breaking news
Mahabubnagar District Latest News
-
ఎల్నినో ప్రభావం.. కంది పంట సాగే మేలు
అలంపూర్: వానకాలం పంట సాగులో కంది లాభసాటిగా ఉంటుంది. కంది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కంది సాగు పెరగడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో తట్టుకునే విధంగా ప్రభుత్వం సైతం కంది పంట సాగును ప్రోత్సహిస్తున్నారు. మిశ్రమ పంటగా.. వేరుశనగ, పెసర, సజ్జ, మొక్కజొన్న, పత్తి, అముదం పైర్లలో కంది పంటను మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు. ఇది రైతుకు ఎంతో అనుకూలం. ఏడాది పాటు కంది రైతుకు గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విత్తన రకాలు: కందిలో మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. సీఓ–9, భీమా జీఆర్జీ –152, డబ్ల్యూఆర్జీఈ–93, డబ్ల్యూర్జీఈ–121 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు టీడీఆర్జీ–59, ఎల్ఆర్జీ–133–33, డబ్లూఆర్జీ–255, ఎల్ఆర్జీ–52, పీఆర్జీ–176, ఆశ(ఐసీపీఎల్–87119) రకాలు అందుబాటులో ఉన్నాయి. నేలలు విత్తన మోతాదు.. అన్ని రకాల నేలలు అనుకూలం. చౌడు నేలలు నీరు పీల్చే పొలాలు అనుకూలం కాదు. పొలాన్ని భాగ రెండు లేదా మూడు సార్లు దున్ని మెత్తగా తయారుచేయాలి. మధ్య కాలిక రకాలు హెక్టారుకు 5 నుంచి 10 కిలోలు, స్వల్ప కాలిక రకాలు 15 నుంచి 18 కిలోలు అవసరం అవుతాయి. నాగలి సాళ్లలో కాని, గొర్రుతో గాని విత్తుకోవాలి. మధ్య కాలిక రకాలకు వరుసకు వరుసకు మధ్య దూరం 150 నుంచి 240 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 20 సెంటిమీటర్లు ఉండాలి. ఆగస్టు 15 వరకు ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేసుకోవచ్చు. విత్తన శుద్ధి, కలుపు మందులు కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైజోబియం కల్చర్ను కూడా పట్టించాలి. విత్తన శుద్ధి ద్వారా భూమి, విత్తనం ద్వార సంక్రమించే కొన్ని తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తనం వేసిన వెంటనే పెండి మిథలిన్ హెక్టారుకు 3.25 నుంచి 3.75 లీటర్ల వరకు పిచికారీ చేయాలి. 20 నుంచి 25 రోజుల తర్వాత ఇనుజాతాఫైర్ 750 ఎంఎల్ హెక్టారుక వాడాలి. 60 రోజుల వరకు పైరులో కలుపు సమస్య లేకుండా చూడాలి. ఎరువుల వాడకం.. హెక్టారుకు ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వాడాలి. పైపాటుగా ఎరువులను వేయాల్సిన అవసరం లేదు. నీరు పెట్టడం.. పూత దశలో, కాయ ఏర్పడే దశలో కంది పంట నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూత, పిందె దశలోను తగిన స్థాయిలో నీరు పెట్టాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు కందిలో సస్యరక్షణ చేపట్టాలి. పాడి–పంట -
రైలు కింద పడి యువకుడి దుర్మరణం
జడ్చర్ల: రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు (45) మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో సదరు యువకుడు ఆకస్మికంగా పట్టాలపైకి వెళ్లడంతో ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతడు పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ ధరించి ఉన్నాడని.. కుడి చేతిపై ఇంగ్లిష్లో పీఓడబ్ల్యూఈఆర్ (పవర్) అక్షరాలతో పాటు స్టార్ గుర్తు పచ్చబొట్టుగా వేసుకున్నాడన్నారు. ఎడమ చేతిపై హిందీలో జానీ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామని.. వివరాలు తెలిసిన వారు 87126 58597 నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. యాసిడ్ ట్యాంకర్ బోల్తా: తప్పిన ప్రమాదం కేటీదొడ్డి: ప్రమాదవశాత్తు యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన మండలంలోని నందిన్నె శివారులో రాయిచూర్ ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్నూల్ నుంచి ముంబై వైపు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి యాసిడ్ లీకై పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ కర్ణాకర్ ప్రమాద స్థలానికి చేరుకుని యాసిడ్ పొగతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో వాహనదారులు, స్థానికులను అప్రమత్తం చేశారు. రాయిచూర్ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపి వేసి వేరే మార్గంలోకి మళ్లించారు. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ కర్నూల్ లోని కెమికల్ కంపెనీకి చెందినదిగా గుర్తించా రు. కర్నూల్ నుంచి మరో ట్యాంకర్ను రప్పించి లీకవుతున్న యాసిడ్ను అందులోకి మార్చినట్లు అధికారులు పేర్కోన్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందస్తుగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచామన్నారు. చికిత్స పొందుతూ మేస్త్రీ మృతి రాజాపూర్: మండల కేంద్రంలోని సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మోటార్సైకిల్పై వ చ్చిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం రాజాపూర్ చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేపల్లి గ్రామానికి చెందిన బోయ లింగం (45) రోజు మాదిరిగా మేసీ్త్ర పని ముగించుకుని సోమవారం సాయంత్రం సంతలో కూరగాయలు తీసుకుని తన మోటర్సైకిల్పై యాదయ్యతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్ను హైదరా బాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఓవర్టేక్ చేసి వెళ్తుండగా.. డ్రైవర్ సడన్బ్రేక్ వేయడంతో మోటార్ సైకిల్కు తగిలి లింగం కింద పడిపోయాడు. దీంతో తలకు, భుజానికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడని స్థానికులు 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకో సం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి తీసుకెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి
భూత్పూర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పను లు యుద్ధ ప్రాతిపాదిక పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ అన్నా రు. మంగళవారం మండలంలోని కర్వెన ప్రాజెక్టు ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎగ్గని నర్సింహులుతో కలిసి దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు పరిశీలించారు. కర్వెన రిజర్వాయర్ వరకు మెయిన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం ఏ దశలో పనులు చేపడుతున్నరో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శాంతికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్లు కనిపించడం లేదని, గడువులు ప్రకటించడం కాదని, పనులు పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునారావాసం, పరిహారం, ఆర్అండ్ఆర్ పెండింగ్ పనులు ఫ్రభుత్వమే తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పడాకుల బాల్రాజు, అంజయ్య, నంబి రాజు, రవీందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నిరంజన్, నాగరాజు, సుధీర్కుమార్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలో నకిలీ బాగోతం
● 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న నకిలీ టీచర్ ● అసలు టీచర్ విధులకు డుమ్మా ● విషయం వైరల్ కావడంతో సీడీపీఓ విచారణ జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్ స్థానంలో డూప్లికేట్ టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. 9ఏళ్లుగా తంతు కొనసాగుతున్నా.. ఐసీడీఎస్ అధికారులు గుర్తించకపోగా.. సమర్ధించటం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన సీడీపీఓ ఘటనపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. నాగసాల అంగన్వాడీ టీచర్గా జ్యోతిలక్ష్మి నియమితులైంది. తొలిరోజుల్లో విధులు పర్వాలేదనిపించినా 9ఏళ్లుగా లావణ్య అనే మరో మహిళతో విధులు చేయిస్తుంది. నెలకు రూ.6వేలు ఇచ్చి తనస్థానంలో మరో మహిళతో పనులు చేయిస్తుంది. మొదట్లో ఆయా లేదని సాకుగా.. చెబుతూ లావణ్యతో విధులు చేయించగా.. ఆయా నియమితులైన తరువాత కూడా ఒరిజినల్ టీచర్ విధులకు రాకుండా డూప్లికేట్తోనే కేంద్రం రన్ చేస్తుంది. తన స్థానంలో మరొకరిని నియమించి 20మంది చిన్నా రుల జీవితంపై చెలగాటమాడుతుంది. ఈ విష యంలో ఎవరైనా ప్రశ్నిస్తే తాను పూర్తిగా తప్పుకుని లావణ్యను టీచర్గా పెట్టిస్తానంటూ సమాధానం దాటవేసేది. దీంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే 9ఏళ్లుగా డూప్లికేట్ టీచర్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓ, సూపర్వైజర్ గుర్తించకపోటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే విషయమై ఇటీవల కొందరు సీడీపీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విచారణ చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. మంగళవారం విషయం మీడియాకు లీక్ కావడంతో సీడీపీఓ శోభారాణిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందింది వాస్తవమేనని అంగీకరించారు. బుధవారం విచారణ చేస్తామని బదులిచ్చా రు. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో విషయం వైరల్ కావడంతో వెంటనే నాగసాల అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామంలో గర్భిణులు, బాలింతలు లావణ్య విధులు నిర్వహిస్తున్న విషయాన్ని చెబుతూనే ఒరిజినల్ టీచర్ కూడా అప్పుడప్పుడు వస్తారని బదులిచ్చినట్లు తెలిసింది. అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లావణ్యను వివరణ కోరగా 9ఏళ్లుగా పనిచేస్తున్నానని, టీచర్ నెలకు రూ.6వేలు ఇస్తున్నారని వెల్లడించారు. ఒరిజినల్ టీచర్ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా.. ఇదేం పెద్ద తప్పని, తనకు నెలకు డబ్బులిస్తున్నానని బదులివ్వటం గమనార్హం. తాను సర్ ప్రక్రిలో బిజీగా ఉన్నానని చెప్పటం కొసమెరుపు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనస్థానంలో మరొకరిని పెట్టి విధులు చేయించిన ఘటనపై పూర్తి విచారణ చేసి డూప్లికేట్ టీచర్ను నియమించాలని గ్రామస్తులు కొందరు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని చర్యలు తప్పవని సీడీపీఓ శోభారాణి తెలిపారు. అసలు టీచర్ నకిలీ టీచర్ -
పెరిగిన వరద.. తగ్గిన విద్యుదుత్పత్తి
గద్వాల/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా చేరుతోంది. మంగళవారం 2,41,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 33 క్రస్టుగేట్లు ఎత్తి దిగువనకు 2,21,331 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. విద్యుదుత్పత్తికి 26,817 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750, భీమా–1కు 1,300, భీమా–2కు 872, కోయిల్సాగర్కు 630, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 675, సమాంతర కాల్వకు 535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 2,53,102 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం ఎగువలో 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 234 మెగావాట్లు, ఇప్పటివరకు 26.139 ఎం.యూ., దిగువలో 25.716 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 51.855 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. 6 యూనిట్లలో 234 మెగావాట్ల ఉత్పత్తి -
కేఎస్పీ గేట్ల దిగువన దెబ్బతిన్న కాంక్రీట్
దేవరకద్ర రూరల్: కోయిల్సాగర్ ప్రాజెక్ట్ డ్యాం గేట్ల దిగువ భాగంలో కాంక్రీట్ దెబ్బతిని భారీ గుంత ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. గోడ దిగువ భాగంలో కాంక్రీట్ ఊడిపోవడంతో లోపలి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్లో సుమారు 11 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం పెరిగిన తర్వాత గేట్ల ద్వారా నీటిని విడుదలచేసే సమయంలో గేట్ల దిగువ భాగాన నీటి ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పడిన గుంతకు వెంటనే మరమ్మతు చేయకపోతే.. అది మరింత విస్తరించి నిర్మాణానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. అవసరమైన మరమ్మతు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
కనులపండువగా రాధాకృష్ణ శాంతి కల్యాణం
కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ పట్టణంలో 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా మంగళవారం రాధాకృష్ణ శాంతి కల్యాణ మహోత్సవం, ఉట్లు కొట్టే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండీ అతిరుద్ర శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చిత్రవేదపూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లకీ్ష్మ్నారాయణ సహిత శ్రీమద్ భాగవత యాగ మహోత్సవాలు కనులపండుగగా సాగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా పండితులు చేసిన నృత్యం భక్తులను ఆకర్షించింది. హరీశ్వర దాండియా బృందం ఆడిన దాండియాను చూసి భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు. 16 రోజులపాటు నిర్వహించిన హోమాలు, కల్యాణ మహోత్సవాల సందర్భంగా తరలివచ్చిన భక్తులకు మూడు పూటల అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రతినిత్యం 5 వేల మందికి పైగా భక్తులు ఉత్సవాలను తిలకించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు విచ్చేసి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు, బీచని బాలకృష్ణ, కొండూరు గోవర్ధన్, చిగుళ్లపల్లి సతీష్, పోలా సురేందర్, గుబ్బ వెంకటేష్, మాచిపెద్ది రామస్వామి, జూలూరు ప్రకాష్, కల్మిచర్ల గోపాల్, అశోక్, మురళి, జంగయ్య, పెద్దయ్య, వినయ్ రెడ్డి, గణేష్, సురేష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు -
రవాణా చార్జీలకు మంగళం
ఎరువుల రవాణా భారాన్ని ఎత్తేసిన ప్రభుత్వం ● రైతులకు భారంగా మారనున్న ఎరువుల ధరలు ● ఇకపైన ప్రైవేట్ డీలర్ల చేతిలో రసాయన ఎరువులు కల్వకుర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువులు అందేవి. రైతులకు వేరే ప్రాంతానికి వెళ్లి ఎరువులను తెచ్చుకునే అవసరం లేకుండా అక్కడే రసాయన ఎరువులు కొనుగోలు చేసేవారు. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులను ఆయా ప్రాథమిక సహకార సంఘాలకు ప్రభుత్వమే రవాణా ఛార్జీ భరించి సరఫరా చేసేది. ప్రస్తుతం ఈ రవాణా చార్జీలను ఎత్తివేసి, ఆ చార్జీలను సంబంధిత పీఏసీఎస్లు భరించుకోవాలని జీవో ఆర్టీ నెంబర్ 391ను విడుదల చేసింది. సహకార సంఘాలకు అందించే ఎరువుల రవాణా భారాన్ని ఎత్తివేశామని, ఇందుకు సంబంధించిన జీవోను అన్ని సహకార సంఘాలకు పంపించి వెంటనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై రవాణా భారం డబ్బులు కూడా రైతుపైనే పడనున్నాయి. ఇప్పటి నుంచి సహకార సంఘాలు బహిరంగ మార్కెట్లో అమ్మిన విధంగానే ఎరువులను అమ్మే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే రైతుపై ఒక్కో బస్తాకు రూ.15 రవాణా చార్జీల భారం పడనుంది. రవాణాకు పాడిన మంగళం మార్క్ఫెడ్ నుంచి పీఏసీఎస్లకు ఎరువులను ఉచితంగా సరఫరా చేసే రవాణా ఖర్చులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకనుంచి ఆయా సహకార సంఘాలకు వచ్చే ఎరువుల లారీ రవాణా ఖర్చులను వారే భరించుకోవాల్సి ఉంటుంది. ఒక్క బస్తా యూరియా సహకార సంఘంలో రూ.266లకు లభిస్తే, ప్రైవేట్లో రూ.300 వరకు అమ్మేది. తాజాగా మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన ర్యాకుల వద్దకు లారీలను మాట్లాడుకుని, ఎరువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. లారీల యజమానులు కిరాయిలు పెంచే అవకాశం ఉండటంతో ఎరువుల విక్రయాల నుంచి సహకార సంఘాలు తప్పుకునే ఆలోచనలు చేస్తున్నాయి. మార్క్ఫెడ్ ద్వారా ఉచిత రవాణా మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలోని 17 సహకార సంఘాలకు రసాయన ఎరువులు అందేవి. రైల్వే వ్యాగన్లు లేకుంటే గోదాముల్లో నిల్వచేసిన ఎరువులను ఆయా సంఘాలకు రైతుల అవసరాన్ని బట్టి సరఫరా చేసేది. ఇదే సంస్థకు చెందిన లారీల్లో హమాలీలతో ఎరువుల బస్టాండ్ లోడ్ చేయించి పంపించేది. ఈ ప్రక్రియలో లారీలు, హమాలీల ఖర్చులను మార్క్ఫెడ్ భరించేది. దీంతో ఆయా సహకార సంఘాలు హమాలీల ఖర్చు, సంఘానికి కొద్దిపాటి లాభాన్ని చూసుకుని, బయట వ్యాపారుల కంటే తక్కువ రేటుకు రైతులకు ఎరువులు అందించేవారు. సహకార సంఘంలో రైతులకు అందించే ఒక్కో ఎరువు బస్తా అసలు ధర రూ.252 కాగా, హమాలీ ఖర్చు రూ.6.5, మామూలు కింద రూ.2, ఆయా సంఘాల లాభం కింద రూ.5 ఇలా బస్తాకు రూ.266–268 వరకు అమ్మేవారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సహకార సంఘాలకు, మండల కేంద్రానికి కొద్ది దూరంలో ఉండే సహకార సంఘాలకు రవాణా చార్జీల్లో వ్యత్యాసం వచ్చి బస్తా ధర మరింత ఎక్కువగా అవుతుంది. పీఏసీఎస్ల ద్వారా అందించే ఎరువులకు సంబంధించి ధరలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీతో అందించే రవాణా చార్జీలను సంఘాలే భరించాలని చెప్పడంతో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. సంఘాల్లోనూ ఇలా రేట్లు పెరిగితే ప్రైవేటు మార్కెట్లో ఎరువుల ధరలు మరింతగా పెరిగి రైతులకు భారం కానుంది. – దస్రునాయక్, రైతు, సారబండతండా, చారకొండ మండలం రసాయన ఎరువుల ధరను శుక్రవారం నుంచే బస్తాపై రూ.30 వరకు పెంచారు. ధరలు ఎందుకు పెంచారని అధికారులను అడిగితే, ట్రాన్స్పోర్టు చార్జీలు పెరిగాయని అందుకే ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఒక్కో బ్యాగుపై ఇంతగా ధరలు పెరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. – భీమయ్య గౌడ్, రైతు, చెర్కూర్, వెల్దండ మండలం అన్ని సహాకార సంఘాల్లో ఒకే రేటు ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్టు చార్జీలు లేకపోవటం వల్ల ఒక్కో దగ్గర ఒక్కో రేటకు ఎరువులను విక్రయిస్తున్నారు. రైతులు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడ కొనుగోలు చేసేవారు. ఇకపై రైతులకు ఇబ్బంది లేకుండా యూనిఫామ్ ధరకు ఎరువులు లభించేలా చూస్తున్నాము. – తహాసీన్, ఎండీ, మార్క్ఫెడ్ -
15, 16 తేదీల్లో ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15, 16 తేదీల్లో ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మహబూనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డబుల్స్లో మాత్రమే పోటీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 12వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాల కోసం 98480 85211 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
తుది దశకు సర్
● 10తో ముగియనున్న ఎస్ఐఆర్మొదటి దశ ● జిల్లాలో గత ఓటరు జాబితా ప్రకారం 99,132 ఓట్ల తొలగింపు? మహబూబ్నగర్ న్యూటౌ: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)–2026 ఎన్యూమరేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్ 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేసి.. పూర్తి చేసిన ఫారాలను ఓటర్ల నుంచి తీసుకొని మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముంగియనుండటంతో బూత్ లెవల్ అధికారులు జల్లెడ పడుతున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో గతంలో మొత్తం 7,32,488 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్–2026లో భాగంగా వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి బీఎల్ఓల ద్వారా అందజేశారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వాటిని తిరిగి సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు. బీఎల్ఓ యాప్ ద్వారా 6,29,846 మంది ఓటర్ల వివరాలను పరిశీలించి అనుమతించారు. చనిపోయిన వారి వివరాలు, డబుల్ ఓటర్ల వివరాలతో పాటు అడ్రస్ మారిన వారు, అందుబాటులో లేని ఓటర్ల వివరాలు బీఎల్ఓల దృష్టికి వచ్చాయి. వీటితో పాటు ఈ నెల 3వ తేదీ నాటికి గుర్తించలేని ఓటర్లు 804 మంది ఉన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అవకాశముండటంతో జల్లెడ పడుతూ ఓటర్ల వివరాలను సేకరించి మ్యాపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత జాబితాలో నమోదై ఉన్న ఓటర్లలో 99,132 మందిని జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టిన అనంతరం 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. -
కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం
మరికల్: కడుపునొప్పి భరించలేక చెట్టుకు ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడని ఘటన సోమవారం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పంపల్లికి చెందిన కె.రవికుమార్(22) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తన పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల రైతులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జీ ఎస్ఐ గాయత్రి తెలిపారు. ఉరేసుకుని తాపీమేసీ్త్ర బలవన్మరణం ● వేధింపులే కారణమా..? చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో తాపీమేసీ్త్ర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ కరిముల్లా(52) కొన్నేళ్లుగా మండల కేంద్రంలో తాపీమేసీ్త్రగా పనిచేసుకుంటూ అద్దెకు నివాసముంటున్నాడు. ఇటీవల నూతనంగా ఓ ఇంట్లో పనులు చేస్తున్నాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో 3వ అంతస్తులోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కొండికి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీగా పనిచేస్తున్న మరోవ్యక్తి అక్కకెళ్లి చూడగా విగతజీవిగా ఉండడంతో సమీప స్థానికులకు తెలుపగా పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలను తెలుసుకొని భార్య దిబిజాన్, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కల్వకుర్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఖరిముల్లా బాబాయి కరీంబాషాను చనిపోవడానికి గల కారణమైన వ్యక్తుల గురించి కాగితంలో రాసినట్లు తెలిపాడు. దీంతో మండలకేంద్రంలో ముగ్గురు వ్యక్తులు తమ తండ్రికి కారణమయ్యారని, వారు డబ్బులిచ్చి మేసీ్త్ర పనిచేయించుకొని ఇబ్బందులకు గురి చేశారని వేధించడంతో మనస్తాపంతో మృతిచెందాడని, కారకులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు చారకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. పరామర్శించేందుకు వెళ్తూ మృత్యుఒడికి.. ● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి రాజాపూర్: వరుసకు కొడుకై న వ్యక్తి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చెల్కచిల్కమర్ర గ్రామానికి చెందిన మనీల(36) వరుసకు కొడుకై న శ్రీకాంత్ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్నా విషయం తెలుసుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బంధువులు రమేశ్, రాకేశ్లతో కలిసి బైక్పై వెళ్తుండగా వీరి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మనీల తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలి భర్త చెనిగారి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మొసలిని బంధించిన అధికారులు వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు రొయ్యల రమేష్ వ్యవసాయ పొలంలోని బావిలో ఉన్న మొసలిని సోమవారం ఎస్ఐ హృశికేష్ ఆధ్వర్యంలో స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్, వారి బృందం, ఫారెస్టు అధికారులు బంధించి బయటకు తెచ్చారు. అటవీ అధికారుల సమక్షంలో సొసైటీ సభ్యులు మొసలిని సురక్షితంగా జూరాల ప్రాజెక్టులో వదిలినట్లు తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేత మానవపాడు: మండలంలోని రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద సోమవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ స్వాతి తెలిపిన వివరాలు.. బ్లూకోర్టు సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా.. కర్నూలు వైపు నుంచి వస్తున్న టిప్పర్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా నాగర్కర్నూల్ జిల్లా అమనగల్లుకు చెందిన టిప్పర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. టిప్పర్ యాజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు నాణ్యతతో రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆటోమేటిక్ స్కోరింగ్, గ్రేడింగ్ విధానంలో జిల్లాకు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్–2026ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి శాఖపై ఉందన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులు, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల సమన్వయంతో రూపొందించాలని తెలిపారు. ఈ ప్రణాళికల్లో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితర భాగస్వాములందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు గ్రామసభలు, మండలసభల్లో తప్పనిసరిగా పాల్గొని నాణ్యమైన ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, డీఆర్ఓ నిర్మల, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ఆహారం తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ అహారమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ‘‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం – సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం’’ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
వర్షం అంతంతే.. ప్రత్యామ్నాయమే మేలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. పత్తి, కంది, వరి, జొన్న, కూరగాయల పంటలను పరిశీలించిన అనంతరం చీడపీడల నివారణ, పోషక నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని కౌకుంట్లతో పాటు రేకులంపల్లి, ఇస్రంపల్లి, అప్పంపల్లి గ్రామాల్లో సోమ వారం పీజేటీఎస్ఏయూ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కల్యాణి, డాక్టర్ వి.దివ్యవాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, పంటల ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు. యాజమాన్య పద్ధతులు పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి కనిపిస్తే ఎసిటామిప్రీడ్ను లీటరు నీటికి 0.25 గ్రాములు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్ను లీటరు నీటికి 0.3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో చీడపీడల ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. కంది, పత్తి పంటల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల ఎదుగుదల దెబ్బతినకుండా ఉండేందుకు రెండు శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువు ద్రావణం, అలాగే నానో డీఏపీ, నానో యూరియా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. జొన్న పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరంట్రానిలిప్రోల్ను లీటరు నీటికి 0.3 మిల్లీమీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, ప్రత్యామ్నాయంగా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేయాలని సూచించారు. ఆగస్టు 15లోపు కంది, రాగి, కొర్ర, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను బోదెలు, సాళ్ల పద్ధతిలో సాగు చేయడం ఉత్తతమని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శివ, ఏఈఓలు గాయత్రి, శివ పాల్గొన్నారు. -
ఈజీమనీకి అలవాటుపడి దొంగతనాలు
● వెంచర్లలో వరుసగా విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్టు ● నిందితుల నుంచి 750 కేజీల వైరు, నగదు స్వాధీనం వెల్దండ: ఈజీమనీకి అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న ముఠాను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి తెలిపారు. వివరాలిలా.. వెల్దండ స్టేషన్ పరిధిలోని వెంచర్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు చోరీ అవుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన మునావత్ మోహన్, మునావత్ దినేష్ తండ్రీ కొడుకులు పాత ఇనుప దుకాణం నడిపిస్తున్నారు. వీరికి పరిచయం ఉన్న రాజు, దినేష్, రమేష్తో కలసి ఈజీమనీ సంపాదించాలని నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. సోమవారం కొట్రచౌరస్తాలో ట్రాలీ ఆటోతో తండ్రీకొడుకులు అనుమానంగా కనిపించారు. దీంతో వారిని విచారించడంతో మే నెలలో వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో ఉన్న ఆర్ఆర్ఆర్ వెంచర్లో దినేష్, మోహన్, అదేవిధంగా యూపీకి చెందిన రాజు, హైదరాబాద్కు చెందిన దినేష్, రమేష్ ఐదుగురు కలిసి 60విద్యుత్ స్తంభాల వైర్ను చోరీ చేసినట్లు తెలిపారు. జూన్ మొదటివారంలో కల్వకుర్తి సమీపంలోని బాలాజీ టౌన్షీప్ వెంచర్లో 30స్తంభాల వైర్, జూలై 12వ తేదీన కొట్ర శివారులో ఉన్న మరో వెంచర్లో 70స్తంభాల విద్యుత్ వైర్ను చోరీ చేసినట్లు తెలిపారు. విద్యుత్ వైర్ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పాత ఇనుప సామాను షాపులో విక్రయించినట్లు తెలిపారు. వారిపై మూడు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి 750 కేజీల వైరు, రూ.75వేల నగదు, చోరీకి ఉపయోగించిన ట్రాలీఆటో, మహేంద్ర థార్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రాజు, దినేష్, రమేష్ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నజీర్, అంజి, నవీన్, కిషోర్కుమార్రెడ్డిని డీఎస్పీ అభినందించారు. -
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడంలో అన్ని శాఖల సమష్టి కృషి దాగి ఉందని అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆపరేషన్ ముస్కాన్లో కీలక పాత్ర పోషించి ఉత్తమ విధులు నిర్వహించిన అన్ని రకాల శాఖ అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. భవిష్యత్లో కూడా చిన్నారుల సంక్షేమం కోసం ఇదే సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో బాల కార్మికులు, భిక్షాటన, బాల్య వివాహాలు, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించడంలో ప్రతి శాఖ బాధ్యతతో పని చేసిందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణ, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, డీసీపీఓ నర్మద, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, కార్మిక శాఖ అధికారి బాసిత్, ఎస్ఐ లెనిన్ పాల్గొన్నారు. -
విశ్వశాంతి మహాయాగం పరిపూర్ణం
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో 16 రోజులుగా నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవోపేతంగా ముగిసింది. సోమవారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాలతో త్యాగం పరిపూర్ణమైందని కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిజీ అన్నారు. శాంతిహోమం, గోపూజ, మహాపూర్ణాహుతి, గురుపూజ, అవబదస్నానం ఆచరించారు. సాయంత్రం ఉత్సాహంగా ఉట్టికొట్టు కార్యక్రమం జరిపారు. రాత్రి రాధాకృష్ణ శాంతికల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రుత్వికులను ఘనంగా సత్కరించారు. ముగింపు సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సాంప్రదాయాలను గౌరవించి ధర్మబద్ధంగా జీవించాలన్నారు. అనంతరం యాగ నిర్వాహకులు స్వామిజీ ఎమ్మెల్యేకు ఖడ్గాన్ని బహూకరించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో పాటు ప్రముఖులు యాగానికి విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్రెడ్డి రూ.5 లక్షలు, నాయకుడు జూలూరి బాలస్వామి రూ.51 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, జూలూరు రమేష్బాబు, కొండూరు గోవర్ధన్, బీచని బాలకృష్ణ, చిగుళ్లపల్లి సతీశ్, పోలాసురేందర్, మాచి పెద్దిరామస్వామి పాల్గొన్నారు. -
స్పందన లేదు..
