breaking news
Mahabubnagar District News
-
కురుమూర్తిగిరులు.. కిటకిట
జాతర మైదానంలో రద్దీ పాలమూరు ప్రజల ఆరాధ్య దైవం అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు గండదీపాలు మోసి పచ్చి పులుసు అన్నం నైవేద్యంగా సమర్పించారు. జాతర మైదానంలోని రంగుల రాట్నాలు, వాటర్బోట్లు, స్ప్రింగ్ జంపింగ్ వద్ద పిల్లలు, పెద్దలు సరదాగా గడిపారు. మిఠాయి దుకాణాలు, హోటళ్లు, ఆట వస్తువులు, గాజుల దుకాణాల్లో రద్దీ కనిపించింది. – చిన్నచింతకుంట -
12వ శతాబ్ధం నాటి విగ్రహాన్ని కాపాడుకోవాలి
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామ శివారులోని పురాతన శివాలయం ఎదుట ఉన్న 12వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహాన్ని ఒక చెట్టు కబళిస్తుందని, చారిత్రక ప్రాధాన్యత గల ఆ విగ్రహాన్ని వెలికితీసి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్స్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన శివాలయాన్ని సందర్శించారు. ఇక్కడి పొలాల్లో ఉన్న శిథిల త్రికూటాలయం ఎదుట 1167వ శతాబ్దం నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో గోకర్ణుని శాసన శకలం ఉందన్నారు. గోకర్ణుని కుమారుడైన తొండయ్య లింగాల లో విష్ణు, శివ, సూర్యలకు చెందిన త్రికుటాల యం నిర్మించి కృష్ణాతీరంలో ఉన్న సోమేశ్వరాలయానికి లింగాలను దానం చేసినట్లు వివరాలు శాసనంపై ఉన్నాయని చెప్పారు. ఆలయం లోపల 12వ శతాబ్దం నాటి వీరభద్ర, భైరవ, సూర్య విగ్రహాలు, ఆలయం ఎదుట దీప స్తంభం, చెట్టు తొర్రలో వినాయకుడు, పక్కనే భిన్నమైన భద్రకాళి విగ్రహా లు ఉన్నాయని పేర్కొన్నారు. మర్రి చెట్టు కొంత కాలానికి వినాయక విగ్రహాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రాశస్త్యం, విలువైన విగ్రహం కనుమరుగు కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. -
బావిలో మొసలి కలకలం
మాగనూర్: మండలంలోని వర్కూర్ సమీపంలో ఉన్న ఊరబావిలో మొసలి కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో మొసలి నీటిమీదకు వచ్చి కనిపించడంతో చూసిన యువకులు భయభ్రాంతులకు గురయ్యారు. బావిలో నీరు చాలా తక్కువగా ఉన్నాయని ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి మరో చోటుకు తరలించాలని గ్రామస్తులు కోరతున్నారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్టు అధికారి కమలుద్దీన్ను సంప్రదించగా.. మొసలి ఉన్న విషయం గ్రామస్తుల ద్వారా తమ దృష్టికి వచ్చిందని.. బావిని కూడా సందర్శించాం. బావిలో నీరు ఉండడంతో మొసలిని పట్టుకోవడానికి వీలుకావడంలేదు. బావిలో ఉండడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే బావిలో నీరు తగ్గిన వెంటనే పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. అంతవరకు ప్రజలు ఎవరు బావివైపునకు వెళ్లవద్దని సూచించారు. వేడివేడి చాయ్ ముఖంపై చల్లి దాడి జడ్చర్ల: టీ హోటల్ దగ్గరకు వెళ్లి చాయ్ అడిగిన వ్యక్తిపై హోటల్ యజమాని ఖేటిల్లో వేడిగా ఉన్న దాదాపు 5లీటర్ల చాయ్ని ముఖంపై చల్లి ఓ రాడ్తో దాడిచేసిన ఘటన శనివారం రాత్రి జడ్చర్ల పట్టణంలో చోటుచేసుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. శనివారం రాత్రి 11గంటలకు శివాజీనగర్కు చెందిన ఎండీ సమీర్ సమీపంలోని ఓ చిన్నహోటల్ దగ్గరకు వెళ్లి చాయ్ అడుగగా పాత కక్షలు మనసులో పెట్టుకున్న హోటల్ యజమాని మహ్మద్ నా దగ్గరకు వచ్చి చాయ్ అడుగుతావా అంటూ ఖేటిల్లో ఉన్న చాయ్ని ముఖంపై చల్లి ఓ రాడ్తో దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన సమీర్ను చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అలవి వలల జోరు
తీవ్రంగా నష్టపోతున్నాం.. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది వచ్చి నిషేధిత వలలతో చిన్న, స న్న చేప పిల్లలను పట్టుకొని మాకు బతుకుదెరువు లే కుండా చేస్తున్నారు.పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి నా ఫలితం లేదు. ఇప్పటికై నా స్పందించి నిషేధి త అలవి వలలతో చేపల వేటను నియంత్రించాలి. – బాలరాజు, మంచాలకట్ట ఉపాధి కోల్పోతున్నాం.. కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేటను నిషేధిస్తే చిన్న, సన్న చేపపిల్లలు పెరిగి పరీవాహక ప్రాంతాల్లోని మత్స్యకారులు బతకడానికి ఉపాధి దొరుకుతుంది. అధికారులు దాడులు నిర్వహించి నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – రంగస్వామి, మల్లేశ్వరం దాడులు నిర్వహిస్తాం.. అలవి వలలు నిషేధం కాబట్టి సిబ్బందితో కలిసి వెళ్లి కృష్ణానదిలో దాడులు నిర్వహిస్తాం. వలలు పట్టుకొనేందుకు ఫీల్డ్ మ్యాన్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశాం. కచ్చితంగా వలలు పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. జిల్లా మత్స్యశాఖ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అంతేగాకుండా స్థానిక మత్స్యకారులకు కూడా అవగాహన కల్పిస్తాం. – రజని, జిల్లా మత్స్యశాఖ అధికారి ●పెంట్లవెల్లి: ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. మరోపక్క దళారులు ఇతర రాష్ట్రాల కూలీలతో నిషేధిత అలవి, చైర్మన్ వలలతో కృష్ణానదిలో సన్న, చిన్న చేప పిల్లలు పడుతూ స్థానిక మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు. ఈ విషయాన్ని మండలంలోని కృష్ణా పరీవాహక గ్రామాల ప్రజలు పలుమార్లు జిల్లా మత్స్యశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన చల్లపాడు, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి తదితర గ్రామాల మత్స్యకారులు ఏటా కృష్ణానదిని నమ్ముకొని చేపల వేట చేపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే పదేళ్లుగా ఇదే ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, కొవ్వూరు, రాజమండ్రి, తుని, కాకినాడ, ఝార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున దళారులు అక్కడి కూలీలను తీసుకొచ్చి అలవి వలలతో సన్న, చిన్న చేపపిల్లలు పట్టి వట్టిగా ఆరబెట్టి వ్యాపారం చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం చెరువులు, నదుల్లో బొచ్చ, రౌట, మట్ట, బొంబిడాలు వంటి రకరకాల చిన్న చేప పిల్లలను వదిలితే కనీసం అవి పెరిగి పెద్దవి కాకుండానే పడుతున్నారు. అలవి వలలు నిషేధితమని తెలిసి కూడా అధికారులు వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. అదేవిధంగా మత్స్యకారులు కనీసం రోజు కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న, సన్న చేప పిల్లలను వారే లాక్కెళుతుంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూసి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. కృష్ణానదిలో సన్న, చిన్న చేపపిల్లల వేట ఉపాధి కోల్పోతున్న స్థానిక మత్స్యకారులు తూతూమంత్రంగా మత్స్యశాఖ అధికారుల దాడులు -
కేఎల్ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం
బిజినేపల్లి: మండలంలోని కారుకొండ గ్రామ శివారులో ఉన్న కేఎల్ఐ కాల్వలో మంగనూర్ కు చెందిన కురువ సాయమ్మ (60) అనే మహి ళ మృతదేహం ఆదివారం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ నూర్ గ్రామానికి చెందిన సాయమ్మ ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులైనా ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, గ్రామంలో తదితర ప్రాంతాల్లో వెతికారు. సా మాజిక మాద్యమాల్లో సాయమ్మ కన్పించడం లేదని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో సాయ మ్మ మృతదేహం ఆదివారం ఉదయం కాల్వలో కనపడింది.స్థానికులు కుటుంబ సభ్యులకు విష యం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరు కుని మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కోస్గి రూరల్: పెళ్లి జరిగి నెల రోజులు గడవక మందే ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు నాచారం గ్రామానికి చెందిన బోయిని భీమప్ప, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన బోయిని రాము (24) కు దోమ మండలంలోని దాదాపూర్కు చెందిన కంపిళ్ల వెంకటయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె అనితతో అక్టోబర్ 8న నాచారంలో వివాహమైంది. రాము హైదరాబాద్లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఆటోను నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. వివాహం తర్వాత భార్య అనితను హై దరాబాద్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి రాలేదు. ఆదివారం ఉదయం ఓ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. పక్కనే ఆటో ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతిపై అనుమానం ఉండటంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి జరిగి నెల రోజులు గడవక మందే రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబంలో విషాధం అలుముకున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఉండవెల్లి: మండలంలోని మెన్నిపాడుకు చెందిన శేఖర్(30)ను గత నెల 30న రాత్రి బైక్పై కర్నూలుకు వెళ్తుండగా జాతీయ రహదారిపై మోవాత్ దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో శేఖర్కు తలకు గాయం కావడంతో 108 అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మృతిపై అనుమానం మృతుడు శేఖర్ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా దాడి చేయడంతో కోమాలో ఉన్నాడని 30వ తేదీన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్కు వచ్చారు. ప్రమాదం కాదని గాయాలపై అనుమానం ఉందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. పోలీసుల అదుపులో బంగారం వ్యాపారి ధరూరు: దొంగ బంగారం కొన్న కేసులో మండల కేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తాలోని హేమంత్ బంగారు దుకాణ యజమాని శివకుమార్ను శాంతినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంత మేర బంగారం తాకట్టులో పెట్టుకున్నారు, ఎప్పుడు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టుకున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై రేవులపల్లి పోలీసులను వివరణ కోరగా అలాంటి దేమి తమ దృష్టికి రాలేదని, ఒకవేళ అదుపులోకి తీసుకొని ఉంటే వివారలు వెల్లడిస్తామని ఎస్ఐ శ్రీహరి తెలిపారు. శాంతినగర్ పోలీసులు సదరు బంగారు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన మహిళ దోమలపెంట: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.వనపర్తికి చెందిన కురుమూర్తి (43)కి భా ర్య, పదో తరగతి చదివే కూతురు ఉండగా వా చ్మెన్గా పనిచేసున్నాడు. అయితే భార్య నాగమణి (38) శ్రీకాంత్ (26) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఆనకట్ట దిగువన ఉన్న సాగర్ జలాశయంలో పడేసి వెళ్లిపోయారు. కురుమూర్తి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వనపర్తి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సాగర్ జలాశయంలో ఓ మృతదేహం తేలియాడుతున్నట్లు తెలియడంతో అమ్రాబాద్ సీఐ శంకర్నాయక్ సహకారంతో మృతదేహాన్ని బయటికి తీసి కుటుంబసభ్యులకు చూపించగా కురుమూర్తిదే అని గుర్తించారు. చివరికి భార్యనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
విషాదం నింపిన అక్కాచెల్లెళ్ల హత్య
గండేడ్/ కోస్గి: చెల్లెలి కాపురం చక్కదిద్దబోయి మరిది చేతిలో చెల్లెలితోపాటు అక్క హతమైన ఘటన మండలంలోని పగిడ్యాల్, బలభద్రాయిపల్లిలో విషాదం నింపింది. గండేడ్ మండలంలోని పగిడ్యాల్ మాజీ సర్పంచ్ తోక కృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె హనుమమ్మ(40)ను గుండుమాల్ మండలంలోని బలభద్రాయిపల్లికి చెందిన బాలకిష్టయ్యకు ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె అలివేలు(34)ను వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లకు చెందిన యాదయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అలివేలు కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. రెండు, మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అలివేలు అక్క హనుమమ్మకు ఫోన్ చేసి తన కాపురం చక్కదిద్దాలని కోరగా.. ఆమె కుల్కచర్లలోని చెల్లి ఇంటికి వచ్చింది. రెండు రోజులపాటు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో యాదయ్య భార్య అలివేలు, కుమార్తె శ్రావణితోపాటు వదిన హనుమమ్మపై కొడవలితో దాడి చేసి హతమార్చాడు. పెద్ద కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నించగా ఆమె గాయాలపాలై తప్పించుకొని పారిపోయింది. అనంతరం అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కాచెల్లెళ్ల సొంత గ్రామమైన పగిడ్యాల్ విషాదం చోటుచేసుకుంది. వారి తండ్రి కృష్ణయ్య నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. -
‘బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత ముఖ్యమంత్రిదే..’
వీపనగండ్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్న జేఏసీకి సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించి ప్రక్రియ పూర్తి చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్రస్థాయిలో ఉన్న బీజేపీ నేతలు మరోతీరుగా వ్యవహరిస్తూ బీసీ కులాల్లో వర్గవిభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తమపార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుందని.. బీసీ వర్గాలు చేసే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి కిల్లె గోపాల్, వనపర్లి జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. శతాబ్ధి ఉత్సవాలకు తరలిరండి మహబూబ్నగర్ మున్సిపాలిటీ:దేశానికి స్వా తంత్య్రం కావాలని తొలుత 1925లోనే గర్జించింది తమ సీపీఐనే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ఆ దివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే పార్టీ శతాబ్ది ముగింపు సభ, ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. పార్టీ త్యాగాలు, పోరాటాలను గుర్తు చేస్తూ ఈ నెల 15న బస్సుయాత్ర జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమై.. వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల మీదుగా ఖమ్మం వెళ్తుందన్నారు. కొందరు వ్యక్తులు ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లును విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర ఎకై ్సజ్ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకుని తక్షణమే దీనిని నిలువరించాలని, లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, కార్యవర్గ సభ్యులు పరమేష్గౌడ్, రాము, పద్మావతి, గోవర్ధన్, కౌన్సిల్ సభ్యులు నర్సింహ, శ్రీను, చాంద్బాషా పాల్గొన్నారు. -
‘వలస బతుకు’ ఓ గొప్ప పుస్తకం
మరికల్: వలస బతుకులపై నర్సన్న ఓ గొప్ప పుస్త కం రచించారని జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి కొనియాడారు. మరికల్కు చెందిన నర్సన్న తన కుటుంబంలో వలస వెళ్లిన వారిలో మూడోతరానికి చెందిన వ్యక్తి. ఆయన వలస వెళ్లిన సమయంలో తన అను భవాలను వివరిస్తూ శ్రీవలస బతుకుశ్రీ అనే పుస్తకం రాసి మరణించాడు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన కుమారుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్రాములు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా జిస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, ప్రొ. హరగోపాల్, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7వ తరగతి వరకు చదివిన నర్సన్న రచించిన పుస్తకాన్ని చదివేటప్పు డు తన మనస్సు కలిచివేసిందని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తమకని సూచించారు. చాలీచాలని కూలీతో జీవనం సాగిస్తూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా సొంత ఊరుకు రావడం అనే విషయం తనను చాలా బాధించిందన్నారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికీ వలసలు ఆగకపోవడం విచారకరమని తెలిపారు. ఓ గొప్ప గ్రంథం.. వలస బతుకులను వివరిస్తూ నర్సన్న రాసిన పుస్త కం ఓ గొప్ప గ్రంథమని విశ్లేషకుడు పరకాల ప్రభా కర్ అన్నారు. తన అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా పుస్తకంగా రాయడం జీవితంలో ఎక్కడ చూడలేదని తెలిపారు. న్యాయమూర్తులు కూడా తెలుసుకోవాల్సి విషయాలు పుస్తకంలో ఉండటం విశేషమన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని పాలమూరు అధ్యయన వేదిక వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా తాగునీరు దొరక్క ఓ రాత్రి మురుగు కాల్వలో నీటిని తాగమని రాసిన విషయం తను బాధించిందన్నారు. మనుషులను కదిలించే అంశాలు ఈ పుస్తకంలో ఉండటం విశేషమని.. నాటి నుంచి నేటి వరకు పాలమూరు జిల్లా వలస కూలీల బతుకులు మారకపోవడానికి పాలన విధానం సక్రమంగా లేకపోవడమే కారణమని తెలిపారు. నర్సన్న ఓ కళాకారుడు.. పుస్తకం చదివిన తర్వాత నర్సన్నలో మరో కళాకారుడు దాగి ఉన్నాడని తెలుకున్నానని ఎమ్మెల్సీ, కళాకారుడు డా. గోరెటి వెంకన్న అన్నారు. బ్రాహ్మంగారి నాటకంలో నర్సన్న ఆలీరాాణి పాత్ర వేసి ఆ నాటకానికే వన్నే తెచ్చారని గుర్తుచేశారు. కనిపించని కళాకారులు తాము రచించిన పుస్తకాలు వెలుగులోకి రాకుండానే కనుమరుగయ్యారని తెలిపారు. నర్సన్న కుటుంబ సభ్యులు, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులను అభినందించడం గౌరవంగా ఉందన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్గా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని జిల్లా సాఫ్ట్బాల్ అ సోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్రాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మహిళా సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అమరేందర్రాజు మాట్లాడుతూ జిల్లా సాఫ్ట్బాల్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జగిత్యాలలో ఈ నెల 7 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ మహిళల టోర్నమెంట్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జి.శరత్చంద్ర, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు రాఘవేందర్, నాగరాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు. – ఉమ్మడి జిల్లా మహిళా జట్టుకు ఎస్.సునీత, పి.మంజుల, భార్గవి, శిరీషా, తులసి, పి.కాంచన, కీర్తి, కె.నిఖిత, పి.నిఖిత, ఎం.వర్షిత, కె.పల్లవి, శివజ్యోతి (మహబూబ్నగర్), పి.రోషిని, జి.మనీషా, జె.మహేశ్వరి, శిరీషా రాణి (నారాయణపేట), స్టాండ్బైగా శ్వేత, ఎం.వర్షిత (మహబూబ్నగర్) ఎంపికయ్యారు. -
అడుగులోతు ప్రవాహం
