్) రజత పతకం, సీనియర్లో పి.రాకేష్ (మహబూబ్నగర్) బంగారు పతకం, సబావత్ వర్షిత్ (నాగర్కర్నూల్) రజత పతకం కై వసం చేసుకున్నారు. క్రీడాకారులకు కోచ్గా తెలంగాణ రాష్ట్ర గోగేమ్ అసోసియేషన్ మహ్మద్ షకీల్ వ్యవహరించారు. -
పాలమూరులో విద్యారంగం మరింత అభివృద్ధి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం పీయూలో రూ.15 కోట్లతో లా కళాశాల, రూ.35కోట్లతో ఇంజి నీరింగ్ కళాశాల, రూ.25కోట్లతో నిర్మించనున్న బా లుర, బాలికల హాస్టళ్ల భవనాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, వీసీ శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలమూరులో కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పటికీ పాలమూరు ఐదు జిల్లాలకు కేంద్రంగా ఉందని, ఇక్కడ అభివృద్ధి జరిగితే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు చదువుకునేందుకు వెసలుబాటు ఉంటుందన్నారు. పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో పీయూ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. కొత్త కళాశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, ఉన్న తంగా వారిని తీర్చిదిద్దాలని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీయూతో ఎంపీ, తనకు ఎన్నోఏళ్ల అనుబంధం ఉందని, నిధులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామని, లా, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసేందుకు తాము కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అనేక కొత్త కళాశాలలు రావడంతోపాటు పీయూలో కూడా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ, మాళవి, చంద్రకిరణ్, కరుణాకర్రెడ్డి, రవికాంత్, కృష్ణయ్య, వెంకటేశ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు, బాలుర, బాలికల హాస్టళ్ల భవనాలకు శంకుస్థాపన -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ రగ్బీ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–19 విభాగాల రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారబదాయి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మ డి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, జగన్మోహన్గౌడ్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. -
ధరాఘాతం..!
కూరగాయల ధరలు కిలో (రూ.లో) ఇలా.. (మంగళవారం మహబూబ్నగర్ రైతు బజార్లో ధరలు) బెండకాయ 100కాకరకాయ 100బీరకాయ 100వంకాయ 80-100బెండకాయ 100మహబూబ్నగర్ (వ్యవసాయం): కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. నెల రోజులుగా నిలకడ లేకుండా కూరగాయల ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక్క ఆలుగడ్డ మినహా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో జనం కొనుగోలు చేసే పరిస్థితి లేనివారు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు. క్యాప్సికం 100గోరు చిక్కుడు 80-100దొండకాయ 80బీన్స్ 120పచ్చి మిర్చి 100దోసకాయ 60టమాట 60ఆలుగడ్డ 40వర్షాలతోపంటలకు దెబ్బ... ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో కూరగాయల తోటలు దెబ్బతినడంతో అవసరానికి తగినట్లు కాయగూరలు లభించడం లేదు. దీంతో స్థానికంగా అందుబాటులో లేని కూరగాయలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, డోన్ నుంచి టమాట, పచ్చిమిర్చి వస్తుండగా, బెంగళూర్ నుంచి ఆలు, దొండకాయ, బీర్నీస్, బీరకాయ, క్యాప్సికం తదితర వాటిని తెప్పించే క్రమంలో అక్కడి వ్యాపారులు డిమాండ్కు అనుగుణంగా ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఒకట్రెండు మినహా ఏది కొందామన్నా కిలో ధర రూ.100 దాటేసింది. ఆకుకూరల పరిస్థితి కూడా ఇదే. ఇక మహబూబ్నగర్ జిల్లాకేంద్రం కంటే జడ్చర్ల, దేవరకద్ర ప్రాంతాల్లో పలు కూరగాయల ధరలు మహబూబ్నగర్కు కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఇక్కడ చిక్కుడు, బీన్స్, వంకాయ, దోసకాయ, బెండకాయ, క్యాప్సికమ్ ధరలు రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే రైతుబజార్లలో కూడా ధరలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ బయట మార్కెట్ కంటే కొంత తక్కువ ఉన్నట్లు బోర్డుల్లో చూపుతున్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత గ్రేడింగ్ పద్ధతిలోనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని కూరగాయలను బోర్డులో ఉన్నదానికంటే రూ.20 ఎక్కువగా విక్రయిస్తున్నారు. నాణ్యమైన కూరగాయలు ఇక్కడ బహిరంగ మార్కెట్ ధరలకు కొంచెం అటు ఇటుగా అమ్ముతున్నారు. కాగా.. కిలో రూ.వంద ఉన్నా.. పావు కిలో రూ.30, అర కిలో రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ఆకాశాన్నంటినకూరగాయల ధరలు టమాట, ఆలుగడ్డ మినహా అన్నీ రూ.వంద పైనే. సామాన్యుల విలవిల -
గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాలి: ఎస్పీ
మహమ్మదాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. మంగళవారం మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను ఆమె సందర్శించారు. అంతకుముందు మండలకేంద్రంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జూనియర్ కళాశాలను పరిశీలించి.. పరీక్షల సమయంలో ఇబ్బందులు కలగకుండా ముందే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్టేషన్లో ఫైళ్లను పరిశీలించి కేసుల నమోదు, పరిష్కరించినవి.. తదితర వాటిని పరిశీలించారు. స్టేషన్కు వచ్చిన బాధితుల సమస్యలు వేగంగా పరిష్కరించాలని, ఫైళ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల కోసం ఫిర్యాదుల పెట్టె..!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సాధారణంగా కార్యాలయాల్లో సమస్యల పరిష్కారానికి ఫి ర్యాదుల పెట్టె ఉండే విషయం అందరికీ తెలిసిందే. అయితే చిన్నారుల కోసం ప్రత్యేకంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అందులో విద్యార్థులతో పాటు 18 ఏళ్ల లోపు వారు తమ కాలనీలో ఏమై నా సమస్యలు ఉంటే స్వయంగా రాసి అందు లో వేయవచ్చు. కార్యాలయంలో ఏయే సేవలు అందిస్తారో తెలుసుకోవ చ్చు. ఇతరుల నుంచి తాము ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తెలియజేయవచ్చు. దీనివల్ల చిన్నారుల్లో ప్రశ్నించేతత్వం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 15 రోజులకోసారి దానిని తెరిచి అందులో వచ్చిన సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొంటున్నారు. -
మహిళా ఓటర్లే అధికం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో 423 గ్రామపంచాయతీలతో పాటు 3,674 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తుది ఓటరు జాబితా ప్రకారం 4,99,852 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,48,222 మంది, మహిళలు 2,51,349 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. పురుషుల కంటే 3,127 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ‘గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి అవకతవలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం.’ అని డీపీఓ నిఖిల శ్రీ పేర్కొన్నారు. -
చిన్న నీటి తరహా వనరుల గణనపై శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఏడో చిన్న నీటి తరహా నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. చిన్న తరహా నీటి వనరుల గణనపై మంగళవారం కలెక్టరేట్లో గణకులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ గణనకు 2023–24 సంవత్సరానికి ప్రామానికంగా పేప ర్ రహితంగా మొబైల్ యందు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా గణన చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ మాట్లాడుతూ ఈ గణనలో గణకులుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, గ్రామ పరిపాలన అధికారులు, ఇతరులను తీసుకొనినవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించాలన్నారు. గణాంక అధికారి రంగారావు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ హైమావతి, గణాంక అధికారి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు ఈ–పాస్లో సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మీసేవ కమిషనర్ రవి కిరణ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు స్కాలర్షిప్ దరఖాస్తులతో పాటు ఆదాయం, కుల ధ్రువీకరణ, ఇతర ధ్రువపత్రాలు మీసేవలో త్వరగా జారీ చేసేందుకు వేగవంతమైన మార్గాలను అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత, ఎస్టీ అభివృద్ధి అధికారి జనార్దన్, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి ఇందిర, ఈడీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,821 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 13 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 10,500 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,821, కనిష్టంగా రూ.1,711 ధరలు లభించాయి. అదేవిధంగా హంస రకానికి గరిష్టంగా