ఉద్యోగం కోసం ఎన్నోసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం.. అయినా ఇంతవరకు స్పందన లేదు. ఆ రోడ్డు ప్రమాదంలో మా నాన్న శివాజీ, అమ్మ చాందిని చనిపోయారు. నాకు ఇద్దరు అక్కలు అనుష, సరిత ఉన్నారు. వారి పెళ్లిళ్లు చేశాం. ప్రమాదంలో అమ్మానాన్న చనిపోయినప్పుడు మా అక్క డీఈడీ పూర్తి చేసింది. అప్పుడు మాకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, ప్రజావాణి చుట్టూ తిరిగినా ఫలితం లేదు. నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. – సంతోష్, గోగ్య తండా ● -
బడి.. బహుదూరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు గొప్ప ప్రయోజకులు కావాలని జిల్లా కేంద్రంలోని పలు స్కూల్స్లో నాణ్యమైన విద్య అందుతుందన్న భావనతో తల్లిదండ్రులు ఇక్కడి పాఠశాలల్లో చేర్పించారు. వసతి కోసం ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తే అక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేకపోగా.. పాఠశాలలకు వెళ్లేందుకు అనేక ఇక్కట్ల పాలయ్యే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఉదయం సాయంత్రం వేళ్లలో పాఠశాలకు సమయానికి వెళ్లాలన్న, హాస్టల్కు సకాలంలో చేరుకోవాలన్న ఎండ, వర్షం పట్టించుకోకుండా కాలినడకన ప్రయాణం సాగించాల్సి ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో కలిపి సుమారు 5 కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. 5, 6, 7 తరగతుల చిన్నరులు రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందిగా భావించే పరిస్థితి. అయిన ఇటూ హాస్టళ్ల వార్డెన్లు, జిల్లా సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దూరం ఎందుకు హాస్టళ్లు లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న బాలుర హాస్టల్స్ రెండు కూడా ప్రభుత్వ భూమిలో పక్క భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో జిల్లాకేంద్రంలో ఉన్న పాఠశాలలకు రావాల్సిన పరిస్థితి ఉంది. వానగుట్ట దగ్గరున్న ఎస్టీ హాస్టల్ కూడా ప్రభుత్వ భవనం కావడంతో అక్కడ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పాఠశాలలు సకాలంలో లేకపోడంతో జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంది. అయితే గతవారం రోడ్డు దాటుతున్న ఓ బాలుడికి బైక్ తగిలి గాయాలైనట్లు తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. సదుపాయం ఏర్పాటు చేస్తాం లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఎస్సీ బాలుర, ఆనంద నిలయం విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నట్లు దృష్టిలో ఉంది. వారికోసం వాహనం ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ, ప్రైవేటు ఎన్జీఓల ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. – సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి తక్కువ మంది విద్యార్థులున్నారు వానగుట్ట వద్ద ఉన్న ఎస్టీ హాస్టల్ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. చాలా తక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారని ఇటీవల వార్డెన్ పేర్కొన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఆపేవిధంగా చర్యలు తీసుకుంటాం. – ఛత్రునాయక్, ఎస్టీ సంక్షేమశాఖ అధికారి అన్నీ తెలిసినా.. అధికారులు పట్టించుకోరు విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారని అధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. గతంలో సంబంధిత హాస్టళ్ల వార్డెన్లు సంక్షేమ శాఖ అధికారులకు సమస్యను చెప్పారు. ఈ విషయం గత కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల వార్డెన్లు విద్యార్థులను పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి షూ ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యార్థులకు అందించలేదని తెలుస్తుంది. దీంతో విద్యార్థులు కాళ్లకు షూ, చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడిచి వెళ్లడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లా కేంద్రంలోని హాస్టల్ విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఇక్కట్లు ఎండా, వర్షం వచ్చిన స్కూల్కు సమయానికి చేరుకోవాల్సిందే.. కాళ్లకు చెప్పుల్లేకుండా కిలోమీటర్ల మేరా నడిచి వెళ్తున్న వైనం -
పూర్తి బాధ్యత అన్నారు.. పట్టించుకోలేదు
విద్యాబోధన పూర్తి బాధ్యత అన్నారు. ఇంతవరకు పట్టించుకోలేదు. మా నాన్న చెన్నయ్య గతంలోనే చనిపోగా, అమ్మ పార్వతమ్మ కూలీ పనులు చేస్తూ నన్ను, మా అక్క శ్రీలతను చదివించింది. ఆ రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందడంతో బతుకు భారమైంది. అక్క శ్రీలత ఇంటర్ పూర్తి కాగానే బంధువులందరూ కలిసి పెళ్లి చేశారు. నేను కష్టపడి చదివి ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. ప్రస్తుతం నాకు అమ్మమ్మ తోడుగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నాడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. – బొంకూరు శ్రీకాంత్, ఎం.ఫార్మసీ, కొత్తపల్లి ● -
మా గోడు ఎవరికి చెప్పుకోవాలి..
గోగ్యతండాకు చెందిన సుక్రునాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య దేవితో పాటుగా ముగ్గురు పిల్లలు శివాని, శివ, గోగ్య ఉన్నారు. కుమార్తె శివానికి గుండె సంబంధిత వ్యాధి ఉండగా.. ప్రభుత్వ పరంగా ఆపరేషన్ చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. పాపకు 15 ఏళ్ల లోపే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం శివానికి 16 ఏళ్లు వచ్చాయి.. అయినా వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘ఇంటి పెద్ద లేడు. మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.’ అని దేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
మధ్యవర్తులు లేకుండా నిర్భయంగా స్టేషన్కు రండి
మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కేసులపై ఆరా తీశారు. పెండింగ్లో పెడుతున్న ఫిర్యాదులపై సకాలంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు పైరవీలు చేయడం లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు (పర్సన్ ఇన్చార్జి) గోనెల శ్రీనివాసులు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు ఆర్థిక బడ్జెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. చేప పిల్లలు, ఉపాధి కోసం, స్కిల్డవెలప్మెంట్, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నిధులు కేటాయించి జీవో కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దోమ పరమేష్, బాలగోపి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ సీఈఓగా షఫీ ఉల్లాఖాన్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మహమ్మద్ షఫీ ఉల్లాఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో సహకార బ్యాంకుసేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. -
లారీ బోల్తా: డ్రైవర్ మృతి
చారకొండ: పేపర్ లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ చెందినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కర్ణాటక నుంచి కలకత్తాకు పేపర్ లోడ్తో లారీ వెళ్తోంది. మండలంలోని జడర్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సారంబండ తండా సమీపాన మూలమలుపున అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన రేలీంగ్ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కిశోర్బాబు(40) కుడిచేతి మణికట్టు వద్ద విరిగి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకన్నాడు. స్థానికులు అంబులెన్స్లో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. -
ఉదండాపూర్ భూ రికార్డుల మాయంపై ఫిర్యాదు
జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూ సేకరణ రికార్డులను మాయం చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపాలని కోరురూ సోమవారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు భూనిర్వాసితులు ఫిర్యాదు చేశారు. 2017లో రిజర్వాయర్ పరిధిలోని వల్లూరు గ్రామానికి సంబంధించిన రైతుల నుంచి భూ సేకరణకు అంగీకారం తీసుకున్నారు. ఆ సమయంలో తమ వ్యవసాయ భూముల్లో గల బోర్లు, పైపులైన్లు, చెట్లు, పుశువుల కొట్టాలు తదితర నిర్మాణాలకు సంబంధించి పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే తమ నుంచి అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. తదుపరి పరిహారం అందించలేదని ఇందుకు సంబంధించిన రికార్డులను కూడా అప్పటి తహసీల్దార్ లక్ష్మీనారాయణ, గిర్దావర్ సుదర్శన్రెడ్డి మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ప్రస్తుత అధికారులు ఆయా రికార్డులు తమ వద్ద లేవని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
‘దీపం’ మంటలు.. రోడ్డున పడిన బతుకులు
● ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధం ● కాలిబూడిదైన రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గద్వాల క్రైం: దేవుడికి పెట్టిన దీపం నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా నిరుపేద కుటుంబానికి చెందిన పూడి గుడిసె దగ్ధమైన ఘటన గద్వాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన బుడగ జంగలగోపాల్ రియల్ వ్యాపారం, భార్య ప్లాస్టిక్ సామాగ్రి, సిల్వర్ గిన్నెల విక్రయాలు చేస్తున్నారు. ఉదయం వారు ఉంటున్న గుడిసెలో పూజ చేసి దీపం వెలిగించి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దీపం నుంచి వెలువడిన నిప్పురవ్వలకు గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున అలుముకోవడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తెచ్చారు. సర్వం కోల్పయిన వైనం... ప్రమాదంలో ఇంటి అవసరాల కోసం ఇటీవల అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారం, 10 తులాల వెండి, ఇతర వంట సామగ్రి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భూతగాదాలే హత్యకు కారణం
● కేసు కోర్టు పరిధిలో ఉండగానే దారుణం ● నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ పెంట్లవెల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం జరిగిన ఆర్ఎంపీ మల్లయ్య హత్యకు భూవివాదమే కారణమని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 31న రాత్రి 8 గంటల సమయంలో మల్లయ్య హత్యకు గురయ్యాడని, ఈ ఘటనపై దర్యాప్తు చేయగా క్లీనిక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన వివరాల ప్రకారం నిందితులు పెంట్లవెల్లికి చెందిన బింగి కృష్ణయ్య, బింగి ఎల్లమ్మ, బింగి నాగమ్మగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మృతుడితో తమకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోందని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆ వివాదంపై 14 కేసులు పోలీస్స్టేషన్లో నమోదయ్యాయని, గతంలో కూడా గ్రామ పెద్దలతో పలుమార్లు కూర్చొని మాట్లాడారన్నారు. సివిల్ కేసులు వేసుకుని వీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒక్కరు ధ్వేషం పెంచుకున్నారని తెలిపారు. అందులో భాగంగా జూలై 31న ఇరువర్గాలు కోర్టుకు వెళ్లగా.. అక్కడ జరిగిన వాగ్వాదాన్ని దృష్టిలో పెట్టుకుని అదే రోజు గ్రామానికి చేరుకొని, పథకం ప్రకారం మల్లయ్యపై దాడి చేసి హత్య చేసినట్లుగా వారు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందితలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి అదే రోజు రిమార్డుకు తరలించినట్లుగా ఆయన తెలిపారు. అదే విధంగా ఈ హత్యకు ప్రోత్సహించిన అదే గ్రామానికి చెందిన డిశ్ శేఖర్పై కూడా కేసు నమోదు చేశామని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. మల్లయ్య హత్య దారుణం పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ మల్లయ్య హత్య దారుణమని తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్రెడ్డి అన్నారు. భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు లో కొనసాగుతుండగా.. నిందితులు ఆవేశపడ్డారని అభిప్రాయపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాలని డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా నిందితులకు బెయిల్ రాకుండా న్యాయ వాదుల తరఫున పోరాడతామని వెల్లడించారు. -
తల్లిపాలే అమృతం
మహబూబ్నగర్ రూరల్: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు -
..ముంగిట పురుషులు
●పాలమూరు: పుట్టుకలో మహిళల కంటే ముందు వరుసలో కొనసాగుతున్న పురుషులు.. మరణాల్లో సైతం అదే బాటలో పయనిస్తున్నారు. పురిట్లో కొందరు మరణిస్తుంటే.. అధికంగా చెడు వ్యసనాలు, అనారోగ్య సమస్యలు.. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో మరణాల లెక్కలను పరిశీలిస్తే.. నాలుగు పదుల వయసులోనే చాలామంది తనువు చాలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలే అధిక శాతంగా ఉంటున్నాయి. దాదాపు అదే వయసులో ఉన్నవారు ప్రస్తుతం 37.23 శాతం రక్తపోటు, 28.36 శాతం మధుమేహంతో బాధపడుతున్నారు. గతేడాది కాలంలో జిల్లాలో 2,863 మంది మరణించగా.. ఇందులో 1,923 మంది పురుషులే ఉండటం గమనార్హం. వీటిలోనూ గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే అధికంగా నమోదయ్యారు. జీవనశైలితోనే పెద్ద దెబ్బ గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్నివర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి.. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు (టార్గెట్లు) అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. ఈ క్రమంలో చాలామంది వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. తీవ్ర అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇళ్లలో వండుకునే తీరిక.. ఓపిక లేక బయట తిళ్లకు అలవాటు పడుతున్నారు. ప్రసవాల్లో మొదలుకొని.. వివిధ రకాల కారణాలతో మృత్యువాత పల్లెల్లో కంటే పట్టణాల్లోనే మరణాల శాతం ఎక్కువ యుక్త వయసులో మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లే కారణం ఆహారపు అలవాట్లతోపాటు జీవన విధానంతోనూ మరణశాసనం -
వైభవంగా తోట మైసమ్మ బోనాలు
స్టేషన్ మహబూబ్నగర్: నగరంలోని కుర్హినిశెట్టికాలనీ మైసమ్మ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ జరిపి.. ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని నగర మేయర్ మమత, కార్పొరేటర్లు దర్శించుకున్నారు.వేగంగా విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. రామచంద్రాపూర్లో మద్య నిషేధం మహబూబ్నగర్ రూరల్: యువత మద్యానికి బానిసవడంతోపాటు కుటుంబాలకు భారంగా మారుతున్న పరిస్థితిని అరికట్టాలనే ఉద్దేశంతో రూరల్ మండలంలోని రామచంద్రాపూర్లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింహులు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామస్తులు పాల్గొని బెల్ట్ షాపులపై కఠిన చర్యలకు మద్దతు తెలిపారు. ఇకపై గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని, అలాంటి వారి సమాచారాన్ని అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించడం గమనార్హం. -
20 ఏళ్ల వారికీ గుండెపోటు..
గత 20 ఏళ్ల కిందట గుండెపోటు చాలా తక్కువగా వచ్చేది. ఇందులో కూడా 50 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఉండేది. కానీ, ప్రస్తుతం మారిన జీవన శైలి వల్ల 20 ఏళ్ల యువకుల దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకులే అధికంగా ఉంటున్నారు. దీనికి ప్రధానంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, పాస్ట్ఫుడ్, బరువు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటివి గుండెపోటుకు దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100 మంది రోగులలో 70 శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. – మహేష్బాబు, కార్డియాలజిస్ట్ -
సరదా.. ముప్పు
● జల పరవళ్లు చూసేందుకు తరలివస్తున్న జనం ● దిగువ నదిలో ప్రమాదకరంగా సెల్ఫీ ఫోజులు ● అదుపుతప్పితే ప్రవాహంలో గల్లంతయ్యే ప్రమాదం ● సూచిక బోర్డులు ఏర్పాటు చేయని ప్రాజెక్టు అధికారులు అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో ప్రాజెక్టు దిగువ భాగం కళకళలాడుతున్నా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రస్ట్ గేట్ల నుంచి నురగలు కక్కుతూ దిగువకు పారుతున్న నీటి దృశ్యాలను చూసేందుకు, నది అంచునకు వెళ్లి సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఉహించలేని పరిస్థితి నెలకొంది. నిత్యం పోలీసు పహార ఉండాల్సిన అవసరం ఉన్నా.. కేవలం నామమాత్రపు గస్తీ నిర్వహిస్తూ వెళ్తుండటంతో పర్యాటకులు నది అంచున వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి దిగువకు సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంలో దిగువన ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు ముళ్లకంచె ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రాజెక్టు పైభాగం నుంచే పర్యాటకులను తిలకించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎడమ కాల్వ వద్ద మరీ డెంజర్.. జూరాల ఎడమ కాల్వ వద్ద నీటి ప్రవాహం ఉధృతిని గుర్తించలేని యువత ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే చేప ఫ్రైని తిని ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక కర్ణాటక రాయచూర్ నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తుంటారు. చేప వంటకాలతో పాటు మద్యం అమ్ముతుండటంతో తాగిన మైకంలో యువకులు కాల్వలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల కిందట మహబూబ్నగర్కు చెందిన ఐస్క్రీం విక్రయదారు జూరాల సందర్శనకు వచ్చి నదిలో స్నానం చేస్తూ గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే ఏడాది మహబూబ్నగర్కు చెందిన ముస్లిం యువకుడు సైతం కుటుంబ సభ్యుల కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్ప వరద వస్తుందని తెలిసిన మరుక్షణమే దిగువ నదిలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదు. -
సమస్యల సవాళ్లు..!
జిల్లాలో భూభారతి రీ సర్వేకు రివర్స్ పంచ్లు ● పాల్గొనని లైసెన్స్డ్ సర్వేయర్లు.. డిప్యూటేషన్లలో ప్రభుత్వ సర్వేయర్లు ● క్షేత్రస్థాయిలో అడ్డంకులు సృష్టిస్తున్న ఎఫ్లైన్ ఫిర్యాదులు ● ఇప్పటికీ ప్రామాణికంగా నిజాం కాలం నాటి మ్యాపులే ● జిల్లాలోని 6 గ్రామాల్లో సా..గుతున్న సర్వే పనులు –8లో u●జిల్లాలో భూ రీ సర్వేకు సర్వేయర్ల కొరత వేధిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లు వారికిస్తున్న పారితోషికం సరిపోవడం లేదని రావడం లేదు. ఒకవైపు ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటితోపాటు భూ రీ సర్వే పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం. – ఎండీ మూసా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మహబూబ్నగర్ న్యూటౌన్: గుట్టకు ధారం కట్టాం.. వస్తే గుట్ట.. లేకుంటే ధారం అన్నట్లుగా ఉంది జిల్లాలో భూముల రీ సర్వే తీరు. భూముల రీసర్వే ద్వారానే భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చనే ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ ఆరు నెలలుగా ఆచరణలో కప్పదాట్లు వేస్తోంది. ఎదురవుతున్న అనేక సమస్యల కారణంగా రీ సర్వేకు రివర్స్ పంచ్ తగులుతోంది. లైసెన్స్డ్ సర్వేయర్లు రాకపోవడం, ఉన్న సర్వేయర్లలో డిప్యూటేషన్లపై వెళ్లడం, సిబ్బంది ఖాళీలు, ఎఫ్–లైన్ ఫిర్యాదుల పెండింగ్, భూ సేకరణ పనులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం వంటివి రీ సర్వేకు సవాళ్లు విసురుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. నిజాం కాలంలో జరిగిన సర్వేల ఆధారంగా తయారు చేసిన మ్యాపులు, హద్దులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉండటం, భూముల విలువలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హద్దుల గొడవలు, గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్ల ఓవర్ ల్యాపింగ్, సబ్డివిజన్ సమస్యలతో భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. భూ ప్రక్షాళనతో రికార్డుల ప్యూరిఫికేషన్ చేపట్టినప్పటికీ సమస్యలు తీరలేదు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గండేడ్ మండలంలోని సాలార్నగర్ గ్రామంలో భూముల రీసర్వే చేపట్టారు. అక్కడ ఎదురైన అనుభవాలను అంచనా వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 2025 అక్టోబర్ 27న జిల్లాలో 17 గ్రామాలను ఎంపిక చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన సిబ్బంది లేకపోతే సాధ్యం కాదని లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను భూ రీసర్వేకు ఉపయోగించుకోవాలని వారికి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేసింది. భూ రీ సర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో మండల సర్వేయర్ పర్యవేక్షణలో సర్వే నిర్వహణకు లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించారు. ఈ ప్రక్రియ నడుస్తుండగానే జిల్లాలో మరో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వేకు అనుమతించింది. అయితే ఆరు నెలల క్రితమే ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీసర్వేకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగలేదు. హన్వాడ మండలం చీకర్లపల్లి, కోయిలకొండ మండలం ఖాజీపూర్, మహబూబ్నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ రెవెన్యూ గ్రామాల్లో ముందుగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహణ కల్పించిన అనంతరం రీసర్వే ప్రారంభించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 87 గ్రామాల్లో భూ భారతిలో భాగంగా భూ రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీ సర్వేకు సిబ్బంది కొరత, నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల సవాళ్లు ఒకవైపు ఉండగా.. మరోవైపు ఎఫ్–లైన్ ఫిర్యాదుల పరిష్కారం, ప్రాజెక్టుల భూసేకరణ వంటి అంశాలు సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని 17 మండలాలకు గాను 3 సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉండగా 6 మంది సర్వేయర్లను నారాయణపేటకు డిప్యూటేషన్పై పంపారు. మిగతా వారిలో ఇద్దరికి ప్రమోషన్ రాగా ప్రస్తుతం జిల్లాలో ఆరుగురు పనిచేస్తున్నారు. ఈ ఆరుగురే భూ రీ సర్వేకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్తోపాటు ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి. భూ రీసర్వే పనుల్లో నిమగ్నం కావడంతో ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం కాక ఆ సంఖ్య 1,415కు చేరింది. భూ రీ సర్వేలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం వారికి గ్రామాలను కేటాయించగా సర్వేలో పాల్గొనడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తమకు సరిపోవడం లేదని సర్వే నిర్వహణకు హాజరు కాకపోవడంతో భూ రీసర్వే ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన పారితోషికం ఎకరాకు రూ.60 ఏమాత్రం సరిపోదని.. గౌరవంతో కూడిన వేతనం ఇస్తేనే తాము భూ రీసర్వే నిర్వహిస్తామనే డిమాండ్ను ముందుంచగా ఎటూ తేలడం లేదు. -
ఎమ్మెల్యే యెన్నంకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు
స్టేషన్ మహబూబ్నగర్: అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రదానం చేశారు. సమాజ సేవ, విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించడం విశేషం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2 వేల పాఠశాలల్లో 2లక్షల మందికిపైగా విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, ఆధునిక సాంకేతిక వనరుల వినియోగం, విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందించడం, ఉపాధ్యాయులకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు. ప్రత్యేకంగా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న శతశాతం వంటి పథకాలు డిజిటల్ స్టడీ మెటీరియల్స్, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. ఎమ్మెల్యేకు అంతర్జాతీయ గౌరవం లభించడంపై మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, మేథావులు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ
● ఏడున్నర తులాల బంగారం, రూ.3.5లక్షల నగదు అపహరణ గట్టు: గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆరగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఆరగిద్దకు చెందిన మునేశ్వరి ఉదయం ఇంటికి తాళం వేసి పిల్లలను పక్కింటిలో వదిలి, తాను వేరే గ్రామానికి పని నిమిత్తం వెళ్లింది. ఇంటి వద్ద ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం విరగొట్టి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు చోరీ చేశారు. ఇంటి తాళం తీసిన విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు మునేశ్వరికి సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా.. బీరువా తెరచి, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి, గట్టు పోలీసులకు సమాచారం అందించా రు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను, ఎస్ఐ శేఖర్గౌడు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మునేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడు తెలిపారు. -
‘20 రోజుల్లో’ గ్యారంటీ!