ఈ సీజన్లో గాండ్లోని చెరువు ఆరంభంలోనే నిండింది. భారీ వర్షం ఆగి నాలుగు రోజులైనా అండర్ పాస్ (ఆర్యూబీ) వద్ద వరద నీరు అడుగులోతు ప్రవహిస్తోంది. దీంతో నగరానికి వెళ్లడానికి ఈ మార్గం గుండా రాకపోకలు ఆగిపోయాయి. వర్షాలు కురిసినప్పుడల్లా కొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా ఈ చెరువులో పూడికతీసి రాజేంద్రనగర్, ప్రేమ్నగర్ వైపు ఉన్న తూములు తెరవాలి. అలాగే ఇక్కడి అండర్పాస్ వద్ద సీసీరోడ్డు నిర్మించి బెడ్వేసి కట్ట ఎత్తు పెంచాలి. – వీరేష్, ఆటోడ్రైవర్, న్యూమోతీనగర్ ఎర్రకుంట తూము గతంలోనే తెరవడంతో పాటుకాల్వ ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది. దీని ఎత్తు పెంచి పటిష్టం చేయాలి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మా ఇంటి ఆవరణలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డాం. ఈ పాటుకాల్వ ద్వారా వరద ఇంకా పారుతోంది. మా కాలనీలో ఇటీవల రోడ్డు నిర్మించినా కాజ్వేకు ఇరువైపులా జాలి ఏర్పాటు చేయలేదు. ఇక్కడి సమస్యను అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదు. – వెంకటేష్, వ్యాపారి, గణేష్నగర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా సీజన్ ఆరంభంలోనే ముందస్తు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దచెరువు, ఎర్రకుంట, ఇమాంసాబ్ కుంటల తూములను తెరిచి ఎప్పటికప్పుడు వరద కిందికి వెళ్లేలా చేశాం. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఇళ్లలోకి వరద చేరలేదు. భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తరుచూ పర్యవేక్షిస్తున్నాం. – విజయభాస్కర్రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్, మహబూబ్నగర్ ● -
కోయిల్సాగర్లో ఒక గేటు ఎత్తివేత
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం ఒక గేటును తెరిచి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దవాగు నుంచి భారీగా వరద రావడంతో గత బుధవారం ఏకంగా అయిదు గేట్లను తెరిచి నీటిని విడుదల చేసిన తరువాత నాలుగు రోజులుగా ఒక గేటు తెరిచి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగుల వద్ద పూర్తిస్థాయి నీటి నిల్వ 2.27 టీఎంసీలు ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం
స్టేషన్ మహబూబ్నగర్: దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఇండోర్ హాల్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్రెడ్డి, గుడిగోపురం మట్టారెడ్డి కుటుంబాల ఆర్థిక సహాయంతో ఆదివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ చేయడానికి నిర్వహించిన ఎంపిక శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి నిర్వాహకులు కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, నాయకులు సుధాకర్రెడ్డి, ప్రశాంత్, సంపత్, ప్రమోద్కుమార్, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా వ్యభిచారం
ఫోన్లో సమాచారం.. మహబూబ్నగర్ క్రైం: ‘సందడిగా ఉండే ఇళ్లు.. రిచ్గా ఉండే కాలనీలు.. జన సంచారం అధికంగా ఉన్న చోట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని భావిస్తాం.. కానీ, కొందరు వీటినే తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో పడుపు వృత్తి కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్నాయి. వాట్సాప్ ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. సెల్ఫోన్లోనే బేరసారాలు చేస్తున్నారు. వేశ్యలు.. కొందరు గృహిణులకు సైతం ప్రలోభాలతో ఆశచూపి ఈ రంగంలోకి దించుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి. జిల్లాకు సరిహద్దు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ప్రలోభాలకు గురిచేసి.. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంతోపాటు జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో విస్తరిస్తున్న హైటెక్ వ్యభిచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల, భూత్పూర్ జాతీయ రహదారుల వెంట టోల్గేట్కు అర కిలోమీటర్ దూరం నుంచి రోడ్డుకు రెండు వైపులా ఈ తతంగం నడుస్తోంది. జాతీయ రహదారిపై ఉండే దాబాల్లోనూ ఈ దందా జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేక పడుపు వృత్తిలో దిగిన మహిళలు కొందరే ఉండగా.. మరికొందరు విలాసవంతమైన జీవితం కోసం ఈ వృత్తిలోకి వస్తున్నారు. వేశ్య వృత్తి చేసేవారు మంచి కుటుంబాలకు చెందిన మహిళలను సైతం ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండటమే ఆందోళనకంగా మారింది. ప్రతిరోజు జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఇళ్లలో, ముఖ్యమైన హోటళ్లతోపాటు చిన్నపాటి లాడ్జిలలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. వాట్సాప్లలో ఫొటోలు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మంచి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలస్తోంది. దీనికోసం చాలామంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ముందుగా వాట్సాప్లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకు పోతున్నారు. పైగా సెల్ఫోన్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు సెల్ఫోన్లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో.. లేక బయట ఫలానా చోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్తున్నారు.కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. హైదరాబాద్తోపాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశచూపెట్టి ఈ రంగంలోకి దించుతూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పరిచయస్తులైన యువతులకు సైతం గాలం వేస్తున్నారు. ఒక్కో విటుడి నుంచి రూ.వెయ్యి నుంచి మొదలుకొని రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఈ దందాలో మధ్యవర్తులే ఎక్కువగా లాభపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని టూటౌన్, వన్టౌన్, రూరల్ ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నా, పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకేంద్రంలో నివాస గృహాలే అడ్డాగా దందా జాతీయ రహదారి పొడవునా అదే తరహాలో.. టోల్గేట్ సమీప ప్రాంతంతోపాటు ప్రత్యేక దాబాల్లోనూ వ్యవహారం జిల్లాకేంద్రంతోపాటు జాతీయ రహదారిపై రాత్రివేళ ప్రత్యేక పెట్రోలింగ్ చేసి అసాంఘిక కార్యకలపాలపై నిఘా పెడతాం. పోలీస్స్టేషన్ వారీగా తనిఖీలు పెంచి అనుమానాస్పద ఇళ్లపై దృష్టిపెడుతాం. కాలనీల్లో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుంటే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ -
నేడు ఎస్ఎల్బీసీకి సీఎం రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్ లెట్కు చేరుకొని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనుమతి లేకుండా ధర్నాలు చేయరాదు : ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీస్ 30 యాక్ట్–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ అమలు నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అన్ని రకాల సంఘాల నాయకులు, ప్రజలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేకుండా ఏదైనా కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని రాజకీయ నేతలతోపాటు ప్రజా, కుల సంఘాల నాయకులు ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. రద్దీ ఏరియాల్లో పటిష్ట నిఘా.. జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో షీటీం విభాగానికి 28 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా 23 కౌన్సెలింగ్స్, రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న కేసులు 21, ఎఫ్ఐఆర్లు 5, ఈ–పెట్టీ కేసులు రెండు, అవగాహన కార్యక్రమాలు 16, హాట్స్పాట్ విజిట్స్ 86 చేశామన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఈవ్టీజింగ్, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడితే డయల్ 100 లేదా 87126 59365 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఏహెచ్టీయూ విభాగం ఆధ్వర్యంలో 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 30 హాట్స్పాట్ ప్రాంతాలు సందర్శించినట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, అవయవాల విక్రయాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు. -
జిల్లాకేంద్రంలో అధ్వాన స్థితిలో పాటుకాల్వలు, పెద్దనాలాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో భారీ వర్షం కురిసి నాలుగు రోజులైనా పాటు కాల్వలు, పెద్ద నాలాలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. సుమారు 45 రోజుల క్రితమే కొత్తగంజి సమీపంలోని కొత్త చెరువు, న్యూమోతీనగర్– ప్రేమ్నగర్ మధ్యలోని గాండ్లోని చెరువు, శ్రీనివాసకాలనీలోని పాలకొండ చెరువు, పాలకొండలోని ఊరచెరువు, అప్పన్నపల్లిలోని గంగోసుకుంట నిండి అలుగులు పారాయి. ఈ సీజన్ ఆరంభంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మినీ ట్యాంకుబండ్ (పెద్దచెరువు), ఎర్రకుంట, ఇమాంసాబ్కుంట తూములను నీటి పారుదల శాఖ అధికారులు తెరిచి ఉంచారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పాటు కాల్వలు, పెద్దనాలాలు సుమారు 8 కి.మీ., వరకు విస్తరించి ఉండగా చాలాచోట్ల అధ్వాన స్థితికి చేరాయి. ఇళ్ల మధ్యలో నుంచి ఇవి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. శాశ్వత నివారణ చర్యలేవి? లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం పెద్దచెరువు (మినీ ట్యాంక్ బండ్) కింద ఒకవైపు తూము నుంచి షాషాబ్గుట్ట– బీకేరెడ్డికాలనీలో, రెండోవైపు రామయ్యబౌలి అలుగు నుంచి మొత్తం కిలోమీటరు మేర వరద కాల్వ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 600 మీటర్లే పూర్తి చేశారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అమృత్–2 కింద సీవరేజీ ప్రాజెక్టు కింద 2023లో రూ.276.80 కోట్లు కేటాయించింది. ఏడాదిన్నర క్రితమే టెండర్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎస్టీపీ లు కాని, పాటుకాల్వలు, పెద్దనాలాలు (ఐఎన్డీ స్ట్రక్చర్ డ్రెయిన్స్) కాని పటిష్టం చేయడానికి పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ఇక అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల వివిధ చోట్ల సీసీరోడ్లు, డ్రెయినేజీలను మాత్రమే నిర్మించి.. పాటుకాల్వలు, పెద్దనాలా ల జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతో నగరంలో ఏటా ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నాలుగు రోజులైనా తగ్గని వరద ఉధృతి ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు నగరంలోని ఆర్యూబీల వద్ద నిలిచిన రాకపోకలు భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి -
రహదారులపై దృష్టి..
ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు ఆటంకం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటి వరకు జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు ప్రధానంగా భూ సేకరణే అడ్డంకిగా మారడంతో.. ఈ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పెండింగ్లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేయడం, నిర్వాసితులకు చట్టపరంగా పరిహారం చెల్లింపు పూర్తి చేయడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు అవుతుండటంతో భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రాగానే విస్తరణ పనుల్లో వేగం పెరగనుంది. శ్రీశైలం దారిలో.. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మండలం కొట్ర మీదుగా శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు వరుసలుగా ఉన్న ఈ దారిని ప్రయాణానికి సౌలభ్యంగా విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దారిలో అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.7,700 కోట్ల అంచనాతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తికావొచ్చిన కల్వకుర్తి– నంద్యాల కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రహదారి పనులు చాలా వరకు పూర్తి కాగా.. బైపాస్, సర్కిళ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి తాడూరు మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు పూర్తవగా.. తాడూరు నుంచి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. నాగర్కర్నూల్లోని కొల్లాపూర్ చౌరస్తా నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల వద్ద పేవ్మెంట్, సైడ్వేల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు కొనసాగుతున్న పనుల్లో వేగం పెరిగింది. సోమశిల వద్ద కృష్ణానదిపై చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలకు ప్రారంభం కానున్నాయి. టెండర్ల దశలో బ్రిడ్జి నిర్మాణం.. కల్వకుర్తి– నంద్యాల జాతీయ రహదారి పనులు పూర్తికావొస్తున్నా.. కీలకమైన సోమశిల బ్రిడ్జి నిర్మాణం మాత్రం టెండర్ల దశలోనే ఉంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే ఈ రహదారి ఏపీలోని నంద్యాల వరకు అనుసంధానం కానుంది. మరో రెండేళ్లలోపు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియలోనే జాప్యం కొనసాగుతోంది. కాగా.. ఈ నెల 5న బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రధాన అడ్డంకిగా మారిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు ప్రతిపాదనలు మహబూబ్నగర్– మరికల్ ఎన్హెచ్–167 పనులకు నిధులు మంజూరు ఉమ్మడి జిల్లాలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి– మల్లేపల్లి– హాలియా– అలీనగర్– మిర్యాలగూడ మీదుగా వెళ్లే ఎన్హెచ్–167 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డును 219 కి.మీ., మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి–167ఎన్ పరిధిలో మహబూబ్నగర్ బైపాస్ నిర్మాణానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్దనున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి రహదారి వరకు అనుసంధానం చేసేలా బైపాస్ నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ., మేర ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి–167కే విస్తరణకు కేంద్రం ఇటీవల నిధులు మంజూరుచేసింది. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుడేబల్లూరు వరకు రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.2,278.38 కోట్లను వెచ్చించి 80.01 కి.మీ., మేర రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ మీదుగా ఏపీలోని మంత్రాలయం, రాయచూరు, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం మరింత సౌలభ్యంగా మారనుంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్– దేవరకద్ర– మరికల్– జక్లేర్– మక్తల్ మీదుగా ప్రయాణించే వారికి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లావాసులకు ప్రయోజనం కలగనుంది. -
మార్మోగిన గోవిందనామస్మరణ
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ సిబ్బంది ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించి.. దాసంగాలు సిద్ధం చేశారు. మెట్ల మార్గం గుండా కొబ్బరికాయలు కొడుతూ గోవిందనామస్మరణతో స్వామి వారి చెంతకు చేరుకున్నారు. దాసంగాలు సమర్పించి.. చల్లంగా చూడాలని వేడుకున్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఇంటి ఇలవేల్పుకు గండదీపాలు మోశారు. కొండపైన అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపం, చెన్నకేశవ స్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలలో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తగు చర్యలు చేపట్టారు. ● కురుమూర్తిస్వామిని జోగుళాంబ జోన్ – 7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా..డీఐజీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నచింతకుంట ఎస్ఐ ఓబుల్రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. కురుమూర్తిస్వామి జాతరకు తరలివచ్చిన భక్తజనం -
బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/రాజాపూర్: బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదామని.. రాజ్యాధికారం దిశగా బీసీలు తమ హక్కులను పోరాడి సాధించుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ పీయూ సమీపంలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్పీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీల 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేకుండా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే విధించే వరకు తీసుకువచ్చిందని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప చట్టబద్ధత ఉండదని మొదటి నుంచి చెబుతూ ఉన్నామని కానీ ఆ విషయంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేసేందుకే ప్రయత్నం చేశాయన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల అధినాయకత్వం మొత్తం అగ్రవర్ణ చేతిలో ఉందని, కాబట్టి బీసీల 42 శాతం రిజర్వేషన్ విషయంలో బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకునేందుకే చూస్తున్నాయన్నారు. . నేటికి పాలమూరు నుంచి వలసలు ఆగలేదు ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా మన పాలమూరు జిల్లా నుంచి నేటికి వలసలు ఆగలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి కురుమూర్తి దేవస్థానానికి వెళ్తూ రాజాపూర్లో ఆగి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేడు ఉద్యోగాలు.. నిధులు, నియామకాలల్లో అన్నింటిలో దొంగతనం చేసుకుంటూ మనసొమ్మే వాళ్లు తినుకుంటూ మనల్ని సాకుతున్నామని చెబుతున్నారని ఆరోపించారు. మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్పా మన బతుకులు మారవని, బీసీలు ముఖ్యమంత్రులు కావాలే అని అన్నారు. కురుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
కోస్గి రూరల్: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు శ్రీలత ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిల అండ చూసుకొని స్థానికంగా కొందరు నాయకులు కోస్గి, మద్దూరు మండలాల్లో భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, అమాయకులపై అక్రమంగా కేసులు పెట్టి రాయలసీమ ఫ్యాక్షనిస్టులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీలత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రవంచకు చెందిన శ్రీశైలం వేధింపుల కారణంగానే శ్రీలత ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. నిందితుడికి సహకరిస్తున్న నాయకులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దందాలకు పాల్పడుతున్న వ్యక్తులకు పోలీసులు సైతం వత్తాసు పలుకున్నారని విమర్శించారు. కోస్గి ఎస్ఐ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని, ఆయన ఉద్యోగం వదిలి సీఎం రేవంత్రెడ్డి ఇంట్లో పని చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిలు, పోశప్ప వెంకట్ నర్సిములు, కోనేరు సాయిలు, నిరంజన్రెడ్డి, బాల్నర్సయ్య, నీలప్ప, వెంకటేష్, రాములు, తదితరులున్నారు. -
బతికే ఉన్నాడా.. ఎటైనా పోయాడా?
