breaking news
Mahabubnagar District Latest News
-
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని డీటీఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం టీడీఓ కార్యాలయంలో పెన్షనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే పెన్షనర్లను వేధించకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. వారు అడిగిన సమాచారాన్ని అందించాలని అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే సావదానంగా వివరించాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లతో స్వయంగా ఎస్టీఓలను కలిసి వ్యక్తిగత నిర్ధారణ చేసుకోవాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న 5 డీఏలను త్వరగా మంజూరు చేయాలని, పే కమిషన్ రిపోర్టు ప్రకటించాలని, జిల్లాకేంద్రంలో రాష్ట్ర రాజధానితో పెన్షనర్ల సంక్షేమ భవనాలను నిర్మించాలని, నగదు రహిత వైద్య సేవలు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో వైద్యులు, మండలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతితో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీఓకు అందజేశారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యధ్యక్షుడు బాలస్వామి, అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రహమాన్, ఉపాధ్యక్షులు వీరేందర్జీ, వీణాదేవి, కార్యదర్శులు ఖాజమ్మ, తులసమ్మ, బాలశివుడు, సభ్యులు కొండారెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు. -
పీయూ భూమిని కాపాడాలి
పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం 500 గజాల భూమికి అధికారులు అనుమతిస్తే విద్యుత్ శాఖ ఏకంగా ఎకరంన్నర భూమిని చదును చేశారు. ప్రస్తుత అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. గత అధికారులు యూనివర్సిటీకి భూమిని సమకూర్చితే ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడలేకపోతున్నారు. భూమిని తిరిగి స్వాధీనం చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – వేణు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీయూలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుదీర్రెడ్డి, ఈఈ, ట్రాన్స్కో పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్చాన్స్లర్ ● -
పతకాలు సాధించడం అభినందనీయం
మహబూబ్నగర్ క్రీడలు: కేంద్రీయ విద్యాలయ జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని బొల్లారంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన 54వ కేంద్రీయ జాతీయ ఆర్చరీ క్రీడా పోటీల్లో కంపౌండ్ కేటగిరిలో మహబూబ్నగర్కు చెందిన విద్యార్థులు స్మృతి సన్నిభా ఫస్ట్రౌండ్, సెకండ్ రౌండ్లో బంగారు పతకాలు, కృతిక్ శ్రీవత్సవ్ ఫస్ట్రౌండ్లో రజతం, సెకండ్ రౌండ్లో కాంస్య పతకాలు సాధించడంపై సోమవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
మహబూబ్నగర్ 331 ఆలౌట్
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లోని కేసీఆర్–2 మైదానంలో సోమవారం బీ–డివిజన్ టూడే లీగ్ చాంపియన్షిప్లో మహబూబ్నగర్ –ఖమ్మం జట్ల మధ్య లీగ్ ప్రారంభమైంది. జరిగింది. తొలి రోజు మహబూబ్నగర్ 87.1 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాఫే 73 పరుగులు (111 బంతుల్లో, 14 ఫోర్లు), ఛత్రపతి 63 పరుగులు (169 బంతుల్లో, 9 ఫోర్లు), కేతన్కుమార్ 62 పరుగులు (85 బంతుల్లో, 12 ఫోర్లు) రాణించారు. ఖమ్మం బౌలర్లు వి.మహేష్, విశాల్ యాదవ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. మంగళవారం ఖమ్మం బ్యాటింగ్ చేయనుంది. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కంట్రోలర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ, పీజీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్వీడీసీ కళాశాల పరీక్ష కేంద్రాలన్ని పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి మాస్కాపీయింగ్కు పాల్పడకుండా చూడాలని, కాపీయింగ్కు పాల్పడి చర్యలు తీసుకుంటామని సూచించారు. కార్గో హమాలీ కూలీరేట్ల పెంపునకు అంగీకారం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లోని కార్గోలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల రేట్ల పెంపునకు అంగీకారం కుదిరిందని ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శి సురేశ్ తెలపారు. ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని వారం కిందట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నోటీస్ అందజేసిన నేపథ్యంలో సోమవారం కాంట్రాక్టర్తో సుదీర్ఘంగా చర్చలు చేసినట్లు తెలిపారు. పెంచిన కూలీ రేట్లు నేటినుంచి అమల్లోకి తెస్తామన్నారు. కూలీరేట్ల పెంపునకు అంగీకరించిన కార్గో ఏజెన్సీ కాంట్రాక్టర్, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగన్న, శంకరయ్య, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగ పొట్టుతో గణేశుడు
కరీంనగర్ అర్బన్: వేరుశనగ పొట్టుతో తయారుచేసిన వినాయక విగ్రహాలు ప్రజావాణి కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీజ.. గ్రీన్ గెలాక్సీ సంస్థను నిర్వహిస్తోంది. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించగా.. మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అయితే, వేరుశన పొట్టుతో తయారు చేయించిన.. పర్యావరణానికి మేలు వినాయక విగ్రహాలను మంత్రి, కలెక్టర్కు అందజేశారు. వీటిని కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రదర్శించాలని కలెక్టర్ అప్పుడు సూచించారు. దీంతో సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వేరుశనగ పొట్టుతో తయారుచేసిన గణపతి విగ్రహాలు ప్రదర్శించారు. ప్రతిమలు ఆకర్షణీయంగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఇప్పటికే ఇలాంటి పర్యావరణహితమైన అనేక ప్రయోగాలు చేసి పలువురు ప్రముఖుల మన్ననలు పొందింది. కరీంనగర్ ప్రజావాణిలో ప్రదర్శన -
భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాకేంద్రంలోని టీచర్స్కాలనీ పార్క్ ఆవరణలో ఉన్న వినాయక ఆలయం దగ్గర ఓరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో 2018 నుంచి మట్టి గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా 9 రోజులు పూర్తిగా కోలాటం, భజనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతాం. ప్రత్యేకంగా మహిళలు చేసే కోలాటం, భజనలు ఆకట్టుకుంటాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు సైతం మట్టి గణనాథుడిపై అవగాహన కల్పిస్తాం. – మహేందర్, ఓరసిద్ధి వినాయక సేవా సంఘం సభ్యుడు, టీచర్స్కాలనీ -
పదోన్నతుల కోలాహలం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ ● సోమవారం వెలువడిన సీనియార్టీ, ఖాళీల జాబితా ● అభ్యంతరాలు సైతం పరిష్కరించిన తర్వాతే తుది జాబితా ● నేటి సాయంత్రం వరకు ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ● ఆన్లైన్ విధానంతో సులువుగా మారిన కసరత్తు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో వివాదాలకు తావులేకుండా ప్రక్రియ సజావుగా సాగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 21న నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో 92 మంది ఎస్ఏలకు జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా, ఎస్ఏలుగా 306 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే మూడు జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఉన్న ఖాళీలు, అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను అధికారులు అందుబాటులో ఉంచారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం రాత్రికి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంది. వారు ఎంపిక చేసుకున్న పాఠశాలల వివరాల ఆధారంగా మంగళవారం సాయంత్రం వరకు ఆర్డర్స్ అందించనున్నారు. పొరపాట్లు సరిచేసి.. సీనియార్టీ జాబితా వెలువడిన వెంటనే అధికారులు ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను సోమవారం స్వీకరించారు. ఇందులో మహబూబ్నగర్లో 3, నారాయణపేటలో 10, నాగర్కర్నూల్లో 5 అభ్యంతరాలు రాగా ఇందులో పుట్టినరోజు, స్పౌజ్, మెడికల్ తదితర చిన్నపాటి పొరపాట్లు ఉండగా వాటిని అధికారులు సరిచేశారు. దీంతో మూడు జిల్లాల్లో దాదాపు ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంలకు సంబంధించి మహబూబ్నగర్లో నలుగురు, నారాయణపేటలో ఏడుగురు, నాగర్కర్నూల్లో ఐదుగురు విధుల్లో చేరలేదని సమాచారం. ఈ పోస్టులకు తదుపరి సీనియార్టీ జాబితాలో ఉన్న వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. జిల్లా హెచ్ఎం ఎస్ఏలు మహబూబ్నగర్ 34 119 నాగర్కర్నూల్ 37 107 నారాయణపేట 21 80 జిల్లావ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. సీనియార్టీ జాబితాపై కొన్ని అభ్యంతరాలు వస్తే వాటిని సకాలంలో పరిష్కరించాం. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మంగళవారం సాయంత్రంలోగా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట -
ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు ప్రకటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు ప్రకటించాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఫిక్స్డ్ వేతనం అమలు చేయకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఆశాలపై ఏఎన్ఎంలు, వైద్యులు, సూపర్వైజర్ల వేధింపులు ఆపాలని, ఆశాలను ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ విజయేందికు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ‘చలో హైదరాబాద్’ చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, పట్టణ అధ్యక్షుడు రాజ్కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాధన, సుగుణ, నాయకులు యాదమ్మ, పద్మ, సావిత్రి, లక్ష్మి, హైమావతి, వెంకటేశ్వరమ్మ, సునీత, సౌజన్య పాల్గొన్నారు. -
డబ్బు రాజకీయాలు మారాలి
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ● సురవరం పుస్తకావిష్కరణ వనపర్తిటౌన్: ఈసీ ఓట్ల చోరీపై రాహుల్గాంధీ చేస్తున్న పోరు తరహాలో డబ్బు రాజకీయాలను మార్చేందుకు యువత ముందుకు రాకపోతే దేశాన్ని ఎవరూ రక్షించలేరని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సురవరం ప్రతాప్రెడ్డి పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వందేళ్లలో పూర్తి చేయాల్సిన పనులను 50ఏళ్ల జీవితంలో పూర్తి చేసి తరగని ముందుచూపుతో కాలంకంటే ముందు నడిచిన మేధావిగా సురవరం ప్రసిద్ధికెక్కారని చెప్పారు. ప్రతాపరెడ్డిలాంటి మహోన్నతుడు భవిష్యత్లో పుట్టడం అసాధ్యమన్నారు. వనపర్తిలో సురవరం, ప్రజావైద్యుడు మాధవరెడ్డి విగ్రహాలను వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామన్నారు. సురవరం కుమారుడు డాక్టర్ కృష్ణవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డికి రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి పరితపించిన సురవరం రచనలు, కృషి సామాన్యుల దరికి చేరాల్సిన అవసరం ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో వనపర్తి సైనికులు ఇండియన్ ఆర్మీలో వనపర్తి, హైదరాబాద్ సైనికులు ప్రధాన భూమిక పోషించారని తెలంగాణ చరిత్ర అధ్యయన కేంద్రం చైర్మన్, మానవ వనరుల విభాగం రాష్ట్ర ప్రతినిధి పాండురంగారెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పోరుగడ్డతోపాటు కళం గడ్డగా ప్రసిద్ధి చెందిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో వనపర్తి సైనికులు పాల్గొన్నారని, ఈ ప్రాంతం విశేష ప్రాధాన్యత కలిగినదన్నారు. కార్యక్రమంలో నాయకులు శిల్ప, అనురాగ్రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, అమరేందర్రెడ్డి, బిక్షం, జలంధర్రెడ్డి, శంకర్గౌడ్, రాజేంద్రప్రసాద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వశక్తితో ముందుకు సాగాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని అప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఇటీవల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటల్ మేనేజ్మెంట్ ద్వారా మహిళా సంఘాలకు చెందిన మహిళలు బేకరీ రంగంలో శిక్షణ పొందిన వారికి సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శిక్షణలో బేకరీ వస్తువులైన బిస్కెట్లు, కేకులు తదితర 16 రకాల వాటిలో శిక్షణ పొందారు. వారు తయారు చేసిన కేక్ను కలెక్టర్ కట్ చేసి అధికారులకు అందించారు. మహిళలు చిన్న షాపులు, వ్యాపారాలు, చేసేవారు బేకరీ పదార్థాల తయారీలో పొందిన శిక్షణ తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, ఫేషియల్ రికగ్నిషనల్ యాప్ ద్వారా అందజేస్తున్నారు. ఫంక్షన్ ద్వారా యాప్లో క్యాప్చర్ చేసేందుకు ప్రభుత్వం సమకూర్చిన శాంసంగ్ మొబైల్ ఫోన్లు 167 ఫింగర్ క్యాప్చర్ మంత్ర డివైస్లు కలెక్టర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అందజేశారు. ప్రజావాణికి 86 ఫిర్యాదులు.. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 86 ఫిర్యాదులను కలెక్టర్ అందకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఆర్డీఓ నర్సింహులు, ఏపీడీ శారద, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతే ధర నిర్ణయించే రోజులు రావాలి
● మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్ ● అట్టహాసంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభలు ప్రారంభం మహబూబ్నగర్ న్యూటౌన్: రైతుల కష్టంతో పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధరలు నిర్ణయించే రోజులు రావాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మెట్టుగడ్డ నుంచి బాయ్స్ కాలేజీ వరకు రైతులతో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆగస్టు 15న దేశ ప్రజలకు అండగా ఉంటానన్న ప్రధాని మోదీ మరుసటి రోజే విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకొని దిగుమతి సుంకాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. విదేశాల పత్తిని కొనుగోలు చేయడంతో ఇక్కడి పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అదానీ, అంబానీ లాంటి కంపెనీలు వచ్చి రాబోయే కాలంలో రైతులను పీడించనున్నాయన్నారు. ఫిబ్రవరిలో 10లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు ఇస్తామని చెప్పి సగం కోత విధించారని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వమంటే కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే అధికారం ఇచ్చినప్పుడు రైతులు పండించిన పంటకు రేట్లు పెంచుకునే అధికారం ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. ఇవన్నీ విషయాలపై కొట్లాడితే అర్బన్ నక్సల్స్ అంటున్నారని, హిందూ ముస్లిం గొడవలు తెచ్చి దేశద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. పాలకులు తీసుకొస్తున్న చట్టాలన్నీ రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులు తమ హక్కుల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ.. రైతాంగం నేడు దుర్భరమైన స్థితిలో ఉందన్నారు. ఓట్ల దొంగతనం చేసి అధికారంలోకి వచ్చారని ప్రతిపక్షం ఆధారాలతో నిరూపిస్తే వారిని అణచివేసే కుట్రలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు–రంగారెడ్డి పథకానికి అరకొర నిధులు కేటాయించడం తగదన్నారు. కార్యక్రమంలో రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంధాల నేతలు సాంబశివుడు, కాశీనాథ్, యాదగిరి, రాజన్న, కొండారెడ్డి, మణ్యం, రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల దీవెనతో ప్రజా పాలన
● ‘పనుల జాతర’లో రూ.20,200 కోట్లు ఖర్చు ● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచించారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం కాని నాలుగో యూనిట్ ● 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ● ఏళ్ల తరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ● మరో నెల రోజుల్లో సిద్ధం చేస్తామంటున్న సీఈ ● ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. -
సరైన సమయంలో ఇవ్వాలి..
మా చెరువులు నిండి 20 రోజులు కావస్తున్నా.. ఉచిత చేప విత్తనాలు ఇవ్వలేదు. ఆలస్యంగా ఇస్తే లాభం లేదు. గతేడాది ప్రభుత్వం ఇచ్చే చేప విత్తనాలను నమ్ముకొని తీవ్రంగా నష్టపోయాం. నాణ్యత లేకపోవడంతో చేపల సైజు పెరగలేదు. సరైన సమయంలో చేప విత్తనాలు నాణ్యతతో ఇస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. లేదంటే ప్రభుత్వం నుంచి మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు నగదు బదిలీ అయినా చేస్తే సంఘాల ద్వారా కొనుగోలు చేస్తాం. – చింతకాయల లక్ష్మయ్య, కొత్త మొల్గర మత్స్యపారిశ్రామిక సంఘకార సంఘం అధ్యక్షుడు -
నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలి: పీయూ వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వీసీ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ మేరకు బాలికల హాస్టల్లో నిర్మిస్తున్న అదనపు డైనింగ్ హాల్, రీసెర్చ్ ఫెసిలిటీ భవనం, నూతన ఇంజనీరింగ్, లా కళాశాలల భవనాలను ఆయన పరిశీలించారు. భవనాలను సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. ఆయన వెంట పలువురు పీయూ అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ.. మద్యంపై ఉన్న ధ్యాస ప్రభుత్వానికి విద్యారంగంపై లేదని విమర్శించారు. మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ, ఒక్క విద్యాశాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 90 శాతం గురుకులాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయని, పీయూకు రూ.500 కోట్ల నిధులను విడుదల చేయాలని, లా, ఇంజనీరింగ్ కళాశాలలకు అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో నేదురుమల్లి జనార్దన్ ప్రభుత్వాన్ని విద్యార్థులే కూల్చారని, ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తే భవిష్యత్లో అదే జరుగుతుందని హెచ్చరించారు. నాయకులు కురుమూర్తి, లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్, మోహన్, భరత్ పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, సంయుక్త కార్యదర్శి జేఎన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ను కోరారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ను ఆదివారం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒబేదుల్లా కొత్వాల్ను తమ ఫోరానికి గౌరవాధ్యక్షుడిగా ఉండాలని కోరగా అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు జగపతిరావు, నాగభూషణం, విశ్రాంత ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
స్టేషన్ మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చేయూత ఇస్తే అద్భుతాలు సృస్టిస్తారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 28 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా శతశాతం వినూత్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండురోజుల నుంచి నిర్వహిస్తున్న విద్యార్థుల ప్రేరణ శిక్షణ తరగతులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. మొదటి రోజు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎమ్మెల్యే ఎదుట విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు అని అన్నారు. రెండురోజుల పాటు సిలబస్ బోధించడమే కాకుండా పెద్దలను గౌరవించడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడమే శత శాతం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని 28 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వలంటీర్లను నియమించామన్నారు. వలంటీర్లు విద్యార్థులను మానసికంగా, ధృడంగా ఎదిగేందుకు కృషి చేస్తారని అన్నారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి వెనుకబడిన సబ్జెక్టుల్లో నుంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు. శతశాతం కార్యక్రమంతో రాబోయే నాలుగైదేళ్లలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవీందర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, అనిల్, రాజ మల్లేష్ పాల్గొన్నారు. -
రైతు ఆపదలో ఉంటే ప్రభుత్వాల నిర్లిప్తత
మహబూబ్నగర్ న్యూటౌన్: దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తత చూపుతున్నాయని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆండ్బీ అతిథిగృహం వద్ద అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి అందలం ఎక్కి ఆగం చేస్తున్నారని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టా న్ని, పంటలకు సాగునీటి వసతి కల్పించే వసతులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నర్సింహ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రఫి తదితరులు పాల్గొన్నారు. -
‘నేనుసైతం’ పూజాసామగ్రి పంపిణీ
మెట్టుగడ్డ: వినాయక చవితిని పురస్కరించుకుని 711 పురాతన ఆలయాలు, వినాయక మండపాలకు పూజాసామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలకు అవసరమయ్యే 31రకాల పూజాసామగ్రితోపాటు, పురాతన ఆలయాల్లో నిత్యపూజకు అవసరమయ్యే సామగ్రిని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాతోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, జిల్లాలోని పలు ఆలయాలకు ధూపదీప కార్యక్రమ సామగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉచిత పూజాసామగ్రి పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. సొంత నిధులతోనే.. నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజాసామగ్రిని సొంత నిధులతోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నేనుసైతం సభ్యులు పవన్కుమార్, శ్రీనివాస్, ప్రియ, లక్ష్మీనారాయణ, సత్యం, దస్తయ్య, శ్రీహరి, గణేశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
పడమటి అంజన్న ఉత్సవాల నాటికి కోనేరు ఆధునికీకరణ
మక్తల్: పట్టణంలో శ్రీపడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల నాటికి కోనేరు ఆధునికీకరణ పనులను పూర్తిచేస్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పడమటి అంజన్న కోనేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తిరుపతి, యాదగిరిగుట్ట తరహాలో పడమటి అంజన్న కోనేరును తీర్చిదిద్ది భక్తులకు అంటుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం ప్రముఖ ఆర్కిటెక్చర్ కల్పన కోనేరు పనులను రిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 కోనేరులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేష్కుమార్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాగేందర్, ఆంజనేయులు, ఈఓ శ్యాంసుందరాచారి, రవికుమార్, కట్ట సురేశ్, నాగశివ, శ్రీనివాసులు, హేమసుందర్, చంద్రశేఖర్, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు. -
మహబూబ్నగర్ వద్దు.. వికారాబాద్లో కలపండి
● ఉమ్మడి మండలాల జేఏసీ కార్యవర్గ సమావేశం ● వికారాబాద్లో కలపాలంటూ 80 శాతం యువకులు, నాయకుల తీర్మానం మహమ్మదాబాద్/గండేడ్: గండేడ్, మహమ్మదాబాద్ మండలాలను మహబూబ్నగర్లో కలపడంతో రాజకీయం, అధికారికంగా ఎన్నో అవస్థలు పడుతున్నట్లు రెండు మండలాల జేఏసీ నాయకులు, యువకులు, విద్యావంతులు పేర్కొంటున్నారు. రెండు మండలాలను వికారాబాద్లో కలపాలని ఆదివారం మండల పరిధిలోని నంచర్ల గేట్ వద్ద రెండు మండలాల విలీన సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 80 శాతం మంది వికారాబాద్ జిల్లాలో కలపాలని, 15 శాతం మంది జిల్లా, అసెంబ్లీ, పార్లమెంటు ఒకే వైపు ఉండాలని, 5 శాతం మంది మహబూబ్నగర్ ఉంటేనే బాగుంటుందని తీర్మానించారు. దీంతో రెండు మండలాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు అన్ని గ్రామాల ప్రజల నిర్ణయాన్ని పరిణలోకి తీసుకొని ఉద్యమం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో సీఎంను కలిసి సమస్యను వివరించన్నున్నట్లు పేర్కొన్నారు. జేఏసీ కార్యవర్గ సమావేశం మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మండల జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మదాబాద్ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలో ఉండేందుకు మండల వాసులంతా మొగ్గుచూపుతున్నారన్నారు. దగ్గర్లోని జిల్లాను విడిచి రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మండలాన్ని మళ్లీ వికారాబాద్కు తరలించాలని పన్నాగం పన్నుతున్నట్లు మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్నగర్ జిల్లాలోనే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు జితేందర్రెడ్డి, కేఎం నారాయణ, న్యాయవాది రాములు, కొమిరె లక్ష్మయ్య, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఏవీ రాములు, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టేషన్ల రూపురేఖలు మారుతాయి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే స్టేషన్లలో ఏబీఎస్ఎస్ పనులు చేపడుతున్నందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు. – గోపాల్నారాయణ, డీఆర్యూ సీసీ మెంబర్ ● -
‘అమృత్భారత్’ స్టేషన్లు
స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పెద్దపీట వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి (ఆధునీకరణ) పనులు చేపడుతన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాలుగు స్టేషన్లకు అమృత్ భారత్స్టేషన్ పథకం కింద నిధులు కేటాయించగా పనులు పురోగతిలో ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్నివిధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదాచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు అహ్లాదకరమైన అనుభూతి కలిగేందుకు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. స్టేషన్ ఆవరణలో పార్కులను కూడా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కోసం స్టాల్స్ కేటాయించడం, అత్యున్నత ప్లాట్ఫారాలు, తగిన ప్లాట్ఫారం స్లాటర్ల నిర్మాణం, అధిక నాణ్యతగల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ ఆధారిత స్టేషన్ నేమ్ బోర్డులు, వెయింటింగ్ హాల్స్ మెరుగుదల తదితర ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. వన్స్టేషన్.. వన్ప్రొడక్టు కింద రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లలో పురోగతి పనులు -
జూరాలకు నిలకడగా వరద
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 3.72 లక్షల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టు 37 క్రస్టు గేట్లను ఎత్తి 3,53,573 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 490, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా మరో 41 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.585 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2,75,568 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 2 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 30 గేట్లను ఎత్తి 1,70,340 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసులలో 9 గేట్టు ఎత్తివేత సుంకేసులలో 9 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రాగా.. 38,493 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసి కేసీ కెనాల్కు 2,626 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుదుత్పత్తికి ఆటంకం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ఆటంకం కలుగుతోంది. అత్యధికంగా వరద నీరు వస్తుండడంతో ఉత్పత్తి సాధ్యమవదని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 533.580 మి.యూ., చేపట్టామని ఆయన పేర్కొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
● మక్తల్ మండలం దాసర్పల్లికి చెందిన కృష్ణవేణి అలియాస్ కిష్టమ్మ (30) కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ మక్తల్ మండలం సంగంబండ సమీపంలోని ఆశ్రమంలో ఉండేది. ఆదివారం ఆశ్రమం నుంచి సంగంబండ గ్రామం వైపు ఆమె నడుచుకుంటూ వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ● మహారాష్ట్ర నుంచి ఉలిగడ్డల లోడ్తో వెళ్తున్న లారీ గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజీ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ సంతోష్ (38) మృతిచెందాడు. మరో డ్రైవర్ వీరకుమార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి సోదరుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మక్తల్ మండలం సంగంబండ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న యువతిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అటుగా వెళ్తున్న రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గమనించి.. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని మక్తల్ మార్చురీకి తరలించి మానవత్వం చాటుకున్నారు. కల్వకుర్తి పట్టణంలో లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజీ సమీపంలో లారీ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం చెందాడు. – మక్తల్/కల్వకుర్తి టౌన్/గట్టు/వెల్దండ లారీ, బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి వివరాల మేరకు.. తాండ్రకు చెందిన శ్రీను (45) వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి కల్వకుర్తికి బైకుపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని సీబీఎం కళాశాల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బాబాయ్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. -
భారీ కొండచిలువ పట్టివేత
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం దొండగుంటపల్లి శివారులోని రేణు సోలార్ ప్లాంట్ వద్ద శనివారం మధ్యాహ్నం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గుర్తించిన సోలార్ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే మేనేజర్ వసంతరావు, ఖిల్లాఘనపురం మండల ఫారెస్ట్ రేంజర్ అధికారి మంజులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. వెంటనే తన బృందంతో అక్కడికి చేరుకున్న కృష్ణసాగర్ అతి కష్టం మీద కొండచిలువను సురక్షితంగా బంధించారు. కొండచిలువ 14అడుగుల పొడవు, 23కిలోల బరువు ఉందని, దానిని బలిజపల్లి–జంగమయ్యపల్లి అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని కృష్ణసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ కంపెనీ పరిసర ప్రాంతాలు అడవి పందులు, కుందేళ్లకు అనువైన వాతావరణం కలిగినందున వాటిని వేటాడి తినడానికే కొండచిలువ తరచుగా వస్తోందని, గతంలో కూడా రైతులు ఈ ప్రాంతంలో కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పాములన్నీ విషపూరితమైనవి కావని, కనిపిస్తే వాటిని చంపకుండా తమకు సమాచారం ఇస్తే పట్టుకుని అడవుల్లో వదిలేస్తామన్నారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యులు చిలుక కుమార్, అవినాష్, ఫారెస్ట్ అధికారి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆరు అడుగుల కొండచిలువ.. గోపాల్పేట: మండలంలోని తాడిపర్తి పెద్దచెరువు అలుగు వద్ద ఆదివారం జాలర్లు వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. గుర్తించిన స్థానిక రైతు స్నేక్సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన చెరువు అలుగు వద్దకు చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను వలలో నుంచి బయటకు తీసి బంధించాడు. అనంతరం గోపాల్పేట సెక్షన్ ఆఫీసర్ స్వప్న సమక్షంలో అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
● ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం ● పోక్సో కేసులో వేధింపులతోనే అంటున్న బంధువులు అచ్చంపేట రూరల్: ఓ కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని సిద్ధాపూర్కు చెందిన పాల్వాయి హరీష్ (22)పై 8 నెలల క్రితం పోక్సో కేసు నమోదైంది. రిమాండ్కు తరలించగా బెయిల్పై బయటకు వచ్చాడు. హరీష్ను యువతి బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మనస్థాపానికి గురైన హరీష్ మార్చి నెలలో వీడియో తీసుకుంటూ తన చావుకు కారకుల పేర్లు చెబుతూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. హరీష్ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు సిద్ధాపూర్ పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. కేసు నమోదు చేయడంతో ఆందోళన విరమించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చిన్నచింతకుంట: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్ర మాదవశాత్తు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రాంలాల్నాయక్ కథనం ప్రకారం.. చిన్నచింతకుంట కు చెందిన సంఘమోని రాము(41) ఆదివారం గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లి వల వేశాడు. అయితే వలను తీసే సమయంలో ప్రమాదవశాత్తు వల చుట్టుకొని చెక్డ్యాంలో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై రాము భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాముకు భార్యతోపాటు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చోరీ కేసులో రిమాండ్ ● 7 తులాల బంగారం, 70 తులాల వెండి స్వాధీనం బిజినేపల్లి: మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య నుంచి దొంగతనం కేసులో 7 తులాల బంగారం, 70 తులాల వెండి, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు. ఏడాది కా లంగా దొంగతనాల కు అలవాటు పడిన మల్ల య్య 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. బాఽ దితుల ఫిర్యాదు మేరకు విచారణలో బత్తుల మల్లయ్య పై అనుమానంతో విచారించగ చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడన్నా రు. ఆదివారం రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
నాలుగు స్టేషన్లకు ఏబీఎస్ఎస్ నిధులు
రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించడానికి భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను అప్గ్రేడ్ చేయడానికి భారతీయ రైల్వేలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.35.54 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.34.29 కోట్లు, బాలబ్రహ్మేశ్వర జోగుళాంబస్టేషన్కు రూ.6.07 కోట్లతో ఏబీఎస్ఎస్ పనులు జరుగుతున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. -
ఉత్సాహంగా యోగా క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా సీనియర్ యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పైబడి క్రీడాకారుల ఎంపికలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ రానున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 18–21 ఏళ్ల విభాగానికి ఎం.నందిని, జెట్టి.కావేరి, బి.అంకిత, పూజ, శైలజ, 21–25 విభాగానికి బి.స్వప్న, ఎన్.శ్వేత, సాగర్, మధు, ఆకాశ్, 25–30 విభాగానికి ఎం.బాలమణి, 35–45 విభాగానికి కె.వెంకటేశ్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, పీడీ రజిని, సీనియర్ క్రీడాకారులు మణికంఠ, సాగర్, బాలమణి పాల్గొన్నారు. జెన్కోలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆత్మకూర్: ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం తెంగాణ జెన్కో రాష్ట్రస్థాయి క్యారమ్స్, చెస్ పోటీలను హెచ్ఆర్, ఐఆర్ డైరెక్టర్ ఎస్వీ కుమార్ రాజు ప్రారంభించారు. ఆదివారం ఎగువ జూరాలను సందర్శించిన ఆయన విద్యుదుత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు భారీగా వస్తుండడంతో ఉత్పత్తి చేపట్టలేకపోతున్నామని స్థానిక అధికారులు వివరించారు. ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కొత్తగూడెం థర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్ సౌధ, యాదాద్రి, పులిచింతల ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. పోటీలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని, అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు. యువతి అదృశ్యం: కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: యువతి అదృశ్యంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన నాగలక్ష్మి ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. దీంతో ఆదివారం బాధిత కుటుంబసభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యాభర్తలను విడదీశాడన్న అనుమానంతో హత్య
● వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● నిందితుడి అరెస్టు వనపర్తి రూరల్: పాన్గల్ మండల కేంద్రానికి చెందిన ఎనుముల కిష్టయ్య (65) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు తన భార్య తనను విడిచివెళ్లడానికి కిష్టయ్య కారణమనే అనుమానంతో హతమార్చినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం వనపర్తి సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎనుముల కిష్టయ్య గొర్రెల వ్యాపారం చేసుకొని జీవించే వాడు. అయితే అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు, తన భార్య మధ్య కిష్టయ్య గొడవపెట్టడంతోనే తనను విడిచిపెట్టి వెళ్లిందనే అనుమానంతో పాటు ఎలాగైనా బైక్ కొనాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కిష్టయ్యపై పప్పుగుత్తితో దాడిచేసి హతమార్చాడు. అనంతరం కిష్టయ్య జేబులో ఉన్న రూ. 40వే నగదు దోచుకొని.. పప్పుగుత్తిని ఎవరు గుర్తించకుండా మురుగు కాల్వలో పడేశాడు. మృతుడి కుమారుడు ఎనుముల శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం పాన్గల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వసంతపురం రాములును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరం అంగీకరించి.. హత్యకు వినియోగించిన పప్పుగుత్తి కాడ, రక్తపు మరకలు ఉన్న బట్టలను చూయించాడు. నిందితుడిని అరెస్టు చేసి రూ. 34వేలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, పాన్గల్ ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కురుమూర్తి క్షేత్రం.. భక్తజన సంద్రం
● అమావాస్య సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు ● స్వామివారికి ప్రత్యేక పూజలు ● మార్మోగిన గోవింద నామస్మరణ చిన్నచింతకుంట: శ్రావణమాసం చివరి శనివారం, అమావాస్య సందర్భంగా అమ్మాపూర్ కురుమూర్తి స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి.. సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. కొందరు భక్తులు కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారుచేసి స్వామికి సమర్పించారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాలను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో రద్దీగా కనిపించింది. జాతర మైదానంలో ఏర్పాటుచేసిన దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ● కురుమూర్తిస్వామిని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భారతమ్మ, నాగరాజు, భాస్కరాచారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర మైదానంలో భక్తుల జాగరణ -
అనుమతి.. అవిఘ్నమస్తు
కల్వకుర్తి టౌన్: పూజల్లో మొదటి పూజలందుకునే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. కాలనీవారంతా ఒక దగ్గరకు చేరి, కోలాటాలు, బతుకమ్మలు, నృత్యాలు, చిన్నారుల కేరింతలు ఇలా పలు రకాల కార్యక్రమాలతో నవరాత్రులను జరుపుకొనేందుకు చిన్న, పెద్ద తేడా లేకుండా సిద్ధమవుతున్నారు. నవరాత్రుల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా, ఇబ్బందులు కలిగించేవి ఉంటే వెంటనే పరిష్కారం చేయడానికి పోలీస్శాఖ ప్రత్యేక నజర్ పెట్టింది. దీనికి పోలీస్శాఖ ప్రత్యేకంగా ఒక పోర్టల్ను తయారు చేసింది. వినాయక మండపాలను ఆన్లైన్ నమోదు చేయడంతో నవరాత్రుల ప్రారంభోత్సవం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం వరకు తదితర అంశాలను చాలా సులువుగా చేపట్టవచ్చని పోలీస్శాఖ భావిస్తోంది. ఇలా పోలీస్శాఖ అనుమతులే కాకుండా విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి పొందిన అనుమతుల వివరాలను పోర్టల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీస్శాఖ వారు ఆన్లైన్ విధానంపై పలుమార్లు నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. ● వినాయక మండపాలకు ఆన్లైన్ తప్పనిసరి వివరాల నమోదుకు పోలీస్శాఖ ప్రత్యేక పోర్టల్ నిర్వాహకుడి సమాచారం, మండపం వివరాలు నమోదు అన్నిశాఖల అధికారుల సమన్వయానికి దోహదం నాలుగు రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం -
జూరాలకు వరద జోరు
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద పెరుగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం 3.55 లక్షల క్యూసెక్కులు ఉండగా.. శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో మరింత పెరిగి 4.08 లక్షలకు చేరిందని వివరించారు. ఈ సీజన్లో ఇంత పెద్దమొత్తంలో వరద రావడం ఇదే మొదటిసారి అన్నారు. దీంతో ప్రాజెక్టు 44 క్రస్ట్గేట్లు పైకెత్తి 4,16,629 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆవిరి రూపంలో 40 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 470 క్యూసెక్కులు వదిలినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.622 టీఎంసీలు ఉందన్నారు. నిలిచిన విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరద భారీగా చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో శనివారం ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టు 44 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
కర్ణాటకకు తరలుతున్న ఎరువుల పట్టివేత
గట్టు: మండల పరిధిలోని బల్గెర చెక్పోస్టు వద్ద అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న ఎరువులను శనివారం మార్కెట్ కమిటీ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. కర్ణాటక రైతులు మల్దకల్ మండలంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో 27 యూరియా, 49 కాంపెక్స్ ఎరువుల బస్తాలు కొనుగోలు చేసి వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రశీదులను పరిశీలించి తరలింపునకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు తిమ్మాజిపేట: మండలంలోని పోతిరెడ్డిపల్లిలో శనివారం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తున్న పుట్టగళ్ల హన్మంతుపై దాడి చేసి ముఖంపై కరిచింది. అనంతరం ఆంజనేయ ఆలయ సమీపంలో గొర్రెల దొడ్డి వద్ద ఆరుబయట ఉన్న బాలయ్య, ఆయన మనుమరాలిపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం తిమ్మాజిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోయే వరకు కుక్క ఆచూకీ దొరకలేదని, ఇంకా ఎంతమందిని కరుస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి నాగర్కర్నూల్ క్రైం: పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తాడూరు మండలం చర్లతిర్మలాపూర్కు చెందిన మణెమ్మ (31) భర్త మృతి చెందడంతో పుర పరిధిలోని ఉయ్యాలవాడలో తండ్రి వద్ద ఉండి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండేది. వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై ఈ నెల 17న ఇంట్లో పురుగుమందు తాగింది. గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం అటు నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. తండ్రి బుచ్చన్న ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. వ్యక్తి బలవన్మరణం కోడేరు: పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆది బాలరాజు (40) శుక్రవారం పురుగుమందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య మధులత గతంలోనే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చోరీ నిందితుడి అరెస్టు అచ్చంపేట రూరల్: ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని అచ్చంపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్ఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల కిందట పట్టణంలో పట్టపగలే ఇళ్లలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడి బంగారు, వెండి, నగదును ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం గ్రామానికి చెందిన గంగాధర్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారు, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్టు
నాగర్కర్నూల్ క్రైం: జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు బైక్లు, ఒక ఆటోను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం నాగర్కర్నూల్ సర్కిల్ పోలీసు కార్యాలయంలో సీఐ అశోక్రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావికి చెందిన శాగాది యుగంధర్, జిల్లా కేంద్రంలోని వినోబానగర్ కాలనీకి చెందిన వేపూరి నీలాంబర్ స్నేహితులు. ఇరువురు జల్సాలకు అలవాటుపడి హైదరాబాద్, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 29న జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడంతో.. బాధితుడు ఈ నెల 1న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శాగాది యుగందర్, వేపూరి నీలాంబర్లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో వారిని విచారించడంతో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు నేరం అంగీకరించారు. నిందితుల నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, వనస్థలీపురం, మేడిపల్లి పోలిస్టేషన్తో పాటు నాగర్కర్నూల్, కల్వకుర్తి పోలిస్స్టేషన్ పరిధిలో చోరీకి గురైన నాలుగు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను రికవరీ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గోవర్ధన్, పట్టణ రెండో ఎస్ఐ వినోద్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు వెంకటేశ్, రమేశ్, భీముడు ఉన్నారు. 4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో రికవరీ -
వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిబి.పాపిరెడ్డి పాలమూరు: సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్లో భారీస్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కక్షిదారులకు నోటీసులు అందజేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి వెల్లడించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో శనివారం అన్ని రకాల కోర్టుల న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, ఏపీపీఓలు, ఇన్సూరెన్స్ ప్యానల్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, డ్రంక్అండ్డ్రైవ్, ఈపెట్టీ, ఎంవీఓపీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు అధికంగా రాజీ అయ్యే విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న కక్షిదారులకు నోటీసులు అందజేసి లోక్ అదాలత్కు తప్పక హాజరయ్యే విధంగా కృషి చేయాలన్నారు. బీమా కంపెనీల నిర్వాహకులు, బ్యాంకు అధికారులు సైతం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు గుర్తించి సదరు కక్షిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు శారదాదేవి, ఇందిర, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, సీఐలు, ఇన్సూరెన్స్ కంపెనీల సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎర్ర సూరీడుకి జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులోసురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నగ్రామస్తులు అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. సొంతూరిపై మమకారం.. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. నిరాడంబర జీవనం ఆయన ప్రత్యేకత.. సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. -
ఉత్సాహంగా ఈశా గ్రామోత్సవం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం 17వ ఈశా గ్రామోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పాలమూరులో మూ డోసారి గ్రామోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈశా ఫౌండేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పురుషుల వాలీబాల్ పోటీల్లో 22 జట్లు పాల్గొన్నాయి. పోటీల ప్రారంభోత్సవంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ● గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. క్రీడలతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఇలాంటి క్రీడాపోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని ప్రతిభచాటి జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతినిధులు మాట్లాడుతూ 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయడానికి ఉద్దేశించినదని అన్నారు. క్లస్టర్ (జిల్లాస్థాయి), డివిజనల్ (రాష్ట్రస్థాయి), ఫైనల్ (దక్షిణభారత దేశ రాష్ట్రాల పోటీ) మూడు దశల్లో మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. ప్రతిస్థాయిలో మొదటి నాలుగుస్థాయిల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన నుపుర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ బృందం చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. వాలీబాల్లో తలపడుతున్న క్రీడాకారులు -
సీపీఎస్ రద్దు కోసం ఉద్యమం ఉధృతం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి అన్నారు. జీఓ 28కి వ్యతిరేకంగా సీపీఎస్ ఉద్యోగులు బ్లాక్ డే నిర్వహించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నీటి పారుదల కార్యాలయాల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జీఓ 28 ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసే వరకు ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్జీఓ సీపీఎస్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ మాట్లాడుతూ జీఓ 28కి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెద్ద ఎత్తున బ్లాక్డే దినంగా పాటించి నిరసన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం జీఓ 28ని తెచ్చిందని ఆరోపించారు. సీపీఎస్తో ఉద్యోగులకు ఎలాంటి భద్రతలేదన్నారు. పెన్షన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అని అలాంటి హక్కును ఉద్యోగికి లేకపోవడం దుర్మార్గమన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేదాక పోరాటం చేస్తామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ విజయేందిరకు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ వెంకటేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, నాయకులు మల్లేష్, ఇనాయత్, కృష్ణారెడ్డి, రామానాయుడు, వెంకటేశ్, బాల్రాజు, లక్ష్మయ్య, విజయ్, భాస్కర్, శ్రీనివాస్రావు, కుర్మయ్య శాంసన్, ప్రియాంక, నీలిమ, ఖరేషీ, అశోక్, సయ్యద్, శేఖర్, శ్రీనివాస్రెడ్డి , తదితరులు పాల్గొన్నారు. -
శాంతియుత వాతావరణంలో పండుగలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): శాంతియుత, ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయి సహాయసహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు ,శోభాయాత్ర నిర్వహించే వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న నిమజ్జనం, వచ్చే నెల 5 లేదా 6వ తేదీల్లో నిర్వహించే మిలాద్–ఉన్–నబీ వేడుకలకు భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీలతో కూడిన అధికారుల కమిటీ పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. నిమజ్జనం చేసే ప్రాంతాల వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు విధులు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది పంచాయతీలు, నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్–బీ అధికారులు క్రేన్ ఏర్పాటు చేయాలని, మండపాల నిర్వాహకులు మండపాల వద్ద తడి, పొడి చెత్త సేకరణకు డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రథమ చికిత్స, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనానికి విగ్రహాల తరలింపు కోసం వాహనాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద మత్స్యశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ● ఎస్పీ జానకి మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్ https:police portal.tspolice.gov.in/indes.htm సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పోలీస్శాఖ తరఫున తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంటపాల వివరాలను ట్రాన్స్కో అధికారులకు తెలియజేసి, ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయించుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినాయక మంటపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజే సౌండ్లను వినియోగించవద్దని సూచించారు. మండపాల వద్ద భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మట్టి విగ్రహాల వాడకంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఏనుగు నరసింహారెడ్డి, ఏఎస్పీ రత్నం, డీపీఓ పార్థసారథి, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి, వీహెచ్పీ అధ్యక్షుడు యాదిరెడ్డి, ఎంఐఎం అధ్యక్షులు హాదీ, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ ప్రశాంతంగా జరుపుకోవాలి నిర్వాహకులు, ప్రజలు పూర్తిగా సహకరించాలి శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయేందిర మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ జానకి -
సాగులో మెళకువలుచెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు అన్యోన్యంగా ఉండేవారు.. సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యువతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ -
జూరాలకు 3.55లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 34 క్రస్టు గేట్ల ఎత్తివేత ● దిగువకు 3.50లక్షల క్యూసెక్కులు ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం రాత్రి 7.30 గంటల వరకు 3.55లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 34 క్రస్టు గేట్లను ఎత్తి 3.49 లక్షల క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 37 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.431 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండో రోజు జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్కు పెరిగిన ఇన్ఫ్లో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 97.277 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2.11లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.658 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2.61లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువన ఉన్న జూరాలకు 30 గేట్లను ఎత్తి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పరుగుల పెడుతున్న వరద -
ఉరేసుకొని ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
● భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం జడ్చర్ల: సంసారం విషయంలో వచ్చిన ఓ చిన్న గొడవ ఉపాధ్యాయురాలి బలవన్మరణానికి దారి తీసిన ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వట్టెం తండాకు చెందిన ముడావత్ పూర్ణ (40) మండల పరిధిలోని నసరుల్లాబాద్లోని పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుంది. ఆమె భర్త రమావత్ బోప్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వారు ముగ్గురు పిల్లలతో కలిసి స్థానిక గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలు గురువారం గొడవ పడ్డారు. శుక్రవారం భర్త బోప్య యథావిధిగా విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ సాయివంశీ కాలనీలో నివాసం ఉంటున్న తన బావమరిది ముడావత్ గణేష్కు ఫోన్చేసి మీ అక్కతో వాగ్వాదం జరిగింది. ఇంటికి వెళ్లి విచారించమని చెప్పాడు. ఇంటికి వెళ్లిన గణేష్ తలుపు తీయకపోవడంతో తలుపు పగులగొట్టి చూడగా పూర్ణ బెడ్రూంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకొని ఉంది. గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇసీ్త్ర చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ● చికిత్స పొందుతూ మహిళ మృతి మరికల్: దుస్తులను ఇసీ్త్ర చేస్తుండగా.. షార్ట్సర్క్యూట్ రావడంతో మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అప్పంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన సంజనోళ్ల అనంతమ్మ(59) ఇంట్లో దుస్తులను ఇసీ్త్ర చేస్తుండగా.. ఆకస్మాతుగా ఇసీ్త్ర పెట్టెకు షార్ట్ సర్క్యూట్ రావడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మరికల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొదుంతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తే ఉన్నారు. మతిస్థిమితం లేని మహిళ దాడిలో వృద్ధుడి మృతి ఊర్కొండ: మతిస్థిమితం లేని మహిళ దాడిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని రాంరెడ్డిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన జమ్ముల లక్ష్మీదేవమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో భర్త ఇదివరకే వదిలిపెట్టడంతో ఆమె తల్లివద్దనే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు భర్త వద్దే హైదరాబాద్లో ఉంటున్నారు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన గుర్రంపల్లి రాములు(65)కావలికారు(వీఆర్ఏ)గా విధులు నిర్వహిస్తున్నాడు. కిరాణం షాపు వద్దకు వెళ్లి మహిళ ఇంటిముందు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా లక్ష్మీదేవమ్మ మాటలు కలిపి మాట్లాడుతూ.. వెంట తెచ్చుకున్న కట్టెతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే కల్వకుర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శుక్రవారం ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ నాగార్జున పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి నవాబుపేట: చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాకర్జాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కాకర్జాల్కు చెందిన గుర్రంపల్లి చెన్నయ్య(35) బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెన్నయ్య భార్య స్వప్న ఉడిత్యాల్ శివారులో కూలి పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఉన్న చెన్నయ్య కూమార్తె తండ్రి ఇంటికి రాలేదని రాత్రి తన తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చింది. చుట్టు పక్కల వెతకగా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో చెన్నయ్య శవం నీటిపై తేలడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి ఇటిక్యాల: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవినాయక్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చాగాపురానికి చెందిన గోల్ల శేఖర్(వీరేష్, 26) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జూలై 28న తల్లి చిన్నక్కను మద్యం తాగడానికి డబ్బులు అడగ్గా ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శుక్రవారం మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
శాంతిభద్రతల కోసమే కార్డెన్ సెర్చ్
కొత్తకోట రూరల్: శాంతిభద్రత, నేరాల నియంత్రణను కట్టుదిట్టం చేసేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు అన్నారు. కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్ఐ ఆనంద్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారు జామున కొత్తకోట పట్టణంలోని విద్యానగర్, శాంతినగర్, ఎన్టీఆర్ కాలనీల్లో 70 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని 50 బైక్లు, డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు గొడవలు, అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఇళ్ల యజమానులు తప్పనిసరిగా అద్దెకు ఉంటున్న వారి వివరాలను సేకరించి పోలీసులకు అందజేయాలని సూచించారు. అపరిచితులు, అనుమానాస్పదంగా కాలనీల్లో కనిపిస్తే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్ఐలు శివకుమార్, రామకృష్ణ, జయన్న, భాస్కర్, ఏఎస్ఐలు రోశయ్య, మన్నెపురెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ చిరుత కలకలం
గండేడ్: ఐదు రోజుల క్రితం స్థానికంగా కలకలం రేపిన చిరుత తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. శుక్రవారం చిరుత రోడ్డు దాటుతూ వాహనదారుడికి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అఽధికారులు మరో మారు చిరుత జాడ కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గత్ప నరేష్ మంగళవారం సాయంత్రం బైక్పై రంగారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి వస్తుండగా చింతగుట్టకు వెళ్లే దారి వద్ద చిరుత అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు దూకింది. అదే సమయంలో బైక్పై అక్కడికి చేరుకున్న నరేష్ ఎడమ చేతికి చిరుత కాలు తగలడంతో గాయం అయ్యింది. అప్పట్లో విషయం తెలుసుకున్న ఫారెస్టు డిప్యూటీ రేంజర్ రాఘవేంద్ర చిరుత రోడ్డు దాటిన ప్రదేశాన్ని సందర్శించి, పరిసరాలను పరిశీలించాడు. అయినా చిరుత ఆచూకీ దొరకలేదు. ఇది మూడోసారి.. లింగాయిపల్లి ప్రాంతంలో గతంలో కూడా చిరుత సంచరించిందన్న వార్తల నేపథ్యంలో సమీప గ్రామాలైన రంగారెడ్డిపల్లి, సల్కర్పేట్, వెన్నాచేడ్, లింగాయిపల్లి వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇదే ప్రాంతంలో తిరిగి మూడోసారి కనిపించడంతో గొర్రెల, మేకల, పశువుల కాపరులతో పాటు పొలాలకు వెళ్లేవారు జంకుతున్నారు. ఐదో రోజు తిరిగి ప్రత్యక్షం ఐదు రోజుల తర్వాత చిరుత మళ్లీ కంటపడడం కలకలం రేపింది. మండలంలోని రంగారెడ్డిపల్లికి చెందిన రాజేందర్ శుక్రవారం ఉదయం 7:30 గంటలకు దాదాపూర్ వెళ్లడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు లింగాయిపల్లి గేటు దాటి కొద్ది దూరం వెళ్లగా చిరుత రోడ్డు దాటుతూ బూకలి నర్సింలు మామిడితోటలోకి వెళ్లడాన్ని గమనించి, తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. చిరుత రోడ్డు దాటిన ప్రదేశానికి కొద్ది దూరంలో గొర్రెల మంద ఆపారు. మందకు కాపలాగా ఉన్న వెన్నాచేడ్ రాజు కుమార్తె భయంతో చెట్టు ఎక్కి కూర్చుంది. తర్వాత తండ్రి వచ్చాక కిందికి దిగి ఇంటికి వెళ్లిపోయింది. లింగాయిపల్లి గేటు వద్ద రోడ్డు దాటిన వైనం భయంతో వెనుదిరిగిన వాహనదారుడు పరిసరాలను పరిశీలించిన అటవీ అఽధికారి -