● రెవెన్యూ సేవల్లో జాప్యానికి చెక్ ● కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాల మంజూరుకు కాలపరిమితి ● జాప్యమైతే అప్పీలు చేసే హక్కు మహబూబ్నగర్ రూరల్: కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల కోసం వారాల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రజాసేవల హక్కు (రైట్ టు పబ్లిక్ సర్వీసెస్) చట్టం కింద రెవెన్యూ శాఖలోని కీలక సేవలను చేర్చడంతో ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసే పలు ధ్రువపత్రాలను 20 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో సేవ అందకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించే హక్కును కూడా ప్రజలకు కల్పించారు. దీంతో రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన తర్వాత ఫైలు ఏ దశలో ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఒక్కోసారి కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వచ్చేది. ఇకపై దరఖాస్తు నమోదు నుంచి ధ్రువపత్రం జారీ వరకు ప్రతి దశ ఆన్లైన్లో నమోదవుతుండటంతో జాప్యానికి బాధ్యులెవరో గుర్తించడం సులభం కానుంది. జాప్యాలకు అడ్డుకట్టే లక్ష్యం ప్రతి ఏడాది విద్య, ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాలు పొందుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఫీల్డ్ విచారణల్లో ఆలస్యం, పెండింగ్ ఫైళ్ల కారణంగా అనేక సందర్భాల్లో గడువు దాటుతోంది. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఉద్యోగార్థులు దరఖాస్తులు, రైతులు సబ్సిడీ అవకాశాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం కాలపరిమితిని అమలు చేస్తోంది. గడువు దాటితే అప్పీల్ నిర్ణీత సమయంలో ధ్రువపత్రం రాకపోయినా, సరైన కారణం లేకుండా దరఖాస్తు తిరస్కరించినా ప్రజలు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అమలుపైనే ఫలితం ప్రభుత్వం గడువు విధించినా క్షేత్రస్థాయిలో అమలు సమర్థంగా జరిగితేనే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని మండలాల్లో సిబ్బంది కొరత, పెండింగ్ దరఖాస్తులు, సాంకేతిక సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. గడువులో సేవలు అందితే ప్రజల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. -
కలుపు నివారణతో దిగుబడి
అలంపూర్: వానకాలం పంట సీజన్లోని వివిధ పంటల సాగులో కలుపు సమస్య ప్రధానంగా ఉంటుంది. కలుపు వలన 30 నుంచి 70 శాతం పంట నష్టం జరిగే అవకాశం ఉంది. వివిధ పంటల్లో వచ్చే కలుపును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఊద నివారణకు.. వరిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి విత్తిన 2 నుంచి 3 రోజుల్లో ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకం 400 మి.లీ. లేదా విత్తిన 14, 15 రోజుల సమయంలో సైహాల్పాప్ బ్యూటైట్ 10 శాతం ద్రావకం 400 మి.లీ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. లేదా ఊద వెడల్పా కు కలుపు సమపాళ్లలో ఉంటే నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు మి.లీ. బిస్ పైరిబాక్ సోడియం(10)శాతం 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. మాగాణి వరిలో.. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నాటిన 3 లేదా 5 రోజుల్లో పొలంలో పలుచగా నీరుంచి ఎకరాకు 1–1.5 లీ. బుటాక్లోర్ (50 శాతం) లేదా 400 మి.లీ. చొప్పున అనిలోఫాస్ (30 శాతం) ప్రిటిలోక్లోర్ (50 శాతం)గాని 20 కిలో పొడి ఇసుకలో కలిపి చల్లాలి. గడ్డి, తుంగ వెడల్పాటి ఆకుజాతి మొక్కలు సమపాళ్లలో ఉంటే ఎకరాకు వరి నాటిన 3 లేక 5 రోజుల్లో 4కి బుటాక్లోర్ 5 శాతం గుళికలు+4కి2.4–డీ ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. నాటిన 20 నుంచి 30 రోజుల్లో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాములు 2.4– డీ సోడియం సాల్ట్ (80 శాతం) లేదా ఇథాక్సి సల్ఫురాన్ 15 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో ఎకరాకు 1–1.5 కిలోల అట్రాజీన్ పిచికారీ చేయాలి. తర్వాత 30– 35 రోజుల్లో గొర్రు గంటుకతో అంతర్కృషి చేయాలి. జొన్న : జొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో 600 నుంచి 800 గ్రాముల అట్రాజిన్ను విత్తిన 20 రోజుల తర్వాత అయితే 400 గ్రాముల 2,4– డీ సోడియం సాల్ట్ 80 శాతం పొడిని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పత్తి : పత్తి విత్తిన వెంటనే లేదా 1 లేదా 2 రోజుల్లో ఎకరాకు 1– 1.3 లీ. పెండిమిథాలిన్ 45 శాతం లేదా 1.5–2 లీ. అలాక్లోర్ 50 శాతం వాడాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువ ఉండి అంతర్ కృషి కుదరనప్పుడు 400 మి.లీ. కై ్వజలాపాప్ ఇథైల్ +250 మి.లీ. పైరితయోటాక్ 10 శాతాన్ని పత్తిమీద పడకుండా సాళ్ల మధ్య కలుపు మీద పడేలా చల్లాలి. చెరకు : ముచ్చెలు నాటిన వెంటనే లేదా 2 మూడు రోజుల్లో ఎకరాకు 2 కిలోల అట్రడాజిన్ పిచికారీ చేసి కలుపు నివారించవచ్చు. వెడల్పాటి ఆకులు ఎక్కువగా ఉంటే తోటనాటిన తర్వాత 30, 60 రోజుల్లో ఎకరాకు అరకిలో 2,4– డీ సోడియం సాల్ట్ చల్లాలి లేదా దీనికి అరకిలో మెట్రబుజిన 70 శాతం కలిపి పైరుపై పడకుండా సాళ్ల మధ్య పిచికారీ చేయాలి. మిరప : నాటడానికి ఒకటి రెండు రోజుల ముందు ఎకరాకు 1.3– 1.6 లీ. పెండిమిథాలిన్ లేదా 200 మి.లీ. ఆక్సిప్లోరోఫిస్ (23.5 శాతం) పిచికారీ చేయాలి. నాటిన 25 నుంచి 30 రోజుల తర్వాత సాళ్ల మధ్య గొర్రు లేదా గుంటక తోలాలి. గడ్డిజాతి కలుపు నిర్మూలనకు 400 మి.లీ కై ్వజాలాపాప్ ఇథైల్ పిచికారీ చేయాలి. పండ్ల తోటల్లో : పండ్ల తోటల్లో వచ్చే వివిధ రకాల కలుపు నిర్మూలనకు లీటర్ నీటికి 10 మి.లీ గ్లైపాసేట్ 10 శాతం +10 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా యురియా కలుపు పూత రాకముందే నేలలో తేమ ఉన్నప్పుడు నాజిల్కు డోమ్ పెట్టి పండ్ల మొక్కలపై పడకుండా కలుపుపై పిచికారీ చేయాలి. అవసరమైతే 1, 2 నెలల తర్వాత మరోసారి చల్లాలి. పాడి–పంట -
గడువులోగా సేవలు అందిస్తాం
ప్రజలకు నిర్ణీత గడువులో సేవలు అందించడమే ప్ర భుత్వ లక్ష్యం. కులం, ఆ దాయం, నివాసం తదితర ధ్రు వపత్రాల దరఖాస్తుల ను ప్రాధాన్యంగా పరిశీలించి 20 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల స్థితి ఆన్లైన్లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుంది. గడువు పాటించేలా అధికా రులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. ప్రజలు పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేస్తే జాప్యం ఉండదు. – దేవేందర్ కేసిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, మహబూబ్నగర్ అర్బన్ ● -
వాలీబాల్ చాంపియన్గా మరికల్ జట్టు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ క్లస్టర్ స్థాయి పురుషుల వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. చాంపియన్గా మరికల్ జట్టు, రన్నరప్గా గాదిర్యాల జట్టు, మూడోస్థానంలో గొల్లపల్లి జట్టు, నాలుగో స్థానంలో నవాబ్పేట జట్టు నిలిచాయి. ఆయా జట్లకు ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య తదితరులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. విన్నర్, రన్నరప్ జట్లు ఈనెల 16న హైదరాబాద్లో జరిగే డివిజన్ (రాష్ట్రస్థాయి) టోర్నమెంట్లో పాల్గొంటాయని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రమేష్బాబు, నాగరాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మయూర విహారం.. -
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం భారతీయ సినీ డైరెక్టర్ రాధాకృష్ణ సందర్శించారు. ఆయన జన్మదినం సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు సందీప్చారి తీర్థ ప్రసాదాలను అందించి, ఆలయ చరిత్ర గురించి ఆయనకు వివరించారు. ఆయన వెంట సినీ ఆర్టిస్టులు, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు. టైరు పేలి కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం ఎర్రవల్లి: జాతీయ రహదారిపై టైరు పేలి కారు బోల్తాపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కర్నూల్కు చెందిన అబ్దుల్లా తమ తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కొట్టం కాలేజీ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లాతో పాటు భార్య ముంతాజీబేగం కు తీవ్రగాయాలు కాగా మిగిలిన ఎనిమిది మంది చిన్న గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు, వాహనదారులు హుటాహుటిన కారు వద్దకు చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స నిమిత్తం వారిని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం పది మంది (ఐదుగురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు) ఉన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. పాముకాటుకు రైతు బలి అమరచింత: చెరుకు తోటలో బోరుమోటార్ సరిచేస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని సింగంపేట గ్రామానికి చెందిన చిన్నఆంజనేయులు(50) తెల్లవారు జామున చెరుకు తోటలో బోరు మోటార్ వద్ద ఫీజులు సరిచేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించగా ఆత్మకూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
యాదవులు రాజకీయంగా ఎదగాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): యాదవులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు యాదవ్ కోరారు. జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్ అధ్యక్షతన ఆదివారం స్థానిక ఏనుగొండలోని రామదూత టౌన్షిప్లో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి యాదవ బంధువులు హైదరాబాద్లో శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టల్ భవనానికి ఆర్థిక సహకారం అందించి సహకరించాలని కోరారు. అనంతరం యాదవ హాస్టల్ భవనానికి సాయిబాబా యాదవ్ రూ.లక్ష నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మాయాదవ్ రూ. 25వేలు, విష్ణువర్ధన్ యాదవ్ రూ.25 వేలు, వెంకట్రాములు రూ.11 వేలు, మద్దిలేటి యాదవ్ రూ.10 వేలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న బైకని బాలు యాదవ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థిరంగా కొనసాగుతున్న వరద
గద్వాల/ కొల్లాపూర్ రూరల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఎగువ నుంచి 1.60 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. స్థానికంగా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో భీమా లిఫ్ట్–1కు 1,300 క్యూసెక్కులు, లిఫ్టు–2కు 872, నెట్టెంపాడుకు 750, కోయిల్సాగర్కు 630, ఎడమ ప్రధాన కాల్వకు 820, కుడి ప్రధాన కాల్వకు 700, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పుష్కరఘాట్ల సమీపంలోకి.. శ్రీశైలం బ్యాక్వాటర్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం రాత్రి వరకు సంగమేశ్వరాలయం సగానికి పైగా నీటిలో మునిగిపోగా.. సోమశిల సమీపంలో పుష్కరఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. సమీపంలోనే ఉన్న మసీదు సైతం సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. జటప్రోల్ సమీపంలోని పురాతన సురభి రాజుల కోట, మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నదీ పరవళ్లను తిలకించేందుకు సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలకు పర్యాటకులు తరలివస్తున్నారు. -
వ్యక్తి మృతి: కేసు నమోదు
రాజాపూర్: బతుకుదెరువు కోసం వచ్చి ఫాంహౌస్లో పనిచేస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం బాలానగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని యాకుత్పురాకు చెందిన మీర్జా సర్దార్బేగ్ (50) భార్య ఫర్హత్ ఉన్నిసాబేగం ముగ్గు రు పిల్లలతో కలిసి హైదరాబాద్కు చెందిన హుస్సేన్ ఫాంహౌస్లో మేకలు, గేదెలు మేపు కుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి షెడ్లో మేకలను చూసేందుకు వెళ్లిన మీ ర్జాసర్దార్బేగ్ కళ్లు తిరిగి సిమెంట్ బెడ్పై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపారు. వ్యవసాయ బావిలో మొసలి వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన రొయ్యల రమేష్ వ్యవసాయ పొలంలో ఉన్న బావి కన్నంలో మొసలి ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వస్తుందని రైతు తెలిపారు. ఆదివారం ఉద యం తమ కుటుంబ సభ్యులు బావి సమీపంలోకి వెళ్లగా.. మొసలి కనబడంతో భయంతో పరుగులు తీశారని రైతు పేర్కొన్నాడు. పోలీసులకు ఫోనులో సమాచారం ఇచ్చామని తెలిపారు. అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని తీసుకెళ్లాలని ఆయన కోరారు. తాళం వేసిన ఇంట్లో చోరీ బల్మూర్: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని మహదేవ్పూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్రెడ్డి భార్య విజయమ్మతో కలిసి జూలై 31న హైదరాబాద్లో ఉన్న తమ కుమార్తె, అల్లుడి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపుల తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్, తులం బంగారు కెంపుదండ, 2 బంగారు ఉంగరాలు, 4 బంగారు పుస్తలగుండ్లు, 40 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం మహబూబ్నగర్ క్రీడలు: ఇంటర్నేషనల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో శ్రీహనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి మహ్మద్ ఫర్హాన్ అహ్మద్ బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్లోని చంపాపేట్లో ఆదివారం జరిగిన పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు కరాటే మాస్టర్ కె.వెంకటేశ్ తెలిపారు. అండర్–14 విభాగం కుమితేలో పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పతకం సాధించిన విద్యార్థిని పలువురు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
జూరాల ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వాహనాలతో ప్రాజెక్టు రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క ఆదివారం సెలవు కా వడం.. మరో పక్క కృష్ణానదికి మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జిల్లా స్థానికులతో పాటు ఆయా జిల్లాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణమ్మ పొంగులను తిలకించి తరలించి పో యారు. కుటుంబ సమేతంగా.. మరో పక్క స్నేహితుల దినోత్సవం కావడంతో యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంతోషంగా గడిపారు. అనంతరం ప్రాజెక్టుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చేపల వంటకాల వద్ద జన సందోహం కనిపించింది. ట్రాఫిక్ నియంత్రిచడంలో పోలీసులు విఫలమైనట్లుగా కనిపించింది. ట్రాఫిక్ జాంతో వాహనదారులు, ప్రజలు కళ్ల ముందు ఇబ్బందులు పడుతుంటే ఓ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. అతడి తీరుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
కల్వకుర్తి రూరల్ : శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు చండీ హోమంలో పాల్గొన్నారు. మొదట యాగశాల ప్రదక్షణ చేసి యాగం అనంతరం స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలని సంకల్పంతో ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. మానవసేవే మాధవసేవని.. మానవాళి మేలు కోసం చేస్తున్న యాగంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. దైవకృప అందరికి లభించాలని, భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. సర్వేజనా సుఖినోభవంతు అని భావించడం ఒక హైందవ ధర్మంలోనే ఉందన్నారు. పిల్లలకు సాంప్రదాయాలు, సంస్కృతిని, దైవ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించాలని, తాము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉదయం సూర్య, శ్రీరామ, శ్రీచండీ హోమం, శ్రీసుదర్శన లక్ష్మీనారాయణ రుద్రహోమం, సహస్ర కళాశాభిషేకం, సీతారామచంద్రస్వామికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు పదివేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్కుమార్, కాయతి విజయకుమార్రెడ్డి, మిరియాల శ్రీనివాస్రెడ్డి, జూలూరు రమేష్బాబు, బీచని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యంతో పేదలకు చదువు దూరం
● ఇంజనీరింగ్ విద్యార్థులను సీఎం కించపరచడం సరికాదు ● ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేవైఎం ధర్నా.. చెదరగొట్టిన పోలీసులు పాలమూరు: రాష్ట్ర విద్యార్థుల పట్ల సీఎం రేవంత్రెడ్డి చులకన భావంతో మాట్లాడిన అంశంపై నిరసన తెలుపుతుంటే లాఠీచార్జీ చేయించడం దుర్మర్గమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పేద విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించకపోవడం వల్ల వారి చదువు లు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. సీఎం విద్యశాఖ తన దగ్గరే పెట్టుకొని రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందకుండా దూరం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం ఆయన తప్పులును కప్పిపుచ్చుకోవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు రాయడానికి రాదని చెప్పి వారిని కించపరుస్తున్నారన్నారు. తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించి కొంత సమయం వ్యక్తిగత పూచీకతపై వదిలిపెట్టారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, నేతలు సుబ్రహ్మణ్యం, మహేష్, లక్ష్మీనారాయణ, సందీప్, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. -
తల్లిపాలతో శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం
పాలమూరు: తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారం ఇస్తుందని, ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి పునాది అవుతుందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా శనివారం నుంచి ఈనెల 7వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగంలో కలెక్టర్ ప్రారంభించారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఉపయోగపడుతుందన్నారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రపాలు పట్టించాలని, దీనితో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిండంతో పాటు అనేక అంటు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని బాలింతలు, గర్భిణులకు సూచించారు. అనంతరం తల్లిపాలపై ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, సూపరిటెంటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, జిల్లా సంక్షేమ అధికారిని జరీనా పాల్గొన్నారు. సీపీఓగా బాధ్యతలు స్వీకరించిన నర్సింహులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ)గా నర్సింహులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.రవీందర్ జూలై 31న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో గణాంక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బి.నర్సింహులను సీపీఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రణాళిక, గణాంక విభాగాల పనితీరు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నర్సింహులకు జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, గణాంక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెలలో ఆధ్యాత్మిక, ధార్మిక, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పాతపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 4 నుంచి 8 వరకు, నర్వ మండలంలోని జక్కన్నపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు భజనలు, కుంకుమపూజ, ఉపన్యాసాలు, మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పలపల్లి శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు భజనలు, ఉపన్యాసాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల భజన మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 14న వేలం పాటలు చిన్నచింతకుంట: ఈ ఏడాది కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి విక్రయించేందుకు ఈ నెల 14వ తేదీన ఆలయం వద్ద బహిరంగవేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డు, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్ లైటింగ్ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ వేలం పాటలు నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉండి ఈ వేలం పాటలలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్ లైటింగ్ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు. -
గోల్మాల్..!
రూ.1,000 కోట్ల 2022–23 యాసంగి సీఎమ్మార్లో మాయాజాలం సీఎమ్మార్ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్మాల్ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్.. విజిలెన్స్ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్.. యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి. జిల్లాలోని హన్వాడ మండలపరిధిలో ఉన్న ఎంఎస్ శ్రీలక్ష్మి బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో జూలై 29న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ సిటీ–2 యూనిట్ అధికారులు.. జిల్లా సివిల్ సప్లయ్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 1,26,772 ధాన్యం బస్తాలు లేవని నిర్ధారించారు. అంతేకాదు.. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మిల్లర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. 2022–23 యాసంగి సీఎమ్మార్ బకాయిలను వసూలు చేస్తున్నాం. ఆ సీజన్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 71,060 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.152 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే ఆయా మిల్లర్లకు నోటీసులు అందజేశాం. అందరూ నిర్దేశిత గడువులోగా కట్టాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవు. ఈ రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలయ్యాయి. – రవినాయక్, సివిల్ సప్లయ్ డీఎం, మహబూబ్నగర్ ఎక్సెస్ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం టెండర్ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో పంచాయితీ సీరియస్గా తీసుకున్న సర్కార్.. డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు విజిలెన్స్ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌర సరఫరాల శాఖలో సైతం.. 2022–23 రబీ సీఎమ్మార్ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు విజిలెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్లో 25 శాతం, అక్టోబర్లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 3 గంటల పాటు కలెక్టర్ సుడిగాలి పర్యటన జడ్చర్ల: కలెక్టర్ ఖుష్బూగుప్తా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మూడు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ గిరిజన మినీ గురుకులం, జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులను తనిఖీ చేశారు. మొదటగా తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి పరిస్థితిని స్వయంగా గమనించారు. ఈ సందర్భంగా 4వ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ ప్రకారంగా ఆహారాన్ని అందిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. దోమల సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని తరగతి గదులలో ఫ్యాన్లు పనిచేయడం లేదని, కిటికీలకు తలుపులు లేవని పలువురు విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోగా ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని, కిటికీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు వంట గదులను తనిఖీ చేసి భోజనం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి, ప్రధాన కారిడార్, వార్డులు, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వెలుపల, లోపల ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రసూతి వార్డులో బాలింతలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో సిగ్నల్గడ్డ–నేతాజీ చౌరస్తా రోడ్డుపై నిర్మాణంలో ఉన్న వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ గిరీష్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ హర్షదుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. ● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు ● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి ● సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు ●శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్ మ్యాప్ను ఖరారు చేసిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్ రతన్టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు. – వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్మెంట్ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బుల్లెట్ రైలు (హైస్పీడ్ ట్రెయిన్)కు సంబంధించి రూట్ అలైన్మెంట్ను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఉండేలా మార్చాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖను పంపించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన కొత్త రూట్ ప్రకారం శంషాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు మొదటగా ఫ్యూచర్ సిటీ – ఆమన్గల్ – మన్ననూరు – శ్రీశైలం – సోమశిల మీదుగా బెంగళూర్ వెళ్తుందన్నారు. వాస్తవానికి శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ చాలా దగ్గరనే ఉంటాయన్నారు. ఇక ఆమన్గల్, మన్ననూరు చిన్న పట్టణాలు కాగా శ్రీశైలం మాత్రమే ప్రముఖ పుణ్యక్షేత్రమని, ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక హైవే రోడ్డు ఇంచుమించు ఇటువైపు నుండే వెళ్తుందన్నారు. ఈ రూట్కు బదులుగా శంషాబాద్ నుంచి షాద్నగర్ – జడ్చర్ల – మహబూబ్నగర్ – దేవరకద్ర – ఆత్మకూరు – శ్రీరాంనగర్ – మదనాపురం – గద్వాల – అలంపూర్ – కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తే ఉమ్మడి జిల్లావాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
ఉద్యమకారులను విస్మరిస్తే ఉద్యమిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి హెచ్చరించారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని.. కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను వేగవంతం చేసి, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. మొదట్లో మూడు నెలల సమయం పెట్టి.. ఇప్పుడు కాలయాపన చేసేందుకు డిసెంబర్ వరకు కమిటీ టైం బాండ్ పెట్టడం ఉద్యమకారులను విస్మరించేందుకేనని అరోపించారు. ఉద్యమకారులుగా ఉన్న తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని ఓయూలో ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుల సంఘం జిల్లా కోకన్వీనర్ నాచ శ్రీనివాస్ యాదవ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు రహీం, బీసీ జేఏసీ నాయకులు మైత్రి యాదయ్య, అన్వర్, గోపాల్ మాదిగ, బుర్ర సురేశ్ ఉన్నారు. -
‘భగీరథ’ లోపాలను సరిదిద్దాలి
మహమ్మదాబాద్: మిషన్ భగీరథ నీటిసరఫరాలో లోపాలను సరిదిద్దాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం నంచర్లలో మిషన్ భగీరథ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటిశుద్ధి, పంపింగ్ వ్యవస్థ, నిల్వ ట్యాంకులు, పైప్లైన్ల పనితీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైప్లైన్ లీకేజీలు, సాంకేతికలోపాలు, మరమ్మతులపై ఆరా తీశారు. నీటిసరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సమస్యలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించారు. అలాగే నంచర్ల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, విద్యాబోధనపై ఆరాతీశారు. పరిసరాలను పరిశీలించిన విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వెంట మిషన్ భగీరథ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ అనిల్, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ప్రిన్సిపల్ రమా, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశంలో సమగ్రమైన విద్యావిధానం ఉండాలి
స్టేషన్ మహబూబ్నగర్: విద్యార్థులందరికీ ఉపయోగపడేలా దేశంలో సమగ్రమైన విధ్యావిధానం ఉండాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ ఎన్.సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఛాత్రోంకి గూంజ్ (విద్యార్థుల గళం) సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల్ మాట్లాడుతూ సమాజంలోని సమస్యలపై ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం కూడా నేర్చుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వారి గొంతుకను ప్రభుత్వానికి వినిపించేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జేబీఎం జిల్లా కన్వీనర్ సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జేబీఎం ఆధ్వర్యంలో ఛాత్రోంకి గూంజ్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర అక్తర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, మధుసూదన్రెడ్డి, కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వెంకట్రెడ్డి, హెచ్ఓడీ షాకీర్, జేబీఎం కన్వీనర్లు ప్రసాద్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ -
తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో పెట్టుకొని శనివారం నుంచి ఆగస్టు 30వరకు జిల్లావ్యాప్తంగా 30–పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, నిర్వహించరాదని సూచించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, వందతులు, మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, వీడియోలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తగదు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తీసుకోవడం తరగదని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. పీయూలో వారు మాట్లాడుతూ బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాలపై జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెమినార్ నిర్వహించే అంశం పూర్తిగా యూనివర్సిటీకి సంబంధించిందని, వీసీ శ్రీనివాస్పై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ స్వ యం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అన్నారు. వీసీని ఇబ్బందికరంగా మాట్లాడిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కావలి కిషోర్, రవితేజ, మహేశ్వరి, హరికృష్ణ, సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. వీరికి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికయ్యే క్రీడాకారులు మహారాష్ట్ర షిరిడీలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి గోగేమ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. -
పేస్కేల్ను అమలు చేయాలి..
ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలి. గతేడాది సీఎం రేవంత్రెడ్డి పేస్కేల్ అమలు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ అమలు చేయలేదు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే సమ్మెబాట తప్పదు. – రాజశేఖర్రెడ్డి, వీబీజీ రాంజీ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ రెగ్యులర్ లేదా సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా టైం స్కేల్ ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒకే కేడర్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా.. అంతే జీతంతో పని చేయడం కష్టంగా ఉంది. కిందిస్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. – విజయ్భాస్కర్, జేఏసీ కో చైర్మన్ 2024 ఫిబ్రవరి 2న ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలో ఉపాధి హామీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోవాలి. 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. సకాలంలో వేతనాలు చెల్లించాలి. మా డిమాండ్ పరిష్కరించాలి. –ఎం.శాంతికుమార్, జిల్లా జేఏసీ ప్రచార కార్యదర్శి ● -
కృష్ణమ్మకు జలకళ
● జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత ● 11 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ● శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు జూరాల ప్రాజెక్టు ముందు సెల్ఫీ దిగుతున్న పర్యాటకులు జూరాల సమాంతర కాల్వకు జలకళ గద్వాల/ఆత్మకూరు/అమరచింత/ధరూర్/ఎర్రవల్లి/కొల్లాపూర్ రూరల్: ఎగువప్రాంతంలో భారీ వర్షాలు కురస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 90,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 క్రస్టు గేట్లను ఎత్తి 39,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లలో 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 7.704 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని వారంలోగా సమస్యను పరిష్కరించి పూర్తిస్తాయిలో ఉత్పత్తి చేపడుతామని అధికారులు వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం 38,712 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. అలాగే నెట్టెంపాడు కాల్వకు 750 క్యూసెక్కులు, భీమా–1కు 1,300 క్యూసెక్కులు, భీమా–2కు 750 క్యూసెక్కులు కోయిల్సాగర్కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 870 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 89,487 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. – ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తుండంతో జలకళను సంతరించుకుంది. ఈ సీజన్లో మొదటిసారి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పర్యాటకులు తరలివచ్చారు. కృష్ణమ్మ జల సవ్వడులను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా కలిపి దాదాపు 80వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండడంతో బీచుపల్లి, సోమశిల వద్ద కృష్ణానది పరుగులు పెడుతోంది. సోమశిలకు అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం సమీపానికి వరద నీరు వచ్చింది. వేపలింగం పరిసరాలు మునిగి పోయాయి. ప్రస్తుతం నదిలోకి ఎవరూ వెళ్లవద్దని బోటు యజమానులకు అధికారులు సూచించారు. సోమశిల దగ్గర కృష్ణానదికి వస్తున్న వరద నీటితో కళకళలాడుతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ -
అందరి మేలు కాంక్షించడమే నిజమైన ధర్మం
కల్వకుర్తి రూరల్: సమాజంలోని అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే నిజమైన ధర్మమని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్దా సూర్యప్రకాశరావు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో చేస్తున్న యాగంతో అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగి, దైవభావం తగ్గిందన్నారు. దైవంపై భక్తి పెంచుకోవడంతో పాటు సమాజానికి.. లోక కల్యాణానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు హోమాలు, యాగాలు సంస్కృతిని కాపాడుతున్నాయని అన్నారు. కార్యదర్శి దర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజ హితమే మతమని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం ఎంతో మంచి విషయమన్నారు. సామా జిక సేవలకు కేరాఫ్ అడ్రస్గా వాసవీ క్లబ్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. వా సవీ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ సర్వీసెస్ జూ లూరు రమేష్ బాబు మాట్లాడుతూ..16 రో జులపాటు నిర్వహిస్తు న్న విశ్వశాంతి మహాయాగంతో ప్రజలందరూ సుఖ సంతోషాల తో జీవించాలని ఆకాంక్షించారు. విశ్వశాంతి మహాయాగంతో ఆధ్యాత్మిక వైభవం ఏర్పడిందన్నారు. కాగా, శ్రీలక్ష్మీ హోమం, దేవసూక్త హోమం, శ్రీలక్ష్మీ నారాయణ సుదర్శన హోమంతో పాటు సామూహిక కుంకుమార్చనలను భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనందకుమార్ దంపతులు హోమం చేశారు. భక్తులందరికీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ప్రవచనాలు చెప్పారు. క్లబ్ డిస్ట్రిక్ట్ వి 108 ఏ గవర్నర్ కల్మిచర్ల రమేశ్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కల్వ హరికృష్ణ, సెక్రటరీ చంద్రశేఖర్, కోశాధికారి చిదిరే శ్రీనివాస్, డిప్యూటీ గవర్నర్ ప్రవీణ్, మాజీ గవర్నర్ మేడిశెట్టి రామకృష్ణ, గుగ్గిల శంకర్, కల్మిచర్ల గోపాల్, చిగుళ్లపల్లి శ్రీధర్, జూలూరు సత్యం, వాసవీ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం హరీష్, సాయిలక్ష్మి, కార్యదర్శులు గోవిందు సంతోష్, గోవిందు, మౌనిక, జూలూరు ప్రకాష్, పోల సురేందర్, వాసా శేఖర్, సతీష్, మురళి పాల్గొన్నారు. -
వరి ధాన్యం బస్తాల వ్యత్యాసంపై విచారణ
మహబూబ్నగర్ రూరల్/ హన్వాడ: జిల్లాలోని హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వరి ధాన్యం బస్తాల వ్యత్యాసం వ్యవహారం జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య రూ.11.34 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన వ్యత్యాసం గుర్తించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ విచారణను వేగవంతం చేసింది. సాంకేతిక లోపమా, నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. 2022–23 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన 5,070.88 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ. 5 కోట్లకు పైగా ఇప్పటికే చెల్లించినట్లు, ఆన్లైన్ చెల్లింపుల రికార్డులు, ఇన్సాయిస్లు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే పౌర సరఫరాల శాఖ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన రిలీజింగ్ ఆర్డర్ (ఆర్ఓ) తీసుకోకుండానే నిల్వలను తరలించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసం ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ప్రసాద్లాల్ జిల్లాలో పర్యటించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, మిల్లుల నిర్వహణ, నిబంధనల అమలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ మాట్లాడుతూ విజిలెన్స్ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని, జిల్లా మేనేజర్ నివేదిక, విజిలెన్స్ నివేదికలు అందిన తర్వాత శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణలో భాగంగా ధాన్యం చెల్లింపులు, ఆర్ఓ జారీ ప్రక్రియ, నిల్వల కదలికలు, ప్రభుత్వ రికార్డులు, మిల్లు నిర్వహణకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తుది నివేదికలో తేలే అంశాల ఆధారంగా శాఖాపరమైన, చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్ఓ అంటే ఏమిటి? రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ఽధాన్యాన్ని మిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత, సంబంధిత నిల్వలను తరలించేందుకు పౌర సరఫరాల శాఖ నుంచి రిలీజింగ్ ఆర్డర్ తప్పనిసరిగా జారీ కావాలి. ఈ ఉత్తర్వు వచ్చిన తర్వాతే ఽధాన్యం లేదా బియ్యాన్ని నిర్ణీత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఆర్ఓ లేకుండా నిల్వలను తరలిస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ప్రస్తుతం శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కేసులో కూడా ఇదే అంశం ప్రధానంగా విచారణలో ఉంది. ఇది కేవలం సాంకేతిక ఉల్లంఘన మాత్రమేనా? లేక మరేదైనా అక్రమం జరిగిందా ? అనే విషయాన్ని అధికారులు తేల్చనున్నారు. రూ. 11.34 కోట్ల విలువైన నిల్వల తేడాపై లోతైన పరిశీలన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ వేర్వేరుగా దర్యాప్తు నివేదికల తర్వాతే చర్యలు -
జోగుళాంబ క్షేత్రం పార్కింగ్ వేలం రూ. 79.25లక్షలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వాహనాల పార్కింగ్ రుసుం వసూలు, టెంకాయలు, పూజా సామగ్రి విక్రయానికి సంబంధించి గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. వాహనాల పార్కింగ్ రుసుం వసూలుకు సంబంధించి ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా.. ఈఓ రంగారావు పర్యవేక్షణలో వేలం నిర్వహించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. వేలంలో హైదరాబాద్కు చెందిన బి.సురేశ్కుమార్ అందరి కంటే ఎక్కువ కోడ్ చేసి రూ. 79.25లక్షలకు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. గతం కంటే రూ. 9.25 లక్షల ఆదాయం అదనంగా సమకూరినట్లు తెలిపారు. అదే విధంగా టెంకాయలు, పూజా సామగ్రి విక్రయం, చీరల నిర్వహణకు సంబంధించి గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. రెండు టెండర్లకు త్వరలోనే వేలం నిర్వహిస్తామన్నారు. కాగా, గతంలో అలంపూర్ ఆలయాల్లోనే వేలం నిర్వహించే వారు. అయితే గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో 6 సార్లు వాయిదా పడ్డాయి. దీంతో నిబంధనల మేరకు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాల యంలో వేలం నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. -
పాముకాటుకు విద్యార్థి బలి
అయిజ: పాముకాటుకు గురై విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామ స్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప, జయలక్ష్మి దంపతుల కుమారుడు తిరుమలేష్ (14) శాంతినగర్లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలో పాము కాటువేసింది. గుర్తించిన తల్లిదండ్రులు పామును చంపి, బాలుడిని తనగలకు తీసుకెళ్లి, నాటువైద్యం చేయించారు. పరిస్థితి మెరుగుపడక పోవడంతో అక్కడి నుంచి అయిజ పీహెచ్సీకి తీసుకెళ్లారు. పీహెచ్సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి గద్వాలకు రెఫర్ చేశారు. వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహానికి కర్నూలు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు సజీవ దహనం మరికల్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘట న చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు.. మరికల్ మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం అచ్చంపేట రూరల్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ ఎస్ఐ అంజయ్య వివరాల ప్రకారం... బొమ్మనపల్లికి చెందిన జల్లెల మహేశ్తో ఐదేళ్ల క్రితం పదర గ్రామానికి చెందిన మంజుల (25)కు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. గురువారం ఉదయం తన అత్త లక్ష్మమ్మతో కుటుంబ విషయాలపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మంజుల.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి పెద్దలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వేరుశనగ రైతుల ఆందోళన
అయిజ: తమకు నకిలీ వేరుశనగ విత్తనాలు కట్టబెట్టి వ్యాపారి నిలువునా మోసం చేశారని ఆరోపిస్తూ రైతులు గురువారం పట్టణంలోని దుకాణం ఎదుట పంట మొక్కలు పట్టుకొని నిరసన తెలిపారు. బాధిత రైతులు తెలిపిన వివరాలు.. మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామానికి చెందిన తిమ్మప్పగౌడ్ అయిజ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్ దుకాణంలో వేరుశనగ పంట సాగు చేసేందుకు 2 ఎకరాలకు సరిపడా విత్తనాలు కొనుగోలు చేశాడు. సుమారు రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టామని, మొక్కలకు వేరుశనగ కాయలు తక్కువగా ఉండి దిగుబడి పడిపోయిందని వాపోయారు. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 5 బస్తాలే వచ్చిందన్నారు. వ్యాపారి నకిలీ విత్తనాలు విక్రయించడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతు కుంటుంబ సభ్యులు తిమ్మప్పగౌడ్, సువర్ణ, మహేంద్రగౌడ్ దుకాణం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విత్తన విక్రయదారుడు తిరుమలేష్ను వివరణ కోరగా.. ఆ రైతుకు నేను విత్తనాలు విక్రయించలేదన్నారు. రైతులు, వేరుశనగ విక్రయదారుడు ఒకరిపై మరొకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
మన్యంకొండలో హుండీ లెక్కింపు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి హుండీ ద్వారా రూ. 50,22,837 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించా రు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ పర్యవేక్షణ అధికారిగా నిత్యానందచారి వ్యవహరించారు. ఎస్బీఐ దేవరకద్ర శాఖ, మహబూబ్నగర్ సత్యసాయి సేవా సమితి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొని హుండీ నగదు లెక్కింపును పారదర్శకంగా పూర్తి చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో దేవస్థానానికి రూ.50.22 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
భూగర్భ జలం.. ఇంకితేనే ప్రతిఫలం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/నర్వ: ఎల్నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జలసిరిశ్రీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి కుంట, ఓపెన్ వెల్, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో పంట కుంట.. గ్రామానికి ఊటకుంట అనే నినాదంతో జలసిరి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసింది. నిర్మాణంలో పాటించాల్సినవి.. శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి. సామూహిక ఇంకుడు గుంతలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడుగుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది. గ్రామానికో ఊటకుంట ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రభుత్వం కార్యాచరణ ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట నిర్మాణానికి చర్యలు ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆగస్టు 14 నాటికి పూర్తి చేసేలా గడువు విధింపు -
ఆరోగ్యవంతమైన జీవనం అలవాటు చేసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: యువత దేశ భవిష్యత్కు బలమైన శక్తిగా మారాలి తప్పామాదకద్రవ్యాలు లాంటి వాటికి బానిసలుగా కావ్వొద్దని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మేరా యువ భారత్– నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్కు బారినపడకుండా, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా యువతకు 8 రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తోటానాయక్, అనిల్కుమార్, రాజేందర్గౌడ్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ నిర్మూలనకు అందరి భాగస్వామ్యం అవసరం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ జానకితో కలిసి పాలమూరు యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ ప్రతినిధులు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీసు, ఎకై ్సజ్, విద్యాశాఖ తదితర అధికారులతో నిర్వహించిన నార్కోటిక్స్ అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, హాస్టళ్లలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టర్ నమూనాను మూడు రోజుల్లో అందజేస్తామని, అన్ని విద్యాసంస్థలు దానికి అనుగుణంగా అమలు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన లక్షణాలను గుర్తించేలా అధ్యాపకులు, వార్డెన్లు, భద్రతా సిబ్బందికి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. హాస్టళ్లలోకి విద్యార్థులు తీసుకువచ్చే బ్యాగులను అవసరమైతే తనిఖీ చేయాలని, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ● డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే యువతను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సమాచారం అందించడంలో భాగస్వామి కావాలని కోరారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి డి.ఇందిర మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించిన విద్యార్థులపై వెంటనే శిక్షాత్మక చర్యలకే పరిమితం కాకుండా, ముందుగా కౌన్సెలింగ్, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు తరలించడం వంటి పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని తదితరులు పాల్గొన్నారు. త్వరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు కలెక్టర్ ఖుష్బూ గుప్తా -
ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు
మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సురవరం వెంకటరామిరెడ్డి భవన్లో ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పాదయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సంఘటితం చేస్తామని, జిల్లా ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాము, కె.పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేష్, చాంద్ పాషా, కే రమేష్ నరసింహ, శ్రీలత , పూజిత, సంధ్య పాల్గొన్నారు. -
సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): 2025–26కు సంబంధించిన వానాకాలం, యాసంగికి చెందిన సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్లాల్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీహాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్ఓలు), జిల్లా మేనేజర్లు (డీఎంలు), ఎఫ్సీఐ అధికారులు, ఎన్న్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మిల్లింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న డెలివరీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మహబూబ్నగర్ డీఎస్ఓ గంప శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్గౌడ్ కోరారు.గురువారం మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల కట్టుబడి ఉన్నామన్నారు. కొత్తగా ఎన్నికై న తమ యూనియన్ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బీకే రెడ్డి, ముజీబ్, టీఆర్సీ శేఖర్రెడ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్ హసన్, చంద్రమోహన్, నిజామాబాద్ శ్రీనివాస్, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కంట్రోల్ రూమ్ నంబరు 08542 241165ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. మూడు షిఫ్ట్లలో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల నుంచి వచ్చే కాల్స్ను స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూమ్ నంబరుకు సంప్రదించి సహాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మొక్కజొన్న అక్రమాలపై ముమ్మర దర్యాప్తు జడ్చర్ల: బాదేపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, ఇతర అక్రమాల కు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సింగిల్విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, సీఈఓ యాద గిరి, గోదాము సిబ్బంది సాధిక్లను విచారించినట్లు పేర్కొన్నారు. బాధిత రైతుల స్టేట్మెంట్లను కూడా రికార్డు చేశామన్నారు. అయితే మార్క్ఫెడ్ కొనుగోళ్ల వివరాలు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ జానకి అనుమతి తో మార్క్ఫెడ్ అధికారులకు లేఖ రాస్తామని సీఐ కమలాకర్ వెల్లడించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిస్థాయిల అధికారులు కార్యస్థానాలు వదిలివద్దని, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పనిచేస్తున్న హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని, ఎవరూ సెలవులపై వెళ్లవద్దని ఆదేశించారు. రిజర్వాయర్ల నుంచి వరద ప్రవహించే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో, కోయిల్సాగర్ సమీప ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్ిసీలు, సీహెచ్సీలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, సీపీఓ రవీందర్, డీఏఓ గోవింద్ నాయక్, ఈఈ దేశ్యానాయక్, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. 45 రోజులకోసారి సమావేశాలు తప్పనిసరి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలను ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఈ సమావేశాలకు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండలస్థాయి అధికారులు, శాశ్వత ఆహ్వానితులు తప్పనిసరిగా హా జరు కావాలని పేర్కొన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, అజెండాలోని అన్ని అంశాల పై సమగ్రంగా చర్చ జరిగేలా చూడాలని, సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలపై తదు పరి చర్యలు చేపట్టేలా పర్యవేక్షించాలని సూ చించారు. అలాగే, సమావేశాల సమర్థవంతమై న నిర్వహణకు ఎంపీడీఓలకు అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు. -
ఆటలు నేర్పే గురువులు కావాలి!
● కోచ్లు కావాలని శాట్ను కోరిన డీఎస్ఏ ● మినీ స్టేడియాల్లో కోచ్ల నియామకంపై ప్రతిపాదనలు ● త్వరలోనే నియమించే అవకాశం? మహబూబ్నగర్ క్రీడలు: క్రీడాకారుల సౌకర్యార్థం కోసం, ఇండోర్ గేమ్లలో క్రీడాకారులు ప్రతిభ చాటాలనే ఉద్దేశంతో జిల్లాలో ఇండోర్ స్టేడియాలు నిర్మించారు. కోట్లాది నిధులతో మహబూబ్నగర్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మూడు మినీ స్టేడియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని మెయిన్ స్టేడియంలో దాదాపు రూ.7.79కోట్ల నిధులతో అధునాతనమైన క్రీడా సౌకర్యాలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే తలమానికంగా నిలుస్తోంది. ఇందులో రెండు ఫ్లోర్లలో ఇండోర్ గేమ్లు ఆడేలా హాళ్లతో పాటు స్టోర్ రూంలు, క్రీడాకారుల వసతి గదులు ఏర్పాటు చేశారు. అలాగే రెండు వైపుల గ్యాలరీలు, ఆరు బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాటోర్నీలు నిర్వహించేందుకు ఈ స్టేడియం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇటీవల ఫాస్ట్–5 జాతీయస్థాయి సీనియర్ నేషనల్ నెట్బాల్, రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్తోపాటు సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు నిర్వహించారు. కాగా.. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో రూ.2కోట్ల 65లక్షలతో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్లో రూ.కోటి 59 లక్షలతో ఇండోర్ స్టేడియం, భూత్పూర్ మండలం పోతులమడుగు సమీపంలో రూ.2.65కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. ● జిల్లాలోని నాలుగు ఇండోర్ స్టేడియాల్లో కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రస్తుతం ఒక బ్యాడ్మింటన్ కోచ్గా ఉండగా బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు కోచ్లు లేరు. అల్లీపూర్లోని ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, బ్యాడ్మింటన్ కోచ్లు ఉండగా ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో యోగా కోచ్ ఉండగా, పోతులమడుగు సమీపంలోని ఇండోర్ స్టేడియంలో కోచ్లు లేరు. మినీ స్టేడియంలతో పాటు జిల్లాలోని ఇతర చోట్ల కోచ్ల అవసరాన్ని గుర్తించి ఇటీవలజిల్లా యువజన, క్రీడాశాఖ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ప్రతిపాదనలు పంపారు. కోచ్ల నియామకం అయితే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. వెంటనే మినీ స్టేడియంతో పాటు ఇతర చోట్ల సరిపడా కోచ్ల నియామకం చేపట్టాలని సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టేడియాలు లేకున్నా కొన్ని ప్రాంతాల్లో కోచ్లు కావాలని ప్రతిపాధనలు పంపారు. కోడ్గల్కు హ్యాండ్బాల్, వాలీబాల్, మిడ్జిల్కు ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాలానగర్కు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లేదా ఖోఖో, రాజాపూర్కు వాలీబాల్, ఖోఖో క్రీడలకు సంబంధించి కోచ్ల ప్రతిపాదనలు పంపారు. మెయిన్ స్టేడియంలో సాఫ్ట్బాల్ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్) -
నాలా పైప్లైన్లో పడి వృద్ధుడి గల్లంతు
● కూతురి వద్దకు వెళ్తుండగా ఘటన ● వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి పైప్లైన్ పనులు ● హైడ్రా, సీఎంసీ, పోలీస్ బృందాల గాలింపు చందానగర్: కూతురు దగ్గరకు వెళ్లి వస్తా అని చెప్పివెళ్లిన ఓ వృద్ధుడు నాలా పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్కు చెందిన బాలయ్య (70), భార్య పద్మ ఇద్దరు కుమారులు శ్రీను, బాలస్వామి, కూతురు మంజులతో కలిసి న్యూ హఫీజ్పేటలోని ప్రేమ్నగర్లో స్థిరపడ్డారు. బాలయ్యకు కంటిచూపు మందగించి రాత్రి సమయాలలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడు కాదు. కూతురు మంజుల వైశాలీనగర్లో నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం బాలయ్య కూతురు దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి వైశాలీనగర్ వైపు బయలుదేరాడు. రైల్వే అండర్ బ్రిడ్జి పైప్లైన్ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బాలయ్య ఒక్కసారిగా పాత పైప్లైన్లోకి జారి పడిపోయాడు. అప్పటికే భారీ వరదతో ప్రవహిస్తున్న పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి 100కి ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం హైడ్రా, సీఎంసీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి సమయం కావడం ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పైప్లైన్లో పడ్డ వృద్ధుడి కోసం గాలింపునకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి హైడ్రా, సీఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. సాయంత్రం వరకు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ఈర్ల చెరువు వరకు వృద్ధుడి కోసం గాలించారు. -
తప్పుడు ప్రయోజనాలుంటే పదవికి రాజీనామా చేస్తా
● యూనివర్సిటీ ప్రయోజనాల కోసం కృషి : వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ప్రయోజనాలను నష్టం చేస్తే పదవి నుంచి తప్పుకుంటా నని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందితో పాటు పాలమూరు జిల్లా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. నేషనల్ సెమినార్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఇక్కడి వసతులు సరిపోవని, వారు వచ్చేందుకు హైదరాబా ద్ నుంచి దూరం అవుతుందన్నారు. వారు తప్పకుండా సెమినార్కు రావాలన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశామని, ఇందులో ఎలాంటి ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. ఏవైనా తప్పుడు ప్రయోజనాలు ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని రాజీనామా లెటర్ను చూపించారు. కేవ లం యూనివర్సిటీకి మంచి పేరు కోసం కృషి చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సెమినార్ ప్రారంభం నుంచి విద్యార్థి సంఘాల కోరిక మేరకు ఒక్కరోజు ఇక్క డ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కన్హాశాంతి వనంలో కార్యక్రమం ఏర్పాటు చేసే అంశాన్ని పూర్తిగా కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకు మాత్రమే అక్కడ నిర్వహించాల ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాలమూరు పునఃనిర్మాణ ఫోరం అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్, వామన్కుమార్ అధికారులతో మాట్లాడుతున్న క్రమంలో ఉద్దేశ పూర్వకంగా సెమినార్ను కన్హాశాంతి వనానికి మార్చారని, ఎటువంటి పరిస్థితి లో అక్కడ నిర్వహించవద్దని, నిర్వహించేందుకు డబ్బులు లేకపోతే తాము డబ్బులు ఇస్తామని హర్షవర్ధన్రెడ్డి పేర్కొనడం చర్చనీయాశంగా మారింది. -
సైబర్ నేరాలు, రోడ్డుభద్రతపై అవగాహన కల్పించాలి
మహమ్మదాబాద్: నేటి సమాజంలో యువతలో ఎక్కువగా జరుగుతున్న సైబర్నేరాలు, రోడ్డుభద్రతపై పోలీసుల పరిధిలో అవగాహన కల్పించాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్హెచ్ చౌహాన్ పేర్కొన్నారు. బుధవారం మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెచ్చుపెరిగిపోతున్న ఈ సమయంలో ముఖ్యంగా యువతకు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్టేషన్కు వచ్చిన కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ప్రతిఫర్యాదును వెంటనే నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకో వాలని తెలిపారు. మహిళలకు చిన్నారుల కేసులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. రాత్రివేళలో బీట్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అవినీతి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. పోలీస్టేషన్కు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించాలని అలాంటి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్టేషన్ల పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని రికార్డులను చూశారు. సివిల్ కేసుల్లో ఎక్కువగా తలదూర్చవద్దని అలాంటి కేసులు కోర్టుల పరిధిలో తేల్చుకుంటారని పేర్కొన్నారు. ఈయన వెంట రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి, పోలీస్టేషన్ సిబ్బంది ఉన్నారు. -
600 కేజీల నల్లబెల్లం పట్టివేత
వెల్దండ: మండల కేంద్ర సమీపంలో కల్వకుర్తి ఎకై ్సజ్శాఖ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా.. 600 కేజీల నల్లబెల్లం, 120 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. హైదరాబాద్లోని బేగంబజార్ గంజ్ నుంచి స్కార్పియో వాహనంలో రంగారెడ్డి జిల్లా తలకొండ మండలంలోని మెగ్లితండాకు చెందిన ఇస్లావత్ రాజు అక్రమంగా నల్లబెల్లం, పటిక మన్ననూర్ గ్రామానికి తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. వాహనంలో తరలిస్తున్న 20 బస్తాలు (600 కేజీలు) నల్లబెల్లం, 120 కేజీల పటికను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసి రాజుపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది జనార్దన్రెడ్డి, సిదార్థ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తన అమీర్పేట: సనత్నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారి పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆరోపించారు. మహిళా సెక్యూరిటీ గార్డు ఏకంగా చేయిచేసుకునేందుకు యత్నించిందని ఓ రోగి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.వివరాల్లోకి వెళ్తే..జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రిషియన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆకుల వెంకటేష్ చికిత్స నిమిత్తం ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాడు. కన్ను, వెరికోవేన్స్ సమస్యతో బాధపడుతున్న అతడికి వైద్యులు పరీక్షలు చేసి కంటికి లెన్స్ వేయాలని, లెన్స్ వచ్చాక సమాచారం ఇస్తామని పంపించారు. గత శుక్రవారం ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని చెప్పడంతో వచ్చి ఆసుపత్రిలో చేరాడు.వెంకటేష్తో పాటు మరో 10 మంది ఓపీడీకి తీసుకెళ్తున్న సమయంలో మహిళా సెక్యూరిటీ గార్డు రోగులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడమే కాకుండగా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని దుర్భాషలాడుతూ చేతిలో ఉన్న పెన్నుతో చేయి చేసుకునేందుకు ప్రయత్నించిందని వెంకటేష్ తెలిపాడు. వైద్యులు రమ్మన్నారని చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. వైద్యులు, నర్సులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా, ఇతర సి బ్బంది పనితీరు సరిగా లేదని వెంకటేష్ అన్నా రు. ఆస్పత్రిలో నీటి కొరత తీవ్రంగా ఉందని, రోగులకు ఇస్తున్న ఆహారంలో అస్సలు నాణ్య త ప్రమాణాలు పాటించకుండా నాసీరకం ఆహారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. -
వీధికుక్కల బీభత్సం.. ఏడుగురిపై దాడి
మక్తల్: పట్టణంలో వీధికుక్కలు ఏడుగురిపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. 16వ వార్డు అనంపల్లి వీధికి చెందిన పలువురిపై దాడి చేయడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మహేశ్వరి అనే మహిళను మెరుగైన చికిత్స కోసం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిపై ఒకేసారి దాడికి పాల్పడటంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ బజార్లో కుక్కలు బెడద అధికంగా ఉందని, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలి
కల్వకుర్తి రూరల్: ప్రపంచంలోని సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో కల్వకుర్తి పట్టణంలో 91 విశ్వశాంతి మహాయాగం కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఉద యం నుంచి రాత్రివరకు కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు మారుమోగుతున్నా యి. హోమాలు, యాగాలు సర్వ మానవాళి మేలుకోసమే జరుగుతున్నాయి. 11రోజులుగా యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులతోపా టు యాగ నిర్వాహకులు జూలూరు రమేష్బాబు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్న మాల ఆనంద్కుమార్ దంపతులతోపాటు ప్రముఖులు పాల్గొని చండీహోమం నిర్వహించారు. హో మానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులు యాగశాల ప్రదక్షిణ చేయడంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి పాటలు పాడడంతోపాటు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం చండీహో మం, పాశుపత, శ్రీ సుదర్శన, లక్ష్మీనారాయణ హో మాలు, సరస్వతి పూజలు, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వా మి కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. సామూహిక కుంకుమార్చనలో దంపతులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకష్ణ, బాలకృష్ణ, సురేందర్, రామస్వామి, ప్రకాష్, గోపాల్, సతీష్, రమకాంత్రెడ్డి, సంతుయాదవ్ పాల్గొన్నారు. -
లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగితే విజయం
● ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి నవాబుపేట:లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగాల ని అప్పుడే.. మన టార్గెట్ పూర్తవుందని.. లక్ష్యసాధనలో ఆలస్యం కావచ్చు.. ఇబ్బందులు రావచ్చు.. వాటిని అధిగమించి ముందుకు సాగితే లక్ష్యం తప్పక చేరుకుంటాం.. ఇది నేను పాటించి విజయం సాధించి నేడు మీ ముందు నిల్చుని మీరు పాటించి ఉన్న శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ తన విజయ రహస్యం చెప్పుకొచ్చారు ఎంఎస్ఎన్ ఫార్మ అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టుబోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం తాను పుట్టిన గ్రామం, తాను చదివిన బడికి రూ.రెండున్నర కోట్లతో నిర్మించిన పాఠశాల అధునాతన భవనాన్ని విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను డిగ్రీ వరకు ప్రభుత్వ బడుల్లోనే చదివినట్లు తెలిపారు. తాను కళాశాలలో లెక్షరర్గా పనిచేసి సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తాజాగా వందకు పైగా దేశాల్లో కంపెనీ మార్కెటింగ్, 26 ఫార్మ బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన కంపెనీలలో దాదాపు 30వేల మంది ఉపాధి ిపొందుతుంటే దాదాపు పదివేల మంది పాలమూరు జిల్లా వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అందుకే తాను చదివిన పాఠశాలను అధునాతన పద్ధతిలో కంపెనీ ద్వారా ఖర్చు చేసి అధ్యాపకులను సైతం నియమించినట్లు తెలిపారు. విద్యకు ఎలాంటి చేయూతనిచ్చేందుకు తాను ముందుంటానని వివరించారు. విద్యముందు ఆస్తులు ఒక లెక్కకాదని ఆస్తులుంటాయి.. పోతాయి.. విద్యాజనం తరిగిపోదన్నారు. ● ఇప్పటికే గ్రామంలో రూ.కోట్లాది రూపాయలతో రోడ్లు, అండర్ డ్రెయిన్, విద్యుత్లాంటివి ఏర్పాటు చేశామని, తాజా విద్యను కార్పోరేట్ స్థాయిలో అందరికీ అందిస్తున్నామన్నారు. త్వరలోనే వైద్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీనివాస్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ రవీందర్రెడ్డి, గురుకుంట మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డి, ఎంఈఓ నాగ్యనాయక్, ఎంఎస్ఎన్ కంపెనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతాప్, రవి, శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రాజశేఖర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
ఉపాధి కోసం వచ్చి.. చోరీలు
● ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల రిమాండ్ షాద్నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్లో ఈ నలుగురు దుండగులు బైక్లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కాగా.. కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఉరేసుకుని వలస కూలీ మృతి
గద్వాల క్రైం: జీవనోపాధి కోసం వచ్చిన ఓ వలస కూలీ ఉరేసుకుని మృతిచెందిన ఘటన గద్వాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్లోని ముజాఫార్పూర్కు చెందిన టూటాన్ రామ్ (34) నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వలస వచ్చాడు. అయితే బసాపురం శివారులోని అబ్దుల్ అజీమ్ కోళ్ల షెడ్డులో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తండ్రి, కుమారుడి ఆరోగ్యం క్షీణించింది. వారంరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇద్దరి ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. ఈ విషయంపై మనస్తాపం చెంది తెల్లవారుజామున కోళ్ల షెడ్డులో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి అక్క ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాముకాటుకు బలి నర్వ: పాముకాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన ఉందేకోడ్లో చోటుచేసుకుంది. ఎస్ఐ పబ్బతి రమే ష్ కధనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3:30గంటల ప్రాంతంలో మొట్టె చిన్న న ర్సింహులు(48) తనకు ఏదో కరిచిందని కు టుంబ సభ్యులకు చెప్పాడు. భార్య, కొడుకు దుప్పటిని పరిశీలించి చూడగా.. నూనెకట్ల పా ముగా గుర్తించి చంపారు. అనంతరం 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ..ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లలిత, కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య ఉప్పునుంతల: మండలంలోని తాడూరుకు చెందిన గుండెమోని పార్వతమ్మ (43) గత ఆదివారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటికి క్యూరింగ్ చేస్తుండగా.. అయిజ: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. చిన్న తాండ్రపాడు గ్రామానికి చెంది న ఏసన్న (60) బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి పైకప్పుకు నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వైర్లను తాకాడు. దీంతో అక్కడ నుంచి కింద ఉన్న రాళ్ల కుప్పపై పడిపోయాడు. అది గమనించిన కు టుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఏసన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడికి భార్య, కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్తంభం తలపై పడి రైతు మృతి మానవపాడు: పంటపొలంలో ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం తలపై పడి రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్కానిస్టేబుల్ శివకుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ గొల్ల పెద్ద నారాయణ (51) పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో గెట్టు వద్ద ఉన్న స్తంభానికి బిగించిన స్టే వైర్ ట్రాక్టర్ పలుగుకి తగిలింది. ఈ క్రమంలో ట్రాక్టర్ అలాగే ముందుకు పోవడంతో స్తంభం విరిగి గొర్రుపై ఉన్న గొల్ల పెద్దనారాయణ తలపై పడడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గుర్తిచించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పెద్ద నారాయణ మృతి చెందాడు. మృతుడికి కుమార్తె, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్కానిస్టేబుల్ శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు గద్వాల క్రైం: జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవా రం అర్ధరాత్రి క్షు ద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని రాఘ వేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ముగ్గులు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు చూసి భయాందోళన చెందారు. స్థానిక కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే స్థానికుల సహాయంతో శుభ్రం చేయించారు. -
విద్యార్థి మృతికి లెక్చరరే కారణం
కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా ● మద్దతు పలికిన విద్యార్థి సంఘాలు ● ఆర్డీఓ హామీతో విరమించిన వైనం గద్వాల క్రైం: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ (17) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందిన సంఘటన విదితమే. అయితే బుధవారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్ రోడ్డుపై విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు శిరీషను విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడటం, చెంపదెబ్బ కొట్టడం ద్వారా తరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ లెక్చరర్ కాకున్నా ఆమె చేసిన నిర్వాకం కారణంగా అమయాక విద్యార్థి మరణానికి కారణమైందని, తక్షణమే సదరు అధ్యాపకురాలిని అరెస్టు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. పోలీసులు శాంతింపజేసేంకు ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది. ఆర్డీఓ శ్రీనివాస్రావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థి మృతిపై న్యాయ విచారణ చేపట్టి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉదోగ్యం ఇవ్వాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిందితురాలైన అధ్యాపకురాలు శిరీషపై మృతుడి సోదరుడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని, త్వరలో అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతామన్నారు. అదే విధంగా విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మహిళ లెక్చరర్ విధుల్లో చేరినప్పటి నుంచి విద్యార్థులతో ఆమె వ్యవహరించే తీరు సైతం విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని విషయాలో జోక్యం చేసుకోవడం ఉంటుందని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థి మృతికి కారకులైన అధ్యాపకురాలి ద్వారా రూ.8 లక్షలు చెల్లించేందుకు కొందరు డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు. -
అడ్డంకులు తొలగేనా..?