ఎర్రవల్లి: మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వనపర్తి జిల్లా కాశీంనగర్కు చెందిన ఎద్దుల వెంకటేష్ ఆచూకీ కోసం శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. రెండో రోజు రెండు స్పీడ్ బోట్ల సాయంతో ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది సాయంత్రం వరకు గాలించినా వ్యక్తి ఆచూకీ లభించలేదని ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన ఎద్దుల వెంకటేష్తో మరోక చరవాణి ఉందని అతడు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడకుండా సోషల్ మీడియా ద్వారా అందరినీ తప్పుదోవ పట్టించి తన మొబైల్, బైక్ను బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జిపై వదిలేసి ముంబాయికి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వ్యక్తి బతికే ఉన్నాడా లేక ఎటైనా పోయాడా అనేది తేలాల్సి ఉంది. రెండో రోజు కొనసాగిన గాలింపు చర్యలు -
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో భోజనం చేయగా.. 9 గంటల తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరు వాంతులు చేసుకున్నారు. గమనించిన హాస్టల్ సిబ్బంది అంబులెన్స్కు సమాచారం అందించగా ఎస్ఐ మురళి సిబ్బందితో అక్కడికి చేరుకొని ముందుగా మూడు అంబులెన్స్లలో 35 మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 20 మంది విద్యార్థులు చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా.. మొత్తం 55 మంది విద్యార్థులను ఆస్పత్రిలోని రెండు మెడికల్ వార్డులలో ఉంచి 20 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు. – ఎర్రవల్లి -
కురుమూర్తి సన్నిధిలో.. నల్లమలరాజాల సందడి
● జాతరలో చుక్కల పశువులకు డిమాండ్ ● తూర్పుజాతి సంతతిగా కొనుగోలుకు రైతుల ఆసక్తి ● రూ.లక్షల్లో వెనకేసుకుంటున్న వ్యాపారులు నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట, మద్దిమడుగు, ఈగలపెంట, మన్ననూరు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే ఆవులు, ఎద్దులు, దూడలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నల్లమల కొండల్లో తిరిగే ఈ జీవాలు వాతావరణంలో చోటు చేసుకొనే అన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగిస్తాయి. అడవుల్లో ఉండే రాళ్ల మధ్య ఇవి మేత కోసం తిరుగుతుండడంతో కాళ్ల గిట్టలు బలంగా ఉంటాయి. తీవ్రమైన చలి, ఎండ నుంచి కాపాడుకునేందుకు శరీరం, కండరాలను దృఢంగా ఉంచుకుంటాయి. ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక నల్లమల జీవాలు కేవలం పాల కోసమే కాకుండా వ్యవసాయంలో కూడా రైతుకు తోడుగా ఉంటాయి. ఈ తూర్పుజాతి పశువులు ధైర్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తాయి. దట్టమైన అడవుల్లోని మృగాలతోనూ పోరాడే శక్తి, తమ యజమానిపై విశ్వాసంగా ఉండడం ఈ పశువులను ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి. సుమారు 45 ఏళ్లుగా ఈ పశువుల సంత కురుమూర్తి జాతరలో సాగుతుండగా.. నల్లమల నుంచి వచ్చే జీవాలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తారు. చుక్కల ఆవులు, దూడలు, ఎద్దులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చుక్కలతో ఉండే ఆవులు అదృష్టాన్ని తెస్తాయని అన్నదాతలు నమ్ముతారు. వీటి క్రయవిక్రయాల ద్వారానే వ్యాపారులు రూ.లక్షల్లో వేనకేసుకుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెండు రోజులే.. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర కేవలం భక్తి ప్రపత్తులకే పరిమితం కాకుండా.. పశువుల పండువగాను విరాజిల్లుతోంది. ఒకవైపు శ్రీకురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ.. గోవింద నామస్మరణ మార్మోగితే.. మరోవైపు పశువుల సందడి.. చిరు వ్యాపారుల హడావుడి.. ఇలా అన్నీ కలిసి సజీవ చిత్రమై కనిపిస్తాయి. – మదనాపురం రాజసం ఉంటుంది.. నల్లమల నుంచి వచ్చే చుక్కల ఆవులు, ఎద్దులను చూడగానే అందులో రాజసం కనిపిస్తుంది. వాటి కళ్లలో ధైర్యం ఉంటుంది. బలమైన ఎద్దు పొలంలో దిగి.. దుక్కి దున్నితే మట్టి కుంకుమలా మారాల్సిందే. అందుకే రైతులు రూ.వేలు ఖర్చు చేసి చుక్కల ఎద్దులు, ఆవులను కొనుగోలు చేస్తారు. మేం చిన్నతనం నుంచే ఈ వ్యాపారంలో ఉన్నాం. మా నాన్న కూడా ఇలానే జాతరకు పశువులు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ జాతర మా కుటుంబ సంప్రదాయం మారింది. నల్లమల ఆవు అమ్మినప్పుడు మేము దానిని దేవతలకే సమర్పించినట్లుగా భావిస్తాం. – వెంటకయ్య, వ్యాపారి, ఇంజమూరు జాతర ప్రారంభమైన మొదటి రెండు రోజులే పశువుల సంత ఉంటుంది. కొందరు వ్యాపారులు కురుమూర్తిస్వామి గుడిలో మొదట పూజలు చేసి.. తర్వాతే పశువుల విక్రయానికి దిగుతారు. పశువును కొన్న రైతు దానికి తలపాగ చుట్టి.. బెల్లం ముక్కతో మొదటి పూజ చేసి.. ఈ ఏడాది పంట బాగుండాలి అని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పశువులను రైతులు తమ కుటుంబ సభ్యుడితో సమానంగా ఆదరిస్తారు. 45 ఏళ్ల చరిత్రలో ఇది కేవలం సంత మాత్రమే కాకుండా.. ఈ ప్రాంత రైతుల సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉండవెల్లికి చెందిన రాజు అలియాస్ చింటు(33) కర్నూల్లో ప్రైవేటు ఉద్యోగి. రోజువారీగా శుక్రవారం బైక్పై ఉద్యోగానికి వెళ్తుండగా.. ఉండవెల్లి శివారులో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైవే అంబులెన్స్లో కర్నూల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన వ్యకిక్తి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు మృతిచెందడంతో శోఖసంద్రంలో మునిగిపోయారు. ప్రమాద స్థలం వద్ద వాహనాలు అధికసంఖ్యలో నిలిచిపోవడంతో హైవే సిబ్బంది, పోలీసులు నియంత్రించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్తంభం తలపై పడి వ్యక్తి మృతి వనపర్తి రూరల్: స్తంభం తలపై పడి వ్యక్తి మృతిచెందిన ఘటన పెబ్బేరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యుగేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొత్తకోట మండలం నాటవెల్లికి చెందిన బాలరాజుగౌడ్ పెబ్బేరు మండలం వైశాఖాపూర్లో ఎస్వీఆర్ మినరల్స్ కంపెనీలో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కంపెనీకి వచ్చాడు. కంపెనీ దగ్గరున్న స్తంభాన్ని ఆపరేటర్ హిటాచీతో తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోవడంతో అక్కడే ఉన్న బాలరాజుగౌడ్ తలపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. మృతుడికి భార్య అనురాధ, ఇద్దరు కూతురర్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి భూత్పూర్: మున్సిపాలిటీలోని గోప్లాపూర్లో విద్యుదాఘాతంతో పి.కార్తీక్ (19) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సావిత్రి, తుల్జానాయక్కు కుమారుడు కార్తీక్, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి కార్తీక్ నీరు పట్టేందుకు సర్వీస్ వైర్ను ప్లగ్లో పెడుతుండగా కరెంట్ షాక్ గురయ్యాడు. స్థానికులు గుర్తించి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి మృతి అచ్చంపేట: మండలంలోని హాజీపూర్ వ్యక్తి ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు.. వంగూరు మండలం ఉమాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య(49)గురువారం వివాహా నిమిత్తం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇందిరా తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి ఎర్రవల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవినాయక్ కథనం మేరకు.. ఇటిక్యాల మండల పరిధిలోని ఉదండాపురానికి చెందిన పింజరి నబీసాబ్(43) బైక్పై స్వగ్రామం నుంచి శుక్రవారం కొండపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై విజయ ఆయిల్ మిల్లు సమీపంలో రాంగ్ రూట్లో వెళ్తుండగా పెబ్బేరు నుంచి ఎర్రవల్లి వెళ్తున్న గుర్తు తెలియని వాహనం తన బైక్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పింజరి పీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి వనపర్తి రూరల్: పట్టణ శివారులో జిల్లా కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మెట్టుపల్లి శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో పోలీసులు దాడులు చేసి పేకాట ఆడుతున్న 8మంది అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
అర్హులకే సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అర్హులైన మత్స్యకారులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా సంఘం సభ్యులు చురుగ్గా పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడి (పర్సన్ ఇన్చార్జ్)గా గోనెల శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులపై ఆధారపడిన మత్స్యకారుల ఆదాయ వృద్ధి, మార్కెట్ విస్తరణ, ఉపాధి సృష్టిలో సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ విజయ్కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, నాయకులు కృష్ణయ్య, టంకర కృష్ణయ్యయాదవ్, మహేందర్, యాదయ్య, శరత్, ప్రవీణ్కుమార్, రామకృష్ణ, స్వరూప, రంజిత్కుమార్, లింగంనాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
పాలమూరు: దేశ సమైక్యత కోసం మొక్కవోని దీక్షతో పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ సమైక్యత దినోత్సవం) వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకితో కలిసి స్టేడియంలో రన్ఫర్ యూనిటీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ సాధనే మనందరి లక్ష్యమని, అప్పుడే పటేల్ ఆశయాలు సాధించినట్లు అవుతుందన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏక్తా దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. పటేల్ కృషి ఫలితంగానే దేశంలో సమైక్యంగా ఉందని, దేశ స్వాతంత్య్రం, సమగ్రత, సమైక్యత కోసం కృషిచేసిన మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. స్టేడియం నుంచి ప్రారంభమైన రన్ ఫర్ యూనిటీ 2కే రన్ అంబేడ్కర్ సర్కిల్, అశోక్ టాకీస్, పాతబస్టాండ్, క్లాక్టవర్ వరకు సాగింది. కార్యక్రమంలో డప్పు కళాకారుల ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, యూత్ కోఆర్డినేటర్ కోటా నాయక్, యూనివర్సిటీ విద్యార్థులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● సర్ధాల్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో పరేడ్ మైదానం దగ్గర ఏర్పాటు చేసిన రన్ఫర్ యూనిటీ 2కే రన్ కార్యక్రమాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. 2కే రన్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సీనియర్ పోలీస్ అధికారులు, మహిళా కానిస్టేబుళ్లకు ఎస్పీ డి.జానకి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్చర్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అడుగులు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకోసం అవసరమైన వివరాలను అధికారులు వచ్చేనెల 7లోగా అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జడ్చర్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై డీటీసీపీ సంయుక్త సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్వినితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 ఏళ్ల వరకు భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు. డిజిటల్ మ్యాపింగ్లో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి భూ వినియోగ మ్యాప్ రూపొందించవచ్చని, నూతన డేటాను జీఐఎస్ ఆధారిత ప్లాన్లను సమీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి ప్రతిబింబించేలా అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. 2051 సంవత్సరం నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇళ్లు, తాగునీరు, రహదారులు, ఇతర సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, ఉద్యాన వనాలు, పచ్చదనం అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జడ్చర్ల పట్టణ పరిధిలో డ్రోన్, సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేశామని, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూ పొందిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయి సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యకళాపాల సమయంలో అవసరమైన మద్దతు అందించాలని కోరా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రత్నం, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు ఫిర్యాదు చేశాం..
బీఏఎస్ స్కీంలో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలకు రానివ్వకపోతే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి సమస్యను కలెక్టర్ వివరించాం. ఆమె ఆదేశాల మేరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదని కారణంతో తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, షూ, హాస్టల్ తదితర అవసరాల కోసం డబ్బులు వసూలు చేశారు. వాటిపై జిల్లా అధికారులు కమిటీ వేసి వాటిని పేద విద్యార్థులకు తిరిగి ఇప్పించాలి. – కమలాకర్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ పుస్తకాలు ఇవ్వలేదు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో బీఏఎస్ స్కీంలో మా పాప చదువుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కచ్చితంగా పుస్తకాలకు డబ్బులు కడితేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సొంతంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి డబ్బులు వెనక్కి ఇప్పించాలి. – రమేష్, విద్యార్థి తండ్రి మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం.. రెండు వారాల క్రితం బీఏఎస్ స్కీంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. తప్పిస్తే మా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. తల్లిదండ్రులు సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. – సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
బెస్ట్ అన్ అవైలబుల్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది. అవగాహన లేకపోవడంతో.. బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు, హాస్టల్స్కు డబ్బులు వసూలు అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు -
జూరాలకు స్వల్పంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇన్ఫ్లో 20 వేలకు తగ్గింది. విద్యుదుత్పత్తి నిమిత్తం 30,468 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 24 క్యూసెక్కులు, కుడి కాల్వకు 260 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 30,752 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.234 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 8 యూనిట్లలో.. జూరాల దిగువ, ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. పూర్తిస్థాయికి చేరువలో.. దోమలపెంట: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగుల వద్ద 215.8070 టీఎంసీల సామర్థ్యం కాగా గురువారం జలాశయంలో 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,468, సుంకేసుల నుంచి 22,230, హంద్రీ నుంచి 1,125 మొత్తం 53,823 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,937 మొత్తం 62,252 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1,984 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.250 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 8.545 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. . -
ఇదేం పద్ధతి గురూ..!
● పాఠశాలల్లో పెరుగుతున్న కీచక ఉపాధ్యాయులు ● తరుచుగా వెలుగులోకి విద్యార్థినులపై వేధింపులఘటనలు ● ఇటీవల వరుసగా టీచర్లపైోపోక్సో కేసులు నమోదు ● తాజాగా షాసాబ్గుట్ట పాఠశాలలో లైంగిక వేధింపులు ● ఆందోళన చెందుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు మహబూబ్నగర్ క్రైం: ‘ఓ ఉపాధ్యాయుడి కీచక చేష్టలు ఆ వృత్తికే మచ్చ తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తెలుగు టీచర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంని పిల్లలమర్రి రోడ్డులోని షాసాబ్గుట్ట ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పెరుమాళ్ల కృష్ణస్వామి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటాడు. అయితే కొన్నిరోజుల నుంచి 8, 10వ తరగతి విద్యార్థినులను అసభ్యకరంగా తాకడం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని చేష్టలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇటీవల 8వ తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించగా.. తండ్రి ఫిర్యాదుతో ఈ నెల 28న రూరల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇదే ఉపాధ్యాయుడు గతేడాది పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు ఉపాధ్యాయుడు దాదాపు నాలుగు నెలలపాటు వ్యక్తిగత సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మళ్లీ విధుల్లో చేరి ఒక అమ్మాయిని టార్గెట్ చేసి పదేపదే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. పోలీసులను ఆశ్రయించారు. మొదట షీటీం, భరోసా పోలీసులు దీనిపై విచారణ చేయగా.. లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారణ కావడంతో రూరల్ పోలీసులకు విషయం చెప్పగా.. కేసు నమోదు చేశారు. వరుసగా నాలుగో ఘటన జిల్లాలో ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ధర్మాపూర్, వీరన్నపేట, రాజాపూర్ పాఠశాలలు కాగా.. ప్రస్తుతం షాసాబ్గుట్ట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ధర్మాపూర్, వీరన్నపేట ఘటనలలో ఉపాధ్యాయులపై కేసులు నమోదు కాగా.. రాజాపూర్ ఘటనలో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేసినట్లు సమాచారం. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో సదరు ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్ చేశారు. వీటిపై దృష్టిసారిస్తేనే.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఈ చట్టం కింద శిక్షలు కఠినంగా ఉంటాయనే విషయం తెలియాలి. వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. బాలల హెల్ప్లైన్ నంబర్–1098తోపాటు షీటీం నెంబర్, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పాఠశాలల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. విధుల నుంచి తొలగించాం.. షాసాబ్గుట్ట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం రావడంతో పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి.. విధుల నుంచి తొలగించాం. గతేడాది ఇతనికి తెలుగు ఉపాధ్యాయుడిగా అప్గ్రేడేషన్ రావడంతో బదిలీపై ఈ పాఠశాలకు వచ్చాడు. ప్రస్తుతం ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. – ప్రవీణ్కుమార్, డీఈఓ -
నవ వధువు మృతదేహంతో ధర్నా
● ప్రేమ పేరుతో మోసం చేసిన వాడిని శిక్షించాలని డిమాండ్ ● బీఆర్ఎస్, బీజేపీ,పలు సంఘాల మద్దతు కోస్గి: ప్రేమించిన వాడు మోసం చేశాడన్న మనస్థాపంతో, వేరే పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న నవ వధువు మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం రాత్రి పట్టణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. స్థానిక శివాజీ చౌరస్తాలో మహబూబ్నగర్– తాండూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యుల రోదనలతో ధర్నా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ ఆందోళనకారులతో మాట్లాడి కేసు వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని నచ్చజెప్పినా బాధిత కుటుంబ సభ్యులు వినిపించుకోలేదు. ఎస్పీ, కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నారాయణపేట డీఎస్పీ లింగయ్య సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో పలు పార్టీలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నాగర్కర్నూల్ క్రైం: మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో కల్వర్టు వద్ద వరదలో గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్(41) కూలీ పనులు చేసుకుంటూ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత పనుల మీద బుధవారం సాయంత్రం ట్రాక్టర్పై నాగనూలుకి వెళ్లి మరో వ్యక్తితో కలిసి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో కల్వర్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరదను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నీటిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాత్రి కావడంతో చర్యలు నిలిపివేశారు. గురువారం ఉదయం గాలించగా గల్లంతైన కరుణాకర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుంతలో పడి బాలుడు మృతి మిడ్జిల్: గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన గురువారం సాయంత్రం మండలంలోని బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు రిత్విక్ (3) గురువారం ఇంటి ఎదుట ఆడుకుంటూ సమీపంలో ఇటీవల విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతలో పడిపోయాడు. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఆ గుంతతో నీరు నిలిచింది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు బయటకు తీసి వెంటనే జడ్చర్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు మహమ్మదాబాద్: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాలు.. రోషన్ అనే వ్యక్తి ముంబై నుంచి కర్నూలుకు కొత్త ట్రాలీ బొలెరో వాహనాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇదే సమయంలో మహబూబ్నగర్ నుంచి కారులో విష్ణు, మల్లేష్, శేఖర్ గండేడ్ వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో నంచర్ల గేటు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించగా అంబులెన్స్ డ్రైవర్ అక్బర్, ఈఎంటీ మహబూబ్పాష ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నవాబుపేట: మండలంలోని కాకర్లపహడ్ గ్రామానికి చెందిన ముర్గని రామచంద్రయ్య(50) పొలానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఈ నెల 25న మధ్యాహ్న సమయంలో రామచంద్రయ్య పొలానికి వెళ్తుండగా జిల్లా కేంద్రం నుంచి నవాబుపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. గాయపడిన రామచంద్రయ్యను గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రామచంద్రయ్య భార్య ముర్గని మాసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. భార్య హత్య కేసులో యావజ్జీవ శిక్ష బిజినేపల్లి: మండల కేంద్రానికి చెందిన జహీదాబేగం హత్య కేసులో నిందితుడైన భర్త అబ్దుల్ నబీకి నాగర్కర్నూల్ జిల్లా జడ్జి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. పూర్తి వివరాలు.. బిజినేపల్లికి చెందిన జహీదాబేగానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అలూరుకు చెందిన అబ్దుల్నబీతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. 2022లో అబ్దుల్ నబీ భార్య జహీదాబేగాన్ని కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ క్రమంలో పోలీసులు చిన్నునాయక్, పీసీ రమేష్, అడిషినల్ పీపీ హైమద్అలీ సాక్షులను కోర్టులో హాజరుపర్చగా, వాదనల అనంతరం నిందితుడికి జడ్జి శిక్ష విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
లారీ వెనక టైర్ కింద పడి వ్యక్తి దుర్మరణం
ధరూరు: లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అల్వాలపాడు శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కేటీదొడ్డి మండలంలోని మైలగడ్డ గ్రామానికి చెందిన చింతలన్న (40) తన ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి 9 గంటల సమయంలో అల్వాలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో కర్ణాటక పాసింగ్తో ఉన్న ఓ లారీ రాయిచూరు వైపు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు లారీ వెనక టైర్ కిందపడి చింతలన్న అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఆత్మకూర్: అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ పట్టణంలోని సంజీవ్నగర్ కాలనీలో ఉంటున్న చిట్టెమ్మ(45) గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది, బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్థానిక పరమేశ్వరస్వామి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా చెరువులో మృతదేహం గుర్తించారు. మృతురాలికి కూతురు, కుమారుడు, భర్త ఉన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చిన్నచింతకంట: చట్టాలు, హక్కులు, ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. కురుమూర్తి జాతరలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రదర్శన స్టాల్ను న్యాయమూర్తి ప్రారంభించారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ప్రకారం అమలవుతున్న పథకాలను వివరించారు. ఈ స్టాల్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయ అర్హత వివరాలు, లోక్ అదాలత్ సమాచారం, న్యాయ చట్టాల పుస్తకాలను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఎస్ఐలు ఓబుల్రెడ్డి, శివశంకర్ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
మరోసారి కనిపించిన చిరుత
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల సమీపంలో ఉన్న దేవరగుట్టపై బుధవారం మరోసారి చిరుత కనిపించింది. ఇక్కడ కనిపించింది చిరుతనా.. లేక పులినా అన్న ఆందోళన గ్రామస్తుల్లో మొదలైంది. దీంతో గురువారం అటవీశాఖ అధికారులు పరిశీలించి చిరుతేనని నిర్ధారించారు. గతంలో కనిపించిన పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు వివరించారు. రైతులు, గ్రామస్తులు దేవరగుట్ట పరిసర ప్రాంతాల్లో తిరగొద్దని సూచించారు. 3న ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 3వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–17 బాల, బాలికల రగ్బీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్కార్డు జిరాక్స్తో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. 4న కరాటే ఎంపికలు నవంబర్ 4వ తేదీన డీఎస్ఏ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాల, బాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి తెలిపారు. ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని ఆమె కోరారు. బాలికపై అత్యాచారం ● గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి.. నవాబుపేట: బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటుంది. కాగా బాలికకు వరుసకు బావ అయ్యే వ్యక్తి బాలికను లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే వ్యక్తి బాలికతో ఉండగా కుటుంబ సభ్యులు గమనించి గొడవకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సదరు వ్యక్తి తనపై దాడి చేస్తున్నారని 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవను అడ్డుకున్నారు. ఇంతలోనే బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ విక్రమ్ చెప్పారు. -
గూడ్స్ రైలు ఢీకొట్టి 18 గొర్రెలు మృత్యువాత
మక్తల్: గూడ్స్ రైలు ఢీకొట్టడంతో గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని దాసర్దొడ్డి శివారుల్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుర్లపల్లికి చెందిన మొగులప్ప, వెంటకప్ప కు చెందిన గొర్రెలు మేత మేస్తూ రైలు పట్టాల సమీపంలోకి వెళ్లాయి. అదే సమయంలో గూడ్స్ రైలు రావడంతో పట్టాలపై ఉన్న గొర్రెలను ఢీకొట్టగా.. 18 అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్నింటిని కాపరులు రక్షించారు. దీంతో కాపారులు మాట్లాడుతూ గొర్రెలు మృతి చెందడంతో ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవానలి వేడుకున్నారు. -
కృష్ణానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్ కథనం మేరకు.. వనపర్తి జిల్లాలోని కాశీంనగర్కు చెందిన వెంకటేష్ తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి మధ్యాహ్నం బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు పంపించాడు. అనంతరం బైక్, మొబైల్ను బ్రిడ్జిపై వదిలేసి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు ఇటిక్యాల పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది కలిపి 26 మంది రెండు స్పీడ్ బోట్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపడతామని ఎస్ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆత్యహత్యకు పాల్పడిన వ్యక్తి గతంలో భార్యను హతమార్చి జైలుకు పోయినట్లు సమాచారం. ఆ ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోగా.. ఇప్పుడు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్రెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం ఐదు నెలలే మిగిలిందని, బకాయిలతో కలుపుకొని మొత్తం రూ.49 కోట్ల ఆస్తిపన్నుకు రూ.12.50 కోట్లే వసూలు కావడమేమిటని ప్రశ్నించారు. ఇందులో రెసిడెన్షియల్ కింద 15 శాతం, కమర్షియల్ కింద 40 శాతమే వచ్చిందన్నారు. గడువులోగా కనీసం రూ.17 కోట్లు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే గ్రాంట్కు అర్హత దక్కుతుందన్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లందరూ ప్రతిరోజూ తమకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అంతకుముందు తన చాంబర్లో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ ఆయన సమీక్షించారు. ఇదిలా ఉండగా ఆస్తిపన్ను తక్కువగా వసూలు కావడంతో ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్యలకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్ఐలు అహ్మద్షరీఫ్, రమేష్, టి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు కన్నీరే దిక్కు!