25లీటర్ల ఆర్మీ మద్యం బాటిల్స్ సీజ్
మహబూబ్నగర్ క్రైం: విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల నుంచి తక్కువ ధరకు మద్యం బాటిల్స్ విక్రయించి.. వినియోగదారులకు అధిక ధరకు విక్రయించే ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధాకర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలోని వందన విహార్ అపార్ట్మెంట్లో నివాసముండే సుదర్శన్రెడ్డి కొన్నిరోజుల నుంచి విశ్రాంత ఆర్మీ అధికారులు, సిబ్బంది వద్ద తక్కువ ధరకు మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి మార్కెట్లో అవసరమున్న వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో శుక్రవారం అతని ఇల్లు తనిఖీ చేయగా.. 33డిఫెన్స్ మద్యం బాటిల్స్ దాదాపు 25లీటర్లు లభ్యం కాగా.. వాటిన సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.90వేల వరకు ఉంటుందని తెలిపారు. సుదర్శన్రెడ్డిపై రెండునెలల నుంచి నిఘా పెట్టామని, అతను కొందరు ఆర్మీ ఉద్యోగులు ఆర్మీ క్యాంటీన్లో మద్యం వినియోగించుకోకుండా తమ కోటాలో వచ్చిన మద్యం బాటిళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారులకు గుట్టుగా సరఫరా చేస్తున్నాడని వెల్లడించారు. ఇకపై ఆర్మీ ఉద్యోగులపై అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టణంలో కొందరు నిర్వహించే ఫంక్షన్స్, పార్టీల్లో డిఫెన్స్ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలిందని, ఇలాంటి సందర్భాల్లో పట్టుబడితే ఫంక్షన్ హాలు నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఫెన్స్ మద్యం లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే 8712658872కు తెలియజేయాలని పేర్కొన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ కవిత, ఎస్ఐ రాజేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరులో గుట్టుగా దందా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు -
మరణంలోనూ వీడని స్నేహం
మహమ్మదాబాద్: మండలంలోని చౌదర్పల్లికి చెందిన కావలి భీమయ్య (55), గోగుల చెన్నయ్య (56) స్నేహితులు. ఇద్దరూ ఈ ప్రాంతంలోని బలభీమరాయ ఆంజనేయ భజన భక్తమండలి సభ్యులుగా ఉంటూ శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో నిత్యభజన కార్యక్రమంలో పాల్గొనే వారు. చివరి శనివారం తిరుమలలో అఖండ భజన చేయడానికి అవకాశం రావడంతో 14 మంది భక్తులు తుఫాన్ వాహనంలో గురువారం బయలుదేరారు. మార్గమధ్యంలో భీమయ్యకు గుండెపోటు రావడంతో కోవెలకుంట్లలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో వారంతా మృతదేహంలో వెనుదిరిగి శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో స్వగ్రామానికి చేరుకున్నారు. ఉదయం అంత్యక్రియలకు సామగ్రి తీసుకొచ్చేందుకు చెన్నయ్య బైక్పై మహమ్మదాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో కమతం రాంరెడ్డి తోట దగ్గర ప్రమాదవశాత్తు రహదారి పక్కనున్న రాతి కడీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు మిత్రులు ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమయ్య అంత్యక్రియలు పూర్తికాగా.. పోస్టుమార్టం అనంతరం శనివారం చెన్నయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఆయా కుటుంబాలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరామర్శించారు. చెన్నయ్య (ఫైల్) భీమయ్య (ఫైల్) గుండెపోటుతో ఒకరు.. రోడ్డు ప్రమాదంతో మరొకరు... -
యువకుడి ఆత్మహత్యాయత్నం
గండేడ్: విద్యుత్ సరఫరాను సకాలంలో పునరుద్ధరించలేదంటూ ఓ వ్యక్తి సబ్స్టేషన్ ఎదుట గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పల్లె సోమభూపాల్రెడ్డి వ్యవసాయంతో పాటు గ్రామంలో నీటిశుద్ధి కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రూ.24 వేల విద్యుత్ బిల్లు బకాయి ఉండటంతో చెల్లించాలంటూ గురువారం లైన్మేన్ మన్నాజీ ఫోన్ చేశారు. మహబూబ్నగర్లో ఉన్నానని శుక్రవారం చెల్లిస్తానని తెలుపగా వినకుండా సిబ్బందితో కనెక్షన్ తొలగించారు. దీంతో చేసేది లేక శుక్రవారం 10.30 ప్రాంతంలో సల్కర్పేట్ సబ్స్టేషన్కు వెళ్లి బిల్లు చెల్లించి కనెక్షన్ పునరుద్ధరించాలని కోరారు. అందుకు లైన్మేన్ నిరాకరించి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని చెప్పారు. దీంతో మరోమారు సబ్స్టేషన్కు వెళ్లి ఏఈ శ్రీకాంత్ను కలిసి తన సమస్యను వివరించారు. ఏఈ లైన్మెన్ను పిలిచి మాట్లాడినా కలెక్షన్లో ఉన్నాం.. రెండు గంటలకు ఇస్తామని బదులివ్వడంతో తనను వేధిస్తున్నారంటూ సోమభూపాల్రెడ్డి బైక్లో తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును వారి ఎదుట తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న ఆపరేటర్ హరినాయక్ అడ్డుకోవడంతో డబ్బా కిందపడింది. వెంటనే దాన్ని తిరిగి తీసుకొని రోడ్డు మీదకు పరిగెత్తి తాగేశాడు. గుర్తించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఏఈ శ్రీకాంత్ని వివరణ కోరగా విచారణ చేసి లైన్మేన్ నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎరువులు, యూరియా పట్టివేత
నారాయణపేట: నారాయణపేట పోలీస్స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో యూరియా, వివిధ రకాల ఎరువుల బస్తాలు పట్టుబడ్డాయని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. నారాయణపేట నుంచి వివిధ ఫర్టిలైజర్ దుకాణాలలో యూరియా వివిధ రకాల ఎరువుల బస్తాలను కర్ణాటకకు చెందిన రైతులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న సమయంలో జలాల్పూర్ చెక్పోస్టు దగ్గర వాహనాల తనిఖీల్లో రెండు కమాండర్లు, ఒక ఆటోలో మొత్తం 34 బస్తాలలో యూరియా ఇతర ఎరువులను పట్టుకొని పోలీస్స్టేషన్ తరలించామన్నారు. వారిని విచారించగా కర్ణాటక చెందిన కొంత మంది రైతులు నారాయణపేటలోని షాపులలో కొనుగోలు చేసి వ్యవసాయ పనుల నిమిత్తం తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎంఏఓ బాలదినాకర్, ఏఈఓ అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
హర్రర్, కామెడీ జానర్లోనే ‘అవంతిక–2’
జడ్చర్ల టౌన్: ఒక్కో దర్శకుడికి ఒక్కో జానర్ అంటే ఇష్టమని, తనకు హర్రర్, కామెడీ జానర్ అంటే ఇష్టమని నటుడు, దర్శకుడు శ్రీరాజ్ భళ్ల పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని బాదేపల్లి పెద్దగుట్టపై రంగనాయక స్వామి ఆలయంలో అవంతిక–2 సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసింహాపురం రివేంజ్, అవంతిక హారర్ కామెడీ జానర్లో తీశామన్నారు. అవంతిక–2 సినిమాను కూడా హారర్ కామెడీ జానర్లోనే తీస్తున్నామన్నారు. రాంగోపాల్వర్మతో అన్నమయ్య సినిమా ఊహించలేమని, అలాగే రాఘవేంద్రరావుతో హారర్ సినిమా ఆశించలేమన్నారు. బలగం లాంటి సినిమా వేణుతోనే సాధ్యమైందని, అలాంటి జానర్లు తాను తీయలేనన్నారు. అందుకే హారర్ కామెడీ సినిమాలు తీస్తున్నామన్నారు. బాదేపల్లికి చెందిన ఫణిరాజ్తో పదేళ్ల ప్రయాణం కొనసాగుతుందని, అవంతికలో క్షుద్రపూజలు, మూఢనమ్మకాల గురించి తీశామని, అవంతిక కథ ఇప్పుడే బయటపెట్టమన్నారు. ఈ సినిమాకు ఫణిరాజ్ క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారని, గీతాంజలి హీరోయిన్గా, రామకృష్ణశాస్త్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ప్రాంత నటులకు ప్రాధాన్యత జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లాలో అనేకమంది ప్రతిభగల నటులున్నారని, వారిలో కొందరికై నా అవకాశం కల్పించాలన్న పట్టుదలతో ఫణిరాజ్ ఉన్నారని, అందుకు త్వరలోనే అడీషన్స్ నిర్వహిస్తామన్నారు. హీరోయిన్ గీతాంజలి మాట్లాడుతూ.. అవంతిక 2 సినిమా సక్సెస్ కావాలని కోరుకుంది. గత సినిమాల షూటింగ్ ఇక్కడ జరగగా తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందన్నారు. అవంతిక–2తోపాటు మరో 3సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ఔత్సాహికులకు సహకారం ప్రతిభ ఉన్న నటులు, ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తామని అవంతిక 2 టీం ప్రకటించడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా గొప్ప విజయం సాధించి జడ్చర్లకు పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. రంగనాయకస్వామి ఆలయంలో పూజలు అవంతిక 2 సినిమా స్క్రిప్ట్ను లక్ష్మీసమేత రంగనాయకస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం హీరో, హీరోయిన్పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి క్లాప్కొట్టి సినిమాను ప్రారంభించారు. కార్యక్రమంలో సినిమా క్రియేటివ్ డైరెక్టర్ ఫణిరాజ్గౌడ్, ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాల్వరాంరెడ్డి, వార్డుకౌన్సిలర్లు రఘురాంగౌడ్, ప్రశాంత్రెడ్డి, దేవా, ఉమాశంకర్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. సినీ నటుడు, దర్శకుడు శ్రీరాజ్భళ్ల పెద్దగుట్టపై సినిమా షూటింగ్ ప్రారంభం క్లాప్కొట్టి కొట్టి ప్రారంభించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి -
గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి
స్టేషన్ మహబూబ్నగర్: గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని గణేష్భవన్లో శుక్రవారం గణేష్ ఉత్సవ సమితి, మండపాల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటిల్లిపాదిని ఈ ఉత్సవాల్లో భాగం చేయాలని కోరారు. మహిళల చేత లలిత సహస్రనామ పారాయణం, చిన్నారుల చేత హనుమాన్ చాలీసా పఠనం, రామాయణ, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు చేయాలన్నారు. హైందవ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు జరపాలన్నారు. కాలనీల్లో ఉండే చిన్నారులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగం చేస్తూ భగవద్గీత, రామాయణం శ్లోకాల పోటీలు నిర్వహించాలని అన్నారు. నిమజ్జనం రోజు వీలైనంత త్వరగా గడియారం చౌరస్తా వద్దకు ఊరేగింపుగా రావాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్గౌడ్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు మనోహర్, ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు యాదిరెడ్డి, బాలయ్య, లక్ష్మణ్, విఘ్నేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేక్కట్ చేసి కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మైనర్ డ్రైవింగ్ కట్టడికి చర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో మైనర్ డ్రైవింగ్ సమస్యలను అరికట్టడానికి తల్లిదండ్రులకు విస్తతంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం భరోసా, షీటీం, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి మైనర్ డ్రైవింగ్ తగ్గించాలన్నారు. విద్యార్థినులు, అమ్మాయిల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈవ్టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గృహహింస, మహిళలపై దాడులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో సీఐడీ ఎస్పీ అన్యోన్య, ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు లక్ష్మణ్, శ్రీనివాసులు, ఎస్ఐ సుజాత పాల్గొన్నారు. -
పోరాట యోధుడు సురవరం
స్వగ్రామం కంచుపాడు.. సురవరం సుధాకర్రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో మార్చి 25, 1942 సంవత్సరంలో జన్మించారు. సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు సుధాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పుష్పలత నలుగురు సంతానం. కాగా అందరిలో పెద్దవాడైన సుధాకర్రెడ్డి విద్యాభ్యాసం కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ, ఉస్మానియా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. 1974 ఫిబ్రవరి 14న వివాహం కాగా.. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చికిత్స పొందుతూహైదరాబాద్లో కన్నుమూత దేశ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించిన నేత మూడుసార్లు సీపీఐ జాతీయకార్యదర్శిగా ఎన్నిక నల్లగొండ నుంచిరెండుసార్లు ఎంపీగా సేవలు స్వగ్రామం కంచుపాడులోవిషాదఛాయలు -
‘పనుల జాతర’ ముమ్మరం చేయండి
జడ్చర్ల: ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పనులను ముమ్మరంగా చేపట్టి పూర్తిచేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం మండలంలోని పోచమ్మగండతండాలో చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.12 వేలతో నిర్మించే ఇంకుడు గుంత నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ తదితర నిధుల కింద చేపట్టే వాటిని పనుల జాతరలో పూర్తిచేయాలని, నిర్ణీత లక్ష్యాలను సాధించే దిశగా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే హార్టికల్చర్ కింద సాగు చేసే కొబ్బరి మొక్కలను సంబంధిత రైతుకు అందజేశారు. వంద రోజుల కూలీ పూర్తి చేసుకున్న ఉపాధి హామీ పథకం కూలీ ఎనావత్ రాములుతోపాటు గ్రామ పంచాయతీ కార్మికుడిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఆమె మండలంలోని గంగాపూర్ పీహెచ్సీని సందర్శించారు. పారిశుధ్య సమస్యలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జడ్చర– గంగాపూర్ ప్రధాన రహదారిని అనుసరించి జడ్చర్ల మున్సిపాలిటీ చెత్తాచెదారం పారబోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ అధికారులు పరసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలకు కారణమైన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయా లన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి అక్కడికి చేరుకుని చర్యలకు ఉపక్రమించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్కుమార్, ఏపీఎం సరోజ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు చికెన్ భోజనం కంటే పరిహారమే ముఖ్యం కదా?
జడ్చర్ల టౌన్: భూ నిర్వాసితులకు చికెన్ భోజనం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారని, మా నిర్వాసితులకు చికెన్ భోజనం కన్నా పరిహారం పెంపు ముఖ్యమనేది విస్మరించారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ బాధితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ఇంటి నిర్మాణం కోసం రూ.16 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ గ్రామ సమీపంలో నిర్వాసితులకు పెట్టిన చికెన్ భోజనం కోసం రూ.9 లక్షలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. శుక్రవారం బాదేపల్లి పెద్దగుట్టపై విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఎక్కడా లేని విధంగా ఇంటి నిర్మాణం కోసం 300 గజాలు కేటాయించేలా స్థల ఎంపిక సైతం చేశామని గుర్తుచేశారు. కొన్నాళ్ల కిందట నిర్వాసితులు ఆందోళన చేస్తుంటే వెళ్లి ఆరు నెలల్లో రూ.16 లక్షలకు బదులుగా రూ.25 లక్షలు ఇప్పిస్తానని, లేకపోతే తాను సైతం ధర్నాలో పాల్గొంటానని చెప్పి ఆందోళన విరమింపజేసిన ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయని, గెలిచి రెండేళ్లు కావొస్తున్నా పనులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ఇచ్చిన హమీలను నిలబెట్టుకోకపోగా.. అసమర్థుడిగా పనులు చేయలేక ఇతరులపై ఆరోపణలు, నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ యాదయ్య, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులిచ్చిన తదుపరి చర్యలు
పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మికంగా గతంలో తనిఖీలు నిర్వహించి.. వసతులు, నిబంధనలు పాటించని మొత్తం 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చాం. వారు సమాధానం ఇస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీ కళాశాలలపై కూడా ర్యాటిఫికేషన్, అప్లియేషన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సెయింట్ మేరీస్ కళాశాలపై చర్యల్లో భాగంగా 50 శాతం సీట్లను కుదించాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ తనిఖీలు చేపట్టాం.. గతంలో మొదటిసారి తనిఖీలు నిర్వహించిన క్రమంలో కళాశాలల్లో లేని వసతులపై రిమార్కులు కళాశాలల వారికి చూపించాం. మార్పులు లేనందుకు మరోసారి వీసీ నేరుగా తనిఖీలు చేసి.. వసతులు లేని 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. గతంతో పోల్చితే తనిఖీలు మెరుగుపడ్డాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ● -
భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలివ్వాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నారాయణపేట: పేట–కొడంగల్ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నా రు. శుక్రవారం నారాయణపేట మండలంలోని పేరపళ్లలో రిజర్వాయర్లో మునుగుతున్న పంట పొలాలను ఆయన పరిశీలన చేశారు. భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తన తన సొంత నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు అతి తక్కువ పరిహారం ఇస్తూ అన్యాయం చేయొద్దని హితవు పలికారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, బలవంతంగా కాకుండా భూయజమానుల సమ్మతి మేరకే భూములను సేకరించాలని కోరారు. నెల రోజులుగా భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నేటికీ స్పష్టంగా పరిహారాన్ని ప్రకటించకపోవడం ఏమిటని ప్రవ్నించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, వెంకట్రాములు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం అందించినప్పుడే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. భూ నిర్వాసితుల పక్షాన సీపీఎం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేస్తుందని చెప్పారు. -
విద్యార్థి దశలోనే అవగాహన ఉండాలి
పాలమూరు: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్లో వాటి అవసరాలు ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. కోయిలకొండలోని కేజీబీవీ, చింతల్తండాలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన హక్కుల పరిరక్షణ పథకం–2015పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత బాల కార్మిక చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. చిన్నారులు ప్రతి ఒక్కరిని చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని, విద్య హక్కు చట్టం ప్రాధాన్యతపై చైతన్యం చేశారు. అనంతరం విద్యార్థులకు పోక్సో, బాలల హక్కులు, చట్టాలు, న్యాయ సేవా సంస్థ విధుల గురించి చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ తిరుపాజీ, ఎంఈఓ వెంకట్జీ, కేజీబీవీ ప్రత్యేకాధికారి హారిక, పంచాయతీ కార్యదర్శి నరేష్, శివరాం, సత్తయ్య పాల్గొన్నారు. కోయిల్సాగర్ గేట్ల మూసివేత దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఉదయం నుంచి మూసివేశారు. గురువారం రెండు గేట్లను తెరిచి నీటిని వదిలిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి పెద్ద వాగు ప్రవాహం తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మెప్మా పీడీగా యూసుఫ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మెప్మా పీడీగా నియమితులైన మహమ్మద్ యూసుఫ్ శుక్రవారం ఇక్కడ విధుల్లో చేరారు. హైదరాబాద్కి చెందిన ఈయన గతంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రత్యేక గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. సుమారు రెండు నెలలుగా వెయిటింగ్ లిస్టులో ఉండగా.. ప్రస్తుతం మహబూబ్నగర్కు వచ్చారు. అంతరాష్ట్ర ప్రయాణికులకు రాయితీతో చార్జీలు స్టేషన్ మహబూబ్నగర్: హైదరాబాద్ నుంచి కర్నూలు, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి ఆర్టీసీ బస్సుల్లో 15 శాతం రాయితీతో కూడిన చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ఆయన కోరారు. హైదరాబాద్–కర్నూలు మధ్య సూపర్ లగ్జరీ పాతచార్జి రూ.450 ఉండగా.. రాయితీతో రూ.390, డీలక్స్ బస్సుకు పాత చార్జి రూ.390 ఉండగా.. రాయితీతో రూ.350, హైదరాబాద్–తిరుపతి మధ్య సూపర్ లగ్జరీ రూ.1,090 కాగా.. రాయితీతో రూ.950 ఉంటుందన్నారు. ఆగస్టులో రూ.3.50 కోట్ల రుణాలిచ్చాం : డీసీసీబీ వనపర్తి: జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకు పరిధిలోని ఆరు పీఏసీఎస్ల పరిధిలో ఉన్న రైతులకు ఆగస్టులో వివిధ రకాల రుణాలు రూ.3.50 కోట్లు అందజేసినట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పలువురు లబ్ధిదారులకు కర్షకమిత్ర చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పాడి పశువుల పోషణ, ఇతర వ్యాపారాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రెండు ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కర్షక మిత్ర పథకంలో భాగంగా రుణ చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నాగవరం పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రాజనగరం పీఏసీఎస్ చైర్మన్ రఘువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కార్మికుల పక్షాన పోరాడుతం
● 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ ● ట్రాన్స్కో రీజినల్(ఉమ్మడి జిల్లా) అధ్యక్షుడిగా రఘువీర్రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ కార్మికుల పక్షాన యూనియన్లు నిరంతరం పోరాటం చేయాలని విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ అన్నారు. గురువారం స్థానిక యూనియన్ కార్యాయలంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వారి తరఫున పోరాటం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన రోజే యూనియన్లకు మనుగడ ఉంటుందన్నారు. అనంతరం ట్రాన్స్కో రిజినల్(ఉమ్మడి జిల్లా)కమిటీని ఎన్నుకున్నారు. ట్రాన్స్కో రిజినల్(ఉమ్మడి జిల్లా) జిల్లా అధ్యక్షుడిగా రఘువీర్రెడ్డి, రీజినల్ సెక్రటరీగా రాఘవేందర్గౌడ్, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జితేందర్రెడ్డి, రీజనల్ అడిషనల్ సెక్రటరీగా స్వామిగౌడ్, రీజినల్ ఉపాధ్యక్షులుగా స్వాతి, శివకుమార్, రీజినల్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సీహెచ్ చెన్నయ్య, ఎండీ ఇక్బాల్, రీజినల్ అసిస్టెంట్ సెక్రెటరీగా సత్యనారాయణ, రీజినల్ ట్రెజరర్గా ఎండీ మక్సూద్అలీ ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్శాఖ ఉద్యోగులు, కార్మికులకు తాము అండగా ఉంటామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి
లింగాల: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వల్లభాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ తెలిపిన వివరాలిలా.. వల్లభాపూర్కు చెందిన పిట్టల లక్ష్మయ్య(65) ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, గురువారం గ్రామ శివారులోని జంబులమ్మ కుంటలో లక్ష్మయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య రాములమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చెంచు రాజు(34) కొంతకాలంగా ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగి తిరుగుతుండేవాడు. భార్య కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో మనస్థాపం చెందిన రాజు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని ఇంటిపైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలిపనికి వెళ్లిన భార్య లక్ష్మమ్మ ఇంటికొచ్చి చూడగా వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మానవపాడు: ీఫట్స్ ట్యాబ్టెట్స్ ఎక్కువగా మింగి వ్యక్తి సృహ కోల్పోయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నిపాడులో చోటచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ కథనం ప్రకారం.. మానవపాడు మండలంలోని చెన్నిపాడుకు చెందిన ఉల్చా శ్రీరాములు(50) పెళ్లి అయిన నాటినుంచి ఫిట్స్ వస్తుండేవి. రెండేళ్లుగా మతిస్థిమితం లేకుండా ఉన్నాడు. అందుకు కర్నూల్ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. ఈనెల 20వ తేదీన ఉదయం భార్య కంగాలమ్మ కూలి పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూలేని సమయంలో శ్రీరాములు ఫిట్స్ వాడే ట్యాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకోవడంతో స్రృహ కోల్పోయాడు. భార్య సాయంత్రం పనినుంచి ఇంటికి వచ్చి చూసి శ్రీరాములును కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక గురువారం రాత్రి మృతిచెందాడు. భార్య కంగాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి వనపర్తి రూరల్: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన జానంపేట రమేష్ (36) బుధవారం రాత్రి పట్టణంలోని నల్ల చెరువు వద్ద కావలి ఉండడానికి వెళ్లాడు. గురువారం ఉదయం రమేష్ చెరువు అలుగు వద్ద బురదలో పడి ఉండడాన్ని చూసిన తోటి కావలి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపతికి తీసుకెళ్లారు. డాక్డర్ పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య జానంపేట రేణుక చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్ గద్వాల క్రైం: ఈ నెల 18న పౌరహక్కుల నేత పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘ టనపై మల్దకల్ పోలీసులు గురువారం ఉద యం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ మొగిలయ్య కథనం మే రకు.. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామా నికి చెందిన పౌరహక్కుల నేత మహేష్కు అదే గ్రామానికి చెందిన బోయనీలి బీసన్న, బో యనీలి పాండులకు పలు విషయాలపై గొ డవలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నాలు గు రోజుల క్రితం గ్రామంలో టీ స్టాల్ వద్ద మహేష్ టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు పాత కక్షలు మనస్సులో పెట్టుకుని కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనపై అదేరోజు మ ల్దకల్ పోలీసుస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, హత్యాయ త్నం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను గురువారం ఉద యం అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో నే రం అంగీకరించారు. నిందితులను గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
నేరాలే ప్రవృత్తిగా.. దొంగతనాలే పనిగా..
వనపర్తి: నేరాలను ప్రవృత్తిగా మార్చుకుని దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరస్తుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో రూరల్ ఎస్ఐ, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి బైక్కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్టేషన్కు తరలించారు. తమదైన శైలీలో విచారించగా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుడుకున్నాడు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మీనుగ రమేష్ కొంత కాలంగా దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతని బైక్లో దొంగతనానికి వాడే వస్తువులతో పాటు అతని నుంచి రూ.11.43 లక్షల నగదు, 30గ్రాముల బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, వనపర్తి రూరల్ ఎస్ఐలు జలంధర్ రెడ్డి, వేణుగోపాల్, పోలీసు కానిస్టేబుళ్లు రఫి, ఆంజనేయులు, నవీన్గౌడ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. -
జూరాలకు 3.65 లక్షల క్యూసెక్కుల వరద
ధరూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం వరద ఉధృతి మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో 3.65 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 41 క్రస్ట్గేట్లు పైకెత్తి 3,80,365 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆవిరి రూపంలో 40 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 320 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.885 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. పెరిగిన వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి... ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. అత్యధికంగా వరద వస్తుండటంతో ఉత్పత్తి సాధ్యం కాదని ఇప్పటి వరకు 533.580 మి.యూ ఉత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. కోయిల్సాగర్ రెండు గేట్ల ఎత్తి.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. బుధవారం భారీగా వరద రావడంతో 5 గేట్లను ఎత్తగా.. గురువారం ఉదయం తగ్గడంతో రెండు గేట్ల ద్వారా, సాయంత్రం ఇన్ఫ్లో మరింత తగ్గడంతో ఒక గేటు నుంచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది. 41 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
జూరాల ప్రాజెక్టు సందర్శించిన సీఈ
● తెగిన రోప్ల ప్రాంతాన్ని పరిశీలించిన వైనం ● కొత్త రోప్లను బిగించేందుకు చర్యలు ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇరిగేషన్ సీఈ నాగేందర్రావు సందర్శించారు. గురువారం సాయంత్రం ఆయన పీజేపీ ఎస్ఈ రహీముద్దీన్తో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలను తెలుసుకున్నారు. గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. తెగిన క్రస్టు గేట్ల రోప్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పైభాగం నుంచి తెగిన రోప్లను పరిశీలించారు. ప్రతి ఐదేళ్లకు ఒక సారి రోప్లను మార్చాలని, తెగిన రోప్ల స్థానంలో కొత్త రోప్లను బిగించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మున్ముందు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం వస్తే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా రోప్లను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫ్లడ్ కంట్రోల్ రూం వద్దకు చేరుకుని ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి ఎంత మేర నీటిని దిగువకు విడుదల చేశారనే సమాచారం తెలుసుకున్నారు. వరదల సమయంలో ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గద్వాలకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో గేట్స్ డివిజన్ ఈఈ కెబేర్ అహ్మద్, ఏఈలు, ఏఈలు ఉన్నారు. -
మన కలెక్టరేట్ భద్రమేనా..?