రూ.2,025, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న 2,059 క్వింటాళ్లు రాగా.. గరిష్టంగా రూ.1,974, కనిష్టంగా రూ.1,621 ధరలు పలికాయి. దేవరకద్రలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,119, సోనామసూరి గరిష్టంగా రూ.2,301, కనిష్టంగా రూ.2,055, హంస ధాన్యం రూ.1,869, కనిష్టంగా రూ.1,719న ధరలు నమోదయ్యాయి. దేవరకద్ర మార్కెట్కు 5వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పనులు వేగవంతంగా పూర్తిచేయాలి: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించాల్సిన ప్లాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, మిషన్ భగీరథ, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద 300 గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనం, పార్కులను, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, మిషన్ భగీరథ పైపులు వంటి మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తయ్యేలా పనులను చేపట్టాలన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల గౌరవాన్ని పెంచుతున్నాం: యెన్నం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళ అంటే కుటుంబానికి పునాది అని, సమాజానికి దిశానిర్దేశకురాలు..అలాంటి మహిళల జీవితాల్లో ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం, భద్రతను నింపే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో 1,539 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.1,84,39,513 విలువైన వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. పదేళ్లుగా మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసిన పాలకులు.. వడ్డీలేని రుణాల పంపిణీని నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని వడ్డీలేని రుణాలను పునఃప్రారంభించిందన్నారు. రెండేళ్లుగా జిల్లాలో మహిళలకు రూ.20 కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం విశిష్ట విధానాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీఆర్డీఓ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి గోనెల శ్రీనివాసులు, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, ఎంపీడీఓ కరుణశ్రీ, డీడబ్ల్యూఓ జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ పెరగడం ఇదే మొదటిసారి
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నలుగురు పెద్దవాళ్లు ఉంటే రోజుకు 60 నుంచి 80 రూపాయల వరకు కూరగాయలకే అవుతాయి. అన్ని రకాల కూరగాయలకు ఒకేసారి ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి కావొచ్చు. నెల రోజుల క్రితం టమాట రూ.20 ఉంటే ఇప్పుడు రూ.60 అయింది. పెరిగిన ధరలు చూసి కిలో బదులు పావు కిలో, అర కిలో కొనాల్సి వస్తోంది. – కమల, గృహిణి, మహబూబ్నగర్ దిగుమతి చాలా తగ్గింది జిల్లా చుట్టుపక్కల నుంచి కూరగాయల దిగుమతి చాలా తగ్గిపోయింది. సరిపడా రాక ధరలు పెరిగాయి. ఈసారి భారీ వర్షాల కారణంగా కూరగాయల ఉత్పత్తులు తగ్గిపోయాయి. 20 రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. – కుంచం మోహన్బాబు, వ్యాపారి, మహబూబ్నగర్ రూ.8 వేలు ఖర్చు అవుతోంది ఒకప్పుడు కిరాణ షాపులో నెలకు సరిపడా పప్పు దినుసులు గతంలో రూ.3000 నుంచి రూ.4000కు వచ్చేవి. కానీ ఇప్పుడు పెరిగిన ధరలకు రూ.8వేలకు పైగా ఖర్చవుతోంది. ఇక కూరగాయలు కొనాలంటేనే భయమేస్తుంది. మార్కెట్కు వెళ్తే రూ.500 పెడితే కనీసం చిన్నపాటి సంచికి సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. – హర్షవర్దన్, మహబూబ్నగర్ ఆర్థిక భారం పడుతోంది గతంలో రూ.150కు పది రకాల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500లకు సరిపడే కాయగూరలు రావడం లేదు.మారుతున్న కాలంతో పాటు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నిత్యావసర సరుకుల మీద దృష్టి సారించి మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. – మేకల సత్యం, డ్రైవర్, మహబూబ్నగర్ ● -
ఏటా తగ్గుతున్న కూరగాయల సాగు
పట్టణీకరణ కారణంగా ఉమ్మడిజిల్లాలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మహబూబ్నగర్ ప్రజలకు అవసరమైన కూరగాయలను అధిక శాతం సమకూర్చే ఉమ్మడి జిల్లా లో కూరగాయల సాగు తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా పట్టణ శివార్లలో ఉద్యాన పంటలు సాగు చేసే భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. దీనికి తోడు కూరగాయలు పండించే రైతులకు సరైన ప్రోత్సాహకం లభించడం లేదు. ఇక్కడ కూరగాయల రైతులు తాము పండించిన పంటను మహబూబ్నగర్లోని మార్కెట్కు రైతుబజార్లకు తరలిస్తుంటారు. అయి తే ఇటీవల కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు కూడా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. -