మిడ్జిల్కు చెందిన బీర్ల ఆంజనేయులు తనకు ఉన్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షానికి పంట చేతికి వచ్చే దశలో నాలుగు ఎకరాలు పూర్తిగా నేలమట్టమైంది. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లింది. ‘పంట నేలకు వాలడంతో వడ్లు మొలకెత్తుతున్నాయని, నష్టం ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.’అని సదరు రైతు వేడుకుంటున్నాడు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మోంథా తుపాను రైతులను నట్టేట ముంచింది. సుమారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి.. ఏరే దశలో ఉన్న పత్తికి భారీ నష్టం వాటిల్లింది. వీటితో పాటు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తగా పంట చేలల్లో ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అధికం.. ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంటకు చెందిన ఇతడి పేరు భాస్కర్రెడ్డి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. దొరికిన చోటల్లా అప్పు చేసి ఐదు ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. నాలుగు నెలలుగా ఇతని కుటుంబం మొత్తం కష్టపడింది. వారంలో రోజుల్లో పంట కోతలు ప్రారంభించాలనుకున్నాడు. అంతలోనే రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి మూడు ఎకరాల పంట పూర్తిగా నీటి మునిగింది. మొక్కపైనే ధాన్యం మొలక వచ్చింది. కూలీ ఖర్చులు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయి డబ్బులు కూడా వచ్చేలా లేవు. కన్నీళ్లు తప్పా.. ఏమీ మిగలలేదు. పరిహారం ఇవ్వాలని వేడుకోలు.. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టం వాటిల్లుతూ వస్తోంది. గతేడాది వానాకాలం సీజన్తో దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత కాత, పూత దశలో దంచికొట్టిన వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి సైతం అధిక వర్షాలు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వరి, పత్తి రైతులకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 36,970ఎకరాల్లో పంట నష్టం కోత దశలో వరద నీటిలో నేలవాలిన వరి ఏరే దశలో చేన్లలోనే తడిసి ముద్దయిన పత్తి నాగర్కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం ఆ తర్వాత వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో.. నష్ట పరిహారం ఇవ్వాలని అన్నదాతల వేడుకోలు -
ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సాక్షిలో ప్రచురితమైన గురువారం ప్రచురితమైన ‘అడ్డగోలు డిప్యుటేషన్లు’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయుల డిప్యుటేషన్లకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వగా.. వారు గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. వీరి డిప్యుటేషన్లు నిబంధనల ప్రకారం లేదని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన డీఈఓ ప్రవీణ్కుమార్ ఆ ఐదుగురి డిప్యుటేషన్లను నిలిపివేసి.. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. -
శాస్త్రోక్తంగా కురుమూర్తిస్వామి చక్రస్నానం
కురుమూర్తిస్వామికి ఆలయ పుష్కరిణిలో బుధవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా పూజారులు చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి నిర్వహించే సేవా కార్యక్రమాలు మంగళవారంతో ముగిశా యి. ఈక్రమంలో చివరిరోజైన మంగళవారం అర్ధరాత్రి స్వామివారికి గరుడ వాహనసేవ నిర్వ హించారు. ఈ సేవ అర్ధరాత్రి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమై పుష్కరిణి వరకు కొనసాగింది. బుధవారం తెల్లవారుజామున అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రోచ్ఛరణల నడుమ పూజారులు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. పలువురు విద్యార్థినులు కూచిపూడి నృత్యం.. వేంకటేశ్వరస్వామి వేషధారణలో భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయ సిబ్బంది ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు దాసంగాలు సమర్పించి.. చల్లంగా చూడాలని వేడుకున్నారు. కొండపైన అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వా మి, ఉద్దాల మండపం, చెన్నకేశవ స్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, కమలాకర్, భాస్కరాచారి పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం బయటపడుతుందనే..
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు నాగర్కర్నూల్ క్రైం: కొల్లాపూర్ మండలం మంచాలకట్ట శివారులో ఉన్న సాకలి రాముని గుట్టవద్ద ఈ నెల 8న జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయపడుతుందనే గొంతు నులిమి, ఒంటిపై పెట్రోలు పోసి హత్య చేసినట్లు గుర్తించారు. బుధ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూర్తి వివరాలు వెల్లడించారు. కొల్లాపూర్లోని ఇందిరానగర్కాలనీకి చెందిన కోమరి స్వర్ణలత (32)కు 15 ఏళ్ల కిందట వివాహం జరగగా ఏడేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండేది. ఇదే క్రమంలో అదే కాలనీలో ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి 23 ఏళ్ల బోగిమొళ్ల విజయ్కుమార్తో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల తర్వాత విజయ్కుమార్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్వర్ణలతకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను విజయ్కుమార్ తల్లిదండ్రులకు చూపిస్తానంటూ రెండు, మూడుసార్లు భయపెట్టింది. దీంతో ఎప్పటికై నా ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని విజయ్కుమార్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 8న స్వర్ణలతకు ఫోన్చేసి మాట్లాడేందుకు పెంట్లవెల్లికి రావాలని చెప్పడంతో బస్సులో వచ్చింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై మంచాలకట్ట వద్ద ఉన్న పుష్కరఘాట్కు చేరుకొని అక్కడ గొడవపడ్డారు. అనంతరం గ్రామ సమీపంలోని సాకలిరాముని గుట్టకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మంచాలకట్టకు వెళ్లి కిరాణ దుకాణంలో అగ్గిపెట్ట, రెండులీటర్ల పెట్రోల్తో పాటు సిగరేట్ తీసుకొచ్చి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చి గుర్తుపట్టలేని విధంగా అయ్యాక అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ నెల 13న మహిళ మృతదేహాన్ని గుర్తించిన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటోతో గుర్తించిన స్వర్ణలత తండ్రి ఈ నెల 27న పోలీసులను ఆశ్రయించారు. హత్య జరిగిన ప్రాంతంలో సెల్ఫోన్ సిగ్నల్స్తో పాటు సీసీ కెమెరాల రికార్డుల ఆధారంగా విజయ్కుమార్ హత్య చేశాడని నిర్ధారించుకొని కొల్లాపూర్లో బుధవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడని వివరించారు. హత్య కేసు త్వరగా ఛేదించిన డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, సీఐ మహేష్తో పాటు ఎస్సైలు రామన్గౌడ్, రిషికేష్ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
డ్రమ్ములో పడి బాలుడి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు నీళ్ల డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు.. గద్వాల మండలంలోని కుర్వపల్లికి చెందిన కుర్వ నారాయణ, పావని దంపతుల కుమారుడు వీరేష్ (3) బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ.. సమీపంలోని డ్రమ్ములో నీళ్లు తీసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు బయటకు తీశారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. బావిలో పడి వ్యక్తి మృతి ● ఆలస్యంగా వెలుగులోకి ఉప్పునుంతల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పాడుబడిన మాదిగ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలం లింగోటం తండాకు చెందిన కాట్రావత్ శంకర్ (38) చెత్త ఏరుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం బావి అంచున చెత్త ఏరుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. శంకర్ అదృశ్యంపై కు టుంబ సభ్యులు అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం బావిలో తేలిన శవాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా శంకర్గా గుర్తించారు. పో స్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనుమానాస్పదంగా వివాహిత.. ఊట్కూర్: మండలంలోని పులిమామిడి గ్రా మంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు.. మండలంలోని మోగ్దుంపూర్ గ్రామానికి చెందిన రాఘవ కూతురు అన్నపూర్ణ (28)ను పులిమామిడి గ్రామానికి చెందిన బుడ్డోళ్ళ రాముతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. అన్నపూర్ణ బుధవారం తెల్లవారు జామున అనుమానాస్పదంగా ఇంట్లో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందినట్లు ఆరోపించారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై ఎస్ఐ రమేష్ను వివరణ కోరగా తనకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. యువకుడి బలవన్మరణం కొత్తకోట రూరల్: ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడి బ లవన్మరణానికి పాల్ప డిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న జనంపల్లి అశోక్(35) పె యింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు, ఆర్థి క ఇబ్బందుల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి భార్య శాంతమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారు డు ఉన్నారు. ఆత్మహత్యపై ఎస్ఐ ఆనంద్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు బుధవారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన ముష్టి తిర్మలయ్య (56) ఈ నెల 14న పస్పుల స్టేజీ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో తన బైక్కు పెట్రోల్ పోయించుకొని రోడ్డు ఎక్కుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తిర్మలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్లు సీసాలో ఎలుక కోస్గి: ఓ మహిళా తాగేందు కు తీసుకున్న కల్లు సీసాలో చనిపోయిన ఎలుక వచ్చింది. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాగుసాన్పల్లి గ్రా మానికి చెందిన బాలమణి బుధవారం రాత్రి కల్లు దుకాణానికి వెళ్లింది. కల్లు సీసాను కొను గోలు చేసి అక్కడే తాగుతుండగా.. సీసాలో నుంచి కల్లు బయటకు రావడం ఆ గిపోయింది. విద్యుత్ వెలుతురు వద్దకు తీసుకొచ్చి సీసాను గమనించగా చనిపోయిన ఎలుక కనబడింది.దీంతో అక్కడే కల్లు తాగు తున్న మ రికొందరు వెంటనే అప్రమత్తమై కల్లు పారబోశారు. ఈ విషయమై సంబంధిత కల్లు దుకాణాదారుడు వెంకటయ్యను అడిగేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
జోగుళాంబ రైల్వేహాల్ట్ త్వరలో పునఃప్రారంభం
● దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం రామారావు ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వేహాల్ట్ను నవంబర్ మొదటి, రెండో వారంలో పునఃప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం రామారావు తెలిపారు. జోగుళాంబ రైల్వేహాల్ట్లో ప్రయాణికులకు ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ద్వారా న్ని, పెయింటింగ్ చిత్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లైటింగ్, టయిల్స్, బుకింగ్, విశ్రాంతి గదులు, హైలెవవల్ ఫ్లాట్ఫాం, విద్యుదీకరణ పనులపై ఆరా తీశారు. ప్రయాణికులు కూర్చోవడానికి టేబుళ్లు, నీడకోసం షెల్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వేస్టేషన్లో కొన్ని రైళ్లను కూడా నిలిపేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతరకు తుపాను ఎఫెక్ట్
వరుణుడి దెబ్బతో టెంటు కింద నైవేద్యం వండుతున్న మహిళలు జాతర ప్రాంగణంలో వర్షంలో తడుస్తూ వెళ్తున్న భక్తులు చిన్నచింతకుంట: మొంథా తుఫాన్ ప్రభావం కురుమూర్తి జాతరపై పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తుండడంతో జాతర ప్రాంగణంలో వీధులన్ని బురదమయంగా మారాయి. దుకాణ సముదాయాల వద్ద, పలు చోట్ల నీరు నిలిచి గుంటలను తలపించాయి. దీంతో భక్తులు బస చేసేందుకు, నైవేద్యాలు సిద్ధం చేసేందుకు, చివరికి నడిచేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. కొందరు టెంట్లు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు వ్యాపారస్తులు ఏర్పాటుచేసుకున్న దుకాణాల కింద ఉండిపోయారు. చాలామటుకు భక్తులు స్వామివారిని దర్శించుకొని వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో భక్తులు లేక జాతరలోని వీధులు, దుకాణాలు వెలవెలబోయాయి. రోడ్లు బురదమయం వర్షం కారణంగా జాతర మైదానంలో పలు చోట్ల నీరు నిలిచి రోడ్లని బురదమయంగా మారాయి. జాతర మైదానంలోని చౌరస్తా సమీపంలో దుకాణాల సముదాయం ఎదుట, కోనేరుకు వెళ్లేదారిలో పాత సత్రం, తలనీలాలు సమర్పించే ప్రదేశంలో వర్షం నీరు నిలిచింది. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న కమాన్ నుంచి రాజగోపురం వరకు, గాజుల దుకాణాలు, స్వీట్ల దుకాణాలు, రంగుల రాట్నం వెళ్లే రహదారులతోపాటు జాతర మైదానంలోని బైపాస్రోడ్లు మొత్తం బుదమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. పారిశుద్ధ్య లోపం.. జాతరలో పారిశుద్ధ్య పనులపై అధికారులు చేతులెత్తేశారు. భారీ వర్షం కురవడంతో పరిసరాలన్నీ బురద, భక్తులు వాడిపడేసిన చెత్తా చెదారంతో నిండాయి. అన్నదాన సత్రం, మంచినీటి వాటర్ ట్యాంక్ సమీపంలో, దాసంగాల షెడ్లు, విడిది గదులు, కోనేరు సమీపాన ఉన్న పాతసత్రం, కళ్యాణ పండపంలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడి చెత్త అక్కడే ఉండి పోయింది. వాటి పరిసరాలలో పందులు సంచరిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురవడంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించేందుకు, గండదీపాలు మోసేందుకు, తలనీలాలు సమర్పించేందుకు భక్తులు నానా తంటాలు పడ్డారు. ఆలయం వద్ద సరిపోను దాసంగాల షెడ్లు లేకపోవడంతో భక్తులు టెంట్లు, చెట్ల కింద వర్షంలోనే నైవేద్యం తయారు చేశారు. పలువురు వర్షంలోనే తడుస్తూ గండదీపాలు మోశారు. మరోవైపు భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకొని వెనుతిరిగిపోతుండడంతో దుకాణాలన్ని వెలవెలబోయాయి. ఎలాంటి వ్యాపారాలు కొనసాగకపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందారు. కంట్రోల్ రూం.. ఒక్కరోజుకే పరిమితం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఒక్కోజుకే పరిమితమైంది. జాతరలో నెలకొన్న సమస్యలు, భక్తుల ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారుల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉద్దాల ఉత్సవం నేపథ్యంలో దీనిని ప్రారంభించగా.. ఆ మరుసటి రోజు బుధవారం మూసివేశారు. భారీ వర్షం నేపథ్యంలో ఇబ్బందులు పడిన భక్తులకు ఈ కంట్రోల్ రూం విడిదిగా మారింది. కురుమూర్తి స్వామికి పుష్కరిణిలో చక్రస్నానం చేయిస్తున్న పూజారులు కురుమూర్తి జాతర మైదానం, పరిసరాలు బురదమయం భక్తులకు తప్పని ఇబ్బందులు వెలవెలబోయిన దుకాణాలు -
పోక్సో కేసులో యువకుడి రిమాండ్
గద్వాల క్రైం: పోక్సో కేసులో యువకుడిని రిమాండ్కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. గట్టు మండలానికి చెందిన ఓ యువకుడు అదే మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి తీసుకెళ్లాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువకుడిని విచారించగా నేరం అంగీకరించడంతో బుధవారం గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించామన్నారు. అయితే మైనార్ బాలికకు కొన్ని రోజుల క్రితం బంధువుల అబ్బాయితో వివాహాం జరిపించారు. ఇష్టం లేని వివాహాం చేయడంతో యువకుడితో వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. అయితే యువకుడిపై గతంలో గట్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు సీఐ పేర్కొన్నారు. భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య శాంతినగర్: ఎన్ని మందులు వాడినా ఛాతి నొప్పి తగ్గకపోవడంతో.. భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని పైపాడు శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. మానవపాడుకు చెందిన నంద్యాల జితేందర్ నాయుడు (27) గత కొంతకాలంగా ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చూయించారు. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గలేదు. ఛాతిలో నొప్పి భరించలేక మంగళవారం సాయంత్రం పైపాడు శివారులోని ప్రైవేట్ వెంచర్ వద్దకు పురుగుమందు డబ్బాతో చేరుకున్నాడు. పురుగు మందు తాగుతూ తన భార్య భారతికి వీడియో కాల్ చేసి చనిపోతున్నా.. అంటూ విలపించాడు. ఎక్కడ వున్నావని భార్య అడగ్గా లొకేషన్ పెట్టాడు. దీంతో హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు.. అతడిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించారు. పరిస్థితి విషమంగా వుండటంతో కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
మహిళా ఉద్యోగి బలవన్మరణం
అప్పు చెల్లించాలని వేధింపులు.. ● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి వనపర్తి: ఇచ్చిన అప్పు చెల్లించాలని వేధించడంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. పట్టణ రెండో ఎస్ఐ శశిధర్ కథనం మేరకు.. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లునాయుడు, అతడి భార్య ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ (37) తమ ఇద్దరు కుమారులతో కలిసి ఎన్టీఆర్కాలనీలో ఉన్న పెద్దముక్కల వసంతమ్మ, రామచంద్రయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిటెంట్గా విధులు నిర్వర్తించేది. వెంకటేశ్వర్లునాయుడు కుటుంబం తమ అవసరాల నిమితం ఇంటి యజమాని వద్ద రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలంగా అసలు, వడ్డీ చెల్లించాలంటూ వేధిస్తుండటంతో భరించలేక మనస్తాపానికి గురై నీలిమ మంగళవారం రాత్రి ఇంట్లోని బెడ్రూంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన భార్య మృతికి కారణమైన ఇంటి యజమానులపై భర్త వెంకటేశ్వర్లునాయుడు బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన ప్రధాన అనుచరుడు వెంకటేశ్వర్లునాయుడును పరామర్శించారు. అధిక వడ్డీకి డబ్బులిస్తూ కుటుంబ విచ్ఛినానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. -
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం
వనపర్తి విద్యావిభాగం: అందరికీ సమానంగా ఉచిత విద్యకోసం ఉద్యమించాల్సిన అవసరముందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న పీడీఎస్యూ 4వ రాష్ట్ర మహాసభలు బుధవారం రెండో రోజు కొనసాగగా.. రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్రెడ్డి పీడీఎస్యూ జెండాను ఆవిష్కరించి విద్యార్థి ప్రతినిధుల మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ప్రారంభమైన విద్యా గోష్టిలో మొదటి అంశమైన శ్రీనూతన జాతీయ విద్యావిధానం – శాసీ్త్రయ విద్య మధ్య వైరుద్యాలుశ్రీ అనే అంశంపై ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడారు. విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణతో సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా, అందరికీ సమాన ఉచిత విద్య కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార్ శక్తులు కలిసి నూతన జాతీయ విద్యా విధానాన్ని మూడు భాగాలుగా విభజించారని.. అందులో భాగంగా విద్యను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేయడం, విద్యలో మతపరమైన అంశాలను చేర్చడం వంటి వాటికి కుట్రలు చేస్తున్నారన్నారు. 1964లో ప్రొ.కొఠారి కమిషన్ సూచించిన కామన్ విద్యా విధానం కోసం, శాసీ్త్రయ విద్యా విధానం కోసం పీడీఎస్యూ విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పీడీఎస్యూ చరిత్ర, 50ఏళ్లలో నిర్వహించిన పోరాటాలు, విద్యార్థుల త్యాగాలను రాష్ట్ర మాజీ కార్యదర్శి, కవి జనజ్వాల వివరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ నేత విజయ్ కన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ రఫీ, ఎస్.కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సాంబ, కార్యదర్శి బి.భాస్కర్, ఉపాధ్యక్షుడు కె.పవన్ కుమార్, రాచకొండ రంజిత్, సతీశ్, జె.గణేశ్, సైదులు, అర్జున్, వంశీ రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు. -
నష్టపరిహారం అందించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కట్ట ఎక్కడికక్కడ కోతకు గురైంది. పలు చోట్ల కట్ట లీకవుతుండడంతోపాటు కట్ట కోతకు గురై వరద మా పంట పొలాలను ముంచెత్తింది. మట్టి మేటలు వేయడంతో నేను నాలుగు ఎకరాల్లో వేసిన వరి దెబ్బతింది. రిజర్వాయర్ కాంట్రాక్టర్లతో మాకు నష్టపరిహారం ఇప్పించాలి. – వెంకటేష్, కిష్టారం, జడ్చర్ల, మహబూబ్నగర్ వరి చేనును మట్టి కమ్మేసింది ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వరద నీరు మా పొలంలోకి వచ్చింది. ఎకర పొలంలో సాగు చేసిన వరి చేనుపై మట్టి దిబ్బలు పేరుకుపోయి మాకు తీవ్ర నష్టం జరిగింది. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్ట తెగిన ప్రతిసారి మా పొలాల్లోకి మట్టి కొట్టుకు వస్తుంది. పంటలు నష్టపోతున్నాం. మాకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – గడ్డల రమేష్, రైతు, కిష్టారం -
ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవాల్సి వస్తదని.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిని తరలించుకుపోయే ప్రమాదముందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జిల్లావాసిగా సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసమానతలు తొలగించే ఉద్దేశంతో అవకాశం, అధికారం, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ జాగృతి ముందుకెళ్తుందని చెప్పారు. తెలంగాణ వచ్చా క ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రులు, గురుకులాలను నడపలేని స్థితిలో ప్రభు త్వం ఉండటం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎ న్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో షాడో కేబినెట్ ఏర్పాటుచేసి.. మంత్రుల పనితీరుపై నిఘా పెడతామన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి పోలేపల్లి సెజ్పై ఉన్న ఆసక్తి.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. పీఆర్ స్టంట్ల కోసం ఆసక్తి చూపుతారని ఆరోపించారు. ఎమ్మెల్యే యెన్నం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా.. బీజేపీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. -
‘మోంథా’తో ఆగమాగం
