breaking news
Mahabubnagar District Latest News
-
భర్తను కొట్టి చంపిన భార్య
కొత్తకోట రూరల్: తాగొచ్చి వేస్తున్నాడంటూ కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్లలో చోటు చేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మణిగిళ్ల కోటయ్య (55) అమ్మపల్లికి చెందిన శ్రీనివాస్రెడ్డి వద్ద పశువుల కాపరిగా పని చేస్తుండేవాడు. కోటయ్యకు భార్య అలివేలమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కోటయ్య రోజు అమ్మపల్లికి వెళ్లి పశువులు కాసి తిరిగి రాత్రి ఇంటి వచ్చేవాడు. నాలుగు రోజులుగా పనికి వెళ్లకుండా గ్రామంలోనే ఉంటూ తాగొచ్చి డబ్బుల విషయమై భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తాగి వచ్చి భార్యతో గొడవ పడగా ఆగ్రహానికి గురై కర్రతో కోటయ్య తలపై మోదడంతో కిందపడ్డాడు. అంతటితో ఆగకుండా తలను పట్టుకొని గోడకు బాధడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటికొచ్చిన చిన్న కుమారుడు రమేశ్ రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి భయాందోళనకు గురై బంధువులు, గ్రామస్తులు, మేనత్త రాములమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దమందడి ఎస్ఐ శివకుమార్ వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కోటయ్య చెల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం గ్రామంలో విచారణ చేపట్టి భార్య అలివేలమ్మను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్టు సీఐ రాంబాబు, ఎస్ఐ వివరించారు. రిమాండ్కు తరలించిన పోలీసులు -
ఎలుగుబంటి దాడిలో తోకల మల్లయ్య మృతి
మన్ననూర్: అప్పాపూర్ గ్రామానికి చెందిన తోకల మల్లయ్య కొన్ని రోజుల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో అదృశ్యమైన ఘటన తెలిసిందే. 12 రోజులుగా మల్లయ్య బంధువులు ఆయన జాడ కోసం వెతుకుతున్న క్రమంలో గ్రామానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో గురువారం ఓ చెట్టు కింద కుళ్లిపోయిన శవాన్ని వారు గుర్తించారు. ఈ క్రమంలో మృతుడి భార్య తోకల లింగమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి లింగాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో లింగాల ఎస్ఐ వెంకటేష్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు, వైద్యులు, అటవీశాఖ సిబ్బంది శుక్రవారం ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎలుగుబంటి దాడి చేయడంతోనే మల్లయ్య మృతి చెంది ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మృతికి సంబంధించిన విషయాలు నిర్ధారణ అవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. -
ఆర్టీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ తనిఖీ
పాలమూరు: ఆర్టీఏ కార్యాలయంలో వరుస తనిఖీలతో ఉన్నతాధికారుల హల్చల్ చేస్తున్నారు.. ఇటీవల కలెక్టర్ విజయేందిర ఆకస్మిక తనిఖీ చేయగా.. కొన్ని రోజుల వ్యవధిలోనే తాజాగా శుక్రవారం మధ్యాహ్నం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సైతం సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఆర్టీఏ కార్యాలయంలో నేరుగా వెళ్లిన వాహనదారుల పనులు కాకుండా ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారి ఫైల్స్ త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతోపాటు లైసెన్స్ల జారీలో అవినీతి జరుగుతుందని సమాచారంతో అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. మొదట ఆఫీస్లోని సెక్షన్ విభాగానికి వెళ్లిన వెంటనే ఆఫీస్ డోర్లు మూసివేసి.. లోపల ప్రైవేట్ వ్యక్తులు (ఏజెంట్లు) ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. ఆ తర్వాత ఏఓ దగ్గర ఫైల్స్ పరిశీలించి క్యూలైన్లో ఉన్న వాహనదారులతో మాట్లాడారు. అలాగే డీబీఐ గదిలోకి వెళ్లి లైసెన్స్ల జారీ ఎలా జరుగుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైసెన్స్లు ఫ్రింట్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం నూతన వాహనాలకు చెస్ నంబర్ తీయడం, డ్రైవింగ్ టెస్ట్ విధానాలను చూశారు. లైసెన్స్ జారీ విషయంలో గతంలో పోస్టాఫీస్ ద్వారా ఇవ్వకుండా కార్యాలయానికి వచ్చిన వాహనదారుడికి నేరుగా ఇవ్వడానికి కొంత అదనంగా నగదు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఏజెంట్లు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఒక్కో ఫైల్కు వాహనదారుల దగ్గర రెండింతల నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
జనాభా కట్టడిలో యువత పాత్ర కీలకం
పాలమూరు: పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మజ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాత వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కు.ని., ఇతర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న కుటుంబాలు ఉంటే పిల్లల పోషణ సక్రమంగా ఉంటుందన్నారు. జనాభా నియంత్రణకు శాశ్వత పద్ధతులైన ట్యూబెక్టమీ, వేసెక్టమీ ద్వారా ఆపరేషన్లు చేయించుకుని చాలా వరకు నియంత్రణ చేయడం జరిగిందని, దీనిని మరింత తగ్గించాలన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 140కోట్లపైనే ఉందని, కొన్ని రోజుల తర్వాత చైనాను మించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందనుందన్నారు. జనాభాను తగ్గించడంలో యువత పాత్ర చాలా కీలకమని చెప్పారు. అనంతరం జనాభా పెరగడం వల్ల వచ్చే సమస్యలపై నర్సింగ్ విద్యార్థులు నాటక ప్రదర్శన చేసి చూపించారు. అలాగే ఒక్క సంతానంతో ఆపరేషన్ చేసుకున్న దంపతులు, అంతర ఇంజెక్షన్లు వాడిన దంపతులకు రూ.వెయ్యి పారితోషికం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లికార్జున్, డెమో మంజుల తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ అవార్డుల అందజేత ఈ ఏడాది ఉత్తమ పనితీరు కనబరిచిన వైద్యాధికారులు, సిబ్బందికి అవార్డులు అందించారు. ఉత్తమ సర్జన్గా భాస్కర్నాయక్, ఉత్తమ మెడికల్ ఆఫీసర్లుగా చంద్రశేఖర్ (గండేడ్), మనుప్రియ (జడ్చర్ల), శ్రావణ్కుమార్ (నవాబ్పేట), ఉత్తమ స్టాఫ్ నర్సులుగా స్వాతి (భూత్పూర్), జయమ్మ (దేవరకద్ర), ఉత్తమ సూపర్వైజర్లుగా ప్రసన్న, రామనాథ్, ఉత్తమ ఎంపీహెచ్ఏలు నిర్మల, శైలజ, వహీద్, దేవయ్య, ఉత్తమ ఆశలుగా సుల్తానా, యాదమ్మ, మైబమ్మలకు అందించారు. -
పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు
పాలమూరు: జిల్లాకేంద్రంలోని బాలసదన్లో ఆశ్రయంలో పొందుతున్న పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలో ఉన్న బాల సదన్ను శుక్రవారం న్యాయమూర్తి ఆకస్మికంగా సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు. స్థానికంగా పనిచేసే సిబ్బంది పిల్లల ఆరోగ్యంపై ఏదైనా తేడాలు గమనిస్తే వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందించేలా చూడాలన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉంటేనే వారి భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, ఆర్బీఎస్కే వైద్యులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సూపరింటెండెంట్ పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి తాత్కాలిక సూపరింటెండెంట్గా అనస్తీషియా హెచ్ఓడీ మాధవి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ బదిలీ తర్వాత ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో తాత్కాలికంగా డాక్టర్ మాధవి సూపరింటెండెంట్గా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్మేళాను మ్యాజిక్ బస్ టెక్ మహేంద్ర, ముతూట్ ఫైనాన్స్, వైసీస్ క్లౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేళాలో మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొనగా.. 50 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పద్మాఅనురాధ, అమీనా ముంతాజ్, శ్రీదేవి, హరిబాబు, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. విధులపై నిర్లక్ష్యం వహించొద్దు : డీఈఓ చిన్నచింతకుంట: ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఈఓ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తర గతి గదులు, మంచినీటి వసతి, ఉపాధ్యాయు ల బోధన, విద్యార్థుల సామర్థ్యం తదితర వా టిని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యూట్రీన్ గార్డెన్ పరిశీలించి మొక్కలు నాటి.. విద్యార్థులకు అందజేశారు. -
వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
● ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బందిమెరుగైన సేవలు అందించాలి ● ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు ● కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి ● మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్/ కల్వకుర్తి/ కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం ప్రారంభం, జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవనం శంకుస్థాపన, వెల్దండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ నుంచి మున్ననూర్ వరకు ప్రధాన రహదారికి మరికొన్ని రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తన చారిటీ ట్రస్టు ద్వారా కృషిచేస్తానన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్కడుంది..’? సాక్షి, నాగర్కర్నూల్: ‘బీఆర్ఎస్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ప్రభుత్వంపై ప్రతీ విషయంలో పోస్టులతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అందుకు ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదు. మనమూ అదేస్థాయిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నాం.’ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు ఎలక్ట్రిక్ బస్సులు : మంత్రి జూపల్లి రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలు మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రిక్ బస్సును ఏర్పాటు చేస్తానన్నారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువవద్దని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. వైద్య విద్యార్థుల కల నేటితో నెరవేరిందన్నారు. వైద్యులు రోగులకు మందులతో పాటు రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియపరచాలని సూచించారు. -
మెరిట్ కమ్ సీనియారిటీతో ఉద్యోగులకు అన్యాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మెరిట్ కమ్ సినియారిటీ విధానాన్ని విద్యుత్ సంస్థలో ప్రవేశపెట్టడంతో విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాంమనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక నేషనల్ ఫంక్షన్ హాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ఎత్తివేయాలని యాజమాన్యం చూస్తుందని, దాని అడ్డుకునేందుకు విద్యుత్ ఉద్యోగులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యనిర్వహక అధ్యక్షుడు చంద్రయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో మన అసోసియేషన్ పోరాటం ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి రద్దయి వారిని ఆర్టిజన్ ఉద్యోగులుగా తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ అసోసియేషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి బీచుపల్లి, రిజినల్ కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర అడిషనల్ ప్రధాన కార్యదర్శి సోమ్లానాయక్, అసోసియేషన్ కంపెనీ అధ్యక్షుడు ఆనంద్బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్సింహ, ఉపాధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను మళ్లీ మోసం చేసిన కాంగ్రెస్
స్టేషన్ మహబూబ్నగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, అందుకే మొదటి నుంచి కులగణనలో కూడా శాసీ్త్రయతను పాటించకుండా ఎన్నికల నిర్వహణపై దాటవేత ధోరణిని అవలంభిస్తుందన్నారు. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ, మండలిలో బిల్లు ఆమోదం పొందగానే గవర్నర్తో ఆమోదింపజేసుకొని గెజిట్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించేదన్నారు. కానీ, ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి కోర్టుల్లో వీగిపోయేలా చేసే కుట్రకు మరోసారి తెరలేపిందన్నారు. బీసీ సంక్షేమం, రాజకీయ, విద్య, ఉద్యోగ ప్రయోజనాలను పరిరక్షించాలంటే 9వ షెడ్యూల్ మాత్రమే శరణ్యమన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను ఆకర్శించేందుకు తాత్కాలికంగా తీసుకొచ్చే ఈ విధమైన ఆర్డినెన్స్ కోర్టులో నిలబడవని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేయాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేని పక్షంలో గతంలో అధికారంలోకి రావడానికి బీసీలు ఏ విధంగా కృషి చేశారో ఇప్పుడు దూరం చేయడానికి అలాగే బీసీ సమాజం మొత్తం ముందుకు వెళ్తుందన్నారు. సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు లక్ష్మీకాంత్, కృష్ణ, బుగ్గన్న, మహేందర్, ఆశన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడి బలవన్మరణం
కోడేరు: పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘ టన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం మేరకు.. మండలంలోని మాచుపల్లికి చెందిన గొల్ల పల్లి శేషయ్య (55) కుటుంబ కలహాలతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గుర్తించి వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందా డు. శేషయ్యకు భార్య, కుమారులు ఉన్నారు. రెండు భైక్లు ఢీకొని వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: రెండు బైక్లు ఎదురెరుదుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్ఐ ఆనందర్ కథనం ప్రకారం.. మండలంలోని రామనంతాపూర్కు చెందిన ఎన్.రాంచంద్రయ్య(55) శుక్రవారం ఉదయం గ్రామసమీపంలోని వ్యవసాయ పొలానికి బైక్పై వెళ్తుండగా శంకరమ్మపేటకు చెందిన వ్యక్తి పల్సర్పై ఎదురుగా వస్తూ రాంచంద్రయ్య బైక్ను బలంగా ఢీకొనడంతో కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా రాంచంద్రయ్యను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్లోని ఎస్వీఎస్కు రెఫర్ చేశారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. భార్య చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ● భర్త దుర్మరణం మరికల్: పెళ్లయిన రెండు నెలలకే యువకుడిని మృత్యువు వెంటాడింది. ఆషాఢమాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను చూసేందుకు భర్త ద్విచక్ర వాహనంపై అత్తగారింటికి వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మరికల్ మండలం తీలేరు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలంలోని నార్లోనికుంట్లకు చెందిన శివకుమార్ (25)కు జక్లేర్ పరిధిలోని కాచ్వార్కు చెందిన అమ్మాయితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను చూసేందుకు కాచ్వార్కు వెళ్తుండగా తీలేరు సమీపంలో కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివాహం అయిన రెండు నెలలకే భర్తను కోల్పోయిన భార్య, చేతికొచ్చిన కొడుకును అకాల మరణం కబళించడంతో తల్లిదండ్రులు వాపోతున్నారు. వివాహిత బలవన్మరణం ఆత్మకూర్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం.. ఆత్మకూర్లోని బాలకిష్టమ్మ కాలనీలో నివాసం ఉంటున్న రామేశ్వరమ్మ(36) భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే గురువారం అర్ధరాత్రి రామేశ్వరమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు చుట్టు పక్కలవారికి సమాచారం ఇవ్వడంతో రామేశ్వరమ్మను కిందికి దించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందిందని ధ్రువీకరించారు. ఈ ఘటనపై శుక్రవారం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో దివ్యాంగుడి ఆత్మహత్య కొత్తకోట రూరల్: డబ్బులు ఇవ్వాలంటూ వేధించడంతోపాటు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఆనంద్ కథనం ప్రకారం.. మండలంలోని విలియంకొండకు చెందిన దివ్యాంగుడు బొల్లి ఆంజనేయులు(35)కు భార్య సరోజతోపాటు ముగ్గురు సంతానం. గ్రామంలో చిన్నపాటి కిరాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆంజనేయులు చిన్నాన్న కుమారుడు బొల్లి వంశీ తాగివచ్చి కిరాణం దగ్గర ఉద్దెరకు సరుకులు, అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేసేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి వంశీని మందలించారు. ఈనెల 10న రాత్రి షాపు ద గ్గరకు వచ్చిన వంశీ మరోమారు గొడవ పడి దూషిస్తూ.. దాడి చేశాడు. మనస్తాపానికి గురై న ఆంజనేయులు రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు భార్య సరోజ ఫిర్యాదు మేరకు వంశీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫేషియల్ రికగ్నిషన్తో హాజరు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును ఇకపై ప్రతిరోజు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ ద్వారా విద్యార్థుల హాజరు విధిగా నమోదు చేయాలన్నారు. ఇందులో మొబైల్ నెట్వర్క్ రాకున్నా విద్యార్థుల హాజరును నమోదు చేయవచ్చని, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డేటా అప్లోడ్ అవుతుందని చెప్పారు. స్కూల్లో అటెండెన్స్ నమోదు చేయడం హెచ్ఎం బాధ్యత అని, ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత విద్యా శాఖాధికారి అధికారారులను సంప్రదించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు వచ్చాయా అని హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కంప్యూటర్లు పనిచేసేలా చూడాలని, విద్యుత్ సరఫరా లేనిచోట పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు అక్షరమాల, గుణింతాలు, వర్ణమాల నేర్పించాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు సరిపడా పుస్తకాలు వచ్చాయా అని ఆరాతీశారు. కళాశాలల్లో మరమ్మతు కోసం డబ్బులు మంజూరయ్యాయని, అవసరమైన చోట వెంటనే చేపట్టాలని సూచించారు. కేజీబీవీలు, రెసిడెన్సియల్ పాఠశాలలు, కాలేజీలకు హెల్త్ చెకప్ ఆర్బీఎస్కే ద్వారా ఎన్ని చోట్ల చేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి టీచర్లు నేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్కుమార్, ఆయా శాఖల సంక్షేమాధికారులు శంకరాచారి, ఇందిర, సునీత, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైనవైద్యసేవలు అందించాలి దేవరకద్ర: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని ఆరా తీశారు. గర్భిణులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీనుగోనిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న విజయమ్మ ఇంటికి కలెక్టర్ వెళ్లారు. ఇల్లు అందంగా నిర్మించుకున్నావని విజయమ్మను అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల, డోకూరు సమీపంలోని కేజీబీవీని తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మీనుగోనిపల్లి శివారులో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి.. సర్వే నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులున్నారు. -
హద్దులను తేల్చాలి..
రెవెన్యూ, ఫారెస్టు భూముల హద్దుల సమస్యతో సరిహద్దు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు లావుణి పట్టాలు ఇచ్చినా భూములు దున్ననివ్వడంలేదు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గతంలో ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా భూముల్లో కందకాలు తీయడం తగదు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను తేల్చాలి. – నాగన్న, వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కలెక్టర్ ఆదేశించారు.. రెవెన్యూ, అటవీ భూముల సమస్యపై కొందరు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి ఏదో ఓ పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ సర్వే నిర్వహించి పరిష్కారం చూపేందుకు అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే ల్యాండ్ అధికారుల ద్వారా సర్వే చేపట్టేందుకు త్వరలో చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, జిల్లా అటవీ శాఖాధికారి ● -
నిండుగా.. జూరాల
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 1.09 లక్షలకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్గేట్లు ఎత్తి 67,310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 30,316 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 460, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 800, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.778 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 108.948 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 129.466 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద.. రాజోళి: సుంకేసుల జలాశయానికి శుక్రవారం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 49,800 క్యూసెక్కుల వరద చేరినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 13 గేట్లను తెరిచి 51,402 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి వదిలినట్లు పేర్కొన్నారు. 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
ప్రతిపాదించారు.. పట్టించుకోరు!