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా అధికారుల సమీకృత భవనం(కలెక్టరేట్)లోని కొన్ని గదుల్లో పీఓపీ ఊడి పడడం, భవనానికి అక్కడక్కడ పర్రెలు రావడం చూస్తుంటే మన కలెక్టరేట్ భవనం భద్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భవనం నిర్మించి మూడేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే చిన్నపాటి వానలకు కురవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు జిల్లా అధికారుల సమీకృత భవనాలను నిర్మించింది. మహబూబ్నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఉండగా కొత్త కలెక్టరేట్ను జిల్లా కేంద్రంలోని పాలకొండ శివారులో నిర్మించారు. ఈ కొత్త కలెక్టరేట్ భవనం 2017 డిసెంబర్లో శంకుస్థాపన చేసి 2022 డిసెంబర్ 4వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 2023 అగస్టులో కురిసిన వానలకు భవనం ముందు భాగంలో వాన నీరు దిగువకు కారగా.. ఇంత నాసీరకంగా పనులు చేయడం ఏంటని, ఆర్అండ్బీ అధికారులు సరిగ్గా పర్యవేక్షించలేదనే విమర్శలు వినిపించాయి. దీంతో హుటాహుటీన అధికారులు స్పందించి కలెక్టరేట్ భవనం ముందు, వెనుక భాగంలో మరమ్మతులు చేపట్టారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లోని ఈఈ చాంబర్లో ఊడిపడిన పీఓపీ 18 ఎకరాలు.. రూ.55.5 కోట్లతో నిర్మాణం 18 ఎకరాల్లో రూ.55.5 కోట్ల వ్యయంతోకలెక్టరేట్ను నిర్మించారు. ఇందులో మొత్తం 34 శాఖలు ఒకే చోట పాలన అందిస్తున్నాయి. మొదటి అంతస్తులో 13 శాఖలతో పాటు మంత్రికి (స్టేట్ చాంబర్ పేరుతో) ప్రత్యేక చాంబర్ కేటాయించారు. రెండవ అంతస్తులో 15 శాఖతో పాటు 31 మంది కూర్చునేలా మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క భవనంలో ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. ఇన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం అప్పుడే మరమ్మతులకు గురవడం, పీఓపీ ఊడిపడడం, విద్యుత్ లేని సమయంలో లిఫ్ట్ పనిచేయకపోవడంపై అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ ఈఈ చాంబర్లో ఊడిపడిన పీఓపీ ఉద్యోగులకు తప్పిన ప్రమాదం చిన్నపాటి వానకు అక్కడక్కడ కురుస్తున్న వైనం -
అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థి మృతి
● ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే! ● బాధిత కుటుంబ సభ్యుల నిరసన ● విచారణ చేస్తామన్న ఎస్ఐ నరేష్, డీటీ లక్ష్మీకాంత్ ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో ఈ నెల 17న మృతి చెందింది. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని విద్యార్థి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు గురువారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలంలోని కోతులకుంటతండాకు చెందిన కెతావత్ శ్రీను, కవిత బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వారి కుమార్తె జ్యోతి మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జ్యోతితో పాటుగా పాఠశాలలోని 11 మంది ఈ నెల 8న అనారోగ్యం పాలవడంతో పాఠశాల అటెండర్ అనురాధ వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్యోతికి జ్వరం ఎక్కువగా ఉందని వైద్యసిబ్బంది గ్లూకోజ్ పెట్టడంతో పాటుగా మొత్తం 11 మందికి మందులు ఇచ్చారు. విషయాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో విద్యార్ధినికి అన్న వరసయ్యే జగదీష్ వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినికి తెల్ల పసరికలు వచ్చాయని తేలడంతో మొదట బిజినేపల్లికి, మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి, హైదరాబాద్లోని ఆకృతి ఆస్పత్రి, యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ క్రమంలో తమ కుమార్తె అనారోగ్యం పాలైన సరైన సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చనిపోయింది శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పాఠశాల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు ఉంటాయని చెప్పడంతో విద్యార్థి బట్టలు, పుస్తకాలు తదితర వస్తువులు తీసుకుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్టర్లో నమోదు చేయలే.. ఎస్ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు వెళ్లిందని రిజిస్టర్లో పరిశీలించగా.. ఎవరు తీసుకెళ్లారు, ఏ రోజు వెళ్లిందనే ఎలాంటి వివరాలు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు, ఎవరితో బయటకు వెళ్లిందని, తిరిగి తీసుకొచ్చిన వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ప్రిన్సిపాల్కు సూచించారు. -
వృద్ధుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన వనపర్తి ఎస్పీ ● ఆధారాల కోసం క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ అన్వేషణ పాన్గల్: వనపర్తి జిల్లా పాన్గల్లో గురువారం ఎనుముల కిష్టయ్య (65)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుంటి కిష్టయ్య గొర్రెల బేరం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బోనాల పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్ద కోడలు వెంకటమ్మ ఇంటికెళ్లి భోజనం చేయగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్పై తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలారు. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించి పప్పుగుత్తి, పదునైన ఆయుధంతో ముఖం, చేతులు, ఛాతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ఉదయం అటుగా వెళ్తున్న ఓ మహిళ ఇంటి తలుపులు తెరిచి ఉండటం, కోతులు లోనికి వెళ్తుండటం చూసి పిలువగా ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపు దగ్గరకు వెళ్లి చూసింది. మంచంపై కిష్టయ్య ఎలాంటి కదలిక లేకుండా ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు చిన్న కుమారుడు శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ వివరించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించారు. ● ఎస్పీ రావుల గిరిధర్ ఘటనా స్థలాన్ని, ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు, చుట్టుపక్కల పరిస్థితులను సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. వివరాలు సేకరించి పలు సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. -
కోర్టుకు హాజరైన తేజేశ్వర్ హత్య కేసు నిందితులు
గద్వాల క్రైం: జూన్17న గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్ చేతిలో దారుణహత్యకు గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరశురాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 ఎ.మోహన్, ఏ7 తిరుపతయ్య (తిరుమలరావు తండ్రి), ఏ8 సుజాతలను గద్వాల జూనియర్ సివిల్ కోర్టు నాయ్యమూర్తి ఉదయ్నాయక్ ఎదుట పోలీసులు గురువారం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకున్నారా.. అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్కు ఆదేశాలు జారీ చేయగా.. పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఏ7 తిరుపతయ్య మాత్రం బెయిల్ మీద ఉన్నాడు. -
యూరియా ఇవ్వండి సారూ!
–8లో uమహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూరియా వినియోగం అత్యవసరమైంది. దీంతో జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో గురువారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది మంది రైతులకే యూరియా లభించడంతో నిరాశతో వెనుదిరిగారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులకు ఒకటి.. రెండు బస్తాలు అంటగట్టి వ్యాపారులు చేతులు దులుపుకుంటున్నారు. సరిపడా యూరియా రాలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో వారం–పది రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ సమయంలో యూరియా చల్లాల్సి ఉంటుంది. పంటల పచ్చదనంతో పాటు మొక్కల ఎదుగుదలకు యూరియా అవసరం ఉంది. కానీ ఇందుకు సరిపడా యూరియా నిల్వలను జిల్లాకు తెప్పించడంలో విఫలమయ్యారు. కేటాయింపు ఎక్కువ.. సరఫరా తక్కువ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 2,67,352 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 1,30,086 ఎకరాల్లో, పత్తి 78,107 ఎకరాల్లో, మొక్కజొన్న 35,894 ఎకరాల్లో, కంది 9,611 ఎకరాల్లో, జొన్న 13,550 ఎకరాల్లో, మిగతా జొన్న, పెసర ఇతర మెట్ట పంటలను సాగు చేశారు. సీజన్లో పత్తి, వరి పంటలకు రైతులు యూరియాను వినియోగిస్తున్నారు. జిల్లాకు ఈ వానాకాల సీజన్లో 38,783 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 19,634 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించింది. మరో 19,149 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిన యూరియాను వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు, ప్రైవేట్ డీలర్లకు కేటాయించారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు యూరియాను రైతులు వెంటవెంటనే కొనుగోలు చేస్తుండటంతో అక్కడ నాలుగు.. ఐదు రోజుల్లోనే యూరియా ఖాళీ అయింది. ఆలస్యమైతే అంతే సంగతి... యూరియా చల్లడం ఆలస్యమైతే పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే యూరియా కోసం ఆరాటపడుతున్నారు. కాగా రైతులకు సరైన అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం ఉంది. విడతల వారీగా యూరియా వస్తుందని, కృత్రిమ కొరత లేదని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అందుకే వరి పంటకు రెండో దఫా యూరియా వినియోగం కోసం ఇప్పటి నుంచే రైతులు తీసుకెళ్తున్నారు. ఫలితంగా ఈసారి యూరియా అవసరం ఉన్న వారికి నిరాశ తప్పడం లేదు. ఇలాంటి వాళ్లే రోడ్డెక్కుతూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు యూరియా చల్లకుంటే పంటలు ఎర్రబారుతాయని, దిగుబడి తగ్గుతుందని ఎవరికి వారే రైతులు భావిస్తున్నారు. ఇందులో నిజనిజాలపై అధికారులు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాకు అవసరమైన యూరియా 38,783 మెట్రిక్ టన్నులు కేటాయించిన యూరియా 19,634 మెట్రిక్ టన్నులు అధికారులను వేడుకుంటున్న రైతాంగం దుకాణాలు, సొసైటీల వద్ద గంటల తరబడి నిరీక్షణ అయినా దొరకడం లేదంటున్నఅన్నదాతలు వరుస వర్షాలతో పెరిగిన డిమాండ్ తగినంత అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలం చేతులెత్తేసిన వ్యాపారులు, అధికారులు -
ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలంలో పండించే వరిధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా 1,71,781 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని.. దాదాపు 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు డీఆర్డీఓ ఆధ్వర్యంలో 110, డీసీఓ 79, మెప్మా ఒక కేంద్రంతో కలిపి మొత్తం 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజ్ తదితర వాటికి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి గంప శ్రీనివాస్, మేనేజర్ రవినాయక్, జిల్లా సహకార అధికారి శంకరాచారి, మార్కెటింగ్ అధికారిణి బాలమణి, అడిషనల్ డీఆర్డీఓ శారద, వ్యవసాయశాఖ ఏడీ హైమావతి ఉన్నారు.చట్టాలను సద్వినియోగం చేసుకోవాలిజడ్చర్ల/జడ్చర్ల టౌన్: వృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర సూచించారు. గురువారం జడ్చర్లలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. వృద్ధ తల్లిదండ్రులను అన్యాయానికి గురిచేసే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆస్తులను పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తమ తదనంతరం అని పొందుపర్చాలని.. తద్వారా ఆస్తికోసమైన పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటారని తెలిపారు. వృద్ధులకు న్యాయ సలహాలు అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు. జడ్చర్ల సీనియర్ సిటిజన్స్ ఫోరం చేస్తున్న కార్యక్రమాలను న్యాయమూర్తి ప్రశంసిస్తూ.. పలువురిని శాలువాలతో సత్కరించారు. అనంతరం రూరల్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి వృద్ధులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి జరీనాబేగం, ఫోరం అధ్యక్షుడు నయీమొద్దీన్, సభ్యులు శంకర్బాబు, ప్రకాశ్, వేణుగోపాల్, ఆశ్రమ నిర్వాహకుడు సంజీవ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా రంగా ఆజ్మీరా
పాలమూరు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రంగా ఆజ్మీరా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. నారాయణపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్కుమార్సింగ్ కొత్త సూపరింటెండెంట్కు బాధ్యతలు అప్పగించారు. సంపత్కుమార్ నారాయణపేటకు బదిలీ అయిన తర్వాత అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ మాధవి నెల రోజుల పాటు తాత్కాలిక సూపరింటెండెంట్గా కొనసాగారు. ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రంగా ఆజ్మీరా 1995 నుంచి 2000 వరకు రాజాపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పని చేసిన చేశారు. పీజీ పూర్తి చేసి గాంధీ, ఉస్మానియాలో పనిచేశారు. ప్రొఫెసర్గా పదోన్నతి పొంది బదిలీపై మహబూబ్నగర్ జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీగా వచ్చారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి కొత్తగా లాప్రోస్కోపీ మిషన్ తీసుకొచ్చి సర్జరీలు చేస్తామన్నారు.ప్రైవేట్లో ల్యాప్రోస్కోపీ అయితే రూ.వేలు ఖర్చు అవుతాయని అలాంటి సర్జరీలు ఉచితంగా రోగులకు అందిస్తామన్నారు. అదే కోత ద్వారా అయితే రోగికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆధునిక పద్ధతుల్లో సర్జరీలు చేయడానికి పరికరాలు చాలా అవసరమన్నారు. ఆస్పత్రి పాత భవనం కావడం వల్ల ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ ఇతర చోట్ల వర్షం లీకేజీ అవుతుందని దానిపై దృష్టి పెట్టడంతో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ బాగుందని, సర్జరీలు అవుతున్నాయని ఇంకా పెంచే విధంగా పని చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సూచనలు, సహకారంతో రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పని చేస్తానని తెలిపారు. కాగా కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ రంగా ఆజ్మీరాకు ఆస్పత్రిలో పనిచేసే అన్ని విభాగాల హెచ్ఓడీలు, వైద్యులు, సిబ్బంది శాలువలు కప్పి, పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..
రైతుకు అవసరం లేకున్నా అనవసరంగా ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. ఆ డబ్బులతో ఇంకో యూరియా బస్తా కొనుక్కోవచ్చు. సొసైటీ నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేసేదేం లేక వారు చెప్పినట్టు కొంటున్నం. గతంలో కావాల్సినన్ని యూరియా బస్తాలను తీసుకెళ్లటోళ్లం. ఇప్పుడు కుటుంబం మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లవారక ముందే లైన్లో ఉంటున్నా.. సరిపోను యూరి యా ఇవ్వట్లేదు. ఒకవైపు వ్యవసాయ పనులు ఆగుతుండగా, మరోవైపు పంటలు దెబ్బతింటున్నాయి. – గొల్ల మల్లయ్య, రైతు, ధర్మాపూర్ దొరకట్లేదు.. నాకు మూడెకరాల భూమి ఉంది. 20 రోజుల కిందట నాట్లు వేశాను. నాటేసిన 15 రోజుల్లోపే పొలానికి యూరియా వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా.. దొరకటల్లేదు. అధికారులు స్పందించి రైతులకు సకాలంలో సరిపడా యూరియా ఇవ్వాలి. – వెంకటయ్య, రైతు, ఎదిర పది రోజులుగా తిరుగుతున్నా.. పది రోజులుగా యూరియా కోసం జిల్లా సహకార విక్రయ కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. ఈ రోజూ కూడా పనులు మానుకుని విక్రయ కేంద్రం వద్దకు ఉదయం 5 గంటలకే వచ్చాను. ఆధార్ కార్డు మీద రెండు బస్తాలే ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుంది. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి రాదు. గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఎరువుల కొరత లేదు. – చెన్నారెడ్డి, రైతు, గుడ్డి మల్కాపూర్ నెలాఖరులో 5వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రస్తుతం 894 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. ఈనెలాఖరుకు మరో 5,318 మెట్రిక్ టన్ను లు వస్తుంది. యూరియా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఆగస్టు మాసానికి 9,036 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 3,718 మెట్రిక్ రైతులకు సరఫరా చేశాం. సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. అంతా ఒకేసారి కావాలంటే సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డీలర్లలో ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్నాం. – బి.వెంకటేష్, డీఏఓ -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని బీచుపల్లి పుణ్య క్షేత్రం కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సీతారాములను అందంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణం జరిపించారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు సంగాలకు చెందిన నల్లారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెట్లకు తిప్పలు..
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేని సింథటిక్ ట్రాక్లు ●మెయిన్ స్టేడియంలో ఇప్పటికే అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సింథటిక్ ట్రాక్పై క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. – జి.శరత్చంద్ర, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ కోసం రూ.10 కోట్లతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ ట్రాక్లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు వల్ల క్రీడాకారులకు మెరుగైన ప్రాక్టీస్ లభిస్తుంది. దీంతో జిల్లా క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దొచ్చు. సింథటిక్ ట్రాక్ కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తాం. – రమణ, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, నారాయణపేట మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జిల్లా నుంచి పలు క్రీడల్లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఖేలో ఇండియా సెంటర్లు, మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీ, వనపర్తి పట్టణంలో హాకీ అకాడమీ ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు అథ్లెటిక్స్లో పతకాలు సాధిస్తూ సత్తాచాటుతున్నారు. కానీ ఈ జిల్లాల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్లు లేకపోవడంతో చాలా మంది క్రీడాకారులు మట్టి గ్రౌండ్లోనే సాధన చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ ట్రాక్ ప్రతిపాదనలకు సంబంధించి 2021 అక్టోబర్ 22న ఖేలో ఇండియా కేంద్ర పరిశీలన కమిటీ సభ్యులు పరిశీలించారు. స్టేడియం అంతా తిరిగి సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అంచనా వేశారు. అదే విధంగా మెయిన్ స్టేడియంలో 2023 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులతో పాటు రూ.8కోట్ల నిధులతో చేపట్టనున్న సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు సింథటిక్ ట్రాక్ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. దీంతో స్టేడియంలో ఉన్న మట్టి ట్రాక్పై అథ్లెట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో వందలాది మంది అథ్లెట్లు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఊసే లేదు మెరుగైన క్రీడా శిక్షణకు ఇబ్బందులు ట్రాక్లు ఏర్పాటు చేయాలంటున్న క్రీడాకారులు సింథటిక్ ట్రాక్లు ఏర్పాటు అయితే ఔత్సాహిక క్రీడాకారులకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. పరుగు పందెం పోటీల్లో క్రీడాకారుల్లో సరైన టైమింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాక్లపై నీళ్లు నిలిచే అవకాశం ఉండదు కాబట్టి వర్షాకాలంలో సైతం ఏ ఇబ్బంది లేకుండా అథ్లెట్లు సాధన చేసుకోవచ్చు. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ల ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు జరిగే అవకాశం ఉంటుంది. -
ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
గట్టు: మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన పల్లె య్య, చిట్టెమ్మ దంపతుల మూడో కుమార్తె సంజు(5) మృతికి కారణమైన ఆలూరులో ఆర్ఎంపీ నర్సింహ నిర్వహిస్తున్న క్లినిక్ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్ కిరణ్మయి, మెడికల్ అధికారులు బుధవారం ఆలూరులో పర్యటించి క్లినిక్ను తనిఖీ చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు.. ఆలూరులో ఆర్ఎంపీగా నర్సింహ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తుమ్మలచెరువుకు చెందిన బాలిక సంజు (5)కు తట్టు పోయడంతో పాటు జ్వరం రాగా, రెండు రోజుల క్రితం బాలికను క్లినిక్ తీసుకెళ్లారు. నర్సింహ హైపవర్ కలిగిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలిక పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే బాలికను కు టుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్క డే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామంలో పంచాయతీ నిర్వహించిన అనంతరం బా లిక అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. బాలికల తల్లిదండ్రులకు కొంత మేరకు నష్టపరిహారం ఇచ్చేలా పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి రాగా, ఆయన ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆలూరు చేరుకుని విచారణ చేపట్టి క్లిని క్ను సీజ్ చేశారు. ఆర్ఎంపీ నర్సింహపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. షార్ట్సర్క్యూట్తో గుడిసె దగ్ధం కేటీదొడ్డి: విద్యుత్ షార్ట్ సర్కూట్తో గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని ఎర్సన్దొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో జంబయ్యకు చెందిన గుడిసె షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు పేర్కొన్నారు. -
‘కురుమూర్తి’లో పూర్తయిన బహిరంగ వేలం
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందామని ఆలయ చైర్మన్ గోవర్దన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి అన్నారు. 2025–26 ఉత్సవాలకు సంబంధించి లడ్డు ప్రసాదం, కొబ్బరికాయలు, లైటింగ్, తలనీలాలు, కొబ్బరి చిప్పలు, పూజ సామగ్రి తదితర వాటి బహిరంగ వేగం బుధవారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. లడ్డు ప్రసాదంను చిన్నకడుమూర్కు చెందిన వెంకట్రాంరెడ్డి రూ.46 లక్షలకు, తలనీలాలను మహబుబ్నగర్కు చెందిన రామన్గౌడ్ రూ.32 లక్షలకు, విద్యుత్ లైటింగ్ అమ్మాపురం గ్రామానికి చెందిన రవితేజ రూ.13.33 లక్షలకు, రంగుల రాట్నం హైదరాబాద్కు చెందిన జ్ఞానేశ్వర్ రూ.34.05 లక్షలకు కొబ్బరి చిప్పలు అల్లీపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు రూ.4,06,200కు దక్కించుకున్నట్లు వారు వివరించారు. పూజా సామగ్రి, కొబ్బరికాయల విక్రయానికి సరైన పాట రానందున వాయిదా వేసినట్లు చెప్పారు. ఉత్సవాలు అక్టోబర్లో జరగనున్నాయని.. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నందున ఎలాంటి ఇబ్బదులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాటదారులు భక్తులకు నాణ్యమైన వాటిని విక్రయించాలని.. లేకుంటే తగిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భాస్కరాచారి, కమలాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రూ.46 లక్షలు పలికిన లడ్డు ప్రసాదం -
జూరాలకు భారీగా వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 7.30 ప్రాంతంలో 2.92 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 44 క్రస్ట్ గేట్లు పైకెత్తి 3,22,179 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 10,663 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 20, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.585 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు. నిర్విరామంగా విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 247.422 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 286.158 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 533.580 మి.యూ. విజయవంతంగా చేపట్టామన్నారు. రామన్పాడు నుంచి 15 వేల క్యూసెక్కులు.. మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి బుధవారం శంకరసముద్రం, సరళాసాగర్, ఊకచెట్టువాగు నుంచి వరద రావడంతో 7 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. సరళాసాగర్ సైఫన్ల నుంచి.. మదనాపురం: సరళాసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రెండు ఉడ్ సైఫన్లు, రెండు ప్రైమరీ సైఫన్ల నుంచి 7,800 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. మదనాపురం వద్ద వాగు పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయిల్సాగర్ జలాశయం వద్ద.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం ఉదయం 5 గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 4,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. మంగళవారం రెండు గేట్లను తెరవగా.. రాత్రి కురిసిన వర్షానికి జలాశయానికి భారీగా వరద చేరడంతో బుధవారం ఉదయం 5 గేట్లను తెరిచారు. సాయంత్రం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు, తర్వాత మరో గేటు మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది. నిండుకుండలా సుంకేసుల.. రాజోళి: సుంకేసుల జలాశయానికి వరద రోజురోజుకు పెరుగుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. బుధవారం ఎగువ నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 19 గేట్లను రెండు మీటర్ల మేర, డ్యాంకు ఒక గేట్ను మీటర్ మేర తెరిచి 1, 39,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్కు విడుదల చేసి న 2,534 క్యూసెక్కులతో కలిపి డ్యాం నుంచి 1,41, 634 క్యూసెక్కులు దిగువకు పారినట్లు చెప్పారు. 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 44 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
త్వరలో సీఎంను కలిపిస్తాం
నారాయణపేట: నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయించేందుకు త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలిపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. మంగళవారం రాత్రి మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి చొరవతో మంత్రి దామోదర రాజనరసింహాను నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని భూ నిర్వాసితుల సంఘం సభ్యులు, అఖిలపక్షం నాయకులు, భూ నిర్వాసితులు కలిసి తమ గోడును వినిపించారు. భూ నిర్వాసితులకు బేసిక్ ధరను 2013 భూ చట్టాన్ని, ప్రస్తుత మార్కెట్ ధరను పట్టించుకోకపోవడంతో భూ నిర్వాసితులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.2.25 లక్షలు ప్రభుత్వ మార్కెట్ ధర ఉందంటూ కేవలం రూ.14 లక్షలు చెల్లిస్తుండడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. కానీ మార్కెట్ ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు పలుకుతుందన్నారు. కాస్తుకు, రికార్డు మధ్య పొరపాటు ఉందని వాటిని సరి చేయాలని, ఇంటికో ఉద్యోగం, పింఛన్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించాలని భూనిర్వాసితులు మంత్రులను కోరారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. భూ పరిహారాన్ని రూ.35 లక్షలు పెంచి ఇవ్వాలనేదే తమ కోరిక.. డిమాండ్ అని తెలిపారు. అనంతరం మంత్రులు స్పందిస్తూ త్వరలోనే సీఎంతో మాట్లాడించి భూ నిర్వాసితులకు తగు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రులను కలిసిన వారిలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి వెంకట్రాంరెడ్డి , అధ్యక్షుడు మశ్చందర్, రైతు సంఘం నాయకులు వెంకోబ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్, భూ నిర్వాసితులు గోపాల్రెడ్డి, రమేశ్శెట్టి, బీజేపీ నాయకుడు భాస్కర్ తదితరులు ఉన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయిస్తాం భరోసానిచ్చిన మంత్రులు -
మీ కొడుకు డ్రగ్ కేసులో దొరికాడు
మద్దూరు: ‘హలో.. మై డీఎస్పీ బాత్ కర్హ హు అప్ కా బేటా డ్రగ్స్ కేస్ మే మిల్ గయా. ఛోడ్దేనా బోలేతో థీస్ హజార్ అర్జెంట్ ఫోపే కరో.. నైతో కేసు హోయాతో 10 సాల్ సజా గిర్తా, ఫైన్బీ గిర్తా.. అర్జెంట్ ఫోన్ పే కరో..(హలో నేను డీఎస్పీని.. నీ కొడుకు డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. అతడిని విడిచి పెట్టాలంటే వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుంది) అంటూ వచ్చిన ఫోన్కాల్తో ఓ తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మద్దూరు పట్టణానికి చెందిన నాగేందర్ పిండి గిర్ని నడిపిస్తున్నాడు. ఇతని పెద్ద కొడుకు విశాల్ షాద్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు 923707509858 నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. దీంతో ఆయన భార్య భాగ్యమ్మ ఫోన్ ఎత్తింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. ‘నీ కొడుకు మరో 4 గురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మీ కుటుంబం ఎలాంటి కేసులో లేవు, ఉన్నతంగా జీవించే కుటుంబలా ఉంది. వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేస్తే కేసు నుంచి తప్పిస్తాం’అని తెలిపారు. ఆమె వెంటనే భర్త నాగేందర్కు ఫోన్ ఇచ్చింది. అవతలివైపు నుంచి దూరంగా పోలీసులు కొడుకును కొట్టుతున్న శబ్దాలను వినపడడంతో.. ‘మా ఫోన్లో అంత డబ్బు లేదు.. మీరు ఎక్కడ ఉన్నారో చెబితో డబ్బులతో అక్కడి వస్తాం’ అని భయపడుతూ చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి దంపతులను మరింత బెదిరించి, ఫోన్ కట్ చేశారు. విషయం చుట్టపక్కల వారికి తెలియడంతో వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఫోన్ కట్ చేయడంతో మళ్లీ ఫోన్ చేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు వీళ్లను ఫోన్లో బెదిరించాడు. ఈ క్రమంలో ఇతర ఫోన్ నుంచి అతని కొడుకు ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నాకు ఏమీ కాలేదని కొడుకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఐ విజయ్కుమార్ తెలుపగా నంబర్లను వాటప్స్ కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి విషయం తెలియజేయాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. రూ.30 వేలు ఫోన్పే చేస్తే వదిలేస్తాం సైబర్ నేరగాళ్ల బెదిరింపులు -
విద్యుత్ఘాతంతో ఎద్దులు మృత్యువాత
కోడేరు: విద్యుదాఘాతంతో ఎద్దులు మృత్యువాత పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు రాములు ఇంటి వద్ద పశువుల పాకలో ఎద్దులను కటేశాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో 11కేవీ విద్యుత్తీగలు తెగి ఎద్దులపై పడటంతో రెండు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం ఏర్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.లభించని చిరుత ఆనవాళ్లుగండేడ్: వాహనదారుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని అటవీ శాఖ మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హై ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ బుధవారం పరిశీలించారు. మంగళవారం మండలంలోని లింగాయపల్లి గ్రామ సమీపంలో నరేష్ అనే వ్యక్తి బైక్పై వస్తుండగా చిరుత అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితుడు నరేష్ వద్దకు వెళ్లి విచారించి సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. బాధితుడు చింతగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పడంతో అధికారులు పంట పొలాలతోపాటు ఖాళీ ప్రదేశాలను కలియదిరిగారు. అయితే చిరుతకు సంబంధించి పాదముద్రలు ఏమీ లభించలేదని అటవీ అధికారి తెలిపారు. చిరుతకు సంబంధించి ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో దాడి చేసింది కచ్చితంగా చిరుత అని చెప్పలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమ్మాయిల రక్షణకు అధిక ప్రాధాన్యం