● పొంగిన వాగులు, వంకలు ● రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం ● స్తంభించిన రాకపోకలు ● నీట మునిగిన పంట పొలాలు మహబూబ్నగర్ (వ్యవసాయం)/మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మోంథా’ తుపాను వల్ల జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంల్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో సగటున 5 సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జడ్చర్ల మండలంలో 9.06 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రామీణ రహదారులు ధ్వంసమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముందు జాగ్రత్తగా జిల్లా అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ● మూసాపేట, అడ్డాకుల మండలాల్లో పెద్దవాగులో నిర్మించిన చెక్డ్యాంలు వరద నీటితో నిండుగా ప్రవహించాయి. కాజ్వేపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొమిరెడ్డిపల్లి, గౌరిదేవిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని నిల్వ చేయగా వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కన్మనూర్లో ఓ మట్టి ఇల్లు మిద్దె కూలిపోయింది. ● మహమ్మదాబాద్ మండలంలో వేరుశనగ పంట దెబ్బతింది. చెరువులు అలుగు పారడం వల్ల పొలాలు నీటి మునిగాయి. కోతకోసిన వరి నూర్పిళ్లు కల్లాలోనే ఉండడంతో మెలకెత్తుతున్నాయి. ● జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రధానరహదారులను వరద ప్రవాహం ముంచెత్తింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గంగాపూర్–కోడ్గల్ ప్రధాన రహదారిపై, కిష్టారం చెరువు అలుగు పారడంతో రాకపోకలు స్తంభించాయి. నవాబుపేట, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. మార్కెట్లో కుప్పలుగా పోసిన మక్కలు మొలకెత్తాయి. ● మిడ్జిల్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మల్లాపూర్ దగ్గర కేఎల్ఐ కాల్వకు గండి పడడంతో దాదాపు వంద ఎకరాలలో వరి పంట దెబ్బతింది. బోయిన్పల్లి–రాంరెడ్డి పల్లి గ్రామాల మధ్యలో రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలోకి భారీగా వరద చేరింది. ఎన్హెచ్ 167పై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 625 ఎకరాల్లో వరి పంట నష్టం జిల్లాలో 625 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.జడ్చర్ల మండలంలో 135 ఎకరాలు, బాలానగర్లో 100 ఎకరాలు, అడ్డాకులలో 110, నవాబుపేటలో 62, రాజాపూర్లో 50, మూసాపేటలో 45, మిడ్జిల్లో 60, దేవరకద్రలో 64, భూత్పూర్లో 25, హన్వాడలో 4 ఎకరాల మేర వరిపంట నేలకొరిగింది. నష్టాన్ని తక్కువ చూపుతున్న వ్యవసాయశాఖ ఆగస్టు నుంచి అధిక వర్షాలు కురుస్తున్నా వ్యవసాయశాఖ నష్టాన్ని నామమాత్రంగా చూపుతుంది. ఆగస్టు నెలలో ఏకంగా 132 శాతం అధిక వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నా ఎలాంటి పంట నష్టాన్ని చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. సెప్టెంబర్లో 50 శాతం అఽధిక వర్షపాతం నమోదైంది. పంటలు చూడటానికి పచ్చగా ఉన్నా దిగుబడులు మాత్రం లేవు. -
జిల్లాకేంద్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్రకుంట, కొత్తచెరువు నుంచి వచ్చే పాటుకాల్వలు, చిక్కుడువాగు ద్వారా వరద ఉద్ధృతంగా ప్రవహించాయి. ముఖ్యంగా గణేష్నగర్ వద్ద రెండు వీధులతో పాటు రాయచూర్ రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయాయి. అటు గౌడ్స్ కాలనీ వైపు ఉండే కాజ్వే మూసుకుపోవడంతో వరద మొత్తం వల్లభ్నగర్ డ్రెయినేజీలోకి వెనక్కి మళ్లింది. అలాగే గోల్మసీదు మొదలుకుని మోనిన్వాడి ఉన్నత పాఠశాల వరకు పెద్ద కాల్వ మొత్తం వరదతో నిండి రోడ్డుపైకి వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూమోతీనగర్లోని ఆర్యూబీ వద్ద, కొత్త బస్టాండు ప్రాంగణం, మోటార్లైన్, ఎంబీసీ కాంపౌండ్, గచ్చిబౌలి, రామయ్యబౌలి, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, నాగేంద్రకాలనీ, వెంకటరమణ కాలనీ, భూత్పూర్ రోడ్డులోని శ్రీశివసాయిరాం కాలనీలలో వరద నీరు చేరింది. -
వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: భారీ వర్షాల నేపథ్యంలో పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న క్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువు ల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయ్యబౌలి ట్యాంక్బండ్, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిని బుధవారం పరిశీలించారు. నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించి సదరు అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి ప్రవాహాలు దగ్గరికి ఎవరూ వెళ్లరాదని, రోడ్లపై భారీ వరద ఉన్న సమయంలో వాహనదారులు రోడ్డు దాటాలనే ప్రయత్నాలు చేయరాదన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు వాగులు, చెరువుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలతో సమన్వయం కలిగి ఉండాలన్నారు. -
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని రాష్ట్ర మత్య్స, పాడి పశుసంవర్ధక, యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం కోయిల్సాగర్ ప్రాజెక్టులో మొదటి విడతగా 2.50 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంద శాతం సబ్సిడీ కింద మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మత్స్యశాఖ ఖదీర్ అహమ్మద్, ఏడీ రాధారోహిణితో కలిసి వదిలారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చేపల పెంపకంపై ఆధారపడిన 5 లక్షల మంది ఆర్థిక అభివృద్ధికి జీవనోపాధి కలుగనున్నట్లు చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గానికి మక్తల్తో పాటు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు పదేళ్ల పాటు చేపపిల్లల ఉత్పత్తిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తాను ముదిరాజ్ కావడం.. అలాగే మంత్రి కావడంతో మత్స్యశాఖకు అధిక నిధులు కేటాయించేలా చేసినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉన్నామని పేర్కొన్నారు. కచ్చితమైన 80ఎంఎం సైజుతో చేపపిల్లలను వదులుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మత్స్యశాఖ డీడీ ఖదీర్ అహ్మద్, ఏడీ రాధారోహిణి, ఆర్డీఓ నవీన్, మార్కెట్ చైర్మన్ కతలప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక, మున్సిపల్ చైర్మన్ నరేష్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో కురిసిన వర్షపాతంమండలాల వారీగా (సెంటీమీటర్లలో)
బాలానగర్ 6.65జడ్చర్ల 9.06భూత్పూర్ 5.78నవాబుపేట 5.38హన్వాడ 4.38మహబూబ్నగర్ అర్బన్ 4.47కౌకుంట్ల 3.21చిన్నచింతకుంట 2.43గండేడ్ 3.17 -
తోటి ఉద్యోగి వేధింపులు.. పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లా: సహచర ఉద్యోగి నుంచి వస్తున్న లైగింక వేధింపులు తట్టుకోలేక మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామానికి చెందిన బండారు రాజశ్రీకి 2016లో నారాయణపేటకు చెందిన నీలి శ్యాంసుందర్తో వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిథున, కుమారుడు ప్రీతమ్నందన్ ఉన్నారు. రాజశ్రీ మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండడంతో వారు జడ్చర్ల పట్టణంలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. జడ్చర్ల బాలాజీనగర్కు చెందిన శ్రావణ్ మిడ్జిల్ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శ్రావణ్ కొంతకాలంగా రాజశ్రీని మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని శ్రావణ్ అనేకసార్లు రాజశ్రీపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని రాజశ్రీ భర్త, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది. దీంతో వారు శ్రావణ్ను మందలించినా మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు తీవ్రం చేశాడు. దీంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని రాజశ్రీ తండ్రి బండారి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రావణ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మంగళవారం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. -
డిసెంబర్ 1 నుంచి.. నూతన మద్యం దుకాణాలు
● ఉమ్మడి జిల్లాలోని 227 షాపులకు కలిపి మొదటి విడత లైసెన్స్ ఫీజు రూ.21.05 కోట్లు చెల్లింపు ● వివాదాస్పదమైన 16వ దుకాణానికి సైతం వసూలు ● ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పేరుపైనే లైసెన్స్ జారీ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్కీడిప్లో మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న దరఖాస్తుదారుల నుంచి మొదటి విడత లైసెన్స్ ఫీజు మొత్తం 227 దుకాణాలకు సంబంధించి మంగళవారం చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క దుకాణం ఫీజు కూడా పెండింగ్లో లేకుండా బ్యాంకులలో డీడీలు తీసి ఎకై ్సజ్ అధికారులకు అందించారు. మొదటి విడత ఫీజు కింద ఉమ్మడి జిల్లా నుంచి రూ.21.05 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావడం జరిగింది. ఏ4 మద్యం దుకాణాల నిర్వాహకులు ఏడాదికి ఆరుసార్ల చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లించాలి. కాగా.. ప్రస్తుతం లైసెన్స్ పొందిన నిర్వాహకులు డిసెంబర్ 1 నుంచి దుకాణాలు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ● మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 28 మద్యం దుకాణాలు ఉండగా.. మొదటి విడత లైసెన్స్ ఫీజు రూ.2.83 కోట్లు వచ్చింది. ఇందులో జడ్చర్ల సర్కిల్ పరిధిలో 26 దుకాణాలకు గాను రూ.2.53 కోట్లు, నారాయణపేటలో 22 దుకాణాలకు రూ.1.98 కోట్లు, కోస్గిలో 14 దుకాణాలకు రూ.1.65 కోట్ల ఆదాయం సమకూరింది. చర్యలుంటాయా.. వదిలేస్తారా? మహబూబ్నగర్ జిల్లాలో గెజిట్ నం.16 దుకాణం సొంతం చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అంశం వివాదాస్పదం అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం లైసెన్స్ ఫీజు చెల్లిస్తుందా..? లేక ఉన్నతాధికారులు ఏదైనా చర్యలు తీసుకుంటారా అని భావించారు. కానీ, సాయంత్రం దుకాణం సొంతం చేసుకున్న వాళ్లే లైసెన్స్ ఫీజు చెల్లించినట్లు ఈఎస్ సుధాకర్ వెల్లడించారు. లైసెన్స్ ఫీజు చెల్లించిన నేపథ్యంలో ఆ దుకాణం లైసెన్స్దారు ప్రభుత్వ టీచర్ పేరు మీద లైసెన్స్ జారీ అవుతుంది. అయితే ఈ వ్యవహారంపై రాబోయే రోజుల్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా.. లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని వదిలేస్తారా.. అనేది వేచి చూడాల్సి ఉంది. జిల్లా చెల్లించిన లైసెన్స్ ఫీజు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 5.36 నాగర్కర్నూల్ 6.00 నారాయణపేట 3.24 వనపర్తి 3.30 గద్వాల 3.14 -
జేపీఎన్సీఈలో ప్రాంగణ ఎంపికలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ధర్మాపూర్ శివారులోని జేపీఎన్సీఈలో మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన టెలి పర్ఫామెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ ఉద్యోగాలకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఇందులో భాగంగా 182 మంది విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, లాంగ్వేజ్ అసెస్మెంట్, ఆపరేషన్స్ రౌండ్ చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, ప్లేస్మెంట్ నిర్వాహకులు రాముల్, జిలానీ, దివ్యతేజ, స్రవంతి, కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సయన్ చక్రవర్తి, టాస్క్ రీజినల్ హెడ్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐకానిక్ వంతెన నిర్మాణ స్థల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలో ఫారెస్టు పరిధిలో ఉన్న ప్రతిపాదిత సోమశిల ఐకానిక్ బ్రిడ్జి స్థలాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వు చీఫ్ ఫారెస్టు ఫీల్డు డైరెక్టర్ సునీల్ హెరేమత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సోమశిల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కొల్లాపూర్ రిజర్వు ఫారెస్టు గుండా వెళ్తున్న ఎన్హెచ్–167 రహదారి మార్గాన్ని సందర్శించారు. ఆ రహదారి మార్గంలో అటవీ సిబ్బంది ద్వారా నిర్వహించబడుతున్న చెట్ల గణనను తనిఖీ చేశారు. సిబ్బంది నిర్వహించిన చెట్లు, గణించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రిజర్వు ఫారెస్టులో రహదారి వెళ్తున్న మార్గాన్ని కచ్చితంగా గుర్తించి అక్కడ పిల్లర్ నిర్మించాలని అటవీశాఖ సిబ్బంది, జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, మండలాధికారి చంద్రశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ రామ్మోహన్, కొల్లాపూర్ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంతరాలు లేని సమాజం నిర్మిద్దాం
వనపర్తి: సమాజంలో కుల, మత, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం భావిభారత పౌరులు కృషి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది ఖాశీం పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన పీడీఎస్యూ రాష్ట్ర నాల్గవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించి ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జీరెడ్డి నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో 1974లో పుట్టిన పీడీఎస్యూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందన్నారు. మౌలిక వసతుల సాధన, విద్య ప్రైవేటీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఉద్యమాలను చేసిందని గుర్తుచేశారు. కాలానుగుణంగా వస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పీడీఎస్యూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పోరాటాలు చేస్తోందన్నారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కావొద్దని, సమాజాన్ని అధ్యయనం చేస్తూ.. సమస్యల పరిష్కారం కోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం విద్యను వ్యాపారంగా మార్చొద్దు విద్యను వ్యాపారంగా మార్చడానికి డబ్ల్యూటీఓ–గాట్స్ ఒప్పందాల అమలుకు ప్రపంచ బ్యాంకు భారత పాలకవర్గాలపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ కార్పొరేట్ యూనివర్సిటీలు తమ సంస్థలను ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు. ఇది దేశంలోనే అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగమే అన్నారు. కార్యక్రమంయోల పీడీఎస్యూ జాతీయ నాయకులు విజయ్ కన్నా, కవి జనజ్వాల, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆరెల్లి కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సరళ, ఆంధ్రప్రదేశ్ పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ రఫీ, కిరణ్కుమార్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పవన్కుమార్, రంజిత్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నాగర్కర్నూల్ క్రైం: బీసీ బాలికల వసతి గృహంలో ఫినాయిల్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.కొల్లాపూర్ మండలం మొలచింతపల్లికి చెందిన స్ఫూర్తి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వవ సైన్స్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ బీసీ బాలికల కళాశాల వసతిగృహంలోనే ఉంటుంది. మంగళవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్లోనే ఫినాయిల్ తాగి త్మహత్యాయత్నానికి పాల్పడడంతో గమనించిన తోటి విద్యార్థునులు వెంటనే హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్ఫూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషయం తెలుసుకన్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థిని నుంచి సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం. జనరల్ ఆస్పత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం -
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఫీచర్స్
నాగర్కర్నూల్ క్రైం: కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకి కంపెనీ కొత్త కొత్త మోడళ్లు, ఫీచర్స్తో వాహనాలను అందిస్తుందని శ్రీజయరామ మోటార్స్ సీఈవో నాగేంద్రబాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మారుతీ సుజుకీ షోరూంలో నూతనంగా మార్కెట్లోకి వచ్చిన విక్టోరియస్ కారును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ.. మారు తి సుజుకీ వచ్చే నూతన వాహనాలన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి ఫీచర్స్తో తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.జీఎం వేణుగోపాల్రెడ్డి, మేనేజర్ గిరిధర్గౌడ్, టీం లీడర్ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బందోబస్తు పర్యవేక్షణ పెంచాలి
● మప్టీలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలి ● ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: కురుమూర్తి జాతరలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ వ్యూ, మ్యాన్ప్యాక్ ద్వారా బందోబస్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ పరిశీలిస్తూ చిన్న వడ్డెమాన్ నుంచి ప్రారంభమైన ఉద్దాల కార్యక్రమంలో భాగంగా కురుమూర్తి వరకు బందోబస్తు పర్యవేక్షణ చేయడం జరిగింది. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, పార్కింగ్, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం పనితీరు తనిఖీ చేశారు. జాతర వాహనాలు ఎక్కడా అడ్డంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి అక్కడే పార్క్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉండాలన్నారు. లాస్ట్, ఫౌండ్ కౌంటర్, హెల్ప్డెస్క్లను ఎప్పుడూ యాక్టీవ్గా ఉంచి భక్తులకు సహాయం చేయాలన్నారు. మప్టీలో ఉన్న సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, జాతరకు వచ్చే భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా దర్శనం చేసుకోవాడానికి వీలు కల్పించే విధంగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, గిరిబాబు, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు. జాతరలో జేబుదొంగల చేతివాటం మంగళవారం జేబు దొంగాల ముఠాలు విజృంభించాయి. ఉద్దాల రద్దీ దగ్గరతోపాటు క్యూలైన్లలో, జాతరలో చేతివాటం ప్రదర్శించి భారీగా జేబు కత్తరించి నగదు అపహరించారు. లాల్కోట్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి జేబులో నుంచి రూ.10వేల నగదు అపహరించారు. అదేవిధంగా దేవరకద్రకు చెందిన లలిత, ఆత్మకూర్కు చెందిన నాగమల్లిక అనే మహిళల బ్యాగ్లను అపహరించారు. జాతర రద్దీగా ఉండడంతో ప్రత్యేకంగా వచ్చిన దొంగల ముఠాలు జేబు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొద్దిగా ఏమరపాటు ఉన్నవాళ్లను లక్ష్యంగా చేసుకుని కాజేస్తున్నారు. -
టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు
స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో భగవద్గీత కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మూడు విభాగాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు ఉంటాయని తెలిపారు. మొదటి గ్రూప్ 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు 14వ అధ్యాయం గణత్రయ విభాగ యోగం, రెండో గ్రూప్ పదోతరగతి నుంచి ఇంటర్ వరకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం, మూడో గ్రూప్ 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 8, 9 తరగతులకు, 18 ఏళ్లలోపు 18 ఏళ్లుపైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 11న నారాయణపేటలోని గీతా భారతి స్కూల్, 18న గద్వాలలోని శ్రీసరస్వతి టాలెంట్ స్కూల్, 23న వనపర్తి జిల్లా తాటిపాములలోని శ్రీరీతాంబర విద్యాలయం, 25న మహబూబ్నగర్లోని టీటీడీ కల్యాణ మండపంలో, 27న నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాములు, సురేష్ చందర్ దూత్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదిదారుల సమస్యలు తెలుసుకుని సత్వర న్యాయం జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్స్టేషన్ను డీఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన డీఐజీకి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసుస్టేషన్లలో కేసులను పెండింగ్లో పెట్టకుండా త్వరగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడటంతోపాటు నిందితులకు శిక్ష త్వరగా పడేలా చూడాలన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం ప్రతిరోజు రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా ఏర్పాటు చేసి ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి, ముగ్గురు పిల్లల అదృశ్యం
పాన్గల్: తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యమైన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ యాదగిరి తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మంగదొడ్డి రాంచందర్కు కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన జ్యోతితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు విషిత(9), భవ్య(8), కుమారుడు తరుణ్(6) ఉన్నారు. రాంచందర్ హామాలీ పని నిమిత్తం నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 27న రాంచందర్ హమాలీ పనికి వనపర్తికి వెళ్లగా పాఠశాల నుంచి ఉపాధ్యాయులు ఫోన్చేసి ముగ్గురు పిల్లలు పాఠశాలకు రాలేదని చెప్పారు. అనంతరం రాంచందర్ తన తల్లిని విచారించగా జ్యోతి ముగ్గురి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపింది. చుట్టు పక్కల విచారించగా ఎంతకూ ఆచూకీ లభించ లేదు. దీంతో భార్య, ముగ్గురు పిల్లలు అదృశ్యంపై మంగళవారం రాంచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ పేర్కొన్నారు. -
నయనానందం ఉద్దాలోత్సవం
వడ్డెమాన్ నుంచి ఊరేగింపుగా ఉద్దాలను ఆలయం వద్దకు తీసుకొస్తున్న భక్తులు చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి. దారులన్నీ కురుమూర్తి వైపే.. కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి. బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం గ్రామగ్రామాన మంగళ హారతులతో స్వాగతం జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు -
పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు నాణ్యతా ప్రమాణాలతో తెచ్చిన మొక్కజొన్న, పత్తిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ సాగించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మక్కలు ఎండబెట్టుకొని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చని రైతులకు సూచించారు. అనంతరం అప్పా యిపల్లి శివారులో కాటన్ జిన్నింగ్ మిల్లును ఆమె సందర్శించారు. పత్తి రైతులతో కలెక్టర్ మట్లాడుతూ.. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకువస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు తెచ్చిన పత్తిని తేమ శాతాన్ని ఒకటికి నాలుగుసార్లు పరిశీలించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. మోంథా తుపా న్ కారణంగా బుధ, గురువారాలలో వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తమ సరుకులను అరబెట్టుకొని తీసుకు రావాలని, లేకుంటే మద్దతు ధర లభించద ని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఏడీ బాలమణి, మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి ఉన్నారు. -
నిర్వాసితులు ఏం పాపం చేశారు?
