breaking news
Mahabubnagar District News
-
మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత..
20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఉమ్మడి పాలమూరులో ఆనాడు మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారని గుర్తు చేశారు. అత్యంత వెనకబడిన ప్రజలు చీకట్లో నుంచి వెలుగు రావాలని 2006లో మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయంతో ఈనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశం వచ్చింది. నాకు ఇంకా అవకాశం ఇచ్చేందుకు ప్రజల వద్ద ఇంకా ఏమీ లేదు. ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చారు. అందుకే మిడ్జిల్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది. మిడ్జిల్ డార్క్ మండలం కాదు.. ఈ ప్రాంతానికి వెలుగు రేఖలు వచ్చినాయనేది ప్రభుత్వ లెక్కల్లో తేలాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనేదే నా కోరిక. అందుకే ఈ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దత్తత తీసుకోవాలని కోరుతున్నా. -
సమయానికి.. పూర్తయ్యేనా ‘సర్’!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ -
ఇంటర్ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పలు ఎస్సీ ఇంటర్మీడియట్ గురుకుల కళాశాలల్లో పలు కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు చేరాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర గురుకులంలో ఎంపీసీలో 38, బైపీసీలో 40, బాలికల గురుకులాల్లో ఎంపీసీలో 14, బైపీసీలో 10, సీఈసీలో 8, ఎంఈసీ 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 6వ తేదీన రాంరెడ్డిగూడెం గురుకులంలో నిర్వహించే కౌన్సెలింగ్ హాజరుకావాలని, టీసీ, బోనోఫైడ్, కులం, ఆదాయం, ఫొటోలతో రావాలని సూచించారు. డే కేర్ను సద్వినియోగం చేసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని డే కేర్ సెంటర్ను ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు. ఉద్యోగుల పిల్లల సంరక్షణ ఎలా ఉందని నిర్వాహకులను అడిగి తెలుకున్నారు. డే కేర్లో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయని తెలిపారు. చిన్నారుల సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రానాయక్, సహాయ అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, నంద కిషోర్, నాయకులు మధుసూదన్, మల్లయ్య, పటేల్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలి: యెన్నం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యా వ్యవస్థలో మార్పులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివా రం నోయిడాలో టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే సమాజ వికాసం సాకారమవుతుందన్నారు. విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా దేశ అభివృద్ధికీ ఎంతో కీలక మని పేర్కొన్నారు. ‘మహబూబ్నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. డిజిటల్ లెర్నింగ్ విస్తరణ, డిజిటల్ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించామన్నారు. ‘మై విలేజ్ స్కూల్’ ద్వారా ప్రతి పాఠశాలకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ, గ్రామీణ విద్యను బలోపేతం చేస్తున్నామన్నా రు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ వేదికపై ఒక ప్రజాప్రతినిధిగా పాల్గొ నే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ విడుదల చేశారు. ఏప్రిల్, మేలో నిర్వహించిన సెమిస్టర్ 2, 4, 1, 3 బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ సుకన్య తెలియజేశారు. ఫలితాల్లో 25శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల విడుదలలో విశ్వవిద్యాలయం అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.అనురాధ, డా.అరుంధతి, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, కళాశాల సీఓఈ ప్రవీణ్కుమార్, అకడమిక్ కో ఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి, అటానమస్ కో ఆర్డినేటర్ డా.సులేమాన్, జబీన్ పాల్గొన్నారు. -
తిరిగి ఇవ్వడంలో జాప్యం
బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ముఖ్యం
● భవనాలు త్వరగా పూర్తి చేయాలి ● హైకోర్టు న్యాయమూర్తి శ్రవణ్కుమార్ పాలమూరు: బండమీదిపల్లిలో జరుగుతున్న నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి ఎన్వీ శ్రవణ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలతతో కలిసి శనివారం మధ్యాహ్నం నూతన కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులతో పనుల పురోగతిపై మాస్టర్ ప్లాన్ పరిశీలించి పనుల నాణ్యతపై ఆరా తీశారు. కోర్టు భవనాలు, పార్కింగ్, న్యాయమూర్తుల క్వార్టర్స్, కోర్టు చుట్టూ వచ్చే ప్రహరీ ఇతర పనులపై ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రధానంగా కోర్టు నిర్మాణ పనుల్లో చాలా నాణ్యత పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు. స్లాబ్ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత మరోసారి పరిశీలిస్తానని పేర్కొననఆరు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వి.శారదా దేవి, పి.ఆంజనేయులు, మహ్మద్ ఆఫ్రోజ్ అక్తర్, రాజా రాజేశ్వరి,ఈశ్వరయ్య, రాధిక కోర్టు అధికారులు పాల్గొన్నారు. -
చేయూత నిలిచేనా..?
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): చేయూత పింఛన్ల లబ్ధిదారుల లెక్క ఇంకా తేలడం లేదు. కొంతమంది లబ్ధిదారుల ఆచూకీ లేకపోవడంతో వివరాలు ఎలా నమోదు చేయాలలో అధికారులు సతమతం అవుతున్నారు. లబ్ధిదారుల ధ్రువీకరణకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎస్ఆర్ఎస్) సిబ్బందికి సవాల్గా మారింది. జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు అన్వేషిస్తున్నారు. జిల్లాలో మొత్తం 96,343 మంది చేయూత లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు 33,646, వితంతులు 41,224, దివ్యాంగులు 12,960, గీత కార్మికులు 990, చేనేత 882, బీడీకార్మికులు 2,085, ఒంటరి మహిళలు 4,556 లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.23,92,56,688 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో 76,778 లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు నమోదు అవుతుండగా.. 19,565 మంది లబ్ధిదారులు పోస్టాఫీస్ అకౌంట్ ద్వారా పింఛన్ తీసుకుంటన్నారు. దీంతో వీరికి సంబంధించిన ఎస్ఆర్ఎస్ ప్రక్రియ నిర్వహించగా.. 1,246 మంది లబ్ధిదారులు చనిపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 15,082 మంది ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో పొందుపరిచారు. ఇంకా 3,608 మంది ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇందులో 935 మంది లబ్ధిదారుల లెక్క తేలాల్సి ఉంది. కొందరు అందుబాటులో లేకపోవడం, ఆధార్ కార్డుల సీడింగ్ సమాచారం పొంతన లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉండడం, వీరిని గుర్తింపు సమస్యగా మారడం లాంటి వివిధ కారణాలతో ఫేస్ రికగ్నిషన్ లెక్క కొలిక్కి రాలేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ పక్రియను త్వరితగతిన పూర్తి చేస్తాం. మున్సిపాలిటీల్లో ఆసరా, చేయూత పథకం లబ్ధిదారుల రికగ్నిషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తాం. కొద్ది శాతం మిగిలింది. వివిధ కారణాలతో ఫేషియల్ రికగ్నిషన్ జరగని వారిని గుర్తించి సమగ్ర వివరాలు యాప్లో పొందుపరుస్తాం. – నర్సిములు, డీఆర్డీఓ ఇంకా తేలని పింఛన్ లబ్ధిదారుల లెక్క సవాల్గా మారిన ‘ఫేస్ రికగ్నిషన్’ సవాల్.. సతమతమవుతున్న యంత్రాంగం దొరకని 935 మంది లబ్ధిదారుల వివరాలు -
‘దామిని’తో పసిగట్టు
●కల్వకుర్తి టౌన్: ప్రకృతి వైపరీత్యాలతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలతో పాటుగా పిడుగుపాట్లతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతూ ఉంటాయి. వర్షా కాలానికి ముందే వేసవికాలంలో వచ్చే అకస్మాత్తు వర్షాలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ప్రతిఏటా పిడుగులు పడి ఎక్కువ సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడటమే గాక, ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పిడుగుపాటుపై పలు పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ అధికారులు పిడుగుపాటును ముందే పసిగట్టగలిగితే ప్రాణాలను కాపాడుకునేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్ను రూపకల్పన చేసింది. దీనిపై అవగాహన పెంచుకోని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. డౌన్లోడ్ చేసుకోండిలా.. ప్రతి పౌరుడు మొబైల్ఫోన్లో ప్లే స్టోర్ నుంచి దామిని అని టైప్చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను ప్రారంభించాక మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ను వాడుతున్న సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశాలు ఉన్నాయో లేదో మూడు రంగుల గుర్తులను కలర్ల కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరు ఉన్న చోట పిడుగుపడే అవకాశం ఉంటే ముందే హెచ్చరిస్తుంది. రెడ్ కలర్: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉందని ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది. ఎల్లో కలర్: మరో 10– 15 నిమిషాలలో పిడుగుపడే అవకాశం ఉంటే యాప్లోని మీరు ఉన్న ప్రాంతం సర్కిల్ ఎల్లో కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్: మరో 18– 25 నిమిషాలలో మీరు ఉన్న ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందని, ఆ ప్రాంతం సర్కిల్ బ్లూ కలర్లోకి మారుతుంది. జాగ్రత్తలు పాటిస్తే... ● నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాలు లేకపోతే తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి. ● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంట పొలాల్లో మొబైల్ వాడకూడదు. మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. ● విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు (విద్యుత్ స్తంభాలు, సెల్ఫోన్ టవర్లు, బోర్ పంపుసెట్ల) దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించరాదు. ● పాడి పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి. ● వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాప్ ఉపయోగకరం వాతావరణంలో మార్పులను పసిగట్టి పిడుగుపడే అవకాశాన్ని తెలిపే దామిని యాప్ ప్రజలతో పాటుగా ముఖ్యంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాప్ని వినియోగించటం వలన పిడుగుపడే విషయాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. – జనార్ధన్ రెడ్డి, ఆర్డీఓ, కల్వకుర్తి పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికలు చేస్తున్న యాప్ జాగ్రత్తలు పాటిస్తే నుంచి బయటపడే అవకాశం అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాలను కోల్పోతున్న ప్రజలు -
పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం
హన్వాడ: పాలమూరు జిల్లా జలవనరుల పరిరక్షణకు దశాబ్దాలుగా నలుగుతున్నా.. పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన భారీ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్నును జేఏసీ నాయకులు హన్వాడలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయాలకతీతంగా జిల్లా ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విస్తారమైన కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 300 కి.మీ. మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి కష్టాలు తప్పకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. 1983లో ప్రారంభించిన కల్వకుర్తి ఎత్తిపోతలు నేటికీ అసంపూర్తిగానే ఉందని, పాలమూరు–రంగారెడ్డి, జూరాల, భీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యామని విమర్శించారు. అలాగే ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక అక్రమంగా నీటిని ఆపేస్తున్నా.. అడిగే నాథుడు కరవయ్యారన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రిజర్వాయర్లలో నీటిని నింపితే వలసలు ఆగిపోతాయన్నారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం ఈనెల 19న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి జలసాధన పోరాటాన్ని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు. -
‘సీ్త్ర’నిధులు గోల్మాల్
ధన్వాడ: మహిళా స్వయం సహాయక సంఘాలలో ఇటీవల కాలంలో పలు రకాల ఆర్థిక మోసాలు, నిధుల దుర్వినియోగం వెలుగుచూస్తున్నాయి. నిరక్షరాస్యత, అవగాహన లోప మరియు నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. సీ్త్రనిధి నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రెగ్యులర్గా తిరిగి చెల్లిస్తుంటే.. మధ్యలో వీఓఏలు, సీసీలు వాటిని వాడుకొని తినేస్తున్నారు. అంతా తెలిసిన అధికారులు వారినుంచి రికవరీ చేయకుండా మహిళా సంఘాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాటికి వడ్డీ, చక్రవడ్డి వేస్తూ చెల్లించాలని లేకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ● మండల కేంద్రంలోని మానికేశ్వరి మహిళా సంఘం 26 నవంబర్ 2018లో ఇద్దరు మహిళలు రూ.50వేలు, ఐదుగురు మహిళలు రూ.25వేయిల చొప్పున్న రూ.2.50లక్షలను సీ్త్రనిధి కింద వడ్డీకి తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతినెలా బ్యాంకులో చెల్లిస్తూ వస్తున్నారు. ఐకేపీ సిబ్బంది వారిని బ్యాంకులో కట్టొద్దు మాకు లెక్క సరిగా రావడంలేదు.. మీరు ఐకేపీ వీఓఏల వద్ద డబ్బులను కట్టాలని సీసీ కుర్మన్న తెలియజేయడంతో అప్పటినుంచి బాలరాం అనే వీఓఏతో డబ్బులను కడుతూ వచ్చారు. ఇలా రెండేళ్లు వీఓఏతో డబ్బులను కట్టారు. వారు కట్టాల్సిన ఈఎంఐ 20జూన్ 2022లో పూర్తయింది. కొత్తగా లోన్ కోసం వెళ్లగా.. ఐకేపీ సిబ్బంది మీరు లోన్ పూర్తిస్థాయిలో కట్టలేదు.. ఇంకా రెండేళ్లకు చెందిన రూ.50వేలు కట్టాల్సి ఉందని చెప్పడంతో మహిళలు అశ్చర్యపోయి వారు కట్టిన పూర్తి రసీదులను అధికారుల ముందు ఉంచారు. అందులో బ్యాంకులో కట్టిన రసీదుల వరకు క్లియర్గా ఉండగా.. వీఓఏతో కట్టిన డబ్బులు బ్యాంకులో జమ కాలేదని తేలింది. అప్పటికే వీఓఏ మోసాలు చేశాడని అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. వారు కట్టాల్సిన రూ50వేలకు వడ్డీ, చక్రవడ్డి వేసి ఇప్పుడు రూ.92వేలు కట్టాలని.. వీఓఏ మోసం చేసిన డబ్బులను కట్టాలని మహిళా సంఘాలపై సీ్త్రనిధి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీసం వాటిలో ఆసలు మాత్రమే తీసుకొని వడ్డీ అయినా.. తగ్గించండని నెత్తినోరు మోత్తుకున్నా.. అధికారులు స్పందించలేదు. ఇందులో వన్టైం సెటిల్మెంట్ లాంటివి అవకాశం ఉండదని.. పూర్తిగా డబ్బులను కట్టాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. చేసేది లేక మహిళా సంఘాల వారు తమ పొదుపు నుంచి డబ్బులను విత్డ్రా చేసి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. రూ.25వేలు తీసుకున్నారు నేను 2018లో రూ.25వేలు సీ్త్రనిధి కింద రుణం తీసుకున్నా.. ప్రతిరోజు బీడీ కూలీ పనిచేస్తూ వాటిని క్రమం తప్పుకుండా కట్టుకుంటూ వచ్చా. ఇప్పుడు ఐకేపీ అధికారులు డబ్బులు కట్టలేదని.. వడ్డీతోపాటు చెల్లించాలని మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కట్టిన డబ్బులు పోగా ఇంకా రూ.25వేలు చెల్లించాలని లేదంటే ఎలాంటి రుణాలు రావని రోజురోజుకు వడ్డీ పెరుగుతుందని చెబుతున్నారు. – బుదారపు మణెమ్మ, ధన్వాడ రెగ్యూలర్గా కట్టాను సీ్త్రనిధి నుంచి తీసుకున్న రుణానికి ప్రతినెల బ్యాంకులో చెల్లిస్తుంటే ఐకేపీ అధికారులు తమకు లెక్క సరిగ్గా రావడలేదు.. మీకు కేటాయించి వీఓఏతో కట్టండని చెప్పారు. మధ్యలో కరోనా రావడంతో ప్రతినెల అతనికి ఇచ్చి రసీదులు తీసుకున్నాం. ఇప్పుడు ఆ రసీదులు పనిచేయవు.. మీరు కట్టాల్సిన డబ్బులు వీఓఏకు ఎందుకిచ్చారు. వీఓఏ కట్టకపోతే మీదే బాధ్యత ఇప్పుడు వడ్డీతో కట్టాల్సిందే లేకుండా రుణాలు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. – గాయిత్రి, ధన్వాడ డబ్బులు కట్టాల్సిందే.. సీ్త్రనిధి నుంచి డబ్బులు తీసుకున్నవారు సీ్త్రనిధి అంకౌట్లోనే డబ్బులు జమ చేయాలని.. అలాకాకుండా సిబ్బంది చెప్పారని వీఓఏలకు అందజేసి వారు కట్టకపోతే మహిళ సంఘాలదే బాధ్యత. వడ్డీ తగ్గింపులాంటి అవకాశాలు ఇందులో ఉండవు. వారు డబ్బులు కట్టాల్సిందే.. – తిరుపతయ్య, ఆర్ఎం, సీ్త్రనిధి చెల్లింపులో వీఏఓల చేతివాటం మహిళా సంఘాలకు ఇబ్బందులు డబ్బులు కట్టినవారికి సైతం నోటీసులు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులు -
ప్రాణమిచ్చినా తక్కువే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘2006 జూలై 4.. నేను గెలిచిన గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. ఆ రోజు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహా వృక్షమైంది. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నిలిపింది. ఈ స్థాయికి ఎదిగానంటే మీరే కారణం. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. మీకు ప్రాణమిచ్చినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయత కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం ముందుగా అప్పటి ఉమ్మడి మిడ్జిల్ పరిధి, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆనాటి మిడ్జిల్ మండల పెద్దలు, నాయకులు, ఆత్మీయులు సుమారు 150 మందిని ఆత్మీయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిడ్జిల్ సమీపంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పెద్దఎత్తున సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.. ఈ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి దత్తత తీసుకోవాలి అభివృద్ధి చెందినప్రాంతంగా ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టాలి.. ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి సహకారం అందించాలి.. కృతజ్ఞతసభలో సీఎం రేవంత్రెడ్డి రూ.47.08 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
పట్టా భూమి అక్రమ నమోదుపై కలెక్టర్ సీరియస్
కందనూలు: అచ్చంపేట మండలం హాజీపూర్కు చెందిన రైతు జంచుక మసన్న జీవించి ఉండగానే.. ఆయన మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సీరియస్ అయ్యారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయి విచారణ చేపట్టిన కలెక్టర్.. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్గా పనిచేస్తున్న మూడావత్ జైపాల్ను విధుల నుంచి తొలగించి.. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించి.. ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా (డిప్యుటేషన్)పై పనిచేస్తున్న ఎ.అశోక్కుమార్పై సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ నిర్లక్ష్యం కారణంగానే జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపిస్తూ.. రికార్డుల్లో మార్పులు జరిగాయని.. ఫలితంగా రైతు పట్టాదారు భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిగా నమోదై రైతు హక్కులకు తీవ్ర భంగం కలిగిందని విచారణలో వెల్లడైంది. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీటీపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోక్సో కేసులో యువకుడు రిమాండ్ గద్వాల క్రైం: బాలికను అపహరించిన ఘటనలో ఓ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గద్వాల మండలానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన అద్భుతకుమార్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ప్రేమ పేరుతో నమ్మించి అపహరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి.. గద్వాల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ● డిప్యూటీ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు ● భూభారతి ఆపరేటర్పై కేసు నమోదు -
పలకరింత.. పులకింత
జడ్చర్ల/మిడ్జిల్: మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద తన గెలుపునకు సహకరించిన వారిని ఆయన కలుసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి పేరు పేరున పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమను పేరు పెట్టి పిలవడంతో సంబ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. -
నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతి
అమ్రాబాద్: నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్ మండలం మాదవానిపల్లికి చెందిన ఎస్జీటీ గాజుల మోహన్ (26) ఇదే మండలంలోని కల్ములోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం లక్ష్మాపూర్ (బీకే)లో జరిగే బంధువు వివాహానికి వెళ్లారు. అందరితో కలిసి ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి సంపులో పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని సంపులో నుంచి బయటికి తీసి.. ప్రైవేటు వాహనంలో అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సంేపులో పడే సమయంలో తలకు బలమైన గాయమై అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య అఖిల, తల్లిదండ్రులు సుగుణమ్మ, చెన్నకిష్టయ్య ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. ఎంఈఓ బాలకిషన్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి వనపర్తి రూరల్: ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ వివరాల ప్రకారం.. మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన చనమోని శ్రీనివాసులు(46) శనివారం బైక్పై పెబ్బేరుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బునాదిపురం గ్రామ శివారులోని కోళ్ల షెడ్డు వద్ద ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి అచ్చంపేట రూరల్: ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని బొమ్మనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొర్రతండాకు చెందిన సిద్దూ (19) కూలీ పనుల నిమిత్తం బొమ్మనపల్లిలో ఓ ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య గద్వాల క్రైం: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాల మండలం కుర్వపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ వివరాల మేరకు.. కుర్వపల్లికి చెందిన కుర్వ గోపాల్(40) పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం తెలిసిన వ్యక్తుల వద్ద కొంత అప్పు చేశాడు. అయితే అప్పులు చెల్లించే దారిలేక మనస్తాపానికి గురైన అతడు.. వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాజీవ్గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ‘పేట’వాసి
నారాయణపేట రూరల్: అరుణాచల్ప్రదేశ్లోని రాజీవ్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడుమల్గిద్దకు చెందిన ప్రొఫెసర్ శివరాజ్ను ని యమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఏబీవీపీ జాతీయ మాజీ నా యకుడు అయ్యప్ప అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. నిర్వహించిన బాధ్యతలు ఓయూలో ముఖ్యపరిపాలన బాధ్యతలు, పీజీఆర్ఆర్ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, అభివృద్ధి, యూ జీసీ వ్యవహారాల డీన్, సైన్స్ ఫ్యాకల్టీ డీన్, యూ జీసీ యూపీఈ కార్యక్రమ సమన్వయకర్త, డీఎస్టీ పర్స్ కార్యక్రమ సమన్వయకర్త, పీయూ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలి
● రాజ్యాంగం ప్రజల చేతిలో ఉండాలి ● ప్రొఫెసర్ జి.హరగోపాల్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఫాసిజం నుంచి అందరూ బయటపడాలని, ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందోననే భయాందోళన చాలా మందిలో నెలకొందని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దన్నారు. అందరికీ విద్య సమంగా అందాలని, మానవీయ సమాజం కావాలని, ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ‘ఎస్ఐఆర్ నేపథ్యం, ప్రత్యేకతలు, పర్యవసానాలు’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కులను కాపాడాలని, రాజ్యాంగం సంపన్న వర్గాల వద్ద కాకుండా ప్రజల చేతిలో ఉండాలన్నారు. ప్రపంచీకరణ పేరుతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా ప్రజల సంక్షేమాన్ని పాలకులు గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం కేంద్రీకృతం కావొద్దని దీనివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. దేశ భవిష్యత్ కోసం ఆర్థిక విధానాలు మారాలని, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో ఎస్ఐఆర్ సంబంధమే లేదన్నారు. వాస్తవానికి పాలకులను ఓటరు ఎన్నుకోవాలి..అలాంటిది ఓటర్లను పాలకులే మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డా.పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. దీని పేరిట సమాజంలోని కొన్ని వర్గాల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరలతో పాటు కూలీలు, యువతకు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వీటిని పక్కనబెట్టి కేవలం ‘సర్’పై దృష్టి పెట్టడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు ఎస్.జగపతిరావు, ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, సభ్యులు నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్రెడ్డి, ఎ.తిమ్మప్ప, న్యాయవాది బెక్కం జనార్దన్, పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధులు ఎం.రాఘవాచారి, హనీఫ్అహ్మద్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఉండవెల్లి: తాళం వేసిన ఇంట్లో బంగారు, వెండి ఆ భరణాలు చోరీ జరిగిన ఘ టన మండలంలోని పుల్లూరు గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపిన వివరాలు.. కర్నూ లు జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన శ్రీనివాసు లు ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగం చేస్తూ పుల్లూ రు శివారులో కుటుంబంతో కలిసి నివాస ముంటున్నారు. ఈ నెల 1న శ్రీనివాసులు అత్త గారి దినకార్యాలకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కు వెళ్లి 2వ తేదీ రాత్రి ఇంటికి వ చ్చి చూడగా వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో పాటు 4 తులాల బంగారు, 6 తు లాల వెండి తదితర వస్తువులు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం ఉండవెల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా శుక్రవారం సీఐ ప్రదీప్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,769
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,769, కనిష్టంగా రూ.2,279 ధరలు లభిచాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,470, కనిష్టంగా రూ.2,372, పొద్దుతిరుగుడు రూ.5,866 ధరలు లభించాయి. గద్వాల మార్కెట్ యార్డుకు 1,400 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,832, కనిష్టంగా రూ.2,639, సరాసరిగా రూ.5,900 ధరలు లభించాయి. అలాగే కంది క్వింటా సరాసరిగా రూ.6,251 పలికింది. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వస్తుంది. శుక్రవారం ప్రాజెక్టుకు కేవలం 223 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 38 క్యూసెక్కులు ఆవిరైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.511 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. -
ఇష్టానుసారంగా యూరియూ విక్రయాలు
● ఒక్కో బస్తాపై రూ.45 అదనపు వసూలు ● డబ్బులు చెల్లించిన రశీదు ఇవ్వని యజమాని తిమ్మాజిపేట: మండలంలో పెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఇష్టానుసారంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమ దందాకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా యూరియా రూ. 266.60లకు విక్రయించాల్సి ఉండగా రూ.310లకు అమ్ముతున్నారు. ఒక్కో బస్తాపై అదనంగా రూ.45 వసూలు చేస్తున్నారు. మండలంలోని తుమ్మలకుంట తండాకు చెందిన రైతు వడ్తావత్ హుసేనీ గురువారం ఆన్లైన్లో యూరియూ బుక్ చేసుకున్నాడు. తిమ్మాజిపేటలోని యూరియా సరఫరా చేస్తున్న దుకాణం వద్దకు వెళ్లి మెసేజ్ చూయించి 6 యూరియా బస్తాలకు రూ.1860లకు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు రూ.45 లు ఎందుకు అదనంగా తీసుకుంటున్నావని ప్రశ్నించగా రవాణా చార్జీలు, హమాలీ కూలి ఎవరిస్తారని దుకాణ యజమాని దురుసుగా సమాధానం చెప్పాడు. ఏఓకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి రైతుకు వేసినట్లు సమాచారం. ఎరువుల దుకాణాన్ని సీజ్ చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా విక్రయించాలి. అధిక ధరలు వసూలు చేస్తే ఎరువుల దుకాణాన్ని సీజ్ చేస్తామని ఏఓ కమల్కుమార్ హెచ్చరించారు. తిమ్మాజిపేటలో దుకాణందారులు అధిక ధరలు తీసుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చింది. తనిఖీ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. -
కొత్తగా 5,016 మందికి రైతు భరోసా
● జూన్ 15 నాటికి పాస్ పుస్తకాలు పొందిన వారికి అవకాశం ● దరఖాస్తుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు మహబూబ్నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈఓలకు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 5,016 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు జూన్ 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయ అధికారులు వాట్సాఫ్ గ్రూపుల్లో, స్టేటస్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. జిల్లాలో వానాకాలం రైతు భరోసా కోసం మొత్తం 2,63,019 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రూ.263.19 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. -
మీసేవలో డిజిటల్ విధానం
● మీసేవ కేంద్రాల్లో రశీదుకు స్వస్తి ● దరఖాస్తుదారుడి ఫోన్కి హైపర్ లింక్ ● మెసేజ్ డిలీట్ అయితే తిరిగి పంపించే వెసులుబాటు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/కల్వకుర్తి టౌన్: రెవెన్యూ కార్యాలయంలో కుల, ఆదాయ, నివాస, తదితర సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్వాహకులు సంబంధిత రశీదు ఇస్తారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ కావడంతో ఇక రశీదులు కనుమరుగు కానున్నాయి. గతంలో రశీదులు పోతే సంబంధిత ధ్రువపత్రాలు పొందేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఆన్లైన్ కావడంతో రశీదు స్థానంలో దరఖాస్తుదారుల ఫోన్నంబర్కు మెసేజ్ రూపంలో సంబంధిత సేవ వివరాలను పంపించనున్నారు. దాని ద్వారానే దరఖాస్తుదారుడు అతను పొందే సేవ వివరాలను చూసుకోవచ్చు. మొబైల్కు రశీదు లింకు మీ సేవలో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తుదారుడికి ఒక మెసేజ్ వస్తుంది. అందరూ అప్లికేషన్ నంబరు, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ వస్తుంది. దరఖాస్తుదారులు ఆ లింకుపై క్లిక్ చేసి వారి అక్నొలడ్జిమెంట్ రసీదును ఎప్పుడైనా చూసుకోవచ్చు లేదా డౌన్ లోడ్, ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చేవరకు ఈ మెసేజ్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు మీసేవ కేంద్రాలకు నూతనంగా వచ్చిన నిబంధన ప్రకారం మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి ఖచ్చితమైన, యాక్టివ్లో ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రసీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి పాత పద్ధతిలోని కాగిత రసీదులు జారీ చేస్తే సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని మీసేవ కేంద్రాల అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని విభాగాలు విస్తరించేలా.. ఆన్ లైన్ లో మీసేవ ద్వారా అందించే సేవలను కేవలం రెవెన్యూ శాఖలో మాత్రమే పేపర్ లెస్ సేవలను అందిస్తున్నారు. మీ సేవలో ముఖ్యంగా మున్సిపల్, పోలీసు ఇతర విభాగాలలో అందించే సేవలకు సంబంధించి వాటిని కూడా పేపర్ లెస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధా నం అమలు చేస్తున్నాం. దీనికి సంబం ధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీసేవ కేంద్రాల్లో పేపర్ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. – చంద్రశేఖర్, ఈడీఎం మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్ లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెం డింగ్లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్ లెస్ సేవలతో ఆ పరిస్థితి ఉండదు. – షేక్ రఫీ సిరాజ్, తెలంగాణ మీసేవ ఫెడరేసన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలోని మీసేవ కేంద్రాలలో ప్రజలు పొందే సేవలకు గాను ఇచ్చే రసీదులకు స్వస్తి చెప్పి పూర్తిగా డిజిటల్ రూపంలో వారికి అందించే సేవలు పక్కాగా అమలు చేయాలని సూచించాం. పేపర్ లెస్ విధానంలో భాగంగా ప్రజలు మీ సేవలో దరఖాస్తు చేసుకోగానే వారి మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో సందేశం వస్తుంది దాని ద్వారానే వారి యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. – అమరేందర్, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ -
18న ఎన్ఐ యాక్ట్పై లోక్ అదాలత్