మహబూబ్నగర్ క్రైం: అమ్మాయిలు, మహిళల రక్షణ అంశంలో భరోసా సెంటర్ల ప్రాధాన్యత అధికంగా ఉండాలని, బలహీన వర్గాల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన భరోసా కన్వర్జెన్సీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలో జరిగే హింసాత్మక ఘటనల నివారణ, బాధితులకు న్యాయం అందించడంలో పోలీస్ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కేసు పరిష్కారంలో మానవతా దృక్పథం అత్యంత ముఖ్యమని, బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, గృహహింస వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, పునరావాసం ఒకే వేదికపై అందించబడితే సమాజం మరింత బలపడుతుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీడబ్ల్యూఓ జరీనా, డీఎంహెచ్ఓ కృష్ణ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ శ్రీధర్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, పీపీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రాకున్నా.. వచ్చినట్లే
గ్రామ పంచాయతీకార్యదర్శుల లీలలు ఎన్నో జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఎక్కడో ఉండి యాప్లో హాజరు నమోదు చేసుకుంటుండగా.. మరికొందరు తమ స్థానంలో మరొకరితో అటెండెన్స్ కోసం సెల్ఫీ ఫొటో తీయిస్తున్నారు. జిల్లాలో ఇలా విధుల పట్ల 11 మంది కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు డీపీఓ అధికారులు గుర్తించి.. కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నీ తామై వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఇతర వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయించడం చర్చనీయాంశమైంది. ఎక్కడెక్కడ అంటే.. జిల్లావ్యాప్తంగా 11 మంది పంచాయతీ కార్యదర్శులు తప్పుడు అటెండెన్స్ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సదరు 11 మందిపై అధికారులు నివేదిక తయారు చేశారు. గండేడ్ మండలంలో ఓ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కౌకుంట్ల మండలంలోని ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కోయిలకొండ మండలంలో ఇద్దరు, అడ్డాకుల, నవాబ్పేటలో ఒక్కొక్కరు, దేవరకద్ర మండలంలో ఇద్దరు, జడ్చర్ల, మూసాపేట్, మిడ్జిల్ మండలాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఒకరు ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ఫొటోతో డీఎస్ఆర్ యాప్లో అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో యాప్లో నమోదైన పంచాయతీ కార్యదర్శుల ఫొటోలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర డీపీఓ అధికారులకు సూచించడంతో నకిలీ హాజరు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని, నలుగురిని సస్పెండ్ చేయగా, మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీచేశారు. చర్యలు తీసుకున్నాం.. ఫేస్ అటెండెన్స్ యాప్లో టెక్నికల్ సమస్యలను ఆసరాగా చేసుకుని ఇతరులతో అటెండెన్స్ వేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాగే చేశారు. జిల్లాలో నలుగురిని సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురికి ఏఓసీ మెమో, ఇద్దరు ఓపీఎస్ను తొలగించడం జరిగింది. – పార్థసారధి, డీపీఓ కొందరు విధులకు రాకుండానే హాజరు నమోదు వరంగా మారిన సాంకేతిక లోపం తాజాగా 11 మంది కార్యదర్శులపై చర్యలు -
అత్యవసరసమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా వానొస్తే.. రాకపోకలు బంద్ వాన ఒచ్చిందంటే తమ ఊరుకు రాకపోకలు బంద్ అవుతాయి. జడ్చర్ల–ఆలూరు మధ్య రైల్వే ఆర్యూబీ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో బైక్లు, ఆటోలు వెళ్లేందుకు వీలు పడదు. దీంతో జడ్చర్ల నుంచి బూర్గుపల్లి గ్రామం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి ఆర్యూబీ వద్ద వరద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి. – కృష్ణ, ఆటో డ్రైవర్, ఆలూరు ప్రణాళిక లోపంతో.. మా గ్రామంలో రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణం ప్రణాళిక లేకుండా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అండర్బ్రిడ్జిలో మొత్తం వర్షపు నీటితో నిండిపోయి.. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయంపై గ్రామస్తులందరం కలిసి ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. – కృష్ణ, డోకూర్, దేవరకద్ర ● -
బీఫార్మసీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని బీఫార్మసీ సెమిస్టర్–8 రెగ్యులర్, 1, 3, 5, 7 సెమిస్టర్లకు సంబంధించి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు 8వ సెమిస్టర్లో 82.74 శాతం, 7వ సెమిస్టర్లో 71.43 శాతం, 5వ సెమిస్టర్లో 50 శాతం, 3వ సెమిస్టర్లో 54.55 శాతం, 1వ సెమిస్టర్లో 58.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ రవికాంత్, ఈశ్వర్కుమార్, సురేష్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైనవైద్యం అందించాలిరాజాపూర్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని లేబర్రూంతోపాటు పరిసరాలను పరిశీలించారు. ప్రతినెలా ఎన్ని కాన్పులు అవుతున్నాయి.. మేజర్ కేసులు ఎలా చేస్తున్నారు అని మండల వైద్యాధికారి సుశ్మితను అడగగా.. ప్రతినెలా 8 నుంచి 10 వరకు కాన్పులు అవుతున్నామని చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం రాజాపూర్ శివారులో ఉన్న కేజీబీవీని సందర్శించి స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మిబాయిని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంమహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమినర్ ప్రవీణ్కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మొదటిసారి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ సామగ్రిని కనీస ధరకు విక్రయించేలా వ్యాపారులను ఒప్పించాలన్నారు. ముఖ్యంగా కూలీల వేతనం రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించాలన్నారు. ఇసుకను రీచ్ల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వీలైనంత తొందరగా లబ్ధిదారులు ఈ ఇళ్లను పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎంసీ అజ్మీరా రాజన్న, హౌసింగ్ డీఈఈ విజయ్, ఆర్ఓ మహమ్మద్ ఖాజా, మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్ఐలు టి.నర్సింహ, రమేష్, ముజీబుద్దీన్, అహ్మద్షరీఫ్తో పాటు వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో రాజీవ్గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే, ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్గాంధీ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్గాంధీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్గాంధీ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, జహీర్ అఖ్తర్, వసంత, సాయిబాబా, అజ్మత్అలీ, రాములుయాదవ్, పీర్ సాధిక్, అవేజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం 2 గేట్లను ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. సోమవారం ఇన్ఫ్లో భారీగా రావడంతో అయిదు గేట్లను తెరిచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు.. నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మొత్తం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. మంగళవారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఇప్పటివరకు 529.752 మి.యూనిట్లను విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. -
మోతెవరి లవ్స్టోరీలో అప్పాయిపల్లివాసి
సాక్షి, నాగర్కర్నూల్/ లింగాల: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్లో లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన చిరుతల బాలరాజు ముఖ్య పాత్రలో నటించారు. ‘తెలుగు జీ5’ ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూయర్స్ను అందుకుని ట్రెండింగ్లో నిలిచింది. ఈ వెబ్సిరీస్లో 70 ఏళ్ల వృద్ధుడు రాములు తాత పాత్రలో చిరుతల బాలరాజు మెప్పించారు. లింగాల జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి, కొండనాగుల జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన బాలరాజు సినిమాలపై మక్కువతో సినీరంగంలో ప్రవేశించారు. పలు సీరియళ్లలో ఆర్టిస్టుగా, కో డైరెక్టర్గా పనిచేశారు. అల్లరే అల్లరి, సరదాగా కాసేపు, మిస్సమ్మ, ప్రతిఘటన, ప్రేమ ఎంత మధురం, అత్తో అత్తమ్మ కూతురో తదితర సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తాజాగా ఓటీటీలో విడుదలైన మోతెవరి లవ్స్టోరీ వెబ్సిరీస్లో ముఖ్య పాత్ర రాములు తాతగా నటించి అలరించారు. నల్లమలలోని మారుమూల ప్రాంతానికి చెందిన బాలరాజు వెబ్సిరీస్లో అలరించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
చిరుత.. లింగాయిపల్లిలో ప్రత్యక్ష్యం
గండేడ్: ఇటీవల మహబూబ్నగర్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత తాజాగా గండేడ్ మండలంలో కలకలం రేపింది. మంగళవారం రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడిని గాయపరిచింది. మండలంలోని లింగాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గత్ప నరేశ్ మంగళవారం సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో బైక్పై రంగారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో లింగాయిపల్లి నుంచి చింతగుట్టకు వెళ్లేదారి వద్దకు రాగానే చిరుత అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు దూకింది. అదే సమయంలో బైక్పై అక్కడికి చేరుకున్న నరేశ్ చేతికి చిరుత కాలు గీసుకుపోవడంతో ఎడమ చెతికి గాయమైంది. చిరుత చింతగుట్ట వైపునకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం అతను గండేడ్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొన్నాడు. అయితే మరోసారి చిరుత గండేడ్ మండలంలో సంచరించడం మండల వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. చింతగుట్ట వైపు వెళ్లిన చిరుత అవతలికి దాటే అవకాశం లేదు. ఎందుకంటే సాలార్నగర్ ప్రాజెక్టు నిండి ఉధృతంగా అలుగు పారుతుండడంతో ఇటువైపే సంచరించే అవకాశం ఉంది. భయాందోళనతో పొలాల వద్ద కట్టేసిన పశువులను స్థానికులు ఇళ్లకు తీసుకొచ్చారు. రోడ్డు దాటుతూ వాహనదారుడికి గాయం రెండోసారి గండేడ్ మండలంలో సంచారం అప్రమత్తంగా ఉండాలి చిరుత సంచరించిన సమాచారం అందింది. బుధవారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తాం. అది చిరుతనా, పులినా, లేక ఇంకేమైనా తిరుగుతుందా పరిసరాలను పూర్తిగా పరిశీలిస్తాం. అప్పటి వరకు చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – మహమ్మద్ అబ్దుల్ హై, రేంజర్, మహమ్మదాబాద్ రేంజ్ -
కొండచరియలు తొలగింపు
దోమలపెంట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం ఈగలపెంట ఎస్ఐలు జయన్న, శ్రీను సిబ్బందితో కలిసి రోడ్డుపై పడిన రాళ్లను తొలగించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో కొండచరియలు రోడ్డుపై పడ్డాయని పొక్లెయిన్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం తొలగించినట్లు పేర్కొన్నారు.గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు పోలె అశ్విని ఎంఏ తెలుగులో సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలలో అత్యధిక మార్కులు సాధించి ఉస్మానియ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. మంగళవారం ఓయూ 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిష్ణుదేవ్శర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాలమూర్ యువ కవుల వేదిక అధ్యక్షుడు బోలయాదయ్య పోలె అశ్వినికి అభినందనలు తెలియజేశారు. -
కమనీయం.. జములమ్మ కల్యాణం
గద్వాలటౌన్: చూడముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆసీనులైన జమదగ్ని మహర్షి.. పచ్చటి తోరణాలు, మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల నడుమ మంగళవారం నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణం కనులపండువగా జరిగింది. సాంప్రదాయబద్దంగా దేవతామూర్తులను పూజించి పుణ్యాహవాచనం నిర్వహించి కన్యాదానం కొనసాగించారు. అంతకుముందు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో జములమ్మ అమ్మవారిని, వరుడిగా త్రిశూలాన్ని ఊరేగింపుగా పెళ్లిపీటలపైకి తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి యోక్త్రధారణ, త్రిశూలానికి యజ్ఞోపవిత ధారణ, సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మధ్యాహ్నం 12.15కి మాంగళ్యధారణ నయనానందంగా సాగింది. కల్యాణోత్సవానికి ముందు పలువురు దంపతులు సంకల్పం నిర్వహించారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వేర్వేరుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించించారు. ఎమ్మెల్యే అమ్మవారికి నిత్య విశేష పుష్పాలంకారం చేసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జములమ్మ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జములమ్మ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో చల్లంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పండితుల నుంచి ఇరువురు ఆశీస్సులు పొందారు. జములమ్మ కల్యాణంతో నడిగడ్డ సుభిక్షంగా వర్ధిల్లుతుందని పండితులు పేర్కొన్నారు. వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధు లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యా ణ మహోత్సవంలో ఈఓ పురేంధర్ కుమార్, అల య కమిటీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ చైర్మన్ సతీష్కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్పర్సన్ -
పురుగుల మందు తాగి మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: భార్యాభర్తల గొడవ కారణంగా మనస్తాపానికి చెందిన భార్య ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం.. మరికల్కు చెందిన ఏడుపుల గీత (22) ఈనెల 17న భార్య, భర్తలు గొడవ పడి మనస్తాపంతో కలుపునివారణ మందు తాగింది. అపస్మారకస్థితికి చేరుకోవడంతో నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి నాలుగునెలల పాప ఉంది. మృతురాలి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. యువతి అదృశ్యం ఉండవెల్లి: మండలంలోని మెన్నిపాడు గ్రామానికి చెందిన కస్తూరి(25) అనే యువతి నెల క్రితం నుంచి మండల కేంద్రంలోని పెద్దమ్మ సుగుణమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. ఎంతకూ ఆచూకీ తెలియక పోవడంతో మంళగళవారం కస్తూరి అక్క సంధ్యపోగు సరస్వతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. విద్యుత్షాక్తో గొర్రెలకాపరి మృతి కొత్తకోట రూరల్: పెద్దమందడి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి రాగమోని మల్లయ్య(40) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. అక్కడే మరో కాపరి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఆర్ఐ గణేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. గొర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లడంతో అక్కడ బోరుబావి వద్ద విద్యుత్ తీగలు తగిలి మృతిచెందినట్లు ఆర్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నట్టు బంధులువు తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుశిక్ష పాన్గల్: మండలంలోని గోప్లాపూర్లో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి కళార్చన తీర్పునిచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బింగి రామదాసుకు, బింగి శ్రీశైలంకు కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. 2023, జూలై 14 రాత్రి రామదాసు గొర్రెల దగ్గరికి ఒంటరిగా వెళ్తుండగా గ్రామ శివారులో అప్పటికే మాటు వేసి ఉన్న శ్రీశైలం ఒక్కసారిగా గొడ్డలితో తలపై దాడి చేశాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవిప్రకాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శ్రీశైలంను రిమాండ్కు తరలించారు. కోర్టులో విచారణ జరగగా మంగళవారం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బైక్ చోరీకి యత్నం.. పోలీసులకు అప్పగింత జడ్చర్ల టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో బైక్ను చోరీ చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని సెక్యూరిటీ నర్సింహులు పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పూర్తి వివరాలు.. ఆర్టీసీ క్యాంటీన్ ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్ను ఎత్తుకెళ్లేందుకు నిందితుడిని గమనించి పట్టుకున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొన్నారు. -
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
భూత్పూర్: ఊరికి దూరంగా ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8 ఆలయాల్లో జరిగిన చోరీల్లో అతని ప్రమేయం ఉంది. ఈమేరకు మంగళవారం మహబూబ్నగర్ ఎస్పీ జానకి భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జూలై 31న సీసీకుంట గంగాభవాని ఆలయంలోని గర్భగుడి తాళం విరగ్గొట్టి వెండి ఆభరణాలు దొంగతనం చేయగా.. ఆగస్టు 1న కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈక్రమంలో మంగళవారం సీసీకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన తోక కర్ణాకర్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఆలయ చోరీ సమయంలో సీసీ ఫుటేజీలో కనిపించిన అనుమానితుడిని.. ఇతడిని పోల్చి చూడగా ఒక్కరేనని గుర్తించారు. అదుపులోకి తీసుకొని ఆరా తీయగా గంగాభవాని ఆలయంలో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. 2024 జనవరి 24 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలిస్తూ వచ్చాడు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 8 ఆలయాల్లో జరిగిన దొంగతనాల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఇందులో సీసీకుంట మండలం మద్దూర్, పెద్దమందడి మండలం మద్దిగట్ల, వెల్టూర్, జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి, ఇటిక్యాల మండలం షాబాద్, సాతర్ల, పెబ్బేర్ మండలం వైశాఖాపూర్, కొత్తకోట మండలం చర్లపల్లి, మదనాపూర్ మండలం అజ్జకొల్లు, వనపర్తి పట్టణంలో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి రూ.3,96,200 నగదు, రెండు మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఆలయంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీసీకుంట ఎస్ఐ రామ్లాల్, నిరంజన్రెడ్డి, విష్ణు, బాల్రెడ్డి, రవిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 8 ఆలయాల్లో వెండి ఆభరణాల అపహరణ -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిఽధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతభగత్ తెలిపారు. మంగళవారం ఆమె అమరగిరి సమీపంలోని బలపాలతిప్ప వద్ద చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ పనులు, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను పరిశీలించారు. టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గూర్చి స్థానిక అధికారులకు సూచించారు. వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగకుండా, పర్యాటక అభివృద్ధికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సహకారం అందిస్తున్నట్లు వివరించారు. సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం కృష్ణానదిలో బోటులో విహరించారు. కార్యక్రమంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హీరేమత్, డీఎఫ్ఓ రోహిత్గోపిడి, ఎఫ్డీఓలు రామ్మోహన్, చంద్రశేఖర్, రేంజర్ ఈశ్వర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత భగత్ -
జూరాలకు పోటెత్తిన వరద
ధరూరు/రాజోళి/మదనాపురం/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 2.45 లక్షలకు చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 38 క్రస్టు గేట్లను ఎత్తి 2.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 24వేల క్యూసెక్కులు వదలగా.. 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.987 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసులకు లక్ష క్యూసెక్కులు.. సుంకేసుల డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మంగళవారం ఎగువ నుంచి 1.30లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా..ఐదు గేట్లను ఒక మీటర్ మేర, 15 గేట్లను రెండు మీటర్ల మేర తెరిచి 1.25లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 38 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇటిక్యాల/శాంతినగర్: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీయడంతో మంగళవారం సాయంత్రం బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఇటిక్యాల మండలంలోని శనిగపల్లికి చెందిన కుమ్మరి వెంకటేష్, కృష్ణవేణి దంపతుల కుమారుడు వీరేష్ (6) శాంతినగర్లోని సరస్వతి పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లని వీరేష్ తన అక్క పాఠశాల నుంచి బస్సులో వస్తుందని మంగళవారం సాయంత్రం తల్లి వెంట బస్సు వద్దకు వెళ్లాడు. గ్రామానికి వచ్చిన సరస్వతి పాఠశాల బస్సును రివర్స్ తీసే క్రమంలో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బస్సు వెనక ఉన్న బాలుడికి రక్తగాయాలై, అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో మంగళవారం రాత్రి శాంతినగర్కు చేరుకొని, అలంపూర్–రాయిచూర్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. విషయం తెలుసుకున్న శాంతినగర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పాఠశాల యాజమాన్యం, డ్రైవర్పై చర్యలకు డిమాండ్ అలంపూర్–రాయిచూర్ రోడ్డుపై బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన -
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వర్షాలు, సహాయక చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర ప్రాధాన్య అంశాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అధికార, సిబ్బంది హెడ్క్వార్టర్లోనే ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లో ఉన్న వారిని సహాయక శిబిరాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వలన పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా చూడాలని తహసీల్దార్లకు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, చెరువులకు గండ్లు పడితే మరమ్మతు చేపట్టేందుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పెట్టని వాటిని మార్కింగ్ చేసి గ్రౌండింగ్ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఓటర్ మ్యాపింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారథి, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్, ఏపీడీలు ముసాయిదాబేగం, శారద తదితరులు పాల్గొన్నారు. -
ఆశల సాగు
మహబూబ్నగర్ (వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి జలకళ సంతరించుకుంది. చాలాచోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంటలను ఆశిస్తున్న తెగుళ్లు వరితోపాటు ఆరుతడి పంటలకు తెగుళ్లు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్నిరోజులుగా ఎండలు లేకపోవడంతో అధిక వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పంట పొలాల్లో నీరు నిలుస్తుండటంతో తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రస్తుతం పంట పొలాలపై పచ్చ పురుగు దాడి చేస్తుంది. దీంతో తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. అయితే వర్షాలు తగ్గిన తర్వాతే మందులు పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పత్తికి ఊపిరి.. వర్షాకాలం ప్రారంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించి పత్తి రైతులు ముందస్తుగా విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. రైతులు పత్తి పంటపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో అల్పపీడనంతో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో తెల్ల బంగారంగా భావించే పత్తి పంటకు ఊపిరిస్తున్నాయి. జిల్లాలో 85,000 ఎకరాల్లో పత్తి సాగు అంచనాలకు గాను ఇప్పటి వరకు 80,523 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రైతులు కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జోరుగా నాట్లు జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరినాట్లు మందకొడిగా సాగాయి. రైతులు కూడా నారుమడులు సిద్ధం చేసుకున్న నాట్లు వేసుకోలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరి సాగుపై ఆశలు పెంచాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1,00,127 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు.. జోరుగా వరి నాట్లు ఇప్పటికే సగటుకు మించి వర్షపాతం నమోదు మత్తడి దూకుతున్న చెరువులు.. కోయిల్సాగర్కు జలకళ ఆరుతడి పంటలకు పొంచి ఉన్న తెగుళ్ల బెడద మరో రెండురోజులపాటు వర్ష సూచన నమ్మకం పెరిగింది.. వానాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట సాగు చేశాను. ఆ తర్వాత వరుణుడు ము ఖం చాటేయడంతో పంటపై పెట్టుకున్న ఆశలు వదులుకున్నా. ఇప్పుడు మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరి పంట చేతికొస్తుందనే నమ్మకం పెరిగింది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, మాచన్పల్లి గ్రామం, మహబూబ్నగర్ రూరల్ భూగర్భజలాలు వృద్ధి.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పత్తి చేలు వాడు దశలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో ఆ పంటకు ప్రాణం పోసినట్లయింది. అయితే పంటలను ఆశిస్తున్న పచ్చ పురుగు నివారణకు కోరాజెన్ 60 మి.మీ., మందును ఎకరాకు పిచికారీ చేయాలి. అలాగే పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు
పాలమూరు: మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, ఆలోచించి న్యాయపరంగా పోరాటం చేయాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై మహిళలకు అవగాహన కలిగించారు.రేపు జాబ్మేళాజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రైవేట్ రంగ సంస్థల్లో నిరుద్యోగ యువతకు జాబ్లు కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 340 ఉద్యోగాల కోసం నిర్వహించే జాబ్మేళాకు అభ్యర్థులు పూర్తి సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 99485 68830, 89193 80410లను సంప్రదించాలని సూచించారు.ఉద్యోగ, పెన్షనర్లసమస్యలు పరిష్కరించాలిజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్ మంగళవారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై వచ్చే నెల 8న వరంగల్ నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఈ యాత్ర 16న జిల్లాకు చేరుకుంటుందని, ఈ బస్సు యాత్రకు టీఎన్జీఓ సంపూర్ణ మద్దతు పలుకుతుందని చెప్పారు. బస్సు యాత్రను ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.చిన్నారుల్లోని నైపుణ్యాలు వెలికితీయాలిదేవరకద్ర: ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని డీఈఓ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక అవసరాల చిన్నారులకు కావాల్సిన వినికిడి యంత్రాలు, వీల్చైర్లు, ప్రైస్ రెంలేటర్సు, సీపీ చర్చ్, బ్రైలీ కిడ్స్, క్రష్ క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు అవసరమైన వారిని గుర్తించి త్వరలో అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించరాదని, సాధారణ పిల్లల మాదిరిగానే వీరు కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. భవిత సెంటర్లలో చదువుతోపాటు వారికి ఫిజియో, స్పీచ్ థెరపీ సేవలు, అవసరమైన ఉపకరణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం డోకూర్ సమీపంలోని కేజీబీవీని డీఈఓ సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ బాలుయాదవ్, ఎంఈఓలు బలరాం, మంజులత, జిల్లా అధికారులు సుధాకర్రెడ్డి, స్పెషల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాం.. మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే ఇక్కడి నుంచి పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ మానవీయ కోణంలో చేపడతాం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ ● -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట నాయకులు రాయుడు, కుర్మయ్య, రాములు, నర్సప్ప తదితరులున్నారు. -
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గురుకులాలు, సంక్షేమ హాస్లళ్లను అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకాధికారు లు తమకు కేటాయించిన వాటిని తనిఖీ చేసి విద్య ఐ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమస్యలు గుర్తిస్తే మరమ్మతు, మౌలిక వసతులు, అత్యవసర పనులను వెంటనే అంచనా వేసి మంజూరు తీసుకుని పనులు చేయించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేపట్టకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. ఇందరిమ్మ ఇళ్లు పీఏఎంఏవై సర్వే చేసి యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రాధాన్యతగా భావించి ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజూ పదిఇళ్లు సర్వే చేయాలన్నారు. అప్పుడే కేంద్రం గ్రాంట్స్ మంజూవుతాయన్నారు. ఐదుశాతం కంటే తక్కువ సర్వే చేసి అప్లోడ్ చేసినవారికి షోకాజ్ జారీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అలాగే వర్షాలు పడుతున్నందున ప్రత్యేకాధికారులు ఎండీపీఓలు, తహసీల్దార్లను జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంచాలన్నారు. రోడ్లు, చెరువులు, గండి పడినా తక్షణ మరమ్మతు చేపట్టాలన్నారు. ప్రజావాణికి 82 ఫిర్యాదులు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 82 ఫిర్యాదులు రాగా.. కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండింగ్ పెట్టుకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు పాల్గొన్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం)/మహబూబ్నగర్ క్రైం/భూత్పూర్: జిల్లావ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో అడపాదడపా వర్షం కురిసినా.. రోజంతా ముసురు కమ్మేసింది. జిల్లాలో అత్యధికంగా చిన్నచింతకుంటు మండలంలో 6.04 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మూసాపేటలో 5.16 సెంమీ, కౌకుంట్ల 4.48, కోయిలకొండ 4.02, గండేడ్ 4.16, హన్వాడ 4.46, భూత్పూర్ 4.15, అడ్డాకుల 3.64, మహహ్మదాబాద్ 3.94, జడ్చర్ల 3.83, మిడ్జిల్ 3.20, రాజాపూర్, బాలానగర్ 3.04, మహబూబ్నగర్ అర్బన్ 3.51, దేవరకద్ర 3.4, నవాబుపేట 3.48, మహబూబ్నగర్ రూరల్ 2.97 సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 823 చెరువులు, కుంటలు ఉండగా.. 599 చెరువులు అలుగు పారుతున్నాయి. దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు పలు చెరువులు మత్తడి దూకుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. భూత్పూర్ మండలంలోని పోతులమడుగు–గోపన్నపల్లి గ్రామాల మధ్య కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ ప్రభాకర్ ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం జిల్లాలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా సహాయం అవసరం అయిన వాళ్లు 87126 59360 నంబర్తో పాటు డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరంతరం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వర్షం ఎలాంటి ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. చేపల వేటకు వెళ్లొద్దు: ఎస్పీ జిల్లాకేంద్రంలోని అప్పన్నపల్లి బ్రిడ్జిపై వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఎస్పీ డి.జానకి సోమవారం పరిశీలించారు. మయూరి పార్క్–జాలీహిల్స్ మలుపు దగ్గర గుట్టపై నుంచి వచ్చే వర్షం వరద కారణంగా రోడ్డు అంచుభాగం కోతకు గురైంది. దీంతో కాంట్రాక్టర్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. రోడ్డుకు వెంటనే అవసరమైన మరమ్మతు చేయాలని సూచించారు. నిరంతరం వర్షాలు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. డ్రెయినేజీలు, మ్యాన్హోల్స్ తెరిచి ఉంటాయని, పాదాచారులు జాగ్రత్తగా నడవాలన్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపై ప్రయాణం చేయరాదని, ఇనుప తీగలపై దుస్తులు అరబెట్టరాదన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే నదులు, వాగుల్లో చేపల వేటకు వెళ్లరాదన్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. పోలేపల్లి రంగనాయకమ్మ చెరువు మత్తడి దూకుతుండడంతో.. ఇలా అలుగుపై నుంచే రాకపోకలు సాగిస్తున్న పోలేపల్లి, కిష్టారం గ్రామస్తులు రోజంతా నగరాన్ని కమ్మేసిన ముసురు సీసీ కుంటలో అత్యధికంగా 6.04సెం.మీ వర్షపాతం నమోదు -
అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ !
‘జిల్లా కేంద్రంలోని మోతీనగర్కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడికి జ్వరం వస్తే తల్లిదండ్రులు రాజేంద్రనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు బాలుడిని పరీక్షించిన వైద్యుడు డెంగీ పరీక్షతో పాటు ఇతర రక్త పరీక్షలు చేయించాలని టెస్ట్లు రాశాడు. అదే ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్కు వెళ్లాగా..రక్త పరీక్షలకు రూ.3,500 వసూలు చేశారు. డెంగీ నిర్ధారణ కావడంతో ఆడ్మిట్ చేసుకొని చికిత్స చేయాలని చెప్పి దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యంచేసి..రూ.60 వేల వరకు బిల్లు తీసుకున్నారు.’ పాలమూరు: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఉండే వైద్యుల వివరాలు, సౌకర్యాలు తదితరలన్నీ జిల్లా వైద్యారోగ్యశాఖలో వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని ప్రత్యేక విభాగం నుంచి ప్రతి ప్రైవేట్ ఆస్పత్రికి అనుమతులు పొందుతున్నప్పటికీ వారు సమర్పించిన వివరాల మేరకు తనిఖీల సందర్భంగా ఉండటం లేదు. తరచూ వైద్యులు మారుతున్నా వివరాలను నమోదు చేయడం లేదు. స్కానింగ్ కేంద్రాలతో పాటు ల్యాబ్ల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. నిబంధనలను విస్మరించి యథేచ్ఛగా స్కానింగ్లు చేస్తున్నారు. దీంట్లో కొన్ని తనిఖీల్లో వెలుగులోకి రాగా.. మరికొన్ని బయటకు రాకుండా లోలోపల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ● జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చాలా వరకు అనుమతులు తీసుకున్న సమయంలో ఉన్న పడకలు (బెడ్స్) ఆ తర్వాత ఉండటం లేదు. 20 పడకలతో అనుమతి తీసుకుంటే కొన్ని రోజుల వ్యవధిలో వాటి సంఖ్య రెట్టింపు చేసుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు పొందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి పెంచితే మరికొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి తగ్గిస్తున్నారు. ఇక ఆరోగ్య శ్రీ అనుమతులు తీసుకోవడానికి 35 పడకలతో పాటు మూడు రకాల విభాగాలు ఉండాల్సి ఉంటుంది. దోచుకుంటున్నారు.. జిల్లా కేంద్రంలోని ఉండే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు సిండికేట్గా మారారు. అందరూ కలిపి ఒక ధరలు నిర్ణయించుకొని ఆ ప్రకారం వసూలు చేస్తున్నారు. సాధారణంగా చెస్ట్ సీటీ స్కాన్ చేయడానికి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు తీసుకుంటే ఎంఆర్ఐ బ్రెయిన్లో పలు రకాల స్కానింగ్కు రూ.5,000నుంచి రూ.8,000 వరకు తీసుకుంటున్నారు. ఇక డెంగీ, మలేరియా, వైడల్, సీబీపీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఫ్టీ, లిపిడ్ ప్రొపైల్, హార్మోన్స్ పరీక్షలు ఇలా కొన్ని రకాల రక్త పరీక్షలకు రూ.1,500 నుంచి రూ.2500 వరకు చార్జ్ చేస్తున్నారు. చాలా వరకు గ్రామాల నుంచి రోగులను ఆర్ఎంపీ రెఫర్ చేస్తుండగా.. ఇందులో ఆర్ఎంపీలకు 40 శాతం, స్కానింగ్ కేంద్రాలకు 60 శాతం లెక్కన కమీషన్లు పంచుకుంటున్నారు. తనిఖీల్లో గుర్తిస్తాం జిల్లాలో ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా ఉన్న ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్లలో తనిఖీలు నిర్వహిస్తాం. ప్రోగ్రామ్ అధికారులకు, మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి వారి పరిధిలో లైసెన్స్ లేకుండా నిర్వహించే వాటిపై నివేదిక తయారు చేయాలని చూస్తాం. తనిఖీలు చేసి సదరు నిర్వహకులకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ఆస్పత్రుల నిర్వహణ, పీఎన్డీటీ(కాన్పుకు ముందు లింగ నిర్ధారణ) చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు’ బోర్డులను స్కానింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసి నిర్దిష్ట ధరల పట్టిక ప్రదర్శించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలకేంద్రాల్లో కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు వారి పేరు ముందు డాక్టర్ అని రాసుకొని ఏకంగా ఆస్పత్రులు తెరిచి అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను వారే ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీలు మండల కేంద్రాల నుంచి పట్టణంలో ఉండే అనుమతులు లేని ఆస్పత్రులకు వైద్యం కోసం రెఫర్ చేసి పంపుతున్నారు. ఇందులో నిర్వాహకులు పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఊరూ పేరు లేని వైద్యుల సిఫార్సుతో గర్భిణీలకు స్కానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు సొంతంగానే గర్భిణీలకు స్కానింగ్లు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల్లో ఇష్టారాజ్యంగా ధరలు అర్హులు లేకపోయినా వైద్యచికిత్సలు క్షేత్రస్థాయిలో అర్హత లేని, అనుమతి లేనికేంద్రాలు ఎన్నో.. తనిఖీలు మరిచిన ఆరోగ్యశాఖ -
పనుల బాధ్యత మీది.. నిధుల బాధ్యత నాది
జడ్చర్ల: నియోజకవర్గంలో భారీ వర్షాల పట్ల సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏఏ పనులు చేస్తారో ఆ బాధ్యత మీది.. అందుకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని ఎమ్మెల్యే అనిరధ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అధిక వర్షాలు, ఇబ్బందులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాటట్లాడుతూ.. చెరువులు, వాగులు, ప్రవాహాల ఉధృతి తీవ్రంగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా చెరువులను సందర్శించి బలహీనపడిన కట్టలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. చెరువు కట్టల పటిష్టతపై సర్వేచేసి ప్రమాదం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పడు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పనులు చేపట్టేందుకు రూ.11కోట్లతో సేఫ్టీ బడ్జెన్ను ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆయన సీఎండీకి ఫోన్ చేసి విషయం చెప్పగా.. సానుకూలంగా స్పందించారు. జడ్చర్లలో నల్లకుంట, నల్లచెరువు, ఊరచెరువుకు సంబంధించిన వరద నీరు ప్రవహించే ఫీడర్ ఛానల్స్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం నీరు రోడ్లపైకి రాకుండా, వరదల కారణంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరో 20ఏండ్ల వరకు సరిపోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా వెంచర్లు తదితర ప్లాటింగ్ చేస్తే నిర్మొహమాటంగా తొలగించాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నియోజకవర్గం స్థాయిలో అన్నిశాఖల అధికారులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో సమస్యలపై స్పందించే విధంగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలోఅధికారులతో సమీక్ష వంతెన నిర్మించాలని వినతి పోలేపల్లి–కిష్టారం మధ్య పోలేపల్లి చెరువు అలుగు పారుతుండడంతో రాకపోకలు నలిచిపోయాయని వెంటనే అక్కడ వంతెన నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అలాగే అంబటాపూర్–కిష్టారం మధ్య బీటీరోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 284లో ఇచ్చిన ఎన్ఓసీ రద్దు చేసి నాగులకుంటను పునరుద్ధరించాలని, చెరువును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సంఘం గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, సంఘం నాయకులు పలు తీర్మానాలు చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు, సకాలంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సంఘ భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలన్నారు. అనంతరం ఆనంద్గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అదనపు కార్యదర్శి కె.సత్యన్నచారి, నాయకులు రహిమాన్సోఫి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. -
హేమసముద్రం చెరువుకు నిధులు కేటాయించాలి
హన్వాడ: జిల్లాలోనే అతి పెద్దది అయిన మండలంలోని హేమసముద్రం చెరువుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ చెరువును రిజర్వాయర్ చేద్దామనుకున్నా.. ఓ గ్రామం, రెండు తండాలు ముంపునకు గురవుతున్నాయన్న కారణంతో విరమించుకొని.. ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలతో నింపేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువుకట్టకు ఏర్పడిన గండికి అధికారులు తీసుకున్న చర్యలపై ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టకు ఏర్పడిన గండి కారణంగా చెరువులోని నీరు లీకై పంటతోపాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో తీవ్ర వర్షాలతో వచ్చే నీటిని ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు నింపుకొనేవాళ్లమని, ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని విమర్శించారు. అధికారులు తీసుకున్న చర్యలు సక్రమంగా లేవని, బుంగ మరమ్మతు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అలాగే చెరువులు, కుంటలపై అధికారులు పర్యవేక్షణ చేసి తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు జంబులయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు, నరేందర్, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ముకుందా.. ముకుందా
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉట్ల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంలోని చివరి శనివారం రాత్రి స్వామివారి సన్నిధిలో ఉట్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉట్ల మహోత్సవంలో ఓబ్లాయపల్లి గ్రామానికి చెందిన భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు. ఉట్ల మహోత్సవం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారిని పల్లకీలో గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన్యంకొండకు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. వైభవంగా శేషవాహనసేవ వేంకటేశ్వరస్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. దేవస్థానంలో ప్రతి శనివారం స్వామివారి తిరుచ్చిసేవ జరిపిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారి విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను రెండోరోజు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి కలశాభిషేకం, పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, అలంకారం తదితర పూజలు చేశారు. సాయంత్రం మురళీకృష్ణ మందిరం నుంచి పద్మావతికాలనీ కమాన్ వరకు స్వామివారిని రథంలో ఊరేగించి.. ఉట్ల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మన్యంకొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు -
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఉధృతంగా పారుతున్నాయని ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదివారం ఆమె హన్వాడ, చిన్నదర్పల్లి, బోయపల్లి, టంకర చెరువులను పరిశీలించారు. చెరువులలో నీటి మట్టం ఎలా ఉంది.. వర్షాల వల్ల ముంపు గ్రామాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఆరాతీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వరద ప్రభావం ఉండే గ్రామాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా నిమజ్జనం సందర్భంలో యువకులు క్రమశిక్షణ పాటించాలని, చిన్నారులను చెరువుల దగ్గరకు తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి ఊరేగింపులో పాల్గొని.. నిమజ్జనం కోసం చెరువుల దగ్గరకు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు నిండిన క్రమంలో వాటి పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు పడిపోవడం జరుగుతాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రైతులు, పశువుల కాపరులు పొలాల దగ్గరకు వెళ్లే సమయంలో విద్యుత్ మోటార్ల దగ్గర, పాములతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలో గణనాథుడిని ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపుల అనుమతి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ ప్రత్యేక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఏర్పాటు చేసే సమాచారం కేవలం మండపం నిర్వహణ సమాచారం మాత్రమే ఉంటుందని, దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి పోలీస్ శాఖ ఆన్లైన్లో అనుమతులు జారీ చేస్తుందని, ఆ తర్వాతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
కాల్పులు విరమించి.. శాంతి చర్చలు జరపాలి
అచ్చంపేట: కగార్ హత్యాకాండను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరిపి.. కాల్పుల విరమణ పాటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు వరంగల్ అంబేడ్కర్ భవన్లో ఈ నెల 24న నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి వాల్పోస్టర్లను ఆదివారం అచ్చంపేట అమరవీరుల స్థూపం వద్ద పలువురు నాయకులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నర దశాబ్దాలుగా ఆదివాసీలను వెంటాడుతూ, హత్యలు చేస్తూ రూ.కోట్లాది విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసి ఉద్యమాలు బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో సల్వా –జుడుము, గ్రీన్ హంట్, సమాదాన్ ప్రహార్ ఆపరేషన్లు, కగార్ పేరుతో పాశవికమైన హత్యాకాండను కొనసాగిస్తున్నాయన్నారు. 70 ఎన్కౌంటర్లలో 600లకు పైగా ఆదివాసీలను, ఉద్యమకారులను హత్య చేసిందన్నారు. ఇది చాలదన్నట్లు ఇంకా దారుణ మారణకాండను కొనసాగిస్తూ 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్ను నిర్మిస్తామని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ప్రగల్బాలు పలుకుతున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో సీఎల్సీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, టీపీఎప్ రాష్ట్రకో కన్వీనర్ ఎడ్ల అంబన్న, బయ్యని శ్రీశైలం, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు ముద్దునూరి లకీ్ష్మ్నారాయణ, జిల్లా కో–కన్వీనర్ పర్వతాలు, నల్లమల కళాకారులు జక్క గోపాల్, టీఎన్వీఎఫ్ కన్వీనర్ గోరటి అనిల్ కుమార్, సీఎల్సీ నాయకులు పంబలి బాలయ్య, బియ్యని వెంకటేష్, నారుమల్ల లకీ్ష్మ్నారాయణ, డీటీఎఫ్ నాయకులు చారగొండ శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
గద్వాల క్రైం: గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని హమలీకాలనీలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి చిన్న రాములు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి మూడురోజుల కిందట హైదరాబాద్లోని బంధువుల వద్దకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపునకు వేసిన తాళం తెరుచుకొని కనిపించింది. లోనికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఘటన స్థలానికి చేరుకొని చోరీ ఘటనపై ఆరా తీశారు. సాంకేతిక నిపుణులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెడ్రూంలోని బీరువాలో భద్రపర్చిన 16 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. 16 తులాల బంగారు ఆభరణాల అపహరణ -
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/రాజోళి/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. శనివారం రాత్రి 8 గంటలకు వరకు 85 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెకులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి 77,946 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 38,818 వదలగా.. 46 క్యూసెక్కులు ఆవిరైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయినీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.989 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసులకు 53వేల క్యూసెక్కులు.. సుంకేసులకు ఆదివారం ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో 53వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో 12 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 49,632 క్యూసెక్కులను దిగుకు, కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేసీ మహేంద్ర తెలిపారు. 415 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి.. జూరాలకు ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది లక్ష్యానికి చేరువగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ ఏడాది మే నుంచే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 2025 –26 కు సంబంధించి 610 మి.యూనిట్లు లక్ష్యం కాగా.. ఆగస్టు 17 నాటికి 415 మి.యూనిట్లు చేరుకుంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుంచి జూరాలకు వరద పోటెత్తుతోంది. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుంది. ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 236.943 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వార 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి -
శిక్షణ.. ఉపాధి
ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండ లేని యువతకు.. సాంకేతిక విద్య అభ్యసించినా నైపుణ్యం లేని విద్యార్థులకు.. వివాహమై ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని పరితపించే అతివలకు.. డిమాండ్ ఉన్న రంగాల్లో పట్టు సాధించాలి అనే యువకులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్.. యువకులకు కంప్యూటర్ హార్డ్వేర్, సీసీ కెమెరాల రిపేర్, డ్రోన్ల నిర్వహణ.. ఇలా ఎన్నో అంశాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితోపాటు పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. తాజాగా ఈ శిక్షణ కేంద్రం జడ్చర్లలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. – జడ్చర్ల నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడానికి 1978లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా యువతకు శిక్షణ ఇచ్చేది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థ 2007 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచడానికి జిల్లాలకు విస్తరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25కు సంబంధించి జహిరాబాద్, జడ్చర్లలో మరో రెండు సెట్విన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు గతేడాది ఆగస్టులో జడ్చర్లలోని జౌఖీనగర్లో నిరుపయోగంగా ఉన్న గురుకుల భవనాన్ని ఆయనతోపాటు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, సంస్థ ఎండీ వేణుగోపాల్ పరిశీలించారు. అక్టోబర్లో కేంద్రాన్ని ప్రారంభిస్తామని కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు త్వరలో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధిత పాలకులు, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎంతో మందికి ఉపాధి జడ్చర్లలోని జౌఖీనగర్ గురుకుల భవనాన్ని శిక్షణకు సిద్ధం చేశారు. రూ.20 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర మౌళిక వసతులు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 శిక్షణా కేంద్రాల ద్వారా యువత, అతివలకు శిక్షణ అందిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఆయా సర్టిఫికెట్లతో దేశంలోని ఎక్కడైన పరిశ్రమలు, తదితర యూనిట్లలో ఉపాధి పొందవచ్చు. సెట్విన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతేగాక స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఈ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న శిక్షణ కేంద్రం జడ్చర్లలో ఏర్పాటు కావడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు కోర్సులలో శిక్షణ రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పలు రంగాల్లో నైపుణ్యతను పెంచేందుకు సెట్విన్ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రధానంగా యువతకు అక్కరకు వచ్చే వృత్తులలో సంతరించుకుంటున్న ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, జరీ అల్లడం వంటి ప్రాధాన్యత కోర్సులతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ హార్డ్ వేర్, ఎయిర్ లైన్ టికెటింగ్, సెల్ఫోన్ రిపేర్, స్పోకెన్ ఇంగ్లీష్, ప్రింటింగ్ ప్రెస్, సీసీ కెమెరాల మరమ్మతులతో పాటు ఏసీ, వాషింగ్మిషన్, ఆర్ఓ మిషన్స్, కటింగ్ అండ్ టైలరింగ్, డ్రోన్ నిర్వహణ, తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వనుంది. అయితే మొదటగా కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గా ర్మెంట్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్ కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అడ్మిషన్లు ప్రారంభం సెట్విన్ శిక్షణ కేంద్రంలో దాదాపు 400 మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఎంపిక చేసిన కోర్సులలో 3 నెలల పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకు నామమాత్రంగా ఫీజు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తాం. ఈ సర్టిఫికెట్లు పొందిన వారికి పరిశ్రమలలో, బ్యాంకు రుణాల మంజూరులో తగు ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయి. – విజయ్కుమార్, సెట్విన్ కోఆర్డినేటర్, జడ్చర్ల సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో నిరుద్యోగ యువతీ,యువకులకు సెట్విన్ శిక్షణ కేంద్రం వరం లాంటింది. ఇక్కడ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ,ఉపాధి రంగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు మాత్రమే కాకుండా ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల నిరుద్యోగుల పాలిట వరం.. సెట్విన్ శిక్షణ కేంద్రం మహిళలు, యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ జడ్చర్లలో ఏర్పాటుకు సర్వం సిద్ధం రూ.20 లక్షలతో భవనంలో మౌలిక వసతుల కల్పన -
జాతిపితకు అవమానం
కల్వకుర్తి టౌన్: జాతిపిత మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం పట్టణంలోని చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ల నుంచి ధ్వంసం చేసి పక్కనే పడేశారు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు -
పోలేపల్లి–కిష్టారం మధ్య నిలిచిన రాకపోకలు
జడ్చర్ల టౌన్: భారీవర్షాల కారణంగా మండలంలోని పోలేపల్లి–కిష్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి సమీపంలోని రంగనాయక చెరువు మత్తడి దూకడంతో భారీగా వరదనీరు రోడ్డుపై పారుతోంది. దీంతో జడ్చర్ల–నవాబుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఫార్మకంపెనీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిష్టారం, ఖానాపూర్, ఉదండాపూర్ తోపాటు నవాబుపేట మండలంలో నివాసముంటున్న ఫార్మ ఉద్యోగులు విధుల్లోకి చేరేందుకు బయలుదేరగా రోడ్డుపై వరదనీరు పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. చెరువు అలుగునీరు నుంచి ఇబ్బందులు తొలగించేందుకు రోడ్డ్యాం నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రాయపల్లి, గుండ్లగడ్డతండాకు.. పోలేపల్లి నుంచి రాయపల్లి, గుండ్లగడ్డతండాకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి నుంచి రాయపల్లికి వెళ్లేమార్గంలో దర్గావద్ద ఫీడర్చానల్ మూసివేయడంతో వరదనీరు ఎటూపోలేక గ్రామంచుట్టూ నీళ్లు నిల్చున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ప్రహరీ నిర్మించడంతో వరదనీరు పోవడంలేదని, ఇదే విషయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రహరీ కూల్చివేసి నీళ్లువెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నర్సింగ్రావును ఆదేశించారు. మంగళవారం పోచమ్మ బోనాలు, శుక్రవారం దర్గా ఉర్సు ఉండగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
దేవరకద్రలో కార్డెన్సెర్చ్
దేవరకద్ర: మున్సిపాలిటీ కేంద్రంలో శాంతిపరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసులు కార్డెన్సెర్చ్ నిర్వహించారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్నతోపాటు మరో 8మంది ఎస్ఐలు, 80 మంది పోలీసులు దేవరకద్రలోని అన్నివార్డుల్లో కవాతు నిర్వహించి ఇంటింటికి తిరిగి కార్డెన్సెర్చ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుని ఆధార్ కార్డులను పరిశీలించారు. కొత్తవారు, అనుమానితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 బైక్లు, కారును సీజ్ చేశారు. రాత్రి వేళ కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యువకులకు సూచించారు. -
జూరాలకు 95వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 95వేల క్యూసెక్కులకు వరద వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 6 క్రస్టు గేట్లను ఎత్తి 41,112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 38,879 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 80,374 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువలో 6 యూనిట్ల ద్వారా 230.683 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 273.706 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఏఈ శ్రీధర్ తెలిపారు. సుంకేసులకు 32 వేల క్యూసెక్కులు రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 7 గేట్లను తెరిచి 30,653 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. అలాగే కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ఎత్తివేత ప్రాజెక్టు నుంచి 80,374 క్యూసెక్కుల నీరు దిగువకు.. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జడ్చర్ల: రెండు రోజుల కిందట చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటకు చెందిన భాను(24) మిత్రులతో కలిసి ఈ నెల 14న జడ్చర్ల వంద పడకల ఆసుపత్రి సమీపంలో ఎగువ నుంచి వస్తున్న వరదలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు శనివారం సమీప ముళ్ల పొదల్లో యువకుడి మృతదేహం ఉండడాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డీసీఎం బోల్తా.. తప్పిన ప్రమాదం
కొత్తకోట రూరల్: ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కొత్తకోట మండలం పాలెం సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం నుంచి హైదరాబాద్కు ఇనుము లోడ్ తీసుకెళ్తున్న వాహనం శనివారం తెల్లవారుజామున పాలెం బ్రిడ్జి సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ యాదగిరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, హైవే సిబ్బంది వచ్చి వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
ఇంట్లో తయారీ.. పట్టణాల్లో విక్రయం
పాలకోవాను ఇంట్లోనే సిద్ధం చేస్తారు. ఉదయం పాలసేకరణ అనంతరం కట్టెలపొయ్యిపైనే పాలకోవను తయారు చేస్తారు. ఆ తర్వాత కర్నూల్, అయిజ, శాంతినగర్, అలంపూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తారు. మిఠాయి, ఇతర దుకాణాలకు సైతం పాలకోవాను సరఫరా చేస్తున్నారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకోవాను విక్రయిస్తారు. ఇళ్లు అలంపూర్– రాయచూరు రోడ్డుమార్గంలో ఉండడంతో ఈ మార్గాన ప్రయాణించేవారు కొనుగోళు చేస్తారు. పట్టణాల్లో సైతం వీళ్లు తయారు చేసే పాలకోవాను నిరంతరం కోనుగోళు చేసే వినియోగదారులు, ఉద్యోగులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
గట్టు: మరో గంటన్నర ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు. తెల్లారక ముందే ఆ ఇద్దరు ప్రాణాలు సిమెంట్ (సిమెంట్ తయారి కోసం బూడిదను తీసుకెళ్లే లారీ) లారీ రూపంలో గాలిలో కలిశాయి. తెలంగాణ–కర్ణాటక సరిహద్దుల్లో రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్ద కారును సిమెంట్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాచర్లకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి పీజీ రాఘవేంద్ర(42)తో పాటుగా ఇదే గ్రామానికి చెందిన అల్లుడు తౌడు నాగన్న అలియాస్ నాగేష్(50)లు మాచర్లకు చెందిన చేనేత కార్మికుడు వస్త్రా వ్యాపారి పీజీ మాసుమన్న, పీజీ రాఘవేంద్ర తండ్రీకొడుకులు సొంతకారులో రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పూనేకు వస్త్రాల కొనుగోలు కోసం వెళ్లారు. శుక్రవారం వారు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో మహారాష్ట్రలోని షోలాపూర్లో మాచర్లకు చెందిన భార్యాభర్తలు ఈరమ్మ అలియాస్ జయంతి, ఆమె భర్త నాగన్న, అలియాస్ నాగేష్లను కారులో మాచర్లకు రావడానికి ఎక్కించుకున్నారు. వారి ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గం దాటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ కారును ఢీ కొట్టింది. డ్రైవింగ్ సీటులో ఉన్న రాఘవేంద్ర (42)తో పాటు పక్క సీటులో కూర్చున్న మాచర్ల అల్లుడు నాగేష్(50)అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుక సీటులో కూర్చున్న తండ్రి పీజీ మాసుమన్న, జయంతి గాయాలతో బయట పడ్డారు. జయంతికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రస్తుతం ఆమె రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కర్ణాటకలోని సైదాపూర్ ఎస్ఐ వినయ్బడిగేర కేసు నమోదు చేసి మృతదేహాలను రాయచూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాఘవేంద్రకు భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన నాగన్నకు ఇద్దర కుమారులు ఉన్నారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. భర్త మరణం భార్యకు తెలియకుండా.. లారీ రూపంలో మృత్యువు కబళించగా, కర్ణాటకలోని సైదాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జయంతి భర్త నాగేష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం జయంతికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. కాళ్లు, చేతులు విరిగి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం అనంతరం రాఘవేంద్ర మృతదేహాన్ని మాచర్లకు, నాగేష్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని షోలాపూర్కు తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సైదాపూర్ వద్ద కారును ఢీకొట్టిన లారీ కర్ణాటక సరిహద్దులో ప్రమాదం మాచర్లలో విషాదఛాయలు -
డ్రెయినేజీలో పడి పారిశుద్ధ్య కార్మికుడి మృతి