గ్రామకంఠ భూమిని కాపాడాలని బైఠాయింపు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తమతండాకు చెందిన గ్రామకంఠ భూమిని కాపాడాలని కోరుతూ జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన తండావాసులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సోమవారం కలెక్టరేట్లో బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేసినా కలెక్టర్ స్పందించలేదు. చేసేదిలేక తండావాసులు మీటింగ్ హాల్లోకి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తతండావాసి రమేశ్నాయక్ మాట్లాడుతూ.. కబ్జాకోరుల నుంచి కొత్తతండా జీపీకి చెందిన భూమిని కాపాడాలని కోరారు. జీపీ పరిధిలోని 135/లు2ఇ, 135/లు2ఇ/2 సర్వే నెంబర్లలో గతంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపనం చేసినట్లు తెలిపారు. దీంతోపాటు పల్లెప్రకృతి వనం, నర్సరీలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించి కొంతమంది కబ్జాదారులు జీపీ భవన నిర్మాణం జరిగే స్థలాన్ని కబ్జాచేసి ఇతర నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన బోరు, పల్లెప్రకృతి వనం, నర్సరీలను తొలగించి దౌర్జన్యంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ సరైన హామీ ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో చందర్నాయక్, అంత్యనాయక్, లక్ష్మణ్, భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పుచ్చ లేచిపోతుంది
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వనపర్తి: ‘తండ్రి వయస్కుడని ఎక్కువగా మాట్లాడటం లేదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయ్’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రెండురోజులుగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన పుచ్చు వంకాయలనే కామెంట్లు ఎలా చేశారట మరోసారి ఇలా మాట్లాడితే.. మర్యాద ఇవ్వబోనని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో వింతలు చాలానే ఉన్నాయి. పెబ్బేరులోని మార్కెట్ గోదాంలో రూ.కోట్ల విలువ చేసే గన్నీబ్యాగులు ఎండలకు ఎలా మంటలు చెలరేగి కాలిపోతాయి ఇప్పటి వరకు ఎక్కడైనా చూశామా.. అని ప్రశ్నించారు. పెబ్బేరు మండలం పాతపల్లిలో 50 మంది నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టర్ రూ.80 వేలు తీసుకున్నారని ఆరోపించారు. పెబ్బేరు సంతలోని స్థలాలను మాజీ మంత్రి అండదండలతో కబ్జా చేశారని, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా పాత చెరువులకు గండ్లు కొట్టి నీళ్లు తెచ్చిన నీకు నీళ్ల నిరంజన్ రెడ్డి అన్న పేరేందుకన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే, మంత్రిగా పని చేస్తే.. మూడు ఫాంహౌస్లు ఎలా కట్టారని, ఈ విషయం కేసీఆర్కు తెలియకుండా హరీశ్రావు ఏమన్నా ఆపాడా అని ప్రశ్నించారు. మీ ఫాంహౌస్లో అసైన్డ్, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూమి ఉందట, కృష్ణానది కాల్వను సైతం కబ్జా చేశారట... ఇన్ని ఆరోపణలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదని నిలదీశారు. మూడుచోట్ల ఫాంహౌస్లు ఎలా నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎలా మంటల్లో కాలిపోయిందో తేలుస్తామన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే.. ఎందుకు భయపడుతున్నారు. భూ దాహం, ధన దాహంకు హద్దులు లేవా.. 32 మంది మంది బీసీ బిడ్డలపై కేసులు ఎలా పెడతారని కవిత మండిపడ్డారు. -
పాలమూరు బాలికల జట్టు శుభారంభం
మహబూబ్నగర్ క్రీడలు: సంగారెడ్డిలో సోమవారం ప్రారంభమైన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా బాలికల జట్టు శుభారంభం చేసింది. మొదటి లీగ్ మ్యాచ్లో జిల్లా జట్టు 125 పరుగుల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు జట్టు నిర్ణీత 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 162 పరుగులు చేసింది. సిఽంధూజ 37 బంతుల్లో 77 పరుగులు, స్వాతి 36 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. జిల్లా బౌలర్లు సింధూజ 2, వైశాలి 1, నిహారిక 1 వికెట్లు తీశారు. ● ఉత్కంఠం సాగిన రెండో లీగ్ మ్యాచ్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. జిల్లా బౌలర్లు సింధూజ 2, తేజశ్రీ 2, స్వాతి 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. జిల్లా క్రీడాకారిణులు స్వాతి 48 పరుగులు, వైశాలి 18 పరుగులు చేశారు. -
