పుర బరిలో భార్యాభర్తలు
కల్వకుర్తి టౌన్: ఒకే ఇంటి నుంచి ఇద్దరికి సామాన్యంగా గుర్తింపు పొందిన పార్టీలు టికెట్లను కేటాయియించటం అసాధారణం. అలాంటిది మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులకు భార్యాభర్త ఇద్దరూ పోటీలో ఉన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో 7వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బృంగి రత్నమాల, ఆమె భర్త ఆనంద్కుమార్ 13 వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. గతంలో భర్త 2014 కౌన్సిలర్గా ఉన్నారు. ఎలాగైనా ఇద్దరూ గెలిచి కౌన్సిల్లో ఉండి ప్రజలు తమవంతు సేవ చేస్తాం అంటున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేయటం చర్చనీయాంశంగా మారింది.