వనపర్తి రూరల్: మండలంలోని అంకూరులో డ్రెయినేజీలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసున్నట్లు ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము రాములు(43) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం గ్రామంలోని రైతువేదిక దగ్గర డ్రెయినేజీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరాడక మృతిచెందాడు. మృతుడి కుమారుడు కొమ్ము వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి బల్మూర్: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ వివరాల ప్రకారం.. మండలంలోని గోదల్ గ్రామానికి చెందిన బాల్రాం(78) ఈనెల 13న ఇంట్లోని బాత్రూంలో కాలుజారి కిందపడ్డాడు. దీంతో వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అందజేశారు. అతని కుమారుడు చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తిమ్మాజీపేట: విద్యుదాఘాతంతో మండలంలోని మారేపల్లి చెందిన ఇప్పలపల్లి అంజలయ్య (68) మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంజలయ్య ప్రతి రోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని కావేరమ్మ చెరువుకు కాలకృత్యాలకు వెళ్లేవాడు. యథావిధిగా శనివారం కూడా బహిర్భూమికి వెళ్లిన అంజలయ్య దారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన చిన్నయ్య బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భార్య బుచ్చమ్మ, ఇద్దరు కుమారులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి చిన్న కుమారుడు శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆరోగ్యశ్రీ అధికారినని బురిడీ అచ్చంపేట రూరల్: తాము ఆరోగ్యశ్రీ అధికారులమని ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన అచ్చంపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మధురానగర్ కాలనీకి చెందిన ఓ మహిళకు గత నెలలో కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తాను ఆరోగ్యశ్రీ అధికారినని.. మీకు ఆరోగ్యశ్రీ నుంచి రూ.15వేలు రానున్నాయని చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆ మహిళ అతనికి ఓటీపీ చెప్పింది. కాల్ ముగిసిన తర్వాత చూస్తే ఆమె ఖాతాలో రూ.16వేలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తిరిగి అతనికి కాల్ చేస్తే కలవలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ విజయభాస్కర్ కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ మోసానికి గురైతే వెంటనే జాతీయ హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్ఐ సూచించారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు: ఎంపీ
చిన్నచింతకుంట: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం చిన్నచింతకుంటలో వాల్మీకి, ముదిరాజ్ సంఘాల కమ్యూనిటీ భననాల నిర్మాణాలకు భూమి పూజ చేయడంతో పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కేంద్రం నిధులు లేనిదే రాష్టంలో ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగవని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, అంగన్వాడీలు, శ్మశాన వాటికలు, పీఎం ఆవాస్యోజన కింద నిరుపేదలకు ఇళ్లు, మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్, రైతులకు కిసాన్సమ్మాన్, ఎరువలపై సబ్సిడీ..తదితర వాటిని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్తో పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వారి మోసపూరిత పాలనను ప్రజలు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి ప్రతి రూపాయి ప్రజలకు చేరవేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్లో ప్రతిపాదన పెట్టమని, అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పద్మజారెడ్డి, పవన్కుమార్రెడ్డి, కొండా ప్రశాంత్రెడ్డి, కుర్వ రమేష్, భరత్ భూషన్, నంబిరాజు, బోయ రాము, దశరథ్, తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరులోభారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి 9.30 నుంచి పది గంటల వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని డ్రెయినేజీలు నిండి పొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో అండర్–15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు.జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి సుమారు 150 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన 20 మంది ఈ నెల 18, 19న హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి ఆర్.శారదాబాయి, మాజీ కార్యదర్శి కె.రమేష్ బాబు, సీనియర్ పీఈటీలు నిరంజన్రావు, శైలజ, శ్రీనివాసులు, రాంచందర్, ఖాజామైనొద్దీన్ పాల్గొన్నారు. -
ఊడ్చడానికి ఎవరూ రారు
మా ప్రాంతంలో ఊడ్చడానికి నెలల తరబడి ఎవరూ రావడం లేదు. చుట్టుపక్కల అంతా అపరిశుభ్ర వాతావరణం అలుముకుంది. మోరీలను శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలకు నిలయంగా మారాయి. ఇంట్లోని చిన్నపిల్లలను ఆడుకోవడానికి ఆరు బయటకు పంపించాలంటేనే భయంగా ఉంది. ఇప్పటికే మా కాలనీకి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. – మేఘన, గృహిణి, క్రిస్టియన్కాలనీ, సుభాష్నగర్ వరద కాల్వతో ఎన్నో ఇబ్బందులు మా స్కూల్ వెనుకనే పెద్దచెరువుకు వెళ్లే వరద కాల్వ ఉంది. అందులో చెత్తాచెదారం, మురుగు పారుతుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్లో చుట్టుపక్కలవారు వచ్చి చెత్తాచెదారం వేసి పోతున్నారు. ముళ్లకంప, పొదలతో నిండిపోయింది. దీంతో ఇక్కడి మదర్సాలలో చదువుకుంటున్న చిన్నారులకు రోగాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. – మొహమ్మద్ హమీద్, మదర్సా వాచ్మన్, పీర్లబాయి, మహబూబ్నగర్ చుట్టూ కార్ఖానాలతో కాలుష్యమయం మా గేరి చుట్టూ వాహనాల మరమ్మతు చేసే కా ర్ఖానాల నుంచి వెలువడే కాలుష్యంతో ఇబ్బందు లు తప్పడం లేదు. వీధి లోపలికి ఎవరూ ఊడ్చ డానికి రావడం లేదు. ఎవరి ఇళ్ల ముందు వారే శుభ్రం చేసుకునే పరిస్థితి తలెత్తింది. మెయిన్ రోడ్డు నుంచి కార్ఖానాలు ఉండే షాపుల వరకు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఊడ్చిపో తున్నారు. థియేటర్ పక్కన మోరీ వద్ద ఎవరిబడితే వారు మూత్రం చేస్తున్నారు. – యాదగిరి, ఆటో డ్రైవర్, కొమ్ముగేరి, మహబూబ్నగర్ ● -
ఏఎస్ఐ మహ్మద్ మోయిజుద్దీన్కి ఇండియన్ పోలీస్ మెడల్
మహబూబ్నగర్ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ పోలీస్ శాఖలోని డీసీఆర్బీలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మహ్మద్ మోయిజుద్దీన్కు ఇండియన్ పోలీస్ మెడల్ను భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 1989లో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై న మోయిజుద్దీన్ ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, తిమ్మాజిపేట, జడ్చర్ల, పెద్దకొత్తపల్లి, కోస్గి పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించాడు. 2012లో హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి పొంది డీసీఆర్బీలో పనిచేశారు. 2018లో ఏఎస్ఐగా పదోన్నతి వచ్చిన తర్వాత సీసీఎస్ మహబూబ్నగర్, హన్వాడ, ట్రాఫిక్ పోలీస్స్టేషన్, కోయిలకొండ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించాడు. తన విశిష్ట సేవలకు గాను ఇప్పటి వరకు 70 క్యాష్ రివార్డులు, 18 జీఎస్ఈ, 12 ప్రశంసాపత్రాలు, ఒక సేవా పతకం, 2017లో టీఎస్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పథకం, 2019లో ఉత్తమ పోలీస్ పతకం అందుకున్నారు. ఇండియ పోలీస్ మెడల్ వచ్చిన మోయిజుద్దీన్ను ఎస్పీ జానకి అభినందించారు. జాతీయ రహదారిపై నిఘా : డీఐజీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో భూత్పూర్– షేర్పల్లి మధ్యలో జాతీయ రహదారిపై వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. షేర్పల్లి పరిధిలో ఉన్న కోమటికుంట చెరువు అలుగు పారడంతో వరద నీరు అధికంగా జాతీయ రహదారి–44పైకి వచ్చింది. దీంతో వాహన రాకపోకలకు అడ్డుగా మారడంతో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారి కావడంతో పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి సమస్యను పరిష్కరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారి వంటి రద్దీ మార్గాలపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. వరదలలో మనుషులు, మూగజీవాలు చిక్కుకుంటే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే జిల్లాకేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే అండర్పాస్ పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ డి.జానకి అక్కడికి చేరుకుని మోటార్లతో నీటిని బయటకు పంపించి రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దివిటిపల్లి సమీపంలో అమర్రాజా బ్యాటరీ కంపెనీ దగ్గర తెగిపోయిన రోడ్డులో పడిపోయిన బస్సును ఎస్పీ పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం ఎర్రవల్లి: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈఘటన బీచుపల్లి స్టేజీ దగ్గర గురువారం చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి నాయక్ కథనం మేరకు వివరాలిలా.. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కర్గౌడ్ (54), అదే గ్రామానికి చెందిన మినిగోలు ఎల్లమ్మ (46) పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బీచుపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బీచుపల్లి స్టేజీ దగ్గర వారు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంతో వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు కాగా.. అల్లాడి భాస్కర్గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి కుమారుడు అల్లాడి కిరణ్గౌడ్ ఫిర్యాదు మేరకు బొలెరో డ్రైవర్ రెడ్డిగారి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నాడు. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన యువకులు ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా గంజాయి కొనుగోలు చేసి వాటిని మైనర్లకు, విద్యార్థులకు విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు వారం రోజుల నుంచి పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రం శివారు కాలనీలో ముగ్గురు యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలియగా.. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ వారిని పట్టుకున్నారు. ముగ్గురిని డీ అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ఆరా తీశారు. దీంతో గద్వాల పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి విక్రయినట్లు వివరించారు. నిఘా ఉంచిన పోలీసులు బుధవారం రాత్రి సదరు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి విక్రయిస్తున్నారని, ఎంతమంది తీసుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. అయితే ఆన్లైన్, ఇన్స్ర్ట్రాగాం సాయంతో రాయచూర్కు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్ఐను సంప్రదించగా.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నామని, తాజాగా ముగ్గురు యువకులను డి అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు ఎవరైన గుట్టుగా విక్రయించిన, నిల్వ ఉంచుకున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య వెల్దండ: ఇటీవల ఇంటర్ పూర్తయి.. బీటెక్లో చేరాల్సిన ఓ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెల్దండలో గురువారం చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. వెల్దండకు చెందిన భారతమ్మ, కృష్ణయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు శివకుమార్(17) సంతానం. కుమార్తె బీఈడీ చదువుతుండగా.. కుమారుడు శివకుమార్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్లో చేరాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకుగాను తండ్రి కృష్ణయ్య హైదరాబాద్లోని ఓ స్వీట్షాపులో పనిచేస్తున్నాడు. ఇదిలాఉండగా, తల్లి భారతమ్మ గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగర్కర్నూల్కు సొంత పని మీద వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు శివకుమార్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తీసి ఉండడం చూసి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులను సంప్రదించగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఇదిలాఉండగా, విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతులు భాస్కర్గౌడ్, ఎల్లమ్మ -
ఈజీ మనీ ఆశచూపి రూ.2 లక్షలు మోసం
● ప్రధాన సూత్రదారుడు స్నేహితుడే.. ● ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలింపు మహబూబ్నగర్ క్రైం: నా దగ్గర రాజకీయ నాయకులకు సంబంధించిన బ్లాక్ మనీ చాలా ఉందని.. రూ.లక్ష ఇస్తే రూ.5లక్షలు ఇస్తానని స్నేహితుడిని నమ్మించారు. రూ.2లక్షలు తీసుకొని.. డమ్మీ నోట్లు ఇచ్చి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్క రోజులోనే ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆశప్పకు 20రోజుల కిందట నవాబ్పేట మండలం పోమాలి గ్రామానికి చెందిన కె.రాములు ఫోన్ చేసి పరిచయం ఉన్న వ్యక్తి మాదిరిగా మాట్లాడాడు. నా దగ్గర రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించే, పంపిణీ చేసే బ్లాక్మనీ ఉందని, మీరు రూ.2లక్షలు ఇస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పాడు. జరిగిన విషయాన్ని ఆశప్ప అతని స్నేహితుడు అయిన వెంకటరాములుకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి ఈనెల 10న మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చారు. రూ.2లక్షలు తీసుకొని.. డమ్మీ నోట్లు ఇచ్చి.. ఈమేరకు కె.రాములు వారిని కలిసి వారి ఇద్దరికి చేరో రూ.500 నోట్ ఇచ్చి ఇలాంటి డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయని నమ్మించాడు. దీంతో కె.రాములు ఇచ్చిన నోట్లు తీసుకుని కోస్గికి వెళ్లిన ఆ ఇద్దరూ నోట్లు చెక్ చేసుకోగా ఒరిజినల్ అని తేలడంతో నమ్మారు. దీంతో ఈ నెల 12న ఆశప్ప రూ.2 లక్షల నగదు తీసుకుని రాగా వెంకట్రాములు రూ.2లక్షల విలువ చేసే డమ్మి(ఫేక్) నోట్లు తీసుకుని మహబూబ్నగర్ బస్టాండ్కు వచ్చారు. ఆశప్ప అతని దగ్గర ఉన్న రూ.2లక్షల నగదు, వెంకటరాములు తన వెంట తెచ్చిన రూ.2లక్షల డమ్మీ నోట్ల కట్టాలను కవర్లో పెట్టి కె.రాములుకు అందించారు. ఆ డబ్బులు తీసుకున్న కె.రాములు మీకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు కారులో ఉన్నాయని చెప్పి తెస్తానని రోడ్డు దాటివెళ్లిపోయి తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయిన అని గ్రహించిన ఆశప్ప టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఒక్కరోజు వ్యవధిలో కేసు చేధించినట్లు డీఎస్పీ తెలిపారు. -
డీసీసీబీ పదవీకాలం పొడిగింపు
● ఆరు నెలలపాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు ● మరోసారి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితి ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలలపాటు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం (2020 ఫిబ్రవరి 15న) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. వీటి గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును రెండోసారి మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కో ఆపరేషన్, సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ కె.సురేంద్ర మోహన్ గురువారం జీఓ 386 జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 78 పీఏసీఎస్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి మరో ఆరునెలల పాటు కొనసాగనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు. రైతులకు మరో ఆరు నెలలు సేవ చేసే అవకాశం లభించింది. పదవీకాలం పొడిగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానం 79వ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. శుక్రవా రం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణ కోసం అర్బన్ తహసీల్దార్ కార్యాలయ అధికారులతోపాటు ఎస్పీ కార్యాలయ ఏఆర్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్, జెడ్పీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేడుకలలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాత్తు సాధన చేశారు. కలెక్టరేట్తోపాటు ఎస్పీ కార్యాలయం ఇతర ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేశారు. కార్యక్రమాలు ఇలా.. ● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ జానకి పరేడ్ మైదానానికి చేరుకుంటారు ● ఉదయం 9.25 గంటలకు కలెక్టర్ విజయేందిర రాక ● ఉదయం 9.29 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు రాక ● ఉదయం 9.30 గంటలకు మంత్రిచే పతాకవిష్కరణ, వందన స్వీకారం ● ఉదయం 9.32 గంటలకు పోలీస్ కవాతు ● ఉదయం 9.45 నుంచి 10.15 గంటల వరకు మంత్రి సందేశం ● 10. 15 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం ● 10.20 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ● 10.50 నుంచి 11.20 వరకు శకటాల ప్రదర్శన ● 11.20 నుంచి 11.40 గంటల వరకు ప్రశంసాపత్రాల పంపిణీ ● 11.40 నుంచి 11.50 గంటల వరకు స్టాళ్ల సందర్శన ● మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ముగింపువిద్యుత్ కాంతులతో కలెక్టరేట్ -
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పర్యటించారు. జడ్చర్ల, భూత్పూర్ మండలం శేరిపల్లి, వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించి.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. పోల్కంపల్లి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను రెస్క్యూ బృందం రక్షించే చర్యలను పర్యవేక్షించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పోల్కంపల్లి, శేరిపల్లిలో పర్యటించగా.. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న అమరరాజా కంపెనీ సిబ్బందిని పరామర్శించారు. శేరిపల్లి వద్ద వరద నీరు మళ్లింపు ఏర్పాట్లను ఎస్పీ జానకితో కలిసి ఐజీ చౌహాన్ పరిశీలించారు. -
దేశాభివృద్ధికి సమష్టిగా కృషి
ఆగని అవినీతి..మహబూబ్నగర్కోయిల్సాగర్ 5 గేట్లు ఎత్తివేత తెగిన కల్వర్టు.. పడిన బస్సు ● సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలి ● కులం, మతం, భాష, ప్రాంత భేదాభిప్రాయాలు ఉండొద్దు ● జిల్లాకేంద్రంలోని వాసవీ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ టాక్షో ● అభిప్రాయాలు వెలిబుచ్చిన విద్యార్థులు ● పొంగిన వాగులు.. నిండిన చెరువులు, కుంటలు ● జడ్చర్ల వద్ద ఎన్హెచ్ సర్వీస్ రోడ్డుపై పోటెత్తిన వరద ● చిక్కుకున్న 2 బస్సులు.. ప్రయాణికులు సురక్షితం ● భూత్పూర్లోని శేరిపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు.. ● దెబ్బతిన్న రహదారులు.. జలదిగ్బంధంలో ఆర్యూబీలు ● పలు చోట్ల నీటమునిగిన కాలనీలు.. రాకపోకలకు అంతరాయం ● వివిధ ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ ‘స్వతంత్ర భారతదేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోనూ అవే రాజ్యమేలుతున్నాయి. స్వేచ్ఛ.. సమానత్వం అనేవి మాటలకే పరిమితమయ్యాయి. విద్య, వైద్యం అంటే కాసులు కుమ్మరించాల్సిందే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలి. ఈ మేరకు చట్టసభలతో పాటు అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తూ స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాలి.’ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 78 ఏళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం 79వ వసంతంలోకి అడుగిడుతున్న స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్ర ఫలాలు అందుతున్నాయా? వంటి పలు అంశాలపై ‘సాక్షి’ గురువారం సర్వే చేపట్టింది. పలు వర్గాల ప్రజలు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025రిజర్వేషన్లుఉండవద్దు.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో ఇంకా సమానత్వం అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. నిజమైన సమానత్వం రావాలంటే కులం, మతం పేరిట ఉన్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – అశ్విని, రెండో సంవత్సరం సర్వే సాగిందిలా.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 150 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి 30 మంది (పురుషులు 15, మహిళలు 15) చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఎంచుకున్న మూడు ప్రశ్నలకు ఒక్కొక్కరి నుంచి సమాధానాలను రాబట్టింది. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వ్యవస్థలోని కాలానుగుణ మార్పులు, లోపాలతో పాటు ఇంకా మెరుగు కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పరంగా పూర్తిస్థాయిలో మార్పులు చోటు చేసుకున్నప్పటికి మరింత మార్పు రావాలని, కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేకుండా సమష్టిగా దేశాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాసవి డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన టాక్ షోలో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి? పర్యావరణ సమతుల్యత.. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నా.. స్థిరమైన అభివృద్ధి సాధించలేకపోయాం. ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. భవిష్యత్లో పెద్దఎత్తున చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. – అనూష, మొదటి సంవత్సరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో.. దేశంలో ప్రతిభ ఉన్న వారు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడ రాణిస్తుండటంతో మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే మంచి ఉద్యోగాలు సృష్టించి.. దేశాభివృద్ధికి దోహదపడాలి. – హిమబిందు, మొదటి సంవత్సరం ఉచితాలు ఇవ్వకూడదు.. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల పేరుతో ఇచ్చే వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా సామాజిక స్పృహ కలిగి ఉండి, ఓటింగ్ సమయంలో కేవలం డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా ఉండే వారికి మాత్రమే ఓటు వేయాలి. – శ్రవంతి, రెండో సంవత్సరం విద్యార్థుల భవిష్యత్.. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవన్నీ ప్రజలను మభ్యపెట్టేలా ఉంటున్నాయి. కాబట్టి చదువుకునే విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే తప్పకుండా కొత్త పథకాలు తీసుకువచ్చి మెరుగ్గా చదువుకునేలా కృషిచేయాలి. – లక్ష్మీ, రెండో సంవత్సరం స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు ఏవి ? స్వేచ్ఛ– సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా? చట్ట సభలు న్యాయ స్థానాలు అధికార యంత్రాంగం మీడియా వసతులుకల్పించాలి.. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా అనుకున్న స్థాయిలో వసతులు మాత్రం లేవు. పేదరికంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, ఇన్యూరెన్సు సౌకర్యం కలిస్తే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. – మహ్మద్ అఫ్రోజ్, మొదటి సంవత్సరం అదే భారత్ గొప్పతనం దేశంలో అనేక మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పడమే భారత్ గొప్పతనం. అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకుంటూ జీవిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో దేశం మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలి. – అబ్దుల్లా, మొదటి సంవత్సరం అవునులేదుకొద్దిగా.. అంతరాలు తొలగించాలి.. సుపరిపాలన అందించే దిశగా ప్రధానంగా చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు తొలగేలా ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకుసాగాలని.. వ్యవస్థలను నిర్వీర్యం చేసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం గానీ, వారి ప్రభావం గానీ లేకుంటే అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందని.. అప్పుడు న్యాయస్థానాలు, మీడియా అవసరం ఉండదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. శేరిపల్లి వద్ద హైవే–44పైభారీగా వరద.. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శేరిపల్లి వద్ద కోమటికుంట చెరువు నిండి వరద నీరు జాతీయ రహదారి–44పైకి పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట మండలంలోని పోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, మేకలు, కాపరులు చిక్కుకుపోయారు. మూగజీవాలతో పాటు కాపరులను రెస్క్యూ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. దేవరకద్ర మండలంలో జీనుగురాల, దేవరకద్ర పట్టణం మధ్య ఉన్న లింక్ రోడ్ వరద ఉధృతితో తెగిపోయింది. డోకూర్లో నిర్మిస్తున్న ఆర్యూబీలో వరద నీరు నిలిచి రాకపోకలు బంద్ అయ్యాయి. చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతల గ్రామ గొలుసుకట్టు చెరువు కాల్వకు గండి పడింది. అడ్డాకుల మండలం పెద్దవాగు వరద ఉప్పొంగడంతో గౌరీదేవిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. పొంగిన వాగులు, అలుగు పారుతున్న చెరువులు, కుంటలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తుండడం, రోడ్లు దెబ్బతినడం.. రైల్వే అండర్ బ్రిడ్జిలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వివిధ గ్రామాలు, కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో కలెక్టర్ విజయేందిర బోయి, ఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/మహబూబ్నగర్ మున్సిపాలిటీ/మహబూబ్నగర్ వ్యవసాయం అలుగుపారిన 599 చెరువులు.. రైతుల్లో హర్షం భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 823 ఉండగా.. ఇందులో 599 అలుగు పారుతున్నాయి. 25 శాతం నిండినవి 44.. 50 శాతం నిండినవి 72.. 75 శాతం నిండినవి 69.. 100 శాతం నిండినవి 39 చెరువులు కాగా.. వాటికింద ఆయకట్టులోని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలు ప్రస్తుతం పంటలకు ఊపిరిపోసినట్లయిందని.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందని ద్రాక్షగానే స్వేచ్ఛ.. సమానత్వం చట్టసభలు, అధికారుల్లో మార్పు రావాలి మరింత నీతి, నిజాయితీగా పనిచేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిమతం -
జలాశయాలకు జలకళ
● 90వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 91,340 ఔట్ఫ్లో ● 8క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల ● 12 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్ల్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7గంటల వరకు ప్రాజెక్టుకు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 90వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 8 క్రస్టుగేట్లను ఎత్తి 54, 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36, 628 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 91, 340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. 29.6 అడుగులకు కోయిల్సాగర్ దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడానికి కేవలం మూడు అడుగుల దూరంలో నీటిమట్టం నిలిచింది. బుధవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 29.6 అడుగలకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో మూడు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు గేట్లను తెరిచేందుకు వీలుంది. పెద్దవాగు ప్రవాహం భారీగా వస్తే ఒక్కరోజులో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాలకు పైనుంచి వరద వచ్చి చేరుతుండడంతో ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 12యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6యూనిట్ల ద్వారా 240మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. రామన్పాడు ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు -
స్పందించారు.. సీజ్ చేశారు
● కర్రీపఫ్లోపాము ఘటనపై ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ ● వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు ● అనుమతి లేకుండా బేకరీ నిర్వహణ ● కాలం చెల్లిన పదార్థాలు, రసాయనాల వినయోగం ● పలు కారణాలతో బేకరీ సీజ్, ల్యాబ్కు నమూనాలు జడ్చర్ల: బేకరీలో కొనుగోలు చేసిన కర్రీపప్లో పాము వచ్చిన ఘటనపై జిల్లా ఆహార భద్రత అధికారులు స్పందించారు. బుధవారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ సిబ్బందితో కలిసి జడ్చర్ల పోలీస్స్టేషన్కు చేరుకుని పాము ఉన్న కర్రీ పఫ్ను పరిశీలించి షాంపింల్ తీసుకుని ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం పఫ్ను విక్రయించిన శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అసలు బేకరీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతిలేదు. అంతేకాక కాలంచెల్లిన ఆహార పదార్థాలు, రసాయనాలు, క్రీములు వినియోగించడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య బేకరీ ఉత్పత్తులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, గడువు ముగిసిన పదర్థాలను ఉపయోగిండం, పరిశుభ్రత పాటించక పోవడంపై బేకరీ నిర్వాహకులకు నోటీస్ను జారీ చేసి దుకాణాన్ని సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హోటళ్లు, బేకరీలు తదితర ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని, అదేవిధంగా నాణ్యత కలిగిన ముడి సరుకును వినియోగించాలని తెలిపారు. ఫ్రీజర్లో దాచి వాటినే వేడిచేసి వినియోగదారులకు అందించడం చట్టవిరుద్ధమన్నారు. పరిశుభ్రత పాటించాలని, వంటపాత్రలను శుభ్రంగా ఉంచడంతోపాటు ఆహార పదార్థాల తయారీపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటళ్లు, బేకరీలు, దాబాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తత మధ్య విగ్రహాల తొలగింపు