పాలమూరు: జిల్లాలో ఈనెల 18న జిల్లా కోర్టు ఆవరణలో ఎన్ఐ యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కేసులలో ఉన్న కక్షిదారులు, చిట్ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఈడీఎక్స్ సదస్సుకు ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నోయిడాలో ఈనెల 4న టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. వేతనాల పెంపునకు పోరుబాట మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలంటూ ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పోరుబాట పడుతున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ చెప్పారు. దీనికి సంబంధించి శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.రంగా అజ్మీరాకు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు పారదర్శకంగా లేవన్నారు. ఈ కార్మికుల వేతన చెల్లింపుల్లో అనేక అవినీతి అక్రమాటు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆస్పత్రి పడకల సామర్థ్యానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలన్నారు. ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 7, 8న ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టనున్నామన్నారు. అలాగే 9న చలో హైదరాబాద్ పేరిట కోఠిలోని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.చెన్నయ్య, ఎస్.దేవానంద్, రంగన్న, భీమన్న, శ్రీనివాస్రెడ్డి, జగ్గానాయక్, సాయిప్రకాష్, లక్ష్మి, నరేష్ పాల్గొన్నారు. జూపల్లి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం కందనూలు/ లింగాల: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉన్నామని ఎంపీ మల్లురవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసిందని, వీటికి తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6.800 కోట్ల వడ్డీ కడుతుందని పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమ సవాల్ను స్వీకరించే దమ్ము లేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అది చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం మానుకోవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. -
సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, డీఐజీ
మిడ్జిల్: మండలకేంద్రంలో శనివారం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జోగుళాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్పీ జానకితో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సకాలంలో పూర్తి చేయండి.. సీఎం సభకు సంబంధించి ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటు స్థలం, హెలిప్యాడ్ పనులు, సభ ప్రాంగణంలో ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ మహేస్, తదితరులు ఉన్నారు. -
వేతనాల సంబురం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు -
పెళ్లి పత్రికలు పంచుతూ వరుడు అదృశ్యం
నవాబుపేట: మరో మూ డు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న వరుడు అకస్మాత్తు గా అదృశ్యమయ్యా డు. ఫలితంగా పెళ్లి ఇంట్లో ఆందోళన మొదలైంది. వరుడి కోసం 24గంటలపాటు వే చిచూసిన కుటుంబ సభ్యులు చివరికి శుక్రవా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని లోకిరేవుకు చెందిన రఘురాంగౌడ్కు హైదరాబాద్కు చెందిన యువతితో ఈనెల 5వ తేదీన పెళ్లి నిశ్చయించారు. దీనికిగాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం వరుడు రఘురాం ఇంటిముందు పెళ్లి పందిరి వేయా ల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన పెళ్లి పత్రికలు ఇచ్చి తన మిత్రులు, బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు జడ్చర్ల వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగా, అదేరో జు మధ్యాహ్నం నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువుల చెంత వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికొడుకు అదృశ్యంతో ఇటు వరుడు, అటు వధువు కుటుంబ సభ్యు ల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వరుడి సోద రుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. యువకుడి అనుమానాస్పద మృతి ఊట్కూర్: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్వీధిలో శంకర్(25) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన రోషనప్ప, పద్మమ్మ కుమారుడు శంకర్ నారాయణపేటలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తుండేవాడు. సాయంత్రం ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడిని తండ్రి నిద్రలేపగా అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి తండ్రి రోషినప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. అల్లుడి దాడి ఘటనలో మామ మృతి కేటీదొడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడి వరుసైన వ్యక్తి దాడి చేసిన ఘటనలో గాయపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మల్లాపురం తండాకు చెందిన మూడావత్ రాజునాయక్ (45) అల్లుడి వరుసైన పాండునాయక్ ఈ నెల 2న మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రాజునాయక్ తల, పొత్తికడుపుపై బలంగా దాడి చేశాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున మూత్రం రాకుండా ఇబ్బందులు పడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజునాయక్ మృతి చెందాడు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తామని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ కేజీబీవీలో విద్యార్థులకు అవసరమైన పరికరాలను కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్ కింద 25 లీటర్ల సామర్థ్యం గల మూడు వేడినీటి గీజర్లు, 15 కిలోల సామర్థ్యం గల రోటీ మేకింగ్ మిషన్, 16 కిలోల స్టీల్ కుక్కర్, 20 లీటర్ల సామర్థ్యం గల 8 కూల్ వాటర్ క్యాన్లను శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్వీఎస్ ఆస్పత్రి సహకారంతో మౌలిక సదుపాయాలు సమకూర్చుతున్నామన్నారు. ఉచిత వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ విద్యతో పాటు నీట్, ఎంసెట్ వంటి వాటికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డీఈఓ విజయకుమారి, జీసీడీఓ అస్త్రాఖాద్రీ, ఎస్ఓ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ సేవలు అభినందనీయం
ఉప్పునుంతల: రుణాలు అందజేయడమే కాకుండా విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు సంఘ సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తున్న ఉప్పునుంతల పీఏసీఎస్ సేవలు అభినందనీయమని తెలంగాణ సహకార శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం ఉప్పు నుంతల పీఏసీఎస్లో నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వాటిలో 311 సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ)గా ఎంపికై నట్లు తెలిపారు. వాటిలో నాగర్కర్నూల్ జిల్లాలో 16 సంఘాలు ఎఫ్పీఓకు ఎంపిక కాగా ఉప్పునుంతల పీఏసీఎస్ మొదటి స్థానంలో నిలువగా ప్రశంసించారు. కొత్తగా వేరుశెనగ డికార్టికేటర్ ఏర్పాటుచేయడం, వెయిట్ బ్రిడ్జి, డ్రోన్ సేవలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ పంట రుణాలతోపాటు ధీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ రైతుల సంక్షేమానికి వినూత్న సేవలు అందిస్తున్న ఉప్పునుంతల సహకార సంఘ పాలకవర్గం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నాగర్కర్నూల్ డీసీఓ రఘునాథ్ మాట్లాడుతూ..ఎఫ్పీఓల ద్వార రైతులకు అందే ప్రయోజనాలు, ఇతర సేవల ను వివరించారు. బిజినెస్ డెవలఫ్మెంట్ ప్లాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేరుశెనగ డికార్టికేటర్ వినియోగంతో రైతులకు కలిగే ప్రయోజనాలు, విలువ ఆధారిత సేవలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు వారు పీఏఎస్ ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమలంలో జిల్లా సంయుక్త రిజిస్ట్రార్ శ్రీమతి పరిమిళ, సూపరింటెండెంట్ మధురావు, పీఏసీఎస్ చైర్మన్ మడ్డు నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్ సత్తు భూపాల్రావు, సంఘ డైరెక్టర్లు సాయిబాబు, నారాయణ్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఈసీ డిజిటల్ అస్త్రం!
● ఓటర్ల జాబితా సవరణలో కీలకంగా యాప్ ● బీఎల్ఓల యాప్లో మాడ్యూళ్లతో పారదర్శకత ● సర్వే వివరాలు, మ్యాపింగ్ అంతా ఆన్లైన్లోనే.. అచ్చంపేట: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపకల్పన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కొనసాగుతుంది. ఈ క్రమంలో లోటుపాట్లు ఎదరుకాకుండా ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను జోడించింది. ఇందుకోసం ఇంటింటా వివరాలు సేకరించే బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ)ల కోసం యాప్లోని ఎసినెట్ ఆప్టికేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఫీ–డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాప్ట్ మాడ్యూళ్లను చేర్చారు. వారు.. ప్రత్యేకం.. బీఎల్ఓలు ఓటరు ఇంటికి ఓ సారి వెళ్లినప్పుడు లేకపోతే మరో రెండు సార్లు వెళ్లాలి. అయినప్పటికీ అందుబాటులో లేకపోయినా, ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, ఫారంపై సంతకం చేయడానికి నిరాకరించినా ప్రత్యేకంగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించిన వివరాలను 150 అక్షరాల్లో రాసి ఫారాన్ని యాప్లో అప్లోడ్ చేసి మార్క్ అన్కలెక్టబుల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. పొరపాట్లు జరగకుండా.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం యాప్లో ప్రత్యేక ఫీచర్లు చేర్చారు. ఓటరు పేరు, బంధుత్వాల పేర్లలో తప్పులు ఉంటే (గత ఓటరు లిస్ట్తో తండ్రి పేరు సరిపోకపోతే) యాప్ చూపిస్తుంది. దీంతో ఆధారాలను బీఎల్ఓలు అప్లోడ్ చేయడమే కాక, అభ్యంతరాలపై విచారణ నోటీసులకు ఇచ్చిన రసీదులను కూడా నమోదు చేయాలి. విచారణ సమయాన గ్రూప్ ఫొటో, అటెండెన్స్ షీట్ను సైతం లైవ్లో అప్లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులోని పాత ఫొటో స్పష్టంగా లేకపోతే కొత్త ఫొటోను యాప్ ద్వారా పరిశీలించి అప్డేట్ చేయొచ్చు. ఇక 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అనుమానాస్పద ఇళ్లల్లో లేని, ఇళ్లు మారిన, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరొసారి పక్కాగా నిర్ధారించుకునే సదుపాయం బీఎల్ఓలకు యాప్ ద్వారా కల్పించారు. ఒకే క్లిక్తో అధికారుల డైరెక్టరీ క్షేత్రస్థాయిలో తిరిగే బీఎల్ఓలకు ఏలాంటి అత్యవసర సాయం కావాలన్నా.. ఉన్నతాధికారులను సంప్రదించాలన్నా ఎసినెట్ యాప్లోనే ప్రత్యేక కాంటాక్ట్ డైరెక్టరీని పొందుపరిచారు. ఇందులో సీఈఓ, డీఈఓ, ఈఆర్ఓ, ఆర్ఓ, ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలతో బీఎల్ఓలు చేపట్టే ప్రక్రియలు సులభంగా మారాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రస్థాయి సబ్జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
జడ్చర్ల టౌన్: రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలికల ఫుట్బాల్ చాంపియన్షిప్కు మండలంలోని కొడ్గల్ సమీపంలో ఉన్న నచికేత విద్యామందిర్కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్ మోహన్ తెలిపారు. శుక్రవారం నుంచి నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొ నే ఉమ్మడి జిల్లా జట్టుకు సాయిప్రియ, శ్రీవల్లి, శ్రీవర్షిణి, అక్షిత, అక్షర, సంజన, పూజిత, అంబికాశ్రీ, ప్రేక్ష, హర్షవర్దిని ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు విద్యార్థినులను గురువారం పాఠశాల ఆవరణలో అభినందించి నిజామాబాద్కు పంపించారు. కార్యక్రమంలో పీఈటీ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ పాండు, అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు సూగూరు విద్యార్థి వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని సూగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జి.శారద రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీ లకు ఎంపికై ందని హెచ్ఎం ఆర్.వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ బాలికల క్రీడల్లో వనపర్తి జట్టు తరఫున శారద పాల్గొంటారని ఆయన తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఈ నెల 01న ఎంపికలు జరగగా.. ప్రతిభ కనబరిచిన శారద అవకాశం దక్కించుకున్నారని పాఠశాల పీడీ ఎండీ షబీర్ తెలిపారు. భారీగా నల్లబెల్లం పట్టివేత బల్మూర్: మండలంలోని బాణాల శివారులోని వ్యవసాయ పొలంలో దాచిన నిషేధిత నల్ల బెల్లం డంపును గురువారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బాణాల గ్రామానికి చెందిన రాజేష్, ధారాసింగ్ తమ పొలంలో అక్రమంగా నల్ల బెల్లం బస్తాలను డంపు చేశారనే సమాచారం మేరకు డీటీఎఫ్ సీఐ రాజేశ్వరి, ఎస్ఐ అరుణ, సిబ్బందితో దాడులు చేశారు. 25 బస్తాలలో 750 కిలోల నల్లబెల్లం పట్టుకొని నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడులలో డీటీఎఫ్, అచ్చంపేట ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. జూరాల డ్యాం వద్ద పవర్ కేబుల్ చోరీ ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సీవేజ్ డ్రెయినేజీ పంపునకు సంబంధించిన పవర్ కేబుళ్లను గురువారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ యాదవ్ రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. -
నీటి పొదుపు చర్యలు పాటించాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంటల సాగులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కళ్యాణి, డాక్టర్ కె.సదయ్య సోమవారం మిడ్జిల్ మండలంలోని వల్లభురావుపల్లి, పస్పుల, రాణిపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సాగులో ఉన్న పత్తి, మొక్కజొన్న, మిరప, వంకాయ, మునగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. నేల తేమను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పంటల పెరుగుదల దశను బట్టి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పచ్చిరొట్ట పంటల సాగు వల్ల భూసారం మెరుగుపడటంతో పాటు భూమిలో సేంద్రియ పదార్థాల శాతం పెరిగి భవిష్యత్లో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరానికి మించి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల వ్యయభారం పెరగడంతో పాటు నేల నాణ్యత దెబ్బతింటుందని, అందువల్ల శాసీ్త్రయ సూచనల మేరకే వాటిని వినియోగించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ గౌర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
వర్షాధారంగా ఆముదం సాగు చేసే హైబ్రీడ్ రకాలు
కొత్తకోట రూరల్: వర్షాదారంగా సాగు చేసే నూనె గింజ పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. వానాకాలంలో జూన్ రెండో వారం నుంచి జూలై చివరి వారం వరకు ఆముదం సాగు చేసుకోవచ్చును. నీరు బాగా పీల్చుకునే ఎర్రనేలలు, నల్లరేగడి, గరపనేలలు ఆము దం సాగుకు అనుకూలమని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి సూచిస్తున్నారు. ఆముదంలో హైబ్రీడు రకాలైతే 2 కిలోలు 4కిలోలు ఎకరాకు విత్తనంగా అవసరం ఉంటుంది. వర్షాదారం ఆముదంలో అంతర పంటలుగా రెండు వరుసలు పెసర, మినుము, పెబ్బె ర్లు, గోరు చిక్కుడు, వేరుశనగ, సాగు చేసుకొని అధిక ఆధాయం పొందవచ్చును. ఆముదంలో కంది పంటను 1–1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చును. నేలలు: నీరు ఇంకే భూములు సాగుకు అనుకూలం. బలమైన భూములలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చును. బీడు నేలలు సాగుకు అనుకూలం కాదు. హైబ్రీడు రకాలను 90 సెం.మీ సాలు సాలుకు మరియు 60 సెం.మీ విత్తనానికి విత్తనానికి మధ్య దూరంలో సాగు చేసుకోవచ్చును. ● కలుపు యాజమాన్యం: ఆముదంలో విత్తనం వేసిన 48గంటల లోపల మందును ఎకరా కు పిచికారి చేసుకోవాలి. ఆముదంలో 45– 60రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ● ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 2–3 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరా కు 25కిలోల నత్రజని 16కిలోల భాస్వరం 15కిలో ల పోటాషి యం ఎరువులను వేసుకోవాలి. ● ఆముదం పంట వయస్సు: 45–50 రోజుల పంట కాలంలో పైరులో లేత ఇగుఉరులను తీసివేయ డం వల్ల పక్క కొ మ్మలు ఎక్కువగా వచ్చి గాళసైజు కాయసైజు ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుంది. ● వర్షాదారంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 2–3 తడులను 10రోజు లకు వ్యవధిలో ఇవ్వడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చును. పాడి–పంట ప్రగతి (పీసీఎస్–262): పంట కాలం 120– 140 రోజులు, స్వల్ప కాలిక రకం అధిక నూనె శాతం కలింగి ఉంటుంది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హరిత (పీసీఎస్–124): పంట కాలం 130– 150 రోజులు, బెట్ట, ఎండు తెగులు తట్టుకుంటి. పీసీహెచ్ (పీసీహెచ్–111): పంట కాలం 120– 140 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది. డీసీహెచ్ (డీసీహెచ్–177): పంట కాలం 130–160 రోజులు, బెట్టను తట్టుకుంటుంది. డీసీహెచ్ (డీసీహెచ్–519): పంట కాలం 130– 160 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐసీహెచ్–66 (ఐసీహెచ్–66): పంట కాలం 130–150 రోజులు, ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదోమ తట్టుకుంటుంది. ఐసీహెచ్–5: పంట కాలం 130–150 రోజులు ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదో మను తట్టుకుంటుంది. అధిక సాంద్రతలో సాగు చేసేటందుకు అనుకూలం. ఐసీహెచ్–6: పంట కాలం 110–140 రోజు లు ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్ల వ్యాధులను తట్టుకుంటుంది. -
వైభవంగా శ్రీచక్ర ప్రాణప్రతిష్ఠ
శృంగేరి శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో మహోత్సవం ● ఐశ్వర్యం, ఆరోగ్యం శాంతిని ప్రసాదించే యంత్రరాజం ● ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవచానాలు అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం మరో విశిష్ట ఘట్టానికి వేదికై ంది. దేవిశక్తి రూపంగా భావించే శ్రీచక్ర యంత్ర ప్రాణప్రతిష్ఠ వేద పండితుల వేదోచ్ఛరణల మధ్య శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి అమృత హస్తాలతో గురువారం సింహలగ్న ముమూర్తంలో ఉదయం 10 గంటలకు వైభవంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతిలో ఈఓ దీప్తిరెడ్డి, ఆలయ అర్చకులు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేత్రపర్వంగా సాగిన క్రతువును వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కిక్కిరిపోయాయి. ఆలయంలో ప్రమఖులు: జోగుళాంబ ఆలయాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రాణి కుముదిని, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, జాయింట్ కలెక్టర్ నర్సింగరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, దేవదాయ శాఖ కమిష్నర్ హనుమంతరావు, డీఎస్పీ మొగిలయ్య, దేవదాయ శాఖ స్థపతి వల్లి నాయగం ఎపిటోమ్ ప్రాజెక్ట్ ఎండీ జైపాల్ కాంత, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి మాట్లాడుతూ.. జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్ర ప్రాణప్రతిష్ఠ జరగడం భక్తుల అదృష్టమన్నారు. శ్రీచక్రం కేవలం యంత్రం కాదని.. అది ఒక దైవశక్తి, విశ్వ శక్తికి ప్రతీక అన్నారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి, దైవ చైతన్యం, మరింతగా వృద్ధి చెందుతాయని, తద్వార భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి సౌభాగ్యం లభిస్తాయన్నారు. శ్రీ చక్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రం, శక్తివంతమైన యంత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. ఇది దేవి సమగ్ర స్వరూపాన్ని సూచిస్తుందని, విశ్వం సృష్టి, స్థితి లయలను ప్రతిబింభిస్తుందని పేర్కొన్నారు. శ్రీచక్ర ఆరాధన ద్వారా భక్తుల మానసిక ప్రశాంతతను శారీరక ఆరోగ్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును పొందగలరని విశ్వసిస్తారన్నారు. -
తారాస్థాయికి ఇసుక వివాదం
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలించే వ్యాపారులపై జిల్లా పోలీసు శాఖ కూపీలాగుతున్నారు. మరోవైపు వ్యాపారుల మధ్య ఘర్షణలకు తావిస్తుంది. మూడురోజుల క్రితం ఓ ఇసుక వ్యాపారి మరో ఇసుక వ్యాపారికి ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై సీఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి గుట్టుగా విచారణ చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకండా ఇసుకను టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే గద్వాల మండలంలో ని ఓ గ్రామానికి చెందిన తాజా యువ సర్పంచ్ అదే గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్కు చెందిన టిప్పర్లు అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నాయని రెవెన్యూ, మైనింగ్, పో లీసు, విజిలెన్స్ అధికారులకు వైరి వర్గంకు చెందిన వ్యాపారి సమాచారం అందజేయండం కారణంగా ఇసుక టిప్పర్ల ను అదుపులోకి తీసుకుంటున్నారని గ్రహించాడు. దీంతో సదరు వ్యాపారితో యువ సర్పంచ్ ఫోన్ లో మాట్లాడారు. ఇక నుంచి అధికారులకు ఫిర్యా దులు చేయడం విరమించుకోవాల్సిందిగా పేర్కొన్నాడు. ముందునుంచి ఇసుక వ్యాపారంలో మీరే ఉన్నారు. ఎప్పుడు ఫిర్యాదులు చేయలేదు. అనవసరంగా సమస్యను సృష్టిస్తున్నా రు. ప్రతినెలా మాములు ఇస్తున్నాం.. నువ్వు ఏం చేసిన వ్యాపా రం చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తారస్థాయిలో వివాదాని కి దారితీసింది. ఈ వ్యాపారంలో నువ్వో.. నేనో చూసుకుందాం.ఏవరో ఒక్కరు మీగులుతారంటూ మాట్లాడిన సంభాషణ పలు సామాజిక మాఽ ద్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా కూపీలాగుతోంది. పోలీసుల విచారణలో.. గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు అక్రమ ఇసుక వ్యాపారులది నేర చరిత్ర ఉన్న నేపథ్యం. ఇరవై ఏళ్లుగా బ్రదర్స్ అక్రమ ఇసుక వ్యాపారంలో పైచేయిగా ఉంది. మంత్రు లు, ఎమ్మెల్యేల అభయహస్తంతోపాటు అధికారులను భయభ్రాంతులకు గురి చేసేవారు. మరో వైపు ప్రజాప్రతినిధుల అండతో బ్రదర్స్ ప్రభుత్వ అనుమతులు పొందినట్లు ఫేక్ అనుమతి పత్రాల తో కొన్నేళ్లు ఇసుకను తరలించారు. ఈ ఘటనపై బ్రదర్స్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్రమ ఇసుక వ్యాపారంలో యువ సర్పంచ్ సైతం కొన్నేళ్లుగా గ్రామంలోని చెరువు నుంచి ఇసుక తరలిస్తూ కొంత ఆర్థికంగా పురోగతి చెంది నేడు తుంగభద్ర నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించే స్థాయికి చేరుకున్నాడు. యువ సర్పంచ్ ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్ల నుంచి తరలించిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. వివిధ వ్యవహారాలపై పోలీసులు రెండు రోజులుగా ఇద్దరి నేర చరిత్రను జిల్లా ఉన్నతధికారులకు నివేదికలను అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫోన్ సంభాషణలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మామూలు ఇచ్చిన వ్యవహారంపై నివేదికలను అందజేసినట్లు తెలుస్తుంది. మూడు రోజల క్రితం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫోన్ సంభాషణపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. అక్రమంగా ఇసుక తరలించే నేరస్తుల పూర్తి సమాచారంపై ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఇద్దరిపై నమోదైన వివిధ కేసులపై విచారణ చేపట్టాం. త్వరలోనే ఇద్దరిని అరెస్టు చేస్తాం. ఇందుల్లో ఏవరి ప్రమేయం ఉన్నా.. ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య, డీఎస్పీ ఇసుకాసురులపై కూపీలాగుతున్న పోలీసు శాఖ బెదిరింపు కాల్స్పై కొన్నసాగుతున్న విచారణ వ్యాపారుల నేర చరిత్రపై వాకాబు -
నూతన అధ్యాయానికి శ్రీకారం
● హాజరైన జడ్జి, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవరకద్రలో కోర్టును వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థాన భవనాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జిలు శ్రావణ్కుమార్, మాధవిదేవి వర్చువల్ విధానంలో ప్రారంభించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్జి ప్రేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోర్టు భవనాన్ని, కోర్టులోని వివిధ విభాగాలను పూజలు చేసి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు దేవరకద్రలో కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని హైకోర్టు జడ్జిలు జస్టీస్ శ్రావణ్కుమార్, జస్టిస్ మాధవిదేవి తెలిపారు. దేవరకద్ర కోర్టును వర్చువల్గా ప్రారంభించిన తరువాత వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల ప్రయత్నంతో దేవరకద్రకు కోర్టు వచ్చిందన్నారు. దేవరకద్ర కోర్టు పరిధిలో అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలకు సంబంధించిన కేసులు విచారణ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కోర్టు సేవలను కక్షిదారులు వినియోగించుకుని సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. దేవరకద్ర చుట్టుపక్కల ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, నిజాం కాలంలో నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక కేంద్రాలైన కురుమూర్తి, మన్యంకొండ ఆలయాలు ఉన్నాయని తెలిపారు. సులభతర న్యాయసేవలే లక్ష్యం ప్రజలకు సులభతర న్యాయసేవలు అందించడమే లక్ష్యమని జిల్లా సెషన్స్ జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. నూతన కోర్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువవుతాయన్నారు. కోర్టు అందుబాటులోకి రావడంతో పెండింగ్ కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సివిల్ కోర్టు ఏర్పాటు కావడం వెనక ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష ఉందని.. అది నేడు సాకారం కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. కోర్టు ప్రారంభంతో ప్రజల ప్రయాణ సమయం ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతాయన్నారు. ప్రజలకు న్యాయం చేరువ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని, నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హర్షద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టానుసారంగా మట్టితవ్వకాలు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్ కట్టకు ఎత్తుకు 15 రెట్ల దూరంలో మట్టి తవ్వకాలు చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికి ఏ అధికారి పట్టించుకోకపోవడంతో మట్టి అవసరమున్న వారంతా కట్టకు సమీపంలో మట్టిని తీసి తరలించుకుపోతున్నారు. రిజర్వాయర్ తూము వద్ద కట్ట అధికారుల లెక్కల ప్రకారం సుమారు 12 మీటర్లు ఉండగా అక్కడి నుంచి కనీసం 200 మీటర్ల దూరంలో మట్టి, ఒండ్రుమట్టిని తీయాల్సి ఉంటుంది. కానీ సుమారు 100 మీటర్ల దూరం నుంచే ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాలకు, కొందరు ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని అనుమతులు లేకుండా తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎక్కడి నుంచి మట్టి తీయాలో కనీసం చెప్పేవారు కూడ లేరని పేర్కొంటున్నారు. ఇలా మట్టి తరలింపుతో రిజర్వాయర్ కట్టకు ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలని కోరుతున్నారు. -
అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి
మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం మిడ్జిల్లో పర్యటిస్తున్న సందర్భంగా మండలకేంద్రంలో జిల్లాస్థాయి అధికారులతో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. బహిరంగసభ, విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్రతి అధికారి చేపట్టాల్సిన బాధ్యతల గురించి అదనపు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్, సభ ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులు వేదిక, గ్యాలరీలు, వీఐపీ వాహనాల ప్రవేశ మార్గం, ప్రజల రాకపోకలకు సంబంధించిన అన్ని పనులు పకడ్బందీగా చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ అఽధికారులు విగ్రహాల ప్రతిష్ఠ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, తహసీల్దార్, మున్సిపాల్ అధికారులు తాగునీరు, గ్రీన్రూమ్ల ఏర్పాట్లు, మరుగుదొడ్ల, పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సభ ప్రాంగణం, పార్కింగ్ దగ్గర లైట్ల ఏర్పాటు, ఆరోగ్యశాఖ అత్యవసర వైద్య సేవలకు కావాల్సిన సౌకర్యాలు, అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి నవాబుపేట: ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిప్రియ సూచించారు. గురువారం ఆమె మండల కేంద్రంతోపాటు లింగంపల్లిలో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారమ్స్ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నవారికి అధికారులు అవగాహన కల్పించి ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. అలాగే మండల అధికారులు, పర్యవేక్షణ విధిగా చేయాలన్నారు. రోజువారీ ప్రక్రియను జిల్లా అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కాస్తా ఆలస్యంగా సాగుతుందని దీన్ని వేగవంతం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ విధులపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సురేష్, మండల, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు. మొదటిరోజు నామినేషన్లు నిల్ అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2872 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,872, కనిష్టంగా రూ.1,839 ధరలు లభించాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,453, కనిష్టంగా రూ.1,988, వేరుశనగ రూ.3,329 ధరలు పలికాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని మార్కెట్కు గురువారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,542, కనిష్టంగా రూ. 3,110, సరాసరి రూ. 6,050 ధరలు పలికాయి. అలాగే 13 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటాకు రూ.1,809, కందులు రూ.6,389 ధర పలికింది. మహబూబ్నగర్ (వ్యవసాయం): దున్నిన దుక్కుల్లో విత్తులు పెట్టాల్సిన రైతులు వాన లేక నెల రోజులుగా ఆకాశానికేసి చూస్తున్నారు. రోహిణి కార్తె చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిపించకుండానే వెళ్లిపోయింది. తర్వాత మృగశిర కార్తె వచ్చినా వాన జాడే లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సీజన్లో జిల్లాలో 4,05,236 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. జూన్ ముగిసే నాటికి 99,440 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. లక్ష్య సాగుతో పోలిస్తే ఇది 24 శాతానికి కూడా చేరలేదు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం పంటల సాగు చేస్తుంటారు. ఇందులో వరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 12,954 ఎకరాల్లో మాత్రమే నారుమడులు సిద్ధమయ్యాయి. అదీ ఎక్కువగా బోర్లు, భూగర్భజలాల ఆధారంగా రైతులు నార్లు పోసిన ప్రాంతాలే. తదుపరి వర్షాలు లేకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ● పత్తి సాగు కొంతమేర ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఈసారి 95 వేల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 67,025 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇటీవల ఎండల తీవ్రతతో మొలక దశలో ఉన్న పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలో జిల్లాలో సగటు వర్షపాతం సాధారణస్థాయిలో నమోదైనప్పటికీ మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉంది. పది మండలాల్లో జూన్ మాసంలో వర్షం లోటు కనిపించింది. జూలై మాసంలో కురిస్తే వర్షాలపైనే ఈ ఏడాది సాగు భవిష్యత్ ఆధారపడి ఉంది. నవాబుపేట, బాలానగర్, దేవరకద్ర, మహమ్మదాబాద్ వంటి మండలాల్లో అధిక వర్షపాతం నమోదవ్వగా.. చిన్నచింతకుంట, హన్వాడ, మూసాపేట, కోయిలకొండ, అడ్డాకుల, మహబూబ్నగర్ రూరల్, అర్బన్, కౌకుంట్ల మండలాల్లో వర్షం లోటు కనిపిస్తోంది. ఈ ప్రభావం నేరుగా పంటల సాగుపై పడింది. ఆరుతడి పంటల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం వంటి పంటలు విత్తేందుకు కనీసం 60–75 మిల్లీమీటర్లకు పైగా వర్షం అవసరమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట విత్తనాలు వేసిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావంతో అవి సరిగా మొలకెత్తకపోవడంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది. సాధారణంగా జూన్ చివరి నాటికి చల్లటి గాలులతో కూడిన వర్షాలు కురవాల్సి ఉండగా, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఎండ వేడి, ఉక్కపోత, వడగాలులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కార్తెలు మారినా కరుణించని వరుణుడు ఎవుసం సాగక దిగాలు పడుతున్న అన్నదాతలు ఎండుతున్న నారుమడులు.. మొలకెత్తని పత్తి గింజలు చినుకు జాడకు రైతుల ఎదురుచూపులు లక్ష్యానికి చాలా దూరంలో పంటల సాగు విస్తీర్ణం జూలై నెల లో కురిసే వర్షాలపైనే ఆశలు -
‘సర్’కు రాజకీయ పార్టీలు సహకరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తప్పులు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా కోరారు. గురువారం కలెక్టరేట్లోని వీసీహాల్లో జిల్లాస్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి తప్పనిసరిగా బూత్ లెవల్ ఏజెంట్లు నియమించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు ఓటర్ల నుంచి పూర్తి వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తున్నారని వివరించారు. పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను నింపేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులను గుర్తిస్తే వాటిని వెంటనే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) లేదా సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఏఈఆర్ఓలు) దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్డీజీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దుక్కులు దున్ని.. దిక్కులు చూస్తూ..