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్కు ఇబ్బందులను తొలగిస్తాం. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నా యి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులోని గూడెందొడ్డి రిజర్వాయర్ భూ సేకరణ పూర్తయితేనే పెండింగ్ పనులు ముందుకు పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై సీఎం ప్రత్యేక దృష్టి అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ వరుస సమీక్షలు -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
జిల్లాకేంద్రంలోని ద్వారకామయి ఆలయంలో భక్తులు జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని శ్రీద్వారకామయి సాయిమందిరంలో కాగడహారతి, మహాన్యాస పారాయణం, అష్టోతర శతక్షీర కుంభాభిషేకం, ప్రదోషకాలపూజ, ఆలయ ఆవరణలో సామూహిక సాయి వ్రతాలతో పాటు పల్లకీసేవ చేపట్టారు. వెంకటేశ్వర కాలనీ, లక్ష్మినగర్, జడ్చర్లలోని విజయనగరం కాలనీ ల్లోని సాయినాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్నగర్ లక్ష్మీనగర్ కాలనీ బాబా గుడిలో భక్తులు -
ఈ వానతో పత్తి గట్టెక్కింది
ఈసారి వర్షాలు లేక పత్తి పంట ఎండుముఖం పట్టింది. మొక్కల ఎదుగుదల కూడా మందగించింది. మరో వారం రోజులు వర్షం పడకపోతే పంట దెబ్బతింటుందనే ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు కురిసిన వర్షంతో పొలంలో తేమ పెరిగింది. పత్తి మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు, మూడు వర్షాలు కురిస్తే దిగుబడిపై మంచి ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం కలుపు నివారణ, అంతర కృషి పనులు చేపట్టి పంటలను కాపాడుకుంటాం. – చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్ గ్రామం, చిన్నచింతకుంట మండలం కురిసిన వర్షం పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. వర్షం తర్వాత పంటల్లో పురుగులు, శిలీంధ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రైతులు తప్పనిసరిగా పొలాలను పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ, తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి, ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన పురుగుమందులు పిచికారీ చేయాలి. మొక్కజొన్న, కంది పంటల్లో కూడా పురుగు, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏఈఓలను సంప్రదించాలి. నేలలో తేమ ఉన్న సమయంలో కలుపు నివారణ, అంతరకృషి, సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెడితే పంట ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. రైతులు క్షేత్రస్థాయిలో పంటలను నిరంతరం పరిశీలిస్తూ శాసీ్త్రయ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి -
గృహకల్పలో కూలిన బాల్కనీ రెయిలింగ్
● బ్లాక్ నం.1, 3వ అంతస్తులో ఘటన ● పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ దేవరకద్ర మార్కెట్కు అమ్మకానికి వచ్చిన ఉల్లి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని 11వ డివిజన్ బండమీదిపల్లిలోని రాజీవ్ గృహకల్ప ఒకటో బ్లాక్, 3వ అంతస్తులో మంగళవారం రాత్రి బాల్కానీ రెయిలింగ్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం సంఘటన స్థలాన్ని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఓవర్హెడ్ నీటి ట్యాంకులతో పాటు కొన్ని భవనాల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో గృహకల్పలో నివసిస్తున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఈ భవన సముదాయంపై సమగ్ర సాంకేతిక (స్ట్రక్చరల్) తనిఖీ నిర్వహించి నిర్మాణ స్థిరత్వంపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. తనిఖీలో ఆర్డీఓ ఇ.నవీన్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ) శ్రీనివాస్యాదవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ, ఏఈ నుస్రత్ పాల్గొన్నారు. నిర్వహణ సరిగా లేక.. రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ఎకరాన్నర విస్తీర్ణంలో 12 బ్లాకులను (జీ ప్లస్ త్రీ) నిర్మించగా.. దీనికి 2007 మార్చిలోప్రారంభోత్సం చేశారు. మొత్తం 384 ఫ్లాట్లు ఉండగా అనంతరం కాలనీ సంక్షేమ కమిటీ ఏర్పాటైంది. అయితే దీని నిర్వహణను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 20 ఏళ్లు దాటినా ఏనాడూ కనీసం సున్నం వేసిన దాఖలాలు లేవని ఎక్కడికక్కడ ప్లాస్టరింగ్ ఊడిపోతోందని వాపోయారు. -
ఉత్పాదకతను పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వీబీజీ రాంజీ అధిక శ్రమ ఆధారిత, ఉత్పాదకతను పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. జిల్లాలో చేపడుతున్న వీబీజీ రాంజీ పనులపై బుధవారం కలెక్టరేట్లో వెబ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న పనులు, కూలీల వినియోగం, పనుల పురోగతి, సకాలంలో పూర్తి చేయడం, నాణ్యతా ప్రమాణాల అమలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉపాధి కల్పించడంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మన్నికై న సామాజిక ఆస్తుల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల అమలులో నాణ్యతను కచ్చితం ్డగా పాటిస్తూ, ప్రతి పనిని నిర్దేశిత గడువు గా పూర్తి చేయాలని సూచించారు. స మావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, ఎంపీడీఓ లు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఈసీలు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి మెట్టుగడ్డ: దేశంలో సగ భాగానికి పైగా ఉన్న బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని, బీసీలను ఏకం చేసి ఉద్యమ జ్వాలను రగిలిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యానిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ వాల్పోస్టర్ను బుధవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రాజకీయ రిజర్వేషన్ల బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోందని, బీసీ బిల్లు లేకుండా ప్రవేశపెట్టే ఈ బిల్లులను అన్ని పార్టీలు అడ్డుకోవాలన్నారు. నాయకులు చంద్రశేఖర్, మహేష్యాదవ్, దోమ వెంకటేష్, జ్ఞానేశ్వర్, వేణుగౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో భారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టుప్రాంతాలు రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, శేషాద్రినగర్, నాగిరెడ్డి కాలనీ, బీఎన్రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, రాయచూర్ రోడ్డు, గౌడ్స్కాలనీ, గణేష్నగర్, వన్టౌన్లోని మహిళా పోలీస్స్టేషన్ ప్రాంగణం, వల్లభ్నగర్, కిసాన్నగర్, కుర్విహినిశెట్టికాలనీ, లక్ష్మీనగర్కాలనీ, వేంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణం జలమయంగా మారాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు పొంగి రోడ్లపైకి వర్షపునీటితో పాటు మురుగు ఏరులై పారింది. బస్టాండులో ప్రయాణికులతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, పలుసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇక 12 విలీన గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ బురదమయంగా తయారైంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా నగరంలో 41.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పది మండలాల్లో పది మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కోయిలకొండ, గండేడ్, జడ్చర్ల, రాజాపూర్, నవాబుపేట, మహమ్మదాబాద్, బాలానగర్లో ముసురుతో కూడిన జల్లులకు పడ్డాయి. -
రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలి
● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ పాలమూరు: వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్ఎంఐడీసీ అధికారులను కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. మొదట వినియోగదారుల ఫోరం కోర్టు దగ్గరకు వెళ్లి సందర్శించారు. ఫోరం కోర్టు న్యాయమూర్తితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావుతో కలెక్టర్ చర్చించారు. వినియోగదారుల ఫోరం కోసం నూతన భవనం కేటాయిస్తామని, అందులోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంతో పాటు గ్రౌండ్ వాటర్ శాఖ కార్యాలయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి ఈ బ్లాక్ పనులు పరిశీలించారు. పార్కింగ్, గార్డెనింగ్, వెయిన్ రోడ్డు, అప్రోచ్ రోడ్డు తదితర పెండింగ్ పనులు పూర్తి చేసి రెండు నెలల్లో ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు. శిక్షణ కలెక్టర్ సాయి శివాని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, డీఈఈ వేణుగోపాల్, ఏఈ శరత్ పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ ఎలా అంటే..
నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. -
కల్యాణ వైభోగం..
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్బగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలతో కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరిరామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు. -
హుండీ లెక్కింపులో వింతలు
అలంపూర్: శక్తిపీఠంలో సోమవారం నిర్వహించిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీ లెక్కింపులో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూశాయి. హుండీ కానుకలను లెక్కిస్తున్న అధికారులకు ఓ లేఖ లభించింది. అందులో ఇలా ఉంది ‘‘ఉన్నత విద్య పూర్తిచేశా. ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు.. నీ చల్లని చూపుతో నాకు ఉద్యోగం వచ్చేట్టు చూడమ్మా’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. బయోడెటాను జతచేసి హుండీలో వేసిన లేఖ వెలుగు చూడటంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అలాగే సేవ పేరుతో హుండీ లెక్కింపునకు వచ్చిన ఓ మహిళ చేతివాటం ప్రదర్శించడం స్థానికంగా కలకలం రేపింది. హుండీ లెక్కింపులో సదరు మహిళ రెండు, మూడు సార్లు బయటికి వెళ్లి రావడం సిబ్బంది గమనించారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఈఓ దీప్తికి సమాచారం అందించి తనిఖీలు చేపట్టారు. ఆమె వద్ద రూ. 12వేల విలువ గల రూ. 500 నోట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. దేవుడి హుండీ లెక్కింపులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ఆలయ ఈఓ దీప్తి మాట్లాడుతూ.. మహిళ వద్ద ఉన్న డబ్బులను రికవరీ చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపడుతామన్నారు. హుండీ లేక్కింపులో భక్తులు డబ్బులు, బంగారం, వెండితోపాటు విదేశీ కరెన్సీ సైతం వేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. -
కాల్పులు జరిపినా.. కొరడా ఝులిపించినా..
● 1969లోనే తెలంగాణ తొలి ఉద్యమం ● తూటాలకు బలైన ఇంజినీరింగ్ విద్యార్థి ● నాటి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు అలంపూర్ రూరల్: తెలంగాణ తొలి ఉద్యమం 1969 లోనే ప్రారంభం కాగా.. పోలీసులు కాల్పులు జరిపినా.. కొరడాలు ఝులిపించినా ఉద్యమం తగ్గలేదని నాటి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు అన్నారు. అలంపూర్ పట్టణంలోని తెలంగాణ హరిత అతిథి గృహంలో మంగళవారం తెలంగాణ తొలి ఉద్యమకారుల సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ.. 1969, ఏప్రిల్ 7న గద్వాలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇంజినీరింగ్ విద్యార్థి సర్వారెడ్డి బలయ్యారని గుర్తుచేసుకున్నారు. 1969, ఏప్రిల్ 9న జరిగిన సర్వారెడ్డి అంతిమ యాత్రలో మరొక బాలుడు కొట్టం వేణుగోపాల్ పోలీసుల తూటాలకు బలైన సందర్భంగా యావత్ గద్వాల ప్రాంతం విద్యార్థి సంఘాల యాక్షన్ కమిటీ పాఠశాలలు, కళాశాలలను నిరవధికంగా బంద్ చేయడంతో పాటు పరీక్షలు కూడా బహిష్కరించారని తెలిపారు. నాటి ఉద్యమంలో 370 మంది బలిదానం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఉద్యమ సమయంలో చురుకై నా పాత్ర పోషించి పోలీసు కేసులున్న వారికి, 1969లో స్కూల్ అండ్ కాలేజీలో నిరవధికంగా పరీక్షలు రాయని వారు కూడా సంక్షేమ పథకాలకు అర్హులేనన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ 2023 అక్టోబర్లో ఽహైదరాబాద్లోని ధర్నాచౌక్లో మహాధర్నా చేపట్టగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. 28 మే, 2024న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, ఎంపీ మల్లు రవికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. గద్వాల జిల్లాలో నిర్వహించనున్న విస్తృత స్థాయి సమవేశాలకు నాటి విద్యార్థుల యొక్క కుటుంబ సభ్యులు హాజరు కావాలని మోహన్రావు కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ మోమిన్, నాగన్గౌడ్, ప్రభాకర్, కొట్టం రవి, మాణిక్యరెడ్డి, అచ్చన్న గౌడ్, రాంగోపాల్, సర్వరెడ్డి, అక్బర్బాషా, శాలిమియ్యా, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో పడగ
శాస్త్రవేత్త డాక్టర్ కల్యాణి మహబూబ్నగర్ (వ్యవసాయం): పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్నినో ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై తీవ్రంగా ఉంటుంది. దీని ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గడం, వర్షాల పంపిణీలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు పనులు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కల్యాణి సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల ఎంపిక నుంచి నీటి నిర్వహణ వరకు శాసీ్త్రయ విధానాలను అనుసరిస్తే నష్టాలను గమనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన అవగాహన పత్రంలో ఎన్నినో ప్రభావ సమయంలో రైతులు అనుసరించాల్సిన పలు సూచనలను వివరించారు. వర్షాలు ఆలస్యమైనా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళిక మార్చుకోవాలని పేర్కొన్నారు. వాతావరణ సమాచారమే కీలకం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసే వాతావరణ సూచనలను రైతులు నిరంతరం పరిశీలించాలి. వర్షాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే విత్తనాలు వేయడం, తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. తక్కువ వ్యవధి పంటలు.. వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటే తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే, కరవును తట్టుకు నే పంట రకాలను ఎంపిక చేసుకోవాలి. అవసరౖ మెతే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి. తేమ సంరక్షణ తప్పనిసరి నేలలో తేమ నిల్వ ఉండేలా దుక్కి, మల్చింగ్, గట్లు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలి. వర్షపు నీరు వృథా కాకుండా పొలాల్లోనే నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపు.. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు సాధ్యమవుతుంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలి. సూచనల మేరకే.. కలుపు నియంత్రణ, అంతర పంటలు, పంట మార్పిడి వంటి శాసీ్త్రయ పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎరువులు, పురుగు మందులు వ్యవసాయ శాఖ సూచనల మేరకే వినియోగించాలి. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు మేత కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగానే పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నినో ప్రభావం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. వాతావరణ సూచనలకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకుంటే పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, సరైన పంటల ఎంపికతో రైతులు ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలరు. పాడి–పంట ముందస్తు ప్రణాళికతో పంట నష్టాలకు అడ్డుకట్ట వాతావరణ సూచనల ఆధారంగా సాగు చేపట్టాలి తక్కువ వ్యవధి, కరవును తట్టుకునే పంటలకు ప్రాధాన్యం తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదలపై దృష్టి జేటీఎస్ఏయూ శాస్త్రవేత్త డాక్టర్ కల్యాణి సూచనలు -
భక్తిశ్రద్ధలతో విశ్వశాంతి మహాయాగం
కల్వకుర్తి రూరల్: విశ్వశాంతి మహాయాగం పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం సామూహిక కుంకుమార్చనలు, హోమాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా దేవుడిపై నమ్మకం పెట్టి చేసే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ కోరుకునేది ఒక సనాతన ధర్మంలోనే ఉంటుందన్నారు. తమ ధర్మాన్ని ఆచరించడంతోపాటు సమాజంలోని ఇతరులకు తన వంతు సహాయం చేయడం ముఖ్యమన్నారు. ఉదయం మన్యుసూక్త హోమం, కుజదోష నివారణ హోమాలు, సుబ్రహ్మణ్యస్వామికి అభిషేక అర్చన హోమాలు, సరస్వతి పూజలు హోమాలు జరిపించారు. రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాయాగంలో ఆర్డీఓ జనార్ధన్రెడ్డి యాగశాల ప్రదక్షిణ చేసి మహాశివుడికి అభిషేకం నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ జిల్లెల్ల వెంకటరెడ్డి, జూలూరు రమేష్బాబు, పసుల రమాకాంత్రెడ్డి, బీచని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పునరావాసం పేరుతో అభివృద్ధికి ఆటంకం
మన్ననూర్: శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారికి అనుసరించి ఉన్న వటువర్లపల్లి గ్రామస్తులకు పునరావాసం పేరుతో గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మన్ననూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను గ్రామస్తులు కలిసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన కొందరు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర పట్టణాలకు గతంలోనే తరలివెళ్లినా.. మరికొందరు తప్పుడు ఆధార్, రేషన్ కార్డులను సంపాదించుకుని పునరావాసం కోరుతున్నారని వారు ఆరోపించారు. వటువర్లపల్లిలో పుట్టి పెరిగి దశాబ్దాల కాలంగా ఇక్కడే జీవిస్తున్న ఏ ఒక్కరూ పునరావాసం కోరుకోవడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొందరు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా గ్రామంలోనే నివాసం ఉంటామని కోరుకుంటున్న అర్హులైన వారసత్వ కుటుంబాల మనుగడ కోసం అభివృద్ధి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వటువర్లపల్లి మాజీ సర్పంచులు సర్యనాయక్, చత్రునాయక్, గ్రామస్తులు వెంకటపతి, అనిల్కుమార్, ప్రభాకర్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్య దర్శి జి.శరత్చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలను శరత్చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపియ్యే తుది జట్టును తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో వచ్చేనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్–6, అండర్–8, అండర్–10, అండర్–12 ఏళ్లలోపు బాలబాలికలు, జాతీయ జావెలిన్ డే సందర్భంగా అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాల, బాలికలు, పురుషు ల, మహిళల జావెలిన్త్రో పోటీలు ఉంటాయని తెలిపారు. జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు ఆనంద్, సునీల్, సి.శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
మక్తల్: జూరాల వెనుల జలాల కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అదుకుంటామని తెలంగాణ రాష్ట్ర సెంటర్ కమిషనర్ శివకుమార్ అన్నారు. మండలంలోని దాదాన్పల్లి, అంకెన్పల్లి, అనుగొండ గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆర్అండ్ఆర్ సెంటర్ కోసం ఏర్పాటు చేసిన పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ముంపు బాధితులందరూ కలిసి మెలిసి ఉంటే ఏవైనా పనులు సునాయసంగా అవుతాయన్నారు. ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 67 ఎకరాలు అంకెన్పల్లి, 60 ఎకరాలు దాదన్పల్లికి కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్గౌడ్, ఎస్డీసీ రవీందర్రెడ్డి, ఈఈ గోపాల్నాయక్, డీఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మృతదేహం లభ్యం మహబూబ్నగర్ క్రైం: స్థానిక బండమీదిపల్లి శివారులోని రైల్వే పట్టాల వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే ఎస్ఐ రాజు వివరాల మేరకు.. నగరంలోని వీరన్నపేటకు చెందిన భగవంతు (48) చెత్త కాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చెత్త సేకరణ కోసం రైలు పట్టాల వెంట వెళ్లిన అతడు.. రైల్వే ట్రాక్ దగ్గర అనారోగ్యంతో మృతిచెందాడు. రైల్వే పోలీసులు మృతదేహన్ని జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరి మృతి తిమ్మాజిపేట: మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన గడమోని ఉత్తస్వామి(58) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్రావు తెలిపారు. ఈ నెల 21న గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో మెడ భాగంలో తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య రాములమ్మ, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
దత్తక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తా
మక్తల్: కృష్ణానది సమీపంలో ఉన్న దత్తక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్థఽక, మత్స్యసహకార, పాడిపరిశ్రమ, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ మండలం పస్పుల గ్రామంలోని దత్తక్షేత్రంలో మౌలిక వసతుల కోసం రూ.50 లక్షలతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దత్తక్షేత్రం ఉండటం వలన ఈ ప్రాంత భక్తులు ఎంతో అదృష్టవంతులన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విశ్రాంతి గదులు, బాత్రూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం చిట్యాల– గజరందొడ్డి బ్రిడ్జి పనులను మంత్రి పరీశిలించారు. అంతకు ముందు మంత్రిని ఆలయ కమిటీ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దత్తప్ప, సర్పంచ్ మహేశ్వరి, ఆర్ఐ రాజు, తహసీల్దార్ సతీష్కుమార్, చిట్యాల సర్నంచ్ రహిమత్పాష తదితరులు పాల్గొన్నారు. నిలువురాళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం కృష్ణా: చారిత్రాత్మక ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతాన్ని అన్ని రకాలుగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిలువురాళ్ల చరిత్రను ప్రపంచం గుర్తించే విధంగా పురావస్తు శాఖ, డెక్కన్ హెరిటేజ్ సంస్థ కృషి చేస్తుందన్నారు. నిలువురాళ్ల గుండా వెళ్లిన విద్యుత్లైన్లను త్వరలోనే తొలగించే విధంగా చర్య లు తీసుకుంటానన్నారు. యునెస్కో గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. అనంతరం డెక్కన్ హెరిటేజ్ సంస్థ వేదకుమార్ మాట్లాడుతూ..భవిష్యత్ తరాలకు నిలువురాళ్ల చరిత్రను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు బాల్రా జ్, నర్సప్ప, నాయకులు విజప్పగౌడ్, ఆనంద్గౌడ్, నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పాలమూరు పెద్ద చెరువులో అక్రమ తవ్వకాలు
మహబూబ్నగర్ఎడ్యుకేషన్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి ఒండ్రుమట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రాత్రి వేళల్లోనే ఒండ్రుమట్టిని తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి సైతం రెండు జేసీబీలు, ఎనిమిదికి పైగా టిప్పర్లలో ఒండ్రుమట్టి అక్రమ రవాణా చేపట్టారు. ఇప్పటికే జరిపిన తవ్వకాలతో పెద్ద చెరువులో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. జిల్లాకేంద్రం నడిబొడ్డులో ఉన్న చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఇటు మున్సిపాలిటీ.. అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక్కడి నుంచి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నట్లు తెలిసింది. -
గుప్తనిధుల తవ్వకాలు.. కేసు నమోదు
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి సమీపంలోని నల్లకుంటలో ఉన్న వెంకయ్య బండవద్ద ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన విషయం విదితమే. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం పలువురిపై కేసు నమోదు చేశారు. మామిళ్లపల్లికి చెందిన పంబలి రామస్వామి, దుడ్డు భీముడు, జరుపటి రాజు, గద్దె సైదులు, రాయిచేడ్కు చెందిన విష్ణు, దాసర్లపల్లికి చెందిన గంగుల విజేందర్రెడ్డి, వంగూరుకు చెందిన నామని శంకర్, కోనాపూర్కు చెందిన వెంకటస్వామి, బల్మూర్ మండలం జిన్కుంటకు ఎల్లికంటి మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపా రు. గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధమని అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తవ్వకాల కోసం వినియోగించిన జేసీబీ, ఆటోను పోలీస్స్టేషన్కు తరంచినట్లు పేర్కొన్నారు. రైలు నుంచి జారిపడి దినసరి కూలీ మృతి దేవరకద్ర రూరల్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి దినసరి కూలీ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ రాజు కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడకు చెందిన మహేష్ (27) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. పేరూర్, కురుమూర్తి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జైపాల్రెడ్డి స్మారక అవార్డుల ప్రదానంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జేపీఎన్సీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి స్మారకస్ఫూర్తి పురస్కారాన్ని పాలమూరు బిడ్డలు ఆలూరి గంగయ్య, సూర్యనారాయణకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ.. జైపాల్రెడ్డి స్మారకార్థం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అవార్డులను ప్రదానం చేస్తున్నామని, ఈ ఏడాది విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఇద్దరికి అందించామని పేర్కొన్నారు. జైపాల్రెడ్డి దేశం గర్వించదగ్గ నాయకుడని, అంగవైకల్యం అధిగమించి అచెంలంచెలుగా ఎదిగి గొప్ప నాయకుడయ్యారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన కీలకంగా వ్యవహరించారని, ఆయన నేటితరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిథున్రెడ్డి, భాస్కర్, కార్యదర్శి వెంకటరామారావు, కృష్ణమూర్తి, చంద్రశేఖర్, నాగేందర్, జగపతిరావు పాల్గొన్నారు. శెభాష్ పోలీస్.. ● సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు రాజాపూర్: కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను రాజాపూర్ పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాపూర్కు చెందిన టంకర రాజేశ్ సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో అతడు తన భార్యకు ఫోన్చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన ఇద్దరు పిల్లలతో కలిసి వెతుకుతుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణగౌడ్, హోంగార్డు ఖలీముద్దీన్, పెట్రోలింగ్ వాహన డ్రైవర్ నరేందర్ ఆరా తీశారు. వెంటనే ఎస్ఐ రాజశేఖర్కు సమాచా రం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో రాజేశ్ మోత్కులకుంట శివారులో ని రైలు పట్టాలపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని రాజేశ్ను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీసులను ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు. -
జాతీయ సెమినార్ను విజయవంతం చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జాతీయ సెమినార్ను విజయవంతం చేసేందుకు సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, పలు యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్ కూడా పాల్గొనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం జరిగేందుకు సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకుల దీక్ష విరమణ పీయూలో నిరసన దీక్షకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులకు దీక్ష విరమింప జేసి, వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు రోజుల పాటు నిర్వహించే సెమినార్ను మొదటిరోజు కన్హాశాంతివనంలో, రెండో రోజు పీయూలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు ప్రధాన కారణం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, పలు యూనివర్సిటీ వీసీలు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్, అధికారులు వస్తున్న క్రమంలో వారికి వసతి, ఇతర సదుపాయాలకు ఇబ్బందులు లేకుండా ఉండడమే అన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఒకరోజు శాంతివనంలో, రెండోరోజు పీయూలో నిర్వహిస్తామని యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సెమినార్ పీయూలోనే నిర్వహించాలి పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8వ తేదీల్లో కన్హాశాంతి వనంలో నిర్వహించే నేషనల్ సెమినార్ను పీయూలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవనంలో ఏర్పాటు రౌండ్టేబుల్ సమావేశంలో పాలమూరు పునః నిర్మాణం ఫోరం అధ్యక్షుడు హర్షవర్దన్రెడ్డి అననారు. పీయూ వీసీ తీసుకున్న చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ముఖ్యమంత్రిని ఏకగ్రీవంగా కోరుతున్నామన్నారు. ఎలాగైనా సమావేశాన్ని పీయూలోనే నిర్వహించాలని కోరారు. పాలమూరు పరువు పోతుంటే చూస్తూ ఊరుకోలేమని, విద్యార్థుల కోసం ఎంతటి పోరాటం అయిన చేస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, అడ్వకేట్ వీరబ్రహ్మచారి, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, చెన్నకిష్టప్ప, ఫారుక్ హుస్సేన్, కిష్టారెడ్డి, శ్రీనివాసులు, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కదులుతున్న డొంక!