జడ్చర్ల, జడ్చర్ల టౌన్: 167వ నెంబరు జాతీయ రహదారిపై మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్గడ్డ రైల్వే బ్రిడ్జ్కు రెండువైపులా ఉన్న మహానీయుల విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న విగ్రహాలను తొలగించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ బుధవారం కార్యరూపం దాల్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా.. సిగ్నల్ గడ్డ బ్రిడ్జ్కు ఒకవైపు నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలతోపాటు పైలాన్ ఉంది. వాటిని బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు రెండు క్రేన్ల సహాయంతో సాఫీగానే తొలగించారు. రెండు విగ్రహాలు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానులు కావడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆటంకం కలిగించలేదు. అయితే ఇందిరాగాంధీ విగ్రహం తొలగించేందుకు 4గంటల సమయం పట్టడం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని కొంత ఇబ్బందులకు గురిచేసింది. విగ్రహాల తొలగింపు ముందుగానే ప్రచారం కావడంతో రైల్వేబ్రిడ్జ్కు ఇవతల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితసంఘాల నాయకులు గుమిగూడారు. ఉదయం 10గంటలనుంచే అధికారుల రాకకోసం వేచి చూశారు. టెంట్ వేసి దీక్షకు కూర్చునేందుకు యత్నించగా సీఐ కమలాకర్ జోక్యం చేసుకుని టెంట్ వేయకుండా అడ్డుకున్నారు. బ్రిడ్జ్కు మరోవైపు ఉన్న విగ్రహాల తొలగింపు పూర్తయ్యాక కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ పుష్పలత, వార్డు కౌన్సిలర్లు క్రేన్లను తీసుకుని అంబేద్కర్, ఫూలే, శ్రీకాంతాచారి విగ్రహాలను తొలగించేందుకు వచ్చారు. ఈ సదర్భంగా దళిత సంఘాల నాయకులు కమిషనర్, చైర్పర్సన్తో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహం తొలగించేదిలేదని వాదనకు దిగారు. ప్రస్తుతం విగ్రహం తొలగించి రోడ్డు పనులు పూర్తయ్యాక కొద్దిగా పక్కకు ప్రతిష్ఠిస్తామని కమిషనర్, చైర్పర్సన్ హామీ ఇచ్చినప్పటికీ వారు వినలేదు. కావేరమ్మపేట రోడ్డులో ఇదివరకు అంబేడ్కర్ విగ్రహం తొలగించి ఎందుకు పునఃప్రతిష్ఠ చేయలేకపోయారని మండిపడ్డారు. జాతీయ రహదారుల శాఖ ఏఈ రవి సైతం విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అంగీకరించలేదు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని దళిత సంఘాల నాయకులు, అధికారులతో మాట్లాడారు. విగ్రహం పునఃప్రతిష్ఠ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నందున విగ్రహం తొలగించేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వరకు గడువు ఇవ్వాలని సూచించారు. ఇదిలా కొనసాగుతుండగానే అధికారులు పక్కనే ఉన్న ఫూలే విగ్రహం తొలగించేందుకు క్రేన్ను ఉంచగా.. బీసీ సంఘాలు అడ్డుపడ్డాయి. విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠిస్తారో చెప్పాలని, ముందు అంబేడ్కర్ విగ్రహం తొలగించాకే ఫూలే విగ్రహం తీయాలని పట్టుబట్టారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కలెక్టర్తో సంప్రదింపు లు జరిపి విగ్రహాలను ఇదేరోజు తొలగించాలని సూ చించారు. దీంతో ముందుగా అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి అనంతరం ఫూలే, శ్రీకాంతాచారి విగ్రహాలను తొలగించారు. తొలగించిన విగ్రహాలు డీసీఎంలో మున్సిపల్ కార్యాలయానికి తరలించా రు. రోడ్డు పనులు పూర్తయ్యాకే పునఃప్రతిష్ఠ చేయనున్నారు. ఎట్టకేలకు ఉద్రిక్తత మధ్య రోడ్డు పనులకు ఆటంకంగా ఉన్న విగ్రహాలను తొలగించడంతో చైర్పర్సన్, కమిషనర్, పాలకవర్గం ఊపిరిపీల్చుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలు సాఫీగా.. అంబేడ్కర్ విగ్రహం తీయొద్దంటూ దళిత సంఘాల ఆందోళన మొదట అంబేడ్కర్ విగ్రహం తొలగించాలని పట్టుబట్టిన బీసీలు రోడ్డు పనులు పూర్తయ్యాక పునఃప్రతిష్ఠాపనకు హామీ ఆందోళనకారులను బుజ్జగించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి -
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
గద్వాల: మద్యంతాగి విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు రవిచందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. రవిచందర్ రాజోళి మండలం చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను సంభోదిస్తూ మాట్లాడిన వైనం సోషల్ మీడియాలో వైరలైంది. స్పందించిన కలెక్టర్ సంతోష్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎవరైనా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఈజీ మనీ కోసం దారిదోపిడీ
● బైక్ను వెంటాడి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలోని రిధి మద్యం దుకాణాన్ని బంద్ చేసి ఆరోజు వచ్చిన కలెక్షన్ తీసుకుని బైక్పై ఏనుగొండకు వెళ్తున్న వైన్స్ క్యాషియర్ అరుణ్రెడ్డిని ఈనెల 7న రాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు స్కూటీపై వెంబడించి కొత్తతండా వద్ద బైక్ను అడ్డగించి కళ్లల్లో కారంపొడిజల్లి చేతిలో ఉన్న నగదు బ్యాగును అపహరించిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ దొంగలను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్స్టేషన్లో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. మహబూబ్నగర్లోని వీరన్నపేటకు చెందిన మూలింటి బాలాజీ, మూలింటి రవితేజ పతకం ప్రకారం.. దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ రోజు స్థానిక లాడ్జీలో తలదాచుకుని వైన్స్ వద్ద నగదుతో బయటకు వస్తున్న క్యాషియర్ను గమనించి స్కూటీపై బైక్ను వెంబడించారు. రూ.1.44 లక్షల క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లిన అనంతరం బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బుధవారం జడ్చర్ల–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై జాలీ హిల్స్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీపై వచ్చిన నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.72,500తోపాటు మొబైల్ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న డబ్బుతో కొత్తగా మొబైల్ ఫోన్ను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నిందితుల్లో బాలాజీ ఓ సంస్థలో డెలివరీ బాయ్గా, రవితేజ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కమలాకర్, సిబ్బంది విష్ణుమూర్తి, కాశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు స్వల్ప గాయాలు
నాగర్కర్నూల్ క్రైం: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని గన్యాగుల గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పెద్దకొత్తపల్లిలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్కు చెందిన పాఠశాల బస్సు నాగపూర్, రాయిపాకుల గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వెళుతుండగా గన్యాగుల శివారులో మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అక్కడే వరి నాట్లు వేస్తున్న కూలీలు అప్రమత్తమై బస్సులో నుంచి పాఠశాల విద్యార్దులను బయటకు తీశారు. బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉండగా కొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విద్యార్థులను ఆటోల్లో ఇంటికి పంపించారు. సంఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మద్దూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పిల్లిగుండుతండా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హన్మనాయక్ తండాకు చెందిన గణేష్నాయక్ (26) అదే గ్రామానికి చెందిన హర్జ్యనాయక్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నిర్మాణానికి గ్రానైట్ రాయిని ట్రాక్టర్పై హన్మనాయక్తండా నుంచి నందిపాడ్కు తరలిస్తుండగా పిల్లిగుండతండా సమీపంలో అదుపు తప్పడంతో గణేష్నాయక్ ట్రాక్టర్ వదిలి కిందకు దూకుతూ వెనుక టైర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆటో బోల్తా: డ్రైవర్ మృతి కొల్లాపూర్ రూరల్: ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ హృషికేశ్ కథనం ప్రకారం.. మండలలోని నార్లాపూర్కు చెందిన దాసరి రాజు(24) నార్లాపూర్ – చెంచుగూడెంకు ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోలో మృతుడితోపాటు మల్లేశ్ అనే యువకుడు ఉన్నాడు. అతడికి స్వల్ప గాయా లయ్యాయి. మృతుడి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పిడుగుపాటుతో ఆవు మృతి కేటీదొడ్డి: పిడుగుపాటుతో ఆవు మృతిచెందిన ఘటన మండలంలోని పాగుంటలోని చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన స్వామి ఆవును పొలం వద్ద కట్టేశాడు. మంగళవారం రాత్రి పిడుగుపాటుకు ఆవు మృతిచెందింది. బుధవారం ఉదయం పొలం దగ్గరికెళ్లి చూడగా ఆవు మృతి చెందింది. రూ.60వేలతో ఆవు మృతి చెందడంతో రైతు స్వామి బోరున విలపించాడు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరాడు. పెబ్బేరులో నగదు చోరీ వనపర్తి రూరల్: పట్టణంలోని పీజేపీ క్యాంప్ కార్యాలయం వద్ద బైక్లో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన బుల్లెదుల ఆంజనేయులు బుధవారం ఉదయం 11.30 గంటలకు పెబ్బేరు పట్టణంలోని ఎస్బీఐలో రూ.2.20లక్షలు విత్డ్రా చేశాడు. మొత్తం నగదును బైక్ టూల్ బాక్స్లో పెట్టి లాక్ చేసి కార్యాలయంలోకి వెళ్లాడు. తిరిగి బైక్ దగ్గరకు వచ్చి చూడగా టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు నగదును ఎత్తుకెళ్లారని గుర్తించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కేజీబీవీ ఘటనపై అధికారుల విచారణ బల్మూర్: స్థానిక కస్తూర్బాగాంధీ విద్యాలయంలో కార్మికుల మధ్య దాడి ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు, ఎస్ఐ రాజేందర్, ఎంఈఓ విష్ణుమూర్తి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు అడిగి తెసుకున్నారు. వాచ్మేన్తో పాటు ఇద్దరు కార్మికులు నిత్యం తాగొచ్చి మద్యం మత్తులో రాత్రిళ్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. వాచ్మేన్పై ఎస్ఓకు ఫిర్యాదు చేసినా ప్రవర్తనలో మార్పు లేదని వాపోయారు. కాగా ఎస్ఓ పర్యవేక్షణ లోపంతోనే ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు విచారణ చేసి తగిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం కన్నా గరిష్టంగా రూ.60, కనిష్టంగా రూ. 50 వరకు ధర పెరిగింది. సీజన్ ముగిసినప్పటికీ రైతులు యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసుకొని ప్రస్తుతం మార్కెట్కు అమ్మకానికి తెస్తున్నారు. దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు పోటా పోటీగా వేలంలో పాడి ఉల్లిని కొనుగోలు చేశారు. వేలంలో క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1,860 , కనిష్టంగా రూ.950 వరకు ధర వచ్చింది. 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్ట ధర రూ.950, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలనుపునరావాస కేంద్రాలకు తరలించాలి ● కలెక్టర్ విజయేందిర జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయి సిబ్బందితో మొదలుకుని జిల్లా అధికారి వరకు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పునరావాస సహాయ కేంద్రాలను గుర్తించి.. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని తెలిపారు. అత్యవసర సమయంలో ఎస్డీఆర్ఎఫ్, ఆపదమిత్ర వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చేపల వేట, ఈత కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలోకి ఎవరూ దిగకుండా కట్టడి చేయాలని.. అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాజ్వేల వద్ద వాగులను దాటకుండా భారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని.. అవసరమైన ఔషధ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 27 ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు విస్తృతంగా చేపట్టాలన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్ధరించాలని ట్రాన్స్కో ఎస్ఈ రమేశ్ను కలెక్టర్ ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఏమైనా ప్రమాదాలు సంభవించినా, అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్రూం 08542 – 241165 నంబర్కు సమాచారం అందించాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, డీపీఓ పార్థసారధి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. సత్వరం పరిష్కరించాలి.. మహబూబ్నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 19 మంది కలెక్టర్కు ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, ఏపీడీ శారద, గృహనిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్ పాల్గొన్నారు. యూరియాను పక్కదారి పట్టిస్తే సహించం.. మహబూబ్నగర్ (వ్యవసాయం): యూరియా ను ఎవరైనా పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్, మన గ్రోమర్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాయితీ యూరియాను కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, ఇతరాత్ర అవసరాలకు కాదన్నారు. పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల్లో విక్రయించే ఎరువులు, యూరియాపై అధికారులు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఏఓ బి.వెంకటేశ్, ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
ఆ ఊళ్లో 2 కుటుంబాలే..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం పాత బండరాయిపాకులలో గతంలో 480 కుటుంబాలు నివసించేవి. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉండగా.. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుండగా.. 2021లో ప్రజలను ఖాళీ చేయించారు. పునరవాసం కింద కొత్తగా నిర్మించిన బండరాయిపాకులకు తరలించారు. అందరూ వెళ్లగా ప్రస్తుతం పాత గ్రామంలో రెండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అన్నాదమ్ములైన మిద్దె పెద్ద లక్ష్మయ్య (మృతుడు హరిబాబు తండ్రి), మిద్దె చిన్న లక్ష్మయ్య కుటుంబాలు పక్కపక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఊరంతా నిర్మానుష్యం కాగా.. ప్రస్తుతం అడవిలా తయారైన ఈ పాత ఊళ్లో దొరికే ఆకులు, అలుములతోనే ఆ రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. -
రికవరీ అయ్యేనా..?
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): అత్యవసర పరిస్థితుల్లో మహిళా సంఘాల సభ్యులను సీ్త్రనిధి రుణాలు ఆదుకుంటున్నాయి. అయితే వాటిని తిరిగి చెల్లించడంలో అంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సీ్త్రనిధి రుణాల తిరిగి చెల్లింపులో సంఘాల సభ్యులు మొండికేసినట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కొత్త వారికి అవకాశం లేకుండాపోతుందని పలువురు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.16.61 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రికవరీ చేసేందుకు డీఆర్డీఓ ఆధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గట్టిగా అడిగినా వసూలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంగా సీ్త్రనిధి రుణాలు పెండింగ్లో పడటంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని మిగతా సభ్యులకు కొత్త రుణాలు అందని పరిస్థితి నెలకొంది. సంఘాల్లో ఒకరిద్దరు కిస్తులు కట్టని కారణంగా మిగతా ఎవరికీ రుణాలు అందవు. సంఘాల్లో లావాదేవీలు సక్రమంగా కొనసాగితేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. తీసుకున్న రుణాలను కొందరు కట్టకపోయినా ఆ ప్రభావం అందరిపై పడుతుంది. ప్రత్యేక డ్రైవ్కు ఆదేశాలు.. ఈ శాఖపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యంగా సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొండి బకాయిలను రికవరీ చేసేందుకు జిల్లాలో ఆరుగురు సీఆర్పీలను నియమించారు. వీరు బకాయిలు ఉన్న మండలాల్లో పర్యటించి వసూలుపై దృష్టిసారిస్తారు. అత్యధికంగా హన్వాడలో.. వాస్తవంగా సీ్త్రనిధి రుణాలను ప్రతినెల సక్రమంగా చెల్లించే గ్రూపులకే ఇస్తారు. వారి పొదుపు మూలధనం ఆయా కిస్తులకు క్రమం తప్పకుండా జమ అయ్యే వారికే వడ్డీలేని రుణాలు అందిస్తారు. క్రమం తప్పక రుణాలు చెల్లించిన వారు కూడా ప్రస్తుతం మొండికేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6,737 సంఘాల నుంచి రూ.33.76 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.17.06 కోట్లు వసూలు కాగా.. మరో రూ.16.61 కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర మండలాలతో పోల్చితే హన్వాడలో అత్యధికంగా సీ్త్రనిధి బకాయిలు ఉన్నాయి. ఏకంగా రూ.2.01 కోట్ల మేర పేరుకుపోయాయి. ఈ మొత్తం 366 సంఘాలు చెల్లించాల్సి ఉన్నాయి. జిల్లాలో మొండికేసిన ‘సీ్త్రనిధి’ బకాయిలు పాతవి పేరుకుపోవడంతో కొత్త రుణాలకు బ్రేక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఆరుగురు ఏపీఎంలతో క్షేత్రస్థాయిలో వసూలుకు చర్యలు -
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు, మినీ ట్యాంక్బండ్ వద్ద వరద ప్రవాహాన్ని ఎస్పీ పరిశీలించారు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినడం వంటి అవకాశాలు ఉన్నాయని.. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ బృందాలు, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య ఉన్నారు. ● నషాముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం సందర్భంగా ధర్మాపూర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ డి.జానకి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేశ్, రవి, ఎస్బీ సీఐ వెంకటేశ్ పాల్గొన్నారు. ● స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా టీనేజర్స్, యువత బైక్లపై ముగ్గురు, నలుగురు వెళ్తూ.. అధిక శబ్ధాలతో రాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు, చిన్నారులు రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తారని.. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దురుసుగా, హారన్స్ కొడుతూ బైక్లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన బైక్
నాగర్కర్నూల్ క్రైం: నీటి ఉధృతికి ద్విచక్రవాహనం కొట్టుకుపోయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగనూలు సమీపంలోని కల్వర్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నాగనూలు గ్రామానికి చెందిన శివ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు బాధితుడిని కాపాడగా ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
భక్తుల ఆరాధ్యదైవం గెల్వలాంబమాత
వంగూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన గెల్వలాంబమాత ఉత్సవాలు ఈనెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, తాగునీరు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13న అమ్మవారి మేలుకొలుపు, తోరణ అలంకరణ, గణపతి పూజ, సాయంత్రం నజర్ బోనాలు, వైశ్యుల బోనాలు, అనంతరం బండ్లు, వాహనాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. 14న అమ్మవారికి గండదీపం, సాయంత్రం రెడ్లు, పద్మశాలిలు, బోయ, గౌడ్స్, యాదవుల బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ, కోలాటాలు, భజనలు ఉంటాయి. 15 ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం ముదిరాజ్ల బోనాలు, బండ్లు తిరుగుతాయి. 16 తెల్లవారుజామున రథోత్సవం, శ్రీకృష్ణ జననం, డోలారోహణం ఉంటుంది. 17 సాయంత్రం యాదవులు ఉట్టి కొట్టుట, బాలబాలికల చేత శ్రీకృష్ణ, గోపికల వేషాధారణ. అనంతరం మహామంగళహారతితో జాతర ముగుస్తుంది. ● ఉత్సవాల్లో భాగంగా 14న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరవుతారని దేవస్థాన కమిటీ ఛైర్మన్ నకిరమోని శేఖర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు రెండు రోజులపాటు ఉత్సవాల్లో పాల్గొంటారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14న రాత్రి పలువురు ప్రత్యేక ఫోక్ సింగర్లచేత ఆటాపాట నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 13 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు బోనాలు, ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న దేవస్థాన కమిటీ -
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రాజోళి: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చా’ కథనానికి ఎంఈఓ భగీరథరెడ్డి స్పందించారు. ఈ మేరకు చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రవిచందర్ తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి వాటర్ట్యాంక్ వద్ద ఏదీ గుర్తులేకుండా నిద్రించాడు. ఎంఈఓ విద్యార్థులతో వివరాలు సేకరించగా.. తరగతి గదిలోనే మద్యం తాగి నిద్రిస్తాడని.. మద్యం మత్తులో తమను ఇష్టం వచ్చినట్లు తిడతాడని విద్యార్ధులు ఎంఈఓతో వాపోయారు. ఈ క్రమంలోనే వాటర్ట్యాంక్ వద్ద మద్యం మత్తులో నిద్రిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓతో అతడు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న సమస్యల కారణంగా పిల్లల సంఖ్య తగ్గుతుందని, అందుకు తామేమి చేస్తామని బదులిచ్చారు. అయితే విద్యార్థులతో పుస్తకాలు చదివించవమని ఎంఈఓ సూచించగా, మద్యం మత్తులో ఊగుతూ.. తూగుతూ నానా తంటాలు పడ్డాడు. పాఠశాలలోనే మద్యం తాగే నీపై చర్యలు తప్పవని ఎంఈఓ అనగా.. పర్లేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అనంతరం ఎంఈఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలే అని అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విచారణ చేసి వదిలేశారని.. ఇప్పటికై నా కఠిన చర్యలు తీసుకుంటారో లేదోనని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మద్యం మత్తులో మాస్టరు సమాధానానికి అవాకై ్కన ఎంఈఓ -
మహబూబ్నగర్ ఆర్టీసీకి గి‘రాఖీ’
స్టేషన్ మహబూబ్నగర్: రాఖీ పండుగకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. పండుగ వేళ వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులు నడిపారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ మార్గంలో ఎక్కువ బస్సులు నడపడంతో రీజియన్కు అధిక ఆదాయం సమకూరింది. ● ఈ ఐదు రోజుల్లో ఆక్యుపెన్షి రేషియాలోనూ రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 139 శాతం సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. బస్సులు 19.56 లక్షల కిలోమీటర్లు తిరిగి 26.63 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది కంటే ఈసారి 15 వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణం చేశారు. డిపోల పరంగా చూస్తే మహబూబ్నగర్ రూ.2,54,98,000, వనపర్తి డిపో రూ.2,26,70,000 అధిక ఆదాయాన్ని పొందాయి. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగుల సమష్టి కృషితోనే ఆక్యుపెన్సి రేషియో 139 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలకు దూరంగా ఉండి విధులకు హాజరవడం గర్వకారణం. పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీపై ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లా ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ తేదీల వారీగా ఇలా.. వచ్చిన ఆదాయం (రూ.లలో..) 8 తేదీన 2,48,37,000 7 తేదీన 2,16,31,000 9 తేదీన 3,70,74,000 10 తేదీన 3,85,60,000 11తేదీన 3,94,34,000 డిపో తిరిగిన కిలోమీటర్లు ఆదాయం (లక్షల్లో..) (రూ.లక్షల్లో..) మహబూబ్నగర్ 3.00 254.98 వనపర్తి 2.54 226.70 కల్వకుర్తి 2.16 182.29 షాద్నగర్ 1.86 169.65 నారాయణపేట 2.03 163.90 గద్వాల 2.31 159.68 అచ్చంపేట 1.97 157.90 నాగర్కర్నూల్ 1.81 151.94 కొల్లాపూర్ 1.54 122.57 కోస్గి 0.34 25.75 డిపోల వారీగా ఆదాయం ప్రతి ఉద్యోగి కృషితోనే సాధ్యమైంది.. 5 రోజులు.. రూ.16.15 కోట్ల ఆదాయం 11వ తేదీన అధికంగా రూ.3.94 కోట్లు ఆక్యుపెన్షి రేషియాలో రాష్ట్రంలోనే మొదటిస్థానం -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు: ఎగువన కురస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 7 గంటల వరకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను ఎత్తి 68,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36,541 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 236 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.057 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 121.957 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 25వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 4 క్రస్టు గేట్లను ఎత్తి 19,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడేళ్ల అనంతరం.. ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 2023లో మొరాయించి పని చేయకుండా ఉన్న మూడో యూనిట్ ఎట్టకేలకు మంగళవారం వినియోగంలోకి వచ్చింది. తెల్లవారుజామున ఎస్ఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూడో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని విజయవంతంగా ప్రారంభించారు. సుంకేసులకు.. రాజోళి: సుంకేసుల ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 13 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 56,927 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్ 2,012 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 473.254 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 216.545 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 256.709 మిలియన్ యూనిట్లు కలిపి 473.254 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ఎత్తివేత 1.05లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు.. -
చెంచు మహిళకు అరుదైన గౌరవం
మన్ననూర్/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నల్లమల్ల చెంచు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకొండ వద్ద 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ చెంచు మహిళా సమాఖ్య నుంచి అటవీ లోతట్టు ప్రాంతం కుడిచింతలబైలు గ్రామానికి చెందిన భౌరమ్మ పాల్గొననుంది. సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలులో భౌరమ్మ ఆమె భర్త వెంకటయ్య ఢిల్లీకి బయలుదేరారు. డీఆర్డీఓ అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. గొప్ప వాళ్లకు లభించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని.. అవకాశం కల్పించిన సెర్ప్ అధికారులు, డీఆర్డీఓ అధికారులకు భౌరమ్మ ధన్యవాదాలు తెలిపారు. -
జిల్లాకేంద్రంలో గంట పాటు భారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎస్.ఆర్.నగర్, బీకే రెడ్డి, కాలనీ, నాగిరెడ్డికాలనీ, వెంకటరమణకాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, పాల్కొండ బైపాస్, రాయచూర్ రోడ్డు తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణంలో వరద ఏరులై పారింది. ఆయా చోట్ల వెంటనే మున్సిపల్ కార్మికులు వరదనీటిని కాల్వల ద్వారా మళ్లించడంతో పరిస్థితి యధాస్థితికి చేరింది. ఇక పెద్దచెరువు (మినీ ట్యాంక్బండ్) లోకి వస్తున్న వరద ఉద్ధృతిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. లోతట్టు ప్రాంతాలు జలమయం వరద నీటిని మళ్లించిన మున్సిపల్ కార్మికులు -
500 మీటర్ల జెండాతో తిరంగా ర్యాలీ
79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జడ్చర్ల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా తిరంగార్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని కళాశాల, హైస్కూల్ విద్యార్థులు పట్టుకుని అంబేద్కర్ చౌరస్తా నుంచి నేతాజీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కిసాన్మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యంబీ బాలకృష్ణ, నాయకులు రాపోతుల శ్రీనివాస్గౌడ్, ఎడ్ల బాలవర్దన్గౌడ్, సాహితీరెడ్డి, కొంగళి శ్రీకాంత్, అమర్నాథ్గౌడ్, నరేష్నాయక్, శ్రీనాథ్, లక్ష్మారెడ్డి, రేఖ, పిట్టల నరేష్, జగదీశ్సింగ్, వివ్వనాథ్, నరేందర్, నవీన్లు పాల్గొన్నారు. – జడ్చర్ల టౌన్ -
ప్రజలు సురక్షితంగా ఉండాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న 72 గంటలు మోతాదుకు మించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆిస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతిశాఖ అధికారులు వారి పరిధిలో విధులను, బాధ్యతలను సజావుగా నిర్వహించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, మిషన్ భగీరథ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలకు నీళ్లు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో ఉన్న సిబ్బందితో వెంటనే సమావేశం పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టర్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరదలు, ఇళ్లకు నష్టం, రోడ్లు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంగా వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్ నంబర్ 08542–241165కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, సీపీఓ రవీందర్, డీఎంహెచ్ఓ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ పుల్లారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఎవరైనా పెడితేనే తింటున్న.. నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా. – భగవంతు, బాధితుడు క్యాన్సర్ పేషంట్ను..గోలీలకూ డబ్బుల్లేవు.. పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం.. నా భార్య పేరు మీద రూ.11 లక్షలు, నా పేరు మీద రూ.2 లక్షలు.. మొత్తం రూ.13 లక్షలు ఫైనాన్స్లో పెట్టాం. మాకు నలుగురు కూతుళ్లు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ చూడనీకే రావడం లేదు. నా భార్యకు చేయి విరిగింది. డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం. మా డబ్బులు మాకివ్వమని ఎవర్ని అడగాలో తెలియడం లేదు. మా మీద కనికరం చూపించి డబ్బులు ఇప్పించాలి. – బింగి లింగయ్య, పాపమ్మ దంపతులు కిరాయి ఇంట్లో ఉంటున్నాం.. తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడు అతికష్టం మీద బతుకుతున్నాం.. నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలు ఫైనాన్స్ మోసంతో పీఆర్ఎల్ఐ నిర్వాసితుల విలవిల ఇప్పటికే కొందరి బలవన్మరణం..గుండెనొప్పితో తనువు చాలించిన మరికొందరు.. వైద్య చికిత్సలకు డబ్బుల్లేక మంచానికే పరిమితమైన ఇంకొందరు.. ఇళ్లు కట్టుకోలేక..పిల్లలను చదివించలేనిదుస్థితిలో పలువురు.. ఆలనాపాలన కరువై ఆదుకునే వారి కోసం వృద్ధుల ఎదురుచూపులు.. -
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న అమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యత లు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కొనసా..గుతున్న ‘పాలమూరు’ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ర్యాలంపాడు రిజర్వాయర్ నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్ల మెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు మంత్రుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష