Mahabubnagar District Latest News
-
తళంకేరి చెరువులో మొసలి కలకలం
మాగనూర్: మండలం కేంద్రంలోని సమాన్చెరువులో మొసలి కలకలం రేగింది. గ్రామస్తులు కొందరు గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో చెరువులో పశువులకు మేతకోసం అటువైపుగా వెళ్లగా మొసలి గట్టు మీదకు వచ్చి కనిపించడంతో ఒడ్డుకు పరుగులు తీశారు. చెరువులో నీరు చాలా తక్కువగా ఉన్నాయని ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి మరో చోటుకు తరలించాలని గ్రామస్తులు కోరతున్నారు. అయితే గతంలో ఇదే చెరువులో మొసలి ఉందని అధికారులకు తెలియజేసిన తూతూ మంత్రంగా బ్యానర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మొసలిని బంధించి మరో ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
అమరచింతకు ఎంతో చారిత్రక నేపథ్యం
నర్వ: కాకతీయులు, చాళుక్యులు, చోళులు పాలన సాగించిన ఎంతో చారిత్రక నేపథ్యం అమరచింతకు ఉందని నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు అన్నారు. గురువారం పెద్దకడ్ముర్లోని 800 ఏళ్ల నాటి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు నర్సింహయ్య స్వామి వారికి పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్రను వారికి వివరించారు. ఆలయ గోడలపై, రాతి స్తంభాలపై కాకతీయులు శిల్పులు చెక్కిన దేవతామూర్తులు, నాట్యమయురీలు, జంతువుల అద్బుత చిత్రాలను చూసి అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో చారిత్రక నేపథ్యాలు కలిగిన ఆలయాలు చంద్రఘడ్ కోట మరెన్నో నాడు రాజులు పిలవబడ్డ అబరచింత, నేడు అమరచింతగా మారిందన్నారు. అమరచింతను నియోజకవర్గం సాధించేవరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు రామన్గౌడ్, సత్యం ఉన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యంపై విచారణ అచ్చంపేట రూరల్: ఓ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యంపై గురువారం వైద్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్ 24న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతంపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో డీసీహెచ్ఓ సూర్యశ్రీరావు, తన సిబ్బందితో విచారణ చేపట్టారు. అప్పట్లో విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో గంటల పాటు విచారణ చేపట్టారు. అలాగే అచ్చంపేట ఎస్ఐ సద్దాంహుస్సేన్ను విచారించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై వడ్ల లారీ దగ్ధం
ఎర్రవల్లి: వడ్ల లోడ్తో వెళ్తున్న ఓ లారీ 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి దాదాపు 300 క్వింటాళ్ల వరి ధాన్యంతో ఓ లారీ బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు బయలుదేరింది. గురువారం ఉదయం లారీ జింకలపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఇంజిన్లో తీవ్రమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై లారీని రోడ్డు పక్కన నిలిపి కిందకు దూకి, ప్రాణాలను కాపాడుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లారీ ఇంజిన్తో పాటు క్యాబిన్, కొన్ని ధాన్యం బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు లారీ డ్రైవర్ కరీముల్లా తెలిపారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్, కోదండాపురం ఎస్ఐ తరుణ్కుమార్రెడ్డి హైవే సిబ్బందితో కలిసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనా స్థలాన్ని అలంపూర్ సీఐ ప్రదీప్కుమార్ సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. లారీ డీజిల్ ట్యాంకుకు మంటలు వ్యాపించకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పోలీసులు తక్షణమే స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. రూ.5 లక్షల వరకు ఆిస్తి నష్టం -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
● డిండి ఎత్తిపోతలతో పాలమూరు రైతాంగానికి తీవ్ర నష్టం ● చేతులెత్తి దండం పెడ్తున్నాం.. జిల్లాను కాపాడండి మెట్టుగడ్డ: పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్ లో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు జేఎసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లా రైతంగానికి మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి పాలమూరు అంటేనే వెనకబడ్డ జిల్లా అని ముద్ర వేసి అన్ని రంగాల్లో వెనకబడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరుకు మొండి చేయి చూపిస్తూ, నల్లగొండకు మేలు జరిగేలా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2013లోనే పాలమూరు ఎత్తిపోతల పధకానికి 72 జీవో ద్వారా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పాలమూరు ప్రజల దురదృష్టమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి 2015లో 105 జీవోతో ప్రాజుక్టు నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించారు. కానీ ప్రారంభమై 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని, కానీ ఉదండాపూర్లో పదిశాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు డండి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో మరోసారి జిల్లా నీటిని నల్లగొండకు తరలించుకుపోయే పథకానికి శ్రీకారం చుట్టడంతో ఈ జిల్లాకు పెద్ద నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం, జిల్లా మంత్రులు కిమ్మనకుండా ఉండటం చాలా బాధాకరమన్నారు. మహబూబ్నగర్ నీటిని మరో జిల్లాకు తరలించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని జిల్లా రైతాంగంలో చైతన్యం కల్పించి ఉద్యమానికి శ్రీకారం చూడ్తామని తేల్చి చెప్పారు. జిల్లాకు మంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు చేతులెత్తి దండం పెడ్తున్నాం.. జిల్లాను కాపాడాలని కోరుతున్నామని తెలి పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాఘవచారి, హనీఫ్, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
● అరైవ్–అలైవ్ అవగాహన సదస్సులోడీజీపీ శివధర్రెడ్డి జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బెక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా దరించాలన్నారు. సీటు బెల్టు దరిస్తేనే ప్రమాదసమయంలో ఎయిర్ బెలున్లు తెరుచుకుంటాయని, ఫలితంగా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. జాతీయ, రాష్ట్రీయ ప్రధాన రహదారులపై లారీలు, బస్సులు, తదితర భారీ వాహనాలు రోడ్డుకు ఎడమ వైపునే వెళ్లాలని సూచించారు. ఎడమ వైపు నుంచి ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయడం సరైంది కాదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షితమైన ప్రయాణం కోసం ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు బైక్లు, తదితర వాహనాలు నడపడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పిల్లలను ప్రోత్సహించడం నేరమన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి విజ్ఞప్తి మేరకు జడ్చర్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరమన్నారు. ఎమ్మెల్యేలతో సహా ఇతర ప్రముఖల వాహనాలకు కూడా తప్పనిసరిగా నంబర్ప్లేట్లు ఉండాలన్నారు.జడ్చర్లలో ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఔట్ పోస్టు ఏర్పాటు చేసి గంజాయి, తదితర నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించి ఎస్పీ జానకి ప్రతిజ్ఞ చేయించారు. ● మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో విదులు నిర్వర్తిస్తూ 29 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు రాజేశ్వర్రెడ్డి, అజాజొద్దీన్లను సన్మానించారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రోడ్డు రవాణా శాఖ అధికారిణి శ్రీవాణి, ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఆర్ఎం వినోద్కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, ఎంఈఓ మంజులాదేవి పాల్గొన్నారు. -
చెరవులు!
మోదంకుంట చెరువు ఏనుగొండ పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఈ చెరువు దాదాపు 7.30 ఎకరాల్లో ఉంటుంది. ఈ చెరువుపై ఆధారపడి 220 మత్స్యకార కుటుంబాలు చేపల వృత్తిలో జీవనం సాగిస్తుండేవారు. పదేళ్లుగా ఈ చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురై మూడెకరాలకు కుచించుకుపోయింది. చెత్తను తెచ్చి ఇందులో పడేస్తున్నారు. చెరువులో నీళ్లు నిలబడటం లేదు. దీంతో మత్స్యకారుల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. ఆక్రమణలపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులిచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోకి చొరబడి యథేచ్ఛగా ఆక్రమణలుపాతపాలమూరు ఏరియాలోని నల్లగుంట దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు ఇందులో చేపలు పెంచుకొని మత్స్యకారులు జీవనం సాగించేవారు. పదిహేనేళ్ల కాలంలో ఈ చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైంది. రియల్ వ్యాపారులు చెరువులో రాళ్లు పాతుతూ ఇప్పటికీ ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 15 ఎకరాలకు ఈ చెరువు కుచించుకుపోయింది. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఆశించిన ఫలితాలు రావడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ న్యూటౌన్/ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని చెరువులను చెరబడుతున్నా సుమారు 15 నెలల క్రితం మహబూబ్నగర్ నమున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారడంతో రియల్ వ్యాపారుల కన్ను చెరువుశిఖం భూములపై పడింది. అధికారుల కళ్లుగప్పి హద్దులను చెరిపేసి మరీ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిని దాటి మట్టి నింపుతూ ప్లాట్లుగా మారుస్తూ రాళ్లు పాతుతున్నారు. భూముల విలువలు పెరగడంతో చెరువు భూములను టార్గెట్ చేసుకొని కొందరు అక్రమార్కులు ఆక్రమణలు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులకు ననగర ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టింపులేదు. రియల్ వ్యాపారుల ధనదాహాన్ని రాజకీయ నాయకుల ద్వారా తీర్చుకుంటున్నారు. ఫలితంగా నగరంలోని చెరువులు కనుమరుగవుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఆక్రమణదారులపై చర్యలు లేకపోవడంతో చేసేది లేక ఫిర్యాదులకే పరిమితం కావడం గమనార్హం. మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలో దాదాపు 800 ఎకరాలలో 31 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పదదమూడేళ్లలో చాలా వరకు ఆక్రమణలు కొనసాగాయి. కొన్ని చోట్ల చెరువుల ఆనవాళ్లే లేకుండాపోయాయి. హైడ్రా తరహా నిబంధనలు వస్తే తప్ప ఈ ఆక్రమణల పర్వం ఆగే పరిస్థితి లేదని స్థానికులు, ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధ్యులపై చర్యలు చేపట్టేదెన్నడో? ఈ నిర్మాణాలన్నీ గతంలోనే చేపట్టగా జిల్లా అధికారులకు ‘ప్రజావాణి’ లో పలుసార్లు స్థానికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ బాధ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. రికార్డుల్లో లోపాలే కారణం నిజాం కాలంలో నిర్మించినఈ చెరువులు నీటి వనరుల నిల్వతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యతకు ఉపయోగపడటంతో పాటు వీటిపై ఆధారపడి మత్స్యకారులు చేపల వృత్తిని కొనసాగించడం, పశువులు, ఇతర జీవాల తాగునీటి అవసరాలకు, వ్యవసాయ పంటల సాగుకు వినియోగించేందుకు చెరువులు ఉపయోగపడుతాయి. మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడే చెరువుల సంరక్షణను గాలికొదిలి భూరికార్డుల్లోని లోపాలను ఆసరా చేసుకొని రియల్ మాఫియా చెలరేగుతోంది. అక్రమంగా చెరువుల్లో మట్టి నింపుతూ ప్లాట్లు చేస్తున్నారు. చెరువు భూముల పరిరక్షణకు సరైన రికార్డులు లేకపోవడం, భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కులపై చర్యలకు పటిష్టమైన నిఘా లేకపోవడం వంటి కారణాలు ప్రధాన సమస్యగా మారింది. నిబంధనలకు నీళ్లు చెరువు సరిహద్దు ప్రాంతంలో సొంత పట్టా భూమి ఉన్నా సరే ఇరిగేషన్శాఖ నుంచి ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) తీసుకొని ఏదైనా నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలను తుంగలో తొక్కి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని దాటి ఆక్రమణలు కొనసాగిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొత్త ఆక్రమణలు ఏమీ లేవు మహబూబ్నగర్ అర్బన్లో మొత్తం 31 చెరువులు, కుంటలున్నాయి. గతంలోనే కొన్నింటిలో ఆక్రమణలు జరిగాయి. వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టును సమర్పించాం. కొత్తగా ఆక్రమలు ఏమీ లేవు. కొత్తగా ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – వెంకటయ్య, ఈఈ, నీటిపారుదల శాఖ, మహబూబ్నగర్ డివిజన్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోనూ వదలని తీరు.. మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలోని వివిధ చెరువులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లోనూ కొందరు వ్యక్తులు ఏకంగా ఇళ్లు, ఇతర కట్టడాలు యథేచ్ఛగా చేపట్టారు. నగరం నడిబొడ్డులోని పెద్దచెరువు (మినీ ట్యాంక్బండ్) 138.20 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో బీకేరెడ్డి కాలనీ, షాషాబ్గుట్ట, పీర్లబావి, మోటార్లైన్, న్యూటౌన్ కు చెందిన 78 మంది ఇళ్లు, వివిధ బహుళ అంతస్తులను అక్రమంగా నిర్మించుకున్నారు. ఇక బఫర్ జోన్లోనూ 64 ఇళ్లు ఇలాగే నిర్మించుకున్నారు. శ్రీనివాసకాలనీ సమీపంలోని పాలకొండ చిన్నచెరువు 138.20 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో 56 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. బండమీదిపల్లిలోని ఇమాంసాబ్కుంట 23.29 ఎకరాలలో విస్తరించి ఉండగా ఇప్పటికే దీని ఎఫ్టీఎల్ పరిధిలో హబీబ్నగర్, పాత పాలమూరుకు చెందిన 14 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. గణేశ్నగర్, బండ్లగేరి, కిసాన్నగర్ మధ్యనున్న ఎర్రకుంట 29.31 ఎకరాలలో విస్తరించింది. దీని ఎఫ్టీఎల్ పరిధిలో 32 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. పాలకొండలోని ఊరచెరువు 19.11 ఎకరాలలో ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో 12 మంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. తిమ్మసానిపల్లి/దొడ్డలోనిపల్లిలోని బోసోనికుంట 5.29 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో ఓ ఇంటితో పాటు శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. బోయపల్లిలోని మల్లమ్మకుంట 14.36 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో ఏకంగా ఓ రైస్ మిల్లుతో పాటు మరొకరు ఇల్లు నిర్మించుకున్నారు. ఎదిరలోని చెంచలకుంట 9.11 ఎకరాలలో విస్తరించగా ఎఫ్టీఎల్ పరిధిలో ఓ వ్యక్తి ప్రీకాస్ట్ కాంపౌంట్ వాల్ నిర్మించారు. నీటి వనరుల హద్దులు చెరిపి నిర్మాణాలు చేపడుతున్న వైనం భూముల పరిరక్షణకు సరైన రికార్డులు లేకపోవడమే కారణం పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 31 చెరువులు, కుంటలు హైడ్రా తరహా నిబంధనలు తెస్తే గానీ.. ఫలితం దక్కదంటున్న స్థానికులు -
చమ్మగిల్లినఖాన్దొడ్డి..!
గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరఫున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితో పాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. పరస్పర కేసుల నమోదు.. కోర్టు ఉత్తర్వులతో చమన్ఖాన్దొడ్డికి వెళ్లిన కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన 8 మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. మరోవైపు తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన భూమి యజమాని బంధువులపై పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతో పాటు వారి బంధువులు ఎనిమిది మందితో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఇక్కడే పుట్టి పెరిగినం.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పు డు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. – ఆంజనేయులు, చమన్ఖాన్దొడ్డి ఎక్కడికి పోవాలి.. మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం. – మల్లేష్, చమన్ఖాన్దొడ్డి ఛి ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి మాత్రం వదులుకోమని ప్రతిన పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు -
దాహం తీర్చేలా..!
అచ్చంపేట: వేసవిలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్డ్యాంలు, నీటి గుంటలు, సోలార్ కుంటలు, సాసర్ పిట్లు నిర్మించారు. సోలార్ పిట్లలో ప్రతి నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో సమస్య జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, నీటి ఆవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాహం తీర్చడంతో పాటు వాటి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జంతువుల ఆవాసాల్లోనే.. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం 2,611.39 చ.కి.మీ., విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చ.కి.మీ., బఫర్జోన్గా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 42 పులులు, 250కిపైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్లపందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, వంటి ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. నీటి సమస్య తీవ్రతతో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణణాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జలవనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసులచెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉండటంతో అత్యధికంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తుంటాయి. 1,150 సీసీ సాసర్ల ఏర్పాటు నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఆర్(అమ్రాబాద్ టైగర్రిజర్వ్)లో 75 సోలార్ విద్యుత్తో నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటీఆర్ పరిధిలో 80 వరకు నీటికుంటలు, చెక్డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్లు, పాంపాండ్లు ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా రెండువైపుల ర్యాంపు తయారు చేస్తారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. వీటిని 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండురోజులకోసారి బేస్ క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. నల్లమలలో వన్యప్రాణులకు ఆహారంతో పాటు దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అడవిలో పారే వాగులు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. నీటి ఆనకట్టలు, ర్యాంపు వెల్స్, చెలిమెల ద్వారా సహజసిద్ధమైన నీటిని వన్యప్రాణులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. సీసీ సాసర్ల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన నీరిందించేందుకు చూస్తున్నాం. కెమెరాల పర్యవేక్షణలో నీరు అయిపోయినట్లు గుర్తించి వెంటనే నింపుతున్నాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ నల్లమల అటవీ ప్రాంతంలోమూగజీవాలకు నీటి సౌకర్యం అభయారణ్యంలో ఎండుతున్నవాగులు, చెక్డ్యాంలు, కుంటలు మండుతున్న ఎండలతో అడుగంటుతున్న జలాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ రూరల్/జెడ్పీసెంటర్: దివ్యాంగుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ గర్జన ప్రారంభమైందని, హామీలు అమలు చేయకపోతే పాలకులకు దివ్యాంగుల శక్తి చూపిస్తామని ఎన్పీఆర్డీ ఇండియా జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ హెచ్చరించారు. జూలై 15న హైదరాబాద్లో లక్ష మందితో నిర్వహించనున్న దివ్యాంగుల ఆత్మగౌరవ బహిరంగసభ చరిత్రాత్మకంగా నిలవనుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త యాదగిరి, స్కైటు రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. నెలకు రూ.6 వేల పింఛన్, జిల్లాల్లో ప్రత్యేక శాఖలు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు మొదటి రోస్టర్ పాయింట్ కేటాయించాలని కోరారు. జూలై 15న జరిగే సభను విజయవంతం చేయడానికి జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చాలని పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. ఆరోగ్య బాల్యం
మహబూబ్నగర్ రూరల్: నేటి బాలలే రేపటి పౌరులు.. చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పోషణ్ పక్షోత్సవాల్లో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 వరకు నిర్వహిస్తున్నారు. ‘అమ్మ’ బాధ్యత ప్రధానం బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం తల్లి పాల ద్వారా చేకూరుతుంది. పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టడం ద్వారా తల్లీ బిడ్డలిద్దరికీ శ్రేయస్కరం. ఆరు నెలల వయసు వరకు అవసరాన్ని బట్టి తల్లిపాలే పట్టించాలి. తల్లి పాలల్లో బిడ్డకు సరిపోయే విటమిన్లు, మినరల్స్ ఉండటం ద్వారా శారీరక, మానసిక వికాసం వేగంగా అభివృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితం కారణంగా కొందరు తల్లులు బిడ్డలకు పాలు పట్టే సమయం ఉండటం లేదు. డబ్బాపాలు పట్టడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ● పోషణ లోపంతో వయసు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు లేని చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల వారీగా ఇప్పటికే గుర్తించారు. పక్షోత్సవాల్లో ఆయా కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోషణ సలహా, చికిత్స కేంద్రానికి తరలిస్తారు. అవసరమైన మందులు, సలహాలు అందేలా చూస్తారు. ఇంట్లోనే పౌష్టికాహారం తయారీ విధానాన్ని వివరిస్తారు. పౌష్టికాహార లోపంతో ఆరోగ్యపరంగా తలెత్తే ఇబ్బందులను తెలియజేస్తారు. అవసరమైన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారంతో పాటు ఆయా కేంద్రాల్లోని పెరటి తోటల్లో పండించిన కూరగాయలను ఉచితంగా అందజేస్తారు. బాలామృతం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించడం, పోషకాలపై అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీల్లో పోషణ పక్షం రక్తహీనత నివారణకు చర్యలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి -
ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట..
పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమరైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలేపల్లి సెజ్లోని ఓ పరిశ్రమ చిమ్నీ నుంచి బయటికి వదులుతున్న నల్లటి కాలుష్యం -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రిక ల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చా రు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవీలత, మహిళా రైతు -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
● అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాష్ట్రంలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారు ● 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చి మహిళా బిల్లుకు మద్దతు తెలపండి ● ఎంపీ డీకే అరుణ పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో మహిళలతో కలిసి ఎంపీ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాల ని ఆమె సూచించారు. -
విచారణలో తేలినా..
జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. -
ఆర్టిజన్ల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం ఏడో రోజుకు చేరుకోగా.. వారికి మాజీ మంత్రి మద్దతు పలికి మాట్లాడారు. వారం రోజులుగా ఆర్టిజన్లు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మర్గమని అన్నారు. అర్జిజన్ల సమస్యలను పరిష్కరించే దాక తమ పార్టీ వారికి మద్దతుగా ఉంటుందన్నారు. పీస్రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, అర్హతలున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను గుర్తించాలని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, నాయకులు సైదులు, మోయిస్, జెట్టి గోపాల్, పెంటయ్య, తిరుమలేష్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్ రూరల్: అంబేడ్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మాల మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో మన దేశం పేరు నిలిచిపోయేలా చేసిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత కూడా దేశ పౌరులంతా ఐక్యంగా ఉన్నారంటే అందుకు అంబేడ్కర్ రచనలే కారణమన్నారు. కార్యక్రమంలో నాయకులు వినోద్కుమార్, సిరాజ్ ఖాద్రీతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
అధికారులు జాగ్రత్తగా పనిచేయాలి
మహమ్మదాబాద్: ఇకపై అధికారులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా పనిచేయాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. బుధవారం ఆమె మహమ్మదాబాద్లోని కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేకుండా ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కేజీబీవీ ప్రత్యేకాధికారి పావనిని సస్పెండ్ చేశారు. అలాగే సీఆర్టీ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు శోభ విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పనందుకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాఠశాల నైట్ వాచ్మెన్ జైతున్బేగం తన భర్త ద్వారా నైట్ డ్యూటీ చేయిస్తుండటంతో ఆమెను సస్పెన్షన్ చేశారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని 7, 8, 9 తరగతుల విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధిస్తున్నారా.. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. మీరు బాగా చదువుతున్నారా.. అని ఆరాతీశారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తరచుగా పరీక్షలు చేస్తున్నారా అని అడిగారు. అనంతరం డార్మెటరీ రూంలు, మరుగుదొడ్లు, స్టోర్ రూంను పరిశీలించి సూచనలు చేశారు. పప్పు, బియ్యం, నూనె, కూరగాయల స్లాక్ వివరాలను సరిగా నమోదు చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్గౌడ్ తదితరులున్నారు. కేజీబీవీ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం నిర్లక్ష్యం వహించిన ఎస్ఓ, నైట్డ్యూటీ వాచ్మెన్ సస్పెండ్ పాఠాలు సరిగా చెప్పని ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు -
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగం -
డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రతి డ్రైవ్కు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థుల భద్రత మీ చేతుల్లోనే ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ఎస్పీ కార్యాలయంలో బుధవారం పాఠశాల, కళాశాల బస్సు డ్రైవర్లకు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం బాధ్యతగా తీసుకోవాలని, డ్రైవర్ ఎప్పుడూ ఇతరుల తప్పులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా వాహనాలు తీసుకువెళ్లడం అలవాటు చేసుకోవాలన్నారు. తప్పక వేగ పరిమితులు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, బాలాజీ, రమణారెడ్డి, ఆర్టీఓ రఘుకుమార్, ట్రాఫిక్ సీఐ రాజేందర్రెడ్డి, ఉమెన్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. ● అరైవ్– అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జానకి హాజరై విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రతతోపాటు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
కోనేరులో పడి యువకుడు మృతి
మన్ననూర్: స్థానిక వేణుగోపాలస్వామి ఆల యం ముందు భాగంలో ఉన్న కోనేరులో(బావి) ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఎండి జాహంగీర్ (35) మూడురోజుల క్రితం చేపల వేటకై సమీపంలో ఉన్న కోనేరులోకి ఒక్కడుగా వెళ్లి గాలాలు వేసి కూర్చున్నాడు. మృతుడు అ నునిత్యం తరచుగా మద్యం సేవిస్తూ మత్తులో నే ఉంటాడు. గాలం వేసి ఒడ్డుపైన కూర్చుండగా.. ప్రమాదవశాత్తు తూలి కోనేరులో పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం కుళ్లు పడవేసేందుకు వెళ్లిన వారికి కోనేరులో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో అమ్రాబాద్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. సర్పంచ్ సమక్షంలో కోనేరు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పో స్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య హసీన, ఇద్దరు పిల్ల లు ఉన్నప్పటికీ వారు కలిసి ఉండటం లేదు.ఇంట్లో కలిసి ఉండే అమ్మమ్మ నెలక్రితం మృతిచెందడంతో జహంగీర్ ఒక్కడే ఉండేవాడు.ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమ్రాబాద్ ఎస్ఐ హన్మంత్రెడ్డి తెలిపారు. నీటిసంపులో పడి వాచ్మన్ మృతి వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ సమీపంలోని వ్యవసాయ పొలంలోని నీటిసంపులో ప్రమాదవశాత్తు పడి వాచ్మన్ మృతిచెందిన ఘటన చోటుచేసుకంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదుకు చెందిన శ్రీరాములు పెద్దాపూర్ సమీపంలోని వ్యవసాయ పొలంలో జామతోట పెంచుతున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని పద్మశాలీ కాలనీకి చెందిన బొక్క శ్రీనివాస్(58) జామతోట వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రోజువారీగా పనిచేస్తూ సోమవారం తోటలో ఉన్నాడు. సాయంత్రం నుంచి వాచ్మెన్ శ్రీనివాస్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియలేదు. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో వ్యవసాయ పొలంలోని నీటిసంపులో శ్రీనివాస్ మృతదేహం కనిపించింది. వెంటనే వెల్దండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఎస్ఐ కురుమూర్తి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం బల్మూర్: మండలంలోని పోలిశెట్టిపల్లి శివారులోని జీఎస్ఎన్ కాలేజీ సమీపంలో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉంటాయన్నారు. అతడు యాచకుడిగా జీవనోపాధి పొందుతున్నాడని అనుమానిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పరిశ్రమల వ్యర్థాలతో తీవ్ర కాలుష్యం
జడ్చర్ల: పోలేపల్లి సెజ్లోని ఫార్మ పరిశ్రమల వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాలలో పారబోస్తున్నారని ఫలితంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తులు సమస్యలతో పాటు కేన్సర్ బారిన పడే ప్రమాదముందన్నారు. స్థానికులకు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వడం లేదని, కాలుష్యాన్ని మాత్రం అంటగడుతున్నారని మండిపడ్డారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విదేశీ పర్యటన ముగియగానే పోలేపల్లి పరిశ్రమల వ్యర్థాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేవిధంగా కోరుతామన్నారు. తమ పోరాట ఫలితంగా సెజ్లో రూ.15 కోట్లతో రసాయన నీటికి సంబంధించి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తామని తెలిపారు. 55 మంది ఎమ్మెల్యేల సంతకాలు తాను అసెంబ్లీలో లేవనెత్తిన ఇప్పపువ్వు సారా ప్రతిపాదనలకు మద్దతుగా 55 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. సీపీఐకి చెందిన ఎమ్మెల్యేతో పాటు బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ వాకౌట్ చేయకుంటే వాళ్లుకూడా సంతకాలు చేసి ఉండేవారని పేర్కొన్నారు. ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. – అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, తహసీల్దార్ నర్సింగరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్,తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 22,851 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు పూర్తిచేసిన పీయూ అధికారులు పీయూ ముఖద్వారం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ఈ నెల 16 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 2, 4, 6 సెమిస్టర్లకు సంబంధించి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడటం.. వారిని అధికారులు డిబార్ చేయడం వంటి చెదురు ముదురు ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది. వేసవి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు.. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పరీక్షల నిర్వహణకు పీయూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా తాగునీటి వసతి కల్పించడంతో పాటు విద్యార్థులకు ఓఆర్ఎస్ పాకెట్లు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల్లోని ప్రతి గదిలో ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నారు. 37 పరీక్ష కేంద్రాలు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అధికారులు 37 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 19 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. బీఏ విద్యార్థులు 7,824, బీకాం విద్యార్థులు 7,995 మంది, బీఎస్సీ విద్యార్థులు 7,032 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్ పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు బ్యాక్లాగ్ పరీక్షలు రాసే వారు కూడా ఉన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
‘డిండికి కృష్ణా నీటిని తరలిస్త్తే ఉద్యమాలు తప్పవు’
కొల్లాపూర్ రూరల్: పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా కృష్ణానది నీళ్లను డిండికి తీసుకెళ్తే ఉద్యమాలు తప్పవని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ నాయకులు రాఘవాచారి, రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు శివారులో నిర్మాణంలో ఉన్న పాలమూరు, కేఎల్ఐ ప్రాజెక్టులను బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా పంపహౌజ్లు, ప్యానల్బోర్డు, డెలివరీ పంపులు, నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్ను పరిశీలించారు.అనంతరం కొల్లాపూర్లో విలేకరులతో మా ట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి మొదటి ప్యాకేజీలో కృష్ణానది నీళ్లను ఎత్తిపోసేందుకు నాలుగు బహుబలి మోటర్లు సిద్ధంగా ఉన్నా.. ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. మూడోప్యాకేజీలో పెండింగ్లో ఉన్న కొంత పనిని పూర్తిచేస్తే దాదాపు 50 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా.. పాలమూరుకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుందని ఆరోపించారు. సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమా ర్రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సింది పోయి పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు. ఎంజీకేఎల్ఐ ప్రాజె క్టు మొత్తం కలిసి 4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఉంటే డిండి ప్రాజెక్టు ద్వారా 25 టీఎంసీల నీళ్లను తీసుకుపోయేందుకు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రయ త్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు మూలంగా పాలమూరు జిల్లావాసులు కృష్ణానదిపై నీటిహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డిండికి గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్కమార్రెడ్డికి సూచించారు. ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత ప్రజలు భూములను త్యాగం చేశారని.. మళ్లీ ఇప్పుడు ఆయకట్టు లేకుండా మరోసారి రైతులు డిండి ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరన్నారు. డిండి ప్రాజెక్టు ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రయోజనాల కోసం ప్రతిగ్రామంలో పెండింగ్ ప్రాజెక్టు సాధన కమిటీ పర్యటించి కమిటీలు వేసి ఉద్యమాలకు సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏసేపు, వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, ఖాదర్ పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖిల్లాఘనపురంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు.. మిడ్జిల్ మండలం వస్పులకు చెందిన వడ్ల సురేంద్రాచారి (42)కి ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు తరుచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి రెండేళ్ల క్రితం తల్లిగారి ఊరికి వచ్చి జీవనం సాగిస్తుంది. రెండు నెలల క్రితం సురేంద్రాచారి కూడా భార్య వద్దకు వచ్చాడు. అయితే రెండు రోజుల క్రితం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో భార్య అలిగి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన ఆయన.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
సమాజంలో సమానత్వం నెలకొల్పాలి
మహబూబ్నగర్ రూరల్: అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమాజంలో సమానత్వం నెలకొల్పాలని ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని రామచంద్రాపూర్లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు విగ్రహాన్ని ఆవిష్కరించి అంబేడ్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. 4,750 కిలోల పత్తి విత్తనాలు పట్టివేత భూత్పూర్: మండల కేంద్రంలోని పత్తి విత్తనాల కంపెనీలో అనుమతి లేని విత్తనాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన సీడ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కృష్ణ, నాగరాజులు సికాప్ సీడ్స్ కంపెనీ, నవత ట్రాన్స్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. సికాప్ సీడ్స్ కంపెనీలో కర్ణాటక నుంచి వచ్చిన 4,500 కిలోల పత్తి విత్తానాలకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడం, నవత ట్రాన్స్పోర్టులో 250 కిలోల కాలం చెల్లిన విత్తనాలను గుర్తించారు. వీటిని సీజ్ చేసి విత్తనాలకు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఓ మురళీధర్ను అధికారులు ఆదేశించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి తిమ్మాజిపేట: చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తిమ్మాజిపేట మండలం బా వాజీపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు వివరాల మేరకు.. బావాజీపల్లికి చెందిన ఎండీ మహమూద్ (53) కొందరు వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే అతడి మృతిపై మృతుడి సోదరుడు జావీద్ అనుమానాలు వ్యక్తంచేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి ‘అథ్లెటిక్స్’లో పాలమూరుకు పతకాలు
డి.శ్రీధర్ (కాంస్య పతకం) కీర్తన (రెండు బంగారు పతకాలు) పౌర్ణమి (వెండి పతకం) కార్తీక్ (వెండి పతకం) బి.శ్రీధర్ (బంగారు పతకం) మహబూబ్నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళల అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. జిల్లా అథ్లెట్లు మూడు బంగారు, రెండు రజత ఒక కాంస్య పతాకాన్ని సాధించారు. 20 ఏళ్లలోపు బాలుర విభాగంలో బి.శ్రీధర్ 400 మీటర్ల హార్డిల్స్లో బంగారు పతకం, బాలికల విభాగంలో కీర్తన 800 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగులో బంగారు పతకాలు, కార్తీక్ డెకథ్లాన్లో వెండి పతకం సాధించారు. అదేవిధంగా 20 ఏళ్ల లోపు బాలికల విభాగంలో బి.పౌర్ణమి డిస్కస్త్రోలో వెండి పతకం, డి.శ్రీధర్ 400 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించారు. పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టోనీ మార్టిన్, జి.శరత్చంద్ర, సభ్యులు సి.శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాసులు, దత్తాత్రేయ, కోచ్లు ఆనంద్కుమార్, సునీల్, ఎం.శ్రీనివాసులు అభినందించారు. -
డ్రిప్ పరికరాల శుభ్రతతో మేలు
అలంపూర్: బిందు సేద్యానికి ఉపయోగించే పరికరాలను సకాలంలో శుభ్రం చేసుకోవడం వలన వాటి మన్నిక పెరగడంతో పాటుగా నీటి పారుదల బాగుంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు. వంద అడుగులకు పైగా పడిపోయిన భూగర్భ జలాల నుంచి వచ్చే సన్నటి మన్ను, ఎరువులు బిందు సేద్యం పరికరాలను దెబ్బతిస్తాయన్నారు. తద్వార మోటార్లపై భారం పడి అవి దెబ్బతినే అవకాశం ఉంది. స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత కీలకం బోరు బావుల నుంచి వచ్చే నీటిలో సన్నటి మన్ను అధికంగా వస్తోంది. దీనివల్ల లేటర్ పైప్ల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లేటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్ను అమర్చుతారు. దీన్ని వారం రోజులకు ఒక సారి నీటితో శుభ్రం చేయాలి. ఫిల్టర్పై సన్నటి రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవాలి. కొత్తగా వేసిన బోర్లు అయితే రోజుకు ఒక పర్యాయం అయినా ఫిల్టర్ను శుభ్రం చేసుకోవడం మంచిది. బావుల నుంచి నీటిని తీసుకుంటున్నప్పుడు సాండ్ ఫిల్టర్ను అమర్చుకోవాలి. రెండు ఫిల్టర్ల వల్ల రెండు దఫాలుగా వడపోత జరిగి లేటరల్ పైపుల్లోకి మట్టి చేరకుండా ఉంటుంది. లెటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్మెంట్ బిందు సేద్య పరికరాల ద్వారా అందించే ఎరువులు వల్ల లేటరల్ పైపులకున్న రంధ్రాలు మూసుకుపోతాయి. తద్వార నీరు కిందికి రావడం నిలిచిపోయి మొక్కలకు నీరు అందదు. ఏడాదికి ఒకసారి పైప్లను శుభ్రపర్చుకోవాలి. ఇందుకోసం తక్కువ గాఢత గల హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ ఆసిడ్ను వాడతారు. ఆసిడ్ను ఉపయోగించి పైప్లను శుభ్రపరిచేందుకు రెండు పద్ధతులు పాటించవచ్చు. ఎకరా పొలంలో గల లేటరల్ పైప్లను శుభ్రపరిచేందుకు 30 నుంచి 40 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పది మీటర్ల హూస్ పైప్ తీసుకొని రెండు వైపులా కట్టెలను పాతి యూ ఆకారంలో అమర్చాలి. హూస్ పైప్నకు ఒక వైపు నుంచి నాలుగేసి లేటరల్ పైప్లను జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. ఆపై పైప్లను రెండు రోజులపాటు వాడకుండా వదిలేయాలి. మూడో రోజు సబ్ లైన్కు బిగించి నీటి వదిలేయాలి. ఆపై ఒక రోజు తర్వాత మొక్కలకు నీరు అందించడానికి పైప్లను బిగించాలి. ● రెండో పద్ధతిలో ఎరువులను వదిలే ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చడం. పంట లేని సమయాల్లో మాత్రమే ఈ పద్ధతిని అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంక్ను ముందుగా శుభ్రపర్చుకొని, తక్కువ గాఢత గల ఆసిడ్ను, తర్వాత నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియ మెల్లగా జరిగే విధంగా చూడాలి. ఆపై గేట్ వాల్స్ను నియంత్రిస్తూ ఆసిడ్ ఉన్న నీటిని మెయిన్ లైన్ గుండా సబ్ లైన్ ద్వారా లేటరల్ పైప్లకు పంపాలి. ఇందుకోసం ఎక్కడ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇనుప ఫెర్టిగేషన్ ట్యాంక్ ఉన్నట్లయితే వెంచురీ సాయంతో లేటరల్ పైప్లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. దీనివలన ఆసిడ్ ఉన్న నీరు వెళ్తున్న తీరు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అరగంట పాటు ఆసిడ్ ప్రక్రియ సాగితే లేటర్ పైప్లకు ఉన్న చిన్న రంధ్రాల్లో మలినాలు తొలగిపోయి పూర్తి స్థాయిలో శుభ్రపడతాయి. జాగ్రత్తలు ● పంటలు ఉన్న సమయాల్లో ఆసిడ్ ద్వారా పైప్లను శుభ్రపర్చరాదు. ● డ్రిప్ కంపెనీలు సూచించిన ఆసిడ్ను వారు నిర్ధేశించిన మోతాదు మేరకే వాడాలి. ● నీటిలో ఆసిడ్ను కలపాలి. అంతేకాని ఆసిడ్ ఉన్న ట్యాంకులో నీటిని దారపోసే ప్రయత్నం చేయరాదు. ● ఫెర్టిగేషన్ లేదా వెంచురీ సాయంతో ఆసిడ్ను పంపేటప్పుడు నీటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● పైప్లు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాప్లను తీసేసి ఆసిడ్ కలిపిన నీటిని వదిలేయాలి. ● శుభ్రపరిచిన పైప్లను సైతం మరోమారు నీటితో కడగడం లేదా సబ్లైన్కు బిగించి నీటిని పారనివ్వాలి. – శుభ్రపరిచే సమయాల్లో రైతులు ముఖానికి, చేతులకు తొడుగులు విధిగా ధరించాలి. వీలైతే చలువ కంటి అద్దాలు వేసుకోవడం ఉత్తమం. ● రసాయనిక ప్రక్రియ కాకుండా అయితే లేటరల్ పైపుల చివరన ఉన్న ఎండ్క్యాప్లను వారానికి ఒకసారి తీసి పది నిమిషాల పాటు నీటిని వదలాలి. తద్వార లేటరల్ పైప్లు శుభ్రపడతాయి. మెయిన్ లైన్ చివరణ గల ఎండ్ క్యాప్లను సైతం తీసి ఉంచడం వలన నీటిలో గల మలినాలు శుభ్రపడతాయి. డ్రిప్ ఫిల్టర్ పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పైపులుపాడి–పంట -
కొమ్ముగుట్టను కొల్లగొట్టారు!
తాడూరు: చెట్టు..పుట్ట..గుట్ట.. మట్టి కాదేది కాసుల దందాకు అడ్డురా అడ్డు కాదు.., ఇసుక, మట్టి స్థలాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా తాడురు మండల కేంద్రం శివారులో ఉన్న కొమ్ముగుట్టను కొల్లగొడుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు మాముల్ల మత్తులో మునిగిపోయారు. వారు పట్టించుకోకపోవడంతో కొంగుటురు రేఖల్ని కొల్పోతుంది. 80ఎకరాల్లో విస్తరించిన ఈ గుట్ట చుట్టూ మూడువైపులా మట్టిని తరలించేందుకు జిల్లా కేంద్రానికి దగ్గరగా కొమ్ముకుంట ఉండడంతో మట్టిదందా ఎక్కువ అవుతుండడంతో ఇది కరిగిపోతుంది. ఒక్క టిప్పర్ మట్టిని రూ.4500కు అమ్మెస్తున్నారు. ఇప్పటికే 10ఎకరాల వరకు తవ్వేశారు. తవ్విన ఆ తర్వాత ఖాళీ స్థలం కూడా అక్రమించేందుకు ప్రయాత్నాలు మమ్మురం చేస్తున్నారు. ఎంత తీశారా అనే దానిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు మైనింగ్ రెవెన్యూ అధికారులు ఒక్కరోజు కూడా పర్యవేక్షించింది లేదంటున్నారు. రాత్రివేళ మట్టి తరలింపుపై విచారణ చేస్తామని నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఇటు రెవెన్యూ అటు పోలీసు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకు సరిపోయింది తప్పా.. ఆచరణలో అధికారులు విఫలమయ్యారు. అర్ధరాత్రి అక్రమ రవాణా హద్దూఅదుపు లేకుండా రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో ప్రైవేట్ స్థలంలో నిల్వ చేసుకొని ఆ తర్వాత డంపింగ్ చేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగాసానిపల్లికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు మాములు ఇస్తున్నామనే ధీమాతో మట్టిని తరలిస్తూ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. పట్టించుకోని అధికారులు మండల కేంద్రంలోని కొమ్ముగుట్ట నుంచి అక్రమంగా మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న టిప్పర్లను గ్రామానికి చెందిన యువకులను పోలీసులకు అప్పజెప్పిన వదిలేస్తున్నారు. 100కు డయల్ చేసి విషయాన్ని తెలిపినా సకాలంలో పోలీసులు స్పందించడం లేదు. ప్రతిరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మండలనానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అక్రమ రవాణాను సాగించడంపై అంతర్యం ఏమిటని యువకులు ప్రశ్నిస్తున్నారు. గుట్టుచప్పుడు లేని దోపిడీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యం మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కనబడడం లేదు. 80 ఎకరాలలో విస్తరించి ఉన్నా.. పూర్తిగా మాయమైపోతుంది. మట్టిని తరలించగా ఏర్పడే ఖాళీ స్థలం కూడా కబ్జా చేస్తున్నారు. లక్షల్లో కాసుల దందా కొనసాగుతుంది. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే తప్పని పరిస్థితుల్లో ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరించారు. గుట్టుగా మట్టి అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు ఎండబెట్లలో నిల్వ కొమ్ముగుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి పోలీసు, మైనింగ్ అధికారులతో చర్చించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతాం – రామకృష్ణయ్య, తహసీల్దార్, తాడూరు -
జనగణనలో ఓబీసీల లెక్క తేల్చాలి
● ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం ● మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్జోడో యాత్రతో దేశంలో ఓబీసీల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఎవరు ఎంత ఉన్నారో.. వారికి అంతస్థాయిలో వాటా ఉండాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రాహుల్గాంధీ ఆలోచన మేరకు ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టి 56 శాతం బీసీలు ఉన్నారని లెక్క తేల్చి రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా బీసీలకు అవకాశం దక్కిందన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఈ వర్గానికి చేసిందేమిలేదని విమర్శించారు. ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, లక్ష్మణ్, సీజే బెనహర్, రాములుయాదవ్, ఉషారాణి, పరమేశ్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలు బాలికల భవిష్యత్కు నిలయాలు
తిమ్మాజిపేట: కేజీబీవీలు బాలికల సమగ్ర అభివృద్ధి, భవిష్యత్కు నిలయాలుగా మారాయని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు సోమిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆర్జెడీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. బాలికలకు విద్యతోపాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, సృజనాత్మకత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకునే బాలికలు విద్యద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించే అవకాశాలు కేజీబీవీలో విస్తతంగా ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, వంటి లక్షణాలను పెంపొందించుకొని భవిష్యత్లో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, యోగా, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం బలంగా ఉంటేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. బాలికల విద్యాభివృద్ధి ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయని మహిళలు అన్నిరంగాల్లో మందంజలో ఉండేలా ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుమందు ఉపాధ్యాయునులతో సమావేశమై పలు విద్యా అంశాలపై చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రంశసా పత్రాలు అందజేశారు. రూ.80వేల పరికరాలు అందజేత మార్చిలో కేజీబీవీని సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించిన సమయంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.80వేల విలువైన పరికరాలను అందజేశారు. 30లీటర్ల సామర్థ్యం గల రెండు చల్లని తాగునీటి విద్యుత్ యంత్రాలను పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు బీపీ కొలిచే యంత్రం, థర్మామీటరు, స్టెతస్కోప్, బరువు కొలిచే యంత్రం వంటి వైద్య పరికరాలను అందజేశారు. బాలికలకు ప్రత్యేకంగా సిక్రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. త్వరలో 10కంప్యూటర్ బేబుళ్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసు
అమరచింత: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నానని, అభివృద్ధికి తానెప్పుడు అడ్డుపడే వ్యక్తిని కాదని ఇక్కడ జరిగే అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల వద్ద హైలెవల్ బిడ్జ్రి నిర్మించడం వల్ల అమరచింత, ఆత్మకూర్ పట్టణాలు అభివృద్ది చెందుతాయని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ అరుణ కేంద్ర నిధులు అంటూ తమ ప్రమేయం ఉండాలంటూ చెప్పుకురావడం, చేసిన శంకుస్థాపనలకు మళ్ల శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మునుపెన్నడు లేని విధంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరెన్ని నిధులు తెచ్చిందో తేల్చుకుందామని దమ్ముంటే చర్చకు రావాలని ఎంపీకు సవాల్ విసిరారు. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పె ట్టుకుని జూరాల ప్రాజెక్టు ఎగువలో బిడ్జ్రిలు, బ్యారేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీమా నదిపై రెండు బ్యారేజీలు, కృష్ణ నదిపై మినీ జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు. ప్రతి వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి సాయం చేయ్యమ ని అడిగే వాళ్లమని బ్యారేజీలు, బిడ్జ్రిలు నిర్మించుకుంటే అలాంటి పరిస్థితి ఇకపై ఉండదన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం.నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, లోకల్బాడీ కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. -
పోషక విలువల అక్షయపాత్ర.. మునగ
మదనాపురం: ప్రకృతి మాత తన అక్షయపాత్ర నుంచి మానవాళికి ప్రసాదించిన అపురూప వరప్రసాదం మునగ. ఇది కేవలం పెరటి చెట్టు కాదు.. ప్రాణదాత. వినీల ఆకా శం కింద పచ్చని తోరణంలా విరిసే ఈ మొక్క, మానవ దేహానికి అవసరమైన పోష కాలను తన ప్రతి అణువులోనూ నింపుకొన్న ఒక శాకాహార నిధి. మునగలోని మాధుర్యం, దాని వెనుక ఉన్న ఆరోగ్యం గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత వివరించారు. కనుచూపునకు వెలుగురేఖ.. క్యారెట్ కన్నా పది రెట్లు మిన్నగా విటమిన్ అని నింపుకుని, నయనాలకు కాంతిని ఇస్తుంది. పాల కన్నా పదిహేడు రెట్లు అధికంగా కాల్షియాన్ని అందిస్తూ ఎముకలను దృఢంగా మలుస్తుంది. పాలకూరను మించిన ఐరన్ ధారల తో రక్తహీనతను పారద్రోలుతుంది. నారింజను తలదన్నే విటమిన్–ఈ, అరటిని మించిన పొటాషియంతో దేహానికి నవ చైతన్యాన్ని ఇస్తుంది.తొమ్మిది రకాల ప్రాణధార అమైనో ఆమ్లాలు మునగలో కొలువై ఉన్నాయి. ఇది ఒక పరిపూర్ణ ప్రోటీన్ల కల్పవృక్షమని తెలిపారు. ఆరోగ్య సౌరభం.. జీవన రాగం ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు.. రోగకారక క్రి ములకు సింహస్వప్నంలా నిలుస్తుంది.రక్తంలో చ క్కెరకు అడ్డుకట్ట వేసి.. మధుమేహ బాధితులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ కల్మషాలను కడిగివేసి, గుండె వేగానికి భరోసా ఇస్తుంది. కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు ఇది గెలాక్టాగోగ్గా మారి, పసిబిడ్డలకు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ రేచీకటిని తరిమికొట్టి, కంటి చూపును శరత్కాల చంద్రికలా ప్రకాశింపజేస్తుంది. విలువ ఆధారిత ఉత్పత్తులు.. మునగను కేవలం పంటగా చూడకుండా, ఒక లాభసాటి వ్యాపారంగా మలిచే అద్భుత అవకాశం ఉంది. మునగ ఆకుల పొడి, సుగంధ భరితమైన టీ, చిన్నారుల కోసం న్యూట్రిమిక్స్ రుచికరమైన బిస్కెట్లు, లడ్డూలు.. ఇలా మునగతో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ఒక ఆదాయ వనరులాంటిది. గ్రామీణ మహిళా సంఘాలు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపడితే వారి ఆర్థిక స్వాలంబనకు ఆకాశమే హద్దని తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మిడ్జిల్: అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని ప ట్టుకున్న ఘటన ఆదివారం మండలంలోని మసిగొండ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహ్మద్ సుల్తాన్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు పో లీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి సుల్తాన్ నివాసంలో సోదా లు నిర్వహించారు. 52 క్వింటాళ్ల రేషన్ బి య్యం బొలెరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు.వాహనంలో 104 బస్తాలు ఉన్న ట్లు తేలింది. రెవెన్యూ అధికారులకు సమాచా రం ఇవ్వగా, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి ఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ధాన్యం రాశులతో కళకళ దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డు ధాన్యం రాశులతో కళకళలాడింది. సోమవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకానికి తెచ్చారు. కోయిల్సాగర్ ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలు, బోరుబావుల కింద యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతో రైతులు దిగుబడులను నేరుగా మార్కెట్కు అమ్మకానికి తెస్తున్నారు. సోమవారం మార్కెట్కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,150 మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,799, కనిష్టంగా రూ.1,736 చొప్పున పలికాయి. ఇసుక ట్రాక్టర్ పట్టివేత పాన్గల్: అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. మండలంలోని మాధరావుపల్లి గ్రామం నుంచి పాన్గల్కు ఏలాంటి అనుమతులు లేకుండా శివ తన ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్ను స్టేషన్కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘ టన మండలంలోని కుమ్మెరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. కుమ్మెర గ్రామానికి చెందిన సురేందర్బాబు (39) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడు గ్రామ సమీపంలోని పల్లె చంద్రశేఖర్ వ్యవసాయ పొలం వద్ద బోరు మో టారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసి ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాల్వలో పడి వృద్ధుడు మృతి ● నారాయణపేట జిల్లావాసిగా గుర్తింపు నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. కందులవారిగూడెం గ్రామ సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువస్తుండగా.. స్థానిక వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. మృతదేహాన్ని ఫొటో తీసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయగా.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన నామల్ల రాయప్ప(70)గా గుర్తించారు. రాయప్ప సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తన కుమారుడు నామల్లి వెంకటేష్ను కలిసేందుకు ఈ నెల 10న వచ్చాడని, ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాయప్ప కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