● మక్కల కొను‘గోల్మాల్’పై పోలీసులవిచారణ ముమ్మరం జడ్చర్ల: బాదేపల్లి సింగిల్విండో ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ చేపట్టిన మొక్కజొన్న కొనుగోళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై జడ్చర్ల పోలీస్స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం సింగిల్విండో సీసీఓ యాదగిరితో పాటు బాధిత కోడ్గల్ గ్రామ రైతులను పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన బస్తాలు.. కాంటా చేయడం.. ఆ తర్వాత లారీల్లో గోదాంకు తరలింపు వంటి అంశాలపై సమగ్ర వివరాలు సేకరించారు. కాంటా సమయంలో బస్తాపై అదనంగా ఎంత మేరకు తూకం వేశారనే దానిపై ఆరా తీశారు. గోదాంకు ధాన్యం తరలింపు అనంతరం మార్క్ఫెడ్కు సమర్పించే ట్రక్ షీట్లలో తేడా వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బస్తాలనే ఏమార్చి బినామీ రైతుల పేరుపై తక్ పట్టీలు సృష్టించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతే కాకుండా కొనుగోలు కేంద్రం నుంచి ఏ గోదాంకు ఎంత ధాన్యం తరలించారనే వివరాలను సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి.. అక్రమాలను వెలికితీసే దిశగా విచారణ జరుపుతున్నట్లు సీఐ కమలాకర్ వెల్లడించారు. కలెక్టర్కు నివేదిక.. మొక్కజొన్న రైతులకు మార్క్ఫెడ్ చెల్లించిన బిల్లుల్లో కోతలు విధించడంపై కలెక్టర్ ఖుష్బూగుప్తాకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మార్క్ఫెడ్ డీఎంపై సస్పెన్షన్ వేటు వేసి.. జిల్లా ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారించి.. మూడు రోజుల క్రితమే నివేదికను కలెక్టర్కు అందజేశారు. అధికారులు నివేదిక మేరకు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
కృష్ణానదిపై మరో వారధి
నారాయణపేట/మాగనూరు: తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న కొల్పూర్–కొర్తికొండ బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మాణంలో మరోమారు కదలిక వచ్చింది. కృష్ణానదిపై ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో రాయిచూరులో భేటీ అయి ప్రాజెక్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. కొల్పూర్–రాయిచూర్ రాకపోకలు సుగమం.. బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. కొల్పూర్ నుంచి టైరోడ్డు మీదుగా కొర్తికొండకు ప్రస్తుతం 29 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేవలం 3 కిలోమీటర్లే కానుంది. అదేవిధంగా ప్రస్తుతం కొల్పూర్ నుంచి టైరోడ్డు మీదుగా రాయిచూరుకు 40కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. బ్రిడ్జ్ కం బ్యారేజ్ వినియోగంలోకి వస్తే 19 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు రాయిచూరుకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. డిసెంబరులో భూమిపూజకు సన్నాహాలు? సుమారు రూ.780 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు కం బ్యారేజ్ నిర్మాణ పనులకు ఈ ఏడాది డిసెంబరులో భూమిపూజ చేసి పనులు ప్రారంభించేలా భేటీలో చర్చించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే భూమిపూజ, పనుల ప్రారంభ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణ గ్రామాలకు ప్రయోజనం.. రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని అడవి సత్యావార్, మందపల్లి, గజరందొడ్డి, కొల్పూర్, పుంజనూర్, పెగడబండ, చిట్యాల తదితర గ్రామాలకు సాగునీటి వసతి మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రైతులకు సాగునీటి లభ్యత పెరిగితే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. ● కర్ణాటకలోని మెయిగడ్డ, చిన్నకురం, రాంపురం, వడ్డేపల్లి, యాపల్దిన్నె, రాళ్లదొడ్డి, అప్పదొడ్డి, మామిడిదొడ్డి, ఎర్రకుంట, సగంకుంట, కుర్తికొండ, కరివాళ్లు, గంజిపల్లి, ఇబ్రహీంపురం, హనుమానన్దొడ్డి, షాకోలి తదితర గ్రామాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు అందే అవకాశం ఉందని చర్చల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ‘కొల్పూర్–కొర్తికొండ’ బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మాణానికి అడుగులు కర్ణాటక మాజీ మంత్రితో మంత్రి వాకిటి భేటీ రూ.780 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు డిసెంబరులో భూమిపూజకు సన్నాహాలు? -
తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దమొత్తంలో ఈత వనాలు పెంచుతున్నాం. మందు కల్లు తయారీపై నిఘా పెట్టాం. తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిషేధిత ఆల్ఫ్రాజోలం ఇతరత్రా మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తప్పవు. – విజయ్భాస్కర్రెడ్డి, ఎకై ్సజ్ శాఖ డీసీ, మహబూబ్నగర్ 30 నుంచి 40 శాతం వరకు బాధితులే.. మందు కల్లుతో అనర్థాలు చాలా ఉన్నాయి. మోతాదు మించి మత్తు కల్పితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వస్తున్న పేద రోగుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మంది ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారే. – డాక్టర్ బాలశ్రీనివాస్, ఫిజీషియన్, జీజీహెచ్, మహబూబ్నగర్ ● -
బస్ డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని బస్ డిపోను మంగళవారం సాయంత్రం ఆర్ఎం సంతోష్కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటుచేసిన డీజిల్ ట్యాంకుకు పరిశీలించారు. అలాగే మహబూబ్నగర్ డిపోలోని బస్సుల కండీషన్పై క్షుణ్ణంగా ఆరా తీశారు. 15 ఏళ్లు పైబడి నడిచిన బస్సులు ఏమైనా ఉంటే వెంటనే స్క్రాప్నకు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం (మెయింటెనెన్స్) జగన్, డిపో మేనేజర్ కె.అశోక్ కుమార్, గ్యారేజీ ఏఈ మృత్యుంజయరాములు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ట్రిపుల్ ఐటీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వివిధ పథకాల కింద మంజూరైన భవన నిర్మాణ పనులు, అదనపు తరగతి గదులు, సైన్న్స్ ల్యాబ్లు, లైబ్రరీ, కిచెన్, మరుగుదొడ్ల, ప్రహరీ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్, విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీరింగ్ శాఖ ఏఈలు, డీఈలు, ఈఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థలలో జరుగుతున్న సివిల్ నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆరా తీశారు. పనుల పురోగతిని ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి అదనపు కార్మికులను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేజీబీవీలలో, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాబార్డ్, పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల ద్వారా మంజూరైన అన్ని చిన్న సివిల్ నిర్మాణాన పనులు, మరమ్మతు పనులను నెలరోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, అప్పటివరకు అన్ని పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గణనీయంగా ముందుకు సాగాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే మేజర్మెంట్ బుక్ (ఎంబీ) నమోదు ప్రక్రియను నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
రైతులకు మేలు..
బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే నీటి లభ్యత పెరిగి పంటల సాగుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి. – శంకర్ లింగం, కొల్పూర్, మాగనూర్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి.. బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయ మార్కెట్లకు రాకపోకలు సులభమవుతాయి. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుంది. – పోతుల రాముల, సర్పంచ్, కొల్పూర్, మాగనూర్ -
రేపు జాబ్మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగు కంపెనీల్లో 100 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ ఫెర్టిలైజర్స్, అమర్రాజ, అపోలో ఫార్మసీ, మెచ్డీఎఫ్సీ బీమా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్కు సంప్రదించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: ఎస్పీ దేవరకద్ర: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే జిల్లా పోలీసుశాఖ లక్ష్యమని.. నేరాల నియంత్రణకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మంగళవారం దేవరకద్ర పోలీస్స్టేషన్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరుపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతాయుతంగా స్వీకరించి.. చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా పోలీసుశాఖపై మరింత నమ్మకాన్ని పెంచుతుందన్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ.. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని.. ప్రతి రిజిస్టర్ను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ శాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచి, బాధితులకు త్వరగా న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం సిబ్బందికి శాఖాపరమైన అవసరాలు, విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎస్పీ తెలుసుకున్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ భాస్కర్రెడ్డి ఉన్నారు. గురు పూర్ణిమ బ్రహ్మోత్సవాలు ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీద్వారకామాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అఖండ దీపారాధన, గణపతిపూజ, స్వామివారికి విశేషంగా అభిషేక పూజ, ప్రధాన కలశపూజ, మహా మంగళహార తి నిర్వహించారు. బుధవారం అష్టోత్తర శతక్షీర కుంభాభిషేకం, సామూహిక సాయి వ్రతాలు, ప్రదోషకాల పూజ, సంధ్యాహారతి, పల్లకీసేవ, 30వ తేదీన మహామంగళహారతి, సకల దేవతా సహితి మత్యుంజయ హోమం పూజలు ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. -
మూడు నెలలకు ఒకేసారి..
● ఆగస్టులో బియ్యం పంపిణీకి అధికారుల కసరత్తు ● ఈ–కేవైసీ ఉంటేనే బియ్యం అందజేత ● 18,326 మెట్రిక్ టన్నులు అవసరం మహబూబ్నగర్ రూరల్: ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను లబ్ధిదారులకు ప్రభుత్వం ఒకేసారి ఇవ్వనుంది. దుకాణాలకు బియ్యం సరఫరా ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రతి నెలా 6,108.925 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈసారి మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించనున్న క్రమంలో ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. గతంలో ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్షాపులు తెరిచి ఉండేవి. కానీ ఆగస్టులో మాత్రం 20 రోజులకు పైగా షాపులు తెరిచి ఉంటాయని పౌర సరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ఓటీపీ, ఎస్ఆర్ఎస్ విధానంలో బియ్యం పంపిణీ జరుగుతుంది. డీలర్లకు ఇబ్బందే నెలవారీ కోటా బియ్యం సరఫరా చేయడానికే వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అలాంటిది మూడు నెలల బియ్యం సరఫరాకు సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ చేసేందుకు 18,326.775 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూడు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేపడుతున్నారు. కాగా మూడు నెలల రేషన్ కోటా బియ్యం ఒకేసారి దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీలు, ప్రభుత్వ భవనాల్లో బియ్యాన్ని భద్రపరుచుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. ఈ–కేవైసీ తప్పనిసరి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ రేషన్ షాపుల్లో పూర్తి చేసుకోవాలి. రేషన్కార్డులో నమోదైన ప్రతి కుటుంబసభ్యుడు తమకు కేటాయించిన షాపులకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ–కేవైసీ చేయించుకోవాలి. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ–కేవైసీ ఉంటేనే మూడు నెలల రేషన్ పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా షాపులకు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. -
నగల కోసమే మహిళ హత్య
● అదృశ్యం కేసు దర్యాప్తులో వెలుగులోకి.. ● ముగ్గురు నిందితుల అరెస్టు ● బంగారు, వెండి ఆభరాలు స్వాధీనం నారాయణపేట/కొత్తపల్లి:బంగారు నగలు దోచుకునేందుకు ముందస్తు పథకం రచించి మహిళను హ త్య చేసిన ఘటన జిల్లాలోని మద్దూర్ పోలీస్ స్టేషన్న పరిధిలో వెలుగుచూసింది. మద్దూరు మండలం జాదవరావుపల్లి గ్రామానికి చెందిన గొయి కల శాంతమ్మ (45) అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ దా రుణం బయటపడింది. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు సంబంధించిన వివరాలను ఎస్పీ వినీత్ వెల్లడించారు. దర్యాప్తుతో మిస్టరీ ఛేదన.. శాంతమ్మ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 15న మద్దూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుపై చర్యలు తీసుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ బాస్ను కలిసి తమ గోడును వినిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నారాయణపేట మండలం జాజాపూర్ చెరువులో ఓ మహిళ మృతదేహం తేలడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం హత్య జరిగినట్లు గుర్తించారు. ముందస్తు పథకం ప్రకారం.. మద్దూర్ మండలం పెదూరుపాడుకు చెందిన జోగు రాజు, బడుగుల భాస్కర్, శాంతమ్మ దూరపు బంధువులు. ఈ నేపథ్యంలో ఆమె వద్ద ఉన్న నగలు దోచుకునేందుకు ముందుగానే పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆమెను మద్దూర్కు రప్పించి బైక్పై జాజాపూర్ చెరువు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగి శాంతమ్మను హత్య చేశారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సెల్ఫోన్, పర్సు, ఆధార్ కార్డును తీసుకొని ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో వాటిని బోరు కేసింగ్లో పడేశారు. ఆభరణాలను నారాయణపేటలో విక్రయించి వచ్చిన నగదు పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, రెండు బైక్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని సరాఫ్ బజార్లో దొంగలించిన ఆభరణాలు కొనుగొలు చేసిన జాజాపూర్ కృష్ణ అనే వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య కేసు ఛేధించిన కోస్గి సీఐ సైదులు, మద్దూర్ ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ వినీత్ ప్రత్యేకంగా అభినందించారు. స్టేషన్లో నిందితుడి ఆత్మహత్యాయత్నం? మహిళ హత్య కేసులో నిందితుల్లో ఒకరు రెండు రోజుల క్రితం మద్దూర్ పోలీస్స్టేషనన్లో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. టవల్ను కిటికీకి కట్టి గొంతుకు ఉరేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. -
ఆదాయం రూ. 90.86 లక్షలు
● అలంపూర్ ఆలయాల్లో హుండీ లెక్కింపు అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో వెల సిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వా మి ఆలయాల్లో హుండీ లెక్కింపు సో మవారం జరిగింది. హుండీల ద్వారా రూ.90.86 లక్షల ఆదాయం వచ్చిన ట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. కురుమూర్తి ఆలయ ఈఓ మదనేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. జోగుళాంబ అమ్మవారి ఆలయాల హుండీ ద్వారా రూ.76,55,496, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.13,54,585 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆలయాల నిత్యాన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.76,850 వీటితోపాటు యూఎస్ డాలర్స్– 247, యూఏఈ 10 దినామ్స్, మలేషియా రింగిట్– 1, నేపాల్ రూపాయి–1 వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా 27 గ్రాముల మిశ్రమ బంగారం, 152 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు పేర్కొన్నారు. హుడీ లెక్కింపులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నిందితుడి రిమాండ్ నవాబుపేట: బాలికను ప్రేమపేరుతో వేధించిన ఘటన లో ఇటీవల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటనపై అప్పట్లో బాధితుల ఫిర్యాదుతో ఈ ఘట నకు కారణమైన వ్యక్తి ని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా గతంలో బాలికను ప్రేమపేరుతో వేధిస్తుండే వాడని ఈ విషయంలో పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన పద్ధతి మార్చుకోలేదని బాధిత కుటుంబం పోలీసులకు వివరించింది. ఈ విషయంలో 10రోజుల క్రి తం బాలిక ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన కోస్గి సత్తయ్యను సోమవా రం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ న రేందర్ తెలిపారు. కా గా న్యాయస్థానం ముందు హాజరుపర్చగా అతడికి న్యాయస్థానం 14రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
జాతీయ సెమినార్కు రావాలని మంత్రికి ఆహ్వానం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఆధ్వర్యంలో ఈనెల 7, 8వ తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని కన్హాశాంతి వనంలో నిర్వహించే జాతీయ సెమినార్కు హాజరుకావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు పీయూ వీసీ శ్రీనివాస్ హైదరాబాద్లో ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ‘వికసిత్ భారత్ –2047లో భాగంగా విద్యా, ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ సెమినార్లో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటు ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించారు. యూనివర్సిటీలోనే నిర్వహించాలి.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూకు సంబంధించి హైదరాబాద్లో నిర్వహించే జాతీయ సెమినార్ను అధికారులు యూనివర్సిటీలోనే నిర్వహించాలని కోరుతూ ఎంఎస్ఎఫ్, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం రిజిస్ట్రార్ రమేష్బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలోనే నిర్వహించాలని గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని, సెమినార్ ఇక్కడ నిర్వహించకపోతే జరగబోయే తదుపరి పరిణామణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేసిన కోడ్ తంత్ర టెక్నికల్, సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్పై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడ్ తంత్ర సంస్థ ప్రతినిధి కల్యాణ్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు పేరు నమోదు చేసుకోవాలని, పలు అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణతో విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, రవికుమార్, సిద్ధరామగౌడ్, సుజాత పాల్గొన్నారు. -
ఆ నాయకులను చట్టసభల నుంచి బర్తరఫ్ చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: హింస, అఘాయిత్యాలు, సామాజిక లింగ వివక్ష, అన్యాయాలకు బలవుతున్న అమాయక బాధితులకు న్యాయం చేసే చట్టాలు తయారు చేసే అత్యున్నత చట్టసభల్లో నేర ప్రవృత్తి కలిగిన నాయకులను బర్తరఫ్ చేయాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో రెండు రోజులుగా జరుగుతున్న భారతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభలు సోమవారం ముగిశాయి. మహిళా బాధితులకు న్యాయం చేయడం కోసం స్వయం ప్రతిపత్తితో నిర్మితమైన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు పాలకవర్గాల ఆధిపత్యం నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు భార్గవి, పద్మావతి పాల్గొన్నారు. తీర్మానాలు.. కమిటీ ఎన్నిక భారతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభల్లో పలు తీర్మానాలు చేయడంతోపాటు జిల్లా నూతన కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. పొదుపు సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, స్వయం ఉపాధి రుణాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమ లు చేయాలని, మహిళా ఉద్యోగులకు రుతుస్రవ ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, మహిళా సమగ్ర విధా నం ప్రకటించాలని తదితర తీర్మానాలు ఆమోదించారు. ● జిల్లా కమిటీ నూతన అధ్యక్షురాలిగా భార్గవి, గౌరవాధ్యక్షురాలిగా రచయిత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పద్మావతి, కోశాధికారిగా ఇందిర, ఉపాధ్యక్షురాలుగా సువర్ణ, అంజమ్మ, జిల్లా సహాయ కార్యదర్శిగా అరుణ, సభ్యులుగా వరలక్ష్మి, శ్రీవిద్య, మొగులమ్మ, అంజమ్మ, సుగుణ, సరిత, మాధవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
మార్కెట్లోకి న్యూ బ్రెజ్జా
పాలమూరు: మారుతీ షోరూం నుంచి మార్కెట్లోకి నూతనంగా వచ్చిన న్యూ బ్రెజ్జా కారును సోమవారం శ్రీరామ జయరామ షోరూంలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం అధినేత బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. న్యూ బ్రెజ్జ కారు 1000 సీసీ సరికొత్త కె సిరీస్ టర్బో ఇంజిన్ కలిగి ఉందన్నారు. రియర్ ఏసీ వెంట్స్, 6ఎయిర్ బ్యాగ్స్ పెట్రోల్ వెర్షన్లో 19.96 మైలేజ్ వస్తుందన్నారు. డిజిటల్ ఏసీ ప్యానెల్, 365కెమెరా, ఆరు రంగుల్లో లభిస్తుందన్నారు. కారు ఎక్స్ షోరూం ధర 7.39లక్షల నుంచి రూ.11.31లక్షల వరకు అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో 43వ కార్పొరేటర్ ప్రశాంత్, సీఈవో విక్రమ్, సరసయ్య, వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. వన్యప్రాణులు, అడవులపై అవగాహన ఉండాలి లింగాల: వన్యప్రాణులు, అడవులపై విద్యార్థులలో అవగాహన కల్పించడమే ‘వనజీవ విద్య’ ఉద్దేశ్యమని హైటీకోస్ నల్లమల ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ‘వనజీవ విద్యశ్రీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ బాపురెడ్డి అడువులు, వన్యప్రాణుల రక్షణ, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీ లు నిర్వహించి విజేతలకు స్టీల్ వాటర్ బాటిళ్లను బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో హైటీకోస్ రీసెర్చ్ అసోసియేట్ అఖి ల్, బయాలజిస్ట్ రవికాంత్, బీట్ అధికారులు మురళీ, ఖాదర్పాష, ప్రవీణ్రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసు లు, పాఠశాల, హైటీకోస్ సిబ్బంది ఇమ్మాన్యుయేల్, ప్రేమ్కుమార్, ఆంజనేయులు, గణేష్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏపీ యువకుడి దుర్మరణం
● మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టిన కారు? గద్వాల క్రైం: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మల్లాది గ్రామానికి చెందిన సునీల్(24) మూడు నెలల క్రితం పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్గా చేరాడు. సోమవారం తెల్లవారు జామున సొంతూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు బైక్పై వెళ్తుండగా వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సునీల్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రామరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. అయి తే ప్రమాదానికి కారకుడైన వ్యక్తి గద్వా లకు చెందిన సత్యారెడ్డిగా గు ర్తించినట్లు సమాచారం. మద్యం మత్తే కారణమా? మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపు తూ అతి వేగంతో బైక్ ను ఢీకొట్టినట్లు స్థాని కులు పేర్కొంటున్నారు.ప్రమాదానికి కారకుడైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు.బైక్ను ఢీకొట్టిన అనంతరం కారు ని లపకుండా తప్పించుకున్నారని వివరించారు. సైబర్ మోసం.. రూ.4.60 లక్షలు మాయం గద్వాల క్రైం: ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ. 4.60 లక్షలు సైబర్ నేరస్తులు కాజేసిన ఘటన ఆల్యసంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో వివిధ కంపెనీలకు చెందిన షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ప్రకటన చూశాడు. నిజమని నమ్మి సదరు కంపెనీలకు మెయిల్, వ్యక్తిగత ఫోన్ నంబర్ను 10 రోజుల క్రితం రిజిస్టర్ చేశాడు. అదేరోజు గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి ఫోన్ చేసి లాభాలపై తెలియజేశారు. ముందుగా రూ. 20 వేలు పెట్టుబడులు చేశాడు. అయితే ఎక్కువ లాభాల కోసం కొంత నగదును పెట్టుబడులు చేయాల్సిందిగా చెప్పడంతో పలుమార్లు నగదును సదరు కంపెనీలకు ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. ఇలా మొత్తం రూ.4.60 లక్షలు పంపించాడు. అయితే బాధితుడు పెట్టిన డబ్బులకు ఎలాంటి ఆదాయం వ్యక్తిగత ఖాతాలో జమకాలేదు. దీంతో అనుమానం వచ్చి సంబంధిత వ్యక్తులను ఆరా తీయగా.. మరికొంత నగదు డిపాజిట్ చేస్తే ఖాతాలో నగదు బదీలి అవుతుందన్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గద్వాల జిల్లా సైబర్ పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చేపలవేటకు వెళ్లిన దంపతులు.. ● భర్త గల్లంతు కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలం అమరగిరి పంచాయతీ పరిధిలో ఉన్న చెంచుగూడెనికి చెందిన ఆదివాసి కాంట్రాస్ బాల య్య (35) తన భార్య నర్సమ్మతో కలిసి కృష్ణానదిలోకి చేపల వేటకు వెళ్లి ప్రమాదవ శాత్తు గలంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడెంవాసుల కథనం ప్రకారం.. గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది బ్యాక్ వాటర్లోకి బోటు వేసుకొని ఈనెల 25న సాయంత్రం కాంట్రాస్ బాలయ్య, తన భార్య నర్సమ్మతో కలిసి చేపల వేటకు వెళ్లారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత కోతిగుండు ప్రాంతంలో చేపలు వేటాడుతున్న సమయంలో పెద్దగాలి వచ్చింది. గాలికి బోటులో ఉన్న బాల య్య ప్రమాదశాత్తు నదిలో జారిపడ్డాడు. భార్య నర్సమ్మ రక్షించడానికి ప్రయత్నించి విఫలమైయింది. అదే బోటులో రాత్రి గడ్డకు వచ్చి గూడెంలో ఉన్నవారికి సమాచారం ఇచ్చింది. కొంతమంది వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 26 ఆదివారం భార్య నర్సమ్మ కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తు చేపట్టి ఆదివాసిల సహా యంతో మరోసారి గాలింపు చేపట్టారు. సోమ వారం వరకు ఆచూకీ లభించలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. గల్లంతైన బాలయ్యకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. -
యజ్ఞాలు వేద వైభవానికి పునాదిరాళ్లు
కల్వకుర్తి రూరల్: యజ్ఞ, యాగాదులు వేద వైభవానికి పునాదిరాల్ల వంటివని ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతలు రుద్రసహిత, మృత్యుంజయ పాశుపతాస్త్ర చంద్రహోమాలు నిర్వహించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ దైవభక్తిని కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ యాగశాల ప్రదక్షిణలు చేసి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. దైవచింతన, భక్తి భావం మనసుకు ప్రశాంతత అందిస్తుందన్నారు. యాగ ఫలితం అందరికీ అందాలన్నారు. విష్ణు పంచాయతనం ఆయుత చండీ, అతిరుద్రం, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాలతో పాటు కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగుతున్నాయి. శిశుమందిర్ పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, సురేందర్రెడ్డి, జూలూరు రమేష్బాబు, కాయతి విజయ్ కుమార్రెడ్డి, యాగ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కల్వకుర్తి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మార్చాలా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన భగవంతు(24) కూలి పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆదివారం వెళ్లాడని రాత్రికి తిరిగి రాలేదన్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న యాగం వద్ద కొద్దిసేపు ఉండి మార్చాలా వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుండూరు గ్రామానికి చెందిన అతని బంధువు వెంకటయ్య యువకుడి మృతిపై సామాజిక మాధ్యమాల్లో గుర్తించి మృతుడి తల్లి మైసమ్మకు సమాచారం ఇచ్చారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడికి ముగ్గురు అక్కలు, అన్న ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