బస్టాండ్ సమీపంలో రద్దీగా ఉన్న 167వ నంబరు జాతీయ రహదారి 2022లో ప్రతిపాదనలు పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జాతీయ రహదారుల శాఖ 2022లో మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తిల్లో మొత్తం 8 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపంలో ఒకటి, కల్వకుర్తి రోడ్డులో డిగ్రీ కళాశాల వద్ద మరోటి నిర్మించాలని మట్టి నమూనాలు సైతం సేకరించారు. ఈ మేరకు అప్పటి ఏఈఈ వినోద్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమీషనర్ సునీత స్థల పరిశీలన చేసి ఆమోదించారు. కొత్తబస్టాండ్ వద్ద రూ.3.50కోట్లు, డిగ్రీ కళాశాల వద్ద రూ.2కోట్లతో వీటిని నిర్మించాలని ఉన్నప్పటికి ఆ ప్రతిపాదనలు పూర్తిగా అటకెక్కాయి. మూడేళ్లయినా వాటి ఊసేలేకుండా పోయింది. ఇప్పుడున్న జాతీయ రహదారి శాఖ అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జ్పై పెదవి విరుస్తున్నారు.బాదేపల్లి పట్టణం సిగ్నల్గడ్డ హైస్కూల్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు నడుస్తున్నందున అవి పూర్తయ్యాక నిర్మాణం చేయాలని లేదంటే విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1000మందికిపైగా విద్యార్థులున్న హైస్కూల్ సాయంత్రం వేళలో రద్దీ ఏర్పడి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అటు బస్టాండ్, ఇటు హైస్కూల్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేయాల్సి ఉంది. జడ్చర్ల టౌన్: పెరుగుతున్న వాహన రద్దీ.. రోడ్డు దాటేందుకు పాదాచారుల ఇబ్బందులు.. రోడ్డుప్రమాదాలు నివారించడానికి 167 జాతీయ రహదారిపై ఫుట్ఓవర్ వంతెనల నిర్మాణాలు జాతీయ రహదారుల శాఖ ప్రతిపాదించింది. 2022లో జడ్చర్ల మున్సిపాలిటీలో రెండు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి రూ.5.50కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేసింది. నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ● దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల మున్సిపాలిటీ గుండా 44, 167 రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అయితే 167వ నెంబరు జాతీయ రహదారి మున్సిపాలిటీ పరిధి ప్రారంభం నక్కలబండతండా నుంచి గంగాపురం శివారు వరకు సుమారు 4కి.మీ మేర పట్టణంలోంచి వెళ్తుంది. దీంతో రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. 167 నెంబరు జాతీయ రహదారి కర్ణాటక రాష్ట్రంలో మొదలై ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చి జడ్చర్ల గుండా నల్గొండ వయా కోదాడ వరకు వెళ్తుంది. మరోవైపు ఇటు కొడంగల్ వైపు కూడా 167 జాతీయ రహదారి మహబూబ్నగర్కు కలవడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలు కోదాడకు ఇదే రోడ్డుగుండా వెళ్తుంటాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. వీటితోపాటు అటు హైదరాబాద్, ఇటు కర్నూలు, మరోవైపు నాగర్కర్నూలు, వనపర్తి నుంచి వచ్చే వాహనాల సంగతి సరేసరి. పోలేపల్లి ఫార్మసెజ్ కారణంగా నిత్యం వేలసంఖ్యలో ఉద్యోగులు ఇదేమార్గాన వెళ్తుంటారు. ఈ కారణంగా 167వ నెంబరు జాతీయ రహదారి రోడ్డు దాటేందుకు పాదాచారులకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా హౌజింగ్బోర్డు కాలనీ నుంచి పోలీస్స్టేషన్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా నెలకొంటుంది. ఇక పట్టణంలో సిగ్నల్గడ్డ వద్ద రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు దాటాలంటే సమయం పడుతుంది. అంతగా వాహనాల రద్దీ పెరుగుతుంది. రోడ్డుదాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైస్కూల్ వద్ద నిర్మించాలన్న డిమాండ్లు 167వ జాతీయ రహదారిపై అటకెక్కిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం 2022మార్చిలో వంతెనల నిర్మాణానికి మట్టినమూనాల సేకరణ రూ.5.50కోట్లతో రెండు ఫుట్ఓవర్ బ్రిడ్జ్లకు ప్రతిపాదనలు ఇప్పుడు పెదవి విరుస్తున్న జాతీయ రహదారుల శాఖ -
నల్లమలలో తప్పిపోయిన.. తోకల మల్లయ్య మృతి
మన్ననూర్: నల్లమల అడవిలో 12 రోజుల క్రితం తప్పిపోయిన లోతట్టు ప్రాంతం అప్పాపూర్ గ్రామానికి చెందిన తోకల మల్లయ్య(64) మృతదేహం కనిపించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తోకల మల్లయ్య అటవీశాఖలో వాచర్ ఉద్యోగం చేసి గత మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. ఈ క్రమంలో స్వగ్రామం అప్పాపూర్లో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. అయితే 12 రోజుల క్రితం రెండు కుక్కలను వెంటపెట్టుకుని అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లాడు. కాగా.. అదేరోజు సాయంత్రం రెండు కుక్కలు ఇంటికి వచ్చినా మల్లయ్య మాత్రం రాలేదు. దీంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు, గ్రామ యువకులు అడవిలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే గురువారం మల్లయ్య మృతదేహం లభించినట్లుగా లింగాల పోలీస్స్టేషన్కు సమాచారం అందించినట్లు తెలిసింది. మల్లయ్యకు ఇద్దరు భార్యలు, 9 మంది పిల్లలు ఉన్నారు. ఈయన మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి కందనూలు: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం ఖిల్లాఘనపూర్కు చెందిన వెంకటమ్మ (65) కొడుకు బిజినేపల్లి మండల కేంద్రంలో మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తుండగా, ఆమె కొడుకు వద్ద ఉంటోంది. ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్లోని కూకట్పల్లి చెంచుగూడకు వెళ్లి తన కూతురు వద్దే ఉంటోంది. ఈనెల 7న చెంచుగూడలో ఓ కల్లు దుకాణంలో కల్లు తాగింది. దీంతో ఆమెకు వాంతులు, విరేచనాలు కావడంతో నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కల్తీకల్లు తాగడం వల్ల మృతి చెందినట్లు ఆమె కుమారుడు నాగరాజు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతోరైతు మృతి
ఖిల్లాఘనపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని సల్కెలాపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుడి భార్య లక్ష్మి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుళ్ల నాగయ్య(40) వ్యవసాయ పొలంలో బుధవారం రాత్రి వరి నారుమడికి నీళ్లు పెడుతుండగా మోటార్ వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కల్లు తాగి ‘ఖిల్లా’ వృద్ధురాలి మృతి ఖిల్లాఘనపురం: హైదరాబాద్లోని కూకట్పల్లి హైదర్నగర్ కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కు టుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన సింగనమోని వెంకటమ్మ(65) కుమార్తె అనసూయ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్బోర్డు ప్రాంతంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది. కుమారుడు నాగయ్య నాగర్కర్నూల్లో తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాడు. ఇటీవల కుమార్తెను చూడటానికి వెంకటమ్మ కూకట్పల్లికి వెళ్లింది. దీంతో కుమార్తె హైదర్నగర్ కల్లు దుకాణం నుంచి ఆది, సోమవారం రెండు రోజులు కల్లు తీసుకెళ్లి తల్లికి తాగించింది. మంగళవారం విరోచనాలు కావడంతో తగ్గుతుందిలే అనుకున్నారు. కానీ రాత్రి వరకు ఎక్కువ కావడంతో బుధవారం ఉదయం నేరుగా నాగర్కర్నూల్లో ఉంటున్న కుమారుడు నాగయ్య వద్దకు తీసుకొచ్చి, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంకల యువకుడు తిరుపతిలో మృతి రాజోళి: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన యువకుడు చాకలి వీరేష్(20) తిరుపతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సోములు, పద్మ దంపతుల రెండో కుమారుడు వీరేష్ మూడేళ్లుగా తిరుపతిలోని కంకర మిషన్కు ఆపరేటర్గా పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన మరికొందరు యువకులు కూడా అక్కడే పని చేసి వివాహం చేసుకొన్న తర్వాత గ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ వీరేష్ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం మృతుడి తల్లిదండ్రులకు తిరుపతి నుంచి ఫోన్ చేసి మీ కుమారుడు చనిపోగా.. మృతదేహం రైలు పట్టాలపై పడి ఉందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. కాగా తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఏం లేవని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బోరు మోటార్ వేయడానికి వెళ్లి.. చారకొండ: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ అంజయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటనారాయణగౌడ్(54) తన వ్యవసాయం పొలంలో బోరు మోటార్ వేయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
చిరుత సంచారంపై అప్రమత్తం
ప్రజలకు సూచనలు.. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో తిరగవద్దు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపడం, ఆటలు ఆడుకోవడం చేయవద్దు రైతులు పశువులను మేత కోసం, ప్రజలు ఎండు కట్టెల కోసం అడవిలోకి తీసుకెళ్లొద్దు. అటవీ ప్రాంత శివారులో మద్యం తాగడాన్ని పూర్తిగా నివారించాలి. అటవీ ప్రాంతంలో ఆహార అవశేషాలు, పశువుల మృతదేహాలు పడవేయవద్దు చిరుత ఎదురైతే భయపడకుండా, చేతులు పైకి ఎత్తి, నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి. అడవిలోకి, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలి. అరణ్య సమీప ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నివారించి.. మరుగుదొడ్లు వినియోగించండి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి. మహబూబ్నగర్ న్యూటౌన్: మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేట గుర్రం గట్టు ప్రాంతంలో చిరుత సంచారం, ప్రజలకు రక్షణ వంటి అంశాలపై గురువారం కలెక్టర్ విజయేందిర కలెక్టరేట్లో ఎస్పీ డి.జానకితోపాటు పోలీసు, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిరుత సంచరిస్తున్న ఏరియాలో సీసీ కెమెరాలు, బోన్ల ఏర్పాటు చేసినా చిరుత ఆచూకీ దొరకకపోవడంతో అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గుర్రం గట్టు చుట్టూ కంచె ఏర్పాటు చేసి విడతల వారిగా 24 గంటల పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వీరన్నపేట గుర్రంగట్టు చుట్టూ కలియదిరుగుతూ డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత సంచారంపై ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు, అటవీ శాఖలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుర్రంగట్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో తమ భద్రత కోసం తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, క్షేత్రాధికారి కమాలుద్దీన్, లక్ష్మీకాంత్రావు, నాగజ్యోతి, డీఆర్డీఓలు, బీట్ అధికారులు గుర్రంగట్టు ఏరియాలో చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని సందర్శించి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో.. వీరన్నపేట గుర్రంగట్టు ఏరియాలోపర్యటించిన అధికారులు రెండు బోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు డ్రోన్ కెమెరాతో సెర్చింగ్.. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలాలని కలెక్టర్ ఆదేశం -
నాగర్కడ్మూర్లో ఉద్రిక్తత
అదృశ్యమైన వివాహిత మృతి.. కోయంబత్తూర్లో రైల్వే ట్రాక్పై మృతదేహం భర్తే కొట్టి చంపారంటూ తల్లిదండ్రుల ఆరోపణ అమరచింత: వివాహిత మాధవి (26) మృతికి భర్త శివ కారణమంటూ బంధువులు భర్త ఇంటిపై దాడికి యత్నించిన ఘటన మండలంలోని నాగల్కడ్మూర్లో గురువారం చోటు చేసుకోగా ఉద్రిక్తతకు దారితీసింది. సీఐ శివకుమార్ ఇరువర్గాలను శాంతింపజేసి వివాదాన్ని సద్దుమణిగించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుర్వ శివకు గద్వాల జిల్లా కొండపల్లికి చెందిన మాధవితో మూడేళ్ల కిందట వివాహం జరగగా 11 నెలల కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేసేవారు. శివకు భార్యపై అనుమానం ఉండటంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కొనసాగాయి. అనుమానం అధికమై రెండు నెలల కిందట మాధవిని ఉద్యోగం మాన్పించాడు. ఆమె వద్ద ఉన్న సెల్నంబర్ను సైతం బ్లాక్ చేయడంతో ఇరువురు మధ్య గొడవలు అధికమయ్యాయి. ఆదివారం తొలి ఏకాదశి రోజున ఆలయానికి వెళ్దామని శివ భార్యకు చెప్పగా ఆమె నిరాకరించడంతో వదిలి వెళ్లారు. అదేరోజు మాధవి ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో హైదరాబాద్ పహడిషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట ఆమె మృతదేహం తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే ట్రాక్పై పడి ఉండటం.. అక్కడి రైల్వే పోలీసులు ఆధార్కార్డులో ఉన్న తండ్రి సెల్నంబర్ ఆధారంగా సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులతో పాటు భర్త శివ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గురువారం నాగల్కడ్మూర్కు తీసుకొచ్చారు. పోలీసుల సమన్వయంతో అంత్యక్రియలు.. తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారని మాధవి తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు శివ కుటుంబంపై దాడికి యత్నించగా సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో మదనాపురం, ఆత్మకూర్ ఎస్ఐలు, సిబ్బంది గ్రామానికి చేరుకొని వారితో మాట్లాడారు. వివాహ సమయంలో ఇచ్చిన 22 తులాల బంగారం, రూ.5 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తిరిగి ఇస్తామని నాగల్కడ్మూర్ గ్రామ పెద్దలు హామీ ఇవ్వడంతో శాంతించారు. అంతక్రియలు జరిగే వరకు పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
‘హరిహర వీరమల్లు’ను అడ్డుకుంటాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు వ్యతిరేకంగా పలు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పీయూ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరిస్తూ సినిమా తీయడం తెలంగాణ ఉద్యమ యోధులను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్సీయూ నాయకులు శివముదిరాజ్, బెక్కం జనార్ధన్, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్, తాయప్ప, వెంకటేష్, గాలెన్న, రామ్మోహన్, రవీందర్ పాల్గొన్నారు. -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల జలాశయానికి వరద కొనసాగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 1.07 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు ఎత్తి 79,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి కొనసాగుతుందని.. ఇందుకోసం 29,220 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 460, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.480 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. కోయిల్సాగర్కు జలకళ.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయంలో గురువారం సాయంత్రం 23.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయి నీటి మట్టం 26.6 అడుగులకు చేరుతుంది. సుంకేసుల జలాశయం.. రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గురువారం 49,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 13 గేట్లు ఎత్తి 51,883 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం 15 గేట్ల ద్వారా నీటి విడుదల జరగగా.. గురువారం స్వల్పంగా వరద తగ్గడంతో 13 గేట్ల నుంచి దిగువకు నీరు వదిలినట్లు పేర్కొన్నారు. 12 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
1,800 కేజీల నల్లబెల్లం పట్టివేత
కేటీదొడ్డి: అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని నందిన్నె చెక్పోస్టు వద్ద ఎకై ్సజ్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా రాయచూర్ నుంచి కొల్లాపూర్కు ఆటోలో తరలిస్తున్న 60 బ్యాగుల్లో (1800 కేజీలు) నల్లబెల్లాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ భరత్సింగ్, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. తనిఖీలో ఎకై ్సజ్ ఎస్ఐ లింగస్వామి, జగదీష్, శేఖర్నాయుడు, రాములు పాల్గొన్నారు. 1,200 కిలోలు.. కోయిల్కొండ: మండల కేంద్రంలో గురువారం 1,200 కిలోల నల్లబెల్లం పట్టుకొని కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తిరుప్పాజీ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని మైసమ్మ గేటు వద్ద గురువారం తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపడుతుండగా మద్దూర్ నుంచి వస్తున్న బొలెరో వాహనంలో రూ.60 వేల విలువైన నల్లబెల్లాన్ని గుర్తించామన్నారు. డ్రైవర్ సురేష్ను విచారించగా కర్ణాటక గుర్మిట్కల్ నుంచి నాగర్కర్నూల్కు తరలిస్తున్నామని చెప్పారని.. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించి కేసునమోదు చేసినట్లు వివరించారు. -
పట్ట పగలే ఇంట్లో చోరీ
చిన్నచింతకుంట: గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు ఇంట్లోకి చొరపడి రూ3.30లక్షల విలువ గల వస్తువులు చోరీ చేసిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని ఉంధ్యాల గ్రామానికి చెందిన మహమ్మద్ అక్రమ్, అతని తల్లి ఫహిదా బేగం గాజుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 3.9 తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. తల్లీకొడుకులు సాయంత్రం సమయంలో ఇంట్లో తెరిచి ఉన్న బీరువాను చూసి అందులో ఉన్న వస్తువులు కనిపించక పోయేసరికి ఆందోళన చెందారు. వెంటనే చిన్నచింతకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై గురువారం ఎస్ఐ రాంలాల్నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు క్లూస్టీంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. బంగారు, వెండి ఆభరణాల అపహరణ -
అసత్య ఆరోపణలు చేస్తే సహించం
జడ్చర్ల: తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలి తప్ప.. పదేపదే అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్చర్లలో ఎన్హెచ్–167 విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్కు చెందిన వారి ఇళ్ల వద్ద కొలతలను కుదించారని ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చేసిన ఆరోపణలపై లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం బీఆర్ఎస్ నాయకుడి ఇంటి నుంచి స్వయంగా టేపు పట్టి కొలతలు వేసి సరిగ్గానే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఇంటి వద్ద కొలతలు సరిగ్గానే ఉన్నాయని.. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఇళ్ల వద్ద కొలతలు వేసి సరిచేయాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అదే విధంగా వంద పడకల ఆస్పత్రి వద్ద తన సోదరి పేరున రెండెకరాల అసైన్డ్ భూమి ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. రికార్డులు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. తన మేనల్లుడి పేరిట ఉన్న 10 గుంటల భూమికి పక్కాగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డిగూడలో సుమారు 80 ఎకరాల దేవాదాయశాఖ భూమిపై అనుమానాలు ఉన్నాయని.. దీనిపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను అసైన్డ్దారులకు డబ్బులు ఇచ్చి వంద పడకల ఆస్పత్రికి, రంగారెడ్డిగూడలో డబుల్బెడ్రూం ఇళ్ల నర్మాణానికి భూ సేకరణ చేపట్టామన్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాతబజార్ ప్రాంతానికి వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మరోసారి స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేనే గందరగోళంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఇక పోలేపల్లి సెజ్ నుంచి తన ఖాతాలోకి డబ్బులు వచ్చాయనే దాన్ని కూడా నిరూపించాలన్నారు. గంగాపూర్–బాలానగర్ రోడ్డు విస్తరణ పనులను తాము మంజూరు చేసినవేనని.. అలా కాదంటే కొత్త జీఓ చూపాలన్నారు. బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన కుటుంబాలకు ఒక్క రూపాయి పరిహారం ఇప్పించలేక పోయారన్నారు. రాష్ట్రస్థాయిలో ఆంధ్రా కోవర్టులపై మాట్లాడిన ఎమ్మెల్యే.. మొదటగా జడ్చర్లలో పనులు చేపట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకొని జడ్చర్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, నంద,రఘు ఉన్నారు. తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వీరినే మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేస్తే సరిపోతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్కర్నూల్/ జడ్చర్ల: ఏటా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దశా బ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా పెరుగుతున్న కారణంగా భవిష్యత్లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. దీంతో యువ జనాభా తగ్గుముఖం పడు తుండటం, వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ, సామాజిక మార్పులు, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రా ధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం దంపతులు ఒకరు లేదా ఇద్దరి వరకే పిల్లలను కనేందుకు మొగ్గు చూపుతున్నారు. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్లోనే ఎక్కువ శా తం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణులు కాగా, 10.19 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుండగా, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వరకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కు.ని., పకడ్బందీగా అమలు, సా మాజికంగా, ప్రజల ఆలోచనల్లో మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వరకు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
మహబూబ్నగర్ రూరల్: శిశు గృహలోని శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ సమీపంలో బాల సదనం నిర్మాణంలో ఉన్న కొత్త భవనం, శిశుగృహ, డైట్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న కొత్త భవనం, ఎగ్జిబిషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనం భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శిశుగృహాన్ని సందర్శించి.. మెనూ ప్రకారం ఆహారం లేకపోవడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు గృహలోని పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహి ంచాలని, శిశువులు, బాలల సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. పిల్లలు ఇంటి వాతావరణంలో పెరిగేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారా అని ఆరాతీశారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పార్కులో తిప్పాలని చెప్పారు. అక్కడ పిల్లలకు ఉపయోగపడే ఆటలు ఆడించాలని, ప్రతిఒక్క చిన్నారి ఆరోగ్య వివరాలు సేకరించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డైట్ కాలేజీలో నూతన భవనాన్ని పరిశీలించి పనుల ప్రగతి తెలుసుకున్నారు. డైట్ కళాశాల విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఒకరోజు ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీడబ్ల్యూఓ జరీనాబేగం ఉన్నారు. -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
కాంగ్రెస్కు కంచుకోట పాలమూరు
స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తూ పదవుల నియామకం చేపడుతామన్నారు. ఈ నెల 15లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పు చేస్తామన్నారు. ఒక్కో అసెంబ్లీ నుంచి ఒక ఉపాధ్యక్ష, రెండు ప్రధాన కార్యదర్శులు, మండలం నుంచి ఒక కార్యదర్శిని జిల్లావ్యాప్తంగా అందరి అభిప్రాయంతో నియామకం చేస్తామన్నారు. సీనియార్టీ, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ఏకాభిప్రాయంతో పదవులను కేటాయిస్తామని వెల్లడించారు. మేనిఫెస్టో ప్రమాణపత్రం లాంటిదని, మా మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన సాగుతుందన్నారు. పాలమూరు ముద్దుబిడ్డ సీఎం రేవంత్రెడ్డి సమర్థవంతమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఈ కూర్పు ఉండాలని నిర్ణయించామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వ పదవుల్లో అన్నివర్గాలకు అవకాశాలు కల్పించేలా సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వస్తామని, వందసీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శలు సంజీవ్ మదిరాజ్, మిథున్రెడ్డి, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, సురేందర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, జహీర్ అఖ్తర్, వసంత, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కుసుమకుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ఈ నెల 15లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ జె.కుసుమకుమార్ -
కర్మాగారాల్లో బాలలను గుర్తించాలి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చాలామంది చిన్నారులను గుర్తించి.. సురక్షితంగా వసతి కల్పించామని, ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమంలోనూ బాల కార్మికులను గుర్తించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11పై గురువారం ఎస్పీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా పిల్లల రక్షణ, అదృశ్యమైన చిన్నారులు, బాల కార్మికులు, రోడ్లపై నివసించే వారిపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఇతర అధికారులను సమన్వయం చేసుకుని బాల కార్మికులను రక్షిస్తూ, పనిలో పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ చిన్నారులను పనిలోకి వెళ్లకుండా పాఠశాలకు వెళ్లేలా చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డెమో మంజుల, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, ఉమెన్ పీఎస్ సీఐ శ్రీనివాసులు, ముస్కాన్ టీం ఎస్ఐ కుర్మయ్య, మహిళా ఎస్ఐ సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం షీటీం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, పోలీస్ సురక్ష కళా బృందం సభ్యులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణలో షీటీం బృందం కీలక పాత్ర పోషించాలని, రద్దీ ఏరియాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉన్నత లక్ష్యాలతో చదవాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నా రు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆదర్శ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం రిజిస్ట్రార్ రమేష్బాబు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో అన్ని వనరులను వినియోగించుకుని బా గా చదవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రాములు, కోశాధికారి అరుణ్కుమార్రెడ్డి, సీనియర్ న్యాయవాది మనోహర్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, రాక్సీజాయిస్, టాస్క్ మేనేజర్ సిరాజ్ పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలో 230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా మొదటి విడతగా 132 మంది అభ్యర్థులకు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో భూ సర్వేపై శిక్షణ ఇస్తున్నారు. మే 26న ప్రారంభమైన మొదటి విడత శిక్షణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. భూభారతి ఆర్ఓఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించుకోనున్నారు. -
జీజీహెచ్కు సుస్తీ
జనరల్ ఆస్పత్రిలో వైద్యం అందేది 3 గంటలే..! పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అంటే కేవలం 3 గంటలు మాత్రమే వైద్యం అందుతుంది. ఆ తర్వాత ఎంత ఎమర్జెన్సీ వైద్యం కావాల్సి ఉన్నా.. సీనియర్ వైద్యులు ఉండరు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు ఎలాంటి వైద్యం చేయాలనే విషయంపై జూనియర్స్కు సరైన అవగాహన లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు.. మరికొందరు హైదరాబాద్కు వెళుతున్నారు. ఎలాంటి ఆధారం లేని పేదలు అక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ● జీజీహెచ్లో ఇప్పటికీ గుండె సమస్యలు, గ్యాస్ట్రో, న్యూరాలజీ, యూరాలజీ ఇలా కీలకమైన విభాగాలు వైద్యులు లేరు. గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి కనీస చికిత్స ఇవ్వడానికి అవసరమైన డాక్టర్ లేకపోవడం పెద్దలోటు. ● వార్డులతో పాటు మరుగుదొడ్లు, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతనే దర్శనం ఇస్తోంది. శానిటేషన్ నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓపీలు మొదలైన తర్వాత ఉదయం 9 గంటలకు ఓపీ గదులు శుభ్రం చేయడం కనిపించింది. మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్, జూనియర్ వైద్యులు అత్యవసర వైద్యం కోసం వస్తే అవస్థలే ఓపీలో సమయపాలన పాటించని వైనం అందుబాటులో లేని మందులు పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం ‘సాక్షి’ విజిట్లో తేలిని పలు అంశాలు -
నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అధికారులు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వన మహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలన్నారు. ఆయిల్పాం తోటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో ఎంపీడీఓలు, మండల మహిళా సమాఖ్య, గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే కళాజాతాలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పింఛన్లు, డెత్, స్పౌస్ కేసులు, పర్మినెంట్ మైగ్రేషన్ వంటివి పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 10,410 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 5 వేలు మాత్రమే మార్క్ ఔట్ అయ్యాయని, వందశాతం మార్క్ ఔట్ చేసి బేస్మెంట్ పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడ భాస్కర్, డీపీఓ పార్ధసారథి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బయట తీసుకోమన్నారు..
కడుపులో నొప్పి వస్తుందని ఆస్పత్రికి ఉదయం 10 గంటలకు వచ్చాను. దాదాపు గంట తర్వాత పరీక్షించిన వైద్యుడు స్టోన్స్ ఉన్నాయని చెబితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవడానికి వెళ్లాను. దాదాపు రెండు గంటల తర్వాత స్కాన్ చేశారు. డాక్టర్ రాసిన ఐదు రకాల మందులలో మూడు రకాలు ఇచ్చి.. మిగతావి బయట తీసుకోమన్నారు. – అక్రమ్, గోల్మజీద్ పరీక్షలు చేయించలేదు.. రెండు రోజుల నుంచి చెస్ట్లో బాగా పెయిన్ వస్తోందని ఉదయం 9 గంటలకు వచ్చాను. ఓపీ తీసుకుని 2 గంటల పాటు ఉండి డాక్టర్కు చూపించుకున్నాను. ఎందుకు నొప్పి వస్తుంది? ఈసీజీ, ఇతర పరీక్షలు ఏవీ చేయించకుండానే మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇందులో రెండు రకాలు ఇచ్చి.. మరొకటి ఇవ్వలేదు. – రాజు, తీర్మాలాపూర్ నిత్యం పర్యవేక్షిస్తాం.. ప్రస్తుతం సూపరింటెండెంట్ బదిలీ కావడంతో కొంత ఇబ్బంది ఉంది. దీనికి తోడు అసిస్టెంట్, అసోసియేట్లకు పదోన్నతులు ఉండటం వల్ల వారు ఆప్షన్స్ పెట్టుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఓపీ సమయపాలన విషయంపై వైద్యులందరికీ స్పష్టమైన ఆదేశాలిస్తాం. ప్రతి ఒక్క సీనియర్ వైద్యుడు తప్పక ఓపీ టైంలో డ్యూటీలో ఉండాలి. బయోమెట్రిక్ విధానం పరిశీలించి సక్రమంగా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటాం. మందుల కొరతపై దృష్టి సారించి.. ఇండెంట్ పెడతాం. – డాక్టర్ రమేష్, డైరెక్టర్, మెడికల్ కళాశాల చిట్టిలో రాసింది ఏదీ ఇవ్వలేదు.. కొన్ని రోజుల నుంచి రెండు కళ్లలో నీరు కారుతుందని కంటి డాక్టర్కు చూపించుకోవడానికి వచ్చాను. ఉదయం 9 గంటల నుంచి క్యూలైన్లో నిలబడితే ఒంటి గంటకు చూశారు. వాళ్లు రాసిన మందుల చిట్టి తీసుకొని వెళితే.. ఏ ఒక్క రకంగా కూడా లేవని బయట తీసుకోవాలని చెప్పారు. – జరీనా బేగం, కొత్త గంజ్ ● -
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఒడిశా టు పాలమూరు’ శిర్షీకతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ట్యాంక్బండ్, రామయ్యబౌళి పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్షాపులతో ఇతర దుకాణాలను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి బుధవారం రాత్రి డీఎస్పీ తనిఖీలు నిర్వహించారు. పాన్షాప్ల పేరుతో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి ప్రమాదకర పదార్థాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిసి తనిఖీలు చేసి అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో వన్టౌన్ సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో పలు పాన్షాపుల్లో తనిఖీలు -
అర్హులకు దక్కేనా..?
●ఐదేళ్లుగా అసంపూర్తిగానే.. బోయలకుంట కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణపను లు చేపట్టి దాదాపు ఐదేళ్లయినా ఇప్పటి వరకు పూ ర్తి స్థాయిలో నిర్మించలేదు. వెంటనే పనులు పూర్తి చేసి తమకు ఇళ్లు కేటాయించాలి. – యాదయ్య, దరఖాస్తుదారుడు, బోయలకుంట త్వరలో అర్హులను ఎంపిక చేస్తాం ఎర్రగుట్టలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. వీరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. తమ దగ్గర ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించేలా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల జడ్చర్ల: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కనీస మౌళిక వసతుల కల్పనతో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్కడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదు. అసలు డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో కూడా స్పష్టత లేదు. దీంతో లబ్ధిదారుల ఎంపికలో అయోమయం చోటు చేసుకుంది. 2,700 ఇళ్లు మంజూరు జడ్చర్ల నియోజకవర్గంలో దశల వారీగా ఇప్పటివరకు 2,700 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే 2132 ఇళ్లు నిర్మించారు. అయితే కావేరమ్మపేట, బండమీదిపల్లి, కోడ్గల్, తదితర గ్రామాల్లో మినహాయిస్తే ఎక్కడా డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. మిడ్జిల్, బాలానగర్, నవాబ్బ్పేట, రాజాపూర్ మండలాల్లో సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు పెండింగ్లో ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ డిమాండ్కు సరిపడా గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేకపోయింది. పూర్తయిన ఇళ్లను సైతం అర్హులకు అందించలేదు. తాజాగా అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించడంలో అధికారులు ఎంతమేరకు పారదర్శకతను పాటిస్తారో వేచి చూడాల్సి ఉంది. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూపులు జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 2వేల ఇంటి నిర్మాణాలు పూర్తి నేటికీ కేటాయించని వైనం ఎర్రగుట్టలో మాత్రం యథేచ్ఛగా ఇళ్ల ఆక్రమణ దరఖాస్తుల వెల్లువ తాజాగా తెరపైకి.. ఎర్రగుట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశించడంతో తాజాగా వివాదం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇష్టానుసారంగా అమ్ముకున్నారని సాక్షాత్తు ఎమ్మెల్యే ఆరోపించడమేగాక సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి వారిని ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందించి తమ పార్టీ వారు ఎవరికి ఇళ్లను అమ్మలేదని.. ఒకవేళ అమ్మితే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. అర్హులకు ఇళ్లను ఇవ్వాలని ఓ వైపు ఎమ్మెల్యే, మరో వైపు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నా ఖాళీ చేయించిన తర్వాత అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా అధికారులు, పాలకులు స్పందించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్ కథనం మేరకు.. బీహార్లోని పాట్నా జిల్లా లోదిపూర్కు చెందిన సోనెలాల్ సింగ్ (25) నాలుగు నెలల క్రితం గద్వాల మండలంలోని అనంతాపురం సమీపంలో గల ఓ రైస్ మిల్లులో కూలీ పనినిమిత్తం వచ్చి మిత్రులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం స్వగ్రామానికి వెళ్తానని తోటి మిత్రులకు చెప్పి ఎర్రవల్లి కూడళికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి పుల్లారెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహన ఢీకొట్టడంతో తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అబులెన్స్లో గద్వాల మార్చురీకి తరలించారు. మృతుడి మిత్రుడు సుభాష్ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు. కారు బోల్తా: వ్యక్తి మృతి పెద్దకొత్తపల్లి: మండలంలోని వావిళ్లబావి గ్రామం వద్ద బుధవారం కారు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మండలానికి చెందిన దుబ్బల శ్రీధర్, భూత్పూర్కు చెందిన హర్షవర్ధన్రెడ్డి, తుమ్మల రాఘవేందర్, దుబ్బల హరిప్రసాద్ కారులో దేవరకద్ర నుంచి సోమశిలకు బయలుదేరారు. మార్గమధ్యలో మండలంలోని వావిళ్లబావి గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిని 108 అంబులెన్స్లో నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దుబ్బల శ్రీధర్(23) పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళపై వేధింపులు: వ్యక్తిపై కేసు నమోదు నవాబుపేట: మహిళను వేధించిన ఘటనలో వ్యక్తిపై కేసు నమోదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండల కేంద్రానికి చెందిన వివాహిత జిల్లా కేంద్రంలో కూలీ పనికి వెళ్తున్న తరుణంలో టీడీగుట్ట అడ్డాలో ఉన్న మేసీ్త్ర సురేందర్ ఆమైపె లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో మహిళ కూలికి వెళ్లటం మానేసింది. కాగా సురేందర్ బుధవారం మండల కేంద్రానికి వచ్చి సదరు వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమెను చంపుతానంటూ భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని జిల్లా కేంద్రం వైపు తీసుకెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయటంతో.. మండల కేంద్రం నుంచి యన్మన్గండ్ల సమీపంలో ఆమెను వదిలేసి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు తన భర్త మైబుతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేసీ్త్ర సురేందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అనుమానాస్పదంగా వ్యక్తి మృతి అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేటలో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పొలంలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్ల పెద్దయాదయ్య(50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి వద్ద టిఫిన్ చేసి అచ్యుతారెడ్డి వ్యవసాయ పొలంలో కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ కరెంటు మోటారు సమీపంలో పొలం పనులు చేస్తూ మృతిచెందాడు. సాయంత్రం పొలానికి సమీపంలో గొర్రెలను మేపుతున్న కాపరి పొలంలో యాదయ్య మృతి చెంది ఉండడాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. యాదయ్య కాలుకు కరెంట్ షాక్ తగిలినట్లు బొబ్బలు ఉండడంతో కరెంట్ షాక్తోనే మృతి చెంది ఉంటాడని తెలిపారు. కరెంటు మోటారు సమీపంలోని తీగలు తగిలి మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ శివారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. మృతుడికి భార్య పెద్ద వెంకటమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. యాదయ్య కరెంటు షాక్తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణు తెలిపారు. ఉల్లిధర గరిష్టంగా రూ.2 వేలుదేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. గతవారం వచ్చిన ధరలే ఈ వారం నమోదయ్యాయి. సీజన్ తగ్గడంతో మార్కెట్కు వచ్చిన వేయి బస్తాల ఉల్లిని కొనడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2 వేలు పలుకగా కనిష్టంగా రూ.1400 ధర వచ్చింది. 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్ట ధర రూ.1000, కనిష్ట ధర రూ.700 వరకు విక్రయించారు. ఎక్కువగా చిరు వ్యాపారులు, వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు. -
జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 1.28 లక్షల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 1.22 లక్షలకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 14 క్రస్ట్గేట్లను పైకెత్తి 94,878 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 28,658 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.933 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. శ్రీశైలంలో మూడు గేట్లు ఎత్తి.. దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లను పైకెత్తి 80,646 క్యూసెక్కుల నీటిని బుధవారం దిగువన ఉన్న నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. 1,81,051 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుండగా.. 882.4 అడుగుల నీటిమట్టం, 201.1205 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,978 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్కు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 19,166 క్యూసెక్కులు, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 1,266 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.657 మి.యూ., ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 17.478 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు. కోయిల్సాగర్లో 23 అడుగులు.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయంలో బుధవారం సాయంత్రం 23 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3.6 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయి 26.6 అడుగులకు.. మరో 9.6 అడుగుల నీరు చేరితే పూర్తిగా నిండుతుందన్నారు. 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి సుంకేసుల జలాశయంలో.. రాజోళి: సుంకేసుల జలాశయం 15 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 55 వేల వరద రాగా.. దిగువకు 57,515 క్యూసెక్కులు వదిలినట్లు చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో 0.608 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్యార్థిపై కత్తితో దాడి
గద్వాల క్రైం: ఇంటర్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీకి చెందిన రవితేజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అంబేడ్కర్ కాలనీకి చెందిన గుర్తు తెలియని యువకులతో కొన్ని రోజులు క్రితం రవితేజకు వివాదం జరిగింది. అయితే పాత కక్షలు మనసులో పెట్టుకొని కొందరు యువకులు బుధవారం పట్టణంలోని కోట సమీపంలో విద్యార్థితో ఘర్షణ పడి ఎడమ వైపు చాతీలో కత్తితో పొడిచారు. పక్కనే ఉన్న చరణ్తేజ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా అతడికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవితేజ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఓ యువతితో ప్రేమ వ్యవహరమే దాడికి గల కారణాలు అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. -
పుస్తకాలు సమాజానికి దిక్సూచి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పుస్తకాలు సమాజానికి దిక్సూచిగా ఉండాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రచించిన ‘ట్రైన్ ట్రాన్స్ఫార్మ్ ట్రాయాంఫ్ ఆండ్ స్పొర్ట్స్ న్యూట్రీషియన్, వెయిట్ మేనేజ్మెంట్’ అనే పుస్తకాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం వేగంగా మార్పుచెందుతోందని, మార్పులను వివరంగా పాఠకులకు అందించేందుకు రచయితలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, వారు పరిశోధన రంగాల్లో మార్గదర్శకులుగా నిలవాలన్నారు. పుస్తకాలు ఒక్క యూనివర్సిటీకే కాకుండా యావత్ సమాజాన్నే ప్రభావితం చేసే విధంగా ఉంటాయన్నారు. ఈ పుస్తకం బీపెడ్, ఎంపెడ్ చేసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, రవికాంత్, పీడీ సత్యభాస్కర్, భూమయ్య, అర్జున్కుమార్, శ్రీధర్రెడ్డి, /్ఞానేశ్వర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడుగుంతల నిర్మాణాలతో సత్ఫలితాలు
మహమ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. బుధవారం మండలంలోని నంచర్ల, గాధిర్యాల్, చౌదర్పల్లి, ధర్మాపూర్, మహమ్మదాబాద్లో కేంద్ర బృందం జలశక్తి జలభాగ్యధారి అధికారి సైంటిస్టు సందీప్కుమార్ ఇంకుడుగుంతల నిర్మాణాలు వాటి వినియోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గుంతల వినియోగం ఎలా ఉన్నదని, భూగర్భజలాలు పెరిగే అవకాశమున్నదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడుగుంతల నిర్మాణాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వినియోగించిన నీరు వృథా కాకుండా తిరిగి భూమిలోకి ఇంకిపోతున్నందున భూగర్భజలాలు పెరిగే అవకాశమున్నదని ఆయా గ్రామాల్లో రైతులు ప్రజలు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగమవుతున్నట్టు తెలిపారు. ఈయన వెంట ఈఎన్సీ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీఓ హరిశ్చంద్రుడు, టీఏలు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
‘ఫోన్ ట్యాపింగ్పై సిట్కు ఫిర్యాదు చేస్తా’
స్టేషన్ మహబూబ్నగర్: తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని, దీనిపై సిట్కు ఫిర్యాదు చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డితో ఫోన్లో సంభాషిస్తుంటే 2018లో తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అప్పట్లో అందరి సమక్షంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తనను అవమానపరిచి మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు ఉండడం సహజమని, గత ప్రభుత్వం అవి మరిచి ఇతరులను ఇబ్బందులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని ప్రజలు తిరస్కరించాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలతో సిట్కకు ఫిర్యాదు చేస్తానని నర్సింహారెడ్డి తెలిపారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్థరహితం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎత్తిపోత పథకం (కేఎల్ఐ) కాల్వ పనులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థ రహితమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కేఎల్ఐపై చిత్తశుద్ధి ఉండటంతోనే మోటార్లు ప్రారంభించామని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఓడిన తర్వాత టూరిస్టుగా వచ్చిపోతున్న వారికి కేఎల్ఐపై సరైన అవగాహన లేకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. డి–63, 64 కాల్వ పనుల్లో కొన్ని మరమ్మతులు ఉన్నాయని.. వాటిని సరిచేస్తూ నియోజకవర్గంలోని మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధిక నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. 11న మంత్రుల పర్యటన.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.189 కోట్లు కేటాయించిందని.. పట్టణంలో నూతనంగా నిర్మించే 100 పడకల ఆస్పత్రి, వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సమావేశంలో నాయకులు ఆనంద్కుమార్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మోతీలాల్, శ్రీనివాస్రెడ్డి, రాహుల్, భూపతిరెడ్డి, రాజేష్రెడ్డి, నర్సింహ, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానికహౌసింగ్ కాలనీ, శ్రీనివాస కాలనీలను మంగళవారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశీలించారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలపై స్థానికులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 60డివిజన్లలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు త్వరలో నిధులు రానున్నాయన్నారు. వీటికి సంబంధించి ఈపాటికే ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఆస్తిపన్ను, నల్లా బిల్లులలో ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించాలని ప్రజలకు సూచించారు. హౌసింగ్ బోర్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. శ్రీనివాసకాలనీలోని చిక్కుడు వాగు పెద్దకాల్వను పటిష్టం చేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి, హెల్త్ ఇన్స్పెక్టర్ వజ్రకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఒడిశా టు పాలమూరు
మహబూబ్నగర్ క్రైం: ‘గంజాయి విక్రయదారులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు.. చాక్లెట్లు, సిగరెట్, ఆయిల్ రూపంలో ఇలా భిన్నంగా ఆలోచిస్తూ మత్తును చేరవేస్తున్నారు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటుపడిన యువత బయటకు రావడం చాలా కష్టంగా మారుతోంది. చివరికి దాడులు చేసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం విచారకరం. గ్రాముల చొప్పున విక్రయం.. ప్రధానంగా పాలమూరుకు సరఫరా అవుతున్న ఎండు గంజాయిలో అధిక శాతం ఒడిశా నుంచి వస్తుంటే.. మరికొంత హైదరాబాద్లోని ధూల్పేట్ నుంచి వస్తోంది. దీనిని ఒక కేజీ గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేసి.. దాంట్లో నుంచి ఐదు నుంచి ఆరు గ్రాములను ఒక పాకెట్గా ఏర్పాటు చేసి రూ.500 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు. పోలేపల్లి సెజ్తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేసే ఒడిశాకు చెందిన కూలీలు కొంత రవాణా చేస్తుంటే దీని సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కళాశాలలు, కాలనీల్లో విద్యార్థులు, యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. బానిస కావాల్సిందే.. ఎవరైనా మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. కేవలం మత్తును ఆస్వాదించడం కోసమే వినియోగించే డ్రగ్స్ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి వైద్యులు అవసరమైన మోతాదులో రోగులకు ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్ను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిత్యం కావాలనిపిస్తుంది. ఇలాంటి మత్తును రుచి చూసిన వారు జీవితాంతం కావాలని కోరుకుంటారు. ఇలాంటి మత్తు ఇంజెక్షన్ల వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే మత్తు అత్యవసరమైన సమయంలో అందుబాటులో లేకపోతే విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అవకాశం లేకపోలేదు. ధూల్పేట నుంచి యథేచ్ఛగా గంజాయి సరఫరా కట్టడి చేయడంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారుల విఫలం మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత ఇటీవల పాలమూరులో పెరిగిన కత్తులతో దాడులు బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికం -
28 నుంచి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పీయూలో అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలోని నార్త్డామ్ యూనివర్సిటీ వారి గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఓల్ చైల్డ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే అవకాశం ఉంటుందని, నార్త్డామ్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, రీసోర్స్ పర్సన్ శాలిని, రూబీనా ఫిలిప్స్, హెచ్ఓడీ ఆంజనేయులు, జంగం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి
జడ్చర్ల టౌన్: బీసీ రిజర్వేషన్ ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే జీఓకు చట్టబద్ధత ఉంటుందా? అని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలో మండల విద్యావనరుల కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను పెంచడానికి ప్రస్తుతం ఉన్న జీఓను సవరణ చేసి నూతన జీఓ అమలుకు న్యాయ నిపుణులు సలహ ఇచ్చారని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈనెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జీఓ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 50శాతం సీలింగ్ విధానానికి అతీతంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని, అలా జరగకుంటే తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ జాగృతిసేన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సురభి విజయ్కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు నిరంజన్, మండల అధ్యక్షుడు నర్సింములు, ఎమ్మార్పీఎస్ నాయకుడు భీంరాజ్తోపాటు నాయకులు పాల్గొన్నారు. -
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
జడ్చర్ల: మహిళా సంఘాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మంగళవారం జడ్చర్ల ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. గ్రామ, మండల స్థాయిలో మహిళా సంఘాల అధ్యక్షులు క్రమశిక్షణతో సంఘాలను బలోపేతం చేస్తూనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పని చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూనే మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి నెలా సక్రమంగా మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, ప్రభుత్వం ఆ దిశగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏ పని చేసినా మహిళలు విజయవంతం చేస్తారనే భావన ఉందని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లను ఎంపిక చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాల ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చారని గుర్తు చేశారు. జడ్చర్ల మహిళా సమాఖ్య ద్వారా కూడా ఒక ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసేందుకు రూ.6 లక్షలు వెచ్చించారని పేర్కొన్నారు. సోలార్ యూనిట్లు, క్యాంటీన్లు, చిరు దాన్యాల ఉత్పత్తుల తయారీ తదితర యూనిట్లపై దృష్టి సారించి ఆదాయాన్ని సాధించే దిశగా ఆలోచించాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి స్వయం ఉపాధి, తదితర యూనిట్లపై దృష్టి సారిస్తే వాటి ఏర్పాటుకు పోలేపల్లి సెజ్లో స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారికి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. కార్యక్రమంలో డీటీలు కిషోర్, మహబూబ్ అలీ, ఏపీఓ మాల్యనాయక్, ఎంపీడీఓ విజయ్కుమార్, ఎంఈఓ మంజులాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
సకల కార్మికులంతా నేటి సమ్మెలో పాల్గొనాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికులంతా బుధవారం నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెకు సంబంధించిన ఆటో జాతాను మంగళవారం ప్రారంభించారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్, టీఎన్టీయూసీ జిల్లా నాయకులు డి.రాములు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ.రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు హక్కులను హరించేందుకు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఆరోపించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్మికుల వాయిస్ను ప్రభుత్వాలకు వినపడేలా గర్జించాలని సూచించారు. -
గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలి
● అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: యాసంగి 2024–25 సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం గడువులోగా అందజేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం రవాణా చేయాలన్నారు. దీనిని మిల్లర్లందరూ ప్రాధాన్యతగా పరిగణించి నిబంధనల మేరకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 19 శాతం మాత్రమే బియ్యం తిరిగివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సీఎంఆర్ పురోగతిని తప్పక పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, డీఎం రవినాయక్ పాల్గొన్నారు. 12న ఫుడ్ ఫెస్టివల్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈనెల 12న పెద్ద ఎత్తున ‘ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక మెప్మా భవనంలో ఆర్పీలు, ఎస్హెచ్సీ–ఓబీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం స్థానిక శిల్పారామంలోని 42 స్టాళ్లలో వివిధ ఆహార పదార్థాల తినుభండారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం నగర పరిధిలోని ఎస్హెచ్జీలతో మాట్లాడి వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలన్నారు. రెండో శనివారం కావడంతో నగర ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తదితరులు రావచ్చన్నారు. కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు పాల్గొన్నారు. హజ్యాత్రకుదరఖాస్తుల స్వీకరణ స్టేషన్ మహబూబ్నగర్: రానున్న పవిత్ర హజ్యాత్రకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి.మహమూద్అలీ, మేరాజుద్దీన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వక్ఫ్ కాంప్లెక్స్లోని జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్యాత్ర దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. ఈనెల 31 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హజ్యాత్రకు సంబంధించి దరఖాస్తులను అందజేయాలని కోరారు. సొసైటీ తరపున దరఖాస్తుదారుల ఆన్లైన్ సేవలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు రవూఫ్పాష, సత్తార్, మహ్మద్ రఫీక్, ఖాజా నిజాముద్దీన్, మహ్మద్ ఫైజొద్దీన్, సయ్యద్ నిజాముద్దీన్, అహ్మద్ పటేల్, ఎండి.మూసా, రఫీక్ ఉర్ రహెమాన్, ఎండీ అర్షద్అలీ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్గా నిలవాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్బాల్లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ పాల్గొన్నారు. జిల్లా ఫుట్బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారి క, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్. -
దాబాల్లోనూ విక్రయాలు..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహబూబ్నగర్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా 975 గ్రాముల ఎండు గంజాయి, 8 మంది అరెస్టు చేయడంతో పాటు మూడు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశారు. అలాగే జడ్చర్ల ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కాగా పది మంది అరెస్టు చేయగా రెండు కేజీల 650 గంజాయి, 8 సెల్ఫోన్లు, ఒక వాహనం సీజ్ చేశారు. జడ్చర్ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబాల్లో గంజాయి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల షాద్నగర్– బాలానగర్ మధ్యలో ఉన్న దాబాల్లో గంజాయి దొరకడమే ఇందుకు నిదర్శనం. రాజాపూర్ నుంచి టోల్గేట్ మధ్యలో ఉన్న కొన్ని హోటళ్లు, దాబాల్లో బయటి వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
మహబూబ్నగర్ జట్టు శుభారంభం
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో జరిగిన హెచ్సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 68.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసి మంగళవారం రెండో రోజు ఆట కొనసాగించిన రాకేష్ లెవన్ జట్టు మహబూబ్నగర్ బౌలర్ల ధాటికి 41.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్నగర్ జట్టులో గగన్ 5, ముఖితుద్దీన్ 2, జశ్వంత్ 2, కె.శ్రీకాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఎండీసీఏ అభినందనలు టుడే లీగ్లో మొదటి మ్యాచ్లో విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో ప్రతిభ చాటాలని సూచించారు. లీగ్లో జిల్లా క్రీడాకారులు తమ వ్యక్తిగత నైపుణ్యాన్ని చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టుడే లీగ్లో 148 పరుగుల తేడాతో రాకేష్ లెవన్పై విజయం -
జనరల్ ఆస్పత్రులకు కొత్త అధిపతులు
పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, జనరల్ ఆస్పత్రులకు కొత్త అధిపతులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా కాకతీయ మెడికల్ కళాశాలలో రేడియో థెరఫి విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న సి.సంజీవ్కుమార్ను నియమించారు. అదే విధంగా గాంధీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ కె.నాగార్జున గద్వాల జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా, మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా.మహబూబ్ఖాన్ను గద్వాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమించారు. వికారాబాద్ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ పి.మల్లిఖార్జున్ వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా, నిజామాబాద్ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ ప్రొఫెసర్ టి.ఉషారాణి నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. సంగారెడ్డి కళాశాల ఈఎన్టీ విభాగం ప్రొఫెసర్ శోభన్బాబును వనపర్తి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. మెడికల్ కళాశాలలకు సైతం నూతన ప్రిన్సిపాళ్లు ఉమ్మడి జిల్లాలో సమూల మార్పులు -
ఆయకట్టుకు సాగునీరు
సాక్షి, నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్హౌజ్ వద్ద రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేఎల్ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈసారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండి.. బ్యాక్వాటర్ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతు లు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి. పూర్తిస్థాయిలో నీటిసరఫరా చేపట్టాలంటే.. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే కేఎల్ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈసారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందుతుంది. ప్రధానంగా కేఎల్ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్ పనులు పూర్తికాలేదు. వెల్దండ, ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్వహణ చేపడితేనే ప్రయోజనం.. కేఎల్ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్లను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికాారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి 2 మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్టెక్ వద్ద సర్జ్పూల్ నుంచి పంప్హౌస్లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి. సాగునీటికి ఇబ్బంది లేకుండా.. కేఎల్ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ కేఎల్ఐ కాల్వలకు నీటి విడుదల 4.20 లక్షల ఎకరాలకునీరందించాలని లక్ష్యం -
జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్ఫ్లో
ధరూరు: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు లక్షా 12వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి లక్షా 25వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 14 క్రస్టు గేట్లను ఎత్తి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,053 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్టు–1కు 1300, ఆవిరి రూపంలో 43, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150.. ప్రాజెక్టు నుంచి మొత్తం 1.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.952 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్కు వరద జోరు.. అలాగే, ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద జోరు కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 91.08 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,08,286 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1,15,670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 31.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,14,972 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 30 క్రస్టు గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 1,17,245 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వార విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వార 195 మెగావాట్లు, 99.302 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వార 240 మెగావాట్లు, 119.011 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఇప్పటివరకు 30 వేల క్యూసెక్కులను వినియోగించి 218.313 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామని తెలిపారు. 14 క్రస్టు గేట్ల ఎత్తివేత.. 11 యూనిట్ల ద్వారా కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా
మక్తల్: పేదల సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని రాష్ట పశుసంవర్ధక, మత్స్య, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలో చేపడుతున్న 150 పడుకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చిన ప్రతి హామీని నేరవేస్తుందన్నారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రూ.153 కోట్లతో.. నియోజకవర్గ కేంద్రంలో రూ.153 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యటించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రూ.833.50 కోట్లు కేటాయించామని, అందుకు సంబంధించిన పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15.13 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, అంజనే యులు, గద్వాల్ రవి, నాగరాజు, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
ప్రజాస్వామ్య మనుగడకు జర్నలిజం కీలకం
కందనూలు: ప్రజాస్వామ్య మనుగడకు జర్నలిజం కీలకమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నాలుగో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మహోన్నతమైనదని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జర్నలిజం నిర్భయంగా, నిర్మోహమాటంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని.. ఎవరికీ కొమ్ము కాయరాదన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కత్తికంటే కలం గొప్పదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక జర్నలిస్టుల విలువ తెలిసిందన్నారు. తాము చేపట్టే అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నది జర్నలిస్టులు మాత్రమేనని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాట్లాడుతూ.. దేశంలో అగ్రభాగాన తమ సంఘం ఉందన్నారు. 20ఏళ్లకు పైగా సీనియార్టీ ఉన్న వారు ఉన్నారని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమన్నారు. జర్నలిస్టులను పట్టించుకునే ప్రభుత్వాలకు సహకరిస్తామని.. పట్టించుకోని ప్రభుత్వాలపై పోరాడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, జిల్లా నూతన అధ్యక్షుడు విజయగౌడ్, కార్యదర్శి సురేశ్ తదితరులు ఉన్నారు. -
రూ.8 కోట్ల విలువైన ధాన్యం మాయం
కోస్గి: పట్టణంలోని రైస్ మిల్లుల్లో మంగళవారం పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారుల బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. స్థానిక శ్రీలక్ష్మీ నర్సింహ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం నిల్వలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. డీఎస్ఓ బాల్రాజ్ తెలిపిన మేరకు వివరాలిలా.. రైస్ మిల్లు యజమానులు వరి ధాన్యం నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలు పౌర సరఫరాల శాఖకు అందించాలని పలుమార్లు సూచించినప్పటికీ కొందరు మిల్లర్లు స్పందించకపోవడంతో ఆకస్మిక దాడులు చేశారు. ఈక్రమంలో శ్రీలక్ష్మీ నర్సింమ రైస్ మిల్లులో రూ.8 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు తేడా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాలను జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించారు. సదరు శ్రీలక్ష్మీ నర్సింహ రైస్ మిల్లుకు సైతం 2022–23 రబీ సీజన్లో 56,625 బస్తాల ధాన్యం, 2024–25 ఖరీఫ్ సీజన్లో 22,792 బస్తాల ధాన్యం కేటాయించారు. ధాన్యం తీసుకొని నిర్ణీత గడువులోగా మర ఆడించి (సీఎమ్మార్) బియ్యాన్ని అందించాల్సి ఉండగా.. సదరు మిల్లర్ ఎంతకూ అందివ్వకపోవడంతో అధికారులు తనిఖీ చేశారు. అధికారికంగా 75,417 బస్తాల ధాన్యం ఉండాల్సి ఉండగా కేవలం 86 బస్తాల ధాన్యం మాత్రమే మిల్లులో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 75,331 బస్తాల వరి ధాన్యం మాయమైందని, మొత్తం 3013.24 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.8 కోట్లు ఉంటుందని, సంబంధిత రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి బాల్రాజ్ తెలిపారు. తనిఖీల్లో ఆయనతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డీటీలు ఆనంద్, భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ బాల్రాజ్, ఆర్ఐలు, ఇతర రెవిన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రైస్మిల్లులో అధికారుల తనిఖీతో వెలుగు చూసిన ఘటన యజమానిపై కేసు నమోదు -
నిలిచిన మధ్యాహ్న భోజనం
గట్టు: మండలంలోని చాగదోణ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో మూడు రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. సోమ, మంగళవారం కొందరు విద్యార్థులు ఇళ్ల నుంచి టిఫిన్ బాక్స్ల్లో భోజనం తెచ్చుకోగా.. మరికొందరు సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామ యువత మహేష్గౌడ్, ప్రవీణ్, కార్తీక్, హరిబాబు, విజయ్కుమార్, నర్సన్న తదితరులు మంగళవారం పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. శుక్రవారం 200 విద్యార్థులు పాఠశాలకు హాజరుకాగా.. కేవలం 170 మందికి మాత్రమే నీళ్ల చారుతో భోజనం వడ్డించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. వంట ఏజన్సీ నిర్వాహకుల సమస్య కారణంగా రెండ్రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచినట్లు తెలిపారు. బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని, అప్పటి వరకు విద్యార్థులు ఇంటి నుంచి భోజన బాక్సులు తెచ్చుకోవాలని చెప్పినట్లు వివరించారు. -
నగర సమస్యలను పరిష్కరిస్తాం
● మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన ● రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రజలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డితో నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల పరిధిలో తిష్ట వేసిన సమస్యలను స్థానికులు ప్రస్తావించగా వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని, కుక్కల బెడదను నివారించాలని, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. ● ప్రశ్న: కోస్గి రోడ్డుపై ఎక్కడికక్కడే గుంతలు పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి పాదచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – వెంకట్రెడ్డి, మర్లు, మహబూబ్నగర్ ● కమిషనర్: త్వరలోనే ఈ రోడ్డుకు మరమ్మతు చేయిస్తాం. ● ప్రశ్న: కోయనగర్కు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద పెద్ద కాల్వ నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. – డి.బాలస్వామి, దొడ్డలోనిపల్లి, మహబూబ్నగర్ ● కమిషనర్: అక్కడికి వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తాం. ● ప్రశ్న: ఆంజనేయస్వామి గుడి నుంచి మైసమ్మ దేవాలయం వరకు యూజీడీ కోసం సిమెంట్ పైపులు వేసి మధ్యలో అక్కడక్కడ ఆపేశారు. ఈ పనులు రెండు నెలలుగా నెమ్మదిగా సాగుతున్నాయి. వెంటనే పూర్తి చేయించాలి. – రాంచంద్రయ్య, శీర్షిక, పాత పాలమూరు వాసులు ● కమిషనర్: ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ● ప్రశ్న: కమ్యూనిటీ హాలు పక్క నుంచి యూడీజీ నిర్మించాలి. – కేశమోని శారద, పాత పాలమూరు ● కమిషనర్: ఇంజినీరింగ్ అధికారులను పంపి పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ● ప్రశ్న: అయ్యప్పగుడికి వెళ్లే దారిలో, భాగ్యనగర్లోని కింది ప్రాంతం సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేక ఇబ్బందుల పాలవుతున్నాం. దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. – పగడం మల్లేష్ (పద్మావతికాలనీ), శ్రీకాంత్ (భాగ్యనగర్) ● కమిషనర్: క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి ఈ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రశ్న: గచ్చిబౌలిలోని రెండు మూడు గల్లీలలో రోడ్లు తవ్వి వదిలేశారు. దీంతో లోపలి వరకు చెత్తబండి, ఆటోలు, ఇతర వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. – ఎండీ జమీల్, గోల్ మసీదు ప్రాంతం కమిషనర్: మీ ప్రాంతంలో త్వరలోనే సీసీ రోడ్లు నిర్మించేలా కాంట్రాక్టర్ను ఆదేశిస్తాం. ప్రశ్న: న్యూటౌన్ చౌరస్తా నుంచి రాజేంద్రనగర్ వరకు ఒకవైపు రోడ్డును తవ్వి వదిలేశారు. 167 ఎన్హెచ్పై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చౌరస్తా వద్ద ట్రాఫిక్ జాం అవుతోంది. – సంపత్కుమార్, రాజేశ్, జహంగీర్బాబా, రాజేంద్రనగర్ వాసులు కమిషనర్: కాంట్రాక్టర్ను పిలిపించి సీసీ రోడ్డును త్వరలో వేయిస్తాం. ట్రాఫిక్ సీఐతో మాట్లాడి వెంటనే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఏర్పాటు చేస్తాం. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ విషయమై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రశ్న: విలీన గ్రామమైన పాలకొండలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మోరీలను శుభ్రం చేయడం లేదు. – వెంకటయ్యగౌడ్, పాలకొండ కమిషనర్: మీ ప్రాంతంలో రోడ్లు బాగు చేయిస్తాం. పారిశుద్ధ్య సిబ్బందిని పంపి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం -
రేచీకటితో బాధపడుతూ యువకుడి బలవన్మరణం
రాజోళి: రేచీకటితో బాధపడుతున్న యువకుడు మనోవేధనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. సోమవారం కేసు చేసినట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. ఎస్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం.. రాజోళికి చెందిన కురవ అంజనేయులు సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా.. కుమారుడు భాస్కర్(23)కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయనకు రేచీకటిలో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు పొలానికి వెళ్తూ, తమ వెంట రావాలన్నారు. కానీ తర్వాత వస్తానని చెప్పిన భాస్కర్ ఇంట్లోనే ఉంన్నాడు. కొద్దిసేటికి పురుగుల మందు తాగి వాంతులు చేసుకోగా చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే బాధితుడిని కర్నూలులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోకారి పేర్కొన్నారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి పాన్గల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన సంగనమోని పరుశరాముడు(45) నిత్యం చేపలు పట్టి విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. ఇదే క్రమంలో ఈనెల 4వ తేదీన చేపల వేటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర, చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో సోమవారం గ్రామ శివారులోని సింగాయిపల్లి రోడ్డు పక్కన నల్లకుంట చెరువులో మృతదేహం ఉందని గ్రామస్తులు తెలపడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా.. అది సంగనమోని పరుశరామునిదిగా గుర్తించారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెంది ఉంటాడని, మృతుడి తల్లి సంగనమోని కోమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి అయిజ: పాముకాటుతో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నౌరోజి క్యాంప్ గ్రామానికి చెందిన రామకృష్ణ(35) ఆదివారం ఉదయం ఇంటి బయట పనులు చేసుకుంటుండగా పాము కాటేసింది. పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పాముకాటుకు మంత్రం వేశాడు. మంత్రం వేయించుకున్నాసరే చికిత్స చేయించుకోవాల్సిందేనని మంత్రం వేసిన వ్యక్తి రామకృష్ణకు చెప్పినా నిర్లక్ష్యం చేశాడు. విషం పాకుతున్నట్లు అనుమానం రావడంతో రాత్రి కుటుంబ సభ్యులకు తెలిపాడు. పట్టణంలోని పీహెచ్సీకి వెళ్లారు. పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం బొజ్జమ్మకు పాముకాటు వేసిన విషయం తెలిపారు. గద్వాలకు వెళ్లాలని ఏఎన్ఎం చెప్పడంతో గద్వాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. రామకృష్ణకు భా ర్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. స కాలంలో ఇంజక్షన్ చేసి ఉంటే రామకృష్ణ బతికి ఉండేవాడని గ్రామస్తులు వాపోతున్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం వనపర్తి రూరల్: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్రెడ్డి కథనం ప్రకారం.. పెబ్బేర్కు చెందిన అబ్దుల్ ఖదీర్ (31) ఏబీడీ కంపెనీలో అపరేటర్గా పని చేస్తున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి బైక్పై మెకానికి వెంకటేశ్తో కలిసి ఖదీర్ చెలిమిల్లకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున బైక్పై శ్రీరంగాపూర్ నుంచి పెబ్బేర్కు వెళ్తూ కంచిరావుపల్లి మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలై మృతిచెందాడు. మృతుడి భార్య సమదానీ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.. కొత్తకోట రూరల్: గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొత్తకోట మండలంలోని కనిమెట్ట ఎన్హెచ్ 44పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన వెల్డింగ్ కృష్ణయ్య (48) మదనాపురం మండలంలోని తిర్మలాయపల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కుమార్తె సింధుతో కలిసి వెళ్లాడు. కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా కనిమెట్ట సమీపంలో సాయిఅమృత దాబా వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో కృష్ణయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న సింధు ఎగిరి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సింధు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
ప్రాజెక్టులకు భారీ వరద
ధరూరు: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో సోమవారం కొంత తగ్గిందని పీజేపీ అధికారులు తెలిపారు. లక్షా 12వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 79,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,159 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్టు–1కు 1300, ఆవిరి రూపంలో 43 , ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 285, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1.10లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.316 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఆల్మట్టికి 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అలాగే, ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 123.081 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 88.248 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,11,472 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 33.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 26.936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,15,00 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 30 క్రస్టు గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 1,12,577 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నిండుకుండలా.. దోమలపెంట: ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయి చేరువలోకి వచ్చేస్తుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు కాగా సోమవారం జలాశయంలో 880.8 అడుగుల నీటిమట్టం వద్ద 192.5300 టీఎంసీలుగా ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,118 మొత్తం 67,433 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.546 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.612 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు. 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. జూరాల వద్ద 12 క్రస్టు గేట్ల ఎత్తివేత -
చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు
మహమ్మదాబాద్: మండలంలోని గాధిర్యాల్ అటవీశివారులో ఓగుట్టపై వారం రోజులుగా చిరుత సంచరిస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్ర వేళల్లో ఓ గుండుపైకి ఎక్కి పడుకొని ఉన్న సమయంలో రైతులు చూస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్న రైతులు తమ పశువులకు రక్షణ కరువైందని, భయాందోళన చెందుతూ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం డ్రోన్ కెమెరాతో చిరుత సంచారాన్ని కనిపెట్టారు. గుండుపై నుంచి ఓ గుహలోకి వెళ్లడాన్ని డ్రోన్లో చిత్రించారు. సోమవారం ఉదయం అటవీశాఖ బృందం గ్రామస్తులు గుట్టనంతా గాలించగా.. ఓగొర్రెను, కుక్కలను పట్టుకుని తిన్నట్లు పక్కనే ఉన్న ఓ కుంటలోకి వెళ్లి నీళ్లు తాగినట్లు జాడలు గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆ ప్రాంతంలో లేదని, మరుసటిరోజు కూడా ఆచూకీ వెతికి బోను ఏర్పాటు చేస్తామని రైతులకు తెలిపారు. పశువులను భద్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు. -
జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరితోపాటు ఆయా విభాగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులను సోమవారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అభినందించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో జయదీప్సింగ్, రోహిత్కుమార్రెడ్డి, రితిక్లు పాయింట్ ఫైవ్లో బంగారు పతకాలు సాధించి చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్లో ఈనెల 16 నుంచి 21 వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు, జూనియర్ విభాగంలో శివప్రసాద్, రేవంత్లు ఆగస్టులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సలహాదారులు విజయ్కుమార్, సీనియర్ విద్యార్థులు నిఖిల్, యామిని, కావ్య, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని.. ఊర్కొండ: అధికార పార్టీ నాయకులతో కొందరు అధికారులు కుమ్మకై ్క తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఓ మహిళా రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. ఊర్కొండపేట శివారు సర్వే నం.220లో ఏ.3.39 ఎకరాల భూమి తమ తాతల కాలం నుంచి స్వాధీనంలో ఉందని మహిళా రైతు శశికళ, శేఖర్రెడ్డి తెలిపారు. వాటిలో కోళ్ల ఫారం పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నామని, అవసరాల కోసం బ్యాంకు రుణం తీసుకొని వన్టైం సెటిల్మెంట్ చేసుకొని పూర్తిగా చెల్లించామన్నారు. బ్యాంకు వారు తమ భూమి విడుదల చేసినట్లుగా మా వద్ద అన్ని రశీదులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ బ్యాంకు తమ మధ్య కోర్టులో మూడేళ్లుగా కేసు నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ పీఏ బంధువులు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారన్నారు. దీనిని తిరిగి సోమవారం వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మహిళా రైతు శశికళ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకొని పెట్రోల్ డబ్బాను లాక్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కల్వకుర్తి టౌన్: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీలోని జేపీనగర్ వద్ద నివాసముండే భాను (33) తన సొంత పనుల నిమిత్తం పట్టణానికి బైక్పై వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా గాంధీనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన యువకుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించామని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటుగా నెల వయస్సున్న కుమారుడు ఉన్నారు. మనస్తాపంతో పురుగుమందు తాగాడు కల్వకుర్తి రూరల్: మండలంలోని గుండూరుకు చెందిన మొగిలి శివయ్య (74) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శివయ్య ఆదివారం పీర్ల వద్దకు వెళ్లి పీర్ల ఊరేగింపు చూసే సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు. ఇంటికి చేరుకుని తాను అన్నివిధాలుగా ఇబ్బందులు పడుతున్నానని మదనపడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోనే అర్ధరాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వేకువజామున కుటుంబ సభ్యులు గమనించి కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 7గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి -
జూరాల భద్రతకు చర్యలు
కృష్ణానదిపై అదనంగా హైలెవెల్ రోడ్డు బ్రిడ్జిక్షేత్రస్థాయి స్థలాల పరిశీలన జూరాలకు దిగువ భాగాన కృష్ణానదిపై అదనంగా నిర్మించే హైలెవెల్ బ్రిడ్జి పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. ఈనేపథ్యంలోనే బుధవారం ఆర్అండ్బీ శాఖ ఎస్ఈలు రాజేందర్, శివకుమార్ ఈఈ, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్శాఖకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ధరూరు మండలం రేవులపల్లి, ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామాల మధ్య సుమారు 1.07 కిలో మీటర్ పొడవుతో నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్యన సైతం బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు పరిశీలించారు. రెండుచోట్ల ఏదో ఒక ప్రాంతంలో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గద్వాల: ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తూ.. ఎన్నో ప్రాజెక్టులకు అవసరమైన నీటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తూ.. సుమారు 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించి బీడు భూములను సస్యశ్యాలం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జూరాల ప్రాజెక్టుకు కష్టం వచ్చిపడింది. 1996లో అందుబాటులోకి వచ్చిన తరువాత 30 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్వహణను పాలకులు గాలికొదిలేశారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతు, భద్రతకు గుండెకాయ మాదిరిగా వ్యవహరించే గ్యాంటీ క్రేన్తోపాటు డ్యాంలోని సుమారు 26 గేట్లు నిర్వహణ లోపంతో దెబ్బతిని రిపేర్లకు గురయ్యాయి. వీటిని మరమ్మతు చేయాలనే ద్యాసే లేకుండా పోయింది. అదేవిధంగా ప్రాజెక్టుపై ఉన్న బ్రిడ్జి నుంచి భారీ లారీలు, బస్సులు, ఇతర వాహనాలు 24 గంటల పాటు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రస్తుతం జూరాల బ్రిడ్జి ప్రమాదంలో పడింది. ఇదే విషయం ఏడేళ్ల కిందటే ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదిక పంపినా పట్టించుకోలేదు. ఇటీవల గేట్ల రోపులు తెగిపోవడం, ఆ విషయం కాస్తా మీడియాలో ప్రచురితమవడం, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతల సందర్శించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. దీంతో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించి అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఈమేరకు నిధులు మంజూరు చేయడంతో జూరాల పటిష్టతపై గట్టి చర్యలు మొదలయ్యాయి. గేట్ల రోపులు తెగడంతో.. ఇటీవల ప్రాజెక్టుకు ముందస్తు వరద రావడంతో అప్పటికే రిపేర్లతో కొట్టుమిట్టాడుతున్న 26 గేట్లలో 4, 8వ నంబర్ల గేట్ల ఇనుప రోపులు తెగిపోయాయి. దీనిపై మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రచురితం కావడం, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో జూన్ 28వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. గేట్లతోపాటు, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పరిశీలించారు. గతంలో అధికారులు పంపిన నివేదికల వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ జూరాల ప్రాజెక్టుపై స్పందిస్తూ అదనంగా మరో రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఇందుకోసం రూ.100కో ట్లు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈక్రమంలోనే ఈనెల 1వ తేదీన నూతన హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రూ.121.92కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రూ.121.92 కోట్లు మంజూరు ఆర్అండ్బీకి నిర్మాణ పనుల అప్పగింత జూరాల, కొత్తపల్లి సమీపంలో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖ అధికారులు -
‘అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ’
తెలకపల్లి: అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని అలేరులో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ.64కోట్లు ఉంటే.. ఆయన పదేళ్ల పాలన పూర్తి చేసుకునే నాటికి రూ.8 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. లక్షలాది మంది ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు వేలాది మంది అమరులై సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో అమరవీరుల స్థూపాలు, ప్రతి గ్రామంలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలిసి అభివృద్ధి చేసుకుందాం ప్రజా ప్రభుత్వంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అంతకు ముందు బోనాలు, డప్పులో గ్రామస్తులు మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్రెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తున్న ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు
స్టేషన్ మహబూబ్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు.. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్చార్జ్లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్చార్జీగా నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్గా జె.కుసుమకుమార్ -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని గిరిజన భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితం: మంత్రి జూపల్లి గత ప్రభుత్వం హామీలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మాయ మాటలతో కాలయాపన చేసి రూ. 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై పెట్టిందని ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తూనే.. ఏడాదిన్నర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు పండుగ వాతావరణం తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రోహిత్రెడ్డి, ఆర్డీఓ మాధవి, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఈలు వెంకటేశ్వర సింగ్, హేమలత, తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్తో ప్రజల నుంచి 104 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈ నెల 10లోగా వందశాతం గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ అంశాలపై సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు నిర్వహించి వివరాలను నిర్దేశించిన యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులను ఆదేశించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 70939 11352
తేది: 8–7–2025( మంగళవారం), సమయం: ఉ. 11 నుంచి మ. 12 గంటల వరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నాం. మొత్తం 60 డివిజన్లలో అవసరమైన చోట్ల చేపట్టాల్సిన సీసీరోడ్లు, డ్రెయినేజీ (యూజీడీ)ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులను నగర ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లవచ్చు. నేడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
‘ఇళ్ల పట్టాలను గుంజుకోవాలని చూస్తోంది’
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిరుపేదలకు గతంలో ఇచ్చిన డబుల్బెడ్ రూం ఇళ్ల పట్టాలను వారి నుంచి గుంజుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి చట్టబద్ధత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధిలో మహబూబ్నగర్ వెనకబడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసపోయినం అనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, పోలీసులు కూడా అతిగా వ్యవహరించకుండా చట్ట ప్రకారం పనిచేయాలని హితవు పలికారు. తప్పులను సరి చేసుకొని పార్టీ బలోపేతం చేయడంతోపాటు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్చైర్మన్ గణేశ్, ముడా మాజీచైర్మన్ వెంకన్న, నాయకులు బెక్కం జ నార్దన్, శివరాజ్, రెహమాన్, అనంతరెడ్డి, నవకాంత్, సాయిలు, ఇమ్రాన్, రాజు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రజల సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు కల్పించేందుకు పోలీసులు పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 12 మంది బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు అందించగా పరిశీలించి ఆయా అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ బాధితుల సమస్యలు సకాలంలో పరిష్కరించి.. సత్వర న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు తక్షణ న్యాయం చేయాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన ఫిర్యాదులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. -
సమయం వృథా చేయొద్దు: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సమయం వృథా చేయొద్దని యువతకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కళాభవన్లో 75 రోజుల పాటు ఉచిత కోచింగ్ పొందిన విద్యార్థులకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే టెట్, డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇచ్చామని వారందరూ ఉత్తమ ఫలితాలు సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు మనను జీవితంలో నిలబెట్టడమే గాక ఉన్నత స్థానానికి చేరుస్తుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంతవరకు వేచిచూడకుండా ముందుగానే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనో హర్, కాంగ్రెస్ నాయకులు సీజే బెన్హర్, నాని యాదవ్, అంజద్ తదితరులు పాల్గొన్నారు. -
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం ● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత ● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్లు సిద్ధమైన తర్వాత రద్దు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది.. ● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం ● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు ● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు కూలగొట్టిన ఇంటి వద్ద కళావతి -
ఫోన్ చేయాల్సిన నంబర్: 70939 11352
తేది: 08–07–2025 ( మంగళవారం), సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నాం. మొత్తం 60 డివిజన్లలో అవసరమైన చోట్ల చేపట్టాల్సిన సీసీరోడ్లు, డ్రెయినేజీ (యూజీడీ)ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులను నగర ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లవచ్చు. రేపు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఏకలవ్యుడికి ఘన నివాళి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఏకలవ్యుడి జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక పద్మావతికాలనీలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం (గిరిజన) ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఏటా తొలి ఏకాదశి నాడు ప్రభుత్వమే ఏకలవ్యుడి జయంత్యుత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు వెంకట్రాములు, నర్సింహులు, శ్రీనివాసులు, రామచంద్రయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాకారులుజాతీయస్థాయికి ఎదగాలి మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం నుంచి జరిగే హెచ్సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఎండీసీఏ తరపున క్రీడాకారులను క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్లు అబ్దుల్లా, ముఖ్తార్ పాల్గొన్నారు. ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు శ్రీకాంత్– కెప్టెన్ (షాద్నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్, శశాంక్ (మహబూబ్నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్కర్నూల్), హర్షిత్, జి.కేతన్కుమార్, అక్షయ్ సాయి (జడ్చర్ల), జశ్వంత్ (నాగర్కర్నూల్) ఉన్నారు. -
ఐదేళ్ల ప్రణాళిక..
జిల్లాలో పీఎం జుగా మిషన్ ద్వారా ఐదేళ్లలో వెనకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 34 గ్రామాల్లో 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడతారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో శిబిరాల్లో పాల్గొనే అధికారులు అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సంరక్షణ వంటివి పరిశీలించి వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత.. అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటినీ కలెక్టర్ ద్వారా పీఎం జుగా మిషన్ అధికారులకు అందజేసిన అనంతరం వెను వెంటనే వాటికి అయ్యే నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
ఎన్సీడీ పరీక్షల్లో..
జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్– అసంక్రమిత వ్యాధుల) నిర్ధారణ పరీక్షలు మూడు దశల్లో పూర్తి చేయగా ఇందులో దీర్ఘకాలిక రోగులు అధికంగా బయటపడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జిల్లాలోని 129 సబ్ సెంటర్లు, 17 పీహెచ్సీలు, ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు ఎన్సీడీ క్లినిక్ల పరిధిలో ఉన్న ఏఎన్ఎం, సెకెండ్ ఏఎన్ఎం కలిసి బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మళ్లీ సదరు పీహెచ్సీ, లేదా సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. -
రేబిస్పై అవగాహన పెంచుకోవాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): జంతువుల నుంచి సోకే రేబిస్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మధుసూదన్గౌడ్ అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని జిల్లా పశువైద్యశాలలో ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిని జేడీ డాక్టర్ మధుసూదన్గౌడ్ లాంఛనంగా ప్రారంభించగా.. సాయంత్రం వరకు పిల్లులు, కుక్కలకు పశువైద్యులు యాంటీ రేబిన్ ఇంజెక్షన్లు వేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు ఏడాదికి ఒకసారి రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. ఆస్పత్రిలో రేబిస్ వ్యాక్సిన్ నిరంతరం అందుబాటులో ఉంటుందని, తమ పెంపుడు కుక్కలకు ఎప్పుడైనా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. రేబిస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమ, మంగళవారాలు కూడా కొనసాగుతుందని జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు శివానందస్వామి తెలిపారు. జూనోసిస్ డే రోజు తమ శునకాలకు టీకాలు వేయించని వారు ఎవరైనా ఉంటే ఈ సేవలు పొందవచ్చన్నారు. మొదటిరోజు 205 శునకాలకు టీకాలు వేశామని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు ప్రహ్లాద్, జేవ్య పాల్గొన్నారు. -
సార్.. నన్ను పట్టించుకోండి
నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సరిగ్గా 57 ఏళ్ల క్రితం ఇదే రోజు (07.07.1968)న అప్పటి న్యాయ శాఖ మంత్రి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కేకే రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 57 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న నేను గతంలో ఎంతో మందికి మెరుగైన వైద్య చికిత్స అందించి గుర్తింపు తెచ్చుకున్నాను. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సైతం సాధించిన రోజులు ఉన్నాయి. ఫలితంగా రూ.25 లక్షలు వెచ్చించి.. నూతన భవనం నిర్మించి.. 24 గంటలపాటు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. కానీ, ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ బాగోలేదు. పేరుకేమో 24 గంటల ఆస్పత్రి అయినా డాక్టర్లు ఉండేది నాలుగు గంటలే. అది కూడా ఎవరో ఒక్కరు మాత్రమే. వీరి నిర్లక్ష్యం ఫలితంగా గతంలో ఘన చరిత్రను లిఖించిన నేను ఇప్పుడేమో అపకీర్తిని మూటగట్టుకుంటున్నా. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడేమో ఒకే డాక్టర్ను నియమించారు. ఆయన కూడా మధ్యాహ్నం వరకే వెళ్లిపోతుండటంతో.. నర్సులతో నెట్టుకొస్తున్న పరిస్థితి. పైగా మండలంలోని గ్రామాలు, తండాలు 70కిపైగా ఉండగా.. సుమారు 80 వేల మంది జనాభాకు వైద్య సేవలందించాలి. ఇప్పటికే కు.ని. ఆపరేషన్ల కోసం ప్రజలంతా జిల్లాకేంద్రానికి వెళ్లిపోతున్నారు. కాబట్టి.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలోని పాలకులు.. అధికారులు.. నా పరిస్థితిని అర్థం చేసుకొని నిరుపేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలందించేలా 30 పడకల ఆస్పత్రిగా మార్చడంతోపాటు సరిపడా వైద్యులను అందుబాటులో ఉంచుతారని కోరుతున్నాను. – నవాబుపేట ఊరు : నవాబుపేట పేరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనివేళలు : 24 గంటలు ఉండాల్సిన వైద్యులు : ఇద్దరు ప్రస్తుతం ఉన్నది : ఒక్కరు పీహెచ్సీ పరిధిలో గ్రామాలు, తండాలు 70కిపైనే జనాభా (సుమారు): 80,000 -
ప్రాజెక్టులకు జలసిరి
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు దోమలపెంట: ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 79,920 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 29,296, సుంకేసుల నుంచి 67,218 మొత్తం 1,76,434 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువున శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 879.3 అడుగుల నీటిమట్టం వద్ద 184.2774 టిఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,425 మొత్తం 67,740 క్యూసెక్కుల నీటిని దిగువున నాగర్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 17.109 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో వస్తున్న ఇన్ఫ్లో వరద స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు లక్షా 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో లక్షా 13వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 79, 920 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29, 296 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ –2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1, 24,710 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.444 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సుంకేసులలో 17 గేట్లు ఎత్తి నీటివిడుదల రాజోళి: సుంకేసుల డ్యాం నుంచి నీటివిడుదల కొనసాగుతుంది. ఆదివారం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని డ్యాం గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఎగువ నుంచి 67,200 క్యూసెక్కు ల ఇన్ఫ్లో రాగా.. 17గేట్లను తెరిచి 67,218 క్యూసెక్కు లను దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 11యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి లక్ష్యం వైపుగా పరుగులు పెడుతుంది. ఈ ఏడాది 610 ఎంయూ టార్గెట్ ఉండగా.. ఇదివరకే 205 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. గతేడాది జూలై మూడో వారంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 92.848 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 111.880 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 204.728 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ప్రస్తుతం 30వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని, వినియోగించిన నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని తెలిపారు. జూరాల 12గేట్లు ఎత్తి నీటివిడుదల ఎగువ నుంచి 1.13లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో దిగువకు 1.11లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
అలంపూర్ ఆలయాల్లో..
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజుతో పాటు తొలి ఏకాదశి కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. జోగుళాంబ ఆలయంలో కుంకుమార్చన, అభిషేక పూజలు అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది భక్తులకు తాగునీటి వసతితో పాటు అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చేశారు. వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. -
బుద్దారంవాసికి అమెరికాలో గోల్డ్మెడల్
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు అమెరికాలో గోల్డ్మెడల్ సాధించి అబ్బురపరిచాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పసుపుల కృష్ణారావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అమెరికా అలబామాలో నిర్వహిస్తున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ 50 ప్లస్ విభాగంలో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ గేంలో 80 దేశాల నుంచి 8500మంది పాల్గొనగా.. పసుపుల కృష్ణారావు గోల్డ్మెడల్ సాధించాడు. కృష్ణారావు గోల్డ్మెడల్ సాధించాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, స్నేహితులు అతడికి ఫోన్కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రానికి, సొంతూరుకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. -
దొంగస్వామిని తరిమిన గ్రామస్తులు
కల్వకుర్తి రూరల్: గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకోవాలని ప్రయత్నించిన దొంగస్వామిని గ్రామస్తులు తరిమిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాలలో చోటుచేసుకుంది. వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దేశగురువుగా పేరు చెప్పుకొంటూ శనివారం రాత్రి ముకురాల గ్రామానికి ఆరుగురు శిష్యులతో కలిసి గుర్రంపై వచ్చి శివాలయంలో బస చేశాడు. ఆదివారం తొలి ఏకాదశి కావడంతో పూజల అనంతరం గ్రామంలో గుర్రంపై తిరుగుతూ ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన గుర్రం వెంట ఆరుగురు బటులుగా ఉన్నారు. గుర్రంపై దొంగస్వామి ఓ ఇంటికి రాగానే ఆ ఇంటి మహిళ ఒక బిందెలో పసుపు, కుంకుమ కలిపిన నీటితో గుర్రం ముందు సాఖపెట్టి మొక్కింది. దీంతో వెంటనే దొంగస్వామి ఆశీర్వదించి.. ‘నీకు దోషముంది.. కొన్ని శక్తులు నిన్ను పీడిస్తున్నాయి.. నేను వాటిని తొలగిస్తాను’ అంటూ నమ్మబలికి ఇంట్లోకి ప్రవేశించాడు. వాళ్లను రకరకాల మాటలతో మోసం చేసి జేబులకు చిల్లుపెట్టే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు దొంగస్వామితో ఇల్లు ఒల్లు గుళ్లయ్యే ప్రమాదం ఉందని గ్రహించి అతనితో వాగ్వాదానికి దిగారు. మోసం చేస్తున్నావని నిలదీసి వెంటనే గ్రామం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. చాలామంది గ్రామస్తులు రావడంతో వివాదం ముదిరింది. చివరికి గ్రామస్తులు గట్టిగా నిలదీసి వెంటపడి తరమడంతో దొంగస్వామి పలాయనం చిత్తగించక తప్పలేదు. -
ట్రాక్టర్టైరుకు తగిలి బాలుడి మృతి
అచ్చంపేట రూరల్: ఇంటి ముందు గడ్డిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు ట్రాక్టర్ టైర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని శివారుతండాలో చోటుచేసుకుంది. సిద్ధాపూర్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. తండాకు చెందిన హన్మంత్ ఆదివారం తన ఇంటిముందర ట్రాక్టర్తో గడ్డిని తొలగిస్తుండగా వెనక టైర్కు అతని కుమారుడు జశ్వంత్(4) ప్రమాదవశాత్తు వచ్చి తగిలాడు. బాలుడి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. హన్మంతు దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. రైలునుంచి జారిపడి వ్యక్తికి గాయాలు నవాబ్పేట/ ఉండవెల్లి: రైలునుంచి జారిపడి మండలానికి చెందిన వ్యక్తి గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. మండలంలోని కారుకొండకు చెందిన నరేందర్ జిల్లాకేంద్రం నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తున్నాడు. కాగా ఉండవెల్లి రైల్వేసేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు డోరు వద్ద ఉండగా.. జారిపడి గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంట ఉన్న వారు కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.గుప్తనిధుల కోసం రైతు పొలాల్లో తవ్వకాలు కోడేరు: గుప్తనిధుల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైతుల పొలాల్లో తవ్వకాలు చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని ఎత్తంగట్టు సమీపంలో బాలస్వామి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని అక్కడ కుంకుమ, పసుపు, అగరు బత్తులు, నిమ్మకాయలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ జగదీశ్వర్ను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. -
ఖిల్లా కోట.. కిటకిట
కోయిల్కొండ: మండల కేంద్రంలో ఆదివారం మొహర్రం వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఖిల్లా కోటపై కొలువుదీరిన బీబీ ఫాతిమాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున తహసీల్దార్ కార్యాలయం నుంచి భాజాభజంత్రీలు, కాగడాలతో అధికారులు, గ్రామ పెద్దలు, భక్తజనం ఖిల్లా కోటపైకి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు ఆఖరి ఘట్టంగా బీబీ ఫాతిమాకు గంధం పూసి ఆశన్న, ఊశన్న పీర్లను కోటపై భాగం నుంచి గ్రామం వరకు ఊరేగించారు. అదే విధంగా అగ్నిగుండం మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, కోయిల్కొండలో గండెల్ సాహెబ్, బీబీ ఫాతిమా, ఉస్సేన్ పచ్చ, ఖాసీం సాహేబ్ పీర్ల కలయిక అందరినీ ఆకట్టుకుంది. మధ్యాహ్నం 3గంటలకు కోటపై భాగం నుంచి మొహర్రం కీలక ఘట్టమైన పీర్ల ఊరేగింపు ప్రారంభించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్లు సైతం బీబీ ఫాతిమాను అనుకరించాయి. ప్రధాన వీధుల గుండా బీబీ ఫాతిమా వెళ్తుంటే.. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ అలాయ్ బలాయ్ పాటలు పాడారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ తిరుపాజీ నేతృత్వంలో 50 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోయిల్కొండలో పారుపల్లి పీర్ల సవారీ హసేనుస్సేన్ దోస్తరాద్దీన్ ఊట్కూర్: ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే మొహర్రం వేడుకలు ఊట్కూర్లో శాంతియుతంగా ముగిశాయి. స్థానిక పెద్దపీర్ల మసీదులో పది రోజుల క్రితం ప్రతిష్ఠించిన హసేన్ – హుస్సేన్ పీర్లకు నవమి సవారీ సందర్భంగా తెల్లవారుజామున గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు దశమి సవారీ ప్రారంభం కాగా.. గ్రామ పురవీధుల్లో కనులపండువగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో మహిళలు బొడ్డెమ్మ ఆడారు. యువకులు డప్పులు కొడుతూ అలాయ్ ఆడారు. ముందుగా పెద్దపీర్ల మసీదులో హసేన్ – హుస్సేన్ పీర్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో భాగంగా దేవినగర్లో నిర్వహించిన డోలారోహణ కార్యక్రమం ఆకట్టుకుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఊయ్యాలలో ఆరెకటిక కులానికి చెందిన మగశిశువును వేయగా.. హసేన్–హుసేన్ పీర్లు ఊయ్యాలను ఊపి బాలుడికి నామకరణం చేశాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొనిమొక్కులు తీర్చుకున్నారు. డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కోయిల్కొండలో అంబరాన్నంటిన మొహర్రం వేడుకలు కనులపండువగా బీబీ ఫాతిమా సవారీ అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తజనం -
నమో.. వేంకటేశా
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం జనసంద్రమైంది. ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకారోత్సవం, అనంతరం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ కనులపండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన శేష వాహనంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభా మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, పురోహితుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం స్వామివారిని తిరిగి శేష వాహనంలో హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న కోనేరు వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంతో పాటు స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు జనసంద్రమైన ఆలయాలు మన్యంకొండలో వైభవంగా శేషవాహన సేవ కురుమూర్తి స్వామికి లక్ష పుష్పార్చన.. చిన్నచింతకుంట: తొలి ఏకాదశిని పురస్కరించుకొని మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామి ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి ప్రధాన ఆలయంలో వివిధ రకాల పూలతో అలంకరించిన మండపంలో విగ్రహాలను ఉంచారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ లక్ష పుష్పార్చన కార్యక్రమం కనులపండుగగా సాగింది. వివిధ ప్రాంతాల తరలివచ్చిన దంపతులు కార్యక్రమంలో పాల్గొని పుష్పార్చన చేశారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం రద్ధీగా కనిపించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, ప్రధాన అర్చకులు వెంకటయ్య, విజయ, ఆలయ కమిటీ సభ్యుడు భారతమ్మ, కమలాకర్, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సేవలే లక్ష్యం
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలిగిన పిల్లలకు డీసీసీబీ తరపున ప్రత్యేకంగా విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేకంగా రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. సహకార రంగాలఅభివృద్ధికి పటిష్ట చర్యలు త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం -
వన మహోత్సవానికి సిద్ధం
● జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ● పకడ్బందీగా చేపట్టేందుకు అధికారుల ప్రణాళికలు ● అటవీ, ఉపాధి హామీ, పురపాలిక శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కల పెంపకం ● జిల్లాలో 2,632 ప్లాంటేషన్ సైట్ల గుర్తింపు మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నర్సరీలు సిద్ధం చేస్తున్నారు. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి తరచూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొక్కల పెరుగుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ, అటవీశాఖ, మున్సిపాలిటీల సిబ్బందికి సూచిస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఖాళీ స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమతమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ● 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ● నిలిచిపోయిన హంద్రీ, బెంగళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్,వందే భారత్ రైళ్లు ● తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు ● రాత్రి 10 గంటల తర్వాత పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్/ జడ్చర్లటౌన్/ మదనాపురం: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్ప్రెస్ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్ప్రెస్లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. -
మన్యంకొండ వెళ్తున్నాం..
నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. – నర్సింహ, గద్వాల తినడానికి ఏమీ లేవు మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్, మహబూబ్నగర్ మధ్యలో నిలిపేస్తే ఎలా..? కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు ఎంతసేపు ఉండాలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అమర్నాథ్, కర్నూలు ● -
టాస్క్సెంటర్ యూనివర్సిటీకి అనుసంధానం
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ టాస్క్సెంటర్ను హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్ చౌరస్తా సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్) శిక్షణకేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపల్లి తర్వాత రెండోది మన మహబూబ్నగర్ టాస్క్సెంటర్ అని అన్నారు. టాస్క్సెంటర్లో అన్ని రకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇస్తారని, ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా కేంద్రంలో శిక్షణ పొందవచ్చన్నారు. టాస్క్ శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్లో 50 మందికి అవకాశం కల్పించారన్నారు. మెట్టుగడ్డలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్కు కేటాయించిన స్థలంలో టాస్క్ సెంటర్ కోసం శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్, స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చడానికి తనతో పాటు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం టాస్క్ శిక్షణకేంద్రంలో అనేక కొత్త కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అంతకుముందు పీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషి ఫలితంగానే మహబూబ్నగర్కు టాస్క్ సెంటర్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్, డీఐఈఓ కౌసర్ జహాన్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ ప్రిన్సిపాల్ నర్సింలు, నాయకులు సీజే బెనహర్, రాములుయాదవ్, రాఘవేందర్ పాల్గొన్నారు. ‘ఫస్ట్’ కార్యక్రమాలు భేష్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మహబూబ్నగర్ ఫస్ట్’ కార్యక్రమాలు బాగున్నాయని టాస్క్ సీఈఓ శ్రీకాంత్సిన్హా కితాబునిచ్చారు. శుక్రవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సొంత నిధులతో ఈ కేంద్రం ఏర్పాటు చేయడమే గాక ప్రముఖ విద్యా సంస్థలను మహబూబ్నగర్కు తీసుకొని రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్, మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్చార్జ్ నిజలింగప్ప, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్లో టాస్క్ సెంటర్ప్రారంభం -
గురుకులాలను సందర్శించిన కలెక్టర్
దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రంలోని పలు గురుకుల పాఠశాల, కళాశాలలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించారు. అలాగే ఇతర సదుపాయాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. రాయచూరు రోడ్డులో ఎస్బీఐ పక్కన ఉన్న తెలంగాణ బాలుర, చౌదర్పల్లి వద్ద స్వీట్స్ కళాశాల భవనంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల, మైనార్టీ గురుకుల పాఠశాల, అమ్మాపూర్ రోడ్డులోని జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, తాగునీరు, మంచాలు వంటి వాటిపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలి రాజాపూర్: గ్రామస్థాయి బూత్లెవల్లో ఉన్న బీఎల్ఓలు ఎన్నికల నియమావళిని పాటించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్ఓలకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఓటర్ల నమోదు తొలగించుట ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాధాకృష్ణ, శ్రీనివాస్, సూపర్వైజర్లు ఏఎస్ఓ శ్రీకాంత్, మంజుల, యాదయ్య పాల్గొన్నారు. కొత్త రకం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి మహబూబ్నగర్ క్రైం: పేదలను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అవగాహనతో ఉండకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పీఎం కిసాన్ యోజన పథకం అడ్డుపెట్టుకొని నకిలీ యాప్ల ద్వారా ఓటీపీలు తీసుకుని ఖాతాలో ఉన్న డబ్బు దోచుకుంటున్నట్లు తెలిపారు. పార్ట్ టైం ఉద్యోగాలు, మీ షో పేరుతో ఆర్డర్ రేటింగ్ లింక్స్ పంపించి మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జలమండలి, విద్యుత్శాఖ అధికారుల పేరిట ఫోన్లు చేసి బిల్లు చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, డిజిటల్ అరెస్టు అని పోలీస్, సీబీఐ అధికారుల పేరుతో భయపెట్టి డబ్బులు కాజేస్తారని హెచ్చరించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930, ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆర్బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ34,731 మందికి మేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ● -
తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓ వరం
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓ వరం లాంటిదని రాష్ట్ర ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించి డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10వ తరగతిలోపు, డ్రాప్ అవుట్ విద్యార్థులను ఓపెన్ పదోతరగతిలో, పది పాసైన విద్యార్థులను ఓపెన్ ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 11 వరకు గడువు ఉందని, రూ.200 అపరాధ రుసుంతో ఆగష్టు 12 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి మహిళకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్లాంగ్ లర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని ప్రవేశపెట్టిందని.. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం ప్రభాకర్, డీడబ్ల్యూఓ సుధారాణి, నితిన్, రాజేంద్రప్రసాద్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకే..
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బందికి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్ ద్వారా వృత్తిపరమైన అంశాల్లో శిక్షణ పొంది పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని స్టేట్ లెవల్కు, అక్కడ విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్కు పంపుతామని పేర్కొన్నారు. దేశస్థాయిలో జరిగే కార్యక్రమంలో విజేతలు నిలిస్తే వారికి పోలీసుశాఖ నుంచి ఇంక్రిమెంట్లు, క్యాష్ రివార్డులు ప్రకటిస్తామని తెలిపారు. 5 జిల్లాల నుంచి.. రెండురోజుల పాటు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పోలీసు డ్యూటీ మీట్లో జోగుళాంబ గద్వాల జోన్లోని 5 జిల్లాలకు సంబంధించిన పోలీసులు పాల్గొనగా.. 24 అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన 72 మందికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను అందజేశారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహించి, స్వతంత్ర జడ్జిలతో విజేతలు ప్రకటించడం అభినందనీయమని డీఐజీ చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎస్పీ జానకి, నారాయణపేట ఎస్పీ యోగేష్గౌతమ్, వనపర్తి ఎస్పీ గిరిధర్, అదనపు ఎస్పీలు రామేశ్వర్, ఏఆర్ఏ ఎస్పీలు రియాజ్ ఉల్హక్, సురేష్కుమార్ పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ 72 మంది విజేతలకు మెడల్స్ అందజేత డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ -
ప్రాజెక్టుల భద్రతపై నిర్లక్ష్యం
అమరచింత: ప్రాజెక్టుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జూరాల ప్రాజెక్టు క్రస్ట్గేట్ల రోప్లు తెగినా సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టును సందర్శించకపోవడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును శుక్రవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి జాన్వెస్లీ సందర్శించారు. జూరాల ప్రాజెక్టుపై తమకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఈఈ జుబేర్అహ్మద్, అధికారులతో సీపీఎం నాయకులు వాగ్వాదానికి దిగారు. తెగిపోయిన క్రస్ట్గేట్ల రోప్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచిన జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడటానికి పాలకులు చేసిన పాపలే కారణం ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరును అందించే ప్రాజెక్టుపై ఉదాసీనంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు వెల్లడించాలి 8 గేట్ల రోప్లు తెగిపోయి ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, వెంటనే సీఎం జూరాల ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సొంత జిల్లాకు ఆయువుపట్టు లాంటి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి రోప్లు మార్చలేని స్థితిలో అధికారులు ఉన్నారని, ఇది పభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వాహన రాకపోకల కోసం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మంచి పరిణామం అని, కానీ కాగితాల వరకే పరిమితం కాకుండా వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు. క్రస్ట్గేట్ల రోప్లు తెగినా పట్టింపు లేదు అధికారులతో వాగ్వాదం సీఎం సొంత జిల్లాలో ఇంత నిర్లక్ష్యమా? జూరాల ప్రాజెక్టు సందర్శనలో జాన్వెస్లీ -
మట్టిదిమ్మె పడి వలస కూలీ మృతి
వీపనగండ్ల: బతుకుదెరువు కోసం వచ్చి మండల కేంద్రంలో కూలీగా పనిచేస్తున్న బోగమోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (42) మట్టిదిమ్మె కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రాణి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన రైతు బాబూజిగౌడ్ భీమా కాల్వ నుంచి తన వ్యవసాయ బావికి పైపులను అమర్చేందుకు పొక్లెయిన్తో కాల్వ తవ్వుతుండగా కాల్వలో పైపులు అమరుస్తున్న వెంకటేష్ మట్టిదిమ్మె కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ తాలుకా బోగమోనిపల్లి గ్రామానికి చెందిన మృతుడు, అతని భార్య గోవిందమ్మ రెండు సంవత్సరాలుగా బాబూజిగౌడ్ వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వృద్ధుడి బలవన్మరణం చిన్నంబావి: ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. మండలంలోని బెక్కెం గ్రామానికి చెందిన గొల్ల సుంకులయ్య (60) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య, కుమారుడు హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. దీంతో సుంకులయ్య ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకోవడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఇంజినీర్ అనుమానాస్పద మృతి ● ఫిర్యాదు చేసిన మృతుడి భార్య నవాబుపేట: ప్రైవేట్ మినరల్స్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్న వ్యక్తి అతడు నివాసం ఉండే కంపెనీ గదిలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి విషయం బయటికి పొక్కకుండ రెండు రోజులుగా రహస్యంగా ఉంచడంతో అనుమానాలకు తావిస్తోందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కాకర్జాల్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ మినిరల్స్ కంపెనీలో ఆంధ్రప్రదేష్ కృష్ణా జిల్లా, పమిడి ముక్కల మండలం, మంటాడ గ్రామానికి చెందిన పూర్ణచందర్రావు (43) ఏప్రిల్లో మెకానికల్ ఇంజినీర్గా చేరాడు. ఈ నేపథ్యంలో కంపెనీ కేటాయించిన గదిలో నివాసం ఉండేవాడు. కాగా ఈ నెల 2వ తేదీ బుధవారం రాత్రి విధులు ముగించుకొని గదిలో నిద్రించాడు. కాగా గురువారం గదిలో శవమై కనిపించడంతో తోటి ఉద్యోగులు కంపెనీ యాజమాన్యానికి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్రావు మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య దీప్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతి విషమమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. చికిత్స పొందుతూవ్యక్తి మృతి తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 1న మండల పరిధిలోని గౌరారం సమీపంలో బైక్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతోకాడెద్దులు మృత్యువాత ఊట్కూరు: విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధమవడంతో పాటు కాడెద్దులు సజీవ దహనమైన ఘటన మండలంలోని పెద్దపొర్ల గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లచ్చమ్మ కాడెద్దులను పొలం వద్ద రేకుల షెడ్డులో కట్టేసి గురువారం రాత్రి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా అప్పటికే విద్యుత్ షాక్తో రేకుల షెడ్డు, గుడిసె, కాడెద్దులు, ఎరువులు తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించాడు. సుమారు రూ.2, 50 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ తరఫున ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,260 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.2,149 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ. 4,400, కనిష్టంగా రూ.3029 ధరలు పలికాయి. -
పెద్దసారు కుర్చీ ఖాళీ!