ఉల్లి రైతు విలవిల
● మార్కెట్లో లభించని మద్దతు ధర ● ఊరూరా తిరుగుతూ విక్రయాలు ● పెట్టుబడి సైతం చేతికందని పరిస్థితి మరికల్: రోజురోజుకు తగ్గుతున్న ధరలతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల కిందట క్వింటా రూ.2 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.700 నుంచి రూ.1,200 మధ్య పలుకుతోంది. కనీసం పెట్టుబడి సైతం లభించని దుస్థితిలో కొందరు రైతులు నేరుగా గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. కర్ణాటకలో ధరలు పూర్తిగా తగ్గడంతో అక్కడి రైతులు కూడా పంటను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుండటంతో ధరలు పడిపోవడానికి కారణమైంది. దీంతో మార్కెట్లో మద్దతు ధర లేక ఉల్లి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరలు పెరుగుతాయన్న ఆలోచనతో కొందరు రైతులు పొల్లాల్లో చెట్ల నీడన భద్రపరుస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఉల్లి కొనుగోలు చేసే మార్కెట్యార్డు లేక అత్యధిక శాతం రైతులు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్యార్డునే నమ్ముకున్నారు. ప్రతి బుధవారం సంతకు రైతులు పెద్దఎత్తున ఉల్లి తరలిస్తుంటారు. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిల్కొండ, నారాయణపేట జిల్లా మరికల్, ధన్వాడ, మక్తల్ మండలాలతో పాటు కర్ణాటక నుంచి కూడా అత్యధికంగా ఉల్లిని ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. గత బుధవారం 384 క్వింటాళ్ల ఉల్లి రాగా కనిష్టంగా రూ.700, గరిష్టంగా రూ.1,200 ధర లభించింది. -
రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలి
గట్టు: భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు ప్రాంత వాసుల వాహనదారులకు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, మల్లాపురం గ్రామాల ప్రజలు కోరారు. ఆయా గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 57వ రోజుకు చేరుకుంది. మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల ప్రజలు వారికి మద్దతు తెలిపారు. రాయాపురం స్టేజీ దగ్గర ఉన్న డబుల్ రోడ్డును మూసి వేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తులో వంతెనను నిర్మించడం వలన భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు స్పందించి గట్టు మండలానికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడంతో పాటుగా రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు, ఆప్కో మాజీ డైరెక్టర్ దోమ వీరన్న, మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, గోవిందు, ఆంజనేయులు, కృష్ణయ్య, సాలే కర్రెప్ప,సుధాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తోకల మహేశ్వరి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేది. అయితే సోమవారం ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లింది. ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విహారయాత్రలో విషాదం
● గోవాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం ● చెట్టును ఢీ కొట్టిన కారు ● ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు గద్వాల క్రైం: నలుగురు స్నేహితులు కలసి గోవా పర్యటనకు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన ఇంతియాజ్ (24), ముజమ్మిల్ మరో ఇద్దరు హైదరాబాద్కు చెందిన హజీ, ఇర్ఫాన్ నలుగురు స్నేహితులు కలసి ఈ నెల 9న కారులో గోవాకు వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున వీరాపురం శివారులో డ్రైవింగ్ చేస్తున్న ఇర్ఫాన్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపుతప్పింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న భారీ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షత్రగాతులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతియాజ్ చికిత్స పొందుతూ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్, ముజమ్మిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ముర్తజావలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతివేగమే కారణం.. గోవా నుంచి కారులో బయలుదేరిన స్నేహితులు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో అతివేగంగా కారును డ్రైవ్ చేసినట్లు సమాచారం. మరోవైపు సరైన నిద్రలేకపోవడం గంటల తరబడి రోడ్డు ప్రయాణంతో అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్నేహితులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఎకరా పొలంలో రూ.70 వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్కు తీసుకెళ్తే క్వింటా రూ.800 అడిగారు. తిరిగి తీసుకొచ్చి ఊరూరా తిరిగి విక్రయిస్తున్నా. క్వింటాకు రూ,1,200 వరకు ధర వస్తోంది. ఇలా చేస్తే కనీసం పెట్టుబడినైనా చేతికందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – రాజు, ఉల్లి రైతు, మాధవరం రూ.50 వేల నష్టం.. వాతావరణ మార్పులు ఉల్లి సాగుపై ప్రభావం చూపింది. పంట చేతికొచ్చే సమయంలో కూడా గడ్డ సైజు పెరగలేదు. దీంతో అర ఎకరంలో ఉల్లి సాగుచేస్తే కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – వెంకటయ్య, ఉల్లి రైతు, మరికల్ ● -
పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
మహబూబ్నగర్ కలెక్టరేట్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల బాధితులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ఖష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 900మందికి 60– 75చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఇంటి స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను నమ్మించి మోసం చేసి అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా పేదలను మోసం చేశారని ఆరోపించారు. పట్టాలు తీసుకున్న 900మంది నిరుపేదలు రోడ్డు మీదకు వస్తే దానికి ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి, టీఎఫ్టీయూ జిల్లా నాయకులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూమ్ బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనిఫాబేగం, లాల్బీ, మహమ్మద్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ యాజమాన్యం మొండివైఖరి వీడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం 6 రోజులుగా పోరాటం చేస్తున్నా విద్యుత్ యాజమాన్యం మొండివైఖరి వీడటం లేదని ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కీ అన్నారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీస్రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ కంటే ముందు నుంచి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్గా గుర్తించాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని, విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా యాజమాన్యం దిగివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలని లేనిచో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సైదులు, మోయిస్, గోపాల్, తిరుమలేష్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజలు రోడ్డు భ ద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి శనివారం వరకు నిర్వహించనున్న ‘అరైవ్– ఆలైవ్’ రోడ్డు భద్రత అవగాహన వాల్పోస్టర్లును ఆమె తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు రోడ్డు భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా మెలగాలని, రోడ్డుపై ప్రయా ణించేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అన్నారు. ముఖ్యంగా యువత మద్యం తాగి నడపడం, అధిక వేగంతో వెళ్లడం చేయరాదని, వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొనే విధంగా జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖాధికారి రఘుకుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సంధ్య, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనగణనకు పక్కాగా ఏర్పాట్లు జనగణనకు అన్నిరకాల ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జనగణనకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎన్యూమరేషన్ సూపర్వైజర్ల నియామకం, హౌస్ లిస్టింగ్ బ్లాక్ల ఏర్పాటు పనులను రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి చార్జి అధికారులు హౌస్ లిస్టింగ్ బ్లాక్లను త్వరితగతిన రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, కలెక్టర్ హరిప్రియ, జిల్లా ప్రణాళిక అధికారి రవీందర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 506 రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రి య కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,78,386 కార్డులకు గాను సోమవారం వరకు 1,71,328 కార్డుదారులు (61 శా తం) బియ్యం తీసుకొన్నారని చె ప్పారు. బియ్యం పంపిణీని ఈ నెల 30 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని, కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోలీస్ సేవలను వినియోగించుకోండి
మహబూబ్నగర్ క్రైం: ప్రజలు మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో దరఖాస్తును స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ముగిసిన ‘పది’ పరీక్షలు ● చివరిరోజు 13,301 మంది విద్యార్థుల హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. చివరిరోజు సోమవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్ష 60 కేంద్రాల్లో కొనసాగగా.. 13,301 మంది హాజరవగా.. 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సుమారు నెలరోజులపాటు కొనసాగిన పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు సంతోషంగా ఇంటిబాట పట్టారు. -
కనీస వేతనాలు చెల్లించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా ఆదివారం ఐదో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్గా గుర్తించాలన్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం దిగి రావాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ పెండయ్య, తిరులమలేష్, సైదులు, మోయిజ్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
బాలికలదే హవా
మహబూబ్నగర్● గతేడాదితో పోలిస్తే మెరుగుపడని జిల్లా ఫలితాలు ● ‘ద్వితీయం’లో ఉత్తీర్ణత పెరిగినా.. ‘ప్రథమం’లో తగ్గింది ● రాష్ట్రస్థాయిలో ఫస్టియర్లో 16, సెకండియర్లో 17వ స్థానం ● రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులకు 20 వరకు అవకాశం ఈకో టూరిజం అభివృద్ధి.. కేంద్ర పర్యాటక, రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమలలో ఈకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీసీఏ తెలిపింది. సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uమహబూబ్నర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్లో ఉత్తీర్ణత శాతం 0.60శాతం తగ్గగా.. సెకండియర్లో 3.06శాతం పెరిగింది. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎప్పటిలాగే పాలమూరు జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రస్థాయిలో గతేడాది ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 10 స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానం, సెకండియర్ జనరల్ కోర్సుల్లో గతేడాది 12వ స్థానంలో నిలవగా ఈ సారి 17వ స్థానం దక్కింది. గత నెల జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేసింది. ఈమేరకు ఫలతితాలను పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మోబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద మార్కెలను లిస్టును డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే గత సంవత్సంతో పోల్చితే జనరల్ కోర్సుల్లో రెండు సంవత్సరాల్లో కూడా పెద్దగా ఉత్తీర్ణత శాతంలో మెరుగుదల కనిపించకపోవడం విశేషం. గతేడాది మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 62.78శాతంగా ఉంటే ఈ ఏడాది 62,18 శాతంగా నమోదైంది. సెకండియర్లో గతేడాది 69.59శాతం ఉత్తీర్ణత ఉండగా.. ఈ సారి 72.65శాతంతో కాస్త మెరుగుదల కనిపించింది. కాగా.. ఒకేషనల్ కోర్సుల్లోనూ బాలికలదే అత్యధిక ఉత్తీర్ణత సాధించండం విశేషం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో ప్రై వేటు కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధించారు. సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. – కౌసర్ జహాన్, డీఐఈఓ పరీక్షల ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తులను విద్యార్థులు ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్కు ఒక్కో పేపర్ రూ.100 చొప్పున చెల్లించాలని, రీ వెరిఫికేషన్కు రూ.800లను చెల్లించాలని అధికారులు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ : వ్యక్తి మృతి
అమరచింత/నర్వ: మండలంలోని బెక్కర్పల్లి సమీపంలో ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అమరచింత మండలం పామిరెడ్డిపల్లికి చెందిన పూలవ్యాపారి వెంకట్రెడ్డి (42) అమరచింత నుంచి పెద్దకడ్మూర్ వైపు బైక్పై వెళ్తుండగా.. మక్తల్ మండలం సత్యవార్ నుంచి ఇటుక లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకట్రెడ్డిని స్థానికులు ఆత్మకూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి బార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
బీచుపల్లి క్షేత్రంలో అసెంబ్లీ స్పీకర్
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇటీవల ఆయన మేనకోడలు సునీత అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె అస్థికలకు పుష్కరఘాట్ పురోహితుడు అనిల్శర్మ ఆధ్వర్యంలో అపరకర్మ పూజలు నిర్వహించారు. అనంత రం కుటుంబ సభ్యులతో కలిసి అస్థికలను శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ స్థానిక నాయకులతో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. వారి వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, రుక్మాందర్రెడ్డి ఉన్నారు. హజ్యాత్రికులకు డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్ స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని మెట్రో ప్యాలెస్ కన్వెన్షన్లో ఆదివారం ఈ ఏడాది హజ్యాత్రకు వెళ్తున్న యాత్రికులకు ప్రత్యేక డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన చీఫ్ ట్రైనర్ ఎండీ మోనిస్ఖాన్ యాత్రీకులకు డిజిటల్ హజ్ ట్రైనింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా హజ్యాత్ర విశేషాల గురించి వివరించారు. అనంతరం జిల్లా హజ్ సొసైటీ ప్రతినిధులు హజ్యాత్రీకులకు హెల్త్బుక్లెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహెమూద్అలీ, ఎండీ.మెరాజుద్దీన్, రవూఫ్పాషా, సత్తార్, మహ్మద్ యూసుఫ్, ఖాజా నిజాముద్దీన్, సయ్యద్ నిజాముద్దీన్, ఫైజొద్దీన్, అయూబ్పాషా, ఎండి.రఫీక్, కలీం, ఇసాక్, రఫీక్ ఉర్ రహెమాన్, అర్షద్అ లీ, ఎండీ.సిరాజ్, మూసా తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘హ్యాపీ సండే’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరునుంచి తొమ్మిది గంటల వరకు జిల్లా ప్రధాన స్టేడియం కమాన్ వద్ద నిర్వహించిన ‘హ్యాపీ సండే’ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా వీరి మ్యాజిక్ షో, మిమిక్రీ, కరాటే, యోగాసనాలు, సంప్రదాయ నృత్యాలను ఆహూతులు ఉత్సాహంగా తిలకించారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వారు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్రదర్శించారు. -
ఇంటర్ ఫలితాల్లో ‘వాగ్దేవి’ సత్తా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవీ జూనియర్ కళాశాల విద్యార్థు లు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు కళాశల విద్యార్థులు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భరత్కృష్ణ 468, సంజన 467, మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీలో సిద్రఫాతిమా 438, కాన్స తబస్సుమ్ 437 మార్కులు సాధించారు. రెండో సంవత్సరం ఎంపీసీలో ఆస్పియా తబస్సుమ్ 994, వైశాలి 993, అమీనా మరియమ్ 991, కౌశిక్ 991 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు సహకరించిన అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ మెథడ్ ద్వారా నాణ్యమైన బోధన అందించడంతో విద్యార్థులు మంచి విజయాన్ని సాధించారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో మరిన్ని మార్కులు సాధించాలని సూచించారు. ‘రిషి’ విద్యార్థుల ప్రభంజనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని రిషి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో వినయ్కుమార్గౌడ్ 468, వేణుమాధవ్రెడ్డి, అంకిత్రెడ్డి, మాధురి కార్తీక్ రెడ్డి, సృజన 467 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో అక్షిత, తానియా మహమూద్ 438 మార్కులు, శ్రావణి, భవిత్, సౌమ్య, సురేంద్రచక్రవర్తి, అక్షిత, ఆయేషాజు వా, అఖిల, అశ్లేషయాదవ్, మౌనిక, రిషిత, నాగసాయివైష్ణవి, మైవిన్, మీనాక్షి సహ 14మంది 437 మార్కులు సాధించారు. రెండో సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎంపీసీ విభాగంలో భావన 995, మహ్మద్ అశ్వక్అహ్మద్, సయ్యద్ బిస్బ ఉద్దీన్, శ్రీవిద్యకు 992 మార్కులు, కోటేశ్వర్ 990మార్కులు సాధించారు. బైపీసీ విభా గం రెండో సంవత్సరంలో అమూల్య, అఫ్సామొయిన్, గాయిత్రి 994 మార్కులు సాధించారు. ఫారియా, ఫాతిమా ఖదీర్, 993, నందినిరెడ్డి, వైశాలి 992, శ్రీనిధి 991, సృజన 990, సుమేరాబేగం 990 మార్కులు సాధించారు. ఈ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల చైర్పర్సన్ చంద్రకళావెంకట్, వెంకటయ్య, డీన్ భూపాల్రెడ్డి, కల్యాణ్బాబు, ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావు, వెంకటరత్నం, ప్రసన్నకుమారి పాల్గొన్నారు. మరోసారి ‘ప్రతిభ’ విజయఢంకా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ మేరకు మొదటి సంవత్సరం ఎంపీసీలో రిషిక, రిషిత, చందన, ప్రసన్నతార, నందకిషోర్, అపూర్వరాజ్, జశ్వంత్, రిత్విక్కుమార్, హృషికేష్ 468 మార్కులు, షరద్యుతి 467, సాయినాథ్ 467, అభినయ 467 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో మానస 438, నవ్య 437, రుమన ఫిర్దోస్ 437, హానీయా కుర్రతులైన్ 437, ఇక్రరహ్మత్ 437, సాహితి 436, వీణ 436, షఫీన్ ఫాతిమా 435, ఎంపీసీ రెండో సంవత్సరంలో వైష్ణవి 994, వై.వైష్ణవి 993, హర్షిత 993, రాఘవి 993, శ్రీవల్లి 992, త్రిష 991, సాయిశ్రీరెడ్డి 991, శివానీ 991, నేహారెడ్డి 991, జవేరియాకుర్రతులైమ్ 990, శ్రీనితిన్ 990, అమూల్య 990, సిద్దార్థ 990, సాయిచరిత 990, నిఖిల్చారి 990, రాజేశ్వరీ 990, బైపీసీ రెండో సంవత్సరంలో కె.వైష్ణవి 992, సుప్రజ 991, మార్కులు సాధించారు. ఈ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఫెయిలైతే.. ఆత్మహత్య ఆలోచన వద్దు
ఉత్తీర్ణత కాకపోతే ఒత్తిడిలోకి వెళ్తున్న విద్యార్థులు ● మార్కులే ప్రామాణికం కాదు.. ● ఒడిదొడుకులను అధిగమిస్తేనే జీవితంలో గెలుపు ● ఎలాంటి చదువులోనైనా ఒత్తిడి సహజమేనంటున్న నిపుణులు ● ఇటీవల ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు నేడు మారుతున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులంతా కష్టనష్టాలను భరిస్తూ వారి పిల్లలను ఉన్నత చదువుల కోసం నగరానికి, పట్టణానికి పంపిస్తున్నారు. ఎన్నో ఆశలతో, ఉన్నత లక్ష్యాలతో ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న యువతలో కొంత మంది వారి తప్పుతున్నారు. చదువు నుంచి నైతిక విలువలు నేర్చుకోకపోవడం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులు చెడిపోవడానికి కారణమవుతున్నాయి. మరి కొంతమంది విద్యార్థులు తాత్కాలిక ఆనందాల కోసం స్నేహితుల మాయలో పడి దారితుప్పుతూ చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువమంది తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నా వారే కన్పిస్తున్నారు. మహబూబ్నగర్ క్రైం: ఇంటర్..లేదా పదో తరగతి ఇతర కోర్సుల్లో అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని టీనేజర్స్ ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ తనువుచాలిస్తున్నారు. చాలామంది విద్యార్థులు వ్యక్తిగతంగా లక్ష్యంగా పెట్టుకున్న మార్కులు రాలేదని.. ఆత్మహత్యలకు పాల్పడటం విశేషం. జిల్లాలో ఆదివారం ఇంటర్ ఫలితాలు రావడంతో భూత్పూర్ మండ లం అన్నసాగర్కు చెందిన శ్రావణి(17) ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఏటా జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. విషయం చిన్నదే అయినా చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కు లు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని..ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్ తిట్టారని.. ఫోన్ మాట్లాడుతుంటే ఇంట్లో అమ్మనాన్న మందలించారని ఇలా చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యంగా ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో చదువుతున్న వారితో కార్పోరేట్ సంస్థల్లో ఇంటర్ చదువుతున్న వారిలో 28నుంచి 30శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థి దశలో 13–20ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలను బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు మన జిల్లాలోను ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. నేను ఎంచుకున్న ల క్ష్యంలో ముందుకు వె ళ్లలేకపోతున్నాను.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ స భ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారని అంతకుముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటా రు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచనలు చేస్తుంటారు. చిన్నచిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటినుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరునెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం. ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. – డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్యనిపుణుడు ప్రతివ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి ఆకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నారు. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసు పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపొటముల సంగమం అన్ని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలుపు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి.మనపై ఆధారపడ్డవారి గురించి ఆలోచించాలి..మనం ఎదగడంలో ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని మన ఎదుగుదలకు వారి ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి. అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సదవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం..ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. విద్యార్థుల మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. నేడు ఏమి చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వారిలో రెగ్యులర్గా ఉండే కంటే భిన్నంగా కనిపిస్తారు. మాటతీరులో మార్పు, నిద్రపోరు, తినడం మానేస్తారు. ఇష్టమున్న పనులకు దూరంగా ఉంటారు. వీటిని గమనించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుంది. – వంగీపురం శ్రీనాథాచారి, ప్రముఖ మానిసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ● -
మదర్సాలోకి ఆకతాయిల చొరబాటు
– ఆందోళన చెందిన విద్యార్థినులు గద్వాల క్రైం: స్థానిక మదర్సాలోకి ముగ్గురు ఆకతాయిలు చొరబడి విద్యార్థినులను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన ఘటన ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ చోటు చేసుకుంది. స్థానికులు, విద్యార్థినుల కథనం మేరకు.. ఉర్ధూ మదర్సాలో వేర్వేరు వర్గాలకు చెందిన వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలపై కొన్ని రోజులుగా తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వాటికి సరైన లెక్కలు చూపడం లేదని ఘర్షణకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యంగా మదర్సాలోకి చొరబడి ఈ ట్రస్టుకు సంబంధించిన వ్యక్తులమని వారితో వివాదస్పదంగా మాట్లాడారు. అనుమతి లేకుండా లోపలికి రావడం భావ్యం కాదని విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేసిన క్రమంలో వారిని భయబ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న మహిళా బోధన సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ మూడో ఎస్ఐ జహాంగీర్ అక్కడకి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత ట్రస్టు నిర్వాహకులు లేదా పోలీసు, న్యాయ నిపుణుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలని, అకారణంగా మదర్సాలోకి చొరబడడంపై సరికాదన్నారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. మదర్సాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ట్రస్టు నిర్వాహకులు మోసాలకు పాల్పడినట్లు ఏవైన ఆధారాలు ఉంటే పోలీసులకు అందజేయాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
మన్ననూర్: కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఎకో టూరిజం మరింత అభివృద్ధి పర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఎ) సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని సంయుక్త పు నరావాస ఐదు గ్రామాల అధ్యక్షుడు (సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల, కొల్లం, వటువర్లపల్లి) సీఎ సాయిబాబు తె లిపారు. రెండువారాల కిందట తెలంగాణ ప్రాంతం నుంచి సాయిబాబు, సంతోష్ మధ్యప్రదేశ్లోని మన్న టైగర్, ఈకో టూరిజం ప్రాజెక్టుకు అటవీశాఖ తరఫున వెళ్లారు. ఆదివారం ఫోన్ ద్వారా మధ్యప్రదేశ్ నుంచి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీసీఎ బృందం సభ్యుల సమక్షంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధి సభ్యులతోపాటు తెలంగాణ తరఫు అమ్రాబాద్ టైగర్ రిజర్వు, ఈకో క్రాఫ్ట్ కన్జర్వేషన్ టూరిజం హబ్, టైగర్ సఫారీ తదితర అంశాలపై సాయిబాబు పవర్ ఫ్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు తరఫున ఇచ్చిన పవర్ ఫ్రజెంటేషన్ మొదటి స్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు. అమ్రాబాద్ ఈకో టూరిజం అభివృద్ధితో ప్రత్యేకించి చెంచు గిరిజనులకు ఉపాధి అవకాశాలు, స్థిరమైన ఆదాయ వనరులు, స్థానిక కళలు, సాంస్కృతిక ప్రోత్సాహం, ప్రకృతి సంరక్షణతో కూడిన అభివృద్ధి వంటివి ఈ ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయని ఎన్టీసీఏ సభ్యులు తెలియజేశారు. అటవీశాఖ తరఫున ఇలాంటి అవకాశం కల్పించిన డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, ఎఫ్డీఓలు, ఎఫ్ఆర్ఓలు, సంబంధిత అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
నైపుణ్యం పెంపొందించుకోవడానికే శిక్షణలు : ఎస్పీ జానకి
మహబూబ్నగర్ క్రైం: ఏఆర్ సిబ్బందికి మొబిలైజేషన్ శిక్షణ అనేది రిఫ్రెషర్ కోర్సు లాంటిందని, సిబ్బంది సైతం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఏఆర్ పోలీస్ సిబ్బందికి పరేడ్ మైదానంలో రెండు వారాల పాటు నిర్వహించే మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. మొదట శిక్షణ విధానాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పోలీస్ విధుల్లో వేగవంతమైన స్పందన అత్యంత కీలకం అని, ఈ తరహా శిక్షణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమయానికి స్పందించే సామర్థ్యం పెరుగుతుందన్నారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం క్రమశిక్షణ లాంటి లక్షణాలు పోలీస్ సిబ్బందికి అత్యవసరం అని తెలిపారు. ఆయుధాల వినియోగం, డ్రిల్, సమూహంగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వంటి అంశాలలో సిబ్బంది నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పోలీస్శాఖ ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్కుమార్ పాల్గొన్నారు. -
నేతువానిపల్లిలో లేగదూడపై చిరుత దాడి
గ్రామస్తులతో మాట్లాడుతున్న ఫారెస్టు అధికారులు లేగదూడపై దాడి చేస్తున్న చిరుత మల్దకల్: మండలంలోని నేతువానిపల్లి సమీపంలోని గుట్టల్లోని వ్యవసాయ పొలం వద్ద ఓ లేగదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కొంతకాలంగా గ్రామ సమీపంలోని గుట్టల్లో పాగా వేసిన చిరుత వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువులపై దాడి చేసి చంపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో దాడి చేసిన జంతువును గుర్తించేందుకు గురువారం రాత్రి ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మధ్యరాత్రి చిరుత సంచరించే ఘటనలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు లేగదూడపై దాడి చేసి చంపిన దృశ్యం నమోదైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెస్టు అధికారులు ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మూడు నెలలుగా పశువులపై దాడి చేసింది చిరుతేనని అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొంతకాలంగా పశువులపై దాడి చేస్తున్నది చిరుత కాదని, నక్క లేక హైనా అయి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. అయితే సీసీ కెమెరాలో చిరుత సంచారం రికార్డు కావడంతో వెంటనే దానిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే రైతులు తమ పశువులను వ్యవసాయ పొలాల వద్ద ఉంచరాదని, పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఫారెస్టు అధికారులు పర్వేజ్అహ్మద్, ప్రసూన, సిబ్బంది పాల్గొన్నారు. -
కురుమూర్తిలో మహా మండపానికి స్థల పరిశీలన
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయ మహా మండపం నిర్మాణానికి శుక్రవారం అధికారులు స్థల పరిశీలన చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజినీర్ శ్రీనివాస్ కురుమూర్తి స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మహా మండపానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే మహా మండపం నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈ రణ్వీత్, ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. రేషన్ బియ్యం పట్టివేత నారాయణపేట: జిల్లాకేంద్రంలోని యాద్గిర్ రోడ్డు బైరం కొండ గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్,నారాయణపేట పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడింది. టీఎస్ 06 యూడీ 0828 వాహనం నుండి 50 బియ్యం సంచులు, సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టగా ఆ బియ్యం, వాహన యజమాని దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన కొమ్మూర్ వెంకటేష్కు సంబంధించినదని తేలింది. ఆ వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి డీటీ కాలప్పకు సమాచారం ఇవ్వగా ఆయన పంచనామా చేశారు. బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్ తరలిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం భూత్పూర్: మండలంలోని ఎల్కిచర్ల వద్ద శుక్రవారం రాత్రి లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు బిజినేపల్లి మండలం వెలుగొండ కు చెందిన జహంగీర్ (40) భూత్పూర్ నుంచి వెలుగొండకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎల్కిచర్ల వద్ద లారీ ఢీకొట్టింది. జహంగీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
ఎర్రవల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిరాథోడ్ కథనం మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా జింకలపల్లి గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులు (35) ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వారు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దాసరి సంధ్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పరిశ్రమ వ్యర్థాల పారబోతపై ఆందోళన జడ్చర్ల: మండలంలోని కిష్టారం సమీప వాగులో గురువారం రాత్రి పరిశ్రమల ఘన వ్యర్థాల పారబోతపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలేపల్లి సెజ్లోని రసాయనిక పరిశ్రమల నుంచి వెలువడిన ఘన వ్యర్థాలను టిప్పర్లలో కిష్టారం సమీప వాగులోకి తరలించి అక్కడ నిప్పంటించి దహనం చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుజాత తదితరులు కలిసి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫార్మ పరిశ్రమ వ్యర్థాల పారబోతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి దహనం చేసిన వ్యర్థాలను పసిగట్టి వాటి ఆధారంగా సంబంధిత పరిశ్రమను గుర్తించి సెజ్లోని పరిశ్రమ వద్దకు వెళి ఆందోళన చేపట్టి హెచ్చరించారు. మరోసారి వ్యర్థాలను తమ గ్రామపరిధిలోని వాగులోకి తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని పరిశ్రమ అధికారులకు సూచించారు. అయితే తమ పరిశ్రమకు సంబంధించిన వ్యర్థాలు కావని పరిశ్రమ అధికారులు సర్పంచ్, గ్రామస్తులకు వివరించారు. తాము వ్యర్థాల తరలింపునకు సంబంధించి కాంట్రాక్టర్కు అప్పగిస్తామని సదరు కాంట్రాక్టర్ వ్యర్థాలను బయటకు తరలిస్తారని తమకు ఎలాంటి సంబంధం ఉండబోదన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని పరిశ్రమ అధికారులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మనిగింది. ఐదు హైమాస్ట్ లైట్లతోపాటు 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు ప్రాణాలు తీసిన విద్యుదాఘాతం నర్వ: పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యు దాఘాతంతో మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బెక్కర్పల్లి గ్రామానికి చెందిన బించన్ రాములు(45) గురువారం రాత్రి తన సొంత పొలంలో చెరుకు పంటకు నీరు పారించేందుకు వెళ్లారు. బోరు మోటార్ వేసేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఉదయం కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకొని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు మిడ్జిల్: మండలంలోని వెలుగొమ్ములకు చెందిన ఖాజాబీ(20) అనే యువతి ఈనెల 9న గురువారం ఉదయం ఫోన్ రిపేర్ చేయించుకుంటానని బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి జహంగీర్ బీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. యువతి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బరిగేల ఆంజనేయులు(28) ఈనెల 9 గురువారం నుంచి కల్పించడం లేదని అతని భార్య తేజస్విని శుక్రవారం సాయంత్రం మిడ్జిల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. భార్య ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భూసారం కాపాడుదాం.. దిగుబడి పెంచుకుందాం
మదనాపురం: మట్టి బాగుంటేనే.. మనిషి బాగుంటాడు. పొలంలో మట్టి కేవలం ధూళి కాదు, అది కో ట్లాది జీవులకు నిలయం. ఆ నేలతల్లిని మనం ఆరోగ్యంగా చూసుకుంటేనే, అది మనకు బంగారు పంటలను అందిస్తుందని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భవాని రైతులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భూమి సుపోషణ, సంరక్షణ జ న అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె నేల ఆరో గ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. భూసారం ఎందుకు క్షీణిస్తోంది? అడ్డగోలుగా రసాయన ఎరువులు వాడటం, పంట మార్పిడి లేకపోవడం వల్ల భూమి తన సారాన్ని కో ల్పోతుందని, మట్టిలో జీవం తగ్గితే దాని ప్రభావం దిగుబడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేల ఆరోగ్యాన్ని కాపాడే త్రాలు ● జనుము, పిల్లిపెసర వంటి పచ్చి ఎరువుల పంటలను పూత దశలో భూమిలో కలియదున్నాలి. గొర్రెల, మేకల మందలను పొలంలో కట్టడం వల్ల సహజంగా పోషకాలు అందుతాయి. ● వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు), పశువుల ఎరువును వాడటం వల్ల మట్టిలో తేమ నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది. ● ఒకే రకం పంట వేయకుండా క్రమంగా పంట మార్పిడి చేయాలి. చిక్కు డు జాతి పంటలను అంతర పంటగా వేస్తే గాలి లోని నత్రజని మట్టికి అందుతుంది. ● పంట కోత తర్వాత మిగిలిన చెత్తను తగలబెట్టకుండా, భూమిలోనే కుళ్లేలా చేయాలి. ● నేలపైన చెత్తాచెదారం పర్చడం వల్ల నీరు ఆవిరి కాకుండా ఉండటమే కాకుండా, మట్టి కోతను అరికట్టవచ్చు. ● పంటకు ఎరువులు వాడే ముందు మట్టి పరీక్ష చేయించి, అందులో లోపించిన సూక్ష్మ పోషకాలను మాత్రమే అందించాలి. లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. ● ఈ పద్ధతులు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, మట్టిలో సూక్ష్మజీవుల క్రియాశీలత పెరిగితే, భూమి గుల్లబారి వేర్లు లోతుకు వెళ్తాయన్నారు. దీనివల్ల పంటకు బలం చేకూరి, ఎరువుల ఖర్చు తగ్గి, నాణ్యమైన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త భవాని వివరించారు. -
ప్రత్యామ్నాయ పంటలతో అధిక మేలు
● నూనె గింజల ఉత్పత్తి పెంచాలి ● కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా.రాజేందర్రెడ్డి పాన్గల్: రైతులు నిరంతరం ఒకే పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా.రాజేందర్రెడ్డి, డా.భవాని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో యూత్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో ‘సమతుల్య ఎరువుల వినియోగం’ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నూనెగింజల ఉత్పత్తులు, పప్పు ధాన్యాల సాగు, పండ్ల తోటల పెంపకం, కూరగాయల పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకంతో నేలకు, మానవులకు కలిగే అనర్థాల గురించి వివరించారు. సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలన్నారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. యుద్ధ ప్రభావంతో యూరియా, డీఏపీ వంటి ఎరువుల తయారీకి ఇబ్బందులు, లభ్యత కూడా తగ్గుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సమతుల్య ఎరువుల వాడకం పెంచాలన్నారు. చౌడు నేలలలో జీప్సం, జీలుగ వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ఉద్యానవన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాగుతో కలిగే లాభాలను ఉద్యాన వన శాఖ అధికారి కృష్ణయ్య రైతులకు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, ఏడీఏ తిప్పేస్వామి, ఏఓ మణిచందర్, సర్పంచులు నాగలక్ష్మి, పార్వతమ్మ, యూత్ ఫర్ యాక్షన్ ప్రోగ్రాం కోఅర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్ సూర్యకళ, ప్రోగ్రాం అసోసియేట్ సిల్వి మృదుల, రైతులు పాల్గొన్నారు. -
నిషేధిత కల్లు స్వాధీనం
గద్వాల క్రైం: లైసెన్స్ లేకుండా గుట్టుగా కల్లు విక్రయిస్తున్న వ్యక్తిని గద్వాల ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి బృదం అదుపులోకి తీసుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని జమ్మిచేడుకు చెందిన లచ్చగౌడ్ కొన్నిరోజులుగా కల్లును గుట్టుగా విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించారు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని 20 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే కల్లు తయారీకి మత్తు పదార్థాలు కలిపి ఈత కల్లుగా నమ్మించి అమ్ముతున్నట్లు తెలుస్తుంది. నిందితుడు విక్రయిస్తున్న కల్లు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తగుపరి చర్యలు ఉంటాయన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న లచ్చగౌడ్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. తప్పిన ప్రమాదం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు నీలగిరి చెట్లు నేలకొరిగిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. గద్వాల పంచాయతీరాజ్ ఉపకార్యనిర్వాహక అభియంత కార్యాలయంలో రెండు నీలగిరి చెట్లున్నాయి. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రమాదంలో ఓ బైక్ ధ్వంసం కాగా.. నేలకొరిగినప్పుడు ప్రజలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. కార్యాలయ సిబ్బంది ఒకసారిగా భయాదోళనకు గురాయ్యరు. -
సంసద్ ఖేల్ మహోత్సవాన్ని పరిశీలించిన ఎంపీ
మహబూబ్నగర్ క్రీడలు:. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాన్ని శుక్రవారం ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. స్థానిక మెయిన్ స్టేడియంలో రెండోరోజు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా టాస్ వేసి క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులతో సరాదాగా క్రికెట్ ఆడారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, టీషర్టులను పంపిణీ చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో రెండో రోజు క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, పీఎంఎస్కేఎం మహబూబ్నగర్ కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాదేపల్లి యార్డులో నిలిచిన క్రయవిక్రయాలు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పంట దిగుబడుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆన్లైన్లో టెండర్ల ప్రక్రియకు సంబంధించి అంతరాయం కలగడంతో ధరల నిర్ణయం ఖరారు కాలేదు. ఆన్లైన్లో వ్యాపారులు టెండర్లు దాఖలు చేసిన తరువాత ధరలను కేటాయించే సమయంలో సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా ధరల ప్రకటనలో ఇబ్బందులు కలిగాయని మార్కెట్ యార్డు కార్యాలయం సిబ్బంది తెలిపారు. తరువాత మ్యానువల్గా టెండర్లు దాఖలు చేసేందుకు ప్రయత్నించినా వ్యాపారులు సహకరించకపోవడంతో చివరకు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్లో పంట ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం యథావిధిగా విక్రయాలు సాగుతాయని సిబ్బంది తెలిపారు. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కొత్త కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కోర్సుల్లో విద్యార్థులు చేరాలని ఎన్టీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్తు ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. కళాశాలకు బీఎస్సీ బ్యాంకింగ్ ఫైన్సాన్స్ సర్వీస్, బీఎస్సీ హెల్త్ కేర్ సైన్సెస్ వంటివి కోర్సులు వచ్చాయన్నాన్నారు. కళాశాలలో మొత్తం 1400 సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇక్కడ చదివే విద్యార్థులకు సివిల్స్ శిక్షణతో పాటు, ఉద్యోగాలు పొందేవిధంగా శిక్షణ ఇస్తామన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్నిరకాల వసతులతోపాటు, పూర్తి భద్రత కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్ తర్వాత ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదివించే విధంగా కృషి చేయాలన్నారు. -
జూన్ చివరి నాటికి వెయ్యి పడకల ఆస్పత్రి
పాలమూరు: వెయ్యి పడకల సూపర్స్పెషాలిటీ టీచింగ్ ఆస్పత్రి ఈ–బ్లాక్ పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే జూన్ చివరి నాటికి నూతన ఆస్పత్రి ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణకు కేంద్ర బిందువుగా పాలమూరు వెయ్యి పడకల ఆస్పత్రిని రెఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు ఉన్న 21 విభాగాలకు అదనంగా మరో 14 విభాగాలు పెంపొందించి మొత్తం 35 రకాల సూపర్స్పెషాలిటీ సేవలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయూష్ హోమియోపతి, యునాని వైద్యశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వెయ్యి పడకల టీచింగ్ ఆస్పత్రిలో ప్రొఫెసర్ల నియామకాలు, ఆధునిక పరికరాలు, ఇతర సౌకర్యాలతో పాటు సర్జికల్ విభాగాలు అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. 2016లో ఏర్పాటు మెడికల్ కళాశాలలో 150 సీట్ల నుంచి ఇప్పుడు 200 ఎంబీబీఎస్ సీట్లకు పెంపొందడం గొప్ప విషయం అని, భవిష్యత్లో పీజీ సీట్లు మరిన్ని పెంచడానికి కృషి చేస్తామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అతి త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్, అత్యాధునిక మోడరన్ ఆపరేషన్ థియేటర్ల ఎంఓటీలు, రోబోటిక్ ద్వారా సర్జరీలు చేయడానికి కావాల్సిన పరికాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో 95 శాతం చికిత్సలు పాలమూరులో పూర్తి కావాలని ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ తరహాలో పాలమూరులో వైద్యసేవలు బలోపేతం చేసి రాబోయే తరాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతామన్నారు. మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్ రిట్రీవల్ సెంటర్, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ ఏర్పాటు చేయడాకి కృషి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలలో ఆడిటోరియం, బాలురు, బాలికల ప్రత్యేక హాస్టల్స్ భవనాలు, పీజీలకు ప్రత్యే వసతి గృహాలు, ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్, బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణాలు చేపడుతామన్నారు. పాలమూరులో థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్ అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చేపడతామని, ఇప్పటికే 172 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్చోంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ నరేంద్రకుమార్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ రవీందర్, అదనపు కలెక్టర్ హరిప్రియ, మేయర్ మమత, డిప్యూటీ సురేందర్రెడ్డి, కార్పొరేటర్ సల్మాన్ షరీఫ్ పాల్గొన్నారు. 35 విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు తీసుకొస్తాం దక్షిణ తెలంగాణలో పాలమూరును రెఫరల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం ఎంఆర్ఐ, పీజీ సీట్ల పెంపు, హాస్టల్స్ భవనాల నిర్మాణాలు త్వరలో పూర్తి థర్డ్ లెవెల్ ట్రామాకేర్తో పాటు ప్రతి 25 కి.మీ.కు డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తాం ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ -
‘కుంకుమపువ్వు సాగు’పై ప్రయోగశాల ప్రారంభం
కొత్తకోట రూరల్: ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆవిష్కరణల అనువర్తనాలతో భవిష్యత్లో వ్యవసాయ, ఉద్యాన అనుబంధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుందని తెలంగాణ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలంలోని మోజర్ల సమీపంలో గల శ్రీకొండాలక్ష్మణ్బాపూజీ ఉద్యాన కళాశాలలో కుంకుమపువ్వు సాగుపై ఆధునిక పద్ధతుల్లో సమగ్ర పరిశోధనలు చేపట్టేందుకు రూ.32 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏరోపోనిక్ కుంకుమ పువ్వు ప్రయోగశాలను శుక్రవారం సీజీఎం బి.ఉదయభాస్కర్ ప్రారంభించారు. ఏరోపోనిక్ పద్ధతిలో కృత్రిమ నియంత్రిత వాతావరణంలో కుంకుమపువ్వు సాగు రాష్ట్రంలో ఇప్పటికే ఫలితాలు ఇచ్చిందని, దీంతో భవిష్యత్లో పురుగు, తెగులు మందుల అవశేషాలు లేని అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వు పొందొచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారని, అందులో ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, సెన్సార్ ఆధారిత సాగు, ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు సాగు వంటి ఆవిష్కరణలు అంకుర పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తాయన్నారు. ఆధునిక సాంకేతిక అంశాలపై పరిశోధన చేపట్టి రైతులకు ఎప్పటికప్పుడు అందజేస్తామని తెలంగా ణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ డి.రాజిరెడ్డి అన్నారు. రైతులు శాసీ్త్రయ టెక్నాలజీ ఆధారిత సాగులో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుంకుమపువ్వు ప్రాజెక్టు పరిశోధకులు ప్రొఫెసర్ డాక్టర్ పిడిగెం సైదయ్య, వర్సిటీ డీన్ డాక్టర్ జె.చీనా, ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ వీణజోషి, డాక్టర్ షహనాజ్, నాబార్డ్ అధికారులు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల వినియోగానికి పచ్చజెండా
జడ్చర్ల పురపాలికకు రూ.15కోట్ల నగర అభివృద్ధి నిధులు ● మొదటి విడుతగా రూ.12కోట్లు, తాజాగా రూ.3కోట్లు విడుదల ● పాతబజార్కు సింహభాగం నిధుల కేటాయింపు ●జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభు త్వం కేటాయించే న గర అభివృద్ధి నిధు ల వినియోగానికి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. నగర అభివృద్ధి కింద మున్సిపాలిటీకి కొన్నాళ్ల క్రితం రూ.15కోట్లు కేటాయించారు. ఇందులో మొదటి విడతగా రూ.1 2కోట్ల పనులకు టెండరు ప్రక్రియ ప్రారంభం కా గా.. సాంకేతిక కారణాలతో వాటిని నిలిపి వేశారు. తాజాగా మరో రూ.3కోట్లు విడుదలయ్యాయి. మొత్తానికి రూ.15 కోట్ల పనులకున్న ఆటంకాలు తొలగిపోవడంతో టెండరు ప్రక్రియ ప్రారంభిస్తున్నా రు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధు లు వరదలా వస్తు న్నాయి. తా జాగా నగర అభివృద్ధి నిధులు రూ.15కోట్లు కేటాయించబడ్డాయి. వాటిలో రూ.12 కోట్లు విడుదల కాగా.. ఆ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సాంకేతిక కారణాలతో ఆ నిధుల వినియోగానికి వీలు లేకుండాపోయింది. ఇటీవల ఆ సమస్యలు వీడటంతో టెండరు ప్రక్రియ ప్రారంభించనున్నారు. -
బిడ్డర్ల కుమ్మక్కు!
● పోటీ లేకుండానే ముగిసిన గొర్రెల వేలం ● రూ.40లక్షల నుంచి రూ.16 లక్షలకు పడిపోయిన వైనం దేవరకద్ర రూరల్: దేవరకద్ర మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన గొర్రెలు–మేకల వేలం అనుమానాస్పదంగా ముగిసింది. గత సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా తీసుకొని అధికారులు ఈసారి ప్రభుత్వ ధరను రూ.16,90,000గా నిర్ణయించారు. అయితే వేలంలో కటికే రామోజీ రూ.16,97,000కే దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పునర్వేలంలో తగ్గిన పోటీ గతనెల 23న నిర్వహించిన వేలంలో రూ. 40,01,000కు బిడ్ చేశారు. రెండో పోటీదారుడు కూడా రూ.40 లక్షల వరకు బిడ్ చేసినప్పటికీ, నిర్వహణకు ముందుకు రాకపోవడంతో అధికారులు మొదటి బిడ్డర్ డీడీని జప్తు చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునర్వేలాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పునర్వేలంలో కూడా ధరలు దాదాపు అదేస్థాయిలో ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే వాస్తవానికి అప్సెట్ ప్రైస్ను కేవలం రూ.7వేలు మాత్రమే అధిగమించడం అనుమానాలకు తావిస్తోంది. రూ.2,50,000తో 25మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నప్పటికీ పోటీ లేకపోవడం రింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీకి రాకుండా ఒక్కో డీడీకి రూ.35 వేల వరకు చెల్లింపులకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారుల విచారణకు దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. -
క్రీడా శిబిరాలకు సన్నద్ధం
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు క్రీడా నైపుణ్యాన్ని చాటేందుకు వేదికగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాకారుల కోసం నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందజేస్తారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది డీవైఎస్ఓ ఆధ్వర్యంలో అర్బన్ కింద దాదాపు 15 దాదాపు శిబిరాలు నిర్వహిస్తారు. 24వ తేదీ వరకు అవకాశం ఈఏడాది జిల్లాలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వివిధ క్రీడాంశాల్లో మే 1వ తేదీ 30 వరకు (నెల రోజుల పాటు) ఔత్సాహిక క్రీడాకారులకు క్రీడా శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు జిల్లాలో క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జాతీయస్థాయి సీనియర్ క్రీడాకారులు లేదా వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ, పీఈటీ) వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తుతో పాటు క్రీడల్లో తాము సాధించిన ధ్రువపత్రాలను జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలోని యువజన, క్రీడా కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి. మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలి. జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలోసమ్మర్ క్యాంప్లు మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ దరఖాస్తులను ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ -
ఏడు ఎకరాలు సాగుచేశా..
యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి. – మైను, రైతు, నందిమళ్ల ఐదు తడులు అవసరం.. జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) ఇబ్బంది లేదు.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ సీఎం దృష్టికి తీసుకెళ్తా.. జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ● -
పాతబజార్ అభివృద్ధి
పాతబజార్ అనగానే అందరికి చిన్నచూపే. అయి తే కొత్తబజార్తో సమానంగా అభివృద్ధి చేయా లనే లక్ష్యంగా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నగర అభివృద్ధి నిధులు రూ.6.50కోట్లు మా పాతబజార్కు కేటాయించారు. ఏవో కారణాలతో టెండరు ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రారంభిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆ నిధులతో మాప్రాంతం సుందరంగా మారుతుందని ఆశిస్తున్నాం. మా 6వ వార్డులోనే రూ.కోటి 50లక్షలతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నాం. – సుంకసారి రమేష్, 6వ వార్డు కౌన్సిలర్, పాతబజార్. నగర అభివృద్ధి నిధులు రూ.2కోట్ల ద్వారా మా 7వ వార్డులో సమస్యలు చాలామటుకు తీరనున్నాయి. పాతబజార్ నుంచి బూరెడ్డిపల్లికి వచ్చే ప్రధాన రోడ్డుపై మురికినీరు పారుతోంది. అలారాకుండా ఉండేందుకు కాల్వ నిర్మిస్తున్నాం. అలాగే పాతబజార్ శివాల యం వద్ద కాల్వ, బూరెడ్డిపల్లి నుంచి జాతీయ రహదారిపైకి నీరు రాకుండా మరో కాల్వ ఇలా మొత్తం రూ.2కోట్ల నిధులతో పనులు ప్రతిపాదించాం. వీటితోపాటు ముడా నిధులు రూ.40లక్షలతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం. – గుండు ఉమాదేవి, 7వార్డు కౌన్సిలర్, బూరెడ్డిపల్లి. -
అడుగంటిన జూరాల
తాగునీటికి ఎలా.. గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధా న కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తు తం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తా గునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. మార్చి చివరి నుంచే.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రా జెక్టుల పరిధిలో సుమారు 7లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఆందోళనలో అన్నదాతలు.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకుపైనే సాగు ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించాలి వేసవిలో తాగునీటి అవసరాలకుఅర టీఎంసీ అవసరం మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి -
‘ప్రజాపాలన’లో విప్లవాత్మక మార్పులు
● రాష్ట్ర వ్యవసాయ, రైతుసంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అమ్రాబాద్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం అమ్రాబాద్లో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్తోపాటు సభ్యులు కేవీఎన్ రెడ్డి, మర్రి భవానీరెడ్డి, రాములునాయక్, భూమి సునీల్, కలెక్టర్ బదావత్ సంతోష్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి సమస్యలపై రైతులు వివరించిన తీరును పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. ఏసీ గదుల్లో ఉండి చట్టాలు అమలు చేస్తే పూర్తి న్యాయం జరగదని.. ఏజెన్సీ ప్రాంత రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి కమిషన్ సభ్యులతో వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఆదరబాదరాగా దివాల తీసిన అమెరికాకు చెందిన తెరాస్ కంపెనీతో ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని.. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూమి హక్కు పత్రాలు ఉండాలని, ప్రతి రైతు పథకాలకు అర్హులు కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కమిషన్ ద్వారా భూభారతి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఇక్కడ విన్న ప్రతి భూసమస్య, గిరిజనుల భూసమస్యల పరిష్కారానికి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ఉండేవిధంగా కృషిచేస్తూనే చట్టాలలో సంస్కరణలు చేసైనా సన్న, చిన్నకారు రైతులకు న్యాయం జరిగేవిధంగా కమిషన్ కృషిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం రైతుల నుంచి అందిన ప్రతి వినతిని పరిశీలించి సీఎంతో మాట్లాడి భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిస్కారానికి కృషి నల్లమల ముద్దుబిడ్డ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాల్లో అనేక భూసమస్యలు ఉండటంతో కమిషన్ను కోరిన వెంటనే నేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం సంతోషకరమన్నారు. పదర మండలం ఇప్పలపల్లిలో 200 ఎకరాలు, క్యాంపు రాయవరలంలో 600 ఎకరాల వరకు సాగు చేస్తున్న భూమి ఇటు రెవెన్యూ, అటు అటవీశాఖ పరిధిలో లేకుండా ఉన్నాయని జాయింట్ సర్వే నిర్వహించి సాగుచేస్తున్న రైతులకు న్యాయం చేయాలని కోరా రు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. కమిషన్ ముందుంచిన భూ సమస్యలను పరిశీలించి ప్రత్యేక డ్రైవర్ ద్వారానైనా పరిష్కరిస్తామన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, సర్పంచ్ కోటయ్య, వ్యవసాయ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు. -
నల్లచెరువు అభివృద్ధికే మొగ్గు
సీఐటీఐఐఎస్ 2.0 పథకం కింద జడ్చర్ల మున్సిపాలిటీలో పర్యాటక అభివృద్ధికి పై ఏజెన్సీలకు చెందిన ప్రతినిధి సునీల్ కొద్దిరోజుల క్రితం మున్సిపాలిటీలో పర్యటించారు. కావేరమ్మపేట నల్లచెరువు, పాతబజార్ ఊరచెరువు, నల్లకుంట, జడ్చర్ల క్రాస్రోడ్డు వద్ద ఫ్లైఓవర్ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే 44వ నంబరు జాతీయ రహదారికి పక్కనే ఉండటం ఇదివరకే మినీట్యాంక్ బండ్ అంటూ కొంత అభివృద్ధి జరగడంతో నల్లచెరువు వైపు పై ఏజెన్సీ మొగ్గు చూపుతుంది. రూ.10–20కోట్లతో చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా పర్యాటకంగా పట్టణ వాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు సేదతీరే ఆస్కారం ఉన్నట్లు అంచనా. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. మురుగు నీటిని శుద్ధి చేశాక ఆ నీటిని మున్సిపాలిటీలో ఇతర అవసరాలకు వినియోగించేలా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటు జడ్చర్ల క్రాస్రోడ్డు ప్లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం చిన్న దుకాణా సముదాయం నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలు ఏజెన్సీ నిర్వాహకులు తీసుకొచ్చారు. తద్వారా రోడ్డుపై వ్యాపారాలు నిర్వహించకుండా ఉండడంతోపాటు ట్రాఫిక్ సమస్య తీరే అవకాశాలున్నాయని వారి వర్క్షాప్లో వివరించినట్లు తెలిసింది. -
‘అసైన్డ్ భూమిని ఎవరికీ అప్పగించొద్దు’
గట్టు: చిన్నోనిపల్లి పునరావాస కేంద్రానికి ఆనుకుని ఉన్న ఎర్రగట్టు వద్ద 2 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించేందుకు వెళ్లిన అధికారులను గరువారం స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. చాగదోనకు చెందిన కటికె బాలాజీకి గతంలో సర్వే నంబర్ 521/5లో 5 ఎకరాల అసైన్డ్ పట్టాను ప్రభుత్వం మంజూరు చేసింది. బాలాజీకి సంబంధించిన పట్టా భూమిని గతంలో చాగదోన పాఠశాలకు విరాళంగా ఇవ్వగా.. వీరికి అసైన్డ్ పట్టా ఇచ్చారు. బాలాజీ వారసులు శివాజీ ఏడాది కాలంగా పట్టా భూమికి సర్వే చేసి హద్దులు చూపించాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం తహసీల్దార్ విజయ్కుమార్, సర్వేయర్ హరికృష్ణ, ఎస్ఐశేఖర్గౌడు చిన్నోనిపల్లె పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. సర్వే నంబర్ 521లోని బాలాజీకి చెందిన అసైన్డ్ పట్టాభూమి పునరావాస కేంద్రానికి సమీపంలోనే గుర్తించారు. కేవలం 2 ఎకరాలు గుర్తించి అప్పగిస్తే చాలని పట్టాదారులు పట్టుపట్టారు. అయితే సర్పంచు దేవేందర్, గ్రామస్తులంతా కలిసి అధికారులను అడ్డుకున్నారు. ఊరికి ఆనుకున్న ఉన్న భూమిని రైతుకు ఎలా అప్పగిస్తారని, భవిష్యత్ అవసరాలకు ఈ భూమి గ్రామస్తులకు ఎంతో ఉపయోగ పడుతుందని, సర్వే చేయడానికి వీలు లేదంటూ గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగి, సర్వేను అడ్డుకున్నారు. అధికారులు గ్రామస్తులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు శాంతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరికి ఆనుకొని ఉన్న భూమిని సాగు చేసుకునేందుకు రైతుకు అప్పగించే ముచ్చటే లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు చిన్నోనిపల్లె పునావాస కేంద్రం నుంచి వెనక్కి తిరిగి వచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తహసీల్దార్ విజయ్కుమార్ తెలిపారు. తాము కూడా కలెక్టర్ను కలిసి ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వొద్దని వినతిపత్రం ఇవ్వనున్నట్లు చిన్నోనిపల్లి గ్రామస్తులు తెలిపారు. సర్వే చేయడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న చిన్నోనిపల్లి గ్రామస్తులు -
బారులు
సిలిండర్ల కోసం వంట గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు బారులుదీరారు. సిలిండర్ కోసం బుక్ చేసినా డెలివరీ బాయ్ ఇంటి వద్దకు డెలివరీ చేయడానికి రోజులు పడుతుండడంతో ప్రజలే గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్యాస్ వినియోగదారులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడి సిలిండర్లను తీసుకెళ్లారు. – ధన్వాడ -
హిందూధర్మ పరిక్షణ అందరి బాధ్యత
● విశ్వామిత్ర తపోభూమి పీఠాధిపతి భక్తసురేష్ స్వామి జడ్చర్ల టౌన్: హిందూధర్మ పరిరక్షణ ప్రతి హిందూ బాధ్యతగా స్వీకరించాలని శంషాబాద్ విశ్వామిత్ర తపోభూమి పీఠాధిపతి భక్త సురేష్స్వామిజి సందేశమిచ్చారు. పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. హిందువులంతా ఐక్యంగా ఉండాలని, హిందూసంస్కృతి ఎంతో గొప్పదన్నారు. పాశ్ఛాత్య సంస్కృతిలో కొట్టుమిట్టాడుతున్న వారంతా తేరుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి తల్లిదండ్రి పిల్లలకు దేశ గొప్పతనాన్ని చాటి చెప్పాలని, దేశభక్తిని పెంపొందించేలా కృషి చేయాలన్నారు. మరోవక్త సంస్కార భారతి ప్రాంత సహకార్యదర్శి చక్రవర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 80వేలు, రాష్ట్రంలో 3వేలు, జడ్చర్ల నగరంలో 7సమ్మేళనాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. సమ్మేళనాల ద్వారా హిందువులను జాగృతపర్చటం, ధర్మ పరిరక్షణ జరుగుతుందన్నారు. సమ్మేళనంలో అక్షరహైస్కూల్ విద్యార్థులు చేసిన రామాయణం నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సమ్మే ళన నిర్వాహకులు చంద్రయ్య, జగ్పాల్రెడ్డి, తోటారెడ్డి, కరుణాకర్, అనంతప్ప, వార్డుకౌన్సిలర్లు ఉమా శంకర్గౌడ్, ప్రశాంత్రెడ్డి, నందకిశోర్గౌడ్తోపాటు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
కావేరమ్మపేట నల్లచెరువుకు పురోగతి!
‘సీటీ 2.0’ ద్వారా రూ.10కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు బ్యాంకు రుణ ఆధారితంగా.. ● నల్లచెరువు, మురుగునీటి శుద్ధిప్లాంట్, ఫ్లైఓవర్ వద్ద దుకాణాల నిర్మాణం ●జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీలో 44వ నెంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన కావేరమ్మపేట సబ్స్టేషన్కు ఆనుకుని ఉన్న నల్లచెరువుకు మహర్దశ పట్టనుంది. సీఐటీఐఐఎస్ (సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్) 2.0 పథకం కింద రూ.10–20కోట్లతో నల్లచెరువు అభివృద్ధికి నోచుకోనుంది. నల్లచెరువుతోపాటు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పెద్ద మురుగుకాల్వపై మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంట్, జడ్చర్ల క్రాస్రోడ్డు ఫ్లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం దుకాణా సముదాయం నిర్మాణం ప్రతిపాదలనున్నాయి. మున్సిపాలిటీల్లో పర్యాటకరంగ అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ హితమైన వసతుల కల్పన, నగరాల ఆధునీకరణ వంటివి సీఐటీఐఐఎస్ 2.0 లక్ష్యంగా ఉంది. భారత ప్రభుత్వ గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, యూరోపియన్ యూనియన్ సహకారంతో పథకం అమలవుతుంది. పథకంలో చేయాల్సిన అభివృద్ధి పనుల గూర్చి పైఏజెన్సీ ప్రతినిధి సునీల్ వారం క్రితం మున్సిపాలిటీలో పర్యటించారు. రెండురోజుల క్రితం(బుధవారం) హైదరాబాద్ మాసబ్ట్యాంక్ ఎన్ఐయూఎంలో నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో మున్సిపల్ కమిషనర్, టీపీఓ, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. సీఐటీఐఐఎస్ 2.0లో భాగంగా మున్సిపాలిటీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వే నిర్వహించాయి. అందులో భాగంగా ఒకరోజు వర్క్షాప్లోనూ పాల్గొని వచ్చాం. కావేరమ్మపేట నల్లచెరువు అభివృద్ధికి స్కీంలో రూ.10కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. చెరువులో బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. నల్లకుంట, ఊరచెరువును అభివృద్ధి చేయాలని కోరాం. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు, జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద చిరువ్యాపారుల కోసం దుకాణా సముదాయం నిర్మాణం వంటి వాటిపై చర్చ జరుగుతుంది. వీటిపై త్వరలోనే స్పష్టత రానుంది. – లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల పురపాలిక -
వేసవిలో ఉద్యాన పంటల సంరక్షణ
అలంపూర్: జిల్లాలో బోరు బావుల కింద చీని, మామిడి, జామ, సపోట, దానిమ్మ వంటి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. వేసవి వచ్చిందంటే ఆయా తోటలకు నీటి తడులను ఇచ్చేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పంటలను రక్షించుకోనే మార్గాలను అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు వివరించారు. నేల నుంచి తేమ ఆరిపోకుండా చూడటం.. నేల నుంచి తేమ ఆరిపోకుండా చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలను వివరించారు. అందులో ఒకటి సేంద్రియ ఎరువులు వాడటం, రెండోది వ్యర్థ పదార్థాలతో మల్చింగ్ విధానం. సేంద్రియ ఎరువులు వాడటం తేమను బాగా పట్టి ఉంచి ఆరిపోకుండా తగ్గించడమే కాకుండా సత్తువను అందించే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల పెంటు, గొర్రెల, మేకల ఎరువులు, వేప అముదం, కానుగ పిండి చెట్ల పాదులలో వేయాలి. వ్యర్థ పదార్థలతో మల్చింగ్ వేసవి ప్రారంభం నుంచే చెట్ల పాదుల్లో ఆకులు, వరిపోట్టు, వేరుశనగ, కాయ పొట్టు, గింజలు తీసిన మొక్కజొన్న కండలు, వాటిని పాదుల్లో మూడు అంగుళాల ఎత్తు వరకు వేయాలి. దీనిని సేంద్రియ మల్చింగ్ అంటారు. దీని వలన పాదుల్లోని తేమ త్వరగా ఆరిపోదు. కలుపు మొక్కల బెడద పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యర్థ పదార్థాలు కుళ్లి సేంద్రియ పదార్థాంగా మారి చెట్లకు సత్తువను ఇస్తాయి. 1.పైపుల ద్వారా నీరు పారించడం రైతులు నీటి వనరులైన బావులు, బోరు బావుల నుంచి చెట్ల వరకు పిల్ల కాలువలు తవ్వి నీరు పారించడం పరిపాటి. కాలువల ద్వారా నీరు పారింటప్పుడు ఎండకు, గాలికి నీరు ఆవిరి కావడం, భూమిలోకి నీరు ఇంకడం వలన నీటి నష్టం జరుగుతుంది. పిల్ల కాల్వలకు బదులుగా పీవీసీ లేదా హెచ్డీపీవీ పైపుల ద్వారా నీరు పంపితే నీటి వృథా తగ్గించవచ్చును. 2.నీటిని పొదుపు చేయడం వేసవిలో బావులు, బోరు బావుల నుంచి లభించే కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. దీని కోసం పెద్దగా ఉన్న చెట్ల పాదులను కదించి చిన్నవిగా చేసుకోవాలి. నీరు పారిస్తే తక్కువ నీటితో ఎక్కువ చెట్లకు నీరు అందించ వచ్చును. 3.ట్యాంకర్ల ద్వార నీటి సరఫరా.. కొన్ని తోటల్లో బావులు, బోరు బావుల్లో పూర్తిగా ఎండిపోయి నీటి పారుదల ఉండదు. దీని వల్లతోటలు ఎండిపోయే ప్రమాదం రావచ్చు. ఈ పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వార నీటి సరఫరా చేసుకోవాలి. 4.నీటి కుంటల తవ్వక వేసవిలో నీటి ఎద్దడి వంటి గడ్డు పరిస్థితుల నుంచి బయట పడటానికి ముందు జాగ్రత్తగా వర్షాకాలంలోనే తోటల్లో నీటి కుంటలు (ఫామ్ పాండ్స్ను) తవ్వుకోవాలి. 14 X14 X14 మీటర్ల సైజు తవ్వుకుంటే 10 లక్షల నీటిని అందులో నిల్వ చేసుకోవచ్చును. ఈ నీటిని డ్రిప్ ద్వారా 80 నుంచి 100 రోజులు రెండు ఎకరాల తోటకు అందించవచ్చును. పాడి–పంట -
కేఎల్ఐ కాల్వలో మొసలి సంచారం
బిజినేపల్లి: మండల కేంద్రం నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రోడ్డులో బుధవారం రాత్రి ప్రయాణికులకు శాయిన్పల్లి కేఎల్ఐ వంతెన సమీపంలో మొసలి కనిపించింది. కేఎల్ఐ బ్రిడ్జి సమీపంలో రోడ్డు దాటుతుండగా.. వాహనాల శబ్దానికి తిరిగి నీటిలోకి వెళ్లింది. మొసలి రోడ్డు పైకి వచ్చినప్పుడు కొందరు యువకులు వీడియో తీసే ప్రయత్నం చేశారు. రాత్రిళ్లు ఆహారం కోసం మొసలి కేఎల్ఐ కాల్వ నుంచి బయటికి వచ్చి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే శాయిన్పల్లి, మమ్మాయిపల్లి గ్రామాల ప్రజలు, కేఎల్ఐ సమీప పొలాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బిజినేపల్లి పరిసరాల్లో మొదటిసారి మొసలి కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆముదం పంట సాగుతో అధిక దిగుబడులు తిమ్మాజిపేట: ఆముదం పంట ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రాజేంద్రనగర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనసంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ శశిభూషణ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ సమీపంలో రైతు శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రైతులకు శాస్త్రవేత్తల బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సహాయ సంచాలకులు శశిభూషణ్ మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి పంటగ ఆముదం పంటను ప్రోత్సహించాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. ఆముదం పంట సాగులో పాటించాల్సిన పద్ధతులను ప్రథమ శ్రేణి ప్రదర్శనల ద్వారా రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. ఆముదం పంట విస్తీర్ణం పెంచడానికి డ్రిప్ సహాయంతో, అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవచ్చన్నారు. పంటల మార్పిడి చేపట్టడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించ వచ్చన్నారు. డాక్టర్ మమత ఆముదం పంటలో యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఎలా సాధించ వచ్చనే విషయాన్నీ రైతులకు అవగాహన కల్పించారు. మన ప్రాంతంలోని వ్యవసాయ భూములలో హైబ్రిడ్, మేలు రకపు విత్తనాలను డాక్టర్ ఈశ్వర్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మాధురి,ఏఓ కమల్కుమార్, సర్పంచ్ రమాదేవి, పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి శాశ్వత తొలగింపు ● అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన బోయ రంగన్నను గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడితో బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి పట్టుబడ్డాడని, పంచాయతీ కార్యదర్శి రంగన్నపై ఆరోపణలు రుజువు కావడంతో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. ● శాయిన్పల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు దాటేందుకు యత్నం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిద శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై అశ్రద్ధ వహించవద్దని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ బిల్లులు పెండింగ్లో పెట్టవద్దన్నారు. పురోగతిలో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. -
‘ఏదుల’ ఉండగా.. ‘గొల్లపల్లి’ అనవసరం
వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. వలసల జిల్లా సస్యశ్యామలం.. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లగచర్లపునరావృతం అవుతుంది.. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. కమీషన్ల కోసమే రిజర్వాయర్ నిర్మాణానికి ఆసక్తి 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు -
13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం
● అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీ మహబూబ్నగర్ క్రైం/జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ఈనెల 13నుంచి 18వరకు విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు అన్నారు. గురువారం సచివాలయం నుండి డీజీపీ శిశధర్రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగహన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ డి.జానకి సమావేశం ఏర్పాటు కార్యాచరణపై సమీక్షించారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో అరైవ్ ఆలైవ్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు. ఆయా సమావేశాల్లో కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డీఈఓ ప్రవీణ్ కుమార్, డీటీఓ రఘు, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, డీసీఆర్బీ సీఐ నర్సింహులు, అప్పయ్య, గాంధీనాయక్ పాల్గొన్నారు. కాగా.. ఈ నెల 16వ తేదీ జడ్చర్లలోని చంద్రగార్డెన్స్లో జరిగే అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ ఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 జిల్లా కార్యదర్శి పాండు డిమాండ్ చేశారు. విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ల పోరాటానికి తమ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించే వరకు అండగా ఉండడంతో పాటు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆర్టిజన్ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్ మాట్లాడుతూ ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలన్నారు. వివిధ సంఘాల నాయకులు ఉదయ్కుమార్, బాబ్య, ప్రమోద్కుమార్, బాలరామ్ పెండయ్య, తిరులమలేష్, సైదు, మోయిజ్, శ్రీనివాసులు, సర్వేశ్వర్రెడ్డి శేఖర్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వివిధ శాఖల్లో పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీసీలో మాట్లాడారు. 60రోజులకుపైగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, తిరస్కరించబడ్డ అభ్యర్థనలకు కారణాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, ఇతర భూలావాదేవీల నివేదికలను సిద్ధం చేసేముందు తప్పనిసరిగా ఇరు పార్టీల వారికి నోటీసులు జారీచేయాలన్నారు. రాజాపూర్, నవాబుపేట, మూసాపేట, మహమ్మదాబాద్, మహబూబ్నగర్ అర్బన్, జడ్చర్ల, గండీడ్, అడ్డాకుల, బాలానగర్, కౌకుంట్ల, కోయిలకొండ తహసీల్దార్ల పరిధిలో అధిక పెండింగ్ కేసులు ఉన్నాయని, వాటిని గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక సరఫరాకు ఆఫ్లైన్కు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రతివారం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాగుతున్న ఎలక్టోరల్ మ్యాపింగ్ వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 10నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో తడి భూముల గుర్తింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చెరువులు, నీటివనరులపై సంయుక్త సర్వేలు నిర్వహించి, ఫుల్ట్యాంక్ లెవల్ పరిమితులను నిర్ధారించి, జోనల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. సమావేశాల్లో డీఆర్ఓ రారెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎం రవినాయక్, సర్వే భూ రికార్డుల ఏడీ అశోక్, నీటిపారుదల శాఖ అధికారి వెంకటయ్య, పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పాత కక్షలు
కల్వకుర్తి టౌన్: వారంతా ఒకే తండ్రి పిల్లలు.. కానీ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన భూ తగాదా, పాత కక్షలతో ఒకరి ప్రాణం తీశారు. వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకట్రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల సాయిలుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య జంగమ్మకు రుద్రాక్షల కృష్ణయ్య, రెండవ భార్య అంజనమ్మకు శివశంకర్, మహేశ్, మూడవ భార్య మానుపాటి పెద్ద వెంకటమ్మకు అన్వేష్, శివ, పవన్ సంతానం ఉన్నారు. కల్వకుర్తిలో పెద్ద వెంకటమ్మకు ఉన్న పందుల షెడ్డును పలు కారణాలతో తీసివేయగా.. దాన్ని 2023లో రుద్రాక్షల సాయిలు తన వ్యవసాయ పొలంలో పెట్టించాడు. ఈ విషయంపై రెండవ భార్య పిల్లలైనా మహేశ్, శివశంకర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సాయిలు తన కూతురుకు 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి వెల్దండలో స్లాట్ బుక్ చేయగా.. మహేశ్ అడ్డుకున్నాడు. ఈ విషయంలోనూ మొదటి, రెండో భార్య పిల్లలకు గొడవలు జరిగి.. వెల్దండ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములుకు చెందిన పందులను మానుపాటి పవన్, శివ, అన్వేష్ చోరీ చేసి వెల్దండలోని షెడ్డు వద్ద ఉంచారని మహేశ్ సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి పోలీస్స్టేషన్లో చోరీ కేసు నమోదైంది. ఆ తర్వాత తన పందులను తీసుకెళ్లేందుకు వెల్దండకు వెళ్లిన బెల్లంకొండ రాములును గతేడాది ఆగస్టు నెలలో పవన్, శివ, అన్వేష్ కలిసి హత్యచేశారు. ఈ కేసులో వారంతా జైలుకు వెళ్లగా.. అదే సమయంలో మహేశ్ను ఎరుకల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అతడు ఎదిగితే తమను బతకనివ్వడని భావించిన చిన్నమ్మ పెద్ద వెంకటమ్మ, ఆమె కుమారులు అన్వేష్, శివ, పవన్ తమ సమీప బంధువు కృష్ణయ్యతో కలిసి మహేశ్ హత్యకు పథకం రచించారు. ● నిందితులు జైలుకు వెళ్లి వచ్చాక మహేశ్తో స్నేహం ఏర్పరచుకొని అతడి పూర్తి కదలికలను నిశితంగా గమనించారు. ఈ క్రమంలోనే కల్వకుర్తిలోని గాజులవాడకు చెందిన బురాన్ అనే టిప్పర్ డ్రైవర్కు రూ. 2లక్షలకు సుఫారీ ఇచ్చారు. రంజాన్ ముందు రోజు రూ.లక్ష, మరో 20 రోజుల తర్వాత రూ. 50వేలను అతడికి అందజేశారు. అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 3న వెల్దండ నుంచి వ్యవసాయ పొలానికి కారులో వెళ్తున్న మహేశ్ను టిప్పర్తో ఢీకొట్టారు. అయినప్పటికీ అతడు చనిపోలేదు. ఈ క్రమంలో టిప్పర్ డ్రైవర్ బురాన్ మహేశ్ కాళ్లు పట్టుకోగా.. అన్వేష్, శివ బండరాయితో తలపై మోది హతమార్చారు. కుటుంబ సభ్యులే సుఫారీ ఇచ్చి హతమార్చిన వైనం హత్య చేసి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే యత్నం వెల్దండలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల అరెస్టు.. రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి వెల్దండ పోలీసులకు రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మొదటగా రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. అనుమానంతో లోతుగా విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గతంలో వీరి వ్యవసాయ పొలంలో రాములును హతమార్చిన నిందితులను తమదైన శైలిలో విచారించగా.. వారే హత్య చేశారని ఒప్పుకున్నారు. వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి నిందితులను కల్వకర్తిలోని పందుల షెడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, కృష్ణయ్య, బురాన్ నుంచి ఆరు సెల్ఫోన్లు, టిప్పర్, కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన వెల్దండ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు. -
ఫలాలనిచ్చే మొక్కలు నాటితే మంచిది
మహమ్మదాబాద్/గండేడ్: అటవీ ప్రాంతంలోని ఖాళీస్థలాల్లో ఫలాలనిచ్చే మొక్కలు నాటితే చాలా మంచిదని జోగుళాంబ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ అధికారి శివాల రాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి.. ఏ రకమైన మొక్కలు ఉన్నాయి.. మంచి ఫలాలనిచ్చే మొక్కలు నాటారా అన్న కోణంలో పరిశీలించారు. రెండు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఏపుగా ఎదగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్లాంటేషన్ చేయాలని సూచించారు. కాగా అటవీ ప్రాంతంలో గతంలో లక్షలు ఖర్చుచేసి నాటిన మొక్కలు పాడవకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఏపుగా పెరిగిన మొక్కలను అనుమతులు లేకుండా తీసి వేయరాదని అలాంటి పొరపాట్లు అటవీశాఖ అధికారులు చేయరాదని సూచించారు. ముఖ్యంగా నర్సరీల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఫ్లయింగ్ స్క్వాడ్ గణేష్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హై, డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేందర్, ఉదయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యభిచారం కేసులో ఇద్దరికి రిమాండ్
మహబూబ్నగర్ క్రైం: ఇటీవల అపార్ట్మెంట్లో వ్యభిచారం నడుపుతున్న ముఠాను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు నిర్వాహకులను మంగళవారం రిమాండ్కు తరలించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న నగరంలోని అశోక్టాకీస్ చౌరస్తా సమీపంలోని శ్రీసాయి బాలాజీ టవర్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచారం నడిపే అసలు సూత్రధారి అయిన సంతోష్రెడ్డి పరారీలో ఉండగా.. మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1 సంతోష్రెడ్డి, ఏ2 ఆంజనేయులు రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సంతోష్రెడ్డిపై గతంలో మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్లో సైతం వ్యభిచారం కేసు నమోదైందని తెలిపారు. రెండు నెలల నుంచి బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్లో 309 ప్లాట్ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు తేలిందన్నారు. ఇతడి స్వస్థలం నల్గొండ కాగా నగరంలో హౌజింగ్ బోర్డులో అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. -
నేడు పీయూలో ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కాన్క్లెవ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో బుధవారం ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి కాన్క్లెవ్ను నిర్వహిస్తున్నట్లు పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కాన్క్లెవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న రుగ్మతలు, మూఢనమ్మకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో పలు యూనివర్సిటీలు, కళాశాలల నుంచి ఎన్ఎన్ఎస్ వలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి ఎటువంటి ఫీజులు లేవని, ప్రోగ్రాం అధికారులకు మాత్రం నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాన్యాసాలు, పోస్టర్ ప్రజెంటేషన్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు పాల్గొంటారని తెలిపారు. ఇటువంటి కాన్క్లెవ్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా నిర్వహిస్తుందన్నందున పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ఎస్ వలింటీర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్వో గాలెన్న, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, జ్ఙానేశ్వర్, రాఘవేందర్, సుదర్శన్, ఈశ్వర్ తదితరులుపాల్గొన్నారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని గత నెల 26న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పక్షం రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చి సీతారామస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి సిర్సనగండ్ల గ్రామంలోకి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తిసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, అనంత శర్మ, కోదండరామ శర్మ, మురళీధర్ శర్మ, ప్రవీణ్ శర్మ పాల్గొన్నారు. బావాజీ ఆలయ హుండీ లెక్కింపు కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతిపెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ సముదాయంలోని హుండీని మంగళవారం మద్దూరు పోలీసుల బందోబస్తులో మద్దూరు ఎస్బీఐ అధికారులు, ఎండోమెంట్ సిబ్బందితో లెక్కించారు. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. మొదటగా బావాజీ హుండీ లెక్కించగా 21, 20, 372, హనుమాన్ ఆలయ హుండీ లెక్కించగా 14, 8, 890 నగదు ఉన్నట్లు ఆలయ ఈఓ కోమల్ తెలిపారు. మొత్తంగా బావాజీ హుండీ, ఆంజనేయ స్వా మి హుండీ లెక్కించగా రూ.35,29, 262 వచ్చినట్లు తెలపారు. ఇంకా కాళికా దేవి ఆలయంలోని హుండీ లెక్కించాల్సి ఉందన్నారు. కేఎల్ఐ కాల్వలో బాలుడు గల్లంతు నాగర్కర్నూల్ క్రైం: కేఎల్ఐ కాల్వలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన ఘటన మండలంలోని పెద్దాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పులి రవీందర్ (16) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాల్వలో ఈత పడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రవీందర్ కాల్వలో గల్లంతవడంతో గమనించిన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. -
అమరేశ్వరాలయంలో వెండి ఆభరణాల చోరీ
అమ్రాబాద్: స్థానికంగా ప్రసిద్ధి గాంచిన అమరేశ్వరాలయంలో కిలోన్నర వెండి ఆభరణాలు చోరీకి గురై ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు వివరాలు. ఆలయంలో ప్రతి సోమవారం పూజలు చేసిన అనంతరం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్ధరాత్రి వరకు గ్రామస్తులు భజన చేసి ఇళ్లకు వెళ్లారు. ముగ్గురు వృద్ధులు అక్కడే నిద్రించారు. వీరు నిద్రలోకి జారుకున్న అనంతరం మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శివలింగం వెండితొడుగు, అమ్మవారి కిరీటం, అభయ అస్తం కలిపి మొత్తం కిలోన్నర వెండి ఆభరణాలు అపహరించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ హన్మంత్రెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. శివలింగం, అమ్మవారి విగ్రహాల మీద ఉన్న వేలిముద్రల ఆధారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం మన్ననూర్: మనస్థాపంతో యువకుడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మ న్ననూర్లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థాని కుల వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ఉమామహేశ్వర కాలనీకి చెందిన రామావత్ చోక నాయక్ (45) భార్య ఉమతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురై కలుపు నివారణ మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అమ్రాబాద్ పోలీసులు మృతుడి ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి మదనాపురం: బతుకు దెరువు కోసం నగరం వెళ్లి న ఆ కూలీని విద్యుత్ షాక్ బలితీసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉండగా.. 11కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్లో చోటుచే సుకుంది. మదనాపురం మండలం శంకరమ్మపేటకు చెందిన బొగ్గు నాగరాజు (35) కొంతకాలంగా హైదరాబాద్లో వలస కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం తుర్కయాంజల్లో ఓ ఇంటి పైకప్పు (స్లాబ్) కాంక్రీట్ పనులు చేస్తుండగా, పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలాయి. తీవ్రమైన విద్యుత్ ఘాతానికి గురైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతివార్త తెలియగానే స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నా యి. మృతుడికి భార్య నాగలక్ష్మితోపాటు ము గ్గురు కూతుర్లున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగ రాజు మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. బంధువులు, గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణం మానవపాడు: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గోకులపాడులో చోటు చేసుకుంది. ఎస్ఐ స్వాతి వివరాల మేరకు.. గోకులపాడుకు చెందిన నర్సింహులు (28) ఈ నెల 4న కొర్విపాడు గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతిడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య సరస్వతి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
రాష్ట్రంలోనే పేట ఆస్పత్రిలో అత్యధిక ప్రసవాలు
పాలమూరు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఆరోగ్యశాఖ, జనరల్ ఆస్పత్రులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేసింది. ఉత్తమ పనితీరు కనబరిచిన బాదేపల్లి ఆర్బీఎస్కే బృందం రాష్ట్ర ఉత్తమ అవార్డు పొందగా.. నారాయణపేట జిల్లా జనరల్ ఆస్పత్రి రాష్ట్రంలోనే అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేసినందుకు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్కుమార్ సింగ్కు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ అవార్డు అందజేశారు. -
మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్స్కూల్ వద్ద నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. తమకు గతేడాది మూ ల్యాంకనానికి సంబంధించి డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో వారం పదిరోజుల్లో ఈ ఏడాది స్పాట్ వ్యాలువేషన్ కూడా పూర్తి అవుతుందన్నారు. అలాగే కులగణనకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న ఆర్జేడీ సోమిరెడ్డి అక్కడికి చేరుకొని ఉపాధ్యాయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం డీఈఓ ప్రవీణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ వెంకటేష్, రవికుమార్, పీఆర్టీయూ మదన్మోహన్, సుధాకర్రెడ్డి, రవీందర్గౌడ్, ప్రభాకర్, మహమూద్ పాల్గొన్నారు. -
కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా
సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్/స్టేషన్ మహబూబ్నగర్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, లక్షలాది సాగునీటితో పాటు పక్కనే ఉన్న హైదరాబాద్కు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మన ఎంపీలు కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువకుడైన సీఎం రేవంత్రెడ్డి అహర్నిశలు ఈ జిల్లా అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మొదటిస్థానంలో టీపీసీసీ.. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగిందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంలో తెలంగాణలో మన టీపీసీసీ మొదటిస్థానంలో ఉండడం మనందరికి గర్వకారణమని అన్నారు. ప్రతి నెల కచ్చితంగా డీసీసీ ఎగ్యిక్యూటివ్ సమావేశం నిర్వహించాలన్నారు. నేను ఎక్కడా ఉన్నా ఈ సమవేశంలో పాల్గొంటానని తెలిపారు. డీసీసీ కమిటీపై గురుతరమైన బాధ్యత అని అన్నారు. గ్రామ, బూత్స్థాయిల్లో పార్టీ బలోపేతం చేయాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ వర్గాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా రానున్న రెండున్నర ఏళ్లు పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం పని చేయాలని, ఏఐసీసీ ఏ పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ డీసీసీ ప్రమాణాస్వీకారానికి టీపీసీసీ అధ్యక్షుడు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్రెడ్డి, నాయకులు వినోద్కుమార్, ఆనంద్కుమార్గౌడ్, ఎన్పీ వెంకటేశ్, జహీర్ అఖ్తర్, చంద్రకుమార్గౌడ్, హర్షవర్ధన్రెడ్డి, ఏపీ మిథున్రెడ్డి, జంగారెడ్డి, పృథ్వీ, అమరేందర్రాజు, వసంత, బెక్కరి అనితతోపాటు జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పదవి ఎందుకిచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి డీసీసీ కమిటీలో పదవి ఎందుకిచ్చారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి టీపీసీసీ అధ్యక్షులు దృష్టికి తీసుకొచ్చారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలో గత ఎంపీ ఎన్నికల్లో వేరే పార్టీకి పనిచేసిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయనను టీపీసీసీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు సముదాయించారు. ఉమ్మడి జిల్లాలో వందశాతం గెలుస్తాం గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు మినహా 12 సీట్లను గెలిచామని, ఈసారి ఎన్నికల్లో వందశాతం సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల నాలుగైదు సీట్లు పెరిగినా వాటిని కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఉన్న ఫలంగా ఎన్నికలు వచ్చినా 85 నుంచి 90 శాతం సీట్లు వస్తాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం మనం గెలుచుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పునాదులను మరింతగా పటిష్టం చేస్తున్నామని అన్నారు. మహబూబ్నగర్ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రతి నెలలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహబూబ్నగర్ రాజకీయ చైతన్యవంతమైన జిల్లా ఉమ్మడి జిల్లాలో వందశాతం సీట్లు గెలుస్తాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ -
విద్యతో పాటు నైపుణ్యఅంశాల్లో శిక్షణ తీసుకోవాలి
స్టేషన్ మహబూబ్నగర్: ప్రస్తుత కాలంలో బాలికలు విద్యతో పాటు నైపుణ్య అంశాల్లో తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రం మర్లులో అన్వారే మదీనా ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 60 మంది బాలికలకు కంప్యూటర్, టైలరింగ్, మెహిందీ డిజైన్ వంటి అంశాల్లో శిక్షణ అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న బాలికలకు మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి ఏర్పరుచుకొని ముందుకు సాగవచ్చని అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. బాలికలు నైపుణ్య అంశాల్లో శిక్షణ తీసుకునేలా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకున్న బాలిక కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ మక్బూల్, మహ్మద్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు పరిహారం జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల నిర్మాణాలకు సంబంధించిన పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిధుల విడుదల ప్రక్రియను పూర్తి చేశారన్నారు. మిగతా నిధులను కూడా ఈ నెలాఖరు వరకు విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిధుల విడుదలకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా అవార్డు పాస్ కాని నిర్వాసితులకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసి పరిహారం అందించే విధంగా చూస్తామన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ప్రతి నిర్వాసిత కుటుంబానికి కొత్త ప్యాకేజీ ప్రకారంగా రూ.18 లక్షలు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,968 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
బాలకార్మికులను రక్షించే చర్యలు చేపట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో వలస బాలకార్మికులను రక్షించి వారికి విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఆరోగ్య, సంక్షేమ, విద్యశాఖలతో సమన్వయం చేసుకుని ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలలో, హోటళ్లు, ఇళ్లలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, బాలల హక్కులను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని, అలాంటి సందర్భాలు కనిపిస్తే వెంటనే గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వలస కార్మికులకు రేషన్ సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ‘ఒక దేశం – ఒక రేషన్ కార్డు‘ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఏఎస్పీ ఎన్బీ రత్నం, జెడ్పీ వెంకట్ రెడ్డి, ఉప కార్మిక కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్డీఓ నరసింహులు, డీడబ్ల్యూఓ జరీనా బేగం, డీఎంహెచ్ఎం కృష్ణ పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు ● టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ● ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు ● పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ● డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు –8లో uమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. డీట్తో ఉద్యోగాలు.. విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాప్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. -
స్పోర్ట్స్ స్కూల్కు 20 మంది ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గతనెల 31వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ ఎంపిక ఫలితాలను మంగళవారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు హైదరాబాద్లోని హకీంపేట క్రీడా పాఠశాలలో వచ్చేనెల 1వ తేదీన రాష్ట్రస్థాయి సెలక్షన్స్ ఉంటుందని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు 10 పాస్ ఫొటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్తో హకీంపేట స్పోర్ట్ స్కూల్లో ఎంపికలకు హాజరుకావాలని డీవైఎస్ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు బాలురు: ఎం.సాయిచంద్ర (హన్వాడ), జి.గగన్, సమర్థ్ (మహబూబ్నగర్ అర్బన్), పాల శివసాయిరెడ్డి (గండీడ్), ఎ.శ్రీవర్ధన్ (హన్వాడ), వి.ధృవన్ (నవాబ్పేట), ఎ.అశ్విత్రాణసాయి (మహబూబ్నగర్ అర్బన్), ఎండీ అవేజ్ (చిన్నచింతకుంట), ఎర్పుల వర్షిత్ (మహబూబ్నగర్ రూరల్), హృతిక్ క్రిష్ణ యాదవ్ (హన్వాడ). బాలికలు: వి.సాయి వైష్ణవి (మహబూబ్నగర్ అర్బన్), వి.అఖిరాబాయి(బాలానగర్), కొత్త కీర్తన (అడ్డాకుల), కాట్రావత్ సింధ ు(హన్వాడ), మెగావత్ ఆరాధ్య (కోయిలకొండ), బి.జాహ్నవి (జడ్చర్ల), పానుగంటి తన్మయి (కోయిలకొండ), ఎం.జ్యోతిక శ్రీ (మహబూబ్నగర్ అర్బన్), నేనావత్ శైలజ (బాలానగర్), జె.అన్విక (కోయిలకొండ). -
ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలి
పాలమూరు: సాధారణ వ్యక్తుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిలో ఒత్తిడి పెరిగిందని, ఈ క్రమంలో నాణ్యమైన ఆహారం, నిత్యం వాకింగ్, యోగా, ధ్యానం చేయాలని, ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సంతోషంగా ఉండటం అని జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ పాటు 56 డివిజన్ కార్పొరేటర్ ఫర్హాత్ బేగం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కలిగి ఉండాలని సూచించారు. అందుకోసం ఆరోగ్యకమైన జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేసే సిబ్బంది సైతం ముందుగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, ప్రోగ్రామ్ అధికారులు శివకాంత్, పులి విద్య, మంజుల,హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజు శెట్టి, సుభాష్, పట్టణ ఆరోగ్య వైద్యాధికారులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
ఉత్సాహంగా ‘అథ్లెటిక్స్’ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళలకు ఆయా అథ్లెటిక్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులను పరిశీలించిన రాష్ట్ర బృందం
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను సోమవారం రాష్ట్ర బృందం పరిశీలించింది. ప్రోగ్రాం అధికారి మురళి ఎన్ఎంఎంఎస్లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని మస్టర్ డౌన్లోడ్, పని ప్రదేశంలో కూలీల హాజరు, ఫొటో అప్లోడ్ను స్వయంగా చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంసాన్పల్లిలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. వారి వెంట డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ సురేందర్రెడ్డి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’ రద్దుకు ప్రభుత్వం కుట్ర
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కుట్రలు చేస్తోందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై భారం మోపాలనే ఆలోచనకు రావడం దుర్మార్గమైన చర్యన్నారు. మరోవైపు చాలా ప్రైవేటు కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని.. లేనిచో బీసీ జాగృతిసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నరేందర్, కేశవులు, శివకుమార్, భాస్కర్, నవీన్, వీరేశ్ ఉన్నారు. -
పాలమూరు కోర్టులో చలివేంద్రం ప్రారంభం
పాలమూరు: వేసవి కాలం నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ చలివేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. తాగునీరు సకాలంలో అందుబాటులో ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, శ్రీదేవి, రాధిక, రాజా రాజేశ్వరి, మమతారెడ్డి, రవిశంకర్, మునవార్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు పాల్గొన్నారు. ●జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సోమవారం కేజీబీవీలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులతో పాటు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. అనంతరం శిశు గృహను సందర్శించి వేసవి నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చిన్నారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశంపై పరిశీలించారు. -
పాత నేరస్తుడే హంతకుడు..!
నారాయణపేట రూరల్: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కామాంధుడు కటకటాలపాలయ్యాడు. వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కేసును పోలీసులు చేధించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు. నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన శిరీష, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండగా.. వారి కుమార్తె తేజశ్రీ (5) గ్రామంలోనే నాయనమ్మ, తాతతో కలిసి నివాసం ఉంటుంది. గతనెల 31న రాత్రి భోజనం అనంతరం చిన్నారితో కలిసి అవ్వ, తాత ఆరుబయట నిద్రించగా.. అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులు మద్యం తాగి అటువైపు వచ్చాడు. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి, సమీపంలోని చెరువు కట్టపై పాడేశాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న పట్టీలను తీసుకుని.. ఇది దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి పొలం పనులు పూర్తిచేసుకుని అటుగా వస్తున్న రైతులు చంద్రప్ప, కేశవులు అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని గమనించి.. గ్రామస్తులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్, ఎస్ఐ గాయత్రి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ వినీత్.. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేశారు. చిన్నారి మృతదేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ బృందాలు పాత నేరస్తుల జాబితాను పరిశీలించి.. గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులును అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన తప్పును ఒప్పుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. అతడి నుంచి కాళ్ల పట్టీలను రికవరీ చేశారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. కాగా, నిందితుడు నర్సింహులుకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు సైతం ఆయనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లారు. అతడు 2014లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్పై బయటకు వచ్చిన అతడు.. మార్చి 31న అర్ధరాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్కుమార్రెడ్డి ఉన్నారు. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన కామాంధుడు 48 గంటల్లోనే నిందితుడినిపట్టుకున్న పోలీసులు చిన్నారి కాళ్ల పట్టీలు స్వాధీనం వివరాలు వెల్లడించిన నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
పారాక్వాట్పై నిషేధం
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర రసాయన పురుగు మందుగా గుర్తించిన పారాక్వాట్, ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తి నిషేధం విధించింది. అన్ని దశల్లో నిషేధం అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి అన్ని దశల్లో పారాక్వాట్పై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇన్సక్టిసిడ్స్ యాక్ట్– 1968 ప్రకారం అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుదిట్టంగా అమలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇన్పుట్ డీలర్లు, పురుగు మందుల దుకాణాలపై ప్రత్యే క తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రైతులకు అవగాహన ప్రతి గ్రామంలో రైతులకు పారాక్వాట్ ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఈ రసాయన వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, భద్రమైన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. హానికర రసాయనం పారాక్వాట్ మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల దెబ్బతినడం, లంగ్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అదే విధంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విష ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. పర్యావరణానికి ముప్పు పారాక్వాట్ కారణంగా పశువులు, పక్షులు విష ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేల నాణ్యత తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణే లక్ష్యం -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
వన మహోత్సవం ప్రణాళిక సిద్ధం చేయండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వచ్చే వర్షాకాలం ప్రారంభంలో నిర్వహించనున్న మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా అటవీ శాఖ, ఇతర అధికారులు కలిసి సమగ్ర ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు సమగ్ర ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరమన్నారు. గతంలో నాటిన మొక్కల స్థితిపై సర్వే నిర్వహించాలని, వాటిలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని చనిపోయాయి నివేదిక తయారు చేయాలని సూచించారు. అలాగే 2027–28 సంవత్సరానికి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు. తడిభూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ● జనగణన 2027లో భాగంగా మండలస్థాయిలో మంగళవారం, బుధవారం ఎంపీలు, ఎంపీఓ ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, మండల గణాంకా అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి 700 నుంచి 800 జనాభా యూనిట్లుగా విభజించి, రెవెన్యూ గ్రామం, హ్యాబిటేషన్ వారీగా ఎన్యూమరేషన్ బ్లాక్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 18న శిక్షణ ఉంటుందని తెలిపారు. మే నెలలో తొలిదశ హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్కు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్డీఓ నర్సింహులు, సీపీఓ రవీందర్, డీఎఫ్ఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
జిల్లా కార్యవర్గంలో అన్ని వర్గాలకు అవకాశం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ స్టేషన్ మహబూబ్నగర్: సామాజిక సమీకరణాల మేరకు అన్ని వర్గాలకు అవకాశం లభించేలా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన 73 మందితో కూడిన డీసీసీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆమోదంతో డీసీసీ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్న, జెండాలు మోసిన వారికి కమిటీలో చోటు కల్పించినట్లు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా వేముల కృష్ణయ్య, బి.మధుసూదన్రెడ్డి, ఎన్.లక్ష్మినారాయణ, ఎం.వెంకట నర్సింహారెడ్డి, పోలేపల్లి యాదయ్య, సయ్యద్ మిన్హాజుద్దీన్, విష్ణువర్ధన్రెడ్డిను ఎంపిక చేసినట్లు తెలిపారు. కోశాధికారిగా జి.రాజేందర్రెడ్డి, అధికార ప్రతినిధులుగా కంచిమి లక్ష్మణ్, బాల నర్సింలు, జీడీ నిత్యానందన్లను ఎంపిక చేశామని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా 21 మంది, జిల్లా కార్యదర్శులుగా 22 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 19 మందిని ఎంపిక చేశారు. ఈ జంబో డీసీసీ కమిటీలో ఉపాధ్యక్షులుగా నలుగురిని బడుగు, బలహీన వర్గాలకు, ముగ్గురిని రెడ్డి వర్గానికి ఎంపిక చేయగా మిగతా జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లలో అధికంగా బడుగు, బలహీనవర్గాల వారిని ఎంపిక చేయడం విశేషం. నేడు టీపీసీసీ అధ్యక్షుడి రాక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం జిల్లాకు రానున్నట్లు సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. ఆయనకు స్థానిక మెట్టుగడ్డ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యవర్గంతో సమావేశం, అనంతరం శాలీమార్ ఫంక్షన్హాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు కంచిమి లక్ష్మణ్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పరేడ్ మైదానంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫూల్లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ను సోమవారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి మహబూబ్నగర్ క్రైం: ప్రతి పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బాధితులకు సత్వరంగా న్యాయం అందించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో దరఖా స్తు పరిశీలించి ఆయా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్శాఖ ముఖ్య బాధ్యత అని తెలిపారు. ● జిల్లా పోలీస్శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి పదోన్నతి చిహ్నాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. మార్కెట్కుభారీగా ధాన్యం దేవరకద్ర/జడ్చర్ల: దేవరకద్ర మార్కెట్ యార్డు కు యాసంగి సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. సోమవారం మార్కెట్కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,239, కనిష్టంగా రూ.2,159, హంస గరిష్టంగా రూ.1,779, ఆముదాల ధర గరిష్టంగా రూ.6,163, కనిష్టంగా రూ.6129గా ధరలు నమోదయ్యాయి. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.8,032, కనిష్టంగా రూ.5,888 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.7,265, కనిష్టంగా రూ.6,310, ఆముదాలు గరిష్టంగా రూ.6,365, కనిష్టంగా రూ.6,265, జొన్నలు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.2,810, మినుములు రూ.7,010, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,840, కనిష్టంగా రూ.4,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,851, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. -
మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం వీరన్నపేట శివారులోని డబుల్బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద యూఐడీఎఫ్ నిధులు రూ.1.38 కోట్లతో, భగీరథకాలనీలో రూ.3.60 కోట్లతో, గణేష్నగర్లోని పార్కు వద్ద రూ.4.21 కోట్లతో, డంపింగ్ యార్డు సమీపంలో రూ.1.29 కోట్లతో నిర్మించే ఓవర్హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు బండమీదిపల్లిలో విజయ డెయిరీ ఉత్పత్తుల ఔట్లెట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 14 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించనున్నామన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా శుద్ధి చేసిన తాగునీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. విజయ డెయిరీ ద్వారా ప్రజలకు నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. రైతులకు సరైన ధర లభించేలా, వినియోగదారులకు శుద్ధమైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం షాషాబ్గుట్ట ప్రాంతంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించారు. ఆయా కార్యక్రమాలలో టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, నాయకులు సిరాజ్ఖాద్రీ, శ్రీనివాస్యాదవ్, సతీష్కుమార్, మైత్రి యాదయ్యతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కోల్డ్వార్!
ముఖ్య నేత వర్సెస్ డీసీసీ వర్గాలు ● కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చీలిక ● కాంగ్రెస్ కార్యాలయం మెట్లెక్కని పలువురు నాయకులు ● హైకమాండ్కు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులు ● నేడు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ రాక ● ఇరువురు నేతలు, వారి వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా? ● ‘హస్తం’ శ్రేణుల్లో జోరుగా చర్చ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకరేమో జిల్లాస్థాయిలో పార్టీ పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించే నేత. మరొకరేమో అదే పార్టీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్కారు పథకాలను ప్రజలకు చేరవేయడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టే హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి. ఇరువురు అధికార కాంగ్రెస్కు చెందిన వారే. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా ఆ ఇద్దరు కీలకం. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కగా.. నిన్నమొన్నటి వరకు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇరు నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. వర్గాల వారీగా నాయకులు చీలిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం తొలిసారిగా మహబూబ్నగర్కు రానుండగా.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రమక్రమంగా ఆధిపత్య పోరు.. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం సీనియర్ నేత, ముదిరాజ్ వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు పలువురు భిన్నస్వరాలు విన్పించగా.. ఇవే విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల్లో బట్టబయలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేష న్ ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరుల మధ్య అంతర్గ త విభేదాలు రచ్చకెక్కాయి. డివిజన్లలో కా ర్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు టికెట్ల కేటాయింపు వరకు వర్గాల వారీగా నేతలు తమతమ అ నుచరుల కోసం పోటాపో టీ రాజకీయాలకు తెరలేపారు. ప్రచారపర్వంలో సైతం ఆయా వర్గాల నేతలు వేర్వేరుగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేషన్ పీఠాన్ని కై వసం చేసుకోగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తొలి నుంచి మేయర్ రేసుల్లో ఉన్న ప్రసన్న ఆనంద్ గౌడ్ను కాదని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమాల మమత శ్రీనివాస్ పేరు తెరపైకి తేవడం పార్టీలో అలజడి సృష్టించింది. చివరకు ఆమెనే మేయర్గా, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో ఇరువర్గాల నేతల మధ్యదూరం మరింత పెరిగినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పలువురు నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని.. పలువురి ఓటమికి వారే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యనేత వర్గీయులు పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. పార్టీని దెబ్బతీసేలా కొందరు యత్నించారని.. ప్రజల్లో బలం లేదని తెలిసినా వారినే నిలబెట్టి వారి ఓటమికి వారే కారకులయ్యారని...అధిష్టానం సూచించిన వారికి పదవులు ఇవ్వకుండా.. ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ఎజెండాను అమలు చేశారని ఎదుటి వర్గం నేతలు పీసీసీ పెద్దలకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
‘కాంగ్రెస్ పార్టీలో చేరితే పనులు ఇస్తారంట’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బీఆర్ఎస్ కార్పొరేటర్లు పనికోసం పోతే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే పనులు, నిధులు ఇస్తామని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా.. తమ పార్టీ మాట్లాడ లేదన్నారు. ప్రజాతీర్పుకు అనుగుణంగా ముందుకు పోయామన్నారు.మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్లోకి వస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వర్గం చెప్పినా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఒక మహిళ కార్పొరేటర్ భర్తకు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే ముడా చైర్మన్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారని ఆరోపించారు. ముందుగా మీ పార్టీ కోసం కష్టపడిన వారికి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వలేకపోయినా వారికి నామినేట్ పదవులు ఇవ్వాలని సూచించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొందరు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. తాము మిగిల్చిన పనులు పూర్తి చేసేందుకు, కొత్త అభివృద్ధి పనులు చేయడానికి సహకరిస్తామన్నారు. మన్యంకొండ రోప్వే, మార్కెట్లు, మినీ ట్యాంక్బండ్, గురుకుల పాఠశాలలు, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకి సాగునీరు ఇవ్వాలని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తాము తెచ్చిన జీఓ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్లు నవకాంత్, శరత్రెడ్డి, ఈశ్వరయ్య, రమేష్ నాయక్, కిషోర్, మధు మోహన్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
అగ్గి.. రాజుకుంటే బుగ్గే
●మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదాలు 112 జిల్లా ఫైర్స్టేషన్లు వాహనాలు మహబూబ్నగర్ 2 5 నారాయణపేట 2 2 గద్వాల 2 2 నాగర్కర్నూల్ 4 5 వనపర్తి 3 3 ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. -
ఒకే ఇంట్లో 12 పాము పిల్లలు
మండలంలోని గుడ్లనర్వ గ్రామానికి చెందిన మేకల శివుడు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం ఒకే చోట 12 పాము పిల్లలు బయటపడ్డాయి. శివుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము పిల్లలు కన్పించడంతో వాటిని బయటికి పంపే ప్రయత్నం సాధ్యం కాలేదు. దీంతో గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడి సాయంతో పాము పిల్లలను పట్టుకుని పంట పొలాల్లో వదిలేశారు. జనావాసాల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తే చంపకుండా తనకు సమాచారం ఇస్తే పట్టుకొని అడవుల్లో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ జగన్ తెలిపాడు. బిజినేపల్లి పాము పిల్లతో స్నేక్ క్యాచర్ పట్టుకున్న పాము పిల్లలు (ఇన్సెట్లో) -
యుద్ధంతో మానవ మనుగడకు ముప్పు
సాగునీరు అందాలంటే కాపలా కాయాల్సిందే.. కేఎల్ఐ సాగునీరు తమ పొలాలకు అందాలంటే అన్నదాతలు కాల్వ గట్టుపై కాపలాగా పడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ నుంచి వచ్చే డీ 82 కాల్వ కల్వకుర్తి మండలంలోని తాండ్ర మీదుగా పారుతోంది. కానీ మండలంలోని తర్నికల్ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా ఎగువ ఆయకట్టు రైతులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తుండడంతో పంజుగుల, సీలార్పల్లి, మొకురాల, ఎల్లికల్, తిమ్మరాసిపల్లి, జంగారెడ్డిపల్లిలోని ఆయకట్టు పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొకురాల గ్రామానికి చెందిన యువ రైతులు రాత్రి వేళలో తర్నికల్ శివారులో కాల్వ గట్టుపై నిద్రిస్తూ సాగునీరు దిగువకు వెళ్లేలా చూసుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ కష్టాలు తొలగించాలని వారు వేడుకుంటున్నారు. – కల్వకుర్తి రూరల్ మెట్టుగడ్డ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వలన మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, మౌనం వహిస్తున్న ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ చరిత్రలో అమెరికా నిర్మాణమే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో కూడుకున్నదని, ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలు తామంటే భయంతో ఉండాలన్న సంకేతం ఇస్తున్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఖనిజ వనరుల కోసం చేస్తున్న విధ్వంసాన్ని సృష్టించి మహిళలను, పసిపిల్లలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని ఆరోపిస్తూ యుద్ధం చేయడం, అమాయకుల ప్రాణాలు తీయడం కూడా ఒక ఉగ్రవాదమే కదా అని ఆయన విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి అమెరికా సామ్రాజ్యావాదమే కారణమని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రచయిత కల్లూరి భాస్కర్, రాఘవాచారి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, తిమ్మప్ప, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించమని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుది జాబితా ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. – పద్మ, ఏడీ, చేనేత, జౌళిశాఖ అమరచింతలో చేనేత మగ్గంపై చీర నేస్తున్న కార్మికులు (ఫైల్) అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే నెల 15 వరకు ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో అప్పులు లేని సభ్యులకే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. దీంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు చివరిసారి 2013, ఫిబ్రవరిలో జరిగాయి. వీటి పదవీ కాలం 2018లో ముగిసింది. తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు మొత్తం 16 పర్యాయాలు పాత పాలక వర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా గత నెల మార్చి 9 నుంచి మే నెల 10వ తేదీ వరకు పదవీ కాలం పొడిగించింది. జిల్లాలోని పలు సంఘాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మార్చి 24న ఉత్తర్వులు జారీ.. ఓటరు జాబితా తయారీకి గత నెల 24న చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన బెట్టారు. చనిపోయిన, డిఫాల్టర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. సంఘానికి నగదు లేక వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే డిఫాల్టర్గా పరిగణిస్తారు. సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు చేనేత జౌళిశాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా రూపొందిస్తారు. 18వ తేదీ నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సవరిస్తారు. 30వ తేదీ నుంచి మే నెల 1 వరకు సంఘాల వారీగా జాబితాలను జిల్లా రిజిస్ట్రార్కు అందజేస్తారు. మే నెల 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు. మే నెల 6 నుంచి 8వ తేదీ వరకు సంఘాల నోటీసు బోర్డులపై సవరించిన ఓటరు జాబితా ప్రదర్శన. జిల్లా రిజిస్ట్రార్ వద్ద అభ్యంతరాల స్వీకరణ. మే నెల 11, 12 తేదీల్లో సవరించిన సంతకం చేసిన ఓటరు జాబితా జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు. మే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర కో–ఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందించాల్సి ఉంటుంది. వచ్చేనెల 15 వరకు రూపకల్పన డిఫాల్టర్ల ఓటుహక్కు తొలగింపునకు అవకాశం చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళిశాఖకు ఆదేశం ఉమ్మడి జిల్లాలో 54 సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేస్తుండగా మరికొన్ని సంఘాలు అప్పుడప్పుడు పని చేస్తుండగా.. ఇంకొన్ని సంఘాలు మూతబడ్డాయని జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మ డి జిల్లాలో సుమారు 35 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. -
జాతీయ రహదారి పనుల అడ్డగింత
భూత్పూర్: మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ వద్ద చేపడుతున్న జాతీయ రహదారి ఎన్హెచ్–167ఎన్ పనులను ఆదివారం గ్రామస్తులు అడ్డగించారు. నాలగు వరుసల రహదారి పనులు చేపడుతుండటంతో మహబూబ్నగర్ వెళ్లే దారిలో ముస్లింలకు చెందిన శ్మశానవాటిక ఉండటంతో ఆటంక పరుచకుండా బీటీరోడ్డు వేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు రెండు వైపులా సమానంగా రహ దారి పనులు చేపట్టాలని, ఒకవైపు రెండు వరుస లు, మహబూబ్నగర్ వెళ్లే దారిలో ఒక వరుస బీటీ దారి ఏంటని ప్రశ్నించారు. శ్మశానవాటికపై గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం వచ్చాకనే పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు చెందిన సూపర్వైజర్కు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రహదారి కాంట్రాక్టర్, గ్రామ పెద్దలతో మాట్లాడారు. తువ్వగుట్టలో చిరుత సంచారం మహబూబ్నగర్ రూరల్: మండలంలోని రామచంద్రాపూర్ సమీపంలోని తువ్వగుట్టలో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. పటేల్ చెరువు వద్ద గల గుట్టపై చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గుట్టపై చిరుత తిరుగుతుండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ పొలాలకు వెళ్లే రైతులు చిరుత సంచారం వల్ల భయంతో పనులకు వెళ్లడానికి సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశువులను మేపేందుకు వెళ్లే కాపరులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, వారు వెంటనే స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఫారెస్టు అధికారులు స్పందిస్తూ చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అది అటవీ ప్రాంతానికి చెందిన గుట్ట అని, గ్రామ ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారం నేపథ్యంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మార్కెట్లకు కాసుల పంట
జడ్చర్ల: జిల్లాలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆదాయానికి పంట పండింది. వ్యవసాయ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో మార్కెట్లకు ఆదాయం కలిసి వచ్చింది. ప్రధానంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7.03 కోట్ల ఆదాయం వరుసగా కొన్నేళ్లుగా మార్కెటింగ్ శాఖ బాదేపల్లి మార్కెట్కు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం ఆర్జించడంపై మార్కెట్ అధికారులు పాలకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, బాలానగర్ మార్కెట్ యార్డులు కూడా నిర్దేశించిన లక్ష్మాన్ని అధిగమించాయి. నవాబ్పేట మార్కెట్ యార్డు మాత్రం నిర్దేశించిన లక్ష్యానికి కాస్త దూరంగా 70 శాతం మాత్రమే ఆదాయాన్ని సాధించింది. బాదేపల్లిలో రూ.700 కోట్ల వ్యాపారం: జిల్లాలోనే ఎక్కువగా ఈ ఏడాది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపుగా రూ. 700 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగింది. ఇందుకు సంబంధించి ఒక శాతం అంటే రూ.7.03 కోట్ల ఆదాయం లభించింది. మార్కెట్ యార్డులో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు, వరి, తదితర పంట ఉత్పత్తుల విక్రయాలు భారీగా కొనసాగడంతో యార్డుకు అధిక ఆదాయం దక్కింది. సెలక్షన్ గ్రేడ్ దక్కేనా? బాదేపల్లి యార్డుకు సంబంధించి ప్రతి సంవత్సరం మార్కెట్ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బాదేపల్లి మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ మార్కెట్గా కొనసాగుతుంది. రూ: 4 కోట్ల ఆదాయం దాటితే యార్డును సెలెక్షన్ గ్రేడ్ మార్కెట్గా గుర్తించాల్సి ఉంది. గత ఐదేళ్లుగా సెలెక్షన్ గ్రేడ్ లక్ష్మాన్ని సాధిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా ఇందుకు అనుగుణంగా ఆదాయం లభించింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాదేపల్లి మార్కెట్ యార్డును సెలెక్షన్ గ్రేడ్గా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. వసతులు కరువు: మార్కెట్ యార్డులకు అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నా.. రైతులకు మాత్రం సరిపడా సౌకర్యా లు కల్పించడంలో అటు అధికారులు ఇటు పాలకులు విఫలమవుతున్నారు. యార్డుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. సకాలంలో అటు రైతులకు ఇటు వ్యాపారులకు సేవలు అందడం లేదు. ఇప్పటికై నా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవాబ్పేటలో తగ్గిన ఆదాయం: నవాబ్పేట మార్కెట్కు సంబందించి నిర్దేశించిన ల క్ష్మాన్ని సాధించలేక పోయింది.ఇక్కడ రూ.117.40 లక్షల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించగా కేవలం రూ. 83.36 లక్షలు మాత్రమే ఆదాయం లభించింది. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మార్కెట్ యార్డులకు సంబంధిత శాఖ నిర్దేశించిన లక్ష్యం.. సాధించిన ఆదాయం వివరాలు: యార్డు లక్ష్యం ఆదాయం (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) బాదేపల్లి 684.50 702.99 మహబూబ్నగర్ 478.70 483.51 దేవరకద్ర 156.50 169.47 నవాబ్పేట 117.40 83.36 బాలానగర్ 41.60 74.79 రికార్డు స్థాయిలో ఆదాయం ముగిసిన 2025– 26 ఆర్థిక సంవత్సరం జోరుగా సాగిన క్రయవిక్రయాలు జిల్లాలోనే బాదేపల్లి యార్డుకు అధిక ఆదాయం బాదేపల్లి యార్డుకు సెలక్ష న్ గ్రేడ్ హోదా లభించే వి ధంగా కసరత్తు చేస్తున్నాం.ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడాది పంట దిగుబడులకు సంబంధించి మార్కెట్లో మంచి ధరలు రావడం ఆదాయానికి కలిసి వచ్చింది. మున్ముందు రైతులకు మంచి ధరలు లభించే విదంగా కృషి చేసి అ ధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషి చేస్తాం. – అశ్వక్ అహ్మద్,యార్డు కార్యదర్శి,బాదేపల్లి బాదేపల్లి యార్డుకు ప్రతి ఏడాది మంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ.7.03 కోట్ల ఆదాయం వచ్చింది. యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఆదాయానికి అనుగుణంగా మార్కెట్ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తాం. – తంగెళ్ల జ్యోతి, మార్కెట్ యార్డు చైర్పర్సన్, బాదేపల్లి ఈ ఏడాది అత్యధికంగా మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి క్రయ విక్రయాలు కొనసాగడం మార్కెట్ ఆదాయానికి కలిసి వచ్చింది. దాదాపు 7 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం క్రయవిక్రయాలు సాగాయి. అదే విధంగా 9 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, లక్ష క్వింటాళ్ల పత్తి, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, కందులు, ఆముదాలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, మినుములు, పెబ్బర్లు, రాగులు, ఉలువలు, పెసర్లు తదితర క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. -
సుర్రుమంటుండు
పాలమూరుపై భానుడి ప్రతాపం ● ఉదయం 8 గంటల నుంచే అధికమవుతున్న ఎండలు ● ఉక్కపోతతో చిన్నారులు, బాలింతలు, వృద్ధుల ఇక్కట్లు పాలమూరు: ఎవరి నోటా చూసినా ఇవేం ఎండలురా బాబు.. మాడు పగిలిపోతుందనే మాటే వినిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే మొదలై 12 గంటలు చేరుకోకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయట రోడ్లమీదకు రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి కనిపింస్తోంది. చిన్నారులు మధ్యాహ్నం పాఠశాలల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకునేలోపు అవస్థలు పడుతున్నారు. చాలామంది వేడివల్ల వడదెబ్బకు గురవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూత్పూర్ మండల పరిధిలో 42 డిగ్రీల వరకు నమోదు కాగా మహబూబ్నగర్ అర్బన్, రూరల్లో 41, కోయిలకొండలో 40 డిగ్రీల వరకు నమోదు కావడం విశేషం. ఎండలు, వడగాలులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మన శరీర ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ (98.6 డిగ్రీల పారన్హీట్) కలిగి ఉంటుంది. వేసవిలో మరో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఎండలో ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎండ తీవ్రత పెరిగే కొద్ది మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చెమట పట్టడంతో ఒత్తిడి, చికాకు అధికం అవుతుంది. రక్తప్రసరణ పెంచడానికి గుండె వేగం పుంజుకుంటుంది. పెద్దలు రోజుకు ఐదు లీటర్ల నీటిని తాగాలి. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కువ సమయంలో ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. వేసవిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటే వైద్యపరంగా అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నవజాత శిశువులకు తల్లిపాలు ఎక్కువసార్లు తాగించాలి. నవజాత శిశువులు ఉండే గదిలో చల్లని వాతావారణం ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటి బయట ఆడకుండా జాగ్రత్త వహించాలి. ఎండలో బయటకు వెళ్లడం తప్పనిసరైతే గొడుగు తీసుకువెళ్లాలి. వడదెబ్బ తగిలితే తలనొప్పి, వాంతులు, జ్వరం వస్తాయి. వడదెబ్బ ప్రభావ ం ముందుగా మెదడు, గుండె, మూత్రపిండాలపై పడుతుంది. అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే మరీ చల్లని నీటితో కాకుండా మాములు నీటితో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. పిల్లలకు వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీరు, కొబ్బరినీళ్లు వాడటం మంచిది. సులభంగా జీర్ణమమ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
పాలమూరు: సుశ్రుత ప్రజావైద్యశాల ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం న్యూటౌన్లో ఉన్న సుశ్రుత ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కమెడియన్ ఆటో రాంప్రసాద్ ప్రారంభించారు. 2కే రన్ న్యూటౌన్ నుంచి రాజేంద్రనగర్, పీడీ నాయుడు చౌరస్తా నుంచి స్టేడియం గ్రౌండ్ వరకు కొనసాగింది. అక్కడ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జుంబా డ్యాన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఒత్తిడి జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నిత్యం వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయమం తప్పక చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ మమత, సుశ్రుత ఆస్పత్రి ఎండీ డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ ప్రతిభ, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్, వైద్యులు శ్యామూల్, విజయ్కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్థిరంగా ఉండేవి ధర్మం, కీర్తి మాత్రమే
మక్తల్: ప్రపంచంలో స్థ్రింగా ఉండేది ధర్మం, కీర్తి మాత్రమేనని నేరడుగోమ్ పీఠాధిపతి సిద్దలింగేశ్వర స్వామి అన్నారు. ఆదివారం జక్లేర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని కోరారు. విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలి.. పుస్తకానికి దగ్గర ఉన్నప్పుడు భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. అనంతరం ఆదిత్య పరాశ్రీ స్వామి మాట్లాడుతూ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని, సమాజం మారినట్లు మనలో మార్పు రావాలని కోరారు. హిందువులందరూ ఐక్యంగా ఉన్నప్నుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, మాతశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
చీకట్లో బావాజీ గర్భగుడి
● సెల్ఫోన్ లైట్ల వెలుగులో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ● కాంట్రాక్టర్ నిర్వాకంతో ఇబ్బందులు ● రాత్రి 7:45 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన ప్రముఖ ఆలయం గురులోకా మసంద్ బావాజీ గర్భగుడిలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు సెల్ఫోన్ వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 1 నుంచి గురులోకా మసంద్ బావాజీ ఉత్సవాలకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్కు లైటింగ్ పనులు అప్పగించారు. 4 తేదీన ఉత్సవాలు ముగియడంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కాంట్రాక్టర్ తాను అమర్చిన లైట్లను తీసుకెళ్లే క్రమంలో ఆలయంలో ఉన్న విద్యుత్ వైర్లను కూడా కట్చేయడంతో గర్భగుడి చీకట్లో ఉండిపోయింది. ఉత్సవాల్లో భక్తులు వేసిన కానుకలు, నగదు, స్వామివారికి అలంకరించిన నగలు కనిపించేలా నిఘా కోసం సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఉంచారు. సాయంత్రం అయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో సెక్యూరిటీ గార్డుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయం సంబంధిత అదికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఏఎస్ఐ రాములు తెలిపారు. ఈ విషయం అక్కడికి వెళ్లిన భక్తులు అధికారులకు తెలుపగా రాత్రి 7:45 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో గర్భగుడితో పాటు సీసీ కెమెరాల నిఘా కొనసాగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
యువతకు స్ఫూర్తి బాబు జగ్జీవన్రామ్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ మహబూబ్నగర్ రూరల్: దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్రామ్ యువతకు స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ జానకి, నగర మేయర్ మమతతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్, జగ్జీవన్రామ్ లాంటి ఎందరో మహనీయులు పోరాటం కృషి ఫలాలు మనం అనుభవిస్తున్నాం అన్నారు. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు అని, కేంద్ర కార్మిక, రవాణ, ఆహార, వ్యవసాయ, రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్ శాఖలతోపాటు దేశ ఉప ప్రధానిగా కీలక పదవులు నిర్వహించారని కొనియాడారు. 1974లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ప్రారంభించి ఆహార ధాన్యాల కొరతకు పరిష్కారం చూపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు రూపొందించి, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. దళితులకు భూ పంపిణీ, ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాలలో సౌకర్యాలు అభివృద్ధి చేసి వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, డీఆర్డీఓ నర్సింహులు, కార్పొరేటర్లు రమేష్బాబు, పూజిత, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సునీత, నాయకులు వినోద్కుమార్, సీజే బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో క్రిస్టియన్ సోదరులు ఆదివారం ఈస్టర్ పర్వదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కల్వరికొండపై నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు శంషాబాద్ బైబిల్ కళాశాల ప్రొఫెసర్ ఆర్.ఎజ్రా ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కల్వరికొండపై జరిగిన ఈస్టర్ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏసు పునరుత్థానం మన జీవితాలకు ఆశ, విశ్వాసం, నూతన ఆరంభాలకు మార్గదర్శకం అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మేయర్ మమత, ఎంబీసీ చర్చి చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ బీఐ.జేకబ్, కార్యదర్శి జేఐ.డేవిడ్, సహాయ కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ రాజ్, కోశాధికారి టీఏ.స్టీవెన్, సహ కోశాధికారి ఎ.టైటస్రాజేందర్, నాయకులు వినోద్కుమార్, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, కార్పొరేటర్ శ్రీపూజిత తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కోడేరు: మండల పరిధిలో ని గుండ్యవాల్యనాయక్ తండాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాట్రావత్ లోకారం నాయక్ (39) ఆదివారం పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో తెగిపడిన విద్యుత్ వైరును గమనించకుండా తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం కోస్గి రూరల్: గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘ ట న మండల పరిధిలో శనివారం రాత్రి చోటుచేసు కుంది. పోలిసుల కథనం మేరకు తోగాపూర్ గ్రామానికి చెందిన నారాయణకు (33) వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన తోక దస్తమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివా హం జరిగింది. వీరు హైదరాబాద్లో కూలీ ప ని చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత నె ల 30 న దాల్తాబాద్ గ్రామంలోని తమ పొలంలో బోరు వేయించేందుకు వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిత్రుడు వెంకటేష్తో కలిసి ద్విచక్రవాహనంపై తోగాపూర్ నుంచి దౌ ల్తాబాద్కు వెళ్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన నిమిత్తం వెంకటేష్ కిందకు దిగ గా బైక్పై ఉన్న నారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయా లై అతను చనిపోయాడు. మృతుని భా ర్య దస్త మ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జడ్చర్ల: మండల పరిధిలోని పెద్ద ఆదిరాలకు చెందిన నలుగురు ఆదివారం బొలేరో వాహనంలో శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు మూడు రోజులుగా గ్రామంలో భక్త శిరియాళ నాటక ప్రదర్శన చేసిన పాత్రదారులు ఆదివారం స్వామి వారి దర్శనానికి శ్రీశైలం బయలు దేరారు. మార్గమధ్యలో కల్వకుర్తి దాటిన తరువాత కొండారెడ్డి పల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన డోజర్ వీరి వాహనా న్ని ఢీకొట్టడంతో ఇమ్మడి వెంకటయ్య (43) అక్కడికక్కడే మరణించగా కుమ్మరి యాదగిరి, కుమ్మరి సుబ్రహ్మణ్యం, కృష్ణయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మాగనూర్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. మందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే నిందితుడు పోలీసులను గమనించి ట్రాక్టర్ను అక్కడే వదిలేసి పారిపోవడంతో ట్రాక్టర్ను స్టేషన్కు తరలించామన్నారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి నవాబుపేట: మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు(41) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అనంతరం చెరువులోకి దిగి వలను సతీస్తున్న క్రమంలో అతని కాళ్లకు వల చుట్టుకొని చెరువులో మునిగిపోయాడు. చెరువు కట్టపై ఉన్న అతని స్నేహితులు గ్రామస్తులను తీసుకుని వచ్చే లోపు మృతి చెందాడు. మృతుడికి భార్య అంజమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరు మృతి కొల్లాపూర్ రూరల్: పెద్దకొత్తపల్లి మండల పరిఽధిలోని కొత్తపేట గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో తెలుగు ఆంజనేయులు (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కొల్లాపూర్ మండల కుడికిల్ల గ్రామానికి చెందిన తెలుగు ఆంజనేయులు బైక్పై ఆదివారం రాత్రి కొత్తపేట దగ్గర ఉన్న మామిడి తోటకు బయలుదేరాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను గమనించకపోవడంతో బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
బీిసీ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
మెట్టుగడ్డ: మహిళా బిల్లులో బీసీ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ కోరా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేషనగర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కులాల ఐక్యవేదిక మహి ళా విభాగం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బీసీలు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో చాలా నష్టపోయారని బీసీలు రాజకీయ పార్టీలను నమ్మడం మానేసి బీసీ కులాలంతా ఏకమై ఒక రాజకీయ శక్తిగా మారి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం ద్వారానే బీసీల ఓట్లు బీసీలు వేస్కోని అధికారం సాధిస్తేనే బీసీల జీవితాలు మారుతాయన్నారు. బీసీల పేరుతో పదవులు పొంది బీసీల సంక్షేమాన్ని మరిచి అగ్రకుల నాయకులకు సేవలు చేస్తూ వత్తాసు పలికే వారిని త్వరలోనే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. బీసీలు రిజర్వేషన్లు కోసం కాదు.. అధికారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని గ్రహించాలని, అధికారమే లక్ష్యంగా బీసీ మహిళలు యువత సిద్ధమవ్వాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో బీసీ మహిళలు విజయలక్ష్మి, రా ణి, రమాదేవి, అంజిలమ్మ, సత్యమ్మ, శోభారాణి, పరమేశ్వరి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. -
పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు
● ఉమ్మడి జిల్లాలో 94 పాఠశాలలకు రూ.4.40లక్షలు విడుదల ● బ్యానర్లు, పోస్టర్లతో ప్రచారం చేయాలని సూచన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీం పాఠశాలలకు కేవలం ప్రచారం కోసమే ప్రత్యేకంగా నిధులను విడుదలచేసింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 94 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా.. రూ.4.40లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రచారం నిమిత్తం కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఉపాద్యాయులు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలో సాధించిన విజయాలు, అందిస్తున్న వసతులు, బోధన సిబ్బంది తదితర అంశాలపై ప్రచారాన్ని నిర్వహించాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహాయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. ప్రచారం కోసం పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. -
లింగమయ్య భక్తులపై లాఠీ చార్జీ