సిరంజీల కొరత
పెద్దాస్పత్రిలో..● రక్త శాంపిల్స్ సేకరించే ట్యూబ్స్లేక రోగుల అవస్తలు ● తిరిగి పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ● గ్యాస్ట్రిక్ సమస్య తగ్గించే ప్యాంటప్ ఇంజక్షన్స్ కరువు పాలమూరు: నిరుపేద రోగులకు పెద్దదిక్కుగా ఉండాల్సిన జనరల్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్పత్రిలో ప్రధానంగా కావాల్సిన వాటిలో సిరంజ్లు, రక్త శాంపీల్స్ సేకరించడానికి ట్యూబ్స్..కానీ ఇక్కడ ఆ కొరతే రోగులను వేధిస్తోంది. సామాన్యులకు ఈ చిన్నపాటి సమస్యలే ఆస్పత్రి చుట్టూ తిరిగేవిధంగా చేస్తున్నాయి. ● జనరల్ ఆస్పత్రిలో కొన్నిరోజుల నుంచి ఒకవైపు సిరంజీలు మరోవైపు రక్త శాంపిల్స్ సేకరించే ట్యూబ్స్ కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రతిరోజూ ఆస్పత్రిలో అన్నిరకాల విభాగాల్లో చికిత్స కోసం వచ్చే రోగుల రక్త నమూనాలు సేకరించడానికి వందల సంఖ్యలో మూడురకాల ట్యూబ్లు అవసరమవుతాయి. ఓపీలో వైద్యుడు పరీక్షించిన తర్వాత రక్త పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత రోగులు శాంపిల్స్ ఇవ్వడానికి శాంపిల్స్ సేకరించే గదికి వెళ్తారు. అక్కడ సరిపడా ట్యూబ్లు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఆస్పత్రికి అరకొర సరఫరా చేస్తున్న క్రమంలో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక ప్రధానంగా రోగులకు ఇంజక్షన్స్ వేయడానికి ఉపయోగించే సిరంజ్ల కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఇంజక్షన్స్ ఇచ్చే గదిలో ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే రోగులకు పలురకాల ఇంజక్షన్స్తోపాటు టీటీ, డాగ్బైట్, ఇతర ఇంజక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాయిల్స్లో ఉండే డ్రగ్ను సిరంజ్ ద్వారా నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో 1సీసీ, 2సీసీ, 5సీసీ, 10సీసీ సిరంజ్లు అవసరం కాగా ప్రస్తుతం 2సీసీ సిరంజ్లు రోజు ఒక బాక్స్ మాత్రమే ఇస్తున్నారు. 5సీసీ సిరంజ్లు లేకపోవడంతో ఇతర మార్గాల్లో సిస్టర్స్ సర్దుబాటు చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో వచ్చే రోగులకు ఇవ్వాల్సిన ప్యాంటప్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాను వివరణ కోరగా పైనుంచి రావాల్సిన ఇండింట్ కొంత మేర కొరత ఉండడంతో స్థానికంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నాం. ఓపీ అధికంగా ఉన్నరోజు ఇబ్బంది అవుతుంది.. ఇంకా ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాట్లాడుతున్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీసిందని.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమైందని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలకుల సమయం ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూర్ఖత్వం అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పి పవర్లూమ్స్పై ఆగమేఘాల మీద చీరలు తయారు చేయించడం సరికాదన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలైన మహిళలకు రూ.2,500, ఆసరా పింఛన్ రూ.4 వేలకు పెంపు, నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు అందించలేదని విమర్శించారు. కొడంగల్, నారాయణపేటను జంట నగరాల మాదిరి అభివృద్ధి చేస్తానన్న మాటను తుంగలో తొక్కి తన నియోజకవర్గంలో శరవేగంగా పనులు చేసుకుంటున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉందని.. కాగితాలపై పనుల మంజూరు ప్రకటనలే తప్ప అమలుకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన మాదిరే రేవంత్ తన వరకే పనులు చేసుకోవడం సరికాదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పట్టణంలో ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మరోచోటకు తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొత్త మండలాల ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, నాయకులు శ్రీనివాస్, రఘురామయ్యగౌడ్, తిరుపతిరెడ్డి, లక్ష్మి, బలరాంరెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలిమహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