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కేంద్ర బిందువు, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయమైన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రారు కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం అందించే కార్యాలయాల్లో ఒకటి. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్నగర్తోపాటు నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడ్డా కూడా జిల్లాకో రిజిస్ట్రార్ను నియమించాల్సి ఉండగా.. ఏ ఒక్కరినీ నియమించలేదు. ఉమ్మడి జిల్లాలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకూ ఒక్కరే కొనసాగుతూ వచ్చారు. అయితే ఇక్కడ పనిచేసే రిజిస్ట్రార్ రవీందర్ గతనెల 30న ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. రోజుకు లక్షల్లో ఆదాయం అందించే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై పర్యవేక్షణ లేకుంటే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. కావున ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా చెప్పుకునే అధికారి లేకపోతే ఎవరికి విన్నవించుకోవాలని, వెంటనే జిల్లాకు రిజిస్ట్రార్ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కొసమెరుపు ఏంటంటే ఉద్యోగ విరమణ చేసిన అధికారి పేరు ఇంకా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని సమాచార హక్కు చట్టం బోర్డులో అలాగే కొనసాగడం విశేషం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నియామకం కాని అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఖాళీ కుర్చీలే.. -
భారీ కొండచిలువ పట్టివేత
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ శివారులోని శంకరసముద్రం రిజర్వాయర్ ప్యాకేజీ– 19 కెనాల బ్రిడ్జి సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మరమ్మతు పనులు చేపడుతున్న కూలీలు కొండచిలువను గుర్తించి అధికారులకు తెలుపగా వారు స్నేక్ క్యాచర్ కృష్ణసాగర్కు సమాచారం అందించారు. అతి కష్టం మీద పొక్లెయిన్ సాయంతో కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువ 22 కేజీల బరువు, 3.5 మీటర్ల పొడవు ఉందని, సమీప అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్టు కృష్ణసాగర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలుక కుమార్సాగర్, ధనుంజయ్, మన్యం తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూరు/ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం ప్రాజెక్టుకు 80వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం ఉదయం నుంచి క్రమంగా పెరుగూ వచ్చింది. సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో లక్షా 15వేల క్యూసెక్కులకు పెరిగినట్లు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 14 క్రస్టు గేట్లను ఎత్తి 95వేల 566 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,494 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వవకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 280 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వవకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కులు ప్రా జెక్టు నుంచి మొత్తం లక్షా 27,659 క్యూసెక్కుల నీటి ని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. శ్రీశైలానికి భారీగా నీటి ప్రవాహం దోమలపెంట: జూరాల నుంచి 1,24,610 క్యూసెక్కుల నీటిని దిగువున ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాటికి శ్రీశైలం జలాశయంలో 876.3 అడుగుల నీటిమట్టం వద్ద 169.8650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 17.498 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి 34,926 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంతో 14.428 మి.యూనిట్ల విద్యుతుత్పత్తి అనంతరం 26,140 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ జలాశయానికి విడుదల చేశారు. రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 292 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రామన్పాడుకు 1200 క్యూసెక్కుల వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి శుక్రవారం 1200 క్యూసెక్కుల వరద చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయంలో సముద్ర మట్టానికి పైన 1,018 అడుగులు ఉండగా.. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 670 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. అలాగే రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 564 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. 1.15లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 14 గేట్లు ఎత్తి 1.27లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో -
కూరగాయల సాగుతో అధిక లాభాలు
కొత్తకోట రూరల్: రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి కూరగాయల సాగు చేయడం ద్వారా రోజు ఆదాయాన్ని పొందవచ్చని ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డా.శ్రీనివాస్, ఏఓ సైదులు అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రైతువేదికలో కూరగాయల సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జీడిమెట్ల ఆధ్వర్యంలో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో కోరమాండల్ ఏటీఎం శివకుమార్, సీనియర్ మేనేజర్ మంజునాథ్, జీడిమెట్ల హార్టికల్చర్ అధికారి జలంధర్, ఉద్యాన అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. పరమేశ్
నాగర్కర్నూల్: పశువులను మేపుతూ చదువుపై పరమేశ్ చూపిన అంకితభావం అమోఘమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బల్మూరు మండలంలోని కొండనాగులకు చెందిన పరమేశ్ కార్మికుడిగా ఉంటూ.. 14ఏళ్లకు పాఠశాలలో ఏడో తరగతిలో చేరి బ్రిడ్జి కోర్స్ పద్ధతిలో విద్యనభ్యసించి పీహెచ్డీ సాధించిన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ను కలెక్టరేట్లో కలిశారు. ఈ సందర్భంగా పరమేశ్ను కలెక్టర్ అభినందించి శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు నుంచి దూరంగా ఉన్న యువతకు పరమేశ్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారని, అతని విద్యాజీవితం ఎంతోమందికి మార్గదర్శకమవుతుందన్నారు. చదువుకు దూరంగా ఉన్న యువతను మార్గనిర్దేశించగల శక్తి పరమేశ్ కలిగి ఉన్నాడని, అతని జీవన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అవకాశాలు అన్వేషిస్తే ప్రతిభ బయటపడతుందన్నారు. పరమేశ్ జీవితం అందుకు నిలువెత్తు ఉదాహరణ’ అంటూ కలెక్టర్ ప్రశంసించారు. జిల్లాలో విద్యార్థులకు ప్రేరణ తరగతులను అందించేందుకు సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అంతకుముందు పరమేశ్ పశువుల కాపరి నుంచి పీహెచ్డీ సాధించేవరకు తన ఎదుగుదలను కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ బ్రిడ్జి కోర్సులో పీహెచ్డీ అభినందించి ప్రశంసించిన కలెక్టర్ -
అత్యవసర సిబ్బందికి అందిన జీతాలు
● సాక్షి కథనానికి స్పందన పాలమూరు: ఉమ్మడి జిల్లాలో 108, 102 వాహనాల్లో పని చేస్తున్న పైలెట్, టెక్నికల్ సిబ్బందికి ఎంఆర్ఐ సంస్థ గురువారం సాయంత్రం జీతాలు అందజేసింది. గురువారం ‘సాక్షి’ ‘దినపత్రికలో అర్ధాకలితో అత్యవసర సిబ్బంది’ శీర్షికతో వచ్చిన కథనంపై విస్తృత ప్రచారం అయిన నేపథ్యంలో సంస్థ నిర్వాహకులు సిబ్బందికి సంబంధించిన జీతాలను వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న సిబ్బంది సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గద్వాల: జిల్లాలోని బీచుపల్లి (బాలుర), మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని టీజీఆర్ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 8వ రగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్నగర్ డీఈఓ ప్రవీణ్కుమార్, తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సంబంధిత పాఠశాలల్లో స్వయంగా అందజేయాలన్నారు. దరఖాస్తుతోపాటు విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న బోనోఫైడ్, రెండు పాస్పోర్టు ఫొటోలు తప్పక జతపరచాలన్నారు. ప్రవేశ పరీక్ష 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీజీఆర్ స్కూల్ జూనియర్ కళాశాల బాలికల బాలానగర్లో నిర్వహించి సీట్లు కేటాయిస్తారన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 81069 63904, 99511 49909లను సంప్రదించాలని సూచించారు. ఆలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ జడ్చర్ల టౌన్: జడ్చర్లలో లోకాయుక్త డీఎస్పీ విద్యాసాగర్ గురువారం పర్యటించారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని సామాజిక వేత్త అనిల్కుమార్, అయ్యన్న, తెలుగు సత్తయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త న్యాయమూర్తి విచారణకు ఆదేశించటంతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు భూములను పరిశీలించారు. భూముల వివరాలు తెలుసుకోవటంతో పాటు ఖాళీ స్థలాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విచారణ సమయంలో దేవాలయానికి సంబంధించిన నిర్వాహకులు అనారోగ్యం కారణంగా హజరు కాలేదని సిబ్బంది ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు ఆలయ భూముల గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం డీఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ నివేదికను న్యాయమూర్తికి అందజేస్తానన్నారు. గతంలో జరిపిన విచారణ వివరాలు ప్రశ్నించగా ఆ సమయంలో ఆలయ భూములతోపాటు గాంధీనగర్ ట్రస్టుపై విచారణ చేశామని, రెండు నివేదికలు న్యాయమూర్తికి ఇవ్వాల్సి ఉందన్నారు. అన్యాక్రాంతం అయిన భూముల్లో శాశ్వత భవనాలు నిర్మించడంతో వాటిని ఏం చేస్తారని ప్రశ్నించగా తాను విచా రణ చేసి వాస్తవాలను న్యాయమూర్తికి అందించడమే తన పని, తదుపరి నిర్ణయం ఆయన తీసుకుంటారని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్రావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఇన్స్పెక్టర్ వీణాధరి ఉన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,100 గద్వాల వ్యవసాయం/జడ్చర్ల: గద్వాల మార్కెట్కు గురువారం 226 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 5,100 కనిష్టంగా రూ. 2,711 ధర పలికింది. ఆముదాలు గరిష్టంగా రూ. 2,077, కనిష్టంగా రూ. 1,868, సరాసరి రూ. 2,077 ధరలు లభించాయి. బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,251, కనిష్టంగా రూ.1,769, ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,969 ధరలు పలికాయి. -
ప్రతిభను గుర్తించేందుకే పోలీస్ డ్యూటీ మీట్
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుల్లో ప్రతిభను గుర్తించేందుకే పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం పోలీస్ పరేడ్ మైదానంలో జోనల్ పోలీస్ డ్యూటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్లో సిబ్బంది నేర పరిశోధనతోపాటు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారని, ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి 150 మంది సిబ్బంది హాజరయ్యారని చెప్పారు. శుక్రవారం పోలీస్ డ్యూటీ ముగింపు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల ఎస్పీలు పాల్గొంటారన్నారు. పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ విభాగాల్లో పోలీస్ సిబ్బంది ప్రతిభను గుర్తించేందుకు ప్రాక్టికల్స్తోపాటు పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. గురువారం డ్యూటీమీట్లో క్రైం ఇన్వెస్టిగేషన్, మెడికో లీగల్ టెస్ట్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్సిబిట్స్, ఫింగర్ ప్రింట్స్, క్రైం సీన్ ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, అబ్జర్వేషన్ టెస్ట్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సైన్స్ రిటన్ టెస్ట్లను నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
శుక్రవారం
4-7-2025గ్రీన్సిగ్నల్.. తుంగభద్రలో ఇసుక తీసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. – 3లోచదువుతోనే అభివృద్ధి చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. – 4లోSimultaneously Printed at Mahaboobnagar | Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
ఎస్జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో పోటీలు ● షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు ● నాలుగు దశల్లో క్రీడల నిర్వహణ ● ఆగస్టు మొదటి వారం నుంచి పోటీలు ప్రారంభం మహబూబ్నగర్ క్రీడలు: ఎస్జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ –14, అండర్– 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారు. ● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్జీఎఫ్ క్రీడా పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్జీఎఫ్ క్రీడా షెడ్యూల్ను ఇటీవల విడుదల చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించి, పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. జిల్లాకు జాతీయ క్రికెట్ టోర్నీలు జిల్లాలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ క్రికెట్ అండర్–17 బాలుర, బాలికల చాంపియన్షిప్లు నిర్వహించనున్నారు. ఇటీవలే నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు 2025–26 జాతీయస్థాయి టోర్నీలకు సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేయగా మహబూబ్నగర్కు అండర్–17 బాలబాలికల క్రికెట్ టోర్నీలు కేటాయించారు. బాలుర క్రికెట్ టోర్నీని దసరా సెలవుల్లో అనగా అక్టోబర్లో, బాలికల క్రికెట్ పోటీలు సంక్రాంతి సెలవులు జనవరిలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం... ఈ ఏడాది అండర్–17, అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గతేడాది ఉమ్మడి జిల్లాకు కేటాయించిన జాతీయ స్థాయి హ్యాండ్బాల్, రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీల ప్రతిపాదనలు త్వరలో పంపుతాం. – శారదాబాయి, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్నగర్ -
విత్తన పత్తి..!
● విత్తిన నెల తర్వాత సీలింగ్ పేరిట బెదిరింపులు ● ఎకరాకు 200 పాకెట్లే కొంటామని మెలిక ● నిర్దేశిత గడువులోపు డబ్బులు చెల్లించకుండా దాటవేత ● పైగా ఆ మొత్తం ఇచ్చే వరకూ వడ్డీ వసూలు ● రైతు సంక్షేమ కమిషన్కు బెదిరేది లేదని ఆర్గనైజర్ల ఽసంకేతాలు? ● ఉమ్మడి పాలమూరులో 55వేల మంది రైతుల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీడ్ పత్తి సాగులో ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా)ది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుంచే ఏటా సుమారు రూ.1,500 కోట్ల మేర విత్తనాల వ్యాపారం కొనసాగుతోంది. దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయిన సీడ్ గింజలే సరఫరా అవుతాయి. అంతేకాదు.. చైనాతో పోటాపోటీగా ఇక్కడి రైతులు విత్తన పత్తి పంట సాగు చేస్తున్నట్లు రైతు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సీడ్ పత్తి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల ఆగడాలు వెరసి నిలువు దోపిడీకి గురవుతున్న విత్తన పత్తి సాగు దారుల దీనస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. రాజకీయ నాయకులే ఆర్గనైజర్లు.. నడిగడ్డలో మూడు దశాబ్దాలుగా సుమారు 40వేల మంది రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని – మిగతా 4వ పేజీలో రైతులతో కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల చెలగాటం -
పీయూలో వసతుల లేమి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న అనేక సమస్యలను రాష్ట్ర విద్యా కమిషన్ ఆలకించింది. ఉన్నత విద్యలో సమూల మార్పులు, బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, పలువురి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు పీయూ వేదికగా ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్రావు, జోష్నశివారెడ్డి, చారకొండ వెంకటేష్, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు పాల్గొనున్నారు. సుమారు 70 – 80 మంది అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఈ క్రమంలో పలువురు అధ్యాపకులు సిలబస్ మార్పులు, యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలల్లో వసతుల లేమి, సిల్స్, తదితర అంశాలపై చర్చించారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ, కళాశాలలు అందులో వసతులు, తరగతి గదులు, ల్యాబ్స్, బాలికల హాస్టల్స్ తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. – వివరాలు 4వ పేజీలో.. ఉన్నత విద్య బలోపేతానికి కృషి.. రాష్ట్రంలో అన్నిస్థాయిలో ఉన్నత విద్య బలోపేతానికి ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్, పాఠశాల విద్యలపై పబ్లిక్ హియరింగ్స్లో పాల్గొన్నామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి మొదటి సారి పీయూలో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, సంఘాలు చాలా సూ చనలు చేశాయని, వాటిని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కమిషన్ ఒక ముసాయి దాను ప్రభుత్వానికి పంపించిందని, దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం, సీఎం ప్రాథమిక స్థాయి విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్నిస్థాయిలో విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా క మిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. హాస్టళ్లలో మౌలికసదుపాయాలు కరువు తరగతి గదులు, ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ లేక చదువులపై ప్రభావం ఉద్యోగ భద్రత లేక టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది పాట్లు విద్యార్థులు, పీయూ సిబ్బందితోముచ్చటించిన విద్యా కమిషన్ అన్ని సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడి -
ఈనెల 31 వరకు ‘ఆపరేషన్ ముస్కాన్’
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఈ నెల 1 నుంచి 31 వరకు చేపట్టే ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రెస్క్యూ టీం అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోనీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించి తీసుకున్న పునరావాస చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని హోటళ్లు, మెకానిక్ షాపులు, నిర్మాణ రంగం, భిక్షాటన, ఇటుక బట్టీలు, ఇతర చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే బాల కార్మికులను గుర్తించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో కలిసి రెస్క్యూ టీం అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. బాల కార్మిక నిర్మూలన చట్టం–2016 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల పిల్లలను బాలల సంరక్షణ కమిటీకి అప్పగించి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలలు పాఠశాల, కళాశాలల్లో ఉండాలని, పనిలో ఉండవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రత్నం, జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి జరీనాబేగం, మైనార్టీ సంక్షేమాధికారి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జెడ్పీ, డీఆర్డీఓ, జిల్లా పంచాయతీ శాఖలలో ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ల పాటించాలని, సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు పని కల్పించడంలో చొరవ చూపాలని, అర్హులైన వారికి జాబ్ కార్డులు ఇప్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీలకు పని దినాలను తక్కువ కాకుండా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు ఇవ్వాల ని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలతో అత్యధికంగా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను నిర్లక్ష్యం చేయవద్దని, రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి అందేలా చూడాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారధి పాల్గొన్నారు. -
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
మహబూబ్నగర్ రూరల్: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని ఎదిరలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దొడ్డి కొమురయ్య ఆత్మ బలిదానంతో దేశవ్యాప్తంగా భూ సమస్యలపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఽభవిష్యత్లో పిల్లలు కుల వృత్తితో పాటు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరి ఏదైనా నైపుణ్య శిక్షణ పొందాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని.. రాజకీయాల పేరుతో గ్రామాలను విచ్ఛినం చేయరాదని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అంతకుముందు రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం రూ.50 లక్షలతో నిర్మించనున్న కురుమ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, శివశంకర్, శాంతన్నయాదవ్, నాయకులు శ్రీశైలం, జె.చంద్రశేఖర్, శివప్రసాద్రెడ్డి, చర్ల శ్రీనివాసులు, రాములు, బచ్చన్న, కర్నె కృష్ణయ్య, అంజి, నర్సింహులు, ఎల్లయ్య పాల్గొన్నారు. రెండు బైక్లు ఢీ: ఇద్దరి దుర్మరణం మహబూబ్నగర్ క్రైం: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. కౌకుంట్లకు చెందిన నజీర్(25) బుధవారం రాత్రి మహబూబ్నగర్ నుంచి కౌకుంట్లకు వెళ్తుండగా, మాచన్పల్లి తండాకు చెందిన శ్రీను(30), మోహన్ కలిసి దేవరకద్ర వైపు నుంచి మహబూబ్నగర్కు వస్తున్నారు. ఈ క్రమంలో ధర్మపూర్ సమీపంలో వేగంగా ఎదురెదురుగా బైక్లు ఢీకొట్టుకోవడంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మోహన్కు గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఇటిక్యాల: మండల పరిదిలోని ఉదండాపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకునట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మూడు బైక్లు, రూ.29,850 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బంగారు దుకాణంలోపట్టపగలే చోరీ రాజోళి: శాంతినగర్ పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిగనర్లోని శ్రీనివాస జ్యూవెలర్స్ యజమాని శ్రీనువాసులు రోజు లాగానే గురువారం ఉదయం దుకాణం తెరిచారు. వెంట తెచ్చుకున్న బ్యాగును షాపులో ఉంచి అటు వైపు తిరిగి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బ్యాగును తీసుకొని బైక్పై పరారయ్యారు. తేరుకున్న యజమాని కేకలు వేసే లోగా దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్యాగులో రూ.4 లక్షల నగదు, రెండు కిలోల వెండి ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఫైల్ పట్టుకుని తిరుగుతున్నారు..
యూనివర్సిటీ ప్రతినెలా జీతాలు ఇచ్చేందుకు అధికారులు నిధుల కోసం ఫైల్ పట్టుకుని సెక్రెటరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో రూ.100 కోట్లపైనే ప్రతిపాదనలు పెడితే అందులో రూ.10 – 20 కోట్ల వరకే ఇస్తారు. అవి ఇచ్చేందుకు కూడా ఇబ్బందులే. యూనివర్సిటీలో భవనాలు విద్యార్థులు కట్టిన ఫీజులతో నిర్మించినవే. – కుమారస్వామి, హెచ్ఓడీ, పొలిటికల్ సైన్స్ ఉపాధి అవకాశాలు కల్పించాలి.. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉండే ఇండస్ట్రీస్లో పీయూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేటి ఆలోచనలు చేసే విధంగా విద్యార్థుల కోసం ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాయాలి. ఉపాధి శిక్షణలు వచ్చేందుకు నిధులు కేటాయించాలి. – అర్జున్కుమార్, అధ్యాపకుడు, కామర్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలి.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మాతో చదువుకుని గతంలో జేఎల్, డీఎల్గా కాంట్రాక్టు పద్ధతిలో చేరిన వారిని ప్రభుత్వం గతంలో రెగ్యులరైజ్ చేసింది. కానీ, యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని మాత్రం చేయలేదు. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రెగ్యులర్ చేసి.. వేతనాలు పెంచాలి. – భూమయ్య, అధ్యాపకుడు ● -
జడ్చర్లలో డెంగీ కేసు నమోదు
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని వెంకటపతిరావు కాలనీలో నివాసుముంటున్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. పోలేపల్లి ఫార్మసెజ్లోని హెటిరో కంపెనీలో పనిచేస్తున్న పరశురాం అనే వ్యక్తికి బుధవారం డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే డెంగీ సోకినట్లు తెలియగానే బాధితుడు స్వగ్రామానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ కోనేటి పుష్పలత, అర్బన్హెల్త్ సెంటర్ వైద్యాధికారి డా.మనుప్రియలు బాధితుడు నివాసం ఉంటున్న ఇంటిని సందర్శించారు. మున్సిపల్ వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా యాంటి లార్వాల్, యాంటి మస్క్విటో నివారణ చర్యలు చేపట్టారు. పరిసరాల్లోని 100 ఇళ్లల్లోనూ అవగాహన కల్పించారు.బాధితుడి ఇంటితో పాటు పరిసరాల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లించి దోమల మందును ఫాగింగ్ చేయించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి దోమలపెంట: శ్రీశైలం భూగర్భ కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మిక సమస్యలను పరిష్కరించాలని జెన్కో 1535 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకర లవకుమార్ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఆర్టిజన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని పనిఒత్తిడి తగ్గించాలని వివరించారు. రొటేషన్ పద్ధతిలో జనరల్లో విధులు నిర్వహిస్తున్నవారిని షిఫ్టుకు, షిఫ్టుకు వారిని జనరల్కు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. జీఐఎస్ ప్రాంతంలో వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని వివరించారు. జెన్కో కాలనీలో విద్యుత్తు ఉద్యోగుల నివాస కాలనీలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి
మహబూబ్నగర్ రూరల్: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధర్మాపూర్ గ్రామం మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం– 2024 ప్రకారం బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన హక్కులతోపాటు బాధ్యతలు సైతం నిర్వర్తించాలని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని, 14 ఏళ్లలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయంతోపాటు బాలల రక్షణ, సంరక్షణపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఫోన్ నంబర్ 15100 ఫోన్ చేస్తే అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతారన్నారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల హక్కులకు భంగం కలగకుండా వారికి సహాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని చదువుపై శ్రద్ధ చూపేలా కౌన్సిలింగ్ ఇవ్వడం బాధ్యతగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ శివ, పారా లీగల్ వలంటీర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఇళ్లు’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఇళ్లు’ ఇస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంపికై న 1,437 మంది లబ్ధిదారులకు జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో గురువారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం వీరన్నపేట, రైల్వేస్టేషన్ రోడ్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మయూరి కో–ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే మహబూబ్నగర్ను మొదటి స్థానంలో నిలిపేందుకు తమ సహకారం, తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ఈనెలాఖరులో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. అనంతరం ఈనెల 4న హైదరాబాద్లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఇక హృద్రోగ సమస్యతో నిమ్స్లో చికిత్స పొందుతున్న జిల్లాకేంద్రానికి చెందిన మనపతి హర్షిత కోసం రూ.4 లక్షలు, అలాగే అక్కడే అనారోగ్యంతో బాధతున్న దివిటిపల్లి వాసి ముతుకూరి బాలమణి కోసం రూ.1.70 లక్షల విలువ జేసే ఎల్ఓసీలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, వైస్చైర్మన్ పెద్ద విజయ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్అహ్మద్, కాంగ్రెస్ నాయకులు జహీర్అక్తర్, సంజీవ్ ముదిరాజ్, ఎస్.వినోద్కుమార్, ఎన్.పి.వెంకటేష్, ఎం.సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, అవేజ్. సీజే బెన్హర్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన పత్తి. . !
మొదటి పేజీ తరువాయి ఇతర ప్రాంతాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగవుతోంది. అయితే ఈ పంట సాగుకు ఖర్చు ఎక్కువ. ఈ క్రమంలో పెట్టుబడి అవసరాలను ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులే సీడ్ ఆర్గనైజర్లుగా మారగా.. ఈ వ్యవస్థ ప్రస్తుతం రైతుల భవిష్యత్ను శాసిస్తోంది. సీడ్ పత్తి సాగుదారులకు పెట్టుబడి అందిస్తూ వచ్చిన వారు దోపిడీకి తెగబడ్డారు. రైతుల నుంచి సీడ్ పత్తిని సేకరించి కంపెనీలకు అప్పగించడం.. వారు చెల్లించిన డబ్బులను రైతులకు చెల్లించడంలో మోసాలకు తెరలేపారు. విత్తనాలను తమకే విక్రయించాలనే నిబంధనతో పెట్టుబడి కింద ఇచ్చిన మొత్తాన్ని రూ.100కు రూ.2 నుంచి రూ.5 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. విత్తనాలు ఫెయిల్ కాకున్నా.. అయ్యాయని, నాణ్యత లేదని రైతులను నిలువునా ముంచుతున్నారు. తొలుత 40 మంది వరకు మాత్రమే ఆర్గనైజర్లు ఉండగా.. సబ్ ఆర్గనైజర్లతో కలిపి 300 మంది వరకు దందా నడిపిస్తున్నారు. తాజాగా సీలింగ్ మెలిక.. కంపెనీలు సీలింగ్ పెట్టాయంటూ సీడ్ ఆర్గనైజర్లు ఎకరాకు 200 పాకెట్ల విత్తనాలను మాత్రమే కొంటామని తాజాగా మెలిక పెట్టడం సాగుదారుల్లో అలజడి సృష్టిస్తోంది. విత్తనాలు పెట్టి నెల దాటగా వేసిన పంటను తొలగిస్తే ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు ఇస్తామని ఆర్గనైజర్లు చెబుతున్నారని.. కానీ ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అయిందని వాపోతున్నారు. ఇతర పంటలు వేసే కాలం అయిపోయిందని.. ఎకరాకు ఉత్పత్తయ్యే సీడ్ మొత్తాన్నీ తీసుకోవాల్సిందేనని.. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, సీలింగ్ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గడువులోపు డబ్బులివ్వరు.. వడ్డీ మాత్రం వసూలు సీడ్ పత్తి కంపెనీలు ఏటా మేలో రైతులకు ఫౌండేషన్ సీడ్స్ అందజేస్తున్నాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు డిసెంబర్లో ఆర్గనైజర్ల ద్వారా కంపెనీలకు విత్తనాలు ఇస్తున్నారు. గ్రోత్ ఔట్ టెస్ట్ (జీఓటీ)లో పాస్ అయిన విత్తనాల డబ్బులు నాలుగైదు నెలల తర్వాత రైతులకందుతున్నాయి. అయితే పెట్టుబడికి తీసుకున్న మొత్తంపై ఈ కాలానికి సంబంధించిన వడ్డీని రైతులు చెల్లించాల్సి వస్తోంది. ఎప్పుడూ ఏప్రిల్, మేలో కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా విత్తన డబ్బులను చెల్లిస్తుండగా.. ప్రస్తుతం ఇప్పటివరకు రాలేదు. గద్వాల జిల్లాలో గత ఏడాది సీడ్ పత్తి సాగుదారులకు చెల్లించాల్సిన రూ.వెయ్యి కోట్లు పెండింగ్లో ఉండగా.. వారు ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నారు. రైతు సంక్షేమ కమిషన్పై తిరుగుబాటా? ఇటీవల రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గద్వాల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో సీడ్ పత్తి సాగు పంటను పరిశీలించిన ఆయన జిల్లా కలెక్టరేట్లో రైతులు, కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీడ్ పత్తి సాగుదారులకు జరుగుతున్న అన్యాయంపై రైతులతో పాటు పలు సంఘాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. అప్పుడు, ఆ తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీడ్ ఆర్గనైజర్ల తీరుపై కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న విత్తన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పలు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలో నూతన విత్తన చట్టం తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమకు ఇబ్బందులు తప్పవని యోచించిన ఆర్గనైజర్లు కొత్త ఎత్తుగడకు దిగినట్లు తెలుస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టేలా సీలింగ్కు తెరలేపడంతోపాటు రైతు కమిషన్ హెచ్చరికలకు బెదిరేది లేదనే సంకేతాన్ని పంపించినట్లు రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా మాఫియాగా మారిన ఆర్గనైజర్ల వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నాయి. ఇంకా రూ.2.50 లక్షలు రావాలి.. గత ఖరీఫ్లో నాకున్న 3 ఎకరాల్లో వేద రాయల్ సీడ్స్ కంపెనీ పత్తి సీడ్ పంట సాగు చేశాను. మొత్తం 11.40 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. రూ.4 లక్షలు పెట్టుబడికి వాడుకున్నా. ఇవి పోను లెక్క చేసిన రూ.2.50 లక్షలు నాకు రావాల్సి ఉంది. ఆ డబ్బులను ఆర్గనైజర్ ఇప్పటివరకు ఇవ్వలేదు. డబ్బులడిగితే విత్తనాలు ఫెయిల్ అయ్యాయని చెబుతున్నాడు. కంపెనీ దగ్గర చెక్ చేస్తే పాస్ అయినట్లు ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. – జయప్ప, ఇర్కిచేడు, కేటీదొడ్డి -
చదువుతోనే అభివృద్ధి సాధ్యం
రాజాపూర్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమతుందని.. గ్రామీణ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎంశ్రీ నిధులను పాఠశాలల నిర్మాణాలకు కేటాయిస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధులు రూ.54 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కష్టపడి చదవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మొదటి, రెండవ ఫేస్లో రాష్ట్రానికి రూ.4.50 లక్షల కోట్లు పీఎంశ్రీ నిధులు కేటాయించిందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన అందిస్తారని.. కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్ విద్యను అందించేందుకు ఏఐ విద్యాబోధనను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తుందని వివరించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తమవంతుగా బూట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, నాయకులు నరహరి, ఆనంద్, శ్రీనివాస్నాయక్, శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రామకృష్ణ, గోవర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, రమణ, నసీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
పరికరాలు బాగు చేయాలి
హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ జిమ్కు అప్పుడప్పుడు వస్తుంటాను. ఫిట్నెస్ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు బాగానే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే కుర్చీలాట యంత్రం విరిగిపోయి చాలా రోజులైంది. దాని బాగు చేస్తే సమీపంలోని విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. సిమెంట్ బల్లా కూడా బాగు చేయించాలి. – వేముల శివ, పద్మావతికాలనీ, మహబూబ్నగర్ లైట్లు సరిగా వెలగవు ఇక్కడి ఓపెన్ జిమ్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు సరిగా వెలగడం లేదు. బయ ట ఓ మూలన కొందరు చెత్తాచెదారం పడేస్తు న్నారు. పారిశుద్ధ కార్మికులతో ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రాత్రివేళ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలి. – నాని, హౌసింగ్ బోర్డు కాలనీ వాసి, మహబూబ్నగర్ పరిశీలించిమరమ్మతు చేపడతాం నగరంలోని అన్ని పార్కులతోపాటు ఓపెన్ జిమ్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఎక్కడైనా పరికరాలు మరమ్మతుకు గురైనవి ఉంటే బాగు చేయిస్తాం. ఈ పాటికే టీచర్స్కాలనీలోని చిల్డ్రన్స్ పార్కు, పాలకొండ, మర్లులో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఆయా చోట్ల చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్నగర్ ● -
‘నేరస్తులు ఎవరూ తప్పించుకోలేరు’
అయిజ: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో పోలీసుల నుంచి నేరస్తులెవరూ తప్పించుకోలేరని డీఎస్పీ మొగలయ్య అన్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించారు. అయిజ పట్టణానికి చెందిన సరోజ (40)కు ధరూరు మండలానికి చెందిన వడ్ల రామాచారితో 2001లో వివాహం అయ్యిందదని తెలిపారు. వారికి ఇద్దరు కుమారులు వినోద్, పవన్, కూతురు వైష్ణవి ఉన్నారన్నారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకున్నారని తెలిపారు. 2012లో రామాచారి రెండో వివాహం చేసుకున్నాడని, అప్పుడప్పుడు వచ్చి మెదటి భార్య ద్వారా కలిగిన సంతానాన్ని చూసి వెళ్లేవాడని పేర్కొన్నారు. అయితే మెదటి భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, దాంతో మొదటి కుమారుడికి ఎవరూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం లేదని రామాచారి భావించాడు. ఈ నెల 1 న అయిజకు చేరుకొని తన పెద్ద కొడుకు వినోద్తో కలిసి సరోజ ఇంట్లో ఒటరిగా ఉన్న సమయంలో గాయపరిచి ప్రాణాలు తీశారని వివరించారు. మృతురాలి తమ్ముడు వడ్ల నరసింహాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐ టాటా బాబు, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘వైస్ చైర్మన్ను పదవి నుంచి తొలగించండి’
మహబూబ్నగర్ (వ్యవసాయం): మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్యార్డు కార్యదర్శి భాస్కర్పై అకారణంగా చేయి చేసుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్కుమార్ను పదవి నుంచి తొలగించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి తన మాట వినాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు. ప్రజాప్రతినిధిగా అధికారులకు సహకరించాల్సింది పోయి దాడికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. వీరికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా మద్దతు తెలిపింది. కాగా ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ సమయంలో ఎవరున్నారు.. సీసీ కెమెరాలు ఉన్నాయా.. లేదా, ఉంటే అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు సమాచారం. దాడి ఘటనపై ఎస్పీతో పాటు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ ఉద్యోగ సంఘం నాయకులకు భరోసానిచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్, ఉపాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సహాయ కార్యదర్శి మల్లయ్య, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, టీజీఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి టైటాస్పాల్, ఏఎంసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, వెంకట్రాములు, శ్రీశైలం ఉన్నారు. -
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: 2012లో ఎల్ఐసీలో నియామకమైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని సౌత్సెంట్రల్ జోన్ బీమా ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్ఐసీలో ఎఫ్డీఐలను 100 శాతం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్డీఐని ఇండియాలోకి తీసుకురావడం వల్ల చాలా ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తాయని అనుకున్నారని, కేవలం 25 కంపెనీలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. బీమాలా అమెండ్మెంట్ బిల్లును ఈ వర్షకాలంలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ఈ బిల్లును కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈనెల 9న జరిగే అఖిల భారత సమ్మెలో ఆలిండియా బీమా ఉద్యోగులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో బీమా కార్పొరేషన్ ఎంప్లాయియిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్, మహబూబ్నగర్ బ్రాంచీ కార్యదర్శి కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఒక్కో ఓపెన్ జిమ్, వివిధ చోట్ల 22 పార్కులు నిర్మించిన మున్సిపల్ అధికారులు ఆ తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో వాకర్స్, ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోని పరిస్థితులు నెలకొన్నాయి. వీటి కోసం సుమారు పదేళ్ల క్రితం రూ.ఎనిమిది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించారు. అలాగే ఈ రెండేళ్ల కాలంలో మరమ్మతులకు, నిర్వహణ కోసం రూ.20 లక్షలు కేటాయించడం గమనార్హం. కాగా ‘సాక్షి’ బృందం గురువారం ఓపెన్ జిమ్లతో పాటు కొన్ని పార్కులను పరిశీలించగా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ● టీచర్స్కాలనీలోని చిన్నపిల్లల పార్కును 1,942 చ.మీ. విస్తీర్ణంలో 2016 ఏర్పాటు చేశారు. అనంతరం అధ్వాన స్థితికి చేరడంతో రెండేళ్ల నుంచి వృథాగా వదిలేశారు. ప్రస్తుతం దీనికి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వాకింగ్ ట్రాక్ పూర్తి కాగా మిగతా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాకేంద్రంలో 2 ఓపెన్ జిమ్లు..22 పార్కులు ఒక్కోదానికి రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం నిర్వహణ పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోని వాకర్స్, నగర ప్రజలు శ్రీనివాసకాలనీలోని పార్కును 2021 జూలైలో రూ.1.42 కోట్లతో ప్రారంభించారు. ఇక్కడికి ప్రతిరోజూ దాదాపు 200 మంది కాలనీవాసులు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునే వివిధ పరికరాలు బాగానే ఉన్నాయి. ప్రాంగణంలోని చుట్టూ వాకింగ్ ట్రాక్ సరిగా లేదు. ఎక్కడికక్కడ చిన్న కంకరతో ఉండగా చాలా వరకు వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. రెస్ట్ షెడ్లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నది. పక్కనే పొదలు, చీదుతో నిండిపోగా.. రూరల్ పీస్ సీజ్ చేసిన వందలాది వాహనాలు ఉన్నాయి. అటువైపు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
చాలా చోట్ల దెబ్బతిన్నాయి..
నగరంలోని చెరువులు, కుంటలకున్న పాటుకాల్వలు, పెద్ద నాలాలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. వీటిని ఆనుకొని దశాబ్దాల క్రితమే కొందరు ఇళ్లు నిర్మించుకోవడంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎర్రకుంటకు సంబంధించి వీరన్నపేట గుట్టల వద్ద జాయమ్మచెరువు, ఈర్లకుంటల నుంచి కుమ్మరివాడి, కురిహినిశెట్టికాలనీ మీదుగా పాటుకాల్వ వస్తుంది. ఇది మధ్యలో ఎక్కడబడితే అక్కడ ధ్వంసమైంది. వెంటనే పటిష్టం చేసి వరద సాఫీగా ముందుకు వెళ్లేలా చూడాలి. – శాంతయ్యయాదవ్, బండ్లగేరి, మహబూబ్నగర్ బాగు చేస్తాం.. అమృత్–2 పథకం కింద నగర పరిధిలో మూడు చోట్ల ఎస్టీపీలు నిర్మించనున్నాం. ఇందులో భాగంగా ఆయా చెరువులు, కుంటలకున్న పాటుకాల్వలు, పెద్దనాలాలు పటిష్టం చేస్తాం. వీటి కోసం సుమారు రూ.40 కోట్లు వెచ్చించనున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. – విజయభాస్కర్రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్– మున్సిపల్ ఇంజినీరింగ్, మహబూబ్నగర్ -
చైర్మన్ వర్సెస్ వైస్ చైర్మన్
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి, అధికారుల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో మొదటి నుంచి వివాదాలకు దారి తీస్తుంది. మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకం విషయంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. కాగా.. బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కులానికి చెందిన పెద్ద విజయ్కుమార్ చైర్మన్ పదవిని ఆశించగా.. రాజకీయ సమీకరణలో భాగంగా చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెక్కరి అనితకు దక్కింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వైస్ చైర్మన్ పెద్ద విజయ్కుమార్ అధికారులు, చైర్మన్పై గుర్రుగా ఉన్నారు. యాసంగి సీజన్లో మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన వరిధాన్యం కొనుగోలు, మద్దతు ధర వ్యవహారంలో రైతులు ఆందోళనకు దిగారు. దీని వెనుక వైస్ చైర్మన్ హస్తం ఉందని అధికార పార్టీ నాయకులతోపాటు చైర్మన్ కూడా అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం లైసెన్స్ హమాలీలకు దుస్తుల పంపిణీ వ్యవహారంలో మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకుని మార్కెట్ యార్డు పాలక మండలి అభాసుపాలు కాకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య వివాదాలు జరగకుండా ఎమ్మెల్యే సర్ది చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తీవ్రమైన వివాదాలు చర్చనీయాంశమైన కార్యదర్శిౖపైవెస్ చైర్మన్ దాడి వ్యవహారం -
ఫర్టిలైజర్స్ దుకాణాల తనిఖీ
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలను సందర్శించిన ఆయన యూరియా అమ్మకాల గురించి తెలుసుకున్నారు. పీఓఎస్ మిషన్, స్టాక్ రిజిష్టర్లు, రైతు వారీగా యూరియా అమ్మకాల రిజిష్టర్లను పరిశీలించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు యూరియా కొరత రానివ్వకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట డీఏఓ వెంకటేష్, ఏడీఏ శ్రీనివాసులు తదితరులున్నారు. -
ఇదేం ఎయిడెడ్ పాఠశాల
దేవరకద్ర: పట్టణంలోని భారతీయ విద్యానికేతన్ (బీవీఎన్) ఎయిడెడ్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీఓ, ఎంఈఓ అక్కడి పరిస్థితులను చూసి నివ్వెరపోయారు. పాఠశాలలో కేవలం 5 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా.. గతంలో ప్రైవేట్గా ఉన్న భారతీయ విద్యానికేతన్ పాఠశాలను ఎయిడెడ్గా మార్చిన తర్వాత ప్రతి ఏడాది కొద్దిమేర విద్యార్థులు తగ్గిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ బలరాం సందర్శించారు. పాఠశాలలో 5 మంది ఉపాధ్యాయులు ఉండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు రిజిష్టర్లో పేర్కొన్నారు. అందులోనూ నలుగురు విద్యార్థులే హాజరు కాగా.. ఒక ఉపాధ్యాయులు సెలవులో ఉండగా.. ముగ్గురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఒకప్పటి ప్రభుత్వ పాఠశాల భవనం కేటాయించగా గదలన్నీ శిథిలావస్థకు చేరగా కేవలం ఒక గది మా త్రమే వినియోగంలో ఉందని హెచ్ఎం ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉన్న గదిలోనే చదువులు సాగించ డానికి ఇబ్బందులు ఎదురుకావడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణమైందని పేర్కొన్నారు. గతంలో ఇద్దరు డిప్యూటేషన్.. గతేడాది కేవలం 15 మంది విద్యార్థులు ఉండటంతో నలుగురు ఉపాధ్యాయులలో ఇద్దరిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్పై పంపించామని ఎంఈఓ బలరాం తెలిపారు. ఈ ఏడాది కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని.. ఒక ఉపాధ్యాయుడిని పాఠశాలకు కేటాయించి మిగతా ముగ్గురిని డిప్యూటేషన్పై పంపిస్తామని పేర్కొన్నారు. ఈ పాఠశాల గురించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ చెప్పారు. ఐదుగురు విద్యార్థులకునలుగురు ఉపాధ్యాయులు నివ్వెరపోయిన మండల అధికారులు -
కబ్జాల్లో పాటుకాల్వలు
● నగర పరిధిలోకుచించుకుపోయిన పెద్ద నాలాలు, కాల్వలు ● పట్టణాన్ని ముంచెత్తుతున్న పెద్దచెరువు, ఎర్రకుంట,గాండ్లోనిచెరువు, చిక్కుడువాగు వరద నీరు ● పట్టించుకోని నీటిపారుదల, మున్సిపల్ అధికారులు ● ఏటా వర్షాకాలంలో భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతవాసులు ● తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న అధికార యంత్రాంగం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగర పరిధిలోని పెద్దచెరువు, ఎర్రకుంట, గాండ్లోనిచెరువు, చిక్కుడువాగుకున్న పాటుకాల్వలు, పెద్దనాలాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వీటికి ఆనుకుని ఇరువైపులా యథేచ్ఛగా కొందరు ఇళ్లు నిర్మించుకోవడంతో కుచించుకుపోయాయి. దీంతో కొన్నిచోట్ల వాటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అసలే వర్షాకాలం.. ఆపై వరద వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమై కుంటలను తలపిస్తోంది. పెద్దచెరువు శివారులో నలువైపులా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పీర్లబావి, అంబేడ్కర్ నగర్, బీకేరెడ్డి కాలనీ, నాగిరెడ్డి కాలనీ, మర్లులోని ఎస్ఆర్ నగర్, రామయ్యబౌలి, శివశక్తి నగర్, బాలాజీ నగర్లో ముంపు పొంచి ఉంది. అలాగే ఎర్రకుంటకు అటు, ఇటువైపు ఉన్న కురిహినిశెట్టి కాలనీ, బండ్లగేరి, కిసాన్ నగర్, గణేష్ నగర్, వల్లభ్ నగర్, గౌడ్స్కాలనీ, గచ్చిబౌలి, గోల్మసీదు పరిసర ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయినప్పటికీ మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతుండటంతో సమస్యలు శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. -
వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో అందిన దరఖాస్తులు సంబంధిత అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రతినెలా మొదటి బుధవారం మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని వృద్ధులు, దివ్యాంగుల నుంచి 19 దరఖాస్తులు స్వీకరించారు. గత నెల ప్రజావాణి సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం గతంలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్లో సమాచార, సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్ ఎదుట రెండు వైపులా బస్షెల్టర్ నిర్మించాలని, స్థానిక పద్మావతీ కాలనీ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మార్చాలని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం, డిప్యూటీ తహసీల్దార్ దేవేందర్ కేసిరెడ్డి, ఆర్టీసీ డీఎం సుజాత, సీనియర్ సిటిజన్ ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, బాలయ్య, మనోహర్రావు, కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు పీయూకు విద్యా కమిషన్ రాక మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ రానుందని పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పీయూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో విద్యా కమిషన్ చైర్పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, కమిషన్ మెంబర్స్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేష్, జ్యోష్నశివారెడ్డి, పీయూ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. ఇందులో విద్యా బలోపేతం, బోధన లోపాలు, వసతుల కల్పన తదితర అంశాలను కమిషన్కు తెలియజేస్తే వారు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్రెడ్డి, రవికాంత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయం పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి సమస్యలపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సెషన్లలో సదస్సు ఉంటుందని, మొదటి సెషన్లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. మూడు సెషన్లలో ఎంతో మంది వక్తలు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన ఇంకా జల వనరుల దోపిడీ ఆగలేదని, స్వరాష్ట్రంలో కూడా జిల్లా వివక్షకు గురవుతుందన్నారు. సాగునీటి కల్పనలో జిల్లాకు అన్యాయం జరిగిందని, కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వలేదని ఆరోపించారు. -
జూరాలకు తగ్గిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 87 వేల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 67 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 5 క్రస్ట్గేట్లను ఎత్తి 32,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 31,380 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 42, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 280, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 450, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.060 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 174.784 మి.యూ. విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 79.443 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 95.341 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. రెండు ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 174.784 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. -
సంతానం లేదని మహిళ ఆత్మహత్య
అయిజ: సంతానం కాలేరని మనస్తాపానికి గురైన మహిళ ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు కథనం ప్రకారం.. అయిజకు చెందిన వెంకటేశ్కు రెండేళ్ల క్రితం సమీప బంధువైన భువనేశ్వరి (23)తో వివాహమైంది. ప్రైవేటు దుకాణంలో వెంకటేశ్ గుమాస్తాగా పనిచేస్తుండగా భువనేశ్వరి ఇంటి వద్దే ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో భువనేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త తలుపు కొడితే తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలికెళ్లి చూస్తే భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఉండవెల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన రంగస్వామి(40) బైక్పై మంగళవారం కర్నూల్ నుంచి బుక్కాపురం వెళ్తుండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో రంగస్వామి తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కర్నూల్ ఆస్పత్రికి తరలించిన విషయం విధితమే. చికిత్స పొందుతూ రంగస్వామి మృతి చెందాడు. అతని భార్య కుర్వ సుజాత ఫిర్యాదు మేరకు బొలెరో వాహనం డ్రైవర్ నరేష్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు ప్రాణాలు కాపాడిన పోలీసులు ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది అభంశుభం తెలియని తమ ఏడాది బాలుడితో కలిసి బుధవారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను కాపాడారు. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మహిళ భర్తతో నిత్యం తగాదాల కారణంగా జీవితంపై విరక్తి చెందింది. తన కుమారుడితో కలిసి బీచుపల్లికి వచ్చి కృష్ణానది పుష్కరఘాట్ దగ్గర నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇటిక్యాల బ్లూకోర్ట్ పోలీసులు శ్రీనివాసులు, వాజిద్ లు దీనిని గమనించి చాకచక్యంగా వ్యవహరించి స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో మహిళతో పాటు బాలుడి ప్రాణాలతో కాపాడారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలి పారు. వివాహిత ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు. ‘ఎన్ఎంఐఎంఎస్’కు న్యాక్ ఏ–ప్లస్ ఫ్లస్ గ్రేడ్ జడ్చర్ల టౌన్: మండలంలోని పోలేపల్లిలో ఉన్న ఎస్వీకేఎం ఎన్ఎంఐఎంఎస్ (డీమ్డ్ యూనివర్సిటీ)కి న్యాక్ ఏ ప్లస్ ఫ్లస్ గ్రేడ్ కేటాయించిందని వైస్ చాన్స్లర్ డా. రమేశ్భట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బృందం 4వసారి యూనివర్సిటీని సందర్శించి 3.67 అత్యుత్తమ సీజీపీఏతో ఏ ప్లస్ ఫ్లస్ గ్రేడ్ అందించిందని పేర్కొన్నారు. ఈ మైలురాయిలో అండగా నిలిచిన, సహకరించిన, లక్ష్యాన్ని విశ్వసించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, విద్యార్థి సభ్యుల బోర్డు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపా రు. లభించిన ఉత్తమ గ్రేడ్ దేశంలో ఉన్నత విద్యలో శ్రేష్టతకు బెంచ్మార్క్గా నిలుపుతుందని.. అంతర్జాతీయ విద్యాలయాలతో వ్యూహాత్మక భాగస్వా ్డములను ఏర్పరచుకోగలుగుతుందని, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించగలుగుతుందన్నారు. 10 నుంచిస్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈ నెల 10 నుంచి 17వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ (ఎఫ్ఏసీ) మధుసూదన్గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్ తదితర వాటి రిపేరుపై శిక్షణ ఇస్తారన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తారన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కా ర్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈ నెల 9 వరకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోతో జతచేయాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
చేనేత కార్మికులకు జియోట్యాగ్ నంబర్లు
అమరచింత: మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులందరికి ప్రభుత్వం జియోట్యాగ్ నంబర్లు జారీ చేస్తూ సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉందని చేనేత జౌళిశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మ వెల్లడించారు. మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో చేనేత మగ్గాలపై జీవనం పొందుతూ జియోట్యాగ్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులను ఆమె బుధవారం ఆకస్మికంగా సందర్శించి కార్మికుల వివరాలు సేకరించారు. ఈ మేరకు అక్కడే ఉండి మగ్గాలపై జరీ చీరలను తయారు చేస్తున్న దరఖాస్తుదారులతో మాట్లాడారు. కొంతకాలంగా మగ్గాలను వదిలామని, ప్రస్తుతం స్థానికంగా ఉపాధి ఉండటంతో మళ్లీ మగ్గాలపై నేత పనులను చేపడుతున్నామని, తమకు జియోట్యాగ్ నంబర్లు కేటాయించి ఆదుకోవాలని నేత కార్మికులు కోరారు. దీంతో ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ జియోట్యాగ్ నంబర్ను కేటాయిస్తామన్నారు. గద్వాల ఏడీ పరిధిలోని గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల కిందట జియోట్యాగ్ కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీంతో నేరుగా వృత్తిలో ఉన్నారా లేదా అనే వివరాలను తెలుసుకోనేందుకు మాచర్ల, అరగిద్ద, గోర్లకాన్ దొడ్డి, అమరచింత గ్రామాలను సందర్శించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నేత పనులతో ఉపాధి పొందుతున్న కార్మికుడు తనకు జియోట్యాగ్ నంబర్ కావాలంటే కనీసం నేత పనుల్లో 6 నెలల అనుభవం ఉండాలని సూచించారు. 6 నెలల కిందట కొత్తగా జియోట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించామని, త్వరలోనే వారికి నంబర్లను కేటాయిస్తామన్నారు. గద్వాల చేనేత జౌళిశాఖ కార్యాలయం పరిధిలో జియోట్యాగ్ నంబర్లు కలిగిన కార్మికులు 2800 మంది ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య, పీల్డ్ ఆఫీసర్ ప్రియాంక ఉన్నారు. చేనేత జౌళిశాఖ రాష్ట్ర ఉప సంచాలకులు పద్మ -
విహారయాత్రతో విషాదం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం కొత్తకోట రూరల్: ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాద ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న ఆ కుటుంబంలో విహారయాత్ర తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మృత్యువాత పడగా.. మరో తీవ్రంగా ఐదుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన సాయి దాబా నిర్వహకుడు రాజు తన ఇద్దరు సోదరుల కుటుంబాలకు చెందిన 18 మంది పెద్దలు, నలుగురు పిల్లలు కలిపి మొత్తం 22 మంది జూన్ 26వ తేదీన ఓ మినీ బస్సు, ఇన్నోవా కారులో విహారయాత్రకు బయల్దేరారు. రం రోజులు సంతోషంగా గడిపిన వారు బుధవారం ఉదయం తమిళనాడులోని భవానీమాతను దర్శించుకొని.. కొత్తకోటకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం తమిళనాడులోని సేలం సమీపంలో ధర్మపురి బైపాస్ వద్ద ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో.. దానికి వెనుకే వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన యుగంధర్రెడ్డి (50), మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సునితమ్మ (58) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు పెద్దవారితో పాటు నలుగురు పిల్లలున్నారు. గాయపడిన వారిలో పురుషోత్తమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు మృతులు వనపర్తి జిల్లా వాసులు యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం -
వివాదాస్పద భూమి ఎన్ఓసీ అందించండి
జడ్చర్ల: పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి దగ్గర తమ కుటుంబ సభ్యులు ఎన్ఓసీ ఉన్న భూమిని కొనుగోలు చేశారని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారం రోజుల్లో సంబంధిత ఎన్ఓసీ ప్రతిని స్థానిక తహసీల్దార్కు అందించాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తాను చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. తనకు రాచరిక పాలన అంటే ఏమిటో తెలియదన్నారు. ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అక్క పేరున భూమి ఉండటంతోనే తాను మాట్లాడానని, పేరు లేకపోతే మాట్లాడేవాడిని కాదన్నారు. ఈ భూమికి సంబంధించిన ఎన్ఓసీ రెవెన్యూ కార్యాలయంలో లేదని, దీని డాటా ఇవ్వాలని ఇప్పటికే అధికారులు నోటీసులు జారీచేశారన్నారు. తన మేనల్లుడి పేరిట 1,200 చ.గ స్థలం ఉందని స్వయంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారని ఆ స్థలాన్ని ఎప్పుడు ప్రభుత్వానికి వెనక్కి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మాట్లాడినట్లు తన తల్లి ఎక్కడా భూ లావాదేవీలు జరపలేదన్నారు. ఆమె మాజీ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉండడంతో హస్తవాసి బాగుంటుందని కొందరు అభిమానంతో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయించుకుంటున్నారని చెప్పారు. తాము బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో సైతం కలిసి ముగ్గులు పోయడం, ప్రొసీడింగ్స్ ఇవ్వడం చేస్తున్నామన్నారు. మీ హయాంలో తమ పార్టీల వారిని ఎక్కడా దగ్గరకు రానివ్వలేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే తమపై చేసిన ఆరోపణలకు త్వరలోనే విలేకరుల సమావేశంలో అన్ని వివరాలు చెబుతానని చెప్పారు. జడ్చర్లను నంబర్ 1 చేస్తా.. జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచి నంబర్ 1 చేస్తానని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. బాలానగర్ మండలంలోని మోతీఘనపూర్లో రూ.50 లక్షలు, గోప్లాపూర్లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కొత్తగా వేసిన తాగునీటి బోర్లను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని, ఎక్కడా పేదలకు ఇళ్లు, రేషన్కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. -
6న కురుమూర్తిస్వామికి లక్ష పుష్పార్చన
చిన్నచింతకుంట: ఉమ్మడి పాలమూరు వాసుల ఆరాధ్యదైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో శయనేకాదశి (తొలి ఏకాదశి)ని పురస్కరించుకొని ఆదివారం స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో రకరకాల పూలతో అలంకరిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి అలంకరణ మండపంలో ఉంచుతారు. ఈ ఉత్సవంలో వివిధ గ్రామాలకు చెందిన దంపతులు జంటగా పాల్గొంటారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణాలతో అమ్మవార్లకు పుష్పార్చన ఘనంగా కొనసాగనుంది. కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇవీ కార్యక్రమాలు.. తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తిస్వామి ఆలయంలో ఆది, సోమవారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, 9 గంటలకు విశ్వక్సేవ పూజ, పుణ్యాహవచనం, 10 గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చన, రాత్రి 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, 8 గంటలకు ప్రదోషకాల పూజ, 9 గంటలకు తీర్థ ప్రసాద వితరణ, 10 గంటలకు అఖండ భజన ఉంటుంది. అలాగే సోమవారం ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చన, 9 గంటలకు మహానివేదన, 9.30 గంటలకు తీర్థప్రసాద వితరణ చేపడుతారు. ● తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తిస్వామికి సహస్ర పుష్పార్చన జరిపించే భక్తులు ఆలయ కార్య నిర్వహణాధికారి కార్యాలయంలో రూ.151 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఈఓ మధనేశ్వర్రెడ్డి, చైర్మన్ గోవర్ధన్రెడ్డి కోరారు. కురుమూర్తిస్వామి ప్రధాన ఆలయం -
వాట్సప్ లింక్ ద్వారా రూ.64,500 మాయం
గట్టు: పీఎం కిసాన్ పేరుతో వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేసిన ఓ రైతు బ్యాంక్ నుంచి డబ్బులు మాయమైన సంఘటన గట్టులో చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. గట్టుకు చెందిన రైతు లక్ష్మన్న తన సెల్ నంబర్ (వాట్సప్)కు పీఎం కిసాన్ పేరుతో మెసేజ్ రావడంతో లింక్ను ఓపెన్ చేశాడు. దీంతో తన ఖాతాలో ఉన్న రూ.64,500 ఖాళీ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రైతు బ్యాంక్లో అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బులు బదిలీ అయ్యాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అప్పటికే ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో రైతు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వీరన్నపేట సమీపంలో మళ్లీ కనబడిన చిరుత
మహబూబ్నగర్ న్యూటౌన్: మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని వీరన్నపేట పరిధిలో హెచ్ఎన్ ఫంక్షన్ హాలు సమీపంలోని గుట్ట మీద రాళ్లపై చిరుత సంచరిస్తున్న ఫొ టోలు, వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. స్పందించిన ఏడుగురు ఫారెస్టు సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్ల బృందం చిరుత సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఫారెస్టు అధికారులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికులు స్వయంగా చిరుతను చూసినట్లు తెలపడంతో గుట్టపై బోనుతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్టు రేంజ్ అధికారి సయ్య ద్ కమాలుద్దీన్ తెలిపారు. అడవిలో చిరుతల సంతతి పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాధిర్యాల్ అటవీప్రాంతంలో చిరుత కలకలం మహమ్మదాబాద్: మండలంలోని గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని ఓగుట్టపై చిరుత ఉండడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం పొలాల నుంచి వస్తున్న రైతులు గుట్టపై ఓ గుండు మీద ఉన్న చిరుతను చూశారు. వెంటనే అక్కడ దారిగుండా వెళ్తున్న పలువురు రైతులు కలిసి కొంత దగ్గరికి వెళ్లి చూడగా.. గుండుపై చిరుత ఉండడాన్ని గమనించారు. వెంటనే పలువురు రైతులు కెమెరాలో చిరుత ఫొటోలు తీశారు. అక్కడే చాలామంది గుమిగూడి దాన్ని పరిశీలిస్తుండగా.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు రైతులు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు, దగ్గరలోని రైతులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చిరుత సంచారాన్ని గమనించి రైతులు భయభ్రాంతులు చెందకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. భయాందోళనతో అధికారులకు సమాచారం ఫారెస్టు అధికారులు, పోలీసుల పరిశీలన -
వరద గుప్పిట్లో మూత‘బడి’
ఉపాధ్యాయుల బోధనలు, విద్యార్థుల ఆటపాటలతో కళకళలాడాల్సిన పాఠశాల ఇలా వరద గుప్పిట్లో చిక్కుకొని మూతబడింది. చిన్నపాటి వర్షం కురిసినా నారాయణపేట జిల్లా మరికట్ మండలంలోని పస్పుల గ్రామ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరి చేరి చెరువును తలపిస్తోంది. వరద తగ్గిన తర్వాత దోమల బెడద, దుర్వాసనతో విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మరికల్ -
ముంపు ముప్పు తప్పేనా..?
●దుకాణంలోకి వస్తున్నాయి.. పెద్ద వర్షం పడిందంటే చాలు ప్రధాన రోడ్డుపైకి నీళ్లు వచ్చి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. నల్లకుంట నుంచి వచ్చే కాల్వ సాఫీగా రాకుండా మలుపు ఉండటంతో నీళ్లన్నీ రోడ్డుపైకి వచ్చి మా దుకాణాల్లోకి వస్తున్నాయి. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెద్ద కాల్వలు నిర్మిస్తేనే సమస్య తీరుతుంది. – వెంకటయ్య, బాదేపల్లి వర్షం వచ్చిందంటే.. వర్షం వచ్చిందంటే చాలు భయం వేస్తుంది. రోడ్డుపైకి నీళ్లు చేరి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. రాత్రిళ్లు అయితే చాలా ఇబ్బందిగా ఉంటది. వర్షం తగ్గాక దుకాణం శుభ్రం చేసుకునేందుకు తిప్పలవుతుంది. దుర్వాసన భరించలేక రెండు మూడు రోజులు ఒక రకంగా ఉంటాం. నీళ్లు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలి. – అస్లాం, బాదేపల్లి కాల్వ కట్ చేయడంతో.. వీరశివాజీనగర్లో పెద్దకాల్వను కట్ చేసి నిర్మాణం చేయకుండా వదిలేయడంతో వరద నీరు రోడ్డుపై పారుతూ ఇళ్లలోకి వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా ఆ రోజంతా ఇబ్బందే. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. కట్ చేసిన కాల్వను సరిచేయడంతో పాటు పైనుంచి వచ్చే వరద సాఫీగా వెళ్లేలా పెద్ద కాల్వ నిర్మించాలి. – సంతోష్చారి, వీరశివాజినగర్ ఈఎన్సీలో జాప్యం.. మున్సిపాలిటీలో వరద నీటిని ఎదుర్కొనేందుకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు మంజూరయ్యాయి. దీని ద్వారా మొత్తం 10 పెద్ద కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే సింగిల్ టెండరు రావడం వల్లే ఈఎన్సీలో జాప్యం అవుతుంది. టెండరు వేసిన సంస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పనులు అప్పగిస్తారు. వచ్చే ఏడాదికి ముంపు నుంచి పూర్తిగా బయటపడతాం. – లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల జడ్చర్ల టౌన్: వర్షాకాలం వచ్చిందంటే చాలు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు జలమయమవుతున్నాయి. పాలకులకు ముందుచూపు లేకపోవడం, పాటు కాల్వలు, కల్వర్టులు కబ్జా చేయటంతో పాటు నల్లకుంటను తీసివేయడంతో ప్రతి ఏటా వానాకాలంలో పట్టణ ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ముంపును నివారించేందుకు గానూ టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు విడుదలైనా ఏడాదికాలంగా టెండరు ప్రక్రియలోనే మగ్గుతోంది. పది కాల్వల నిర్మాణం.. మున్సిపాలిటీలో వరద ముంపును నివారించేందుకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొత్తం 10 కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి.. టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే సింగిల్ టెండర్ మాత్రమే రావడంతో ఈఎన్సీ అధికారులు పెండింగ్లో పెట్టారు. టెండర్ వేసిన సంస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం కోసం ఎవాల్యుషన్ చేస్తున్నారు. దీంతో ఏడాదిగా పనులు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్కు పనులు అప్పగించినా వర్షాకాలంలో మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో మున్సిపాలిటీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. జడ్చర్ల మున్సిపాలిటీలో కనిపించని వరద నివారణ చర్యలు చిన్నపాటి వర్షాలకే జలమయమవుతున్న పట్టణం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరైనా టెండర్ ప్రక్రియలోనే పాటు కాల్వలు, కల్వర్టుల కబ్జాతోనే ప్రమాద ఘంటికలు ఈ వర్షాకాలంలోనూ తిప్పలు తప్పవంటున్న పట్టణవాసులు -
ఔత్సాహికులకు నిరుత్సాహం
మహబూబ్నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ (హకీంపేట), కరీంనగర్, ఆదిలాబాద్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదట జిల్లాస్థాయి అనంతరం రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరుగుతాయి. రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో ప్రతిభచాటిన విద్యార్థులు ఈ మూడు స్కూళ్లలో ప్రవేశాలు పొందుతారు. ప్రతి పాఠశాలలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి సెలక్షన్స్కు ముగిశాయి. చిన్నారులను స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్పించాలనే సంకల్పం ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్ స్కూళ్లే ఉండటంతో చాలా మంది విద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. వనపర్తిలో స్థల సేకరణ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన క్రీడా వసతులు గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. పెద్ద పెద్ద భవనాలతోపాటు ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీతోపాటు ఇతర క్రీడల కోర్టులను ఏర్పాటు చేస్తారు. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆయా క్రీడల్లో నిష్ణాతులైన కోచ్లను నియామకం చేసి చిన్నారులకు మెరుగైన క్రీడాశిక్షణ అందజేస్తాయి. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఆహారపరంగా కూడా ప్రత్యేకమైన మెనూ అమలుచేస్తారు. డైటీషియన్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన భోజనం అందిస్తారు. క్రీడా విద్యార్థులకు ఎలాంటి పోషక పదార్థాలు అవసరమో ముందుగానే మెనూ నిర్ణయించి దానికనుగుణంగా భోజన సౌకర్యం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు నోచుకోని స్పోర్ట్స్ స్కూల్ క్రీడా పాఠశాలలో చేరికకు చాలా మంది ఆసక్తి స్థానికంగా లేకపోవడంతో కొందరికే అవకాశం తెలంగాణ క్రీడా పాలసీలోనైనా చోటు కల్పించాలని వేడుకోలు -
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంగళవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వత్థామారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేయక ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ను గెలిపించడానికి ఆర్టీసీ ఉద్యోగులు వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో 90 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. గతం కంటే దారుణంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పేస్కేల్ చెల్లించాలని, చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి వారి పిల్లలకు శాశ్వత పద్ధతిన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో సమ్మె అనివార్య పరిస్థితికి తీసుకురావద్దని కోరారు. ఒకవేళ సమ్మె వస్తే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శంకర్, కోశాధికారి రాజలింగం, రాష్ట్ర కార్యదర్శులు యాదయ్య, నిరంజన్, సత్యనారాయణ, బీఎస్.రెడ్డి, ఎండీ.వహీద్, నాగయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీసీఎస్రెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె,రవీందర్రెడ్డి, డీఎస్చారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, ప్రచార కార్యదర్శి భానుప్రకాశ్రెడ్డి తోపాటు రీజియన్లో ఆయా డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి -
జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1.26 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి 87 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ప్రాజెక్టు 9 క్రస్ట్గ్రేట్లను ఎత్తి 60,075 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం 30,722 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు, కుడి కాలువకు 280 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు కలిసి ప్రాజెక్టు నుంచి మొత్తం 92,985 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు వెల్లడించారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువన 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు కలిపి మొత్తం 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయంలో మంగళవారం 874.8 నీటిమట్టం వద్ద 162.4372 టీఎంసీలుగా ఉంది. జూరాలలో ఆనకట్ట గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 60,075 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,722 మొత్తం 90,797 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం వస్తున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 9.504 మిలియన్ యూనిట్ల విద్యుత్పత్తి చేసి 19,031 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 6.068 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 11,061 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. 87 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు 9 క్రస్ట్గేట్ల ఎత్తివేత కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నుంచి 92,985 క్యూసెక్కుల నీరు దిగువకు -
3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..
మరమ్మతుల కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా.. పట్టింపు లేకుండాపోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత మరమ్మతులకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదన చేయగా.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్లోని ఎనిమిది గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలని భావించగా.. వీటి కోసం ఫిబ్రవరి నెలలో రూ.కోటి మంజూరు చేశారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా.. పురోగతి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్
కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్లతోపాటు ఓ ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ సమీపంలో ఎన్హెచ్–44పై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బీహెచ్ఈఎల్కు ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున కొత్తకోట సమీపంలో మదర్ థెరిస్సా జంక్షన్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా డివైడర్ను ఢీకొని రోడ్డు దాటి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్తోపాటు మరో డ్రైవర్ మడెం నాగరాజు, ప్రయాణికురాలు పావనికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శంకర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురికి గాయాలు -
మేము చెప్పినోళ్లకేఅడ్మిషన్ ఇవ్వాలి!
ఆంగ్ల మాధ్యమం కావడంతో.. మరికల్ కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండటంతో 6వ తరగతిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. మొత్తం 40 సీట్లు ఉండగా.. 413 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీటుకు 10 మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. అయితే మరికల్ మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాము చెప్పిన విద్యార్థినులను చేర్పించుకోవాలని రాజకీయ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో నాయకుడు 5 నుంచి 10 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పించేందుకు ఫైరవీలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యే, మంత్రులచే ఫోన్లు చేయించడానికి కూడా వెనకడాటం లేదు. అంతే కాకుండా 7నుంచి 10 వరకు కూడా ఒక్కో తరగతికి 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సీట్లకు కూడా ఫైరవీలు చేస్తున్నారు. పేదలకు మొదటి ప్రాధాన్యత.. గ్రామాల నుంచి వలస వెళ్లిన వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేని పిల్లలు, బడిబయటి పేద బాలికలకు విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను స్థాపించారు. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో అర్హులైన బాలికలకు సీట్లు రావడం లేదని తెలుస్తోంది. కేజీబీవీలో తమ పిల్లలను చేర్పించేందుకు వచ్చే తల్లిదండ్రులకు సీట్లు లేవని చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికల్: ‘‘మేము చెప్పినోళ్లకే 6వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి.. లేదంటే ఇక్కడి నుంచి పంపిస్తాం’’ అంటూ రాజకీయ పార్టీల నాయకులు మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకానొక దశలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఒత్తిళ్లతో కేజీబీవీ ఎస్ఓ, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ నాయకుడు ఎస్ఓతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెతో గొడవ పడిన ఘటనను వీడియో రికార్డు చేసి ఎమ్మెల్యే, డీఈఓకు పంపిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటే భయమేస్తుందని కేజీబీవీ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఆరో తరగతిలో ప్రవేశానికి ఫైరవీల జోరు 40 సీట్లకు 413 దరఖాస్తులు భయపెట్టిస్తున్నారు.. రాజకీయ పార్టీల నాయకులు తీసుకొచ్చిన విద్యార్థినులకు సీట్లు ఇవ్వకుంటే భయపెట్టిస్తున్నారు. నాతో గొడవకు దిగుతున్నారు. ఓ మహిళా అధికారిణి అని కూడా చూడకుండా గొడవ పడుతూ అగౌవర పరుస్తున్నారు. ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అర్హులైన పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం. – రాజ్యలక్ష్మి, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి, మరికల్ -
రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను మంగళవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారిణులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఫుట్బాల్లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టిస్ చేయడం వల్ల క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, ఉపాధ్యక్షులు రమేష్కుమార్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, కోచ్ వెంకట్రాములు, ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ నికేష్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ -
‘దళితుల భూములు లాక్కొని మొక్కలు నాటారు’
మహబూబ్నగర్ రూరల్: మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ శివారులో గల దళితుల భూములను ఫారెస్టు అఽధికారులు బలవంతంగా లాక్కొని మొక్కలు నాటారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ (టీఎస్) దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ బాధిత రైతులతో కలిసి మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయికి ఫిర్యాదు చేశారు. 431 సర్వే నంబర్లో 20 ఎకరాలకు పైగా భూమిని, 435 సర్వే నంబర్లో 6.37 ఎకరాల భూమిని ఫారెస్టు అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారని వాపోయారు. దీంతో ఆ భూముల యజమానులైన దళితులు పూర్తిగా జీవనోపాధి కోల్పోయారని కలెక్టర్కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటానని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. ఇసుక తరలింపుపై అన్నదాతల ఆగ్రహం మాగనూర్: మండల కేంద్రంలో ఇసుక తరలింపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపుపై గొడవలు చెలరేగడంతో తహసీల్దార్ మంగళవారం గ్రామస్తులతో చర్చించారు. మాగనూర్ సమీపంలో కాకుండా మరెక్కడైనా ఇసుక తీసుకోవాలని తేల్చి చెప్పడంతో తహసీల్దార్ అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో సదరు కొండగల్, నారాయణపేట కాంట్రాక్టర్లు ఆర్డీఓ రాంచదర్తో కలిసి ఇసుక తరలింపునకు ప్రయత్నాలు మొద లు పెట్టారు. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వాగు దగ్గరకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇసుక తరలించడం ద్వారా గ్రామానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో పాటు సమీపంలోని వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ శాఖకు చెందిన ప్రముఖ మంత్రి ప్రోద్బలంతోనే అధికారులు ఇంతలా అత్యుత్సాహం చూయిస్తున్నారని మండిపడ్డారు. స్పందించిన ఆర్డీఓ రాంచందర్ ప్రజలు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరించాలని, మాగనూర్ గ్రామ సమీపంలోని ఇసుక కేవలం ఒక మీటర్ లోతు మాత్రమే తరలిస్తామని సర్ధిచెప్పి పంపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగలక్ష్మి, మైనింగ్ ఆర్ఐ ప్రతాప్రెడ్డి, డీటీ సురేశ్కుమార్, ఇరిగేషన్ ఎస్సీ శ్రీధర్, భూగర్భ జలాల అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
భూగర్భ కేంద్రాన్ని సందర్శించిన హైడెల్ డైరెక్టర్
దోమలపెంట: టీఎస్ జెన్కో హైడెల్ డైరెక్టర్ బాలరాజు మంగళవారం శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల ఆయన జెన్కో హైడెల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయనకు కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్ఈ(ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ(సివిల్) రవీంద్రకుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైడెల్ డైరెక్టర్ మొదట కేంద్రం మొత్తం తిరిగి అన్ని యూనిట్లను పరిశీలించారు. నాలుగో యూనిట్కు సంబంధించి చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించి ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందికి సూచనలు తెలిపారు. అనంతరం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, టీజీ స్టేట్ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శులు మదన్మొహన్రెడ్డి, చరణ్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కోవిడ్ 2020 నుంచి జెన్కోలో బదిలీలు కొంతవరకే జరుగుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లు పదేండ్లుగా బదిలీలుకాక కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా వ్యథ చెందుతున్నారని వాపోయారు. కనీసం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు, భార్యాపిల్లలకు దూరంగా, వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉంటున్న ఇంజినీర్లను గుర్తించి వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, బదిలీలు త్వరతిగతిని చేపట్టాలని విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారానికి సీఎండీ దృష్టికి తీసుకెళ్తానని హైడెల్ డైరెక్టర్ తెలిపినట్లు ఇంజినీర్లు చెప్పారు. అంతకుముందు ఇంజినీర్ల సంఘం నాయకులు, ఇంజినీర్లు హైడెల్ డైరెక్టర్ను శాలువాతో సన్మానించారు.