విత్తనాలు సరిగా మొలకెత్తలేదు.. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన పి.చంద్రశేఖర్కు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా, వరి సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసి తుక్కంపోశారు. మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు ప్రారంభించారు. వానలు అనుకూలిస్తాయన్న నమ్మకంతో తొందరపడి పత్తి విత్తనాలు నాటారు. అయితే ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. కొద్దిగా వచ్చిన మొలకలు ఎండకు వాడిపోయాయి. పత్తి సాగుకు, విత్తనాలు, కూలీల ఖర్చులన్ని కలిపి ఎకరానికి రూ.15వేల వరకు నష్టం వాటిల్లిందని, వర్షాలు వస్తాయని నమ్మి అప్పులు చేసి పెట్టుబడి పెట్టానని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ర్యాలంపాడు’కు మోక్షం!
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మరమ్మతు కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. లోపభూయిష్ట నిర్మాణంతో.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతులు చేపట్టాలని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. మట్టి నమూనా సేకరణ.. గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు. ఎట్టకేలకు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు సివిల్ గ్రౌండింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ -
ఉత్సాహంగా వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గులాం దస్తగీర్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, వాలీబాల్ అకాడమీ కోచ్లు పర్వేజ్పాష, అబ్దుల్ రహెమాన్ఖాన్, ఇతర కోచ్లు సునీల్కుమార్, సయ్యద్ అంజద్, రాజగోపాల్, వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి 95 మందిబాలబాలికలు హాజరు -
విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి
నవాబుపేట: విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని గోవానిపల్లిలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన రైతు గోవు రాజుకు చెందిన గేదెలు మేత మేస్తూ అక్కడే ఉన్న కంచలేని ట్రాన్స్ఫార్మర్ చెంతకు రాగానే షాక్ తగిలి రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతుకు గేదేలు మృతి చెందటంతో జీవనోపాధి కరువైంది. దీంతో పాటు రెండు గేదెలు దాదాపుగా రూ.2 లక్షలు విలువ చేస్తాయని, ఆర్థికంగా నష్టపోయిన రైతును ఆదుకోవాలని సర్పంచ్ రవికిరణ్ అధికారులను కోరారు. కంచె లేని ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదం ఇప్పటూర్ గ్రామంలో గతంలో సైతం రెండు గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. దీనికి కంచెలేని ట్రాన్స్ఫార్మర్లే కారణమని సర్పంచ్ ఆరోపించాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి కంచె లేని ట్రాన్స్ఫార్మర్లకు వెంటనే కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దాపూర్లో విద్యుదాఘాతానికి గురై రెండు పాడి గెదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన చెందిన రైతు సాకలి తిరుపతయ్య తన పాడి గేదెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాయి. దీంతో రైతు సుమారు రూ.2.3 లక్షలు నష్టపోయినట్లు స్థానికులు తెలిపారు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
గోపాల్పేట: అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో ఎస్ఐ శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. ఈ ఘటన గోపాల్పేట మండలంలోని మున్ననూరు, తిర్మలాపూర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్ననూరు గ్రామానికి చెందిన రైతులు పందెం కృష్ణారెడ్డి, పందెం రవిచంద్రనాథ్రెడ్డి పొలంలో రాళ్లు పేల్చి భూమిని చదును చేసేందుకు మండ్ల కురుమూర్తి కంప్రెషర్ పెట్టి పేలుడు పదార్థాలు వినియోగించి భూమిని చదును చేద్దామనుకున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంప్రెషర్ ఓనర్ మండ్ల కురుమూర్తి నుంచి 83 జిలెటిన్ స్టిక్స్, 20 డిటోనేటర్లు, వంద మీటర్ల కార్డెక్స్ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గోపాల్పేట ఎస్ఐ శశిధర్ ఫిర్యాదు మేరకు ఉమెన్ ఏఎస్ఐ రమామణి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పెరిగిన ఉల్లి ధరలు దేవరకద్ర: సీజన్ ప్రారంభంలో తక్కువ పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు భారీగా ఎగ బాకుతున్నాయి. మే నెల వరకు రూ.వేయి నుంచి రూ.1,200 వరకు క్వింటా ఉన్న ఉల్లి ధర జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తోంది. మూడు వారాల క్రితం రూ.1,600 ఉండగా.. బుధవారం జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.1,200 వరకు లభించాయి. దేవరకద్ర మార్కెట్కు దాదాపు వేయి బస్తాలకు పైగా వచ్చిన ఉల్లిని వేలం తరువాత తూకాలు వేసి విక్రయించారు. 50 కేజీల నాణ్యమైన ఉల్లి ధర రూ.1,350 వరకు విక్రయించారు. మధ్యస్తంగా ఉన్న ఉల్లిని బస్తా రూ.1,200 నుంచి రూ.800 వరకు బస్తాగా విక్రయాలు సాగాయి. ఆర్ఎన్ఆర్ రూ.2,771 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా గరిష్టంగా రూ.2,771, కనిష్టంగా రూ.2,589, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,447, కనిష్టంగా రూ.2,121, ఆముదాలు రూ.6,386, పొద్దుతిరుగుడుకు రూ.5,526 ధరలు లభించాయి. -
కళకు ‘శృతి’ కలిసే
● కొనసాగిస్తున్న కళాకారుడైన తండ్రి వా రసత్వం ● గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారి శృతిమదనాపురం: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు.. కంటే కూతుర్నే కనాలి, మనసుంటే మగాడిలా పెంచాలి అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తోంది ఆ కు టుంబం. అటు చదువులో ఫస్ట్.. ఇటు నృత్యంలో బెస్ట్ అంటూ జిల్లా, రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగో టం గ్రామానికి చెందిన జానపద ఉద్యమ కళాకారుడు గుడిసె శివలింగం ప్రస్తుతం వనపర్తి నివా సి తన కుమార్తెలను కళా వినీ లాకాశంలో ధ్రువతారలుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న కుమార్తె శృతి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి పాలమూరు మట్టి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. మహానృత్యంలో గిన్నిస్ రికార్డు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కూచిపూడి నత్య ఉత్సవంలో చిన్నారి పాల్గొంది. వేలాది మంది నృత్య కళాకారుల మధ్య ప్రదర్శించిన కూచిపూడి నృత్య రీతులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను అందుకొని చరిత్ర సృష్టించింది. కళల శివలింగం.. సృజనాత్మక వారసత్వం స్వయంగా జానపద ఉద్యమ కళాకారుడైన గుడిసె శివలింగం తన పిల్లల కు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, వి ద్యా బుద్ధులతో పాటు సృజనాత్మకత ను, కళలను నూరిపోశారు. తండ్రి ఆశయాలకు తగ్గట్టే అటు చదువులో రాణిస్తూనే, ఇటు నృత్యంలో అంతర్జాతీయ స్థా యి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖుల ప్రశంసలు గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారి శృతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లా వాసులతో పాటు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు కలెక్టర్లు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. -
పంటలకు సమగ్ర పోషణ ముఖ్యం
కొత్తకోట రూరల్: పూర్వం రైతులు అందుబాటులో ఉన్న సహజ వనరులను ఉపయోగించి వ్యవసా యం చేసేవారు. ప్రస్తుతం రైతాంగం సహజ వనరులైన నీరు, భూములను మితిమీరి వినియోగంచడం వలన గ్రామీణ ప్రజల జీవనోపాధులను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. రైతులు మొక్కల పోషణకు అవసరమైన పోషకాలను అందించడానికి మో తాదుకు మించి రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు నిస్సారంగా మారడం, పంటలకు చీడ పీడల వ్యాప్తి అధికమవుతుంది. కొన్ని పోషకాలు ఎక్కువ మొతాదులో వాడినప్పుడు భూమిలోనే నిరుపయోగంగా స్థిరీకరించబడతాయి. సేంద్రియ ఎరువులతో భూమి సారవంతం మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి 17 పోషకాలు అవసరం. వీటిలో ముఖ్యమైనవి కార్బన్, హైడ్రోజ న్, ఆక్సిజన్ అలాగే ఇతర పోషకాలు గాలి, నీరు ద్వారా లభిస్తాయి. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను తగిన మోతాదులో ఉపయోగించి పంటలకు పోషకాలను అందించడాన్ని ‘సమగ్ర పోషక యాజమాన్యం’గా పిలుస్తారు. పంటలకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయనిక ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా అందిస్తే భూమి నిస్సారం కాకుండా కాపాడుకోవచ్చు. భూసారం: భూములలో తగ్గిపోతున్న సేంద్రియ పదార్థం, చెడు నేలలుగా మారడం, పంట నాణ్యత, దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. వరుస పంటల సాగు కారణంగా జింక్, గంధకం, ఐరన్, బోరాన్ లోపాలు ఎక్కువగా కనబడుతాయి.గట్టిపడుతున్న భూమి పై పొరలు, భూమి లోని పోషకాలకు అవరోధం కలిగిస్తాయి. కావున రైతాంగ భూసార పరీక్షల ద్వారా పోషక విలువలను తెలుసుకొని ఎరువులను వాడుకోవాలి. రసాయన ఎరువులు: రైతాంగం నత్రజని, భాస్వరం, పోటాష్, జించ్ గంధకం పోషకాలు ప్రధానంగా రసాయనిక ఎకువుల ద్వారా అందిస్తుంటారు. నత్రజని, భాస్వరం, పోలాష్ను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. కానీ రైతాంగం ప్రస్తుతం 9.5: 2.7:1.0 వాడుతున్నారు. సేంద్రియ ఎరువులు: వ్యర్థా పదార్థాలలో అధికంగా కార్బనం, నత్రజని ఉంటుంది. కావున పంటలకు లభ్యం కావు. వీటిని బాగా కుళ్లింపచేసి పంటలకు వాడుకోవాలి. టన్ను సేంద్రియ ఎరువు నుంచి సరాసరి 5 నుంచి 8 కిలోల నత్రజని, పోటాస్, 2 కిలోల భాస్వరం లభిస్తాయి. సేంద్రియ ఎరువుల్లో సూక్ష్మపోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి వాడటం వల్ల భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. పచ్చిరొట్ట ఎరువులు: పచ్చి రొట్ట ఎరువులలలో నత్రజని 2 నుంచి 3 శాతం ఉంటుంది. పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర, పెబ్బర్లు, మరియు మినుములు లాంటి పంటలను విత్తిన 40–50 రోజులకు భూమిలో తీరు ఉన్నప్పుడు కలియదున్నాయి. వరుసగా పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం వల్ల భూమిలో నత్రజని, కర్బనం పెరిగి జీవ రసాయన చర్యలు వేగవంతమై భూ భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. పంట మార్పిడి: క్రమంగా పంట మార్పిడి చేసి నత్రజని పంటలైన పెసర, మినుము, పెబ్బర్లు, కంది సాగు చేయడం వల్ల కలుపు సమస్య తగ్గి భూసారం పెరుగుతుంది. అదే విధంగా సహజ క్రిమి శత్రువులు పెరుగుతాయి. జీవన ఎరువులు: ప్రకృతిలో గల సూక్ష్మజీవులు స్వతంత్రంగా కానీ మొక్కలతో కానీ కలిసి జీవ ప్రక్రియల ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలను వాతావరణం లేదా నేల నుంచి గ్రహించే వాటిని జీవన ఎరువులు అంటారు. ఇవి మార్కెట్లో రైజోబియం, ఫాస్పోభాక్టీరియా, అజటోబాక్టీరు, మరియు ఆజైస్పరిల్లమ్ రూపంలో లభ్యమవుతాయి. పంట అవశేషాలు: ప్రస్తుతం రైతాంగం పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి నిస్సారమవుతుంది. పంట అవశేషాలను పొలంలో కుళ్లించి భూమిలో కలిపి వేయాలి. ప్రతి టన్ను వరిగడ్డిలో 400 కిలోల పోటాష్ 50 కిలోల సిలికాన్ ఉంటాయి. పాడి–పంట -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మద్దూర్ (కోస్గి): భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకోగా మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్ పరిధిలో బుధవారం చోటు చేసు కుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన ఖాజాబీ (26)కి కుటుంబ విషయంలో భర్త యూసుఫ్తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు భార్యభర్తలు గొడవపడ్డారు. భర్త వ్యాపారం నిమిత్తం కోస్గికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖాజాబీ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం ఇచ్చారు. వివాహిత ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం వీపనగండ్ల: మండలంలోని కల్వరాల్ల గ్రామానికి చెందిన బండారు గోవిందు (26) అనే యువకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ మాజీ సర్పంచ్ బండారు శంకరమ్మ కుమారుడైన ఇతను రోజు నూతనంగా నిర్మించిన గృహంలో నిద్రించేవాడు. అవివాహితుడైన ఇతడు మంగళవారం రాత్రి కూడా పడుకోవడానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి హుస్సేన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. రెండు బైక్లు ఢీ.. యువకుడు మృతి జడ్చర్ల: ఎదురెదురుగా బైక్లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఖాదర్ కథనం మేరకు.. నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(30) బైక్పై జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రశేఖర్, మరో బైక్ మీద ఉన్న మహబూబ్నగర్కు చెందిన వినయ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో జడ్చర్ల పర్యటనకు వస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రమాద స్థలం వద్ద ఆగి క్షతగాత్రులను ఆటోలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం మల్దకల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘ టన మండలంలోని అమ రవాయి గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసు కుంది. పూర్తి వివరాలు.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన కుర్వ రవి(32) బైక్పై మహబూబ్నగర్కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమరవాయి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. ఇదే సమయంలో ట్రాక్టర్ వెళ్తుండగా రవి తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుక్కను తప్పించబోయి.. జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన వర్షిత్(17), అతడి మిత్రుడు జహంగీర్తో కలిసి ఆదివారం రాత్రి బైక్పై గంగాపూర్ నుంచి జడ్చర్ల కొత్తబస్టాండ్కు మరో మిత్రుడిని రిసీవ్ చేసుకోవాడానికి వెళ్తుండగా జడ్చర్లలో ఎంబీ చర్చీ వద్ద కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో వెనుక కూర్చున్న వర్షిత్, బైక్ నడుపుతున్న జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వర్షిత్ మృతి చెందాడు. మృతుడి తల్లి సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదుపులో గంజాయి బాధితుడు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో బుధవారం సాయంత్రం పోలీసులు విస్తతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక షేరేలీవీధికి చెందిన బషీర్ అను యువకుడు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. మత్తు పదార్థాలతో జీవితం నాశనం అవుతుందని, ఎవరైనా మత్తు పదార్ధాలు తీసుకున్నా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆన్లైన్లో మోసం: రూ.5.25 లక్షలు స్వాహా
జడ్చర్ల: వాట్సాప్కు ఒక మెసేజ్ పంపించి దాని ద్వారా దశల వారీగా రూ.5.25 లక్షలు స్వాహా చేసిన ఘటన మండలంలోని నసరుల్లాబాద్ తండాలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నసరుల్లాబాద్ తండాకు చెందిన కె.శంకర్ ఫోన్ వాట్సాప్కు మహేశ్వర్రావు వ్యక్తి మెసేజ్ పంపి తనను తాను హెచ్ఆర్గా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. భారత్ ఫర్టిలైజర్స్ స్టోర్స్ ఏజెన్సీ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో బాధితుడు తన ఖాతా నుంచి దశల వారీగా అతడు ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు రూ.5.25 లక్షలను బదిలీ చేశాడు. చివరకు నిందితుడు ఫోన్లో బదులు ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గ్ర హించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 24 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్ రాజోళి: మండలంలోని పెద్ద ధన్వాడలో అక్రమంగా డంపు చేసిన 24 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ పి.రామ్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద ధన్వాడ గ్రామ శివారులోని తుంగభద్ర నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తీసి, స్థానికంగా నిల్వ చేశారనే సమాచారంతో ఆర్ఐ చంద్రకాంత్, సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల నిల్వ ఉంచిన 24 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి, వాటిని సీజ్ చేశారు. వాటికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తహసీల్దార్ తెలిపారు. -
నెరవేరుతున్న ‘కోర్టు’ కల
● 17 ఏళ్ల నిరీక్షణకు తెర ● నేడు దేవరకద్రలో ప్రారంభం ● 5 మండలాల కేసులు ఇక ఇక్కడే దేవరకద్ర: నియోజకవర్గంగా ఏర్పడిన 17 ఏళ్ల తరువాత కోర్టు కల నెరవేరబోతుంది. గురువారం అధికారికంగా కోర్టును ప్రారంభిస్తున్నారు. కోర్టు పరిధిలోకి దేవరకద్రతో పాటు చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, కౌకుంట్ల మండలాలకు సంబంధించిన కేసులన్ని బదలాయిస్తారు. ఇక నుంచి కోర్టులోనే కేసుల విచారణ సాగునుంది. వర్చువల్గా ప్రారంభం.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మాధవిదేవి వర్చువల్గా దేవరకద్ర జూనియర్ సివిల్ జడ్జి కమ్– జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కో ర్టును గురువారం ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు. పాత మండల పరిషత్ భవనాన్ని కొత్త హంగులతో తీర్చిదిద్ది కోర్టుకు సంబంధించి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. కోర్టు రాకతో ఒకే పరిధిలో.. దేవరకద్రకు కోర్టు రాకతో 5 మండలాలు ఒకే పరిధిలోకి రానున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పడినప్పటికీ ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడు కూడా అన్ని మండలాలు అనుసంధానంగా పని చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత నియోజకవర్గం రెండు ముక్కలైంది. కొత్తకోట, మదనాపురం వనపర్తి జిల్లాకు, దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు. దీంతో దేవరకద్ర ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంగా పని చేయడం తప్పా మిగతా సమయంలో మండలంగా మిగిలింది. ఎన్నికల సమయంలోనే నియోజకవర్గం.. దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. కేవలం ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంగా గుర్తింపు లభిస్తుంది. ఆ తరువాత మండలస్థాయిలోనే కార్య కలాపాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని మండలాల కేసులు పలు కోర్టులకు పరిమితంగా ఉండేది. దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల గతంలో ఆత్మకూరు కోర్టు పరిధిలో ఉండేవి. ప్రస్తుతం మహబూబ్నగర్ పరిధిలో ఉన్నాయి. అడ్డాకుల, మూసాపేటకు మహబూబ్నగర్ కోర్టు పరిధి, భూత్పూర్ మండలం జడ్చర్ల కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం దేవరకద్ర కోర్టు రాకతో భూత్పూర్ తప్పా మిగతా 5 మండలాలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో దేవరకద్రకు కోర్టు మంజూరైంది. న్యాయశాఖ కూడా సీఎంతో ఉండడం వల్ల అడిగిన వెంటనే కోర్టు మంజూరు చేయడం, ప్రస్తు తం ప్రారంభోత్సవం చేసుకునే అవకాశం లభించింది. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు. నియోజకవర్గ కేంద్రంగా అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నా. – మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే -
ద్విచక్రవాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన గువ్వలి బాలయ్య (45) బుధవారం రాత్రి ద్విచక్రవాహనం పైనుంచి పడి మృతి చెందా డు. మండల కేంద్రం నుంచి చిన్నకొత్తపల్లి గ్రామానికి వెళ్తుండగా పెద్దకార్పాముల–చిన్నకారుపాము ల గ్రామాల మధ్యలో అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. బాలయ్యకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు తెలకపల్లి: పిచ్చికుక్క స్వైర వి హారం చేస్తూ కనిపించిన వారందరిని కాటు వేసి భయాందోళనకు గురి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బు ధవారం సాయంత్రం మండలంలోని బొప్పల్లిలో పిచ్చికుక్క తిరుగుతూ కనిపించిన వారిని కాటువేస్తూ గాయపర్చిందని గ్రామ స్తులు తెలిపారు. బొడ్డుపల్లి వెంకటేష్, గౌరారం సైదులు, నిషంత్, నవ్యశ్రీ, యశ్వంత్, శేఖర్తో పాటు మరో కొంతమందిని కాటు వేసింది. బాధితులను 108 వాహనంలో నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి ఉండవెల్లి: బైక్పై లిఫ్ట్ అడిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పో లీసులు తెలిపిన వివరాలు.. మానవపాడు మండ లం బోరవెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(54) జూన్ 30న మంగళవారం బోరవెల్లి నుంచి అలంపూర్కు వెళ్లేందుకు రోడ్డుపై ఉండగా అటుగా బైక్పై వెళ్తున్న కాంతారెడ్డిని లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకొ ని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉండవెల్లి శివారులోని ఆర్డీఎస్ కెనాల్ సమీప మార్గంలో జాతీయ రహదారిపై లక్ష్మీదేవి బైక్పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందింది. మృతురాలి తమ్ముడు వెంకట్రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపారు. మహిళ గోప్యతకు భంగం.. ఏడాది ౖజైలుశిక్ష కోస్గి రూరల్: మహిళకు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడినట్లు కోస్గి సీఐ సైదులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 2016లో కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ గోప్యతకు భంగం కలిగించిన ఘటనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడు బర్రె కృష్ణయ్యను అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజవు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి సుస్మిత బుధవారం సదరు వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. -
ప్రతిసారి నిరాశే..