మాగనూర్: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గుడి శంకర్(19) మాగనూర్కు చెందిన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు సమాచారం మేరకు సంఘటనా చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సొదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉద్యోగం రావడం లేదని వివాహిత ఆత్మహత్య నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ గోవర్దన్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని రాఘవేంద్రకాలనీకి చెందిన నాగరాజు, శశికళ (33)లకు ఏడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. నాగరాజు జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుండగా.. శశికళ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త నాగరాజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి శశికళ ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు కూతుళ్లతో తల్లి అదృశ్యం నవాబుపేట: భర్తతో తరుచు గొడవ పడుతూ తన పుట్టింటికి వచ్చి ఇక్కడే కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్న మహిళ తన ఇద్దరు కవల పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెల్లిపోయింది. దీంతో ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె దేవమ్మ కూతురు జ్యోతిని 9 ఏళ్ల క్రితం కోయిల్కొండ మండలం కానాయపల్లికి చెందిన వడ్డె చెన్నయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వారికి మొదటి సంతానం ఆడబిడ్డ కాగా, రెండో సంతానంలో ఇద్దరు (కవలలు)ఆడ పిల్లలు జన్మించారు. మొత్తం ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వచ్చింది. ఇక్కడే కూలీ పని చేస్తూ కాలం గడుపుతోంది. ఈనెల 22న శనివారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ఇద్దరు కవలలు సింధు, అనుష(7 ఏళ్లు) ను తీసుకుని ఇంట్లో నుంచి వెల్లిపోయింది. వారి కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తల్లి తల్లి దేవమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. పోక్సో కేసులో వ్యక్తి రిమాండ్ గద్వాల క్రైం: బాలికతో అసభభ్యంగా వ్యవహరించి, అత్యాచారయత్నం పాల్పడిన సంఘటనలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. గద్వాల మండలానికి చెందిన మహేష్గౌడు మైనర్ బాలికతో చనువుగా ఉంటు పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడాడ్డు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో అసభ్యంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించడన్నారు. నిందితుడిని అలంపూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ శ్రీను తెలిపారు. మైనర్ బాలిక పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జూరాలకు 6వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 6వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. ఎగువన ఒక యూనిట్లో 39 మెగావాట్ల ద్వారా 509.961 ఎం.యూ., దిగువన ఒక యూనిట్లో 40 మెగావాట్ల ద్వారా 502.637 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ, దిగువ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 1012.598 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో 9.480 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 6,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
టిప్పర్ ప్రమాదంలో కూలీ..
బిజినేపల్లి: మండలంలోని మిట్యాతండా గ్రామ పంచాయతీ భీమునితండా సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద టిప్పర్ ఢీకొని వట్టెం గ్రామానికి చెందిన పద్మ బాలయ్య (40) అనే కూలీ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన బాలయ్య అనే కూలీ భీమునితండాలో నిర్మిస్తున్న వంతెన పనులకు కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో కంకర లోడ్తో ఉన్న టిప్పర్ వెనకకు వెళ్తునప్పుడు బాలయ్య, మరో వ్యక్తి ప్రమాదశావత్తు దాని కింద పడ్డారు. గాయపడిన ఇద్దరిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా బాలయ్య మరణించగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సోమవారం బిజినేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
థర్డ్క్లాస్ ప్రచారం సరికాదు