జడ్చర్ల/భూత్పూర్/చిన్నచింతకుంట: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్లోని భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పోలేపల్లి భూములకు ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చి.. మిగతా భూములకు తక్కువ పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి నిర్వాసితులు ఏం పాపం చేశారని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని జడ్చర్ల మండలం ఉదండాపూర్, భూత్పూర్ మండలం కర్వెన రిజర్వాయర్లను పరిశీలించి నిర్వాసితులతో ప్రత్యేక సమావేశమయ్యారు. కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అంతకుముందు మీనాంబరంలోని పరుశవేదీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా కల నెరవేరిందన్నారు. చెరువులు, కుంటలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. పెద్ద మనస్సుతో ప్రాజెక్టుల కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి 2021 కటాఫ్ డేట్ పెట్టడం సరికాదన్నారు. పరిహారం ఇచ్చే నాటి తేదీని పరిగణలోకి తీసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి తాజా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారంగా పరిహారం ఇవ్వాలన్నారు. పునరావాసానికి ఎంపిక చేసిన భూమిలో గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్నాయని, అక్కడ ఇళ్లను నిర్మించుకోవడం ఇబ్బందిగా ఉంటుందని, చదునైన భూమిని కేటాయించి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట పనుల్లో నాణ్యత లోపం కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలకు సిద్ధం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్ల పరిశీలన -
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని టీడీగుట్ట నుంచి బోయపల్లి రైల్వేగేటు వరకు ట్రాక్ పక్కన ఉన్న నివాస ప్రాంతాలను పరిశీలించారు. కాగా, కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో డబుల్లైన్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు. దీని పక్క నుంచి సీసీరోడ్డుతో పాటు యూజీడీ యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు రైల్వేశాఖ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో రూ.పది కోట్లతో నిర్మించనున్న పూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దీనిని అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ, విశాలమైన హాల్స్, వివిధ పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే నగర టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు సిరాజ్ఖాద్రీ, షబ్బీర్ అహ్మద్, సాయిబాబా, సీజే బెన్హర్, అమరేందర్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
నేడే ఉద్దాల మహోత్సవం
● కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ● భారీ పోలీసు బందోబస్తు నడుమ పాదుకల ఊరేగింపు ● వేలాదిగా తరలిరానున్న భక్తజనం చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం మంగళవారం (నేడు) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకుంటారు. ఉద్దాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం పల్లమర్రి నుంచి చాటను ట్రాక్టర్పై ఊరేగింపుగా వడ్డేమాన్ గ్రామంలోని ఉద్దాల మండపానికి తీసుకొస్తారు. పాదుకలకు మండపం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం చాటలో పాదుకలను ఉంచి భారీ పోలీసు భద్రత మధ్యన అప్పంపల్లి ఊకచెట్టు వాగు నుంచి వ్యవసాయ పొలాల మీదుగా తిర్మలాపూర్కు చేరుస్తారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై కురుమూర్తి గుట్టకు తరలిస్తారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీ పడతారు. దీంతో చిన్నవడ్డేమాన్, ఊకచెట్టు వాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాలతో పాటు కురుమూర్తి స్వామి ఆలయం వరకు జనసంద్రంగా మారుతుంది. నియమ నిష్టలతో పాదుకల తయారీ.. చిన్నవడ్డేమాన్లో 60 దళిత కుటుంబాలకు చెందినవారు ఉద్దాల తయారీలో పాల్గొంటారు. కార్తీక అమావాస్య నుంచి ఏడురోజుల పాటు నియమ నిష్టలతో ఒంటిపూట భోజనం చేస్తూ.. కురుమూర్తి స్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను తయారు చేస్తారు. పాదుకలను ఆవు చర్మం, వన్నెలాకు తగురము, పచ్చపూసలు, టేన్పోగులు, తగ్గి, వైనం, రేషం, పట్టు తదితరవాటితో తయారు చేస్తారు. సప్తమి నాడు ఈ పాదుకలను ఊరేగింపుగా కురుమూర్తిగిరులకు చేరుస్తారు. 230 ప్రత్యేక బస్సులు.. కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలిరానుండగా.. అందుకు తగ్గట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర ప్రాంగణంలో ఆరోగ్య వైద్యకేంద్రం, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సీకుల దర్శనం, సర్వ దర్శనం ద్వారాలు.. భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 4 ఓహెచ్ఆర్ వాటర్ ట్యాంకులతో పాటు అక్కడక్కడ 8 మినీ వాటర్ ట్యాంకులు, 8 స్టాండ్ పోస్టు మంచినీటి వాటర్ ట్యాంకులు నిర్మించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు 100 ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు నుంచి అన్ని రూట్లలో 230 బస్సులు నడపనున్నారు. ఉద్దాల ఉత్సవానికి ముందురోజు కొనసాగే తలియకుండ ఉత్సవం అప్పంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వైభవంగా కొనసాగింది. గ్రామంలోని శాలివాహన కాలనీలో ఉన్న తలియకుండ మండపంలో కుండకు శాలివాహనులు పూజలు జరిపారు. అనంతరం వారు కుండను తలపై పెట్టుకొని మేళతాళాల మధ్య బాణసంచా కాలుస్తూ.. ఊరేగింపుగా చిన్నవడ్డెమాన్ గ్రామంలోని ఉద్దాల మండపానికి తరలించారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. 680 మంది పోలీసులతో బందోబస్తు కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరకు క ట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కల్పిస్తామని ఎ స్పీ డి.జానకి అన్నారు. మంగళవారం ఉద్దాల మ హోత్సవం ఉండటంతో సోమవారం జాతర మైదానాన్ని పరిశీలించి మాట్లాడారు. జాతర స మయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా దైవ దర్శనానికి సాఫీగా వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సిబ్బంది అందరూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉద్దాల ఉత్సవం సందర్భంగా 680 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు కల్పిస్తామన్నారు. జాతర ప్రాంగణంలో మొత్తం సీసీ కెమెరాలు, 24 గంటలు కంట్రోల్ రూం ఏర్పాటు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య వస్తే డయల్ 100కు సమాచా రం ఇవ్వాలని కోరారు. ఎస్పీ వెంట ఏఎస్పీ ఎన్ బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుడి రిమాండ్
● వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట సహా ఆరు జిల్లాల్లో దొంగతనాలు ● 16 కేసుల్లో నిందితుడైన సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వి ● నిందితుడిని పట్టుకున్న వనపర్తి పోలీసులు వనపర్తి: వనపర్తి జిల్లాలో పలు దొంగతనాల కేసు ల్లో నిందితుడు సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వికి రిమాండ్ విధించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం.. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రిజ్వి కొంతకాలంగా పోలీసుల కు చిక్కకుండా, కోర్టులో హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతనిపై కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు వనపర్తి డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్బీడబ్ల్యూ బృందం నిందితుడి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. వివిధ ప్రదేశాల్లో గాలింపు చర్యల అనంతరం, హైదరాబా ద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ సహకారంతో సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్విని పోలీసులు పట్టుకున్నారు. సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్విని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14రోజులు రిమాండ్ విధించింది. జిల్లా వ్యాప్తంగా 16కేసుల్లో.. 2018లో పెబ్బేర్ పోలీస్టేషనన్లో 6కేసులు, వనపర్తి టౌన్ పోలీస్టేషన్లో 4 కేసులు, కొత్తకోట పోలీస్టేషన్లో 6 కేసులు, రాజేంద్రనగర్, వికారాబాద్, కర్నూ లు జిల్లాలో కూడా దొంగతనం కేసులు నమోదు అయినట్లు డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు రిమాండ్ అయిన తర్వాత పారిపోయిన సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వి మళ్లీ పట్టుకోవడంలో విశేష నైపుణ్యం కనబర్చిన వనపర్తి డీసీఆర్బీ పోలీసులను ఎస్పీ అభినందించారు. -
జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
● ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజ్ పాలమూరు: జిల్లా క్లబ్ ఎన్నికల ఫలితాలు సోమవారం సీనియర్ న్యాయవాది నాగేందర్రాజు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి ప్రకటించారు. శనివారం అర్ధరా త్రి వరకు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. జిల్లా క్లబ్ ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజ్కు 719ఓట్లు రాగా సమీప అభ్యర్థి మల్లు నర్సింహారెడ్డికి 299ఓట్లు వచ్చాయి. దీంతో మ ల్లు నర్సింహారెడ్డిపై సంజీవ్ ముదిరాజ్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఉపాధ్యక్షుడిగా సీమ నరేందర్(512ఓట్లు), సంయుక్త కా ర్యదర్శిగా ఎన్.శంకర్రెడ్డి(676ఓట్లు), క్రీడా సంయుక్త కార్యదర్శిగా ఆర్.రవీందర్రెడ్డి (912), కోశాధికారిగా జి.రామచంద్రారెడ్డి (650ఓట్లు) రావడంతో గెలుపొందినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఎంసీ సభ్యుల్లో బరిలో ఉన్న 12మందిలో నరేశ్రెడ్డికి 465, మోహన్రెడ్డికి 453, బాద్మి ధృవకు 432, ఆంజనేయులు కు 414, సతీశ్కుమార్కు 411ఓట్లు వచ్చాయి. దీంతో ఈసీ సభ్యులుగా వీరు గెలుపొందారు. -
చెరుకుకు గిట్టుబాటు ధర రూ.4,500 ఇవ్వాలి
● తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి అమరచింత: టన్ను చెరుకుకు బోనస్లతో పని లేకుండా రూ.4500లు గిట్టుబాటు ధర ఇవ్వాలని తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం తమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్వైజర్ రామకృష్ణ ప్రసాద్, కెన్ డీజీఎం నాగార్జునను కలిసి చెరుకు రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతం పెంచి చెరుకు రైతులను ఫ్యాక రీ యాజమాన్యం ఆదుకోవాలన్నారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్లో ప్రకటించిన సబ్సిడీలను ఈ సీజన్లో సైతం అమ లు చేస్తున్న యాజమాన్యం రికవరీ శాతాన్ని 11 నుంచి 12 శాతానికి పెంచాలన్నారు. సబ్సిడీలను 2026 నుంచి 2027 వరకు కొనసాగించాలన్నారు. కోతలకు సరిపడా లేబర్ బంటాలను మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యాక్టరీకి పంపిన 14 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని విన్నవించారు. చెరుకును తరలించే గ్రామాల అంతర్గత రహదారులను ఫ్యాక్టరీ సీడీసీ నిధుల నుంచి ఖర్చు చేసి మరమ్మతు చేపట్టాలన్నారు. ఆత్మకూర్ నుంచి ఫ్యాక్టరీ వరకు ఉన్న బీటీ రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరైనా సంబంధిత అధికారులు నేటికీ పనులు చేపట్టలేక పోవడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జి ల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వెంకట్రాములు, ఎస్.రాజు, అంజి, బాలు నాయక్, భాస్కర్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తోంది
మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని ఆశ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మండిపడ్డారు. తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ 4వ మహాసభల్లో భాగంగా రెండోరో జు జెండావిష్కరణ, ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధనకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఆశా కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. 2018లో సుప్రీం తీర్పు ప్రకారం కార్మికులందరికీ రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రోజుకు కనీస వేతనం రూ. 175 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విదేశాలు తిరిగేందుకు ప్రధాని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, కార్మికుల వేతనాలు పెంచేందుకు మాత్రం మనసు రావ డంలేదని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. అనేక రకాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఐటీ యూ ముందుందన్నారు. భవిష్యత్లో కార్మికుల పక్షాన మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆశా కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, అధికార ప్రతినిఽధి మాధవి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కిల్లెగోపాల్, దీప్లానాయక్, కురుమూర్తి, రాములు, లక్ష్మయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వదేశీ వాడకంతోనే చేనేతకు ఆసరా
నారాయణపేట: చేనేత వృత్తి అద్భుతమని, అది ఒక కళ అని.. స్వదేశీ ఆదరించడం.. చేనేతను అక్కున చేర్చుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని బీజేపీ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అభిప్రాయపడ్డారు. సోమవారం నారాయణపేట జిల్లా కోటకొండలోని చేనేత వస్త్రాలు, పట్టుచీరలను ఆయనతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్తోపాటు ఎగ్గని నర్సింలు పరిశీలించారు. గద్వాల్, పైతాన్, సికో, తదితర రకాల పట్టు చీరలను వారు చూశారు. అత్యద్భుతమైన డిజైన్లు, ఆకర్షించే రంగుల చీరలు మహిళల మనసును గెలుచుకుంటాయని కితాబిచ్చారు. స్లార్ హీరోయిన్లతో ప్రచారానికి ప్రణాళిక.. కోటకొండ చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు పాటుపడతానని మురళీధర్రావు పేర్కొన్నారు. ఇక్కడ తయారు చేసిన చేనేత వస్త్రాలకు జాతీయస్థాయిలో ప్రచారం తీసుకువచ్చేందుకు పని చేద్దామన్నారు. ఇక్కడ పంచెలు తయారుచేసి, వాటికి కోటకొండ బ్రాండ్ తీసుకురావాలని. రాష్ట్రంలో పేరుగాంచిన వివిధ ప్రాంతాల మాదిరే, కోటకొండ అనేది ఒక బ్రాండ్గా తయారు కావాల ని ఆయన పేర్కొన్నారు. అయితే స్వయంగా తయా రు చేసే చీరలకు సినిమా స్టార్లతో ప్రచారం చేద్దామని, కోటకొండలోకానీ, హైదరాబాద్లో గాని షో ఏర్పాటు చేద్దామని సూచించారు. అందుకు ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి స్పందిస్తూ.. స్టార్లను ఒప్పించి, ప్రచారం చేయించే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పగా.. ఆ బాధ్యతలు నేనే నిర్వహిస్తాన ని మురళీధర్రావు బదులిచ్చారు. ఖరీదైన కార్పొ రేట్ వస్తువుల కంటే కూడా, చేనేత వస్త్రాలు భార తీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా చేనేతను ఆదరించాలని సూచించారు. అనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, నాయకులు ఎంగలి సిద్దు, పగుడాకుల రవి, చెవుల కష్ణయ్య, ఎంగలి నవీన్, ఎంగలి సురేందర్ , బొక్కి సాయిలు, కొత్తపల్లి తిరుపతి యాదవ్ ఉన్నారు. కోటకొండ చేనేతకు జాతీయస్థాయి గుర్తింపునకు కృషి బీజేపీ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చీరలను పరిశీలించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి -
గణతంత్ర వేడుకలకు పీయూ అధ్యాపకుడు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే వేడుకల కంటిజెంట్ ఆఫీసర్గా పీయూ అధ్యాపకుడు అర్జున్కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వెళ్లే ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రతిభ చూపి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వలంటీర్లను సమన్వయం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వం చాటాలని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెఎల్డీ కళాశాల నుంచి పరమేష్, గద్వాల్ నుంచి పద్మావతి కూడా గుజరాత్లో జరిగే పటాన్లోని హేమచంద్రాయ నాత్ గుజరాత్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే క్యాంపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోస్గి రూరల్: బొలేరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుండుమాల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోస్గి పట్టణానికి చెందిన అచ్చుగట్ల అశోక్ (47) నారాయణపేట జిల్లా కేంద్రంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుండుమాల్ మండలం అమ్లీకుంటలో తమ ఇంటి దైవం వీరభద్రస్వామికి పూజల నిమిత్తం ఆదివారం ఉదయం తన భార్యాపిల్లలను కోస్గికి పంపించాడు. రోజు మాదిరిగానే వస్త్ర దుకాణాన్ని మూసివేసి రాత్రి కోస్గికి బయలుదేరాడు. గుండుమాల్ చెరువుకట్టపై కోస్గి నుంచి మద్దూర్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఓ ప్రైవేటు వాహనంలో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు బొలేరో వాహనం డ్రైవర్ కాశీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం గద్వాల క్రైం: ఆర్థిక సమస్యలు తాళలేక వ్యక్తి బలవన్మరణం చెందిన సంఘటన గద్వాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ప ట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రెండవ రైల్వే గేట్కు చెందిన లక్ష్మన్న(55) వృత్తి రిత్యా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తెలిసిన వారితో అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తీర్చే స్థోమత లేకపోవడంతో సోమవారం తెల్లవారు జామున గదిలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం కుటుంబ సభ్యులు గ మనించి పోలీసులకు సమాచారం అందించా రు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బావిలో పడి వృద్ధురాలి మృతి ఎర్రవల్లి: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ము రళి కథనం మేరకు.. మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన సాయిరెడ్డి తిరుపాలమ్మ (70)కు కొంత కాలంగా మతిస్థిమితం సక్ర మంగా లేకపోవడంతో కంటిచూపు లోపం ఉండేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అదే గ్రా మంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఊర బావిలో పడింది. సో మవారం ఉదయం దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బావిలో నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన డ్యూటీ డాక్ట ర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆమె కుమారుడు సాయిరెడ్డి తిక్కారెడ్డి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హైవే విధుల నుంచి తొలగింపు జడ్చర్ల: జడ్చర్ల పరిధిలో జా తీయ రహదారి–44 పర్యవేక్షణకు నియమించిన హైవే పోలీసులను విధుల నుంచి తొలగించారు. ఆదివారం జాతీయ రహదారిపై వెళ్తు న్న హార్వెస్టర్ల డ్రైవర్లు, యజమానుల నుంచి హైవే పోలీసులు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘హైవే పోలీసుల చేతివాటం’ శీర్షికన వచ్చిన కథనంపై ఎస్పీ జానకి స్పందించారు. ఈ మేరకు సదరు పోలీసులను విధుల నుంచి తప్పించి ఇతర పోలీసులకు అప్పగించారు. -
ప్రజావాణికి45 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. ప్రజవాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. 45 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను ఊరికే తిప్పుకోవద్దని సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సిములు పాల్గొన్నారు. నేటి నుంచి జిల్లాలో జాగృతి జనం బాట ప్రాజెక్టుల నిర్వాసితులతో కవిత సమావేశం మెట్టుగడ్డ: జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు జాగృతి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో మొదటిరోజు మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ నిర్వాసితులతో సమావేశమవుతారని, ఆ తర్వాత మీనాంబరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్వెన ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడతారని, దేవరకద్ర నియోజకవర్గంలోని అప్పంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారని పేర్కొన్నారు. రెండోరోజు బుధవారం సుదర్శన్ ఫంక్షన్ హాల్లో మేధావులు, అన్ని కుల సంఘాలతో ములాఖత్ నిర్వహిస్తారని తెలిపారు. ‘వారంతట వారేబయటికి వస్తున్నారు’ నవాబుపేట: ‘నన్ను ఓడించాలని గడిచిన ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారే ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.’అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నవాబుపేట మండలంలో పర్యటించిన ఆయన ఇటీవల సొంత పార్టీ నాయకులు తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు స్పందించారు. పార్టీ వ్యతిరేక శక్తులు వారంతట వారే ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారని, ఇటీవల జరిగిన పరిణామాలు గమనిస్తే తెలుస్తుందన్నారు. కోవర్టులుగా మారి పార్టీకి ద్రోహం చేసిన వారు త్వరలోనే మరింత మంది బయటికి వస్తారని తెలిపారు. పార్టీ కోసం, తన గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఎప్పటికీ మరువనని, వారికి నిరంతరం అండగా ఉంటానని పేర్కొన్నారు. ర్యాగింగ్ చేస్తే భవిష్యత్ నాశనం చేసుకున్నట్లే మహబూబ్నగర్ క్రైం: మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలే గానీ ర్యాగింగ్ చేయరాదని ఎస్పీ డి.జానకి అన్నారు. ర్యాగింగ్ సరదా కాదని ఒక నేరం కిందకు వస్తుందని అలాంటి చర్యలకు పాల్పడితే మీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సోమవారం యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ చదువుకు సహకరిస్తున్నారనే విషయం మరిచిపోరాదని, వాళ్లకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించరాదన్నారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారని అనిపించినా, మీరు బాధితుడిగా అనిపించిన వెంటనే కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీకి లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. ర్యాగింగ్ బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యల తప్పవన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ప్రొఫెసర్లు సునందిని, రూరల్ సీఐ గాంధీనాయక్, తదితరులు పాల్గొన్నారు. -
పటేల్ ఆశయాలను సాధించాలి
● 31న ఏక్తా ర్యాలీలో భాగంగా 8 కిలోమీటర్ల పాదయాత్ర ● ఎంపీ డీకే అరుణ పాలమూరు: దేశ సమైక్యత కోసం పోరాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన అందరిపై బాధ్యత ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈనెల 31న పటేల్ జయంతి కార్యక్రమాలపై సోమవారం ఎంపీ కార్యాలయంలో యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పటేల్ 150వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ‘ఏక్ భారత్–ఆత్మ నిర్బర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్తా ర్యాలీలో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని, ఇందులో పార్టీలకతీతంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ నెల 31న వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు నివాళి, అదేవిధంగా స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా, క్లాక్టవర్, అశోక్ టాకీస్ మీదుగా పిల్లలమర్రి వరకు ఏక్తామార్చ్ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా వైద్య శిబిరాలు, కళాశాల, పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మహబూబ్నగర్లో ఉన్న మేరా యువభారత్ కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తూ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, కోటానాయక్, గాల్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మద్దతు ధర
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు నాణ్యతా ప్రమాణాలతో పంట ఉత్పత్తులు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండలపరిధిలోని అప్పాయిపల్లి శివారులో శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని సూచించారు. పత్తికి 8 శాతం తేమ ఉంటే క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర, 9 శాతం ఉంటే రూ.8,020 వస్తుందని అన్నారు. 12 శాతం ఉండే పత్తిని సైతం పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్తగా కిసాన్ కపాస్ యాప్ను తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్తో మాత్రమే పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. సీజన్లో ఒక రైతు మూడు దఫాలుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఏదేని కారణాలతో బుకింగ్ను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మార్కెటింగ్శాఖ ఏడీ బాలమణి, ఏడీఏ రాంపాల్, ఏఓ శృతి, నాయకులు సిరాజ్ ఖాద్రీ, గోవింద్యాదవ్, నరేందర్రెడ్డి, రఘు పాల్గొన్నారు. -
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు. రేవులపల్లి–నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మా పొలాలకు కాస్త రేట్లు వస్తాయి. చిన్నాచితక వ్యాపారాలతో జీవనోపాధి పొందొచ్చనేది మా ఆశ. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలి. అంతవరకూ పోరాటం తప్పదు. – రాజు, రేవులపల్లి, ధరూర్, జోగులాంబ గద్వాల ఎవరూ అడ్డుకోవద్దు.. ఆత్మకూరు మండలంలోని జూరాల పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రయోజనకరం. ఆత్మకూరు నుంచి గద్వాలకి వెళ్లాలంటే ప్రస్తుతం 33 కి.మీలు ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 12 కి.మీ.లకే గద్వాల వెళ్లొచ్చు. 1979లోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో కొత్తపల్లి – జూరాల మధ్య నిర్మాణం కానుంది. ఎవరూ అడ్డుకోవద్దని.. అటుఇటు అయితే మేమూ పోరాటానికి సిద్ధం. – రహమతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్, వనపర్తి ● -
హైవే పోలీసుల చేతివాటం!
● హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి లంచం వసూలుకు యత్నం జడ్చర్ల: పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు జాతీయ రహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం తమిళనాడు నుంచి కరీంనగర్కు జాతీయ రహదారిపై దాదాపు 40 హార్వెస్టర్లు వరుస క్రమంలో వెళ్తున్నాయి. అయితే జడ్చర్ల శివారులోకి రాగానే జాతీయరహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు వాటిని ఆపి రోడ్డుపై బేరసారాలు కొనసాగించారు. ఒక్కో హార్వెస్టర్కు రూ.500 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆయా డ్రైవర్లు రూ.200 ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విషయం మీడియాకు తెలిసి అక్కడకు చేరుకునే లోపు సంబంధిత పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే హార్వెస్టర్లకు రోడ్డుపై ప్రయాణించే పర్మిట్ ఉంటుందని, ఇందుకు సంబంధించి పన్నులు కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే కడతామని హర్వెస్టర్ యాజమానులు, డ్రైవర్లు తెలిపారు. అయినా జాతీయ రహదారి పోలీసులు తమను వెంటాడి డబ్బులు డిమాండ్ చేశారని వాపోయారు. -
గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్కు తరలింపు
నాగర్కర్నూల్ క్రైం : పట్టణంలోని లాడ్జిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక హరిజనవాడకు చెందిన బొండ్ల రేణుకుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన మైలగాని సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన అరకు విశ్వాస్, అచ్చంపేట మండలం హాజీపూర్కు చెందిన ఎదుల వంశీలు హైదరాబాద్లోని దూల్పేటలో అకాశ్సింగ్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేవారు. ఈ క్రమంలో ఆదివారం స్థానిక చైతన్య లాడ్జిలో గంజాయి విక్రయించడానికి వెళ్లగా ముందస్తు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు నిందితులతో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన జిల్లా కేంద్రానికి చెందిన కొత్త వెంకటేష్, కొత్త మనోజ్ కుమార్, తాడూరు మండలం గుంతకోడూరుకు చెందిన ఆది కిష్ణ్రగౌడ్, పరేమేష్ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 735 గ్రా గంజాయి, ఏడు సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్దన్ పాల్గొన్నారు. గంజాయి తీసుకున్న యువకులపై కేసు జడ్చర్ల: గుట్టుగా గంజాయి తీసుకున్న నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మండల పరిదిలో ని మాచారం గ్రామానికి చెందిన మరికంటి సుమంత్రెడ్డి గంజాయి వినియోగించడం, విక్రయించడం చేస్తున్నాడన్న సమాచారం మేరకు శనివారం గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఒక ప్యాకెట్ గంజాయి లభించడంతో పాటు గంజాయి పరీక్షలో పాజిటివ్గా తేలింది. దీంతో సుమంత్రెడ్డిని విచారించగా జడ్చర్ల టీహోటల్ నిర్వాహకుడు అబ్దుల్ రహెమాన్, మహబూబ్నగర్లో బీహార్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ సుబద్ కాంత్ శర్మ, షాద్నగర్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మిథుకుమార్ యాదవ్ ద్వారా గంజాయి తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు నేపాల్కు చెందిన సుభాద్సింగ్ ద్వారా రూ.9,500కు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించడం, తీసుకోవడం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉత్కంఠగా జిల్లా క్లబ్ కార్యవర్గ ఎన్నికలు
పాలమూరు: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠగా సాగాయి. ఈసారి రాజకీయ నేతల ప్రమేయం పెరగడంతో రాజకీయ ఎన్నికలను తలపించాయి. ప్రధాన కార్యదర్శి పోస్టుకు కాంగ్రెస్ నేత సంజీవ్ ముదిరాజ్తో పాటు మల్లు నర్సింహ్మారెడ్డి మధ్య పోటీ కొనసాగింది. ఇక ఇతర పోస్టులకు బరిలో ఉన్న వారందరూ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. పార్టీల నేతలు అక్కడే తిష్టవేసి వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి పావులు కదిపారు. ● జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు క్లబ్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా నాగేశ్వర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. మిగిలిన కార్యవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా క్లబ్లో మొత్తం 2,045 మంది ఓటర్లు ఉండగా.. 1,169 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడి పోస్టుకు ముగ్గురు, ప్రధాన కార్యదర్శికి నలుగురు, సంయుక్త కార్యదర్శికి ముగ్గురు, స్పోర్ట్స్ జాయింట్ కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారి పోస్టుకు ముగ్గురు, ఈసీ సభ్యుల పోస్టులకు 12మంది పోటీ చేయగా.. వీరిలో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లకు ఒకసారి.. జిల్లా క్లబ్ 1958లో ఏర్పాటు కాగా.. ఆనాటి నుంచి ప్రతి రెండేళ్లుకు ఒకసారి నూతన కార్యవర్గం ఎన్నుకుంటున్నారు. జిల్లా క్లబ్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. గతంలో రూ. లక్ష ఉన్న సభ్యత్వాన్ని ప్రస్తుతం రూ. 3లక్షలుగా నిర్ణయించారు. చివరగా 2023లో ఎన్నికలు జరిగాయి. ● రాజకీయ ఎన్నికలను తలపించిన వైనం ● ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కోడేరు: కరెంట్ షాక్తో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఖానాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆది కర్రె బాలస్వామి (60) ఆదివారం వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేశాడు. లైట్లు వేసిన అనంతరం ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసి చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలస్వామికి భార్య మశమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. భవనం పైనుంచి పడి బీహార్ వాసి మృతి ● మంకి లిఫ్ట్ ఆపరేటింగ్కు వెళ్లి మృత్యువాత? వనపర్తి: జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బీహార్కు చెందిన మేసీ్త్ర తిలక్సా (45) మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. తోటి కార్మికులు, నిర్మాణ కంపెనీ ఇంజినీర్ సతీష్రావు కథనం మేరకు.. బిహార్కు చెందిన తిలక్సా తన బృందంతో వైద్య కళాశాల, రెసిడెన్సీ, డైనింగ్ తదితర ఐదు భవనాల నిర్మాణాలు చేపడుతూ సుమారు మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. పనులు తుదిదశకు చేరుకోవడంతో ఇటీవల వేగం పెంచారు. ఆదివారం ఉదయం వైద్య కళాశాల భవనం వెనకభాగంలో మూడో అంతస్థులో మంకీ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అక్కడే ఉన్న ఓ వైద్యు డు పరీక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో ఇంజినీర్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బిహార్కు తరలించామని ఇంజినీర్ వివరించారు. ● భవన నిర్మాణ సమయంలో కార్మికులు, మే సీ్త్రల రక్షణకు తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్య త అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్పై ఉంటుంది. సుమారు నాలుగైదేళ్లుగా భవన నిర్మాణ ప నులు కొనసాగుతున్నా..ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్ఎంపై ఎస్బీ కానిస్టేబుల్ దాడి గోపాల్పేట: రేవల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ప్రధానోపాద్యాయురాలిపై శనివారం ఎస్బీ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. పాఠశాల హెచ్ఎం తెలిపిన వివరాల మేరకు.. ఎస్బీ కానిస్టేబుల్ శనివారం కొత్తగా జాబ్ వచ్చిన వ్యక్తికి సంబంధించిన బోనఫైడ్ సేకణరించేందుకు రేవల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వెళ్లాడు. అతడు ఐదోతరగతి వరకు ఈ ప్రాథమిక పాఠశాలలోనే చదివాడు. పరుష పదజాలంతో హెచ్ఎంను దూషిస్తూ అతడి బోనఫైడ్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాఠశాల హెచ్ఎం అందుకు నిరాకరించింది. దీంతో ఎస్బీ కానిస్టేబుల్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఓ మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుల్ను తీసుకుని తిరిగి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత వాదోపవాదాలు జరుగుతుండగా విచక్షణ కోల్పోయిన ఎస్బీ కానిస్టేబుల్ ప్రధానోపాద్యాయురాలిపై చేయిచేసుకున్నాడు. అనంతరం ఇరువురూ రేవల్లి పోలీస్స్టేషన్లో శనివారం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తనకు అవమానం జరిగిందని ఈ విషయం సోమవారం ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఇదే విషయం ఆదివారం రేవల్లి ఎస్ఐని వివరణ కోరగా.. విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపారు. స్వగ్రామానికి జవాన్ మృతదేహం అమరచింత: రాజస్థాన్లోని జోథ్పూర్లో విధులు నిర్వర్తించే శంకర్నాయక్ కుటుంబ కలహాలతో శుక్రవారం అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి అంబులెన్స్లో స్వగ్రామమైన మండలంలోని దీప్లానాయక్తండాకు తీసుకొచ్చారు. ముందుగా అమరచింత వీధుల్లో యువకులు, తండావాసులు జాతీయ జెండాలు చేతబట్టి మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న వయస్సులో కుమారుడు దూరమవడం, తమ తండ్రి ఇక రాడని తెలియని చిన్నారుల రోధనలు పలువుర్ని కంటతడి పెట్టించాయి. -
మృతదేహంతో రోడ్డుపై నిరసన
గోపాల్పేట: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో రోడ్డుపై నిరసన చేసిన ఘటన ఆదివారం ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజేనేయులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుడు ఏదుల ప్రాజెక్టులో మినుముల పంట సాగు చేశాడు. సాగు చేసుకున్న మినుముల పంటలో నుంచి టిప్పర్లు, లారీలు వెళ్లడంతో పాటు రిజర్వాయర్ పనులు చేసేందుకు అడ్డుపడుతున్నాడని కాంట్రాక్టర్ ఆంజనేయులుపై కేసు పెట్టి పోలీసులతో వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, రాచాల యుగంధర్గౌడ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి ధర్నా వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సాయంత్రం వరకు రిమాండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒప్పించేందుకు ప్రయత్నించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరగా.. కాంట్రాక్టర్ రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణ తెలిపారు. -
కాంచనగుహకు స్వర్ణకాంతులు
● వైభవంగా కురుమూర్తిస్వామి అలంకారోత్సవం ● మార్మోగిన గోవింద నామస్మరణ ● పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహ రి, ఎంపీ డీకే అరుణ , ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆభరణాలను పూజారులకు అందిస్తున్న అధికారులు ఆత్మకూర్లో ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్న భక్తజనం చిన్నచింతకుంట/ఆత్మకూర్/మదనాపురం/ అమరచింత: పేదల తిరుపతి కురుమూర్తి గిరుల్లో శ్రీనివాసుడు కొలువుదీరిన కాంచనగుహ స్వర్ణకాంతులను సంతరించుకుంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన అలంకారోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పటణంలోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలకు రాష్ట్ర మ త్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మె ల్యే జి.మధుసూదన్రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మేళాతాళాలు, మంగళ వాయిద్యా లు మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయ ప్రకారం గాడి వంశానికి చెందిన గాడి శేషుచారి స్వామివారి ఆభరణాలను పరమేశ్వరస్వా మి చెరువు వరకు తలపై పెట్టుకుని ఊరేగించారు. అనంతరం పోలీసు కాన్వాయ్లో స్వామివారి ఆలయానికి బయల్దేరారు. మదనాపురం మండలం కొ త్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరం గ్రామానికి చేరుకోగా.. గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతించారు. అనంతరం గ్రామంలోని ముక్కెర వంశీయులు రాజ శ్రీ రాంభూపాల్ నివాసానికి చేర్చారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. మహ బూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మపూరం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని అంభోరు మధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. ఊరేగింపుగా తీసుకొచ్చిన ఆభరణాలను ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డిల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్యకు అందజేయగా.. స్వామివారికి అలంకరించారు. దీంతో కాంచనగుహ స్వర్ణకాంతులతో పులకరించింది. -
పట్టువస్త్రాల తరలింపు..