● ఆలస్యంగా సంఘటన వెలుగులోకి..అచ్చంపేట: సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చిన భక్తులపై పోలీస్ లాఠీచార్జి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 1నుంచి 3వరకు జరిగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఐదురోజుల ఉత్సవాలను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో నల్లమల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మొదటిరోజు నుంచే చెప్పుల కుర్వ వద్ద భక్తుల రాకపోకలను నియంత్రించినప్పుటికీ అదుపు తప్పింది. ఈ క్రమంలో భక్తుల తాకిడికి ఇనుప కంచె, బారికేడ్లు తట్టుకోలేదు. లోయ ప్రాంతంలో భక్తుల నియంత్రణంలో భాగంగా పోలీసులు, అటవీశాఖ వలంటీర్లు అదుపు చేసే సమయంలో లాఠీచార్జీ చేసిన వీడియో సోషల్ మీడియా, ఇన్స్ర్ట్రాగామ్, ఫేస్బుక్లో హల్చల్ అవుతుంది. మునుపటి మాదిరిగానే భక్తులను ఐదురోజులపాటు అనుమతిస్తే ఇంత తాకిడి ఉండదని, వచ్చే ఏడాదికై నా అటవీ, పోలీస్శాఖలు ఈ విషయంపై పునపరిశీలిస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు. ఏడాది పొడవునా అనుమతిస్తామని రెండేళ్లుగా ఊరిస్తున్న అటవీశాఖ ఐదురోజులకు అనుమతి ఇవ్వడంలో వారికి వచ్చే ఇబ్బంది ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అగ్నికి ఆహుతైన పొగాకు
అలంపూర్ రూరల్: మండల పరిధిలోని లింగన్వాయి గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన పొగాకు పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైనట్లు ఏఓ నాగర్జున్రెడ్డి తెలిపారు. శనివారం ప్రమాదంలో దగ్ధమైన నాలుగు ఎకరాల పొగాకు పంటను పరిశీలించారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం సంభవించిదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరారు. జాతీయ రహదారిపై లారీ బోల్తా భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద జాతీయ రహదారిపై శనివారం ముందు వెళ్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తా పడింది. టైల్స్ లోడ్తో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఓ మహిళ, పిల్లలతో కలిసి రోడ్డు దాటుతుంగా లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయగా, వెనకాల వస్తున్న కారు సైతం బ్రేక్ వేసింది. దీంతో కారు వెనుకాల వస్తున్న మరో లారీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. శేరిపల్లి(బి) వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితులు..? నారాయణపేట రూరల్: ఇటీవల మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం, హత్యా అనుమానాలు గ్రామంలో వినిపిస్తుండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అనుమానితులుగా గుర్తించిన నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రూరల్ ఎస్ఐను వివరణ కోరగా విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఆరోగ్యంగా మాగిస్తే.. అమృతఫలం
గ్రేడింగ్ విధానం కాయలను గ్రేడింగ్ చేయడం ద్వారా అవసరమైన సైజు(పరిమాణం), రంగు, బరువును బట్టి చేయడం వల్ల మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఆవిరి (వేపర్ ట్రీట్మెంట్) ద్వారా కాయలను శుభ్రం చేసుకోవచ్చు. గ్రేడింగ్ చేయడంతో రైతుకు వినియోగం కూడా లాభం చేకూరుతుంది. బరువును బట్టి గ్రేడింగ్ చేయవచ్చు. 200–250 గ్రాములు ఉన్నవాటిని మరో గ్రేడ్గా, 300 నుంచి 350 బరువు ఉన్నవాటిని ఇంకో గ్రేడ్గా తయారు చేస్తే మంచిధర లభిస్తోంది. అలంపూర్: మామిడిలో పోషకాలు అత్యంత విలువైనవి. అందుకే మాడిని పండ్లలో రాజుగా గుర్తిస్తారు. ఇందులో విటమిన్–సీ 76 శాతం, విటమిన్–ఏ 25 శాతం, విటమిన్–బీ 6నుంచి 11శాతం, ఫైబర్(పిచు) 9 శాతం, రాగి 9 శాతం పొటాషియం 7శాతం, మెగ్నీషియం 4శాతం ఉంటుంది. మామిడి ఆరోగ్యం కాబట్టి వాటిని మాగించే పద్ధతులు, కోత కోసే సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు. మామిడి మాగించడం: మార్కెట్లోకి పంచదార, కలప వంటి రకాలు ముందుగా వస్తాయి. పెద్దరసం, చిన్నరసం, చెరుకు రసాలు తర్వాత అందుబాటులోకి వస్తాయి. బేనిషా రకం ఆ తర్వాత నీలం, బెంగుళూరు(తోతపరి, కలెక్టర్) రకాలు అలస్యంగా మార్కెట్లోకి వస్తాయి. ముందుగా వచ్చే పండ్లకు నాణ్యత ఉండదు. కార్బెట్ను ఉపయోగించి రంగును తెప్పించి విక్రయిస్తారు. తర్వాత వచ్చే మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. ఒకగదిలో గడ్డి లేదా వరిగడ్డి పరచి వాటిపై కాయలు పేర్చి మళ్లీ గడ్డిని కప్పాలి. రెండుమూడు రోజుల్లోనే కాయలు మాగుతాయి. పండ్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. అవసరమైతే మామిడికి మంచి రంగును తెప్పించడానికి ఇథైల్ను ఉపయోగించవచ్చు. ఇది కెమికల్ కాదు. ఇది హార్మోన్. లీటర్ నీటికి 1ఎంఎల్ నుంచి 1.8 ఎంఎల్ను ఉపయోగించి కాయలన్నింటికీ సమానంగా రంగును తెప్పించి మాగపెట్టవచ్చు. ఇథైల్ను వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కలిపి కాయలను 5నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టాలి. మామిడి పండ్లను చెక్కపెట్టల్లో కాకుండా సీఎఫ్బీ పెట్టెల్లో ఉంచి రవాణా చేయవచ్చు. 5–10 కిలోల వరకు పెట్టేల్లో ఉంచి దూరప్రాంతాలకు రవాణా చేయడం వల్ల దెబ్బతినవు. కాల్షియం కార్బైట్ ద్వారా మాగించడంతో.. కొంతమంది రైతులు, వ్యాపారులు కాయలను మాగపెట్టడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. కాల్షియం కార్బైట్ను అధికంగా వినియోగించి సరిగ్గా పక్వానికి రాని కాయలను కృత్రిమంగా రంగు తెప్పించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటికి మంచి రంగు ఉంటుంది. కానీ రుచి ఉండదు. పుల్లగా ఉంటాయి. ఇలా మాగబెట్టినవి తినడంతో ఆరోగ్యానికి హానికి కలిస్తాయి. బాగా ముదిరిన కాయలను మాగబెట్టడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇథైల్ వాడకం శ్రేయస్కరం మామిడి కాయలను మాగించడానికి ఇథైల్ వాడకం శ్రేయస్కరం. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఆకు పచ్చని రంగును ఆకర్షణీయమైన రసం పసుపు రంగుకు మారుస్తుంది. పండ్లు తీపిదనాన్ని, మంచి సువాసనను ఇస్తోంది. ఇథైల్ వాడకంతో మామిడి కాయాల్లో ఇథిలిన్ వాయువు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల రైతులు కార్బెడ్ ఉపయోగించకుండా ఈ సూచన ప్రకారం మాగపేడితే మంచి నాణ్యత వస్తోంది. రైతుకు మంచి ధర లభిస్తోంది. మామిడి కోతలో జాగ్రత్తలు తప్పనిసరి పాడి–పంట -
ఎత్తిపోతల పనులు అడ్డుకున్న రైతులు
● పరిహారం చెల్లించాకే ప్రారంభించాలని డిమాండ్ ● వెనుదిరిగిన అధికారులు దామరగిద్ద: పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలంటూ కాన్కుర్తి రైతులు శనివారం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మక్తల్–నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలలో భాగంగా గ్రామ సమీపంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను రైతులు అడ్డుకున్నారు. త్వరలోనే అందరికి పరిహారం అందుతుందని అధికారులు, నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లింపులో జాప్యం చేపడం సరికాదని.. ఆందోళనకు గురవుతున్నారని భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ నారాయణ అన్నారు. అధికారులు రైతులను ఒప్పించేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి 15 రోజుల్లో డబ్బులు చెల్లించి పనులు ప్రారంభిస్తామంటూ అధికారులు వెనుదిరిగారు. పరిహారం చెల్లించాలంటూ రైతుల పక్షాన సర్పంచ్ నారాయణ అక్కడికి వచ్చిన చీఫ్ ఇంజినీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డి, స్థానిక నాయకులు ఈదప్ప తదితరులు ఉన్నారు. -
రెవెన్యూ, పోలీస్ అధికారుల తీరుపై విమర్శలు
మాగనూర్: మండల రెవెన్యూ అధికారులు అలాగే పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. మక్తల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు వడ్వాట్ గ్రామం నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి సైతం ఇదే విధంగా పదికి పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే టిప్పర్ల దగ్గరకు చేరుకున్న పోలీసులు వాటిని పట్టుకోకుండా వదిలేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్కు సమాచారం అందించగా తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ శ్రీశైలం సిబ్బందితో కలిసి టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయినా పోలీసులు టిప్పర్లను పట్టుకోకుండా వదిలేశారు. దీంతో స్థానిక అధికారులు, పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తే కేసులు నమోదు చేసే అధికారులకు టిప్పర్లలలో అక్రమ రవాణా కనబడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వదిలేసిన టిప్పర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రతి పోలీస్ కుటుంబానికి సమయం ఇవ్వాలి
● ఇకపై ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం ● ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో పనిచేసే అధికారి నుంచి సిబ్బంది వరకు విధి నిర్వహణతో పాటు కుటుంబానికి తప్పక సమయం ఇవ్వాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ట్రాఫిక్ పోలీసులు, మహిళా పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలా స్పందించాలి, ఎలా విధులు నిర్వహించాలనే అంశంపై ప్రత్యేక మాక్ డ్రీల్ నిర్వహించారు. అత్యవససర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శనాత్మకంగా చేసి చూపించారు. అనంతరం సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధుల కారణంగా ఒత్తిడికి గురవుతారని.. ఈ క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలన్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ధృడంగా మారుతారని తెలిపారు. ఆరోగ్యం కోసం నిత్యం యోగా, నడక, ప్రాణయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి వద్దాకే ఎఫ్ఐఆర్ బాధితులు, ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం ఇకపై పోలీస్స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని ఇంటి వద్ద నుంచి తెలంగాణ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తోందని ఎస్పీ జానకి ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీలు వంటి ఆస్తి సంబంధిత, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలు సందర్భాల్లో బాధితులు స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఫోన్ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు చేరుకుని ఫిర్యాదు స్వీకరిస్తారని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో కూడా పోలీసులే బాధితుడి వాగ్మూలం వారి భాషలోనే నమోదు చేసి చదివి వినిపించి వారి సంతకం తీసుకుంటారని తెలిపారు. అక్కడినుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అక్కడే బాధితుడికి ఎఫ్ఐఆర్ అందిస్తారని తెలిపారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మన్యంకొండలో వైభవంగా తిరుచ్చి సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి తిరుచ్చి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్భగుడి నుంచి శోభయామానంగా అలంకరించిన తిరుచ్చివాహనంపై దేవస్థానం ముందున్న సభామండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. సభామండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఈ సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో మన్యంకొండకు తరలివచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి యువకుడు మృతి
నారాయణపేట రూరల్: స్నానానికి వెళ్లిన యువకుడు ఈతరాక నీటిలో మునిగి మృతి చెందిన ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్కు చెందిన ఖాదర్ తన మిత్రులు, సోదరులతో కలిసి మండలంలోని కోటకొండ గ్రామంలో బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఉదయం గ్రామ శివారులోని చెరువుకట్ట వైపు వెళ్లిన ఖాదర్ స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఆయన ఆచూకీ దొరకలేదు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడు అనుమానాస్పద మృతి కొత్తకోట రూరల్: తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడంటూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని శ్రీరాంనగర్ కాలనీ, కాటేదన్కు చెందిన దోమ అరుణమ్మ కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (27) డీసీఎం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈనెల 2న డీసీఎంను తీసుకుని బళ్లారికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొత్తకోట మండలం విలియంకొండ గ్రామ సమీపంలో ఓ దాబా దగ్గర కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆపి అంతలోనే అస్వస్థతకు గురికావడంతో తోటి డ్రైవర్లు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే చంద్రశేఖర్రెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి అరుణమ్మ తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య రాజోళి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వడ్డేపల్లి మండలంలోని రామాపురంలో జరిగింది. శాంతిగనర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రామస్వామి(40) 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. తాగుడుకు బానిస కావడంతో పదేళ్ల కిందట భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అడవిపంది దాడిలో గాయపడిన రైతు మృతి జడ్చర్ల: పొలంలో అడవి పంది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామ శివారులో శుక్రవారం వ్యవసాయ పనులు చేసుకుంటున్న గొంగండ్ల రామకృష్ణ(50)పై అడవి పంది దాడి చేసింది. దాడిలో కడుపులోని పేగులు బయటకు రాగా స్థానికులు 108 అంబులెన్స్లో చికిత్స కోసం ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు వెల్దండ: మండలంలోని నారాయణపూర్ బస్స్టేజీ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం చోటుచుసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మండలంలోని నారాయణపూర్ బస్స్టేజీ సమీపంలో ఎదురుగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన కారు బస్సును ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో హైదరాబాదులోని పిసల్బండకు చెందిన డ్రైవర్ అసీఫ్అహ్మద్, అర్ఫన్, ఫరీదాబేగం, సల్మా, మహ్మద్జానీ, సఫా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో డ్రైవర్, కండక్టర్తోపాటు మరో 33మంది ప్రయాణికులున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెల్దండ పోలీసులు పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ వెంకట్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ అసీఫ్అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ముగిసిన బావాజీ బ్రహ్మోత్సవాలు
కొత్తపల్లి: నాలగు రోజులుగా కొనసాగుతున్న లోకామసంద్ బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. శనివారం చివరి రోజు ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. కాళికాదేవికి భక్తులు మొక్కుబడిగా మేకపోతులు, గొర్రె పోతులను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, దన్సింగ్లు కాళికామాతకు మహా హోమం జరిపంచారు. రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన సామాజిక వర్గాల జాతర కావడంతో గిరిజనులు పెద్దఎత్తున హాజరయ్యారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనట్లు ఈఓ కోమల్ తెలిపారు. ప్రభుసేవలో కర్ణాటక మాజీ మంత్రి గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను శనివారం కర్ణాటక మాజీ మంత్రి ప్రభుచౌహాన్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా వరుసగా ఐదోసారి గెలుపులో లోకామసంద్ బావాజీ ఆశీస్సులతోనే ప్రజల్లో ఉంటున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయన అభివృద్ధిపై దృష్టి సారిస్తే గొప్ప పర్యాటక ప్రదేశంగా మారి మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాక్షించారు. కలెక్టర్ ప్రత్యేక పూజలు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ స్వామివారిని దర్శించుకొన్నారు. ఆర్డీఓ రాంచందర్నాయక్, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, డీపీఆర్వో రశీద్, తహసీల్దార్ జయరాములు, కొత్తపల్లి మద్దూరు ఎంపీడీఓలు కృష్ణారావు, రామన్న, కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
వెల్దండ: భూ వివాదం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన వెల్దండలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల మహేశ్ (30) శుక్రవారం రాత్రి గ్రామం నుంచి తన వ్యవసాయం పొలంలోని ఇంటికి కారులో వెళ్తుండగా.. అప్పటికే పక్కా ప్రణాళికతో దారి కాచి ఉన్న దుండగులు టిప్పర్తో కారును ఢీ కొట్టారు. అనంతరం మహేశ్పై రాళ్లతో దాడిచేసి హతమార్చారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. గ్రామస్తుల సమాచారం మేరకు శనివారం వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తితో పాటు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేసుకొని వివరాలు సేకరించారు. మహేశ్ తలపై మోదిన బండరాళ్లపై రక్తపు మరకలను గుర్తించారు. ఈ క్రమంలో మృతుడికి తన కుటుంబ సభ్యులతో భూ వివాదం ఉన్నట్లు గుర్తించారు. పథకం ప్రకారం టిప్పర్ మహేశ్ కారును ఢీకొట్టి హత్యచేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతుడి భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. కాగా, టిప్పర్ డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా 15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట ఎందరో ప్రాణాలు కాపాడా.. 108 వాహనంలో టెక్నీషియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట సద్వినియోగం చేసుకోండి.. 108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ , మహబూబ్నగర్ ● -
క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
● ఏప్రిల్ 9 నుంచి 24 వరకు‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ● ఎంపీ డీకే అరుణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
సలేశ్వరం ఉత్సవాల్లోనూ..
మన్ననూర్: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతరలోనూ 108 సిబ్బంది సేవలు భేష్ అనిపించాయి. ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు కొంత మేరకు భక్తులకు ఇబ్బందులు కలిగినప్పటికి 108 అంబులెన్స్ సిబ్బంది అందించిన వైద్యసేవలు ఆశించినస్థాయిలో అస్వస్థతకు గురైన భక్తులకు అందుబాటులో ఉన్నట్లు పలువురు ప్రశంసించారు. మూడురోజుల పాటు 108 అంబులెన్స్, 9 మొబైల్ వాహనాలు (బైక్లు) అటవీ మార్గంలో పర్యటిస్తూ అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరమైన సేవలు అందించారు. ఈ క్రమంలో అటవీ మార్గంలో ఇబ్బందులకు గురైన సుమారు 30 మందికి ప్రత్యక్షంగా వైద్యసేవలతోపాటు మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు, తాగునీరు అందించి సఫర్యలు చేశారు. -
మరింత విస్తరిస్తాం..
రాష్ట్రంలోని 108 వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. మూడురకాల వాహనాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్లైనన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి -
ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని, బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. బూత్స్థాయి అధికారులకు శిక్షణ అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్లకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శిక్షణ సంబంధిత మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే నియమించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. వీసీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు సంబందించి శిక్షణ తీసుకుని అర్హత సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందులో చాలా మంది విద్యార్థులు అర్హత సాధించడం గొప్ప విషయం అన్నారు. కొంత మంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం ఉండదని, తల్లిదండ్రుల సహకారం ఉండదని తెలిపారు. ఒకవేళ తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరిస్తే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, నీట్ వంటి వాటిల్లో రాణిస్తారన్నారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ఎన్ఆర్ఐలు కూడా సహకరిస్తున్నారని, పేద విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారు సీట్లు సాధించారని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మేయర్ మమత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు వినోద్కుమార్, సిరాజ్ఖాద్రీ, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
● ఇరిగేషన్ మంత్రిగా ఉండి డీపీఆర్సమర్పించలేదు: ఎమ్మెల్యే జీఎమ్మార్స్టేషన్ మహబూబ్నగర్: హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివా రం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొడంగల్కు విహారయాత్రకు వచ్చిన హరీశ్రావు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఎద్దేవా చేశా రు. ఆరు గ్యారంటీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు మీరు అధికాంలో ఉండి చేసిన మోసాలు, దోపిడీలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. ప్రజలకు ఇచ్చిన మా ట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రూ.500కే సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రూ.22 వేల కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మీలా ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్రూం పేరిట ప్రజలను మోసం చేయలేదన్నారు. కొడంగల్ వరకు కాదు, మీరు దేవరకద్ర నియోజకవర్గానికి వస్తే రుణ మాఫీ రైతులు, గ్యారంటీలు అందుకుంటున్న లబ్ధిదారులను చూపిస్తామని సవాల్ విసిరారు. గ్రామసభల్లో ప్రజలు అడ్డుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తుండడం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఒక్క పాలమూరు–రంగారెడ్డినే కాదు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉనికి కోసమే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఫొటోషూట్ కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినట్లు నటించి ప్రజలను మోసం చేశా రని విమర్శించారు. త్వరలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్లతో రైతుల పాదాలు తడుపుతామని అన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, రాములుయాదవ్, అజ్మత్అలీ, అవేజ్ పాల్గొన్నారు. -
నల్లమల అడవిలో అగ్నికీలలు
మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని కొల్లంబీట్ పరిధిలోని అడవిలో శుక్రవారం అగ్ని కీలలు చెలరేగాయి. వేసవి కావడంతో అటవీ ప్రాంతంలో మొత్తంగా ఎండుగడ్డి, ఎండుటాకులు విస్తరించి ఉన్నాయి. ఈక్రమంలో ఎవరైనా నిప్పు రాజేశారో కొన్ని సమయాల్లో వేడికి అగ్నికీలలు చెలరేగుతాయి. ఎలా జరిగిందో కానీ 6–7గంటల పాటు అడవిలో మంటలు చెలరేగి సుమారు 20 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగుతున్న సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైర్ వాచర్లు, టైగర్ ట్రాకర్లు, ప్రొటెక్షన్ వాచర్లు సుమారు 20మంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి లంబడోని ఉతార్ సమీప ప్రాంతంలో పొగలు విస్తరించడంతో కొంత సమయంపాటు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. -
ప్రముఖుల ప్రత్యేక పూజలు
గురులోకా మసంద్ బావాజీ, కాళికాదేవిని మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్రెడ్డితో పాటు మాజీ ఎమెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, అంజయ్యయాదవ్ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ కమిటీ ఆద్వర్యంలో శాలువా పూలబొకేతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, గోపాల్, కౌన్సిలర్లు దినేశ్కుమార్, గోపాల్, సంగీత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం
కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీ స్వయంభు లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని వేలాది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలతో కనులపండువగా చే శారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజ లు, అలంకరణ, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు పాల ఉట్టి పగులగొట్టారు. అనంతరం భజనమండలి చేత భజన గీతాలు ఆలపించారు. ఉత్సవాలకు స్థానికులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకునున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండగా నిర్వాహకులు తాగునీరు, వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. -
వెళ్లొస్తాం.. లింగమయ్య
ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు తీవ్ర ఎండల్లో కూడా తగ్గని భక్తుల రాక భద్రతా ఏర్పాట్లు భేష్ సలేశ్వరం ఉత్సవాల ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం ఉదయం ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి సలేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సలేశ్వరంలో 400మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, మూడురోజులపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సలేశ్వరం వచ్చిన భక్తులు వచ్చిన దారినే వెళ్లాలని, డీప్ ఫారెస్ట్లోకి వెళ్లకూడదని సూచించారు. సలేశ్వరంలో పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేస్తూ విధులపై సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించడంతోపాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ను ప్రత్యేకంగా అభినందించారు. గురువారం రాత్రి నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా ప్రమాదవశాత్తు లోయలో పడిపోగా.. విధుల్లో ఉన్న ఎస్ఐ మురళి, కానిస్టేబుళ్లు ఊర్మిళ, మణిక్యాలు వెంటనే గమనించి అతన్ని గట్టుపైకి తీసుకొచ్చి వైద్యం అందించడంపై కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఫర్హాబాద్ వద్ద చెక్పోస్టుల మూసివేత మూడు రోజుల్లో 3లక్షల మంది దర్శనం అచ్చంపేట: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలు శుక్రవారంతో మగిశాయి. మూడురోజులపాటు నల్లమల అభయారణ్యం జనసంద్రంతో నిండుగా కనిపించింది. శివనామస్మరణంతో మారుమోగిన నల్లమల కొండలు నేటినుంచి మూగబోనున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు రావడంతో కిక్కిరిసింది. చివరిరోజు శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి వాహనాలు ఆడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. ఈసారి పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడురోజుల్లో 24గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రివేళ ఎక్కువ మంది దర్శనం చేసుకోవడం అనుభూతినిచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ పేరుతో అటవీశాఖ విధించిన అంక్షలతో మూడేళ్లలో భక్తుల సంఖ్య తగ్గడం, ఆలయాలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శల కారణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. మూడేళ్లుగా అలాంటిదేదీ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపీరిపీల్చుకున్నారు. చివరిరోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్య నామం జపించారు. లోయలో భద్రత గాలికి.. సలేశ్వరం ఉత్సవాలకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు లోయలో భద్రత కరువైంది. పోలీస్ సిబ్బంది, అటవీశాఖ వలంటీర్లను ఏర్పాటు చేసినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేపోయారు. వేలాదిమంది గుమ్మిగూడిన చోట నియంత్రణ, భద్రత చర్యలు నామమాత్రంగా కనిపించాయి. పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ వాహనాదారులు అటవీ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెరిగిన బందోబస్తు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వారి అంచనాలకు మించి వాహనాలు, భక్తులు రావడంతో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముందుస్తుగా అడవిలో చెత్త నిర్వహణ, తొలగింపు, వాహనాల ట్రాఫిక్, లోయ వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, బారీకేడ్లు, భద్రత నిర్వహణను పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపీరి పీల్చుకుంది. సలేశ్వరం లోయలో భక్తులు సలేశ్వరం కొండల్లో భక్తులు చెక్పోస్టులు మూసివేత దాతల సేవలే పరమార్థం హైదారాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫర్హాబాద్, లింగాల మండలం అప్పాయిపల్లి ప్రాంతంలోని చెక్పోస్టులను అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఈసారి అంచనాలకు మించి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్, అటవీశాఖలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మాత్రమే అనుమతించనున్నట్లు పోలీస్, అటవీశాఖ సంయుక్త ప్రకటన చేసినా.. భక్తులు మార్చి 30, 31వ తేదీల్లో కూడా తరలి రావడంతో ముందుస్తుగా అనుమంతించారు. అచ్చంపేట ఆర్టీసీ మొదటిరోజు 28, రెండోరోజు 32, మూడరోజు16 ట్రిప్పుల చొప్పున బస్సులు నడిపించారు. అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని చివరిరోజు మధ్యాహ్నం 2గంటలకే బస్సులను నిలపివేశారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, అంబలి కేంద్రాలు, తాగునీటి వసతి భక్తులకు ఎండవేడి నుంచి కాపోడుకోవడానికి ఎంతగానో ఉపకరించాయి. సలేశ్వరం ఉత్సవాలతో అటవీశాఖ ముక్కిపిండి టోల్ ేరుసుము వసూలు చేసింది. సలేశ్వరం ఉత్సవాలు మాత్రం అటవీశాఖకు మంచి ఆదాయ వనరుగా నిలిచిందనే చర్చ సాగుతోంది. ఏటా రూ.లక్షలాది ఆదాయం సమకూరుతున్న అటవీశాఖ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. -
లైఫ్ జాకెట్లు లేకుంటే విహారయాత్రకు అనుమతించొద్దు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని కృష్ణా నది అందాలను వీక్షించేందుకు వచ్చే విహారయాత్రికులు బోటులో ప్రయాణించాలంటే తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని లేని పక్షంలో వారిని బోటులో అనుమతించొద్దని జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ టూరిస్టు పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సోమశిల నుంచి కృష్ణానదిలో బోటులో సంగమేశ్వరాలయం వెళ్లే పర్యాటకులను స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మితో కలిసి పరిశీలించారు. కొందరు లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణించడాన్ని గమనించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకులు బోటులో వెళ్లేటప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. మర బోట్ల యాజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోమశిల నుంచి ఏపీలో నది అవతలివైపు ఉన్న సంగమేశ్వరాలయానికి పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అందులో భాగంగా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. -
కనులపండువగా రథోత్సవం
● ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు ● బావాజీ జాతరకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ● దర్శించుకున్నమాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురులోకామసంద్ ప్రభు బావాజీ రథోత్సవం కనులపండుగగా సాగింది. గురువారం తెల్లవారు జామున రథోత్సవం, స్వామివారి పల్లకీ సేవా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు నృత్యాలు, భజనలు చేస్తూ ప్రభువును ఆరాదించారు. గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లానాయక్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులు బావాజీకి తలనీలాలు సమర్పించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేశారు. జెండాలను ధ్వజారోహణం చేసి మొక్కు లు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 40 మంది బిల్డర్స్ పూణా గ్రూప్ అసోసియేషన్గా ఏర్పడి భక్తులకు 8 ఏళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. రథోత్సవంలో భక్తుల కత్తి విన్యాసం గురువారం తెల్లవారు జామున నిర్వహించిన రథోత్సవంలో పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులతో పాటు నారాయణపేట జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రాంచందర్, తహసీల్దార్ జయరాములు చేసిన కత్తి విన్యాసం ఆకట్టుకుంది. ప్రశాంతంగా రథోత్సవం బావాజీ జాతర రథోత్సవం పటిష్ట బందోబస్తు మధ్య తెల్లవారు జామున ప్రశాంతంగా ముగిసిందని అదనపు ఎస్పీ రియాజుల్ హక్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. జాతర పూర్తిగా ముగిసే వరకు పటిష్ట బందోబస్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గురులోకామసంద్ ప్రభు రథోత్సవంలో భక్తజన సందోహం