ఆర్డీఎస్ కెనాల్లో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఏ ఈడాది నీరు వస్తాయనుకునే సరికి ఏదో రకంగా నీటి విడుదలకు బ్రేక్ పడుతుంది. మేము ఉన్న సమయంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురు సీఎంలు కలిసి కూడా ఏదీ స్పష్టత రాలేదు. – నాగార్జున, రైతు, ఉండవెల్లి ప్రాజెక్టులను నిలిపేయాలి కర్ణాటకలో తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపేయాలి. ఆర్డీఎస్ రైతుల కోసం నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్టు పూర్తి కాలేదు. అప్పుడే వారు నీటిని దిగువకు రానివ్వకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి పూర్తిచేసే స్థాయికి వచ్చినా మన ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు. వెంటనే మల్లమ్మకుంట నిర్మించడంతో పాటు, కర్ణాటకలోని కురిడిలో నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలిపేయాలి. – మధుసూదన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి పూజలు
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జోగుళాంబ సన్నిధిలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అలాగే యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. గురువారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
విద్యా వలంటీర్ల నియామకానికి పరీక్ష
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నియోజకవర్గంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సొంత నిధులతో నియమించించేందుకు గాను బుధవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘మహబూబ్నగర్ ఫస్ట్’ శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. దీనికి 430 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష వందేమాతరం ఫౌండేషన్, ‘మహబూబ్నగర్ ఫస్ట్’ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఉత్సాహంగా అత్యాపత్య ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ (అండర్–14) బాలబాలికల అత్యాపత్య ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అత్యాపత్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముంతాజ్ మాట్లాడుతూ ఎంపికయ్యే జిల్లా జట్లు హైదరాబాద్లో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప కార్యదర్శులు రవి, ఉస్మాన్ పాల్గొన్నారు. 94 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 18 ఏళ్ల తర్వాత ఇప్పటూర్కు ఆర్టీసీ బస్సు – వివరాలు 9లో.. -
విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
● ఉపాధ్యాయులు సమయపాలనపాటించాలి ● నాణ్యమైన బోధన అందించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యార్థులు నమోదు, హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలిని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డీఈఓ ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, నిర్దేశిత టైమ్ టేబుల్ ప్రకారం తరగతి గదులకు సకాలంలో హాజరై నాణ్యమైన బోధన అందించాలని ఆదేశించారు. పాఠశాల పనివేళల్లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో నైట్ డ్యూటీ పూర్తి చేసిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి బోధనకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదు లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్ని ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న డ్రాప్బాక్స్ విద్యార్థులందరికీ వెంటనే ప్రవేశాలు కల్పించాలని సూచించారు. సీసీ కుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరచాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించారు. ప్రతి ఎంఈఓ నెలకు కనీసం 16 పాఠశాలలను, ప్రతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కనీసం 12 పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలన్నారు. యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచకుండా వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సాయిశివాని, డీఈఓ విజయకుమారి, ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్ రెడ్డి, జీఈసీఓ అస్రాఖాద్రీ, ప్లానింగ్ కోఆర్డినేటర్ ప్రశాంత్, పాల్గొన్నారు. -
‘సర్’పై నిర్లక్ష్యం తగదు
దేవరకద్ర: వారం రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అదనపు కలెక్టర్, దేవరకద్ర నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్నాయక్ సమీక్షించారు. బుధవారం తహసీల్దార్లతో జరిగిన సమావేశంలో సర్ కార్యక్రమంపై చర్చించారు. అన్ని మండలాల్లో సర్ ద్వారా ఓటరు నమోదు జరగాలని సూచించారు. ఎక్కడా తప్పులు జరగకుండా ప్రతి ఓటరు నమోదయ్యేలా బీఎల్ఓలు చూడాలని, తహసీల్దార్ల పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సర్కు అందరు సహకరించాలని, బీఎల్ఏలు సమన్వయంతో పని చేసే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్లు హర్షద్, సుందర్రాజు, ఎల్లన్న, కిషన్, రాజు, శేఖర్, వివిధ పార్టీల నాయకులు అంజిల్రెడ్డి, నాగిరెడ్డి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అరకొరగా అద్దె వసూళ్లు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండు ప్రాంగణంలో ఉన్న దుకాణాల నుంచి ప్రతినెలా అద్దె పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదు. వేల పాటల సమయంలో వ్యాపారులు పోటాపోటీగా పాల్గొని ఎక్కువ ధరకు దక్కించుకుంటున్నారు. ఆ తర్వాత సరిగా వ్యాపారాలు నడవడం లేదని అద్దె చెల్లింపును వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు దుకాణాలను మూసివేయడంతో చివరకు డిపాజిట్ నుంచి అద్దె బకాయిలను ఆర్టీసీ అధికారులు రాబడుతున్నారు. ● మహబూబ్నగర్ ఆర్టీసీ కొత్త బస్టాండు ప్రాంగణంలో మొదట 1990లో 19 దుకాణాలు, మరొకటి హోటల్/క్యాంటీన్ నిర్మించారు. ఏడాది తర్వాత వీటికి వేలం పాటలు నిర్వహించారు. అక్కడ గిరాకీ బాగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లో పోటాపోటీగా వ్యాపారులు పాల్గొని ఆయా దుకాణాలను అధిక ధరకు దక్కించుకున్నారు. వీటిలో నెలసరి అద్దె కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్నాయి. ఇక హోటల్/క్యాంటీన్కు మాత్రం రూ.ఆరు లక్షలకు ఖరారైంది. పదేళ్ల పాటు వివిధ వ్యాపారాలు ఆశించిన విధంగా నడిచింది. ఆ తర్వాత నగరం వేగంగా విస్తరిస్తుండటంతో న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ, శ్రీనివాస కాలనీ, ఏనుగొండ వరకు వందలాది ప్రైవేట్ వ్యాపార సముదాయాలు వెలియడంతో పాటు స్టాండుకు ఎదురుగా ఉన్న కలెక్టరేట్ పాలకొండ శివారుకు తరలిపోయింది. దీంతో కొత్తబస్టాండులోని షాపులలో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే 8 షాపులు మూతపడ్డాయి. ఇక కాలక్రమేణా అటు.. ఇటు ప్లాట్ఫాంల మధ్యన మరో ఏడు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. వీటికి కనిష్టంగా రూ.45 వేల నుంచి గరిష్టంగా రూ.రెండు లక్షల వరకు అద్దెలు వస్తున్నాయి. అలాగే ఏడాదిన్నర క్రితమే ఎన్హెచ్–167 వెంట (మెయిన్ రోడ్డు) కొత్తగా మొదటి బ్లాక్లో పది, రెండో బ్లాక్లో ఏడు, మూడో బ్లాక్లో మూడు ఇలా 20 దుకాణాలు నిర్మించారు. ఆ వెంటనే వేలం పాటలు నిర్వహించగా కేవలం మూడు షాపులు మాత్రమే తీసుకోవడానికి ఇద్దరు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఇందులో ఒకరు మొబైల్ షాపు ఏర్పాటు చేసుకున్నా పదుల సంఖ్యలో తోపుడుబండ్లు అడ్డంగా ఉండటంతో గిరాకీ లేక మూడు నెలలకే మూసేశారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ హోటల్ యాజమాన్యం ఇక్కడి రెండు, మూడు బ్లాక్లలోని పది దుకాణాలను ఏకమొత్తంగా నెలసరి అద్దె రూ.8.5 లక్షలకు తీసుకున్నా ఇంకా ప్రారంభించలేదు. ఇదిలాఉండగా వచ్చే నెలలో ఖాళీగా ఉన్న దుకాణాల కోసం మరోసారి వేలం పాటలు నిర్వహించనున్నారు. కాగా, ఆయా దుకాణదారుల నుంచి అద్దె వసూలుకు ఆర్టీసీ అధికారులు ఏడుగురితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతినెలా 5 తేదీలోగా వారి నుంచి రావాల్సి ఉన్నా కొందరు గడువులోగా చెల్లించకపోవడంతో ప్రత్యేక బృందం నోటీసులు జారీ చేసి ఎలాగోలా 32 దుకాణాల నుంచి రూ.24 లక్షలకు గాను రూ.14 లక్షలు (58 శాతం) రాబట్టగలిగారు. పాలమూరు బస్టాండ్లో క్యాంటీన్ సహా 47 దుకాణాలు కొన్నేళ్లుగా ఖాళీగానే ఆర్టీసీ 15 పాత, కొత్త దుకాణాలు వ్యాపారాలు సరిగా నడవక మధ్యలోనే మూసివేస్తున్న తీరు -
ఎగువన కొత్త పథకాలు..
తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. -
విద్యాశాఖలో డిప్యూటేషన్ల హడావుడి
● డైట్ కళాశాలకు 13 మంది, బీఎడ్కు 12 మంది కేటాయింపు ● ఆయా కళాశాలల్లో నెల రోజుల పాటు విధులు నిర్వహించనున్న ఎస్ఏలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్ల హడావుడి కొనసాగుతుంది. వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల, డైట్ కళాశాలల్లో పనిచేసేందుకు డిప్యూటేషన్ ఇచ్చారు. బీఈడీ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీ పని చేయాల్సి ఉంది. వీరి భర్తీ ప్రక్రియ ఆలస్యం కానుంది. ఈ క్రమంలో వివిధ సబ్జెక్టులు బోధించే 12 మంది స్కూల్ అసిస్టెంట్లను నెల రోజుల పాటు డిప్యూటేషన్పై పంపించారు. అలాగే డైట్ కళాశాలలో పని చేసేందుకు 13 మందికి డిప్యూటేషన్ ఇచ్చారు. ● ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, వసతుల కల్పన తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు మొత్తం మూడు టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో టీంలో తొమ్మిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరితో పాటు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ తనిఖీల కోసం ముగ్గురు సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్స్ తనిఖీల కోసం ఒక్కో టీంలో ముగ్గురు చొప్పున ఆరు టీంలను ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు రెండు పాఠశాలలను తనిఖీలు చేసి విద్యా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంది. వీరిని మంగళవారం పాఠశాలల తనిఖీల ట్రాయల్స్లో భాగంగా పంపించారు. వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో పని సర్దుబాటు చేశాక.. వీరిని కూడా డీఈఓ కార్యాలయానికి డిప్యూటేషన్లు ఇచ్చే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. డిప్యూటేషన్లు ఇచ్చాం.. ప్రభుత్వ బీఈడీ కళాశాల, డైట్ కళాశాలలో బోధించేందుకు పలువురు ఉపాద్యాయులకు నెల రోజుల పాటు విధులు నిర్వహించేందుకు ఉపాధ్యా యులకు డిప్యూటేషన్లు కల్పించాం. వీరితో పాటు పాఠశాలల్లో తనిఖీలు చేసేందుకు కూడా త్వరలో మరికొంత మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసిన అనంతరం పూర్తిస్థాయిలో డిప్యూటేషన్లు ఇస్తాం. – విజయకుమారి, డీఈఓ -
పాలమూరు బిడ్డకు ఘనస్వాగతం పలుకుదాం
మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానం మిడ్జిల్ నుంచి ప్రారంభించి జూలై 4వ తేదీకి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పాలమూరు బిడ్డకు ఘనంగా స్వాగతం పలికేందుకు జడ్చర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం సభ, విగ్రహల ప్రతిష్ట కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు, స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని సూచించారు. సీఎం రాకతో మిడ్జిల్, ఊర్కొండ మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు ఇవ్వడం ఎంతో సంతోషమన్నారు. ఆయన వెంట నాయకులు రబ్బానీ, అల్వాల్రెడ్డి, గౌస్, సాయిలు, శంకర్, మల్లిఖార్జున్రెడ్డి, నరేందర్రెడ్డి, తదితరులుఉన్నారు. ● సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను బుధవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్ ప్రజల రాకపోకలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈ సంధ్య, సీఐ మహేష్, ఎస్ఐ శ్రీనువాసులు ఉన్నారు. -
పేలుడు పదార్థాలు ఉపయోగించిన వ్యక్తులు రిమాండ్
మహబూబ్నగర్ క్రైం: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నైట్రేట్ మిశ్రమం ఏర్పాటు చేసి పేల్చడానికి ప్రయత్నించిన ఇద్దరూ వ్యక్తులను కోయిలకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. కోయిలకొండ మండలంలో అంకిళ్ల వాగు వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం గుంతలు తీసి నైట్రేట్ మిశ్రమం (పూసలు) ద్వారా పేల్చడానికి ప్రయత్నం చేసిన నితిన్రెడ్డి, ఉదయ్కిరణ్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరు ఎలాంటి పోలీస్, సంబంధిత శాఖల అనుమతి తీసుకోకుండా అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం వద్ద గుంతల్లో నైట్రేట్ మిశ్రమం ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. దీంతో మహబూబ్నగర్ నుంచి బాంబ్ స్క్వాడ్ రప్పించి నైట్రేట్ మిశ్రమం నిర్వీర్యం చేశామన్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలు వాడుతున్న సమయంలో ముందుస్తు అనుమతులు, కావాల్సిన రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పేల్చడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇలా చేస్తే సమీపంలో ఉన్న వారికి కూడా ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. ఈ ఇద్దరిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్ర ఉత్సవాలు
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో మంగళవారం వైభవంగ శ్రీచక్ర ప్రతిష్ఠాపన ఉత్సవాలను ఈఓ దీప్తిరెడ్డి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మంగళవారం గణపతి, గోమాతపూజ, యాగశాల ప్రవేశం, దీక్షధారణ, వాస్తుశాంతి, పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని పోలేపల్లి గ్రా మానికి చెందిన కొంగలి సుజాత(45) ఆదివారం మల్లేపల్లికి వెళ్లి తిరిగి పోలేపల్లికి కుమారుడి తో కలిసి బైకుపై వస్తుండగా ఎదురు గా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమా దంలో సుజాత తీ వ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భూసార పరిరక్షణపై అవగాహన అవసరం
కొత్తకోట రూరల్: రైతులు భూసార పరీక్షలు చేయించుకొని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపడితే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందొచ్చని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమడబాకుల రైతువేదికలో భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సాగు భూముల్లో సేంద్రియ కార్బన్, నత్రజని, జింక్, బొరాన్, సల్ఫర్ వంటి పోషకాల లోపాలు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. భూమి సారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రియ, పచ్చిరొట్టె, జీవన ఎరువులను సమపాళ్లలో వాడాలని సూచించారు. ప్రకృతి వ్యయసాయంతో మేలు రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ విధానాలను అవలంబించడం ద్వారా పంట పెట్టుబడిని తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ ఆత్మ (ఏటీఎం) డిప్యూటీ డైరెక్టర్ హైమావతి సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందన్నారు. పంట కోత అనంతరం పంట అవశేషాలను కాల్చివేయకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా మార్చుకొని వినియోగించే పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ రవీందర్రెడ్డి, రైతులు భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, శేఖర్, అబ్దుల్లా, వెంకటయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట సాగుతో భూమికి ప్రయోజనం
అలంపూర్: వరి సాగులో సేంద్రియ ఎరువులను సరిపడా మోతాదు మేరకు అందించడంలో రైతులు విఫలమవతున్నారు. దీంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. అయితే పచ్చి రొట్ట ఎరువు సాగుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. పచ్చి రొట్ట ఎరవులతో కలిగే ఉపయోగాలు.. పచ్చి రొట్ట వినియోగం వలన ముఖ్యంగా భూమి గుళ్ల బారుతుంది. దీంతో భూమికి నీటిని, పొషక పదార్థాలను నిల్వ ఉంచుకోనే శక్తి పెరుగుతుంది. మొక్కల వేర్లకు గాలి, నీరు పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము, జీలుగలు, పెసర వంటి పచ్చి రొట్ట విత్తనాలను, ఎరువులను తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. వీటి ద్వారా భూములను మరింత సారవంతంగా చేసుకోవచ్చు. భూమిలో ఆమ్ల, క్షార గుణాలను పెంపొందించుకోవచ్చు. మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా చూసుకోవడంతో పాటు పంట నాణ్యత, దిగుబడులు మెరుగుపడేందుకు పచ్చి రొట్ట మేలు చేస్తోంది. వీటి వలన చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. పంటలో కలుపు మొక్కలను నివారించవచ్చు. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలో ఇంకేలా చేస్తోంది. పంటలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మ క్రిములు భూమిలో వృద్ధి పొందేందుకు దోహదపడుతుంది. పప్పు జాతి పచ్చి రొట్ట పైరు వలన భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం అభివృద్ధి చెందుతుంది. పచ్చి రొట్ట విత్తన ఎరువుల ఎంపిక పచ్చి రొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా, కాండం వచ్చి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వలన వేర్లపైనే నత్రజని బుడిపెల ద్వారా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండటంతో నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతుంది. పచ్చి రొట్ట పైర్ల వేర్లు భూమిలోకి చొచ్చుకోనిపోయే గుణం కలిగి ఉంటాయి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేందుకు ఉపయోగపడేలా చూసుకోవాలి. జీలుగు సాగు.. పచ్చి రొట్ట ఎరువుల సాగు చేసుకుంటే భూమికి అవసరమైన సేంద్రియ పదార్ధాల్ని అందిస్తాయి. వీటి వలన భూమిలో సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెందుతాయి. జీలుగలు ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనం కావాలి. పూత దశలో కోసినపుడు ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్ట ఎరువు వస్తోంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికొస్తుంది. జనుములు.. ఎకరానికి 20 కిలోల విత్తనం కావాలి. పూత దశ కంటే పంట వేసిన 8 వారాల తర్వాత కోసినప్పుడు 6–8 టన్నుల పచ్చి రొట్ట వస్తుంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్ ఉంటుంది. పిల్లి పెసర సాగుతో... ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూత దశలో 4 నుంచి 5 టన్నుల పచ్చి రొట్ట దిగుబడి లభిస్తుంది. ఒక టన్ను పిల్లి పెసరలో 4 కిలోల నత్రజనిని, ఒక కిలో భాస్వరం, 3 కిలోల పోటాష్ లభిస్తోంది. రైతులు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు చల్లుకోని భూముల్లో సేంద్రియ కర్భనం పెంపొందించుకోవాలి. పాడి–పంట -
దుఃఖాన్ని దిగమింగుతూ అవయవదానం
కృష్ణా: ఎదిగిన కొడుకు మృతి చెందినా అతడి అవయవాలు మరొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమ దుఃఖాన్ని దిగమింగుతూ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచింది ఓ కుటుంబం. మండలంలోని ఆలంపల్లి గ్రా మానికి చెందిన కొనింటి కిరణ్కుమార్(24) హైదరాబాద్లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్టైం జాబ్ చేస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం బైక్పై వెళ్తుండుగా జరిగి న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి ఎల్లమ్మ తన కొడుకు అవయవాలు లివర్, కిడ్నీ, గుండె దానం చేసింది. అవయవాలు దానం చేయడం మూలంగా మరో ముగ్గురుకి ప్రాణం పోశారని గ్రామస్తు లు అభినందనలు తెలియజేశారు. చెరువులో పడి మహిళ మృతి పెద్దకొత్తపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహి ళ మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గంట్రావుపల్లికి చెందిన పగిడాల సువర్ణ(54) మంగళవారం మధ్యాహ్నం దుస్తులు శుభ్రం చేసేందుకు గ్రామంలోని పెద్ద చెరువుకు వెళ్లింది. దుస్తులు శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తుతో చెరువు నీటిలో మునిగి చనిపోయింది. మృతురాలికి భర్త రాజయ్య, కుమారుడు శ్రీశైలం ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సతీష్ తెలిపారు. జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో కాంస్యం మహబూబ్నగర్ క్రీడలు: ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీ ల్లో ప్రతిభ చాటి పాయింట్ ఫైట్లో కాంస్య పతకం సాధించిన స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్నగర్ జిల్లా విద్యార్థి వినూత్నను మంగళవారం ఎస్పీ డి.జానకి అభినందించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ పాల్గొన్నారు. -
రేపే ’వాలీబాల్’ ప్రవేశాల వేట!
● రాష్ట్రస్థాయిలో బాల, బాలికల ఎంపికలు ● హాజరుకానున్న వివిధ జిల్లాల క్రీడాకారులు మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరు మెయిన్ స్టేడియంలోని రాష్ట్రస్థాయి వాలీబాల్ అకాడమీ ప్రతి భకు కేరాఫ్గా నిలుస్తోంది. గతేడాది జూన్ రెండో వారంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు కల్పించారు. అకాడమీలో ఉదయం, సా యంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణతోపాటు భోజన, వస తి సౌకర్యం కల్పించారు. అకాడమీ బాలబాలిక లు అనతికాలంలోనే వాలీబాల్పై పట్టుసాధించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు. ● జిల్లాకేంద్రంలోని రాష్ట్ర వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం గురువారం ఉదయం 8 గంటలకు రాష్ట్రస్థాయి బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల శారీరక, క్రీడా నైపుణ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఏదైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు నేరుగా సంబంధిత ధృవపత్రాలతో (ఒరిజనల్, జిరాక్స్) ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం వాలీబాల్ కోచ్లు అబ్దుల్ రహెమాన్ఖాన్ 97041 50321, పర్వేజ్పాష 77805 82604 నంబర్లను సంప్రదించాలని కోరారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులకు ఉచిత శిక్షణా, భోజన, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్ఓ సూచించారు. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ప్రస్తుతం చదువుతున్న స్కూల్ లేదా కళాశాల నుంచి స్టడీ సర్టిఫికెట్. జనన ధ్రువీకరణ పత్రం (సంబంధిత అధికారులు తహసీల్దార్/పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి జారీ చేయబడింది.) పది పాస్పోర్టు సైజ్ ఫొటోలు. ఆధార్కార్డు /రెసిడెన్షియల్ సర్టిఫికెట్. అకాడమీలో ప్రవేశాల కోసం 30.6.2010 నుంచి 1.7.2012 మధ్య జన్మించి ఉండాలి. బాలబాలికలు 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. బాలుర ఎత్తు 182 సెం.మీ, బాలికల ఎత్తు 166 సెం.మీ పైబడి ఉండాలి. -
మొదట నష్టపోయేది పాలమూరే
జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో 5–10 కిలోల వరకు తరుగు పెట్టారని, తరుగు పెడితే తోలు తీస్తానని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఎక్కడా తోలు తీయకపోగా దళారుల చేతుల్లో తోలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు.శవాల మీద ప్రమాణాలు, దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలను రైతులను మోసం చేసిన ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలు సూచించారు. ● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ సర్ విషయంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఏలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి అవగాహన కల్పించాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్లో పదవులు అనుభవించి, పనులు చేయించుకుని ఇతర పార్టీలలోకి వెళ్లిన దొంగలను తిరిగి రానిచ్చేది లేదన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, రజినీ సాయిచంద్, వాల్యానాయక్ పాల్గొన్నారు. ఒట్టుకు ప్రాణం ఉంటే.. రేవంత్ పెట్టిన ఒట్లకు అది ఉరేసుకుంటుంది అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరానికై నా సాగునీరిచ్చారా? మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు -
పూర్తిగా ఇస్తారా.. కోత పెడతారా?
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులకు సాగు పెట్టుబడికి ఊతమివ్వాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం జిల్లాలో ప్రారంభం నుంచే సందిగ్ధ పరిస్థితులకు దారి తీస్తోంది. 2026–27 వానాకాలం సీజన్కు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకే పరిమితం చేయడం సాగుదారుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. మిగిలిన భూమి విస్తీర్ణానికి పూర్తిస్థాయిలో నిధులు వస్తాయా? లేక కోతలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందని పరిస్థితుల్లో.. వానాకాలం నిధులు విడుదల కావడం మరింత అయోమయానికి దారితీస్తోంది. జిల్లాలో రైతు భరోసా అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లాలో వానాకాలం రైతు భరోసా కోసం మొత్తం 2,63,019 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రూ.263.19 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేయడం ప్రారంభించింది. మిగిలిన రైతులకు ఎప్పుడు నిధులు అందుతాయన్న దానిపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందలేదు. ఆ సీజన్లో 2,23,248 మంది రైతులకు రూ.166.69 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. రూ.84.59 కోట్ల సాయం అందించాల్సి ఉంది. పాత బకాయిలను పెండింగ్లో ఉండగానే కొత్త సీజన్కు నిధులు విడుదల చేయడంపై రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి పూర్తి పెట్టుబడి సాయం అందుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన తొలి విడతలో 2 ఎకరాలకే పరిమితమైన పెట్టుబడి సాయం యాసంగి బకాయిలు పూర్తి కాకుండానే వానాకాలం నిధులు మిగిలిన విస్తీర్ణంపై ‘భరోసా’ కరువు -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్– 12వ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జూలై 1నుంచి 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–12 కింద 18 ఏళ్ల లోపు చిన్నారులను బాలకార్మికులుగా గుర్తించి పని చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వారు పని చేస్తున్న ప్రాంతాలు గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడం, తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న యాజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అదే నేరాన్ని మళ్లీ చేసిన వారిపై అవసరం అయితే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తాత్కాలిక ప్రయోజనాల కోసం పిల్లలను పనులకు పంపించి వారి బంగారు భవిష్యత్ను నాశనం చేయవద్దని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు బలవంతంగా పని చేయిస్తున్నా, తప్పిపోయిన బాలబాలికలు కన్పిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణయ్య, ఆపరేషన్ ముస్కాన్ టీం ఎస్ఐ లెనిన్ పాల్గొన్నారు. -
పేదలకు చట్టాలపై అవగాహన కల్పించాలి
● రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి పాలమూరు: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు న్యాయాన్ని అందించడంలో అందరి నుంచి సమష్టి కృషి ఉండాలని రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి అన్నారు. జిల్లా కోర్టులో ఉన్న న్యాయసేవా అధికార సంస్థను పరిశీలించిన తర్వాత కోర్టు ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ పథకాలు, లైంగిక వేధింపుల చట్టం, డాన్ చట్టం, ఎల్ఎస్యూసీ చట్టాలతో పాటు లీగల్ ఎయిడ్ క్లినిక్లలో పనిచేస్తున్న పీఎల్వీలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు రాని పేదలకు చట్టాలపై అవగాహన పెంచాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొన్నారు. పేదలకు హక్కులను, బాధ్యతలను విస్తృతంగా తెలియజేయాలన్నారు. అందరూ న్యాయవాదులతో పాటు పీఎల్వీలు సమష్టిగా కృషి ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈనెల 18న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి డి.ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు పాల్గొన్నారు. -
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
మిడ్జిల్: మండలకేంద్రంలో ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ ఖుష్బూగుప్తా పరిశీలించారు. విగ్రహాల ఏర్పా టు స్థలం, బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా లోటు లేకుండా చూసుకోవాలని, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ నిరంతరం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని అన్నారు. సీఎం కాన్వాయికి, పబ్లిక్ మీటింగ్కు అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ మహేష్కుమార్, సీఐలు నాగార్జున, మహేష్, ఎస్ఐ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా జూలై 31వ తేదీ వరకు 30(ఏ)పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేయరాదని సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 1,12,088 చిన్నారులకు పోలియో చుక్కలు పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పాల్గొన్ని అర్హులైన చిన్నారులకు చుక్కల మందు వేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించారు. మూడు రోజుల్లో జిల్లాలో 0–5 ఏళ్లు నిండిన 1,12,088 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 2,02,123 ఇళ్లను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారిని డాక్టర్ శైలజ పాల్గొన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్నకు గడువు పొడిగింపు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్ప్రింగ్ సీజన్–2026 కింద విదేశాలలో ఉన్నతవిద్య (పోస్ట్ గ్రాడ్యు యేట్/ పీహెచ్డీ) చదువుతున్న మైనారిటీ విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి ఎం.ఎ.ఖయ్యూం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉండగా.. తాజాగా జూలై 15వ తేదీ వరకు పొడించామని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తుదారుల హార్డ్ కాపీతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జూలై 31వ తేదీలోగా తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ పథకం కింద ఎంపికయ్యే విద్యార్థులకు రూ.20 లక్షలతో పాటు రూ.60 వేలు వన్–వే విమాన చార్జీలు ఇస్తామని, ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనారిటీ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆటోమోబైల్స్లో 8, సివిల్లో 8, ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజినీరింగ్లో 4, మెకానికల్లో 37 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. జూలై 4వ తేదీన కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని, ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,732 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,732, కనిష్టంగా రూ.1,811 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,431, కనిష్టంగా రూ.2,071, కానుగ పలుకులు రూ.4,650 ధరలు పలికాయి. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు ● పదుల సంఖ్యలో మాత్రమే దస్తావేజులు ● క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. ‘వాలీబాల్’ ప్రవేశాల వేట! మహబూబ్నగర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలకు గురువారం ఎంపికలు నిర్వహించనున్నారు. –8లో u -
పాలమూరును అభివృద్ధి చేసేందుకే వచ్చా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘నేను చిల్లర మల్లర రాజకీయాల కోసం రాలే.. కేవలం మహబూబ్నగర్ భవిష్యత్ కోసం.. అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు వచ్చా.. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నా..’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతేడాది ట్రిపుల్ ఐటీని ప్రారంభించగా ఉమ్మడి జిల్లాకు చెందిన 20 శాతం మంది విద్యార్థులే సీటు దక్కించుకోగా.. ఈసారి ఏకంగా 65 శాతం ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మొత్తం 200 సీట్లు ఉంటే 130 దాకా ఈ ప్రాంతవాసులే పోటీపడి దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘శత శాతం’ ఉత్తీర్ణత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు పదోతరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించామన్నారు. దీంతో మహబూబ్నగర్లో వంద శాతం ఫలితాలు నమోదు కాగా, జిల్లాలో అది 94 శాతం మేరకు రావడం గర్వ కారణమన్నారు. ఇక త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతి విద్యార్థి చదవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమావేశంలో నగర మేయర్ జి.మమత, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, నాయకులు ఎన్పీ వెంకటేష్, సీజే బెన్హర్, శాంతన్నయాదవ్, వి.మహేందర్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు ఈసారి కూడా నిరాశేనా..