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి: డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలను విశ్వసించి థర్డ్క్లాస్ ప్రచారం చేయటం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కూతురుగా విచక్షణతో మాట్లాడుతారనే భావనను కవిత పొగొట్టారన్నారు. పెబ్బేరు సంత విషయంలో పూజారులకు ఇచ్చిన స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. పలుమార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసీఆర్ సాన్నిత్యాన్ని, గులాబీ జెండాను, ఉద్యమబాటను వదిలిపెట్టలేదన్నారు. వనపర్తిలో 32 మంది బీసీలపై కేసులు చేయించామనే ఆరోపణలు, కబ్జాలు చేసినట్లు గానీ, మీ వెనక ఉన్న కాంగ్రెస్ నాయకుల సహకారంతో నిరూపించి చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. పెబ్బేరు సంతస్థలంపై గత సాధారణ ఎన్నికల సమయంలో కొందరు అవగాహన లేని నాతో పని చేసి బయటకు వెళ్లిన వారు చేసిన ఆరోపణలను ఇప్పటి వరకు నిరూపించలేదన్నారు. నీళ్ల నిరంజన్రెడ్డి అనే పేరును నేనుగా పెట్టుకోలేదదని, ప్రజలిచ్చారని చెప్పారు. పాత చెరువులకు గండ్ల కొడితే.. రెండు బ్రాంచ్ కెనాల్స్ రేవంత్రెడ్డి పాలనలో నిర్మాణం చేశారా అని ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్న కవిత ఎంతో పరిపక్వత చెందిన నాయకుడి కూతురుగా.. ఆయన సూచనల మేరకు రాజకీయంలోకి వచ్చిన ఆమె ఇలాంటి అవగాహనరాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఊహించలేదన్నారు. నీకు లిక్కర్ రాణి అనే పేరు ఎలా ప్రజలు ఇచ్చారో.. నాకు నీళ్ల నిరంజన్రెడ్డి అని రైతులు పేరు పెట్టారన్నారు. ఇప్పటి వరకు కవితకు దందాలే తెలుసనుకున్నానని, పుచ్చలు లేచిపోతాయని బెదిరింపులు చేస్తే.. దందాలతో పాటు దాదాగిరీ కూడా నేర్చుకున్నారని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కూతురనే కారణంగా ఆయన్ను బాధపెట్టొద్దని మా కార్యకర్తలెవ్వరిని మాట్లాడనివ్వటం లేదన్నారు. లేదంటే.. సోషల్ మీడియాలో దుర్బాషలాడి పోస్టులు పెట్టించడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయటం మేమూ చేయగలమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయదవ్, పాల్గొన్నారు. -
ఇక సమరమే..
సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితా నుంచి బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది నియామకం వరకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతోపాటు తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావడమే మిగిలి ఉంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన విడుదల అవుతుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముగిసిన కసరత్తు.. పంచాయతీ ఎన్నికలను డిసెంబర్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్ల కసరత్తు పూర్తిచేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. అలాగే ఆదివారం నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇప్పటికే పలు విడతల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. పావులు కదుపుతున్న పార్టీలు.. పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. గ్రామాల వారీగా తేలిన రిజర్వేషన్ల లెక్కలకు అనుగుణంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించగా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనలో వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండ్రోజుల్లో నోటిఫికేషన్.. పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు పెండింగ్లో ఉండటంతో వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. మంగళవారం వెలువడే తీర్పు తర్వాత రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఆశావహుల సందడి పెరిగింది. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం తుది ఓటర్ల జాబితా ప్రకటించిన అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు -
ఉద్యోగ భద్రత ఉండదు..
2014 కంటే ముందు నుంచి చాలామంది విధులు నిర్వహిస్తున్నారు. వారిని నేరుగా యూనివర్సిటీ నియమించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీఓలో నేరుగా ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్లు ఉంది. కనీసం సిబ్బందికి చెప్పకుండా ఔట్సోర్సింగ్కు ఇస్తే ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. కాంట్రాక్టు విధానం లేదా నేరుగా యూనివర్సిటీ కింద కొనసాగిస్తూ జీఓ ప్రకారం వేతనాలు ఇస్తే చాలు. – రామ్మోహన్, పీయూ నాన్టీచింగ్ సంఘం అధ్యక్షుడు ఈ అంశాన్ని పరిశీలిస్తాం.. పీయూలో నాన్టీచింగ్ సిబ్బంది ఔట్సోర్సింగ్ అంశాన్ని పరిశీలిస్తాం. వారు వినతిపత్రం ఇస్తే దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ ● -