జూరాలకు స్థిరంగా వరద
27 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 1,758 క్యూసెక్కులు విడుదల గద్వాల: కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వరద వదలడంతో మూడోరోజు స్థిరంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలను తాకింది. ఈ క్రమంలో సోమవారం జూరాలకు ఇన్ఫ్లో రూపంలో 27 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 318.010 మీటర్ల వద్ద 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో స్పిల్వే ద్వారా దిగువకు ఎలాంటి వరద నీటిని విడుదల చేయడం లేదు. అదేవిధంగా హైడల్ ప్రాజెక్టుకు నీటిని వదలడం లేదు. కాగా.. నెట్టెంపాడు కాల్వకు 750 క్యూసెక్కులు, భీమాకు 650 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 27 వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ఫ్లో రూపంలో 1,758 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పస్పుల ఘాట్కు తాకిన వరద మక్తల్: ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండటంతో క్రమంగా కృష్ణానదిలో నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం మక్తల్ మండలంలోని పస్పుల ఘాట్కు వరద తాకుతూ పారుతుంది. పస్పుల వద్ద కృష్ణానది అర కి.మీ., దూరంలో రెండు పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది. కృష్ణానదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని అధికారులు సూచించారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ మక్తల్: మండలంలోని చిన్నగోప్లాపూర్ పంపు వద్ద ఫేజ్–1 ద్వారా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి శేషగిరి సోమవారం మోటార్లను ఆన్ భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అలాగే స్టేజ్–2 పంపుహౌజ్లో డీఈ వెంకటరమణ పంపును ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో రెండు పంపుహౌజ్ల నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని వదిలినట్లు చెప్పారు. వీటి ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపి ఆయకట్టు పొలాలకు నీటిని విడుల చేస్తామని వారు పేర్కొన్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు వెంకటేస్, సురేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
సాగేదెలా.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33 వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మొఖం చాటేశాడు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలోనూ జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69 వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. ప్రస్తుత సీజన్లో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80 వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న ఆలోచనతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80 వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క పంటకై నా నీరివ్వండి.. ఎడమ కాల్వ పరిధిలో నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ప్రతిసారి వరిపంట సాగుచేస్తాను. ఈసారి జూరాలకు వరద రాలేదని.. అధికారులు ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం వరద వచ్చి చేరుతుంది. అధికారులు స్పందించి ఒక్క పంటకై నా నీటిని విడుదల చేయాలి. – చిన్న ఊశన్న, రైతు, వీపనగండ్ల వరినారు పోసిన.. కుడి కాల్వ పరిధిలో నాకు పదెకరాల పొలం ఉంది. ఇప్పటికే వరినారు పోసిన. ఇందుకోసం సుమారు రూ.35 వేల పెట్టుబడి అయ్యింది. అధికారులు మాత్రం ఆరుతడి పంటలు సాగుచేయాలంటున్నారు. కానీ, మా పొలంలో వరిపంట మాత్రమే పండుతుంది. ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో అధికారులు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలి. – బీచుపల్లి, రైతు, జింకలపల్లితాగునీటికే ప్రాధాన్యం.. జూరాలకు మూడు రోజులుగా వరద వస్తోంది. సోమవారం నీటి ప్రవాహం కాస్త తగ్గింది. వరద నీటితో జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్ల మేర నింపుతాం. ఈ నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగిస్తాం. ఆ తర్వాత వచ్చే వరద ప్రవాహం ఆధారంగా పంట పొలాలకు నీరందించాలా.. లేదా అన్నది నిర్ణయించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకట్, డీఈ, జూరాల ప్రాజెక్టు రెండురోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద ఇప్పటికై తే తాగునీటికే ప్రాధాన్యంఅంటున్న అధికారులు ప్రశ్నార్థకంగా మారిన 1.9 లక్షల ఎకరాల భూములు దిక్కుతోచని స్థితిలో ఆయకట్టుదారులు -
ఎస్ఐఆర్ ఫారాల స్వీకరణ వేగవంతం
జడ్పీసెంటర్: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ వేగవంతం చేసి, గడువులోగా వందశాతం డిజిటలైజేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి వెంటనే బీఎల్ఓలకు ఇవ్వాలని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కావని, దీంతో వారు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ జానకి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యలపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేడు కార్పొరేటర్లకు శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల కు మంగళవారం హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనునున్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారి కార్పొరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నా రు. ఇందులో ‘కెపాసిటీ బిల్డింగ్, ఇట్రైనింగ్ ప్రోగ్రాం, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నేషన ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం 8 గంటలకు 60 మంది కార్పొరేటర్లు బస్సులో హైదరాబాద్కు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వార్డు ఆఫీసర్ల ద్వారా కార్పొరేటర్లకు అందజేశారు. రేపు స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డైట్, ప్రైవేటు కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల విద్యార్థులకు రెండో దశ స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మెరాజుల్లాఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ డైట్ కళాశాల, గురువారం ప్రైవేటు కళాశాలలకు స్పాట్ కౌన్సెలింగ్ మెట్టుగడ్డ వద్ద ఉన్న డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
జీపీలకు కరెంట్ షాక్
పంచాయతీలకు గుదిబండగా విద్యుత్ బిల్లుల చెల్లింపు ● ఎండిపోయిన బోర్లకూ మీటర్లు.. పేరుకుపోతున్న బకాయిలు ● ఇప్పటికే ఖర్చయిన 15వ ఆర్థిక సంఘం నిధులు ● బిల్లులు చెల్లించేందుకు చిల్లిగవ్వ లేని వైనం కల్వకుర్తి టౌన్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసిన నిధులు ప్రస్తుతం విద్యుత్ బిల్లుల భారాన్ని మోయలేని పరిస్థితిని తెచ్చాయి. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల కోసం వినియోగించిన ఈ నిధుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు అవసరమైన మొత్తాన్ని కేటాయించకపోవడంతో ఇప్పుడు పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. తాగునీటి సరఫరా బోర్లు, వీధిదీపాలకు సంబంధించిన బిల్లులు నెలనెలా పేరుకుపోతుండగా.. వాటిని చెల్లించేందుకు పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేక సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. నిధులున్నాయి.. కానీ, బిల్లులకు లేవు 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదలైన సమయంలో వాటిలో కొంత మొత్తాన్ని విద్యుత్ బిల్లుల కోసం కేటాయించాల్సి ఉన్నప్పటికీ, చాలా గ్రామాల్లో వాటిని సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, భవనాల మరమ్మతు తదితర అభివృద్ధి పనులకు వినియోగించారు. అప్పట్లో విద్యుత్ బిల్లులపై సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుతం బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వాటితో అదనపు భారం.. గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోర్లు, మోటార్లు, వీధి దీపాలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నీరు రాని, ఎండిపోయిన బోర్లు వినియోగంలో లేకపోయినా వాటి కనెక్షన్లు కొనసాగుతుండటంతో బిల్లులు వస్తూనే ఉన్నాయి. ఉపయోగం లేని కనెక్షన్లను తొలగించకపోవడం కూడా పంచాయతీలపై అదనపు భారం పడేలా చేస్తోంది. ప్రస్తుతం చెల్లింపుపై ఒత్తిడి ప్రస్తుతం విద్యుత్ శాఖ బిల్లుల చెల్లింపుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పంచాయతీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంచాయతీ ఖాతాల్లో తగినంత నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించేందుకు సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సైతం నూతనంగా ఏర్పడిన పాలకవర్గాల కాలంలోని జనవరి 26, 2026 నుంచి ప్రస్తుతం వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెబుతుంది. అయితే విద్యుత్ బిల్లుల సమస్యతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు. అలాగే వినియోగంలో లేని బోర్ల విద్యుత్ కనెక్షన్లను రద్దు చేసి, భవిష్యత్లో ప్రతి నెల విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలకు విద్యుత్ బిల్లులు కట్టాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. కేవలం నూతన పాలకవర్గాలు ఏర్పడిన నాటి నుంచే కట్టాలని ప్రభుత్వం పేర్కొంది. చాలావరకు జీపీలు బిల్లులు కడుతున్నా.. మరికొన్ని జీపీల వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే పనులకు వాడామని సర్పంచులు చెబుతున్నారు. కానీ, విద్యుత్ బిల్లులు తప్పనిసరిగా కట్టాల్సిందే. – శ్రీరాములు, డీపీఓ, నాగర్కర్నూల్ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాక వాటితోనే జీపీ వర్కర్ల జీతాలు, పలు ఈఎంఐలతోపాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడేమో విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. నిధులు ఖర్చు అయ్యాక బిల్లులు కట్టాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదు. కాబట్టి జీపీలకు గుదిబండగా మారిన విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. – ఽశ్రీనివాసులు, సర్పంచ్, చెర్కూర్, వెల్దండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
ముగిసిన కబడ్డీ అకాడమీ ప్రవేశాల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరు నగరం మెయిన్ స్టేడియంలోని బాలుర కబడ్డీ అకాడమీలో ప్రవేశాల ఎంపికలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. అకాడమీలో 20 మంది క్రీడాకారుల కోసం 40 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేశామని, వీరిలో 20 మందిని అకాడమీకి ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులకు శాట్జీ ప్రధాన కార్యాలయం నుంచి సెలక్షన్ లేఖలు, ఫోన్ ద్వారా సమాచారం అందజేయడం జరుగుతుందన్నారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 1 నుంచి మహబూబ్నగర్ కబడ్డీ అకాడమీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికై న వారు అలాగే సందేహాల నివృత్తి కోసం సెల్ నం.98660 80831ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు శ్రీనివాస్రెడ్డి, మల్లేష్, శాట్జీ కబడ్డీ కోచ్ జ్యోతీశ్వర్రెడ్డి, ప్రశాంత్, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కర్మలు తొలగించే ప్రక్రియనే యాగం
కల్వకుర్తి రూరల్: విశ్వంలోని సమస్త జీవుల పాపా ల కర్మలను తొలగించే ప్రక్రియ యాగం ద్వారా సిద్ధిస్తుందని కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న భారతదేశానికి అత్యంత శక్తిని ప్రసాదించే యాగాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో 91వ విశ్వశాంతి మహా యాగం 8వ రోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతోంది. ఆదివారం ఆయుత చండీ, అతిరుద్రం, నవగ్రహ హోమం, నక్షత్రయాగం, సుదర్శన హవనములు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భగవద్గీత పారాయణం మానవ జీవితాన్ని మారుస్తుందని శ్రీకృష్ణుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం యాగశాల ఆవరణలో ఉమామహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. 6000 మంది భక్తులకు అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో యాగ నిర్వాహకులు జూలూరు రమేష్బాబు, కల్వ మనోహర్, బీచని బాలకృష్ణ, పోలా సురేందర్, జూలూరు ప్రకాష్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు బాధ్యతగా ఉంటేనే నేరాలు తగ్గుముఖం
భూత్పూర్: ప్రజల సహకారం అందిస్తే పోలీసులు భద్రత కల్పిస్తారని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై యువత దూరం ఉండాలని, ఇలాంటి వాటికి పాల్పడితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని అదనపు ఎస్పీ రత్నం అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 1వ వార్డు డబుల్బెడ్రూం కాలనీలో ఎస్పీ జానకి ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహించారు. ప్రజల్లో శాంతిభద్రత, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నట్లు ఏఎస్పీ సూచించారు. గ్రామాలు, కాలనీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులు, 100, 112 నంబర్లకు డయిల్ చేసి సమాచా రం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తు ల వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నా రు. భద్రతలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్న ట్లయితే నేరాలు కొంతమేర అరకట్టడానికి పోలీసులకు సహకరించిన వారవుతారని ఏఎస్పీ చెప్పా రు. డీఎస్పీ రమణారెడ్డి, భూత్పూర్ సీఐ రామకృష్ణ, 1–టౌన్ సీఐ అప్పయ్య, భూత్పూర్ ఎస్ఐ నాగన్న, 9మంది ఎస్ఐలు, 20 మంది హెడ్కానిస్టేబుళ్లు కమ్యూనిటీ కాంటాక్టులో 41మోటర్ సైకిళ్లు, కారు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అదుపులో ఆరుగురు అనుమానితులు కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా డబుల్బెడ్రూంలోని 24 బ్లాక్ల్లో సోదాలు నిర్వహించారు. రామ్చరణ్, శివ ఇంట్లో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన నలుగురు యువకులకు సంబంధించి ఆధార్ కార్డులు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 70మంది పోలీసులు పాల్గొన్నారు. -
లక్ష్మీతండాలో రైతు దారుణహత్య
గోపాల్పేట: ఇంట్లో పడుకున్న రైతును గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందిన దారుణ ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం లక్ష్మీతండాలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. తండావాసుల కథనం ప్రకారం.. మండలంలోని బుద్దారం లక్ష్మీతండాకు చెందిన ముడావత్ మేఘ్యానాయక్(55) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేఘ్యానాయక్ భార్య నాను ఏడాది కిందట మృతిచెందింది. ఇద్దరు కుమారులు శ్రీను, కిషన్.. హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదేక్రమంలో శనివారం పెద్దకుమారుడు ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. శనివారం రాత్రి మేఘ్యానాయక్ రాత్రి పదిగంటల సమయంలో కాలనీవాసులతో మాట్లాడి ఇంట్లో పడుకున్నాడు. ఆదివారం సాయంత్రం 4గంటలవరకు ఇల్లు తెరవకపోవడంతో పక్కింటివారు వెళ్లి తలుపు తెరువగా మేఘ్యానాయక్ అప్పటికే రక్తపుమడుగులో మృతిచెంది కనిపించాడు. దీంతో వెంటనేవారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డీఎస్పీ గిరిబాబు, సీఐ రత్నం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి బాడీని పోస్టుమార్టం కోసం తరలించామని అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శశిధర్ తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ వెల్లివిరిసిన ‘మానవత్వం’ గండేడ్/మహమ్మదాబాద్: తమ కుటుంబ సభ్యుడు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్నా.. వారిలో మానవత్వం వెల్లివిరిసింది. మరొకరికి కంటిచూపు ప్రసాదించేందుకు కళ్లను దానం చేశారు. వెలకట్టలేని వారి విలువైన దాతృత్వానికి ఈ ఘటన నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లింగనపల్లికి చెందిన రాఘవేందర్గౌడ్ (37) తల్లి 30 ఏళ్ల క్రితం చనిపోవడంతో మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మేనమామ సార రాములు చేరదీశాడు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన రాఘవేందర్గౌడ్ మీసేవ కేంద్రాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల గండేడ్ మండలంలోని వెన్నాచేడ్ మీసేవలో పనిచేస్తున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బైక్ౖ పె మహబూబ్నగర్కు వెళ్తున్న ఆయనను హ న్వాడ మండలంలోని పల్లెమోని కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108 అంబులెన్స్లో మహబూబ్నగర్ ఆస్పకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయి తే అతడి కళ్లు దానం చేస్తే మరొకరికి చూపు ప్ర సాదించవచ్చని డాక్టర్లు చెప్పడంతో.. మేనమామ రాములు మానవత్వంతో ఆలోచించి అందుకు అంగీకరించారు. దీంతో డాక్టర్లు ఎల్వీ ప్ర సాద్ కంటి ఆస్పత్రి వారికి సమాచారం ఇ చ్చా రు. హైదరాబాద్ నుంచి వారు వచ్చిన సి బ్బంది మృతుడు రాఘవేందర్ రెండు కళ్లను తీసుకెళ్లారు. అనంతరం మేనమామ రాములు కు ప్రశంసాపత్రం అందజేశారు. పోస్టుమార్టం అ నంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో ఆదివారం సాయంత్రం మహమ్మదాబాద్లో అంత్యక్రియలు నిర్వహించారు. -
కూలీలపైకి దూసుకెళ్లిన కారు
గండేడ్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు అదుపుతప్పి వలస కూలీలపైకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్తోపాటు ముగ్గురు వలస కూలీలకు గాయాలైన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన 20మంది కూలీలు నేషనల్ హైవేపై చెట్లు నాటడానికి వచ్చారు. వీరంతా నాలుగైదు రోజులుగా మండలంలోని ఆయా గ్రామాల పరి ధిలో నేషనల్ హైవేకు ఇరువైలాపులా చెట్లు నాటుతున్నారు. ఆదివారం కూడా కొంరెడ్డిపల్లి–అంచన్పల్లి మ ధ్య నేషనల్ హైవేకు కిందివైపు మొక్కలు నాటుతున్నారు. 12 గంటల సమయంలో కొంరెడ్డిపల్లికి చెందిన శేఖర్ గండేడ్కు కారు లో పనిమీద వెళ్తుండగా.. పనిప్రదేశానికి రాగానే కారు అదుపుతప్పింది. ఒక్కసారిగా కారు అడ్డంగా తిరిగి కూలీలపైకి దూసుకెళ్లింది. మొక్కలు నాటుతున్న వలస కూలీల్లో భార్యాభర్తలైన విజయ్, రంజీభాయితోపాటు బాలాజీనాయక్, ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో రంజీభాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
పోలీసుల దాష్టీకం.. బెల్టుతో యువకులపై దాడి
ధన్వాడ: ట్రాక్టర్ డ్రైవర్లపై పోలీసులు బెల్టు ఝులిపించడంతో ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. మండలంలోని గోటూర్ గ్రామస్థులు తెలిపిన వివరాలు.. శనివారం అర్ధరాత్రి సమయంలో గోటూర్ శివారులోని కోయిల్సాగర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కొందరు డయల్ 100 కు ఫోన్ చేశారు. దీంతో స్థానిక పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో వాగు వద్ద పరిశీలించగా ఒక ట్రాక్టర్లో ఇసుక ఉండగా.. మరో రెండు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. పోలీసులను చూసిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు. వాటిని పోలీస్స్టేషన్కు తీసుకురావాలని గ్రామ పెద్దలకు చెప్పి పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. ట్రాక్టర్లను స్టేషన్కు తీసుకురాకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులు మరోమారు గ్రామానికి వెళ్లి హెచ్చరించారు. దీంతో రెండు ట్రాక్టర్లను చాకలి నరేశ్, కుమ్మరి కుమార్ అనే ఇద్దరు యువకులు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఇంకో ట్రాక్టర్ రాలేదని పోలీసులు వారిని ఆరా తీయగా.. నారు వేసేందుకు పొలం వద్దకు వెళ్లిందని, దాని డ్రైవర్ రాజవర్ధన్ వచ్చాడని, ట్రాక్టర్ను సాయంత్రం తీసుకొస్తామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు వారిపై రబ్బర్ బెల్టుతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో చాకలి నరేష్ అనే యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించగా.. యువకుడు కోలుకోకపోవడంతో వెంటనే 108కు ఫోన్ చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఇన్చార్జీ ఎస్ఐ మహేశ్వరికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అనంతరం సీఐ భగంత్రెడ్డిని వివరణ కోరగా.. యువకుడికి ఆరోగ్యం ముందు నుంచే సరిగా లేదని, పోలీసులు వారిపై ఎలాంటి దాడి చేయలేదని తెలిపారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో యువకుడు.. గతేడాది చాకలి నరేశ్ వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో బీపీ పడిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కేసు నమోదు చేయాలి కానీ ఇలా ప్రాణాలు తీసేలా కొడతారా అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
5 నిమిషాల్లో ఇంటికొస్తా..
రోడ్డు ప్రమాదంలో యువ స్వర్ణకారుడిని కబళించిన మృత్యువు ● ఒకే ఒక్క ఆధారం కోల్పోయిన కుటుంబం కల్వకుర్తి టౌన్: అమ్మా మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను.. అని చెప్పిన కొడుకు ఆ మాటే చివరి మాట అయింది. కుమారుడి కోసం ఎదురుచూసిన తల్లికి చివరికి కనిపించింది మాత్రం అతని మృతదేహమే. కుటుంబ భారాన్ని తన భుజాలపై మోస్తూ, కష్టపడి జీవితాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న యువకుడిని రోడ్డుపై పార్క్ చేసిన భారీ క్రేన్ రూపంలో మృత్యువు కబళించిన ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వంగూర్ మండలం కోనేటిపురానికి చెందిన సాయికుమార్ (24) పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో తల్లి, వదిన, ఆమె పిల్లలతో కలిసి నివాసముంటూ స్వర్ణకారుడిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. తనకు తెలిసిన వారిని బైక్పై శనివారం రాత్రి వంగూర్లో దించడానికి వెళ్లి తిరిగి కల్వకుర్తికి బయలుదేరాడు. పట్టణంలోకి చేరుకోగానే అర్ధరాత్రి 12: 30 సమయంలో హైదరాబాద్ చౌరస్తాలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న రోడ్డులో వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించే సమయంలో అక్కడే రోడ్డుపై పార్కింగ్ చేసిన భారీక్రేన్ ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయమైంది. పెట్రోలింగ్ చేస్తున్న బ్లూకోర్టు పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. అతని ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లతో వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పట్టణంలోని సీహెచ్సీ మార్చురీకి తరలించారు. మగదిక్కును కోల్పోయామని.. కుటుంబంలోని మగవారంతా ఏదో కారణాలతో మృతి చెందటంతో, కుటుంబ బాధ్యతలు సాయికుమార్పై పడ్డాయి. సొంత గ్రామంలో కలిసి రాకపోవటంతో, కల్వకుర్తి పట్టణానికి వచ్చి వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడిని చూసుకుంటూ జీవితాన్ని సాగిద్దామని అనుకున్న ఆ తల్లికి ఉన్న కుమారుడు సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఆస్పత్రిలో వారు రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. సాయికుమార్ (ఫైల్) -
చర్యలు తీసుకోవాలి
గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి పిత్రి గుట్టను రెవెన్యూ అధికారులు దళారుల మధ్యవర్తిత్వంతో అక్రమ పట్టాలు చేస్తూ ముడుపులు దండుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే సర్పంచ్ భర్త తన తండ్రి పేరిట ప్రభుత్వం భూ మి ఇచ్చిందని, ఇద్దరి పేరుపై ప్రస్తుత తహసీల్దార్తోనే అక్రమ పట్టా చేయించుకున్నాడు. ఇంకా రెండు ఎకరాలు చేయించుకోవా లని సర్వేయర్తో వస్తే అడ్డుకున్నాం. తమ వద్ద ఆధారాలు ఉన్నాయి.. కలెక్టర్ విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. – మాదంశెట్టి నారాయణ, రామాజిపల్లి -
కోచ్ల నియామకంతోనే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి..
మహబూబ్నగర్ క్రీడలు: క్రీడా వసతులతోపాటు కోచ్ల నియామకంతోనే ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, ఇండియన్ కబడ్డీ కోచ్ ఎల్.శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ అకాడమీ బాలుర ప్రవేశాల ఎంపికలను పర్యవేక్షించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహబూబ్నగర్లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ఏకై క కబడ్డీ అకాడమీ ఇదేనని పేర్కొన్నారు. ఇక్కడ ప్రత్యేక నిపుణులైన కోచ్లను నియామాకం చేస్తే అనతికాలంలోనే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. గ్రామీణ క్రీడాకారుల టాలెంట్ను వెలికితీసేది మొదట పీఈటీలేనని చెప్పారు. క్రీడాకారుడిగా, కోచ్గా ఒక్కటే విన్నపం అని.. ప్రతిభగల క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు కల్పించాలని, ముఖ్యంగా ప్రతి శాఖలో 2 శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. – ‘సాక్షి’తో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, కోచ్ ఎల్.శ్రీనివాస్రెడ్డి -
సొంతూరులోనే ఓటు
● స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకే మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75 నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలి. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లుగా, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా, ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వందశాతం పూర్తికి.. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవైపు గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలామంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఫారాలు శాతం రానివి మహబూబ్నగర్ 7,32,488 5,93,167 55,743 86.12 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 56,482 79.38 వనపర్తి 2,75,570 2,18,488 16,515 79.29 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 43,961 83.32 నారాయణపేట 4,95,574 3,93,911 45,959 79.49 నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి.. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. -
నేటినుంచి ‘విత్తన మేళా’
● అన్ని మండలాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ మహబూబ్నగర్ (వ్యవసాయం): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలోని 17 మండలాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజులపాటు ‘విత్తన మేళా–2026’ నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సూచించిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు విత్తన మేళాలో కంది, మినుము, పెసర, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే దిగుబడులు మెరుగ్గా వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉంది. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా శాస్త్రవేత్తలు సూచించిన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. అందుకే జిల్లాలో అన్ని మండలాల్లో విత్తన మేళా నిర్వహిస్తున్నాం. కంది, పెసర, మినుము, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తాం. రైతులు తమ భూమి పరిస్థితులు, తేమను దృష్టిలో ఉంచుకుని తగిన పంటలను సాగు చేస్తే నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
చికిత్సకు రెఫర్ చేస్తున్నాం..
ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన డీఆర్డీఏ– ఆరోగ్య శాఖ అధికారులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కసారి వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు చేసి రక్త నమూనాలు టీ–హబ్కు పంపిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి ఏదైనా సమస్య ఉన్న మహిళలను మళ్లీ వైద్యాధికారుల దగ్గరకు తీసుకువచ్చే బాధ్యత వీఓలు, డీఆర్డీఏ అధికారులదేనని కలెక్టర్ చెప్పారు. థైరాయిడ్, బీపీ, షుగర్, కిడ్నీ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం రెఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం పీహెచ్సీలలో స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ మహిళా సంఘాల మహిళలకు చేస్తున్న పరీక్షల్లో ఎక్కువగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతి మహిళలో 11– 12 మధ్యలో ఉండాలి. కానీ, వీరికి 7–8 మాత్రమే ఉంది. అలాంటి వారికి ఐరన్ మాత్రలు ఇవ్వడం, ఇంజెక్షన్స్ అవసరమైన వారికి పెడుతున్నాం. ఆ తర్వాత 40– 45 ఏళ్ల వారిలో బీపీ, షుగర్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మేము సమస్య ఉందని గుర్తించిన వారి వివరాలు డీఆర్డీఏ అధికారులకు ఇస్తున్నాం. – మమత, వైద్యాధికారి, పాత పాలమూరు హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు లక్ష్యం ఇలా.. -
మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: సీ్త్రలపై వివక్ష, సామాజిక అణచివేత మహిళల అస్తిత్వానికి గొడ్డలి పెట్టులాంటివని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభలు ఆదివారం జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో జిల్లా అధ్యక్షురాలు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం వెంకట్రామరెడ్డి భవన్ ఎదుట ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జెండాను రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ చౌరస్తా వరకు భారీ మహిళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ తరతరాలుగా మహిళలు తీవ్రమైన హింస, అణచివేత, లింగ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఎన్నో పోరాటాలు, ఎందరో సామాజికవేత్తల కృషి ఫలితంగా మహిళలకు పాలకులు కొన్ని చట్టాలు తీసుకొచ్చిన వాటిని పకడ్బందీగా అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మహిళలపై కొత్త రకమైన హింస, దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాల పరంపర కొనసాగుతుందని వాపోయారు. ఇప్పటికై నా మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు గాయని శ్యామల, బాలకిషన్, పద్మావతి, ఇందిర, కృష్ణవేణి, గీత, శ్రీదేవి, శ్రీవిద్య, సురేష్, రాము, లక్ష్మణ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, కార్తీక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం -
సాగు, తాగునీటి ఇబ్బందులు
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. ● మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. ఏడారిగా మారుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. కృష్ణా, భీమా నదులపై దివంగత ఎమ్మెల్యే నర్సిరెడ్డి నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు కొత్తగా ఎక్కడపడితే అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తుందని, ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారుతుందని వాపోయారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలుగకుండగా తగు చర్యలు తీసుకోవాలని, కూసుమర్తి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, నర్సింహగౌడ్, మహిపాల్రెడ్డి, శివరాజ్పాటిల్, సంతోష్, సురేష్రెడ్డి, నర్సింహారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు. -
మహబూబ్నగర్లో ఖేలో ఇండియా పోటీలు?
మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడా పోటీలను మహబూబ్నగర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర సాంకేతిక బృందం శనివారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంతోపాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానాలు, జిల్లా కేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించింది. ఖేలో ఇండియా కబడ్డీ పోటీలతో పాటు మరో మూడు క్రీడలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేయాలని ఈ మేరకు జిల్లా యువజన, క్రీడల అధికారికి సూచించినట్లు సమాచారం. డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాను ఖేలో ఇండియా జాతీయస్థాయి క్రీడల ఆతిథ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేపడుతామని తెలిపారు. -
నేషనల్ సెమినార్కు ఏర్పాట్లు ముమ్మరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆగస్టు 7, 8 తేదీలలో షాద్నగర్లో నిర్వహించే నేషనల్ సెమినార్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో అడ్మినిష్ట్రేషన్ భవనంలో శనివారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీయూకు రూ.100 కోట్లు కేటాయించి సెమినార్ను నిర్వహించేందుకు అవకాశం కల్పించడం పీయూకు గర్వకారణమన్నారు. దేశాన్ని వికసిత్ భారత్లో భాగంగా పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని, వివిధ యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొంటారని తెలిపారు. సాంకేతికత అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యం, నైపు ణ్యాభివృద్ది, స్టార్టప్లు, ఉపాధి అవకాశాలు, పర్యా వరణ పరిరక్షణ వంటి అంశాలు ఇందులో భాగంగా సెమినార్లో చర్చ జరుగుతుందన్నారు. పీయూ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వివిధ పరిశ్రమలు, జాతీయ స్థాయి సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటామని, ఇంటర్న్షిప్, పరిశోధన, ప్రాజెక్టులు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీయూ ఖ్యాతిని, జాతీయ స్థాయిలో పెంచడమే కాకుండా, రాష్ట్రంలో ఉన్నత విద్య పరిశోధన, ఆవిష్కరణలను ప్రతిబింబించే విధంగా సెమినార్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కన్వీనర్లు ప్రవీణ, నూర్జహన్, రవికుమార్ పాల్గొన్నారు. అధ్యాపకులకు అభినందన పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చంద్రకిరణ్, రామరాజు, పీహెచ్డీ స్కాలర్ శ్రీనివాస్ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల ఫలితంగా నీటిలో రసాయన ఆక్సికరణ చర్యలు జరిపే ఆర్సీకరణ కారకాలను రూపొందించారు. ఈ కారకాలను పునర్వినియోగం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ పబ్లికేషన్ లభించింది. ఈ మేరకు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు వారిని అభినందించారు. భవిష్యత్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, మెడిసిన్ కెమిస్ట్రీలో ఔషధాలు తక్కువ వ్యయంతో తయారు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల నుంచి హాజరుకానున్న వీసీ, అధికారులు -
లక్ష్మీచెన్నకేశవుడికి..
జడ్చర్ల టౌన్: ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్శామికి ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని వైభవంగా లక్ష పుష్పార్చన జరిపించారు. కాళ్ల మంటపం వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తిరెడ్డి పుష్పార్చన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చనలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకలు పంచామృతాభిషేకం, పుణ్యాహవచనము, రుత్విక్వరణం, ప్రదోష పూజ, శయనోత్సవం నిర్వహించారు. ఆదివారం సహాస్రనామార్చన, మహానివేదనతో వేడుకలు ముగుస్తాయి. ఏకాదశి పురస్కరించుకుని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. -
శేషశయనా.. పాహిమాం
● శేషవాహనంపై లక్ష్మీవేంకటేశ్వరుడు ● ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం జనసంద్రమైంది. ఆషాడ శుద్ధ(తొలి ఏకాదశి)ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. ఆషాడంలో వచ్చే తొలి ఏకాదశి వేడుకలను ప్రతిఏటా అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వివిధ పూజలు చేశారు. కనులపండువగా సేవలు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శోభాయామానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభా మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. శేషవాహనంలో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దిగువ కొండ నుంచి కొండపై వరకు కాలినడకన వచ్చి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, అళహరి రామకృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఎగువ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో
ధరూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరదతో జలకళ సంతరించుకుంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. నేటికి జూరాలకు పూర్తిస్థాయిలో వరద రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు శనివారం భారీగా వరద వచ్చి చేరుతోంది. నేడో రేపో జూరాలకు వరద వచ్చే అవకాశం ఉంది. ఆల్మట్టికి భారీగా వరద.. ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. పైనుంచి 84,888 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి 67,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 91.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్కు వరద జోరు... నారాయణపూర్కు వరద జోరు కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి విడుదల చేసిన 65వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 65 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 43,888 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. శనివారం విడుదల చేసిన వరద ఆదివారం సాయంత్రం వరకు జూరాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు ఇన్ ఫ్లో నిల్... ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో ఏమి లేవని పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 32 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 512 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.44 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ నుంచి వచ్చే వరద ఆదివారం జూరాలకు చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో లక్షపుష్పార్చన
చిన్నచింతకుంట: తొలి ఏకాదశిని పురష్కరించుకొని అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయంలో శనివారం గోవింద నామస్మరణ మారుమోగింది. స్వామివారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. కురుమూర్తి గిరులలో గోవింద నామస్మరణ మారుమోగింది. భక్తిశ్రద్ధలతో లక్షపుష్పార్చన తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తి స్వామికి ఆలయ సిబ్బంది లక్షపుష్పార్చన నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణుల మంత్రోశ్ఛణల మధ్య వివిధ రకాల పూలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పుష్పార్చన చేశారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు పూజారులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవ విగ్రహాలను మహామండపంలో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల దంపతుల చేతుల మీదుగా అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి దంపతులు స్వామివారికి రెండు వందల గ్రాముల వెండిని మొక్కుబడిగా సమర్పించారు. వారికి ఆలయ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భత్తుల బాల్రాజు, ఈవో మదనేశ్వరెడ్డి, కమిటీ సభ్యులు మైపాల్రెడ్డి, తిరుపత్రెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు తదతరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరా.. సల్లంగా చూడు
కొల్లాపూర్ రూరల్: తొలి ఏకాదళి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానది బ్యాక్వాటర్లో పుణ్యస్నానాలు ఆచరించి సోమేశ్వరునితోపాటు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంబిక అమ్మవారికి దర్శించుకోవాడానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమరగిరి గ్రామ సమీపంలో ఉన్న మల్లయ్యసెలలో కొలువుదీరిన మల్లయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంగమేశ్వరాలయానికి వెళ్లే భక్తులకు నిరాశ సోమశిల నుంచి కృష్ణానదిలో సంగేమేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు నిరాశ ఎదురైయింది. సోమశిలకు సంబంధించిన బోట్లను సంగమేశ్వరాలయానికి రాకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. బోట్లు బంద్ కావడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. -
కాల్వ సర్వేకు సర్పంచులు సహకరించాలి
నవాబుపేట: పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం చేయాల్సిన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్కు మండల సమీపంలోని ఉదండాపూర్ రిజర్యాయర్ నుంచి ఏర్పాటు చేసే కాల్వ నిర్మాణాలకు ఆయా గ్రామాల సంర్పచులు సహకరించాని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కాల్వ నిర్మాణంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాల్వ నిర్మాణం జరిగే గ్రామాల సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. కాగా మండలంలో దాదాపుగా 1091 ఎకరాలు కాల్వ నిర్మాణంలో 9గ్రామాల రైతులు భూములు కోల్పోనున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అత్యంత అవసరమైన కాల్వ నిర్మాణానికి తాజాగా సర్వే జరుగుతుందని దీన్ని త్వరగా పూర్తిచేసేలా సర్పంచులు సహకరించాలని సూచించారు. కాల్వ సర్వేలో రైతులకు చెందిన భూమి ఏ సర్వే నంబర్లో రైతులు ఎంత కోల్పోతున్నారన్న విషయం పూర్తి ఖరారు చేసిన అనంతరం పరిహారం విషయం తేలుద్దామని సూచించారు. పరిహారం ప్రభుత్వ తాజాగా తీసుకున్న కొత్త నిబంధనల ప్రకారం ఉండే అవకాశం ఉందని వివరించారు. ప్రధానంగా కాల్వ స్వరూపం, రైతుల గుర్తింపు లాంటివి పూర్తిగా ఖరారు కావాల్సి ఉందని అందుకు గ్రామలవారీగా సర్పంచులు సహకరించాలని సూచించారు. కాల్వ నిర్మాణంపై రైతులకు సర్పంచులు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు అపోహపడాల్సిన అవసరం లేదని వారికి తగిన న్యాయం జరుగుతుందని ెసూచించారు. ప్రాజెక్టు కాల్వ నిర్మాణంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి సమీక్ష ఇంటికో ఉద్యోగం, మార్కెట్ ధర ప్రకారం పరిహారం ప్రాజెక్టు కోసం తీసుకొస్తున్న కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తాజాగా మర్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని వివిధ గ్రామాల సర్పంచులు కోరారు. ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాల్సి వస్తే ప్రభుత్వ ధరకు నాలుగు రెట్లు ధర ఎకరానికి పరిహారం అందించాలని సూచించారు. దీంతోపాటు భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇంటితోపాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సర్పంచులు సూచించారు. సమావేశంలో ఆర్ఐలు రామాంజనేయులు, గాయిత్రీ, సర్పంచులు గీతారాణి, రంజిత్గౌడ్, వెంకటే్ష్, రవీందర్రెడ్డి, భూపాల్రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై దాడి.. నిందితుడికి రిమాండ్
అమరచింత: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడిన కుర్వ రాము అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి శనివారం జూడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. మండలంలోని నాగల్ కడ్మూర్ గ్రామంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుళ్లు చెన్నయ్య, రవివర్మలపై ఇదే గ్రామానికి చెందిన కుర్వరాము తాగిన మైకంలో గొడవకు పాల్పడ్డాడన్నారు. గొడవను నివారించేయత్నం చేసినందుకు పోలీసు చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఎదురుదాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. కృష్ణానదిలో జారిపడి డిగ్రీ విద్యార్థి మృతి అమరచింత: సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి వెళ్లిన జాఫర్ (20) అనే విద్యార్థి నదిలో గల్లంతై మృతి చెందిన ఘటన ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామ సమీపంలోని కృష్ణనదిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కుడిచింతలబైలుకు చెందిన ఖాసీం కుమారుడు మహ్మద్ జాఫర్ ఆత్మకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం ఉదయం కాలేజీకి వెళ్లి అక్కడి నుంచి స్నేహితులు అ భిషేక్, శివశంకర్తో కలసి జూరాల గ్రామ శివారులో కృష్ణనదిపై నిర్మిస్తున్న వంతెన వద్దకు వెళ్లారు. అభిషేక్, శివశంకర్ స్నానం చేద్దామని నదిలో దిగి ఈత కొడుతుండగా రాతిపై కూర్చున్న జాఫర్ అదుపుతప్పి నదిలో పడిపోయాడు. స్నేహితులు జాఫర్ను కాపాడేయత్నం చేస్తుండగానే నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జాలర్లు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభించకలేదు. గద్వాల పోలీసుల సహకారంతో టీజీఎఫ్డీ బృందంతో గాలింపు ముమ్మరం చేశారు. చివరకు జాఫర్ మృతదేహం లభించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుక్క పిల్లను కాపాడేయత్నంలో.. తమతో పాటు సరదా కోసం పెంపుడు కుక్కపిల్లను తీసుకెళ్లిన వారికి అదే కుక్క పిల్ల తమ స్నేహితుడి మృతికి కారణం అవుతుందనే విషయాన్ని గుర్తించలేక పోయారు. జాఫర్ వద్ద కుక్క పిల్లను వదిలి స్నానం చేద్దామని నదిలోకి దిగారు. నదిలో ఈత కొడుకున్న వారిని చూసిన కుక్కపిల్ల సైతం నదిలోకి దూకగా మెడకు ఉన్న తాడు సాయంతో దానిని గట్టుపైకి లాగే క్రమంలో జాఫర్ జారిపడి నదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి మేనమాన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
సమాజం ధర్మమార్గంలో నడవాలి
కల్వకుర్తి రూరల్: ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక దారి చూపిన ఘనత యజ్ఞాలు, యాగాలదని రాష్ట్ర సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రదక్షణ చేసి మహాశివుడికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి అభిషేకం, హారతి ఇచ్చారు. అనంతరం శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వేజన సుఖినోభవంతు అంటూ దీవిస్తారని, అందరూ బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయంలో భాగమన్నారు. నేటి శాస్త్ర సాంకేతికతో పాటు పూర్వీకులు మనకు ఇచ్చిన ధర్మం, శాంతి, సేవాభావాల గొప్పవరం యజ్ఞ, యాగాలన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు, సామాజిక రుగ్మతలు తొలగాలన్నా, సమాజం ధర్మ మార్గంలో నడవాలన్నా మనిషి ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం, మానవాళి శ్రేయస్సు, వర్షాలు సమృద్ధిగా కురవాలని చేస్తున్న యాగం అందరికీ మేలు చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేయాలని పేర్కొన్నారు. సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమం, రమాసహిత సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. యాగంలో ఎమ్మెల్యే దంపతులు.. విశ్వశాంతి మహాయాగంలో ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి దంపతులతో పాటు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీసింగ్, దీప దంపతులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి గీత దంపతులు హోమంలో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కబడ్డీ, వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న కబడ్డీ, వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి బాల, బాలికల సెలక్షన్ ట్రయల్స్ శనివారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ అకాడమీకి సంబంధించి బాలుర, వాలీబాల్ అకాడమీకి బాల, బాలికల ఎంపికలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కబడ్డీకి దాదాపు 250 మంది బాలురు, వాలీబాల్లో బాలురు 80 మంది, బాలికలు 40 మంది హాజరయ్యారు. వివిధ ఫిజికల్ అంశాల్లో పరీక్షలు కబడ్డీకి సంబంధించి క్రీడాకారులకు వివిధ అంశాలో ఫిజికల్ ఫిట్నెస్ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. స్టాండింగ్ బ్రాడ్ జంప్, 60గీ10 మీటర్ల షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, 800మీ, 30మీ, సెట్ అప్స్, పుష్ అప్స్, స్కిల్ టెస్ట్లో ఫుట్ వర్క్, హ్యాండ్ టచ్, టో టచ్, ఆంకిల్ హోల్డ్, తిగ్ హోల్డ్, బ్లాకింగ్ అంశాల్లో పరీక్షించి అనంతరం మ్యాట్పై కబడ్డీ ఆడిపించారు. వాలీబాల్కు సంబంధించి ఎత్తు, బరువు, వన్ హ్యాండ్ టచ్, మ్యాగ్జిమమ్ టచ్, 20మీటర్ల స్టాండింగ్, జంప్, మెడిసినల్ బాల్త్రో, ఆగ్జిలిటీ టెస్ట్ అంశాల్లో పరీక్షించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు అకాడమీల ఎంపికలకు డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకటనారాయణ, శాట్ కోచ్ రుషేందర్, సీనియర్ వాలీబాల్ కోచ్ అక్బర్అలీ, వీరారెడ్డి, ప్రముఖ కబడ్డీ కోచ్ శ్రీనివాస్రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మల్లేష్, జిల్లా యువజన, క్రీడల అధికారి రాజశేఖర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకటనారాయణ, జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
వెన్నాచేడ్లో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సోలార్ మోడల్ విలేజ్’ (సౌర విద్యుత్ ఆదర్శ గ్రామం) కార్యక్రమంలో భాగంగా గండేడ్ మండలంలోని వెన్నాచేడ్లో గృహాలు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ బిగింపును వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యుత్ శాఖ, టీజీ రెడ్కో అధికారులతో కలిసి వెన్నాచేడ్లో చేపడుతున్న సోలార్ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ, ఆసక్తి ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పంపు వ్యవస్థలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో మొత్తం 726 గృహ జ్యోతి విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. వాటిలో 261 గృహాలు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని, వీటిలో ఇప్పటివరకు 116 గృహాల్లో 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. అలాగే 447 వ్యవసాయ మోటార్ కనెక్షన్లు ఉండగా.. 64 మంది రైతులకు 7.5 హెచ్పీ సామర్థ్యం గల సోలార్ పంపుసెట్లు అమర్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రెడ్కో జిల్లా మేనేజర్ మనోహర్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, ట్రాన్స్కో ఎస్ఈ భీమానాయక్, డీఈ లక్ష్మణ్నాయక్, ఏడీఈ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల రక్షణలో ఉపాధ్యాయులే కీలకం
మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వ పాఠశాలల్లో బాలలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్పర్సన్ ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నాల్సా పథకం లక్ష్యాలు, బాలల రక్షణలో ఉపాధ్యాయుల బాధ్యత, పాఠశాలల్లో పిల్లలకు భద్రమైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. శిక్షణలో పోక్సో, జువైనెల్ జస్టిస్, బాల్య వివాహాల నిషేధం, బాల కార్మిక నిషేధం, బాలల హక్కులు, సేఫ్ టచ్– అన్సేఫ్ టచ్, ఉచిత న్యాయ సహాయం, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నివారణ, పిల్లలపై వేధింపుల నిరోధం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు, డీఈఓ విజయకుమారి, డీఐఈఓ రమణి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నయీముద్దీన్ పాల్గొన్నారు. సైబర్ మోసాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎస్పీ జానకి అన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, సైబర్ క్రైం, ఐటీ సెల్ సిబ్బంది, సైబర్ వారియర్స్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రతి బుధవారం గ్రామాలు, వార్డులు, కాలనీల్లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే స్పందించడం అత్యంత కీలకమన్నారు. మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ (ఎన్సీఆర్పీ) పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేస్తే గోల్డెన్ అవర్లో నగదును హోల్డ్ చేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దీనిపై అంశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టగలమని ఎస్పీ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్.బీ. రత్నం, డీఎస్పీలు, సీఐలు, ఐటీ సెల్ సిబ్బంది, సైబర్ క్రైమ్ అధికారులు, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు. నేడు బ్యారేజీల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్డ్యాంలు, బ్యారేజీలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు. -
కోనేరులో మునిగి ఆటోడ్రైవర్ మృతి
గోపాల్పేట: ఆటోడ్రైవర్ కోనేరులో మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జలీల్ మియాకు ఐదుగురు కుమారులు, కూతురు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమారుడు ఎండీ నజీర్(43)కు పదేళ్ల క్రితం పెళ్లయి ఒక కూతురు ఉన్నారు. ఐదేళ్ల కిందట నజీర్ భార్య తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒక్కడే ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల నుంచి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద కోనేరులో దిగి ఈత కొట్టాడు. ఒకసారి పైకివచ్చి మళ్లీ వెళ్లి కోనేరులో దూకి పైకి రాలేదు. దీంతో కోనేరులో మునిగిపోయాడని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కోనేరులో వెతికి మధ్యాహ్నం నజీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి మేనల్లుడు మహమూద్ తన మామ చావుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. -
తొలి ఏకాదశికి ముస్తాబు
● శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ● నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు స్టేషన్ మహబూబ్నగర్: ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి హైందవులకు మహాపర్వదినం. దీన్ని ‘శయనైకాదశి, ప్రథమ ఏకాదశి’ కూడా అని పిలుస్తారు. క్షీరాబ్దిలో శేషపాన్పుపైన శ్రీమహావిష్ణువు శయనించడం (యోగానిద్ర) వల్ల దీన్ని శయనైకాదశి అంటారు. ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. మోక్షాన్ని ఇచ్చే మాసం ఆషాఢం. ఈ రోజు నుంచి ఉత్తరం ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. శనివారం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతాలు’ ప్రారంభిస్తారు. ఏకాదశి 11 సంఖ్యకు సంకేతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు వెరసీ పదకొండింటిపైన నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం. ఈ రోజు నుంచే పండుగలు ప్రారంభమవుతాయి. రాబోయే శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే వ్రతాలు, నోములు బాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, దాని తర్వాత దేవినవరాత్రులు, దసరా, దీపావళి ఇలా ఎన్నో పండుగలకు ఈ చాత్మురాస్యం ప్రత్యేకం. విశేష అభిషేకాలు తొలి ఏకాదశికి దేవాలయాల్లో ఎక్కాహం (ఉపవాసం జాగరణలు), అభిషేకాలు చేపడుతారు. ఎక్కాహం అంటే 24 గంటలపాటు ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం ఎప్పుడైతే ప్రారంభిస్తారో.. మరునాడు అదే సమయం వరకు నిరంతరం భక్తి భజనలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు తొలి ఏకాదశి పూజలకు నగరంలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. స్థానిక పిల్లలమర్రి రోడ్డు శ్రీవేంకటేశ్వర దేవాలయం, సింహగిరిలోని లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి, పాత శివాలయం, బండ్లగేరి ప్రాంతంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయం, టీచర్స్ కాలనీ రామాలయం తదితర ఆలయాల్లో శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఎంతో విశిష్టత.. తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. వచ్చే పండుగలకు ప్రారంభసూచిక తొలిఏకాదశి. తొలిఏకాదశి రోజు నుంచే చాతుర్మస్యం దీక్ష ప్రారంభమవుతోంది. చాతుర్మసం దేవతా పూజలకు నిలయమైనది. ఈ చాతుర్మస్యం నాలుగు నెలల్లో ఒక్కొ నెల ఒక వ్రతాచరణ ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం అత్యంత పుణ్యప్రదమైనది. – తోటపల్లి శ్రీకాంత్శర్మ, అధ్యక్షుడు, శ్రీవెంకటేశ్వర సేవా మండలి -
కబడ్డీ అకాడమీ ప్రవేశాల ఎంపికలు
● నేడు, రేపు రాష్ట్రస్థాయి బాలుర సెలక్షన్స్ ● తెలంగాణలోనే ఏకై క కబడ్డీ అకాడమీ ● పాలమూరు మెయిన్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరు నగరంలోని మెయిన్ స్టేడియం కబడ్డీ అకాడమీలో ప్రవేశాల కోసం శనివారం, ఆదివారం బాలుర ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. గత నెలలో అండర్–16 బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలోనే మొదటి కబడ్డీ అకాడమీ పాలమూరు నగరంలో ఏర్పాటు కావడం విశేషం. 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్లతో హాజరుకండి.. మెయిన్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీలో రాష్ట్రస్థాయి సెలక్షన్స్ నిర్వహించనుండగా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏదైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు నేరుగా సంబంధిత ధ్రువపత్రాలు (ఒరిజనల్, జిరాక్స్)తో ఉదయం 7.30 గంటలకు మెయిన్ స్టేడియంలో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాల కోసం డీవైఎస్ఓ సెల్ నం.98660 80831, కబడ్డీ నామిని సెలక్షన్ కురుమూర్తిగౌడ్ సెల్ నం.97049 34663, వాలీబాల్ కోచ్లు అబ్దుల్ రహెమాన్ఖాన్ సెల్ నం.97041 50321, పర్వేజ్పాష సెల్ నం.77805 82604లను సంప్రదించాలని సూచించారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులకు ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయం ఉంటుందన్నారు. జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అర్హతలు ఇవీ.. అకాడమీలో ప్రవేశాల కోసం 30.06.2010 నుంచి 01.07.2012 మధ్య జన్మించి 14–16 ఏళ్లలోపు బాల, బాలికలు ఉండాలి. వాలీబాల్కు బాలుర ఎత్తు 182 సెం.మీ., బాలికల ఎత్తు 166 సెం.మీ., పైబడి ఉండాలి. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ప్రస్తుతం చదువుతున్న స్కూల్ లేదా కళాశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం (సంబంధిత అధికారులు తహసీల్దార్/ పంచాయతీ/ మున్సిపాలిటీ నుంచి జారీ చేయబడింది.) పది పాస్పోర్టు సైజ్ ఫొటోలతోపాటు ఆధార్ కార్డు /రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకురావాలి. -
లొద్ది మల్లయ్యా.. నీ దర్శనభాగ్యం లేనట్లేనా?
● ఏటా పెరుగుతున్న అటవీశాఖ నిబంధనలు ● ప్రకృతి ఒడిలో కొలువుదీరిన దైవాలకు దూరమవుతున్న భక్తులు బల్మూర్: మండలంలోని బాణాల సమీపంలో కొలువుదీరిన లొద్ది మల్లయ్య దర్శనానికి ప్రతిఏటా ఏకాదశి పర్వదినాన భక్తులు, ప్రజలు కాలినడకన వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ ప్రాంత ప్రజలు లొద్దిమల్లయ్య దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. లొద్ది చేరుకున్న భక్తులు ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఈ క్షేత్రానికి వెళ్లడానికి గత కొన్నేళ్లుగా అటవీ శాఖ ఆంక్షలు అడ్డొస్తున్నాయి. ప్రస్తుతం పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో అడవిలో జనసంచారంపై అధికారులు నిషేధం విధించారు. సరిగ్గా ఇదే సమయంలో తొలి ఏకాదశి పర్వదినం రావడంతో అక్కడికి వెళ్లలేక భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఏడాదిలో ఒకసారి లొద్దిమల్లయ్య చెంతకు భక్తులు వెళ్లడం వల్ల అటవీ శాఖకు, జంతువుల సంరక్షణకు వచ్చే ముప్పు ఏమీ ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈసారి కూడా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లన్న దర్శన భాగ్యం లేనట్లేనా అని భక్తులు నిట్టూర్పు విడిచారు.