ప్రస్తుతం రెండు ఎకరాల రైతులకే రైతు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించడం నిరాశ కలిగిస్తోంది. గతంలో రైతుబంధు ద్వారా వచ్చిన పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సమకూర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రైతు భరోసా వస్తుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈసారి కూడా ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు నిరాశే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. – శ్యామ్సుందర్రెడ్డి, లింగంపల్లి, నవాబుపేట మండలం అర్హులందరికీ అందిస్తాం.. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు దశల వారీగా పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. రైతులు ఆధార్, భూ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలి. ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చు . – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భరోసాతో ప్రయోజనం లేదు.. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడటం లేదు. రెండు ఎకరాలకే భరోసా నిధులు విడుదల చేయడం వల్ల మిగతా భూమి సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాకు మూడెకరాల భూమి ఉంది. గత యాసంగిలో ఒక ఎకరాకే రైతు భరోసా అందగా, ఈసారి రెండు ఎకరాలకే ఇస్తామని చెబుతున్నారు. రైతులకు నిజమైన మేలు జరగాలంటే ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి. – జి.కాంతారావు, గూడూరు, చిన్నచింతకుంట● -
ఫిజిక్స్ అరుణ్కు ‘సరోజినీదేవి’ పురస్కారం
కందనూలు: జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయి త ఫిజిక్స్ అరుణ్కుమార్కు ’ఉత్తమ కవిత’ విభాగంలో చల్లా సరోజినీదేవి స్మారక సాహిత్య పురస్కారం– 2026 లభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిజిక్స్ అరుణ్ సినీ ప్రముఖుల సమక్షంలో అవార్డుతో పాటు నగదు పురస్కారం, సన్మానం పొందారు. మహిళా సాధికారత రచనాంశంపై ‘అంతా ఆమెమయం‘ శీర్షికతో రాసిన కవిత ఉత్తమ కవితల విభాగంలో ఒకటిగా నిలిచింది. ఆమె అన్నింటిలో సగం కాదు, అనంతంలో సమస్తమంటూ మహిళ లు నేడు శాస్త్రవేత్తలుగా, పర్యావరణ ప్రేమికులుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామిక వేత్తలుగా, ప్రభు త్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా కంపెనీల అధినాయకులుగా ఇలా అన్ని రంగాల్లో కీలకంగా మారారనీ, అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ కుల, మత ఛాందసవాదంతో అనాగరిక, అమానుష, లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారనీ కవితలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు అరుణ్ తన రచనలు శూన్యం, బిగ్ బ్యాంగ్ను అందించి అభినందనలు పొందారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు డాక్టర్ వెనిగళ్ల రాంబాబు, గోపీ చిరంజీవి, ప్రముఖ రచయిత్రులు జ్వలిత, నీరజాచంద్రన్, చల్లా సరోజినీదేవి కుటుంబ సభ్యులు భానుకిరణ్, వంశీకిరణ్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
డిండికి నాగార్జునసాగర్ నుంచి నీరు తీసుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్):డిండి లిఫ్టుకు పాల మూర్–రంగారెడ్డి నుంచి కాకుండా నాగార్జున సాగ ర్ గొట్టిముక్కల లిఫ్టు నుంచి నీరు తీసుకో వాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నాయకుడు బెక్కం జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి అర టీఎంసీ నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. పార్టీలకతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఒత్తి డి తెచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేయాల ని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని కోరారు. 2013లో తెచ్చిన జీఓను అమలు చేస్తూ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్సాగర్, ఆర్డీఎస్ పనులను పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలన్నారు. గట్టు ఎత్తిపోతల, వెల్టూరు గొందిమల్ల బ్యారేజ్, కాకరవాణి, చంద్రసాగర్, అమ్రాబాద్ పనులు తక్షణమే చేపట్టాలని కోరారు. రాష్ట్ర వాటా నీరు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే వరకు గోదావరి–కావేరి అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాఘవచారీ, వీరబ్రహ్మచారీ, హనీఫ్ అహ్మద్, పరమేశ్గౌడ్, చెన్నకిష్టన్న, ఖలీల్, సాయిబాబ, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
అదనపు కలెక్టర్కు తప్పిన ప్రమాదం
జడ్చర్ల: మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సోమవారం తృటిలో రోడ్డు ప్రమా దం బారి నుంచి బయటపడ్డారు. ఆయన ఆర్డీఓ నవీన్కుమార్తో కలిసి బాలానగర్ పర్యటన ము గించుకుని జడ్చర్ల వైపు వస్తుండగా గొల్లపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వరుసగా నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదనపు కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న స్థానిక రెవె న్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అద నపు కలెక్టర్ అధికారులతో కలిసి మరో వాహనంలో వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన మిడ్జిల్: మండల కేంద్రంలో జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ ఏర్పాట్లు, పార్కింగ్, హెలిప్యాడ్ స్థలాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ మహేష్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట ఈఈ నరేందర్రెడ్డి, తహసీల్దార్ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు, స్థానిక నాయకులు అల్వాల్రెడ్డి, గౌస్, వెంకటయ్య, సాయిలు, శంకర్, మల్లికార్జున్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, శంకర్నాయక్, సత్యంగుప్తా, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ
అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రంలో రహదారికి ఆనుకొని ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం.. అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి గిన్నె రాంచంద్రయ్య, భార్య కళావతి హైవే పక్కన సొంత ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్నారు. వారం క్రితం బంధువుల పెళ్లి కోసం కర్ణాటకలోని బళ్లారికి వెళ్లారు. కుమారుడు, కోడలితో కలిసి తిరుపతికి వెళ్లి ఆదివారం రాత్రి మూసాపేటకు తిరిగొచ్చారు. ఇంటి కిటికీకి ఉన్న ఇసుప గ్రిల్స్ విరగొట్టి ఉండడంతో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువా పగులగొట్టి చెవి కమ్మలను అలాగే దేవుడి గదిలో ఉన్న రెండు వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బంగారు, వెండి వస్తువుల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు రాంచంద్రయ్య తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం కళావతి సోదరి ఇంటికి వచ్చి శుభ్రం చేసి వెళ్లింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం రాత్రి చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్ల కిందట ఇదే ఇంట్లో.. మూడేళ్ల కిందట ఇదే ఇంట్లో చోరీ జరిగింది. దంపతులిద్దరూ బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు దొంగలు చోరీకి పాల్పడి వెండి వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. పోతూపోతూ ఇంట్లో ఉన్న సీసీటీవీ హార్డ్ డిస్క్ను కూడా తీసుకెళ్లారు. ఈసారి దొంగలు వాటి జోలికి వెళ్లకుండా చోరీ చేసి పారిపోయారు. హైవే పక్కన ఒకే ఇల్లు ఉండటంతో వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. -
మూఢ నమ్మకమే వ్యక్తి ప్రాణం తీసింది
కల్వకుర్తి టౌన్: ఉర్కొండ మండలం రేవల్లి గ్రామంలో శనివారం జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఐ భీమ్ కుమార్, ఉర్కొండ ఎస్ఐ రమాదేవితో కలిసి వివరాలు వెల్లడించారు. రేవల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూఢ నమ్మకాలను నమ్మే ఇతను జాతకాలు చెప్పే వారి వద్దకు వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు నీ పైన ఎవరో క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అదే గ్రామంలో ఉన్న యాదయ్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకొని అతడిని హత్య మార్చాలని నిర్ణయించుకున్నాడు. పతకం ప్రకారం ఈ నెల 26న రాత్రి యాదయ్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, దుస్తులను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. 48 గంటలలో హత్య కేసును చేధించిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కల్వకుర్తి డీఎస్పి వెంకట్ రెడ్డి అభినందించారు. ● హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన సీఐ -
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
రాజాపూర్ (బాలానగర్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన మీసాల మల్లేష్ (35) స్థానిక పరిశ్రమలో డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అదే కంపెనీలో పనిచేసే భూపని మల్లేష్ అనే వ్యక్తి ఫోన్చేసి మల్లేష్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు భార్యకు సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా తీవ్రగాయాలై అప్పటికే మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి భార్య మీసాల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. వెంటిలేటర్ స్లాబ్ కూలి బాలుడికి గాయాలు అమరచింత: పాఠశాలలో వెంటిలేటర్ స్లాబ్ కూలి పైన పడటంతో పవన్ కుమార్ అనే విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన అమరచింత పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమరచింత పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన పగడాకుల నరసింహా కుమారుడు పవన్ కుమార్ ఆదివారం సాయంత్రం అడుకునేందుకు పీఎంశ్రీ పాఠశాలలో గల మై దానంలోకి వెళ్లాడు.ఈ క్రమంలో అక్కడే ఉన్న పాత పాఠశాల భవనం పక్కన నిల్చోని ఉండగా వెంటిలేటర్కు సంబంధించిన స్లాబ్ ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో సబ్జా దిమ్మెలు పవన్ పై పడడంతో కుడికాలు విరగగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్య గండేడ్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధి లోని కొంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆన మోని మాధవులు (32) సెంట్రింగ్ కూలీగా జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో 2015లో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రాంపూర్కు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్లుగా భార్య లక్ష్మి భర్త నుంచి విడిపోయి హైదరాబాద్లో ఉంటుంది. ఎంతకూ భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన మాధవులు ఆదివారం రాత్రి పొలం వద్ద ఉన్న గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఇంట్లో దొంగల చేతివాటం తిమ్మాజిపేట: మహిళ చనిపోయి కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తూ శవాన్ని ఖననం చేసేందుకు వెళ్లగా మానవత్వం మరిచిన ఓ ఆగంతకుడు చేతివాటం ప్రదర్శించి దొంగతనానికి పాల్పడిన ఘటన తిమ్మాజిపేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆశమ్మ అనే మహిళ సోమవారం ఉదయం మరణించింది. బంధువులు వచ్చాక సాయంత్రం మృతదేహాన్ని తీసుకొని అంత్యక్రియలకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న దుండగుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారు కమ్మలు, బుట్టలు ఎత్తుకుపోయాడు. అంత్యక్రియలు ముగిశాక ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి వేసిన తాళంతో పాటు బీరువాకు వేసిన తాళం పగిలిపోయి ఉండడం చూసి అవాక్కయ్యారు. దాదాపు రూ.1.40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు చోరీ జరిగిందని తెలిపారు. చోరీ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
తెలంగాణ గుండె చప్పుడు సాయిచంద్
మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరైన జనంఅమరచింత: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ గుండె చప్పుడుగా సాయిచంద్ ప్రజలకు తరతరాలుగా గుర్తుండిపోతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. దివంగత రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ 3వ వర్ధంతిని పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిచంద్ విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ నాయకలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సాయిచంద్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నా.. ఏనాడు పదవులను ఆశించలేదన్నారు. ఆయన సేవలను గుర్తించి కేసీఆర్ కార్పొరేషన్ చైర్మన్తో గౌరవించారని, బంగారు భవిష్యత్ ఉన్న సాయిచంద్ అకాల మరణం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు మిగిల్చిందన్నారు. సాయిచంద్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన సతీమణి రజని ప్రజల్లో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్సాగర్, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్, నాయకులు నాగభూషణంగౌడ్, నరసింహులుగౌడ్, కౌన్సిలర్ తిరుమలేష్, మాజీ కౌన్సిలర్ రాజ్కుమార్, డీజే శేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. వైభోగం
● మన్యంకొండలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విపత్తు సమయంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సిబ్బందికి సూచించారు. సోమవారం స్థానిక విద్యుత్భవన్లో శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నాణ్యతలో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా, ఫీడర్ల పనితీరు, పెండింగ్ అభివృద్ధి పనులు, కాలిన స్టక్అప్ మీటర్ల మార్పిడి, వినియోగదారుల సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. 2026– 27 సంవత్సరానికి ప్రతిపాదిత అభివృద్ధి పనులు, బడ్జెట్ అవసరాలు, విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన సామగ్రి అందుబాటు అంశాలపై కూడా అధికారులు సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ భవన్లో మొక్క నాటారు. అదే విధంగా జిల్లా స్టోర్స్ తనిఖీ పర్యటనలో భాగంగా జిల్లా స్టోర్స్ను సందర్శించారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన 33 కేవీ హెచ్టీ సర్వీసు సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శివాజీ, చీఫ్ విజిలెన్స్ అధికారి నారాయణ, చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ (ఆపరేషన్) మహబూబ్నగర్ జి. భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక విద్యుత్ సౌధలో రూ.52.56 లక్షల వ్యయంతో నిర్మించనున్న విజిలెన్స్– ఏపీటీఎస్ పీఎస్ భవన నిర్మాణ పనులకు సీఎండీ జితేష్ విపాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని హన్వాడ మండలం గొండ్యాలలో 133 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూములను గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మాల మమత, ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ల్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
2న దేవరకద్రలో కోర్టు ప్రారంభం
దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రంలో జూలై 2న కోర్టు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం కోర్టు భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ దేవరకద్ర నియోజకవర్గకేంద్రంగా ఉన్నా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ కోర్టు ద్వారా దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట మండలాలకు సంబంధించిన అన్ని రకాల కేసులు ఇక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చామని, ఇప్పటికే రూ.30 కోట్ల నిధులు తెచ్చి వివిధ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే కోయిల్సాగర్ పర్యాటక కేంద్రం ఏర్పాటు కోసం రూ.9.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. రూ.33 కోట్లతో వంద పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయని. రూ.10 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. -
ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా?
● ఈఆర్ఎస్కు దివ్యాంగుల ఎదురుచూపులు ● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ● నెలలు గడిచినా ఫలితం శూన్యం ● ఉమ్మడి జిల్లాలో 120 మంది లబ్ధిదారులు వనపర్తి: దివ్యాంగుల ఆర్థిక బలోపేతానికిగాను ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఆర్ఎస్ (ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం) ఏడాది కాలంగా డోలాయమానంలో పడినట్లయింది. క్షేత్రస్థాయిలో ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నా.. వందశాతం రాయితీతో వచ్చే ఆర్థిక చేయూతకు రాష్ట్ర ఖజానా గేట్లు మూసివేసింది. గతేడాది ఆగష్టులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2026, ఫిబ్రవరిలో నిధుల మంజూరుకు ట్రెజరీకి టోకెన్లు పంపించారు. 2026 ఏడాదికిగాను దరఖాస్తు చేసుకునే సమయం వచ్చినా.. లబ్ధిదారుల చేతికి మాత్రం నేటికీ డబ్బులు అందలేదు. అసలు ఏమైంది.. లోపం ఎక్కడుందనే విషయం తెలియక అమాయకులైన దివ్యాంగులు ప్రతి సోమవారం ప్రజావాణికి, ఇతర రోజుల్లో డీడబ్ల్యూఓ కార్యాలయాలకు ప్రదక్షిణలు చేయడం తప్పా నెలలు గడుస్తున్నా చేకూరిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 120కి పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పథకం ముఖ్య ఉద్దేశం.. 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం.. 21 ఏళ్ల నుంచి 55 మధ్య వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్ఎస్ అమలు చేస్తోంది. మున్సిపాలిటీ, మండలానికి ఒకరు చొప్పున వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా మండల, జిల్లా కమిటీల నిర్ణయం మేరకు వందశాతం రాయితీపై గరిష్టంగా రూ.50వేల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో ఆ కుటుంబం టైలరింగ్, మొబైల్ రిపేరు, డెయిరీ, కంప్యూటర్ సెంటర్, ఇతర చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి. -
పీఎం కిసాన్ ఇప్పించండి
నాకు మా గ్రామంలో సర్వే నం.141లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం నాకు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేదు. మీరైనా స్పందించి పీఎం కిసాన్ నిధి ఇప్పించి న్యాయం చేయండి. – గోవిందు, పార్పల్లి, కోయిల్కొండ మండలం ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి.. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య పెరి గిపోతుంది. ఉన్న రోడ్లు సరిపోవడం లేదు. గతంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉండేవి. ప్రస్తుతం లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి ట్రాఫిక్ నియంత్రణలోకి రావడం లేదు. వెంటనే ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలి. – ఆనంద్కుమార్, శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు -
ట్యాంకర్లలో తెచ్చి వదులుతున్నారు..
సెజ్లోని పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ జలాలను హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరుకు తీసుకెళ్లి అక్కడి ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసిన తర్వాత బయటకు వదలాలి. ఖర్చు ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఫ్యాక్టరీల నిర్వాహకులు కాలుష్యపు జలాలను ఇక్కడే పంట పొలాల్లోకి నేరుగా వదులుతున్నారు. కొందరైతే ట్యాంకర్లలో తీసుకొచ్చి మా గ్రామ శివారు, వ్యవసాయ భూముల్లో పారబోస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు సీరియస్గా స్పందించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రాయపల్లి -
బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై ఎస్పీ డి.జానకికి వినతులు అందించారు. ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ ఆయా స్టేషన్ అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, అధికారులు సమన్వయంతో పని చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లావాసులు తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
ఓర్పుగా విని.. త్వరగా పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేబీఎల్ హరిప్రియతో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి సమస్యలను తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు ప్రజల సమస్యలను ఓర్పుగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం లేని సమస్యలైతే అందుకు గల కారణాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచకుండా నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, ప్రతి కార్యాలయంలో ఫైళ్ల కదలిక నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు. జూలై 1న నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో పోలీసు, వైద్య, పౌర సరఫరాలు, హౌసింగ్, మున్సిపల్, విద్యుత్, ఉపాధి, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా.. ఈ వారం ప్రజావాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డుల శాఖ, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 137 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్ఓ నిర్మల, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు పాల్గొన్నారు. అనవసరంగా పెండింగ్లో పెట్టొద్దు.. గడువు లోగా పూర్తి చేయండి ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూగుప్తా ఈ వారం ప్రజల నుంచి 137 వినతుల స్వీకరణ -
సహకార్ సే సమృద్ధి వారోత్సవాలకు శ్రీకారం
మహబూబ్నగర్ (వ్యవసాయం): సహకార రంగం బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సహకార్ సే సమృద్ధి కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సహకార వారోత్సవాలు సోమవారం మహబూబ్నగర్ డీసీసీబీ ఆడిటోరియంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి కృష్ణ సహకార ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓ)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎఫ్పీఓల పరిధిలో 2,290 మంది రైతులకు సభ్యత్వం కల్పించి రూ.34.89 లక్షల వాటా ధనాన్ని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులు ఈ వాటా ధనంతో వివిధ రకాల వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా సమాన వాటా ధనాన్ని ఆయా సంఘాలకు అందించిందన్నారు. సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్ పవర్, డీసీసీబీ జనరల్ మేనేజర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. డీఎఫ్ఓగా మందాడి నవీన్రెడ్డి మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లా అటవీశాఖ అధికారి ఆశిష్సింగ్ రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారిగా పని చేస్తున్న మందాడి నవీన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఏప్రిల్ 29న జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యత తీసుకున్నఆశిష్సింగ్ రెండు నెలల్లోనే బదిలీపై వెళ్లడం గమనార్హం. ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్లు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాలతో చదువులకు దూరమైన విద్యార్థులు ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొందవచ్చని, ఆన్లైన్ విధానంలో వచ్చేనెల 29వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, జరిమానాతో ఆగస్టు 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని వివరించారు. 7 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో జూలై 7 తేదీ నుంచి 21వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి జె.రాజశేఖర్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఏసీ, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. మూడు నెలల శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తారని, ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 7వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోతో జతచేయాలని కోరారు. మిగతా వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి 9440788502 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. పీయూలో కొనసాగుతున్న పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీపెడ్ మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 8వ సెమిస్టర్, బీఫార్మసీ 6 సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈమేరకు పరీక్షలను కంట్రోలర్ ప్రవీణ, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
అంతే.. ఆ‘తంతే’!
ఇష్టారాజ్యంగా ‘ఫార్మా’ వ్యర్థాల పారబోత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాలు కాలుష్యమయంగా మారాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమ ల నుంచి ఘనరూప వ్యర్థాలను ఎక్కడి పడితే అక్కడ పారబోస్తున్నారు. చినుకు మాటున రసాయనాలతో కూడి విషపూరిత జలాలను నేరుగా బయటకు వదులుతున్నారు. అయినా అటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనలు పట్టని ఫ్యాక్టరీలపై కనీస చర్యలు సైతం చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనిచేయని ఎమ్మెల్యే హెచ్చరికలు? పోలేపల్లి సెజ్ పరిధిలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పలు పర్యాయాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక సందర్భంలో ఓ పరిశ్రమను ప్రజలతో ముట్టడించి.. దగ్ధం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు. అసెంబ్లీ వేదికగా నిబంధనలు పట్టని పలు పరిశ్రమలు.. వాటి నిర్వాకంపై మాట్లాడారు. పీసీబీ పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ ప్రివిలేజి కమిటీకి ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు ఏ ఒక్క పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకెవరు చెబితే ‘అధికార’ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని సెజ్ పరిసరాల్లోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బరితెగించిన 2 పరిశ్రమలు.. సెజ్లోని కోహన్స్ లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమకు చెందిన సిబ్బంది సోమవారం ఘన వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల పక్కన పారబోశారు. గమనించిన రైతులు పరిశ్రమ ట్యాగులతో కూడిన ప్లాస్టిక్, గ్లౌజులు, ఇతర వ్యర్థాల ఫొటోలు తీసి.. హైదరాబాద్లోని పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆ ప్రాంతానికి ట్రాక్టర్ను, సిబ్బందిని పంపించి ఖాళీ చేసేందుకు యత్నించారు. అక్కడే ఉన్న రైతులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ప్రతిసారి చెబుతూనే ఉన్నా.. ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫ్యాక్టరీ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. కాగా, మరో ఫార్మా పరిశ్రమ నుంచి ట్యాంకర్ ద్వారా విషజలాలను సమీపంలోని ఓ ప్రాంతంలో గుంత తీసి వదిలిపెడుతున్నారు. ప్రధానంగా ఈ రెండు పరిశ్రమలు మరింత బరితెగించాయని.. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. ఓ పరిశ్రమ నుంచి గుంతలో వదిలిన కాలుష్యపు జలాలు షరామామూలు.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో సుమారు 1,100 ఎకరాల్లో భూములు సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్కు 250 ఎకరాలు కేటాయించారు. ఇందులో 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడిన ద్రవ వ్యర్థాలను శుద్ధి చేశాకే బయటకు వదలాలి. ఘన వ్యర్థాలను నిర్దిష్ట ప్రాంతాలకు తరలించి రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలను ఏ ఒక్క పరిశ్రమ కూడా పట్టించుకోకవడం లేదు. ప్రధానంగా వర్షాకాలంలో వరద మాటున వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే పరిసర పంట పొలాల్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం వర్షాలు అంతగా లేకున్నా.. పలు పరిశ్రమల నిర్వాహకులు చినుకుల మాటున రాత్రిళ్లు దొంగచాటున రసాయనాలతో కూడిన నీటిని సరఫరా చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల్లో వాడిన గ్లౌజులు, ప్లాస్టిక్, సిరంజి వంటి వ్యర్థాలను సెజ్లోని ఖాళీ ప్రదేశాలు, పొలాల్లో ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. ఫలితంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సెజ్ సమీప ప్రాంతాల్లోని భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. చినుకు మాటున బయటకుశుద్ధి చేయని జలాల సరఫరా సరిగ్గా పండని పంటలు.. మూగజీవాల మృత్యువాత షరామామూలుగా పట్టించుకోని పీసీబీ, జిల్లా అధికారులు నిబంధనలు పట్టని ఫ్యాక్టరీలపై కానరాని కనీస చర్యలు అరణ్యరోదనగా ‘పోలేపల్లి’ పరిసర రైతుల ఆవేదన -
మసిగొండ్లపల్లిలో ఉద్రిక్తత
మిడ్జిల్: మండలంలోని మసిగొండ్లపల్లిలో మొహర్రంలో ప్రారంభమైన గొడవ చివరకు ఉద్రికత్తకు దారి తీసింది. ఆదివారం ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆరుగురికి గాయాలైనట్లు తెలిసింది. ఘటనా స్థలానికి ఎస్ఐ శ్రీనువాసులు తమ సిబ్బందితో వెళ్లడంతో ఇరువర్గాల వారు పోలీస్స్టేషన్కు వచ్చారు. గ్రామంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిస్థితిని సమీక్షించారు. విచారణ అనంతరం దాదాపు ఇరువర్గాలకు చెందిన 36మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం గ్రామంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
‘సర్’ ఫారం.. ఇలా నింపండి..
సిబ్బందికి సూచనలు ఇచ్చాం ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. ప్రజలకు ఫారం ఇవ్వటమే కాక వాటిని నింపడంలో బీఎల్వోలు సహకరిస్తారు. ఫారంను పూర్తిగా చదివిన తర్వాతే దానిని నింపడం చేయాలి. తప్పులు లేకుండా నింపడం ద్వారా ఓటర్ కార్డులో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఉంటాయి. –మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి జెడ్పీ సెంటర్(మహబూబ్నగర్)/కల్వకుర్తి టౌన్: ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఉండే ఎన్యూమరేషన్ ఫారం అందజేస్తారు. సరైన సమా చారం అందిస్తేనే మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. ఈ ఫారం ఎలా నింపాలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఫారాన్ని ఎలా నింపాలో అధికారులు సూచిస్తున్నారు. ఎన్యుమారేషన్ ఫారం ఇలా.. ఓటర్ జాబితాను ధృవీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించేందుకు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకునేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఈ ఫారంలో వివరాలు నింపేటప్పుడు తప్పులు లేకుండా స్పష్టంగా రాయాలి. ఫారంలో పొందపరిచిన విభాగాలు 01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే.. 2002 ఓటర్ జాబితా వివరాల ఆధారంగా ఈ కాలాన్ని నింపాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, సంరక్షకుడి పేరు, అతనితో మీకు ఉన్న బంధుత్వం వివరాలను నింపాలి. 2002 ఓటర్ జాబితాలో గల శాసనసభ నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ స్టేషను నెంబరు (భాగం సంఖ్య), క్రమ సంఖ్య ( ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబరు) ఎంత అనేది వేయాలి. 01–01–2002 నాటికి ఓటు లేకపోతే.. మీకు ఓటు లేదు.. 2002 ఓటర్ జాబితాలో మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరికో ఓటు ఉందో వారి వివరాల ప్రకారం ఈ బాక్స్ పూరించాలి. పేరు అనే చోట తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మ లలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ వేయాలి. బంధువు అనే చోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నెంబర్ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కానీ మీ బంధువుల్లో ఓటు ఉన్న వారి వివరాలు ఈ బాక్సులో నింపాలి. ఫారం పై భాగం.. మీ పేరు, మీ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫోటోతో ముందుగా ము ద్రించి ఉంటాయి. అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫోటో తప్పనిసరిగా అతికించాలి. మొదటి భాగంలో.. 2002లో ఓటు ఉన్న వారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేని వారికోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాలలో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకొని నింపాలి. మరో భాగం.. చివరి భాగంలో ఓటరు ప్రస్తుత వివరాలను నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి వాటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు వారి ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి కాకుంటే ఆ బాక్సులు ఖాళీగా వదిలేయాలి. ఓటర్లు అందించాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, జనన ధవీకరణ పత్రం, పాస్ పోర్ట్, 10వ తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన వివరాల అందించడం వల్ల భవిష్యత్తులో ఓటర్ కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పులు లేకుండా నింపాలి ఫామ్ అందజేసిన తర్వాత రశీదు తప్పనిసరి ఓటర్లు చేయాల్సిన చేయకూడని నిబంధనలు వివరించిన అధికారులు ఫారంలో కొత్త కలర్ ఫొటో అతికించాలి -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
వెల్దండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చౌదర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవైన ఉపాధ్యాయులు, డిజిటల్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చౌదర్పల్లి పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గురు వలంటీర్ల నియమించి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజీవ్ తదితరులు ఉన్నారు. -
ఏరువాక సాగారో.. అన్నో రైతన్నా
ఏరువాక పౌర్ణమి.. రైతు సంస్కృతికి జీవనాడి నారాయణపేట: మండే ఎండలతో పగుళ్లు పడిన నేల.. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న.. తొల కరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న పొలాలు.. ఈ దృశ్యాల మధ్య జూన్ 29న జరుపుకునే ఏరువాక పౌర్ణమి రైతుజీవితంలో మరో కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతోంది. భూమాతకు నమస్కరించి, ఎద్దులను అలంకరించి, నాగలికి పూజలు చేసి తొలి దుక్కితో సాగును ప్రారంభించే ఈ పండుగలో రైతు విశ్వాసం, ప్రకృతి పట్ల కృతజ్ఞత, జీవన తత్వం అంతర్లీనంగా కనిపిస్తాయి. ఏరువాక సాగారో...‘ అనే జానపద గీతం వినిపించగానే రైతు గుండెల్లో కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే ఏరువాక పౌర్ణమి కేవలం ఓ పండుగ కాదు.. వానకాలం వ్యవసాయానికి శ్రీకారం, ప్రకృతికి కృతజ్ఞత, భూమాతకు వందనం, సమృద్ధి పంటల కోసం రైతన్న చేసే మహా ప్రార్థన.వ్యవసాయా న్ని జీవనాధారంగా భావించే తెలుగు రాష్ట్రాల్లో ఏరువాక పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా భావించే ఈ రోజున రైతులు ఎద్దులు, నాగలి, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి పొలంలో తొలి దుక్కితో కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతారు. ఈ ఏడాది జూన్ 29 సోమ వారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా గ్రామాల్లో సంప్రదాయ వేడుకలు జరగనున్నాయి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూ మాతను, వర్షాధిపతి ఇంద్రుడిని ప్రార్థిస్తూ సమృద్ధి గా వర్షాలు కురవాలని రైతులు కోరుకుంటారు. వాతావరణ మార్పుల సవాల్ ఒకప్పుడు ఏరువాక సమయానికి వర్షాలు కచ్చితంగా పడతాయనే నమ్మకం ఉండేది. ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, ఒకేసారి భారీ వర్షాలు కురవడం, మధ్య లో దీర్ఘ విరామాలు రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాల అంచనాలను గమనిస్తూ సాగు చేయాలని, తక్కువ కా లంలో పండే రకాలను ఎంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏరువాక అంటే.. ‘ఏరు’ అంటే నాగలి. ‘వాక’ అంటే ప్రారంభం. నాగలితో భూమిని దున్నే వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే రోజే ఏరువాక. వానకాలం సీజన్కు ముందుగా రైతులు భూమిని సిద్ధం చేసుకునే ఈ సమయం వ్యవసాయ చక్రంలో కీలకమైన దశ. పురాణాల ప్రకారం భూమిని దేవతగా భావించి, పంటల ద్వారా జీవనాధారం కల్పిస్తున్న ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఉద్దేశంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. ఎద్దుల మెడలో గంటలు.. ప్రత్యేక అలంకరణలు భూమాతకు నమస్కారం.. కొత్త సాగుకు శ్రీకారం ఏరువాక తర్వాతే అసలు వ్యవసాయ సందడి నేడు ఏరువాక పౌర్ణమి -
రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి, అన్నకు గాయాలు
మిడ్జిల్: మండల కేంద్రంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా అన్న తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మిడ్జిల్ మండలంలోని మసిగొండ్లపల్లికి చెందిన అన్న, తమ్ముడు శ్రీను, రాజేందర్(36) ఇద్దరు కలిసి బైక్పై మిడ్జిల్కు వచ్చి తిరిగి వెళ్తుండగా స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం 108లో మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేందర్ మృతి చెందగా శ్రీను తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మృతుడు రాజేందర్కు ముగ్గురు భార్యలు, ఆరు మంది పిల్లలు ఉండగా వారు అతడిని వదలేసి వెళ్లడంతో తల్లి మణేమ్మ వద్ద ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంపై ఎస్ఐ శ్రీనువాసులును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చెరువులో పడి యువకుడి మృతి నవాబుపేట: బంధువుల ఇంట్లో జరిగిన పూజ కు సంబంధించిన పూజా ద్రవ్యాలు చెరువులో కలిపేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశా త్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని తీగలపల్లిలో చోటుచేసుకుంది. తీగలపల్లికి చెందిన మంగళి రాంప్రసాద్(26) ఆదివారం బంధువుల ఇంట్లో మూడు రోజుల క్రి తం జరిగిన వ్రతానికి చెందిన ద్రవ్యాలను ఆది వారం బంధవులతో కలిసి చెరువు నీటిలో కలిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో ము నిగిపోయాడు. బంధువులు గ్రామస్తులకు సమాచారం అందించగా.. చెరువు నీటిలో వెతకగా.. తూమ్ చెంత శవమై తేలాడు. మృతుడి తండ్రి మంగలి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. రోడ్డుప్రమాదంలో మహిళ దుర్మరణం వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఇద్దరికి గాయాలైన ఘటన వనపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణ ఏఎస్ఐ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన చిలుమూర్తి రమేష్, భార్య చిట్టెమ్మ, కొడుకు వంశీ కలసి ఆదివారం ఉదయం బైక్పై పెద్దకొత్తపల్లి మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.., వనపర్తి పట్టణంలోని ఓల్డ్ యూకో బ్యాంకు వద్ద ఆదివారం మధ్యాహ్నం డీసీఎం అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న బైకును ఢీ కొట్టడంతో చిట్టెమ్మ (51)కింద పడిపోగా.. ఆమైపె డీసీఎం వెళ్లింది. దీంతో చిట్టెమ్మను వెంటనే స్థానికులు మాణిక్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. మరో ఇద్దరు చిలుమూర్తి రమేష్, కుమారుడు వంశికి గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు వంశి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య మానవపాడు: పోతులపాడు–అలంపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ అశోక్కుమారు కథనం ప్రకా రం.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపుగా ఆదివారం తెల్లవారుజామున కి.మీ. 232.6.7. మధ్య రైలు పట్టాలపై సుమారు 30–35ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన బైక్ కీ ఆధారంగా అతడు ప్రకా శం జిల్లా గిద్దలూరు చెందిన వ్యక్తిగా భావిస్తు న్నారు. ఎరుపు రంగు ఆఫ్ హ్యాండ్స్ టీ–షర్ట్సు, నీలం రంగు లోయర్ లేత గ్రీన్ కలరు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఛాతి కింద కుడివైపు నల్లని పుట్టుమచ్చ ఉంది. మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. తాళం వేసిన ఇంట్లో చోరీ బల్మూర్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని పోలీశెట్టిపల్లి శివారులో శివసాయినగర్లో వెలుగు చూసింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. శివసాయినగర్లో నివాసం ఉంటున్న సాజిదాబేగ్, భర్త ఖాజలు ఈ నెల 25న మొహర్రం పండుగ సందర్భంగా కొండనాగుల గ్రామానికి వెళ్లారు. పండుగ అనంతరం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో 2 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు, 10 విలువైన చీరలు అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని బాధితులు వా పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
‘విద్యాహక్కు’ను పకడ్బందీగా అమలుచేయాలి
మెట్టుగడ్డ: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో విద్యాహక్కు చట్టం అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో తొంభై శాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, విద్యార్థులు మేలుకుంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చన్నారు. అదే విధంగా బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో పాత పద్ధతిని అవలంబించాలని కొత్త జీఓను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పథకాన్ని పూర్తిగా నీరు గార్చే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మంచిదని లేని పక్షంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. విద్యాహక్కు చట్టానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షుడు విజయ్కుమార్, బీసీ జేఏసీ కన్వీనర్ బెకెం జనార్థన్, జుర్రు నారాయణయాదవ్, బుగ్గన్న, సారంగి లక్ష్మీకాంత్, అశ్విని సత్యం, మున్నూర్ జైపాల్, చెన్నయ్య, విద్యార్థి సంఘాల నాయకులు నరసింహ, భరత్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సెట్విన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జడ్చర్ల: జడ్చర్ల సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో పలు కోర్సులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ కో ఆర్డినేటర్ విజయ్కుమార్ తెలిపారు. కోర్సులకు ఎంపికై న వారికి జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నా రు. 3నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని, తదు ప రి పరీక్ష నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యూటీషియన్, అడ్వా న్స్ బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్స్ తయారీ, కంప్యూటర్ కోర్సు, డీటీపీ, స్పోకెన్ ఇంగ్లీష్, కోర్సులకు 10వ తరగతి, జర్దోసి, మగ్గంవర్క్, ఎలక్ట్రీషియన్, హౌసింగ్ వైరింగ్కు 7వ తరగతి విద్యార్హత కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఆధార్, 2 పాస్ఫొటోలతో దరఖాస్తులు చేయాలన్నారు. వివరాలకు 94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్లో క్రీడాకారులకు రెండోస్థానం మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లోని మణి కొండలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–19) బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఎన్జే జోయెల్, సంతోష్కుమార్ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచారు. జిల్లా క్రీడాకారులు రెండోస్థానంలో నిలవడంపై మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి
కందనూలు: వానాకాలంలో విత్తనాలు పొలంలో వేసి వర్షాలు పడక తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రక్షించేందుకు పాలకులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని కోరారు. రైతులు వినియోగించే ఎరువులు, విత్తనాలు, యూరియా ధరలను విచ్చలవిడిగా పెంచేసి విక్రయిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఏడాది లోపు రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, పంట కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి నెల రోజులు కావస్తున్నా.. పనులు పురోగతి మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 36 లక్షల సాగు భూమి ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండగా.. నల్లగొండ జిల్లాలో 17 లక్షల ఆయకట్టు ఉండగా 14.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. యథేచ్ఛగా డిండికి నీరు తరలిస్తున్నా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వల సామర్థ్యం కుదింపునకు ప్రస్తుత మంత్రి జూపల్లి కారణమని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం మానుకొని రెండున్నరేళ్లలో రేవంత్రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దొంగలకు దేహశుద్ధి
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి పరిధిలో ప్రతి ఆదివారం జరిగే మైస మ్మ జాతరలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడడంతో దేహశుద్ధి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్ర త్యక్ష సాక్షులు, ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. మైసమ్మ జాతరలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడి సెల్ఫోన్లు, చిన్నపిల్లల కాళ్ల కడియాలు, కొంత నగదును అపహరించడంతో గమనించిన భక్తులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి ఆలయ కమిటీకి అప్పగించారు. మొక్కులు తీర్చుకునేందుకు మైసమ్మ దగ్గరికి వచ్చిన మహిళలు చిన్నారులును ఎత్తుకొని వెళ్తుండగా.. వెనుక నుంచి పిల్లల కాళ్లకు ఉన్న వెండి కడియాలు, గొలుసులు, సెల్ఫోన్లు కొట్టివేయడం ఆ మహిళలకు వెన్నతోపెట్టిన విద్యగా మారింది. మైసమ్మ జాతర వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుండంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం మహాసభ కృషి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆర్యవైశ్య మహాసభ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ అన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా గుద్దేటి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కలకొండ రాఘవేంద్రగుప్త, కోశాధికారిగా వలకొండ చంద్రశేఖర్, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభను మరింత బలోపేతం చేయాలని కోరారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పట్టణ పురోభివృద్ధికి అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పట్టణ అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల సహకారంతోనే సాద్యమవుతుందన్నారు. ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి గణేష్గుప్త, రాజకీయ కమిటీ చైర్మన్ ఆగీరు వెంకటేశ్, రామకృష్ణ, సోమిశెట్టి సాయికిషోర్, జిల్లా అధ్యక్షుడు పాలాది రాంమోహన్, దేవాలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ ఇమ్మడి వెంకటరమణ, మేడిశెట్టి రవికుమార్, గుబ్బ ఆంజనేయులు, భీంశెట్టి హన్మంతయ్య, విట్యాల రామేశ్వర్, బెజుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లతో ఎస్టీలకు ఎంతో లబ్ధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఒకే భాష, సంస్కృతి కలిగిన ఎస్టీలు రిజర్వేషన్లతో అన్ని రంగాల్లో లబ్ధి పొందుతున్నారని మహబూబాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ అన్నారు. ఆదివారం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ రిజర్వేషన్లు కల్పించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. ఆమె 1976లో తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు లంబాడీలు, ఆదివాసీలు ఎందరో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. రాజకీయంగా ఎస్టీ నాయకులకు వివిధ పదవులు దక్కాయన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సామాజిక న్యాయం దక్కిందన్నారు. ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తున్న ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా ఎస్టీలకు సబ్–ప్లాన్, పోడు భూములకు హక్కులు కల్పించారని, రైతు భరోసా, రుణమాఫీ, బీమా తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. వచ్చే సెప్టెంబర్ 18 నాటికి బస్సు యాత్ర పూర్తవుతుందని, చివరిరోజు హైదరాబాద్లో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ మైసిగండి నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో పూర్తయిందన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జటోత్ రాంచందర్నాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత తదితరులు పాల్గొన్నారు. -
మొదటి రోజు 99 శాతం పూర్తి
● జిల్లాలో 1,05,564 మంది చిన్నారులకు పోలియో చుక్కలు పాలమూరు: వైద్యారోగ్యశాఖ పరిధిలోని జిల్లా ఇమ్యూనైజేషన్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లావ్యాప్తంగా 0–5 ఏళ్ల బాలబాలికలకు పల్స్ పోలియో చుక్కల మందు విజయవంతంగా పంపిణీ చేశారు. ఒక్క రోజే 99 శాతంతో మొత్తం 1,05,564 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. మిగిలిపోయిన చిన్నారులకు సోమ, మంగళవారం ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేస్తారు. మహబూబ్నగర్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ మమత హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు సైతం చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. రెండు చుక్కలు జీవం పిల్లల జీవితానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అందరూ సకాలంలో చుక్కల మందు వేయడం వల్ల దేశాన్ని పోలియో రహిత భారతంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, డీఐఓ డాక్టర్ శైలజ, డాక్టర్ పులివిద్య, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత.. ఎన్నిక
జూలై 10న నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. రెండురకాల బ్యాలెట్ పత్రాలు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ● జూన్ 29న నోటిఫికేషన్ జారీ ● జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ ● జూలై 5న పరిశీలన ● జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ● జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా జిల్లా సంఘాలు ఓటర్లు జో.గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 ఎన్నికల షెడ్యూల్.. నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల -
ట్రామా కేర్ కలేనా?
గోల్డెన్ అవర్లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు –8లో uప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
జూలై 4న మిడ్జిల్కు సీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్లు రాములు, నరేష్, రాజ్కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ిసీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి ఎన్ని నిధులు అవసరమో, తక్షణం కేటాయించి పూర్తిచేసి ఈ రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. కేసీఆర్ హయాంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కానీ దానికి రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేస్తే అల్లంపూర్ రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కేఎల్ఐ, భీమా ఫేస్ 1, 2, నెట్టెంపాడ్, కోయిల్సాగర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాంతం, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణాడెల్టాలో వాళ్ల నీటివాటా కంటే అధికంగా నీళ్లను తరలించకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరంటినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. -
జిల్లావాసులకు సరైన సలహాలు, వైద్యం అందిస్తా
● పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని, మహబూబ్నగర్ ప్రాంత వాసులు ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి సన్మానోత్సవం ఆదివారం రాజా బహుదూర్రెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోగుల ప్రేమ, దీవెనలే తన సంపద అని అన్నారు. జిల్లాకు చెందిన క్యాన్సర్ రోగులు నన్ను కలవడానికి వచ్చినప్పుడు సరైన సలహాలు, వైద్యం అందిస్తానని తెలిపారు. అలాగే వారికి ఆర్థికంగా అండగా నిలిచి సహాయంగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పాలకొండ విజయానందరెడ్డికి పద్మశ్రీ అవార్డు లభించడం జిల్లాకే గొప్ప గౌరవమన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం మన యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, రెడ్డిసేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూము ఇంద్రసేనారెడ్డి, వేపూరు రాజేందర్రెడ్డి, నాయకులు మల్లు నర్సింహారెడ్డి, జి.వెంకట్రాంరెడ్డి, నలమద్ది సురేందర్రెడ్డి, కోటేశ్వర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజనుల అభ్యున్నతి ఘనత ఇందిరమ్మదే
భూత్పూర్: అంబేడ్కర్ ఆశయా లు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు కల్పించి, భూ సంస్కరణలు, పోడుభూముల పట్టాలను పంపిణీ చేసిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జటోత్ రాంచందర్నాయక్ పేర్కొన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపాలిటీలోని రాందాస్ తండాలో రిజర్వేషన్ స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర భూత్పూర్కు చేరుకుంది. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలకోటి స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. రిజర్వేషన్లు కల్పించడంతో నేడు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు, రాజకీయంగా ఎదిగారంటే ఇందిరమ్మ ఆశీర్వాదంతోనేనని పేర్కొన్నారు. తండాల్లో ప్రతి ఇంట్లో సంత్సేవాలాల్ ఫొటోతోపాటు ఇందిరమ్మ ఫొటోను పెట్టుకోవాలని గిరిజనులకు సూచించారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరమ్మ ఆశయ సాధనకు కృషిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆదే దిశగా ఆరు గ్యారెంటీలతో ముందుకు సాగుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసిన ఘనత మాజీ సీఎం రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గిరిజనులకు చేపట్టిన పథకాలు, ఇందిరా గాంధీ కల్పించిన రిజర్వేషన్లు, గిరిజనులకు స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశంతో బస్సుయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గిరిజన మహిళలు నృత్యం చేస్తుండగా.. బస్సుయాత్రలో వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలతో నృత్యం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, శాసనమండలి కోచైర్మన్ కేతావత్ శంకర్నాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, భుక్య మురళీ నాయక్, రాందాస్నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, కాంగ్రె్స్ పట్టణ అధ్యక్షుడు నవీన్గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచందర్నాయక్ భూత్పూర్కు చేరుకున్న ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర -
ఎంఈఓపై విచారణకు ఆదేశం
● ‘ఎడ్యుకేషన్–కరప్షన్’ కథనానికి స్పందించినఉన్నతాధికారులు ● వెంటనే విచారణ చేపట్టాలని డీఈఓకు ఆదేశాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల విషయంలో పలు అక్రమాలు జరిగాయని పేర్కొంటూ ‘సాక్షి’దినపత్రికలో మే 19న ప్రచురితమైన ఎడ్యుకేషన్–కరప్షన్ కథనానికి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు కథనానికి స్పందిస్తూ మహబూబ్నగర్ డీఈఓ విజయకుమారికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ ఎంఈఓ లక్ష్మణ్సింగ్పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. దీన్ని అర్జెంట్ ఎంక్వయిరీగా భావించి త్వరగా విచారణ చేయాలని ఆదేశించారు. అయితే గత నెల 23వ తేదీనే ఆర్డేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా.. జూన్ 27వ తేదీ వరకు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందన లేదు. విచారణ జరగకపోయినప్పటికీ అధికారులకు వచ్చిన లెటర్ను సంబంధిత సెక్షన్ అధికారులు దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో విచారణ చేయాల్సిందిగా మరోసారి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా మండల ఎంఈఓ కార్యాలయంలో జరుగుతున్న విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఎంఈఓపై విచారణ చేయాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, విచారణ చేసి వీలైనంత త్వరగా నివేదిక పంపిస్తామని ఆమె పేర్కొన్నారు. -
రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు
● ఉమ్మడి జిల్లాలో 11 తహసీల్ కార్యాలయాలకు మహర్దశ ● గద్వాల ఆర్డీఓ కార్యాలయానికి సైతం నిధుల కేటాయింపు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శిథిలావస్థలోఉన్న తహసీల్దార్ కార్యాలయాలు, డివిజన్ రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్డీఓ, 107 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక ఆర్డీఓ, 11 తహసీల్దార్ కార్యాలయాలకు మహర్దశ రానుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రతి భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు చొప్పున నిధులు కేటాయించనున్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో లేదా శిథిలావస్థలో పని చేస్తున్న కార్యాలయాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పనుల అమలు బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగించారు. మహబూబ్నగర్ జిల్లాలో రాజాపూర్, మహమ్మదాబాద్, కౌకుంట్ల, కోయిల్కొండ తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి తహసీల్దార్ కార్యాలయాలతో పాటు గద్వాలలో ఆర్డీఓ కార్యాలయానికి నిధులు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్, రేవల్లి, చిన్నంబావి, వీపనగండ్ల, నాగర్కర్నూల్ జిల్లాలో కోడేరు తహసీల్ కార్యాయాలకు మహర్దశ రానుంది. కొత్త భవనాల నిర్మాణంతో రెవెన్యూ సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కలగడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందే అవకాశం ఉంది. -
పులుల ఖిల్లా.. నల్లమల
ఏటీఆర్ పరిధిలో గత నవంబర్ నుంచి జూన్ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్లను నాలుగు బ్లాక్లుగా విభజించారు. ప్రతి బ్లాక్లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్ను 2 చ.కి.మీ. గ్రిడ్లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గణన ఇలా.. కెమెరాలతో నిఘా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 42కు చేరిన పెద్ద పులులు 2024–25తో పోల్చితే ఆరు అధికం గణనీయంగా పెరిగిన ఆడ పులుల సంతతి సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు -
అంతర్రాష్ట్ర చెక్కుల దొంగ అరెస్టు
మహబూబ్నగర్ క్రైం: చెక్కులు దొంగతనం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని పట్టణ శివారు ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన సిద్ధేష్ కొన్ని రోజుల నుంచి బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మోసం చేస్తూ చెక్కులు మాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 1న మహబూబ్నగర్ న్యూటౌన్లో ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ వద్ద మహ్మద్ అసదుల్లా అనే వృద్ధుడు విత్డ్రా కోసం చెక్కు రాస్తున్న క్రమంలో సహాయం చేస్తానని నమ్మించాడు. అనంతరం బాధితుడికి తెలియకుండా చెక్బుక్లోని సంతకం చేసిన ఒక చెక్కును అపహరించాడు. వారం రోజుల తర్వాత అనంతపురం జిల్లా రాంగనర్ ఎస్బీఐ బ్రాంచ్లో బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన మరో వ్యక్తిని నమ్మించి అతని వద్ద రూ.90 వేలు తీసుకొని దొంగతనం చేసిన చెక్కును సదరు వ్యక్తి ఖాతాలో జమ చేశాడు. 2025లో ఫిబ్రవరిలో మహబూబ్నగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ క్లాక్టవర్ బ్రాంచ్లో ఒక వృద్ధుడి వద్ద చెక్కు అపహరించి రూ.50వేలు డ్రా చేసినట్లు తెలిపారు. సదరు నేరస్తుడు సిద్ధేష్పై తెలంగాణ, ఏపీలో కలిపి 16 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్భాస్కర్, హెడ్కానిస్టేబుల్ శేఖర్, కా నిస్టేబుళ్లు శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు
● జిల్లాలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం ● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ● జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,06,208 మంది పాలమూరు: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్న పల్స్పోలియో కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలియో వ్యాక్సిన్లను పీహెచ్సీలకు, ఉప కేంద్రాలకు చేర్చారు. జిల్లాలో 2,824 మంది వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఆదివారం 676 కేంద్రాల ద్వారా పోలియో చుక్క లు వేయడంతో పాటు ఈ నెల 29,30 తేదీలలో 2,01,448 గృహాలను సందర్శించి చుక్కల మందు వేయనున్నారు. ● జిల్లాలో చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేయడానికి సంబంధిత శాఖ అధికారులు ఉన్న 16 మండలాలో ఉన్న 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 190 సబ్సెంటర్స్, 2 కమ్యూనిటీ హెల్త్సెంటర్స్, ఏరియా సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, 441 గ్రామాల్లో కలిపి మొత్తం 676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇప్పటికే 6,744 పోలియో వ్యాక్సిన్ వాయిల్స్ వచ్చాయి. జిల్లాలో 68 రూట్లు విభజించి 68 మంది పర్యవేక్షకులను నియమించారు. 24 మొబైల్ బృందాలు, 2,824 మంది వ్యాక్సినేటర్లు, 225 మంది ఏఎన్ఎంలు, 853 ఆశలు, 1,133 అంగన్వాడీలు, 613 మంది వలంటీర్లు ఈ పోలియో చుక్కల పంపిణీలో పాల్గొనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 0–5 వయసు కలిగిన 1,06,208 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ చుక్కల మందు వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆయా పల్స్ పోలియే కేంద్రాలు వ్యాక్సిన్ వాయిల్స్ పంపిస్తారు. ప్రతి సెంటర్లో ఉదయం 7 గంటల నుంచి చుక్కల మందు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ● జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ ప్రతి చిన్నారికి చుక్కల మందు వేయాలని సంకల్పంతో జిల్లాలోని ప్రతి బస్టాండ్, రైల్వేస్టేషన్లలో కూడా చుక్కల మందు పాయింట్స్ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాలో 30 మొబైల్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. ● పల్స్ పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాకేంద్రంతో పా టు దేరవకద్ర, జడ్చర్ల, నవాబ్పేటలో స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో చుక్క ల మందు వ్యాక్సిన్ నిల్వ ఉంచుకొని అవసరమైన ప్రాంతాలకు పంపిస్తారు. ఈనెల 29న వైద్యా ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చుక్కలమందు వేయించుకోని పిల్లలు మందు వేస్తారు. -
హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్రెడ్డి
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన బి.అజిత్రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్రెడ్డి వద్ద స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్రెడ్డి 2012 సివిల్ సర్వీస్కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఆహారం నాణ్యత పరిశీలించాలి: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వివాహ, శుభ కార్యాలు, విందులు, సామూహి క భోజనాల అనంతరం మిగిలిపోయిన ఆహారాన్ని స్వీకరించే ముందు దాని నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఓ ప్రకటనలో సూచించారు. పెళ్లిళ్లు, వేడుకలు, ఇతర కార్యక్రమాల అనంతరం మిగిలిన ఆహారాన్ని కొందరు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సేవా సంస్థలు అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆహారం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఆహారం తయారైన సమయం, నిల్వ చేసిన విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, రవాణా పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పంపిణీ చేసి వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలాంటి ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆస్పత్రిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిలకడగా ఫుడ్ పాయిజన్ బాధితుల ఆరోగ్యం పాలమూరు: కలుషితమైన స్వీట్ తినడం వల్ల వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో పాటు మ హిళలను డీఎంహెచ్వో పరిశీలించారు. మోతీనగర్లో 25న జరిగిన పెళ్లి వేడుకలో తయారు చేసిన కద్దు కీ ఖీర్ స్వీట్ మరసటి రోజు మధ్యాహ్నం తర్వాత తినడం వల్లే 41 మందికి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనా లు అయినట్లు తెలిపారు. వారందరూ రాత్రి జనరల్ ఆస్పత్రిలో చేరారని, ఇందులో 26 మంది చిన్నారులు, ఒక గర్భిణితో పాటు మరో 14 మంది మహిళలు, పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జి అవుతారని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్ పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి పాలమూరు: గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జమిస్తాపూర్లో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలెవరూ చట్టాలను చేతుల్లోకి తీసుకోవద్దని, చట్ట పరిధిలో నడుచుకోవాలన్నారు. క్షణికావేశంలో గొడవలకు పోతే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని తెలుసుకోవాలని సూచించారు. వర్షకాలం సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే వాటిని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీంద్ర నాయక్, యోగేశ్వర రాజ్, మల్లారెడ్డి, శివరాజ్, సర్పంచ్ లక్ష్మీ మొగులయ్య, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతు బలవన్మరణం
మిడ్జిల్: మండలంలోని కొత్తపల్లిలో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రెడ్యానాయక్(60) లింబ్యాతండా సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద శనివారం ఉదయం వెళ్లాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకోగా.. చుట్టుపక్కలవారు గమనించిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మృతిచెందాడు. మృతుడి కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోసుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి భార్య సాలమ్మ ఉన్నట్లు తెలిపారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి బల్మూర్: అతివేగంగా అజాగ్రత్తగా బైక్పై వచ్చి మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైన ఘటన మండలంలోని అనంతవరం–బల్మూర్ ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. అనంతవరం గ్రామానికి చెందిన మిట్టకడుపుల శ్రీనివాసులు(50), తన స్నేహితుడు అర్కపల్లి వెంకటయ్యతో కలసి ఎక్సెల్పై బల్మూర్ వైపు వెళ్తుండగా.. లింగాల మండలం అంబటిపల్లికి చెందిన అతినారపు వెంకటయ్య తన బైక్పై అచ్చంపేట నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చి ఎక్సెల్ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులును 108అంబులెన్స్లో అచ్చంపేట ఆప్పత్రికి తరలించగా.. చిక్తిత్స పొందుతూ మృతుచెందాడు. అతనితోపాటు ఉన్న మిత్రుడు వెంకటయ్య, అతినారపు వెంకటయ్య, కాకం తిరుపతయ్యకు గాయలుకావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
అలంపూర్ రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భైరంపల్లి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. భైరంపల్లికి చెందిన బోయ శ్రీరాములు (38) పీర్ల పండుగ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండంలో నడవాలనుకుని స్నానం చేసేందుకు స్థానిక బావి దగ్గరికి వెళ్లాడు. తీరా ఎంతసేపటికి రాకపోవడంతో భార్య చుట్టుపక్కల వెతికింది. ఈ క్రమంలో శనివారం ఉదయం బావిలో శ్రీరాములు మృతదేహం కనబడింది. దీంతో భార్య రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి బల్మూర్: చెరువు అలుగు నీటిగుంటలో అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు శవమై తేలిన ఘటన మండలంలోని జిన్కుంట గ్రామ శివారులోని తుమ్మెన్పేటకు రహదారి బ్రిడ్జి కింది శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముందలింటి ఈదమ్మ(60) శుక్రవారం రాత్రి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామ సమీపంలోని ఊర చెరువు అలుగు వాగు గుంతలో చేపల వేటకు వెళ్లిన వారికి బ్రిడ్జి కింద ఉన్న గుంతలో ఆమె శవం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతం మృతదేహాన్ని బయటకు తీశారు. వృద్ధురాలి మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. -
కడసారి చూపునకు నోచుకోక..