నాన్ టీచింగ్ సిబ్బంది ఔట్ సోర్సింగ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు సిబ్బంది మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంగేజ్ చేస్తున్నట్లు జీఓ 1626ను ఈనెల 15న జారీ చేసింది. అయితే ఈ జీఓను నాన్టీచింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న వారు ఉండగా.. మరికొంతమంది 2014 కంటే ముందు విధుల్లో చేరి జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వకపోయినా నేరుగా యూనివర్సిటీ కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాన్ టీచింగ్ సిబ్బంది రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో పనిచేసిన పలువురు వైస్ చాన్స్లర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తే 21 రోజులపాటు ధర్నా చేపట్టి.. ఆ విధానంలోకి వెళ్లలేదని పీయూ రిజిస్ట్రార్కు తెగేసి చెప్పారు. జీఓలో ఔట్సోర్సింగ్ విధానం అని చెప్పి ఏ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానో వేతనాలు ఇవ్వకూడదని, నేరుగా యూనివర్సిటీ లేదా, ట్రెజరీ నుంచి ఇవ్వాలని కోరారు. ఆ విధానంతో నష్టం.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందని నాన్టీచింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు యూనివర్సిటీ కింద తాత్కాలిక సిబ్బంది లేదా అడ్హక్ పద్ధతిలో పనిచేస్తూ వచ్చిన సిబ్బందిని ఇప్పుడు నేరుగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు సమస్య వస్తే నేరుగా యూనివర్సిటీ అధికారులను చెప్పుకొనేందుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తే ఏజెన్సీ కాంట్రాక్టర్ చెప్పినట్లు వినాల్సి వస్తుందని సిబ్బంది భయపడుతున్నారు. జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చినప్పటికీ ఈఎస్ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ, ఏజెన్సీ కమీషన్ వంటివి వేతనాల్లో కోత విధించి అరకొర వేతనాలు మాత్రమే చేతిలో పెడతారని, అందుకు తాము ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతున్నారు. 2014 తర్వాత పలువురు సిబ్బందిని అవసరం మేరకు గతంలో తీసుకున్న అధికారులు నేరుగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. అయితే 2014 కంటే ముందు విధుల్లో చేరిన వారు సుమారు 75 మందికిపైగా ఉన్నారని వారిని నేరుగా కాంట్రాక్టు విధానంలో తీసుకోవాలని నాన్టీచింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కేటగిరీల వారీగా విభజన.. జీఓ 1626 ప్రకారం మొత్తం 512 మంది సిబ్బందిని ఎంగేజ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 38, సెల్ప్ ఫైనాన్స్ ద్వారా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 24, అకాడమిక్ కన్సల్టెంట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ 34 ఉన్నారు. పార్ట్ టైం ద్వారా మరో 66 మంది పనిచేస్తున్నారు. వీరికి వేతనాలను జీఓ 60, 11 ప్రకారం చెల్లిస్తున్నారు. అలాగే ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారు మొత్తం 350 మంది ఉన్నారు. రూ.19,500 వేతనం స్లాబ్లో వంద మంది, రూ.15,500 వేతనం స్లాబ్లో 236 మంది, రూ.22,750 వేతనం స్లాబ్లో 14 మంది ఉన్నారు. పీయూలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి బదలాయింపునకు చర్యలు వచ్చే ఏడాది మార్చి వరకు ఎంగేజ్ చేస్తూ జీఓ జారీ తమను సంప్రదించకుండా ఎలా విలీనం చేస్తారని సిబ్బంది ఆవేదన అన్యాయం చేయొద్దని పీయూ రిజిస్ట్రార్కు వేడుకోలు -
కార్మిక భద్రతపై అవగాహన కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీ టింగ్ హాల్లో కార్మిక సంక్షేమ బోర్డు– సామాజిక భద్రత పథకాలపై అవగాహన కల్పించే వాల్పోస్టర్ విడుదల చేశారు. జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షే మ బోర్డు (టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) తరపున 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన సంక్షేమ పథకాలు, ప్రమాద మరణ సహా యం రూ.10 లక్షలు, సహజ మరణ సహాయం రూ.2 లక్షలు, వైకల్య సహాయం రూ.5 లక్షల వర కు, పెళ్లి కానుక రూ.30 వేలు, ప్రసూతి సహాయం రూ.30 వేలు, హాస్పిటలైజేషన్ రిలీఫ్ రోజుకు రూ.300, నమోదు లేని కార్మికుల మరణాలకు ప్రత్యేక సహాయం రూ.50 వేలు ఉన్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక భద్రతా పథకాలపై అవగాహన సదస్సు లు 10 రోజుల పాటు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, సహాయ కార్మిక కమిషనర్ ఎండీ అల్తాఫ్ పాల్గొన్నారు.