గట్టు: కట్టుకున్న భర్త.. కన్నకొడుకు కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. తీవ్రంగా గాయపడి, కడచూపునకు నోచుకోలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది రాయపురం గ్రామానికి చెందిన లక్ష్మి. వివరాలిలా.. రాయపురం గ్రామానికి చెందిన హనుమంతు(42), అతని కొడుకు తిరుమలేష్(18)ను ఎర్రవల్లి–కర్నూలు జాతీయ రహదారిపై పుటాన్దొడ్డి స్టేజీ వద్ద గురువారం రాత్రి వాహనం ఢీకొని మృతిచెందారు. వీరి అంత్యక్రియలను శుక్రవారం రాయపురంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భర్త, కుమారుడు ఆఖరిచూపునకు నోచుకోలేక, ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతుంది రాయపురం లక్ష్మి. హనుమంతుకు తనకున్న ఎకరా పొలాన్ని సాగు చేసుకోలేక ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొలం యజమాని వద్ద జీతానికి కుదిరాడు. హనుమంతుకు భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారురులు శరణప్ప, తిరుమలేష్తో కొంతకాలంగా ధర్మారంలోనే ఉంటున్నారు. ఊరదేవర కోసం.. ధర్మారంలో ఉన్న హనుమంతు కుటుంబ సభ్యులు ఈనెల 23న గట్టుకు వచ్చారు. దేవర పండును ముంగించుకుని శరణప్ప ధర్మారం చేసుకోగా.. మిగతావారు గురువారం ధర్మారానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 5కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారనుకునేలోగా రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకులను మృత్యువు కబళించింది. లక్ష్మిని మాత్రం తీవ్రగాయాలతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పెబ్బేరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషాదం నింపిన రోడ్డు ప్రమాదం -
ఓటర్ల వివరాలు త్వరగా పూర్తి చేయండి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) లో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటిని బీఎల్ఓలు సందర్శించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వారి వివరాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. సర్లో ప్రతి ఓటరు నమోదు కావాలి దేవరకద్ర: సర్లో ప్రతి ఓటరు నమోదు కావాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలో సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మృతిచెందిన వారిని, శాశ్వతంగా వలస పోయినవారిని గుర్తించి విచారణ జరిపి తొలగించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులను సర్లో ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. పీసీసీ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు. వీబీజీ రామ్జీపై పోరుకు సిద్ధం మహబూబ్నగర్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న కొత్త విధానం వల్ల ఉపాధి హామీ కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రెండు పూటల ఫొటో విధానం కూలీలకు ఇబ్బందికరంగా మారిందని, దాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే ఉపాధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే చర్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మహాసభల పిలుపు మేరకు జూలై 1న ఉపాధి కూలీలు పనులు బహిష్కరించి పెద్దఎత్తున గ్రామపంచాయతీల ఎదుట నిరసనల్లో పాల్గొనాలని కోరారు. అనంతరం ఇటీవల మహబూబ్నగర్లో ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, జిల్లా ప్రజలు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం ● పీహెచ్సీలలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ● అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేస్తాం ● మెడికల్ ఆఫీసర్ల సమయపాలనపై ప్రత్యేక డైరీ ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పాలమూరు: వర్షకాలం మొదలైన క్రమంలో సీజనల్ వ్యాధుల కట్టడికి అన్ని విభాగాల ప్రోగ్రామ్ అధికారులతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో జిల్లా ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్ఓ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.. ‘‘గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం ఆరోగ్య శాఖను చక్కదిద్దడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మొదట ఒక్కో పీహెచ్సీని పరిశీలన చేసి సమస్యలపై అధ్యయన చేస్తున్నా. అక్కడ నిర్వహణ లోపాలపై సమగ్రంగా ఒక నివేదిక తయారు చేస్తున్నాం. జిల్లాలో పీహెచ్సీలు, కమ్యూనీటీ హెల్త్సెంటర్లలో వైద్యసేవలను గాడిలో పెట్టడానికి ఇప్పటికే మెడికల్ ఆఫీసర్ల దగ్గరి నుంచి ఇతర సిబ్బంది వరకు అందరితో వేరువేరుగా సమావేశాలు నిర్వహించాను. ప్రతి పీహెచ్సీలో కావాల్సిన మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు. వారు సమయపాలన పాటించడానికి ఒక ప్రత్యేక డైరీ విధానం అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే రోజుల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాం. జిల్లాలో గతే ఏడాది 336 డెంగీ పాజిటివ్ వచ్చాయి.జిల్లావ్యాప్తంగా 23 హైరిస్క్ గ్రామాలతో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్లో 33 హైరిస్క్ డివిజన్లను గుర్తించాం. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో లీకేజీలకు మరమ్మతులు చేయించి..పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెడుతాం. ప్రధానంగా యాంటీ లార్వా ఆపరేషన్, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తాం. ప్రతి ఆశా కార్యకర్తకు 180 నుంచి 200 ఇళ్లు కేటాయించాం. వారి పరిధిలో ఉన్న ఇళ్లలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ట్యాంకులు, టైర్లు, పూలకుండీలలో వర్షం నీరు, ఇతర నీళ్లు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి.’’ సాధారణ ప్రసవాలు అయ్యేలా జిల్లావ్యాప్తంగా ఉన్న 17 పీహెచ్సీలు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలలో సాధారణ ప్రసవాలు పెంచడానికి ప్రతి నెలా 50 ప్రసవాలు అయ్యే విధంగా చూస్తాం. పీహెచ్సీలలో వందశాతం స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరిని మెడికల్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తుండాలి. సాధారణ కాన్పులు చేయడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటే పీహెచ్సీలో చేయాలి. ఉమ్మ నీరు సక్రమంగా కచ్చితంగా సెక్షన్ చేయాలనే కేసులను మాత్రమే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలి. అలాగే హైరిస్క్ కేసులు రెఫర్ చేసిన తర్వాత ఎందుకు చేశారో అనేది తప్పక వివరాలు నివేదించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు చేసుకోవాలనే అవగాహన గర్భిణీలతో పాటు భర్తలు, వారి కుటుంబసభ్యులకు రావాల్సిన అవసరం ఉంది. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు: ఎస్పీ
జడ్చర్ల: మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ జానకి సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జడ్చర్లలో వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ జడ్చర్ల పరిసర ప్రాంతాలలో గల పరిశ్రమలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో కొందరు గంజాయిని ఆయా రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని అన్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రధానంగా యువత ఇలాంటి మత్తు పదార్థాల బారిన పడవద్దన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా వేసి ఉంచాలని, పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాలను ఎప్పటికప్పడు పరిశీలిస్తుండాలన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్న డ్రగ్స్ వాడకం నివారణపై చైతన్యం కలిగి ఉండాలన్నారు. చెడు అలవాట్లు ఒకరికే పరిమితం కావని, వారి స్నేహితులకు కూడా అలవాట్లుగా మారుతాయన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడం, విక్రయించడం వంటి సమాచారాన్ని తమకు అందించి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిష్యత్కు బలమైన పునాది
రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, నిధులు కేటాయిస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి రూ.12 వేల కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి.. వారి కళ్లలో ఆనందాన్ని నింపుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బాలానగర్ మండలంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ తీసుకొచ్చానని, అలాగే నవోదయ, జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా తీసుకొచ్చినట్లు చెప్పారు. రాజాపూర్లో రూ.8 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రూ.34 కోట్లు టాటా కన్సల్టెన్సీ ద్వారా సీఎస్ఆర్ నిధులతో ఏటీసీని నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. కలెక్ట ర్ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ ఏటీసీ సెంటర్ ఏర్పాటు చుట్టుపక్కల గ్రామాల యువతకు గొ ప్పవరమని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, ట్రె యినీ కలెక్టర్ సాయిశివాని, మార్కెట్ చైర్పర్సన్లు అశ్విని, జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, సర్పంచ్ రేవతి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్స్వామి రంగారెడ్డిగూడలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించడంతో పాటు ప్రజల ఆకాంక్షలను, సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. యాక్షన్ ప్లాన్లోలో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం చేసినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా గుర్తించిన ప్రజల సమస్యలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలు, పరిష్కారం చేసిన వాటి వివరాలు, పెండింగ్లో ఉన్న వాటి పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించి ప్రణాళిక, ఆర్థిక అవసరాల అంచనా వేయాలన్నారు. నిధులతో సంబంధం లేనివి తక్షణం పరిష్కరించాలన్నారు. గ్రామపంచాయతీ భవనాలు లేని చోట ఈజీఎస్ కింద మంజూరు చేసి వచ్చే 9 నెలల్లో భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను నిర్మాణం చేయాలని డీఆర్డీఓకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణ తగు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్తో కార్పొరేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణం చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. జాతీయ రహదారులుపై ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లు గుర్తించి ఆయా ప్రాంతాలతో పాటు దాబాలు ఉన్న చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్ఫూర్తిని భవిష్యత్లోనూ కొనసాగించాలని సూచించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమం కాదని, నిరంతర కార్యక్రమం అని, సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, ట్రెయినీ కలెక్టర్ సాయశివాని, డీఆర్ఓ నిర్మల, సీపీఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ -
మాకొద్దు.. ‘మల్లమ్మకుంట’
● రిజర్వాయర్ కోసం భూములు ఇవ్వలేం ● భూసేకరణ గ్రామసభలో తనగల గ్రామ రైతులు రాజోళి: ‘‘ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో ఇతర ప్రా ంతాల్లో భూములను కొనలేం.. ఆ డబ్బు ఏడాదిలో గా అయిపోతుంది. ఆ తర్వాత మేము కూలీలుగా మారాల్సిందే.. ఇతర గ్రామాలకు నీరందించేందు కు తమకు జీవనోపాధిగా ఉన్న భూములను కోల్పో లేం..’’ అని వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులు స్పష్టం చేశారు. గురువారం గ్రామ పంచా యతీ కార్యాలయంలో భూసేకరణ స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లమ్మకుంట రిజర్వాయర్కు భూ సేకరణపై గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు లు తమ అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో తమకు మల్లమ్మకుంట రిజర్వాయర్ వద్దే వద్దని ముక్తకంఠంతో నినదించారు. జిల్లా మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారని.. ఎన్నో ఎకరాల భూములు పోతున్నాయని.. ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో నీరు ఎక్కడైనా పారుతుందా అని ప్రశ్నించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు వచ్చి రిజర్వాయర్ కోసం భూములు అడిగితే ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం చిన్నోనిపల్లె నుంచి ఆర్డీఎస్కు నీరందించేందుకు అవకాశం ఉండటంతో పాటు నెట్టెంపాడు నుంచి తీసుకొచ్చిన కెనాల్ కూడా వృథాగా తవ్వి ఉంచారని.. ముందుగా ఆ పనులు సాగేలా చూడాలన్నారు. ఇప్పటికే భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్న చిన్నోనిపల్లె నుంచి కలిపితే, మల్లమ్మకుంట కోసం రైతులు భూములు కోల్పోవాల్సిన అవసరముండదని తెలిపారు. ఈ అంశంపై అధికారులు స్పందిస్తూ.. కృష్ణానది నుంచి వచ్చే నీటిని వాడుకునేందుకు కొన్ని రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ వాటా ను వినియోగించుకోవాలంటే తప్ప నిసరిగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మించాల్సిందేనని.. తద్వారా ఆయకట్టు సస్యశ్యామలం అవు తుందని చెప్పారు. గతంలోనే మల్లమ్మకుంట నిర్మాణానికి తనగల సమీపంలోని భూమిని గుర్తించామని అధికారులు చెప్పగా.. ఆ విషయాన్ని అప్ప టి నుంచి రైతులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇక్కడ నిర్మించే బదులు జూలకల్లో నిర్మించాలని.. అక్కడైతే ప్రభుత్వ భూమితో పాటు సాగు కు ఆమోదయోగ్యం కాని భూములు కూడా ఉన్నా యని తెలిపారు. కాగా, మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 567 ఎకరాల భూమి అవసముండగా.. అందులో 124 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందని, మిగిలిన భూమి పట్టా భూమిగా ఉందని అధికారులు తెలిపారు. డీపీఆర్ ప్రకారం మల్లమ్మకుంట నిర్మిస్తేనే నీటి విడుదలకు, స్టోరేజీకి సరైన విధంగా ఉంటందని.. రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామసభలో ఆర్డీఎస్ డీఈలు నాగరాజు, రాంపతి, తహసీల్దార్ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్రెడ్డి, సీఐ శంకర్, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎవరా..ఏజెంట్లు?
పాఠశాలలు ఇతర పనుల నిమిత్తం అవసరం ఉన్న వారు వస్తుంటారు. కానీ ఆర్జేడీ పేరు చెప్పి ఎవరు రాలేదు. ఇటీవల ఏ పాఠశాలకు సంబంధించిన ఫైల్స్ చేయలేదు. పై అధికారి పలు పనుల నిమిత్తం ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తాం. బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నాం. – విజయకుమారి, డీఈఓ ఆర్జేడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో అడ్డగోలుగా ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయడంతో వాటికి అనుమతులు ఇప్పించేందుకు జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు అనుమతు ల విషయంలో బయటి వ్యక్తుల ప్రమేయం, పలువురు ఏజెంట్లు సంఘాల నాయకులు తరచూ డీఈ ఓ కార్యాలయంలో ఉంటూ పనుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు కొంత కాలంగా విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆర్జేడీ పేరు చెప్పి డీఈఓ కార్యాలయంలో పలువురు ప్రైవేటు పాఠశాలల అనుమతులు, రెన్యువల్ చేయించడం వంటి పనులు చేయడాన్ని పలువురు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆర్డేడీ దిష్టిబొమ్మ దహనం.. డీఈఓ కార్యాలయంలో మహబూబ్నగర్ ఆర్జేడీ సోమిరెడ్డి ఏజెంట్ల ద్వారా పనిచేయించుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐతో పాటు పలు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్జేడీ సోమిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ప్రశాంత్, రాము మాట్లాడుతూ.. కొంత మంది ప్రైవేటు ఏ జెంట్ల ద్వారా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమతుల్లేని పాఠశాలల జాబితా తయారు చేసి సంబంధిత ఏజెంట్లు పాఠశాలల దగ్గరకు వెళ్లి పాఠశాలలకు అనుమతులు ఇప్పస్తామని, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. వీటికి కారణమైన ఆర్జేడీ సోమిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సీఎం సొంత జిల్లాలో అవినీతి జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజ్, దస్తప్ప, జీశాంత్, భానుప్రసాద్ పాల్గొన్నారు. ఫిర్యాదుదారులే ఏజెంట్ల? గత డీఈఓపై పలువురు ఆర్జేడీ, కలెక్టర్ కార్యాలయం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలో అదే పనిగా ఫిర్యాదులు చేశారు. ఇందుకు ప్రధాన కారణం తమకు అనుకూలంగా వ్యవహరించలేదని, తామూ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ఫైల్స్ ఇతర పనులు నిమిత్తం డీఈఓ దగ్గరకు వెళ్తే పనులు చేయలేదని కారణంతో గత డీఈఓపై అనేక మార్లు ఫిర్యాదులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సోమిరెడ్డి ఆర్జేడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే గత డీఈఓపై ఫిర్యాదులు పెరిగాయని, ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనపై పలుమార్లు ప్రస్తుత ఆర్జేడీ ఎంక్వయిరీ చేయడం ఆరోపణలకు బలన్ని చేకూరుస్తున్నాయి. ● ఎవరి సలహాతో వారు గత డీఈఓపై ఫిర్యాదులు చేశారని, డీఈఓ మీద ఫిర్యాదులు చేసిన వారే ఇప్పుడు ఆర్జేడీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న విద్యాశాఖలో తీవ్ర చర్చకు తావిచ్చింది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక గత డీఈఓ వ్యక్తిగత సెలువులపై వెళ్లి అనంతరం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ● పలు సెక్షన్లలో సిబ్బంది, ఇతర అధికారులు పనులు చేయకపోతే ఏదో ఒక ఆరోపణలతో ఫిర్యా దులు చేస్తున్నారని తెలుస్తుంది. గత డీఈఓపై కూడా రాష్ట్రస్థాయి అధికారులతో ఒత్తిడి చేయించి పలు పాఠశాలలకు అనుమతులు ఇప్పించడంలో ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. డీఈఓ కార్యాలయంలో జోరుగా పైరవీలు ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల్లో జోరు ఆర్జేడీ స్వయంగా ఏజెంట్లను నియమించి అనుమతుల ఫైల్స్ చేయిస్తున్నట్లు సంఘాల ఆరోపణ అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్జేడీ సోమిరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు గత డీఈఓపై ఫిర్యాదులు చేసిన వారే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్న వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల అనుమతి ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగుతుండగా పలు అనుమతులు సంతకాల ఇతర ఎన్ఓసీల తంతును స్వయంగా పాఠశాల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంది. కానీ ఏ సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇప్పటించేందుకు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల విషయంలో ఎంఈఓ, డీఈఓ కార్యాలయంలో సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
వడివడిగా ‘గుడ్డెందొడ్డి’
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. యాసంగిలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ యాసంగి సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కృష్ణాబేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు. రివర్స్ పంపింగ్ విధానం.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.6 వేల కోట్లతో.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి. ఉమ్మడి జిల్లాలో.. కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు యాసంగి సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాలలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
ఎకై ్సజ్ డీసీగా విజయ్భాస్కర్రెడ్డి
● వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్కు కొత్త ఈఎస్లు ● ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా శ్రీనివాస్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కారీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్భాస్కర్రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్గా డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. నాగర్కర్నూల్ ఈఎస్గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్కర్నూల్ ఈఎస్గా వి.వేణుగోపాల్రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చారు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్గా ఉన్న పి.కరమ్చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్గా వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏఈఎస్గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్గా వెళ్లారు. -
సర్.. ప్రక్రియ ప్రారంభం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ అనుకూల ఓట్లు పోకుండా చూస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్య ఓటర్లలో ఈ ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యులు, రోజు వారీ కూలీలకు ‘ఫారం–2’ నింపడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అవగాహన లోపం వల్ల వేలాది మంది అర్హులైన సామాన్యులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముసాయిదా జాబి తా ప్రచురణ తర్వాత పాత జాబితాతో అనుసంధానం కాని వారికి ఓటరు నమోదు అధికారి (ఈఆర్ఓ) నోటీసులు జారీ చేస్తారు. అయితే, ముసాయిదా జాబితాలో పేరున్న వ్యక్తిపై విచారణ జరపకుండా, వారికి న్యాయ సమ్మతమైన అవకాశం ఇవ్వకుండా పేరును తొలగించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ● ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సవరణ షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈనెల 25 నుంచి బూత్స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ తిరిగి గణన ప్రక్రియ ప్రారంభించారు. కాగా.. ఓటరుజాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఓటర్లంతా విధిగా ‘మ్యాపింగ్’ పూర్తి చేసుకోవాలి. జిల్లాలో మొత్తం 7,32,488 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 77.28 శాతం (5,66,055 మంది) మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 1,66,433 మంది మ్యాపింగ్ కావాల్సి ఉంది. జిల్లాలో పురుషులు 3,61,863, మహిళలు 370600 మంది, 25 మంది ఇతరులు ఉన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2,64,235 మంది ఓటర్లు ఉండగా.. 1,80,388 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారు. ఇంకా 83,847 మ్యాపింగ్ చేయాల్సి ఉంది. జడ్చర్లలో 2,23,911 మంది ఓటర్లలో 1,83,443 ఓటర్ల మ్యాపింగ్ కాగా.. 42,468 మ్యాపింగ్ చేయాల్సి ఉంది. దేవరకద్రలో 2,42,342 మంది ఓటర్ల ఉండగా 2,02,224 ఓటర్లు మ్యాపింగ్ చేయగా 40,118 మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉంది. వీరంతా తక్షణమే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవడంతో పాటు ఫారం పూర్తి చేసి ఇవ్వాలి. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తుంది. దీని కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా అ ధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్య వేక్షించారు. రంగారెడ్డి గూడ పర్యటనలో ఉన్న కలెక్టర్ ఖుష్బుగుప్తా ‘సర్’ ప్రక్రియకు సంబంధించి బీఎల్ఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బల్సుపల్లి, నా గారం గ్రామాల్లో, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్ బీ హరిప్రియ జడ్చర్ల పురపాలికలో, ఆర్డీఓ నవీన్ జిల్లాకేంద్రంలోని కిద్వాయిపేటలో పర్యటించి ఎ న్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లకు ఫారాలు ఎలా నింపాలో వివరించాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు సై తం గ్రామాల్లో పర్యటించి ప్రక్రియను పర్యవేక్షించా రు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి చిన్నచింతకుంట మండలం దమగ్నాపురంలో బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. అలాగే రంగారెడ్డిగూడలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎన్యూమరేషన్ ఫారం నింపి బీఎల్ఓకు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్పత్రాలిస్తున్న బీఎల్ఓలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించిన రాజకీయ పార్టీలు తొలిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన యంత్రాంగం జిల్లాలో మ్యాపింగ్ చేయాల్సిన ఓటర్లు 1,66,433 -
ప్రభుత్వ ఆస్పత్రిలో నీళ్ల కొరత
● ఇబ్బందులు పడుతున్న రోగులు, అటెండర్లు జడ్చర్ల టౌన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నీళ్ల కొరతతో రెండు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు వినియోగించేందుకు కూడా నీరు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎక్కడికి వెళ్లాలో తెలియక తంటాలు పడ్డారు. ఆస్పత్రిలో బోరు మోటర్ ద్వారా సంప్లను నింపి, అక్కడ నుంచి భవనం పైన ట్యాంక్లను నింపి, వాష్రూంలకు, నల్లాలకు సరఫరా చేస్తారు. వీటితో పాటు మిషన్ భగీరథ నీరు సైతం సంప్లో నిల్వ అవుతుంటాయి. నెల రోజులుగా మిషన్భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవటంతో బోరు మోటార్పైనే ఆధారపడాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉన్న బోరు మోటార్ కూడా మరమ్మతుకు నోచుకోవడంతో నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. డ్యూటీలో ఉన్న డాక్టర్ నీళ్లు అయిపోయిన విషయాన్ని ఎలక్ట్రీషియన్కు సమాచారం అందించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న రెండో బోరు ఆన్ చేసి సంప్లోకి నీటిని పంపించారు. రెండో బోరులో నీటి లభ్యత తక్కువగా వస్తుండటంతో అవి రోగుల అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. మంగళవారం రాత్రి, బుధవారం, గురువారం రోగులు, వారి వెంట ఉన్న అటెండర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరత కారణంగా పురుషుల వార్డులో నీళ్లు లేక ఓ టాయిలెట్కు ఏకంగా తాళం వేశారు. దీంతో రోగులు బాటిళ్లు పట్టుకుని ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చింది. పాడైన మోటార్ బుధవారం మరమ్మతుకు పంపించి గురువారం సాయంత్రానికి తిరిగి ప్రారంభించారు. -
మరోసారి వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుడు
గద్వాల క్రైం: ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకంపై జిల్లా కేంద్రంలోని ఓ బాధితుడు వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గత గురువారం ఉదయం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడికి ట్యాంక్ దిగాడు. అయితే బాధితుడు మరోసారి గురువారం ఇదే తీరును ప్రదర్శించాడు. బాధితుడి కథనం మేరకు.. నరేష్చారి కుటుంబ వ్యవహారంలో ఏఆర్ కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నాడు. పోలీసులు న్యాయం చేస్తామని చెప్పినా ఫలితం లేదని వాపోయాడు. భార్య కాపురానికి రాకుండా బెంగళూర్లో ఉందన్నారు. దీంతో మనస్థాపం చెంది జిల్లా ప్రభుత్వాస్పత్రి వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి బలవన్మరణం చేసుకునేందుకు యత్నించగా.. అప్పట్లో గద్వాల సీఐ శ్రీను ఘటనా స్థలానికి చేరుకొని, ఏఆర్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నేటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. దీంతో బాధితుడు అధికారుల తీరుపై నమ్మకం లేదని వాపోయాడు. సీఐ అక్కడికి చేరుకొని కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు క్షేమంగా కిందకు వచ్చాడు. ఈ ఘటనతో ఆస్పత్రి పరిసరాల్లో రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. 60 ట్రిప్పుల ఫిల్టర్ ఇసుక సీజ్ గోపాల్పేట: రేవల్లి మండలంలోని కేశంపేట చింతలచెరువు నుంచి మట్టిని తీసి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారని గురువారం సోషల్ మీడియాలో వీడియోలు, ఆడియోలు హల్చల్ చేశాయి. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం మధ్యాహ్నం కేశంపేట చింతలచెరువును సందర్శించారు. చెరువులో నుంచి బయటకు తీసిపోసిన సుమారు 60 ట్రాక్టర్ల మెత్తటి మట్టిని సిబ్బందితో కలిసి సీజ్ చేశామని రేవల్లి తహసీల్దార్ సరస్వతి తెలిపారు. పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్కు నివేదిస్తామని, ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వివరించారు. ఇదిలా ఉండగా అక్కడ మట్టి మాత్రమే లేదని, ఫిల్టర్ చేసిన ఇసుక కూడా ఉందని అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించి.. ఫిల్టర్ ఇసుకను కూడా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
బైక్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం
తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెంది న ఘటన తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఏ ఎస్ఐ బాలశంకర్రెడ్డి వివ రాల మేరకు.. మండలంలోని కమ్మరెడ్డిపల్లికి ఆవుల శాంతయ్య కొంతకాలంగా తెలకపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నా రు. బుధవారం రాత్రి అతడి కుమారుడు ఆవుల భీముడు (17), తెలకపల్లికి చెందిన తన స్నేహితుడు తుపాకుల బాలుతో కలిసి బైక్పై గౌరెడ్డిపల్లిలో పీర్ల సవారీ చూసేందుకు వెళ్లాడు. వేడుకల అనంతరం అక్కడి నుంచి తెలకపల్లికి బయలుదేరారు. మరోవైపు కమ్మరెడ్డిపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి వట్టెపు జగన్కుమార్ (23) బైక్పై గౌరెడ్డిపల్లి వెళ్తుండగా.. పాత బస్టాండ్ సమీపంలో వారి వాహనా లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. ప్రమాదంలో భీము డుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. జగన్కుమార్ తలకు తీవ్రగాయా లు కావడంతో చికిత్స నిమి త్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడు హైదరాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా తీవ్రగాయలైన బాలును హైదరాబాద్ ఆస్ప త్రికి తరలించారు. ఆవుల భీముడు తండ్రి శాంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. మరొకరికి తీవ్రగాయాలు -
ధాన్యం లారీ పట్టివేత
పాన్గల్: పాత ధాన్యం తరలిస్తున్నారనే అనుమానంపై ధాన్యం లారీని పోలీసులు సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కార్తీక్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్రెడ్డి తన మీనాక్షి రైస్ మిల్లులో సీజ్ చేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున ఎస్ఐ కుర్మయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బీపీ ప్రసాద్తో కలిసి మిల్లుకు వెళ్లి ధాన్యం లోడ్తో ఉన్న లారీని సీజ్ చేశారు. అనంతరం లారీలో లోడ్ చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల టెక్నికల్ అధికారులు నిర్ధారణ కోసం శాంపిల్ తీసుకెళ్లారని, నిర్ధారణ చేసిన తర్వాత లారీల్ లోడ్ చేసిన ధాన్యం పాతదా, కొత్తదా అనే విషయాలు తెలుస్తాయన్నారు. తాను పండించిన ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు ఇచ్చిన టోకెన్ ఆధారంగా విక్రయించేందుకు తీసుకెళ్తుంటే అధికారులు సీజ్ చేశారని ఓ రైతు పేర్కొన్నాడు. -
పోలీసు విధులకు ఆటంకం.. కేసు నమోదు
తెలకపల్లి: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బాలశంకర్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు.. మండల కేంద్రంలో ఈ నెల 23 రాత్రి 9గంటల సమయంలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు బ్లూకోర్టు కానిస్టేబుల్ బాలకృష్ణ, శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని గొడవ పరిష్కరించారు. తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చే క్రమంలో గ్రామానికి చెందిన మోకురాల రాజేష్గౌడ్ అనే వ్యక్తి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతూ వారి విధులకు ఆటంకం కలిగించాడు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదు మేరకు రాజేష్గౌడ్పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం మహమ్మదాబాద్: మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతు కొమ్మూరి చిన్నయ్య(54) బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై నడుచుకుంటూ పాత పెట్రోల్బంక్ సమీపంలోని సర్వీస్రోడ్డు వద్దకు రాగానే, వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన చిన్నయ్యను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని జింకలపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేశ్(24) గతవారం జాతీయ రహదారిపై ధర్మవరం స్టేజీలో జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కర్నూలు జిల్లాలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య రాజోళి: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోకారి తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఖలీల్(30)కు ఇటిక్యాల మండలం ఉదండాపురానికి చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఖలీల్ మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గత రెండేళ్ల క్రితం భార్య భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనస్థాపం చెందిన ఖలీల్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రఫి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గండేడ్ కేజీబీవీ ఎస్ఓకు షోకాజ్ నోటీస్
● విధులకు గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం ● నోటీసులు జారీ చేయాలని డీఈఓకు ఆదేశాలు గండేడ్: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఖుష్భూగుప్తా షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా కేజీబీవీకి చేరుకున్న కలెక్టర్ హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఎస్ఓ శివలీల పాఠశాలకు రాలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు పొందలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విధులకు సకాలంలో హాజరవ్వాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని తేల్చిచెప్పారు. కొందరు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా వరండాలో ఉండడంతో గమనించిన కలెక్టర్ తరగతులోకి వెళ్లాలని సూచించారు. వసతులను పరిశీలించారు. వంటగది, స్టోర్ రూంను పరిశీలించిన కలెక్టర్ అంసతృప్తి వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలు అందించడంపై ఆరా తీశారు. విద్యార్థినులకు అలాంటివి ఎలా పెడతారని సిబ్బంది, ఉపాధ్యాయులను ప్రశ్నిచారు. విద్యార్థినులకు ఇచ్చే పండ్లు గురువారం సరిపోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాభోదన, కల్పిస్తున్న సదుపాయాలపై ఆరాతీశారు. అలాగే కాంట్రాక్టర్తో మాట్లాడి కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ గండేడ్ మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న ఓపీ వివరాలను మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లికార్జున్రావు, ఎంఈఓ జనార్దన్ ఉన్నారు. -
భూమి డబ్బులు వచ్చాయి..
గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో నా భూమి 2.03 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పరిహారం చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. ఇటీవల రూ.26 లక్షలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. సంతోషంగా ఉంది. మాకు పరిహారం డబ్బులు త్వరగా అందడంతో మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. – బైని కొండయ్య, రైతు, ఖిల్లాఘనపురం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మొదట పరిహారం సకాలంలో అందకపోవడంతో తరుచూ పనులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఒకసారి 18 ఎకరాలకు, ఇటీవల 388 ఎకరాలకు రూ.44 కోట్లు విడుదల చేసింది. మొత్తం 647 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 406 ఎకరాలకు పరిహారం అందింది. మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నా రు. ఆయా భూముల సర్వే కొనసాగుతోంది. ఇక నుంచి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – నరేందర్రెడ్డి, డీఈ, నీటిపారుదలశాఖ -
పాలమూరుకు కబడ్డీ అకాడమీ
● రూ.22.87 లక్షల నిధులు మంజూరు ● మెయిన్ స్టేడియంలో ఏర్పాటుకు చర్యలు ● 20 మంది బాలుర చేరికకు అవకాశం మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరుకు మరో క్రీడా అకాడమీ మంజూరైంది. నగరంలోని మెయిన్ స్టేడియంలో బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటు కానుంది. ఇప్పటికే మెయిన్ స్టేడియంలో బాల, బాలికల వాలీబాల్ అకాడమీ కొనసాగుతుండగా.. ఇప్పుడు అండర్–16 బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2026– 27 విద్యాసంవత్సరంలో అకాడమీ ప్రారంభించాలని క్రీడాప్రాధికార సంస్థ శాట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే రాష్ట్రంలోనే మొదటి కబడ్డీ అకాడమీ మహబూబ్నగర్లో ఏర్పాటు అవుతుండడం విశేషం. అదనపు విభాగంగా.. డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేయనున్నారు. కబడ్డీ అకాడమీలో 20 మంది బాలురకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీ కోసం రూ.22,87,680 నిధులు మంజూరు చేశారు. కబడ్డీ అకాడమీల 2026– 27 ప్రవేశాల కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులతోపాటు షూస్లు, మంచి పౌష్టికాహారం అందించడంతోపాటు వారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో చదువుకునేలా అవకాశం కల్పిస్తారు. మెరుగైన క్రీడా శిక్షణ కబడ్డీ అకాడమీకి ఎంపికయ్యే క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. అకాడమీలో ప్రత్యేక శిక్షణ కోసం కబడ్డీ మ్యాట్లు ఏర్పాటు చేసి నిష్ణాతులైన కోచ్ల ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ అందనుంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. ప్రతి ఏడాది క్రీడాకారులకు సబ్ జూనియర్, జూనియర్, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. మెయిన్ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు అవుతుండడంపై సీనియర్ క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. -
త్వరలో రాష్ట్రస్థాయి ఎంపికలు
మెయిన్ స్టేడియంలో క బడ్డీ అకాడమీ ఏర్పా టు కానుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు కబడ్డీ అకా డమీలో బాలుర ప్రవేశాల కోసం త్వరలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచి మెరిట్ సాధించిన క్రీడాకారులకు అకాడమీలో ప్రవేశాలు కల్పిస్తాం. – రాజశేఖర్రెడ్డి, డీవైఎస్ఓ సంతోషంగా ఉంది.. ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్నగర్ కబడ్డీ అకాడమీ ఏర్పాటు కావాలన్న కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవతోనే పాలమూరుకు కబడ్డీ అకాడమీ మంజూరైంది. అకాడమీ ఏర్పాటుతో నైపుణ్యంగల కబడ్డీ క్రీడాకారులను వెలికితీయవచ్చు. – కురుమూర్తిగౌడ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ సంఘం, మహబూబ్నగర్ ● -
ప్రభుత్వ బడికి పంపిస్తే ఇంటి పన్ను చెల్లిస్తా
నవాబుపేట: ప్రభుత్వ బడికి తమ పిల్లను పంపిస్తే వారి ఇంటి పన్నును పూర్తిగా తానే భరిస్తానని సర్పంచ్ రవీందర్ ప్రకటించారు. బుధవారంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ బడికి మరింత చేయూతనిచ్చి బడిని అభివృద్ధి చేద్దామని ఆయన వివరించారు. అందుకు ప్రైవేట్ పాఠశాలకు గ్రామంలో 55మంది పిల్లలు వెళ్తున్నారని.. వారి తలిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడికి పిల్లలను పంపిస్తే వారికి చెందిన ఇంటి పన్నులు 5ఏళ్లపాటు తానే భరిస్తానని ప్రకటించారు. దీంతో సర్పంచ్ ప్రకటించిన పన్నుల చెల్లింపు పథకంపై గ్రామంలో విశేషస్పందన వచ్చి వెంటనే 16మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. అలాగే మిగతా కూడా రెండు రోజుల్లో ప్రభుత్వ పడిలో చేరుతారని వివరించారు. కాగా మన ఊరు–మన బడి కార్యక్రమాల్లో రుద్రారం సర్పంచ్ తీసుకున్న పన్నుల పథకం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ నాగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ: యువకుడు దుర్మరణం
మరికల్: కారు, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తీలేర్ స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల మేర కు మరికల్ మండలం రా కొండకు చెందిన భరత్ కుమార్రెడ్డి(32) బైక్పై మంగళవారం అర్ధ రాత్రి కన్మనూర్ నుంచి రాకొండకు బయలుదేరాడు. తీలేర్ స్టేజీ దగ్గరకు రాగానే హైదరాబాద్ నుంచి నారాయణపేటకు వెళ్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, కుమారుడు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. వివాహిత మృతిపై కేసు నమోదు ఎర్రవల్లి: వివాహిత మృతిపై కేసు నమోదైన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలోని చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని కొండేరు గ్రామానికి చెందిన బోయ నాగవేణి కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త ఈరన్న తో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం కృష్ణా: షార్ట్ సర్క్యూట్తో ఓ గుడిసె దగ్ధమై ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయ హన్మంతు రాత్రి భోజనం చేసి గుడిసెలో నిద్రపోయాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో గుడిసెకు నిప్పంటుకుంది. నిద్రిస్తున్న హన్మంతుకు ఇది వరకే పక్షపాతం రావడంతో ఆయన కదల్లేని పరిస్థితుల్లో మంటల్లోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వృద్ధుడిని ప్రాణాలతో కాపాడి మక్తల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గుడిసెలోని రూ.4.70 లక్షలతో పాటు 4 తులాల బంగారం, 18 తులాల వెండి, సామగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పాడైపె పెట్టే ముందు పసిగట్టారు తిమ్మాజిపేట: మృతదేహాన్ని పాడైపె పెట్టె ముందు ఒంటిపై గాయాలు గుర్తించి అంత్యక్రియలు ఆగిన ఘటన మండలం ఆవంచలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన అలివేల, యాదయ్య దంపతులు మంగళవారం మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఇంతలోనే యాదయ్య పడుకున్న చోటే చనిపోయాడని అంత్యక్రియలకు రావాలని అలివేల బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. బుధవారం మృతదేహానికి స్నానం చేయించి బట్టలు మారుస్తున్న సమయంలో మెడ, భుజంపైన గాయాలు ఉండడం గుర్తించిన మృతుడి అన్న కుమారుడు అనుమానం వ్యక్తం చేయడంతో అంత్యక్రియలు ఆగాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శ్రీనివాస్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పత్తికి బదులు సోయాబిన్
● తక్కువ పెట్టుబడి...ఎక్కువ లాభాలు ● యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి అలంపూర్: వానాకాలం పంట సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వానాకాలం పంట ప్రారంభం కావడంతో అధికారులు ఏ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చో అవగాహన క ల్పిస్తున్నారు. మూసపద్ధతికి స్వస్తి పలకాలని పంట మార్పిడి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలలకు పత్తి సాగుకు ప్రత్యామ్నాయంగా సోయాబిన్ పంటను సాగు చేసుకోవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. కందిలో సహాయ పంటగా, పండ్ల తోటలో అంతర్ పంటగాను సోయాబిన్ సాగు చేసుకోవచ్చని వివరించారు. పంట సాగు యాజమాన్య పద్ధతులతో పాటు అంశాలను వివరించారు. నేలలు: మురుగు నీరు పోయే వసతి ఉండి, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. రకాలు: జేఎస్–335, ఎల్ఎస్బీ–1, పీకే–472 ఇందులో జేఎస్ 335 రకం ప్రసిద్ది చెందింది. పంటకాలం: సోయాబిన్ పంట కాలం 100 నుంచి 110 రోజులు పంట వేసే పద్ధతి: సోయాను పత్తిలో, కందిలో అంతర్, మిశ్రమ పంటగా వేయవచ్చును. వానాకాలంలో సోయా సాగు తర్వత రబీలో శనగ, మినుములు వేసుకోవచ్చు. విత్తనం: విత్తనం ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరం. విత్తనాన్ని 45 ఇంటూ 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకు వరసలోని మొక్కల మధ్య 3 సెంటిమీటర్ల లోతులో మెత్తటి దుక్కిలో నాటు వేసుకోవాలి. విత్తే కాలం: జూన్ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తడానికి అనుకూలం కలుపు నివారణ: సోయాలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి 250 మి.లీ ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని కలుపును నివారించుకోవాలి. ఎరువులు: ఎకరానికి 25 కిలోల యూరియా, 150 కేజీల సూపర్, 25 కిలోల పోటాష్ అవసరం. విత్తేటప్పుడు ఫోరేట్ 10 జీ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడితే కాండపు ఈగలాంటి పురుగును నివారించుకోవచ్చు. పంట కోత: ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి, రాలిపోవడం మొదలైనప్పుడు లేదా కాయలు ఆకుపచ్చ నుంచి బూడిద రంగులోకి మారినప్పుడు కోయాలి. కోత ఆలస్యం అయితే కాయలు చిట్లి గింజలు రాలిపోతాయి. పంట కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆరనిచ్చి గింజలోని తేమ శాతం 14 వరకు చూసి నూర్పిడి చేయాలి. దిగుబడి: సోయా సాగుకు ఎకరానికి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. పాడి–పంట -
సర్.. వస్తున్నారు!
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కబడ్డీ అకాడమీ పాలమూరు మెయిన్ స్టేడియంలో బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.22.87 లక్షలు మంజూరు చేసింది. –8లో u ఇప్పటికే బూత్లెవల్అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ -
డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ట చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నార్కొటిక్ కోఆర్డినేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఎస్పీ జానకితో కలిసి కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్, విద్య, జిల్లా సంక్షేమ, వైద్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్కి పహచాన్’ థీమ్తో ఈ నెల 17 నుంచి 26 వరకు జిల్లాలో మత్తు పదార్థాల నివారణపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలనపై 22 నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీస్ శాఖ ఒక్కటే కాకుండా.. మిగతా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా సమన్వయంతో పనిచేస్తేనే మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గురువారం నగరంలోని మెయిన్ స్టేడియం నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ఉదయం 9.30 గంటలకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం తెలిపారు. ● జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, రోడ్డు భద్రతా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ జానకితో కలిసి సమీక్షించారు. ఆయా సమావేశాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈఓ విజయకుమారి, ఆర్అండ్బీ ఈఈ సంధ్య, పీఆర్ఈఈ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ఎన్హెచ్ఏఐ, రోడ్డు భద్రత నిపుణులు, ట్రాఫిక్ పోలీసు, ఎకై ్సజ్, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక లభ్యత, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అలాగే హరితహారం, మొక్కల పెంపకం కార్యక్రమాలపై సమీక్షిస్తూ.. మండలాలు, గ్రామాల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. రోడ్ల పక్కన చెత్త వేయకుండా, గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల్లోనే చెత్తను పారవేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, డీఆర్డీఓ నర్సింహులు, హౌజింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, పీఆర్ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిరోజూ ఇబ్బందులే..
నేను ఉద్యోగరీత్యా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటాను. ఉదయం కొత్త బస్టాండులో మహమ్మదాబాద్కు వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం వద్ద కొద్దిసేపు వేచి చూస్తుంటాను. ఇక్కడి ప్రాంగణమంతా దుర్గంధభరితమైన వాసన వస్తుండటంతో ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సాయంత్రం తిరిగి బస్సు దిగిన సమయంలోనూ అదే పరిస్థితి. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. – మంజుల, సుభాష్నగర్, మహబూబ్నగర్ అపరిశుభ్ర వాతావరణమే.. నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్ శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి కొత్త బస్టాండులో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం లోపలికి వెళితే చాలు ఎక్కడ చూసినా దుర్గంధమే కనిపిస్తుంది. ఆవరణలోని కొత్త షాపింగ్ కాంప్లెక్స్కు వెనుక ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లు తొలగిస్తే బాగుంటుంది. ముఖ్యంగా హోటల్, క్యాంటీన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలు కాల్వ ద్వారా బయటకు సరిగా వెళ్లడం లేదు. వెంటనే ఆర్టీసీ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలి. – జగపతిరావు, అధ్యక్షుడు, సీనియర్ సిటిజన్స్ ఫోరం, మహబూబ్నగర్ శుభ్రం చేయిస్తున్నాం.. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్కుమార్, డీఎం, మహబూబ్నగర్ -
ధాన్యం క్వింటా రూ.2,552
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,552, కనిష్టంగా రూ.1,901 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,239, కనిష్టంగా రూ. 1,651, వేరుశనగ రూ.5,454, ఆముదాలు రూ.6,371 చొప్పున పలికాయి. ● గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు బుధవారం 843 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టం రూ.6,750, కనిష్టం రూ.2,811, సరాసరి రూ. 6419 ధరలు లభించాయి. 5 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్ రూ.2,587 ధర పలికింది. అలాగే 5 క్వింటాళ్ల కంది రాగా క్వింటాల్కు రూ.6,419 ధర వచ్చింది. -
విద్యతోనే వికసిత్ భారత్ సాధ్యం
నారాయణపేట రూరల్: సంపూర్ణ విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్ ప్రారంభించారు. అలాగే ధన్వాడలో ఎస్సీ విద్యార్థుల వసతిగృహాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న సింగిల్విండో గోదాం విద్యార్థులకు అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్ నారాయణపేటకు తరలించడం నిలిపివేయాలని.. ఇక్కడే అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం కిష్టాపూర్లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పి ంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోటకొండ పాఠశాల జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న పీఎం శ్రీ పాఠశాలగా.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను పొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నగరంలోని 11 కేవీ టీడీగుట్ట ఫీడర్ పరిధిలోని చెట్ల కత్తిరింపు కారణంగా గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏడీ థావుర్యానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మోటార్ లైన్, శ్రీనివాస్ టాకీస్, మదీనా మసీదు, రామమందిర్ చౌరస్తా, రామయ్యబౌలి, వీటీగోల్డ్ పాన్చౌరస్తా, గాంధీనగర్, బండ్లగేరి, కుర్హినిశెట్టి కాలనీ, గణేష్నగర్, హోండా షోరూం, జములమ్మనగర్, హనుమాన్పుర, బండమీదిపల్లి చౌరస్తా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. యువత డ్రగ్స్కు ఆకర్షితులు కావొద్దు పాలమూరు: విద్యార్థులు, యువత తాత్కాలిక ఆనందం వైపు కాకుండా భవిష్యత్ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి అడుగులు వేయాలని, విద్యార్థి దశలో ఉన్నవారు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నా రు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. డ్రగ్స్ వల్ల జీవన విధానం పూర్తిగా మారుతుందని, దీంతో భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడి కోసం పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి కూడా బాధ్యతగా ఉంటూ గంజాయి, పొగాకు వంటి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. పీజీ ఫలితాలు విడుదల పాలమూరు: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్సైట్ను చూడాలని కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పీజీలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు వివిధ లాంగ్వేజెస్లో చేరే అవకాశం ఉందని, విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నైపుణ్యాలు పెంచుకోవడంలో డ్యూటీ మీట్ కీలకం
మహబూబ్నగర్ క్రైం: పోలీస్ విధుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సమర్థతతో విధులు నిర్వహించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించారు. పోలీస్ శాఖలో ఉన్న అతి కీలకమైన పలు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. శాసీ్త్రయ ఆధారాల సేకరణలో సంఘటన స్థల పరిశీలన, సాక్ష్యాధారాల పరిరక్షణ వంటి అంశాల్లో సిబ్బంది ప్రతిభను పరీక్షించారు. అదేవిధంగా అనుమానాస్పద వస్తువులను గుర్తించడం, భద్రత తనిఖీల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై పోటీలు సాగాయి. అలాగే డాగ్ స్క్వాడ్ పోటీలలో ట్రాకింగ్ సామర్థ్యం, అనుమానితులను గుర్తించే ప్రతిభపై ప్రదర్శన నిర్వహించారు. కంప్యూటర్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డేటా నిర్వహణపై సిబ్బంది వారి నైపుణ్యాలు ప్రదర్శించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానం, అప్రమత్తత, సమర్థతత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి డ్యూటీ మీట్లలో సిబ్బంది నైపుణ్యాలు మరింత మెరుగుపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, సీఐ రామకృష్ణ, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్ పాల్గొన్నారు. నేరస్తులపై నిఘా పెరగాలి స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులతోపాటు రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ జానకి అన్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆమె తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. స్టేషన్లో నమో దవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిఘా కొనసాగించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పర్యవేక్షణ పెంచాలన్నారు. ఆ తర్వాత సిబ్బందితో మాట్లాడుతూ శాఖపరమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోవచ్చు..
ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ -
జములమ్మ సల్లంగా చూడమ్మ..
గద్వాలన్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా అమ్మవారు ఫిబ్రవరిలో వచ్చే మాగశుద్ధ పౌర్ణమి రోజు జమ్మిచేడు ఆలయానికి చేరుకుంటారు. ఆ రోజు నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే మాగశుద్ధ పౌర్ణమి నుంచి ఏరువాక పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం వరకు భక్తులు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి మంగళవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. నైవేద్యాలు సమర్పించి, మేకపోతులు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగా చూడమ్మ జములమ్మ తల్లీ అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. పలువురు భక్తులు వివిధ వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈఓ పురందర్కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. -
పీయూ సిబ్బందికి యాప్లో అటెండెన్స్
● ఈనెల 26 వరకు యాప్లో పేరు నమోదుకు సూచన ● లొకేషన్ ఆధారంగా రోజూ ఫొటోతో ఫోన్లో హాజరు ● మీ ప్రమాణం పేరుతో ప్రత్యేక యాప్ ● జూలై 1వ తేదీ నుంచి యాప్ ద్వారా ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందికి అటెండెన్స్ ఆన్లైన్లోనే వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్రత్యేక యాప్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మీ ప్రథమం’ యాప్లో సిబ్బంది తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇటీవల అధికారులు సర్క్యూలర్ జారీ చేశారు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీతోపాటు పీజీ కళాశాల, ఫార్మసీ, ఎంఈడీ, లా, ఇంజినీరింగ్తోపాటు అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, హాస్టల్స్కు సంబంధించిన సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్తోపాటు, రిజిస్ట్రర్లో కూడా సంతకాలు పెడుతున్నారు. అయితే గతనెల పలువురు సిబ్బందికి వేతనాల్లో కోత విధించారని, బయోమెట్రిక్ అటెండన్స్ పనిచేయకపోయిన సిబ్బందిని బాధ్యులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్ తీసుకొచ్చారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒకేసారి అందరూ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలంటే నిరీక్షించే పరిస్థితి నుంచి ఈ యాప్ ద్వారా అంటెండెన్స్ ఉపశమనం కలిగించనున్నట్లు పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు. 350 మంది సిబ్బంది పీయూలో మొత్తం 350 నాన్టీచింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. సుమారు 120 మందికిపైగా టీచింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఈనెల 26లోగా మీ ప్రథమం యాప్లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ అటెండెన్స్ వల్ల బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో ఇప్పుడు యాప్లో అటెండెన్స్ వేయాల్సి ఉంది. పీయూలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళల్లో నేరుగా యాప్లో ఫేసియల్ రెకగ్నైజేషన్ విధానంలో ఫొటో తీసుకోవాల్సి ఉంది. ఇక వేతనం కోసం ఇటూ యాప్ అటెండెన్స్, రిజిస్టర్ అటెండెన్స్ను అధికారులు పరిగణలోనికి తీసుకోనున్నారు. అయితే కొంతమంది నాన్టీచింగ్ సిబ్బందిలో ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ యాప్ ద్వారా సుమారు 75శాతం సిబ్బంది పేర్లును నమోదు చేసుకున్నారు. -
కొండను ఢీకొట్టి జీపు బోల్తా
తీవ్రంగా గాయపడిన చరణ్ అదుపుతప్పి బోల్తా పడిన జీపు మన్ననూర్: శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహ దారి మన్ననూర్ సమీపంలోని నిరంజన్ షావలీ దర్గా సమీపంలో అదుపుతప్పి జీపు బోల్తా పడిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్రాబాద్ పోలీసులు తెలిపిన వివరాలు.. అమ్రాబాద్ నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న జీపు అదు పుతప్పి కుడివైపున ఉన్న కొండను ఢీకొట్టి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న సుమారు 14 మంది ప్రయాణికుల్లో లక్ష్మాపూర్కు చెందిన చరణ్, కుమ్మరోనిపల్లికి చెందిన మారెమ్మకు తీవ్రగాయాలు కావడంతో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన విజయ్మోహన్, రా ధాదేవి, కృష్ణవేణితో పాటూ మరి కొందరిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమ్రాబాద్ పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హన్మంత్రెడ్డి తెలిపారు. -
గుడిసెవాసులకే ఇందిరమ్మ ఇళ్లు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రెండో విడుతలో ముందుగా గుడిసెలున్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను కేటాయించారు. గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకే కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో గుడిసెలు, ప్లాస్టిక్ కవర్ల కింద నివాసముంటున్న నిరుపేదలను గుర్తించే పనిలో క్షేత్రస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. గృహ నిర్మాణశాఖ అధికారులు స్వయంగా వెళ్లి అర్హులను గుర్తించి వారితో ఇందిరమ్మ ఇంటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున వంద నియోజక వర్గాలకు రెండు లక్షల గృహాలను మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. మరో 50 వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటాగా నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల గృహాలు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి రెండు వేలు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం 2వేల ఇళ్లను రెండో విడుతలో మంజూరు చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లబ్ధిదారుల జాబితాలోని అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా అధికారులు గుర్తిస్తారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గుడిసెవాసులకు కేటాయించే 500 ఇళ్లు పోగా మిగతా 1,500 ఇళ్లలో 40 శాతం ఇళ్లను కోటాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ లెక్కన 1,500 ఇళ్లల్లో సుమారు 600 ఇళ్లు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల కోటాగా ఉంటుంది. మన జిల్లాల్లో ఒక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా లేడు. ఉన్న మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదాన్ని ఈసారి కూడా తప్పనిసరి చేశారు. రెండో విడుతకు ఎదురుచూపులేనా? ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాల్లో అర్హుల జా బితా ఇవ్వగా.. మొదటి విడుతలో అందరికీ ఇవ్వ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దాదాపు ఆరునెలలుగా రెండో విడుత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిర మ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండో విడుతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడుతను ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని జాబితాలు వస్తాయని భావించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటనలే గాని ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాక 1,841 గుడిసెల లెక్క జిల్లాలో ఇప్పటిదాక 1,831 గుడిసెల లెక్క తేలింది. మరో రెండు మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. దీంతో పూర్తి లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 10,266 ఇళ్లు మంజుయ్యాయి. ఇందులో ఇప్పటి దాక 1,825 ఇళ్లు పూర్తయ్యాయి. 7,103 వివిధ దశల్లో ఉండగా.. బేస్మెంట్ స్థాయిలో 1,445, గోడల దశలో 660 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి దాక 3,173 ఇళ్లు చెత్తు పూర్తయ్యాయి. ఇప్పటి దాక మొత్తం రూ.190కోట్ల బిల్లులను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం గుడిసెలు లేనితెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడుతలో ముందుగా గుడిసెలున్న వారికి ప్రాధాన్యం ఇస్తాం. గుడిసెల లెక్క తేలిన అనంతరం మిగిలిన ఇళ్లను వేరే కేటగిరీ వారికి కేటాయిస్తాం. – ఉపేందర్రెడ్డి, హౌసింగ్ పీడీ రెండో విడుత ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం గుడిసెల సర్వేలో పంచాయతీకార్యదర్శుల నిమగ్నం ఇప్పటిదాక జిల్లాలో తేలినగుడిసెల లెక్క 1,831