కురుమూర్తిస్వామి అలంకారోత్సవంలో భాగంగా అమరచింత పద్మశాలీ కులస్తులు మగ్గంపై నేసిన పట్టువస్త్రాలను ఆలయానికి తరలించారు. వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పట్టుపంచె, అమ్మవారికి పట్టుచీర తయా రు చేసిన పద్మశాలీలు.. స్థానిక భక్త మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఉరేగింపుగా ఆత్మకూర్ కు తరలించారు. అక్కడ మంత్రి వాకిటి శ్రీహరి పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా కురుమూర్తి క్షేత్రానికి బయలుదేరారు. కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్ దంపతులు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షు డు ప్రశాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, మాదిరెడ్డి జలంధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీను, శ్రీధర్గౌడ్, వీరేశ లింగం పాల్గొన్నారు. -
బంగారం దుకాణంలో చోరీకి యత్నం
మరికల్: మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో ఓ బంగారం దుకాణంలో దొంగలు చోరీకి యత్నించారు. మరికల్ ప్రధాన చౌరస్తాలో ఉన్న గణేష్ జ్యువెలర్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షాపు షెట్టర్ను కట్చేసి లోపలికి ప్రవేశించి లాకర్ను కూడా కటర్తో కట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరు. ఆదివా రం ఉదయం గమనించిన చుట్టుపక్కల వ్యా పారులు విషయాన్ని దుకాణా యాజమానికి సమాచారం అందించారు. షాపు యాజమాని చోరీ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం కూల్స్ టీంతో వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మిర్చి.. తెగుళ్లు ముంచి
అలంపూర్: రైతన్న ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మిరప పంటకు ముడత తెగుళ్లు సోకుతున్నాయి. దీనికి సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో మిర్చి పంట సాగులో ఉంది. దీంతో పాటు హైబ్రిడ్ మిరపను రైతులు సాగు చేస్తున్నారు. సాగు చేసిన మిరప పైర్లకు పైముడత కింది ముడత తెగుళ్లు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నివారణ చర్యలను సూచిస్తున్నారు. తెల్ల నల్లి (కింది ముడత): తెల్ల నల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడ్చుకుంటా యి. దీంతో ఆకులు తిరగబడి పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారి మొక్కల పెరగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి. నివారణ : నీటిలో కరిగే గంథకం 3 గ్రాములు లేదా డైకోపాల్ 5.0 మి.లీ లేదా పెగాసెస్ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి ఎకరా కు ఫానలోన్ 400 మి.లీ లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ పిచికారీ చేసుకోవాలి. తామర పురుగు (పైముడత) : ఇవి ఆకుల నుంచి రసం పీల్చడం వ లన అకులు పైకి ముడ్చుకుంటా యి. ఆకులు, పిందెలు, రాగి రంగులోకి మారి పూత పిందె దశలో నే నిలిచిపోతుంది. నివారణ : పై ముడత నివారణకు 10 లీటర్ల నీటికి 12.5 గ్రా ముల డైపెన్ ధయురాన్ లేదా 20 మి.లీ ప్రిపోనిల్ లేదా 30 మి.లీ స్పైనోసాడ్ లేదా 20 మి.లీ పానలోస్, 15 గ్రాముల ఎసిఫెట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. పాడి–పంట -
స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాచకులు కృష్ణకుమార్, రవితేజ మాట్లడుతూ.. తెలంగాణలో విద్యావ్యవస్థ క్షీణిస్తుందని, ప్రభుత్వం కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం వల్ల పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. సంవత్సరాల త్వరబడి ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజులు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కళాశాలల్లో సర్టిఫికేట్లు సైతం ఇవ్వకపోవడంతో మద్యలోనే చదువులను నిలిపివేసే పరిస్థితి నెలకొందన్నారు. వీలైనంత త్వరగా ఫీజులు విడుదల చేయకపోతే రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంగీత, శరత్, హరికృష్ణ, గోపి, అర్జున్, నందిని, రేణుక, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
● 5.5 గ్రాముల ఆభరణాలు, రూ.1.20 లక్షలు స్వాధీనం ● రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు సీజ్ గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్ల తలుపులు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి 5.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. శనివారం సాయంత్రం గద్వాల సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. కొన్ని రోజులుగా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటకు చెందిన కుర్వ చిన్న వెంకన్న, మొర్రి ప్రణేష్, కర్ణాటకకు చెందిన కుర్వ గిరీష్, చంద్రశేఖర్ నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను పట్టుకునేందుకు గద్వాల సీఐ శ్రీను ఆధ్వర్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి, జిల్లాలో నిఘా పెంచామని తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్దకల్ పోలీసులు మండల శివారులో వాహనాలు తనిఖీ చేపట్టిన క్రమంలో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కేసు చేధనలో ఎస్ఐలు నందికర్, శ్రీకాంత్, శ్రీనివాసులు, శ్రీహరి, సిబ్బంది కృషి చేశారన్నారు. వీరికి నగదు రివార్డును ఎస్పీ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, బైక్లు, సెల్ఫోన్లను త్వరలో కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందజేస్తామన్నారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ నందికర్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో
ధరూరు/ దోమలపెంట/ దేవరకద్ర/ ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వ స్తుంది. శనివారం రాత్రి 7,30 గంటల వరకు ప్రాజె క్టుకు 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 22, 680 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. మరో 47 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● సుంకేసుల నుంచి 49,228, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 22,680 మొత్తం 71,908 క్యూసెక్కుల నీటి ప్రవాహం శనివారం శ్రీశైలం జలాశయం వచ్చింది. దీంతో శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 62,107 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 880.5 అడుగుల వద్ద 191.2118 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 2,674, ఎంజీకేఎల్ఐకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు యూనిట్లలో విద్యుతుత్పత్తి జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో కేవలం 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం ఎగువలో 2 యూనిట్ల ద్వారా 78 మెగావాట్లు, దిగువలో 2 యూనిట్ల ద్వారా 80 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. కోయిల్సాగర్లో ఒక గేటు ఎత్తివేత.. కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ప్రవాహం రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి 32.6 అడుగులకు చేరడంతో అధికారులు ఒక గేటును తెరిచి నీటిని వదిలారు. -
కురుమతిరాయుడి సేవలో.. అమరచింత పద్మశాలీలు
● నేటి అలంకారోత్సవంలో పట్టువస్త్రాల సమర్పణ అమరచింత: కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మార్కండేయ ఆలయ సత్రంలో పట్టణ పద్మశాలీ కులస్తులు ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా నిష్టతో నేత పనులు చేపట్టారు. ఆదివారం జరిగే అలంకారోత్సవానికి ఇక్కడి నుంచి భక్తిశ్రద్ధలతో ఆలయానికి వస్త్రాలను తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. వీటిని తలపై పెట్టుకొని ఆలయం వరకు తీసుకెళ్లేందుకు లక్కీడిప్ ద్వారా కులస్తుల్లో ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు. ఇలవేల్పునకు కానుక.. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పట్టణ పద్మశాలి కులస్తులు వస్త్రాలు నేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాలానుగుణంగా నూలుకు బదులు పట్టు అందుబాటులోకి రావడంతో స్వామివారికి పట్టు పంచ, గౌను, అమ్మవారికి పట్టు చీరను ప్రత్యేక మగ్గంపై నిష్టతో స్వయంగా తయారుచేసి సమర్పిస్తున్నారు. పద్మశాలి కులస్తులందరూ భాగస్వాములై ప్రతి ఇంటి నుంచి కొంత నగదు సేకరించి వస్త్రాల తయారీకి వినియోగిస్తారు. గతంలో కోనేటిపై.. 60 ఏళ్ల కిందట కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని మగ్గంపై వస్త్రాలను తయారుచేసి ఆలయ అర్చకులకు అందించి వారిచ్చే అతిథ్యాన్ని స్వీకరించేవారు. -
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
● మరో నలుగురికి గాయాలు మానవపాడు: అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జాతీయ రహదారి –44పై మానవపాడు శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్, స్థానికుల కథనం ప్రకారం.. సులోమన్, మనోజ్కుమార్, బేబి స్టెఫి, ఫియాపాప, మేరీకళావతి(60) కారులో కర్నూలు నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. అయితే, మానవపాడులోని శివారులోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న డివైడర్ను, అనంతరం ఓ చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులోని ఐదుగురిలో మేరీకళావతికి తీవ్రగాయాలై మృతి చెందగా.. సులోమన్, మనోజ్కుమార్, బేబి స్టెఫి, ఫియాపాపకు గాయాలైనట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై బేబీ స్టెఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి కల్వకుర్తి రూరల్: కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై మండలంలోని మార్చాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. పట్టణంలోని బాలరాంనగర్కు చెందిన ఈశ్వర్రెడ్డి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి మతిస్థిమితంలేదని కాలనీవాసులు తెలిపారు. కొన్నిరోజులు సూర్యలత కాటన్ మిల్లు పనిచేయడంతోపాటు రిక్షా తొక్కుతూ జీవనం సాగించాడని చెప్పారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. యువకుడి ఆత్మహత్య నాగర్కర్నూల్ క్రైం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. జిల్లాకేంద్రంలోని ఎర్రగడ్డకాలనీకి చెందిన గాజుల మధు (22) ఓ ఎలక్ట్రానిక్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్కి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. గాజుల మధు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనకు సంబందించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. గడ్డిమందు తాగి వ్యక్తి బలవన్మరణం గోపాల్పేట: గడ్డిమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. ఏదులకు చెందిన కొమ్ము ఆంజనేయులు(52)కు ఏదుల ప్రాజెక్టు వద్ద వ్యవసాయ పొలం ఉండేది. ప్రాజెక్టులో పొలం పోయింది. జీవనోపాధికి పొలం లేకపోవడంతో అదే పొలంలో ఆంజనేయులు మినుముల పంట వేశాడు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇటీవల పంటలో నుంచి లారీలు వెళ్లడంతో నష్టపోతానని కాంట్రాక్టరుతో వాదోపవాదాలు జరిగాయి. గురువారం తీవ్ర మనస్తాపానికి గురై పొలంవద్ద గడ్డిమందు తాగాడు. అనంతరం కుటుంబ సబ్యులకు ఫోన్చేసి తాను గడ్డిమందు తాగానని చెప్పగా.. వెంటనే వనపర్తి, మహబూబ్నగర్ అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య అంజనమ్మ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చికిత్సపొందుతూ మహిళ మృతి ఆత్మకూర్: పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని ఎస్ఐ నరేందర్ తెలిపారు. మండలంలోని మేడేపల్లికి చెందిన భారతమ్మ(30)కు తిప్డంపల్లికి చెందిన శివతో 13 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. శుక్రవారం భర్తతో గొడవపడ్డ భారతమ్మ మేడేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో పడిఉన్న తమ కూతురుని చూసిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బీసీలకురాజ్యాధికారం దక్కాలి
మక్తల్: రాష్ట్రంలో అగ్రకులాలు బీసీలను మోసం చేస్తున్నారని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలో జిల్లా బీసీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్ వేసి కొందరు అడ్డుపడుతున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇప్పటికై నా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం మాగనూర్ మండంల కర్కూర్ గ్రామానికి చెందిన పసుల అంజనేయులుకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించి, నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లోకపల్లి భీమేష్, జిల్లా నాయకులు నర్సింహ, శాలివాహన దండు, దేవప్ప, కుర్మయ్య, తోటి అశోక్, ఆశప్ప, వెంకటప్ప, పరశురాం, బుగ్గప్ప, వెంకటప్ప, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిష్టతో వస్త్రాల తయారీ..
స్వామివారి సేవలో త రించేందుకు ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి ద క్కింది. నియమ నిష్టలు, ఉపవాస దీక్షతో స్వామి, అమ్మవార్ల పట్టువస్త్రాలు తయారు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – పగడాకుల శేషు, చేనేత కార్మికుడు, అమరచింత అదృష్టంగా భావిస్తున్నా.. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఏటా పట్టువస్త్రాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ క్రతువులో ఐదేళ్లుగా పాల్గొంటుడటం అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. – దేవరకొండ వెంకటేశ్వరమ్మ, నేత కార్మికురాలు ● -
యువత రాజకీయాల్లోకి రావాలి
కందనూలు/కల్వకుర్తి రూరల్: యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది చేసిన ఆత్మబలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే నేటికీ ఒక భౌగోళిక తెలంగాణగానే మిగిలిపోవడం.. బహుజనులకు అధికార పగ్గాలు అందకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6వేల కోట్లతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకారానికి రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ నాయకులు ముద్దం మల్లేష్, రిషబ్ జైన్, జానీ, నర్సింహారావు, సుధాకర్ పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రం నుంచి కల్వకుర్తికి సామాజిక చైతన్య రథయాత్ర చేరుకోగా.. పాలమూరు చౌరస్తాలో దిలీప్కుమార్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఫాం అడిగే స్థాయి నుంచి బీఫాం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, జంగయ్య, సదానందంగౌడ్, గోపాల్, రమేశ్ బాబు, శ్రీనివాసులు, శేఖర్, రాములు యాదవ్ పాల్గొన్నారు. -
నేడు అలంకారోత్సవం
చిన్నచింతకుంట/ఆత్మకూర్: అమ్మపూరం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అలంకారోత్సవం నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను తీసుకొచ్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆభరణాలు తీసుకురానున్నారు. బ్యాంకు నుంచి ఆత్మకూర్ చెరువు కట్ట వరకు మధ్యనగాడి వంశస్తులు స్వామివారి ఆభరణాలను తలపై పెట్టు కుని వస్తారు. అక్కడ శివుడికి పూజలు చేసిన తర్వా త పోలీసు భద్రత మధ్య మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరంలోని రాజ శ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం గంటపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మపూరం నుంచి నంబీ వంశస్తులు తలపై పెట్టుకొని అంభోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి కొండలకు చేరుస్తారు. ఈ కార్యక్రమం కనులపండువగా సాగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారుల సమక్షంలో ఆభరణాలను ఆలయ పూజారులకు అందజేస్తారు. స్వామివారి కిరీటం, హస్తాలు, పాదుకలు, కోర మీసాలు, కెంపు, ముత్యాలహారం, కనకహారాలతో పాటు అనేక రకాలైన ఆభరణాలను కాంచనగుహలో కొలువుదీరిన శ్రీనివాసుడికి అలంకరిస్తారు. ఆతర్వాత స్వామివారు స్వర్ణకాంతులతో కనిపిస్తారు. ఈ సందర్భంగా కాంచనగుహ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యేలు కురుమూర్తిస్వామి అలంకారోత్సవానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మేఘారెడ్డి హాజరవుతారని ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా తెలిపారు. అదే విధంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్తో పాటు అన్ని పార్టీల నాయకులు హాజరుకానున్నారు. 100మంది పోలీసులతో బందోబస్తు కురుమూర్తిస్వామి అలంకారోత్సవం సందర్భంగా వనపర్తి ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐలతో పాటు 100 మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శివకుమార్ తెలిపారు. అలంకారోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు సహకరించాలని కోరారు. -
హ్యామ్ నిధులతో రోడ్ల అభివృద్ధి
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తొలి విడుతలో సర్కిల్కు రూ.421 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 20రోడ్లను అభివృద్ధి పరుస్తామని, నవాబుపేట మండలంలో లింగంపల్లి మీదుగా బాలానగర్, రుద్రారం నుంచి కూచూరు మీదుగా మల్రెడ్డిపల్లికి, నవాబ్పేట నుంచి పోమాల్ మీదుగా కేశవరావుపల్లి రోడ్లకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. అదేవిధగా బాలానగర్ నుంచి నేలబండ తండా, హేమాజీపూర్, బిల్డింగ్తండా వరకు, జెడ్పీరోడ్డు నుంచి బోడజానంపేట, ఆగ్రహారంపొట్లపల్లివరకు, బాలానగర్ నుంచి నందారం, మోతిఘన్పూర్ వరకు, బూర్గుల నుంచి లింగారం రోడ్డు, రాజాపూర్ మండలంలో మర్రిబాయితండా రోడ్డు, ఈద్గానిపల్లి, నాన్చెరువుతండా మీదుగా తిరుమలగిరి, జాతీయ రహదారి నుంచి ముదిరెడ్డిపల్లి మీదుగా నందారం వరకు, కుచ్చర్కల్ నుంచి ఖానాపూర్ వరకు, జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి క్రాస్రోడ్డు నుంచి ఈర్లపల్లి వరకు, అల్వాన్పల్లి నుంచి తంగెళ్లపల్లి మీదుగా నసరుల్లాబాద్ వరకు, బూర్గుపల్లి మీదుగా పెద్దతండా వరకు, మంగలికుంట తండా రోడ్డు, మిడ్జిల్ మండలంలోని రానిపేట నుంచి దోనూర్, సింగందొడ్డి మీదుగా తొమ్మిదిరేకుల వరకు, వాడ్యాల నుంచి వేముల మీదుగా వెల్జాల వరకు, వేముల నుంచి మసిగుండ్లపల్లి మీదుగా చెన్నంపల్లి వరకు, ఊర్కొండ మండలంలో ముచ్చర్లపల్లి నుంచి రాంరెడ్డిపల్లి, బొమ్మరాసిపల్లి, జగబోయిన్పల్లి మీదుగా వెల్జాల రోడ్డు వరకు, మాదారం నుంచి గుడిగానిపల్లి మీదుగా మల్లాపూర్ క్రాస్రోడ్డు వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పిడుగుపాటుకు 14 గొర్రెలు మృత్యువాత అలంపూర్: పట్టణంలోని సంతోష్నగర్కు చెందిన వెంకటేశ్కు చెందిన 14 గొర్రెలు పిడుగుపడి మృతిచెందాయి. వెంకటేశ్ గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగులు పడడంతో వాటి ధాటికి 14 గొర్రెలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువు దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటందని బాధితుడు తెలిపారు. పశు సంవర్థక శాఖ అధికారులు మృతిచెందిన గొర్రెలను పరిశీలించిట్లు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు. -
కృష్ణమ్మ ఒడిలో.. జలవిహారం
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో తిరిగే ఏసీ లాంచీప్రయాణాల్లో మార్పులు సోమశిల నుంచి శ్రీశైలానికి నడిపే ఏసీ లాంచీలో గతేడాది కొన్ని రకాల మార్పులు చేశారు. గతంలో 60 నుంచి 70 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకుంటేనే లాంచీ ప్రయాణం చేపట్టేవారు. అయితే ఒకేసారి అంతమంది బుకింగ్ చేసుకోవడం సమస్యగా మారింది. దీంతో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా ఈ లాంచీ ప్రయాణం కొనసాగేది కాదు. గతేడాది ప్రతి శని, ఆది వారం ప్రయాణికులు ఉన్నా.. లేకున్నా.. లాంచీని తిప్పాలని టూరిజం శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకులు ఆయా రోజుల్లో లాంచీ ప్రయాణాలకు మొగ్గుచూపడంతో ఇదే పద్ధతిని కొనసాగించాలని భావిస్తున్నారు. టికెట్ల ధరలు, వసతుల కల్పనలోనూ ఈ ఏడాది నుంచి మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు వరదలతో రెండు నెలలుగా వాయిదా పడిన వైనం తాజాగా తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించేందుకు కసరత్తు పర్యాటకులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు బ్యాక్వాటర్లో ఆకట్టుకుంటున్న చిన్నబోట్ల షికారు -
నోటీసులు జారీ..
ఆన్లైన్ ద్వారా 2020 సంవత్సరంలో వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. దరఖాస్తుల ఆధారంగా సాదా కాగితాలపై భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇరువురిని పిలిచి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మార్గదర్శకాల ప్రకారమే.. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తుల పరిషారం విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నాం. మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేశాం. విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. – మధుసూదన్నాయక్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ ● -
పార్లమెంట్లో చట్టం చేస్తేనే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు
● కోర్టులను నిందించడం సరి కాదు ● మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ నారాయణపేట: ‘రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించడాన్నిస్వాగతిస్తున్నాం. స్థా నిక సంస్థల ఎన్నికల్లో ఎలా అమలు చేస్తారనేది వేచిచూడాలి. పార్లమెంటులో చట్టం చేస్తేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి. కోర్టులను నిందించడం సరైన ది కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు అమలు అయ్యే లా దేశంలోని అన్ని జాతీయ పార్టీలు సహకరించాలి.’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పే ర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అత్యధికంగా వెనుకబడిన కూలాలు ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభు త్వం సంకల్పించిన సమయంలోని సాధ్యసాధ్యాలను ఆలోచన చేయాల్సి ఉండేదని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. సామాజిక న్యాయమనేది చాలా అవసరమని, వెనకబడిన సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిపిస్తే.. పరిపాలన వారిచేతుల్లోకి వెళ్లడం శుభపరిణామన్నారు. పార్లమెంట్లో చట్టం చేస్తే తప్పా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మనం ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. కోర్టులపై నిందలు వేయడం సరైంది కాదని, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పునిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం రావాలని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి చొరవ తీసుకోవాలని మనసారా కోరకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో నాగురావు నామాజీ, సత్య యాదవ్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హన్వాడ: జిల్లాలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి మొదటి ప్రాధాన్యత ఇస్తానని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందించిన చేపపిల్లల పంపిణీని కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి శనివారం ఆయన మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామం హేమసముద్రం చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా ఇతరులకు మత్స్య శాఖను కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుడినైనా తనకు ఆ శాఖను కేటాయించి, మత్స్యకారుల సంక్షేమంపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.125 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చినట్లు చెప్పారు. జిల్లాలో ప్రధానంగా నీటి వనరులున్న ప్రాజెక్టులు, చెరువులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చేపలతోపాటు రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా మత్స్యకార సంఘాలకు రవాణా వాహనాలను ప్రతి సంఘానికి అందించేందుకు కృషిచేస్తానని, ఇందుకు ఎన్ని నిధులైనా తెస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఎండుచేపలను పౌడర్ రూపకంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ లేని కారణంగా చాలామంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ప్రతి జిల్లాకు కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్న ప్రభుత్వానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు హేమసముద్రం చెరువులో రూ.2.70 లక్షల విలువైన 1.80 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీష్ చైర్మన్ సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేష్, ఏఎంసీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, నాయకులు సురేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, సిరాజ్ఖాద్రి, కృష్ణయ్య, మహేందర్, ఆంజనేయులు, యాదయ్య, నవనీత, శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలు స్మరించుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పరేడ్ మైదానంలో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఉండే షీటీం, భరోసా సెంటర్, ట్రాఫిక్ విభాగం, సైబర్ క్రైం, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఐటీ సెల్ విభాగాల పనితీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా చట్ట వ్యవస్థ సక్రమంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ శాఖలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక ప్రగతిని గమనించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి.. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు సమయపాలన, బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టులకు సంబంధించిన అన్ని రకాల విధులు, పత్రాలు, సాక్ష్యాధారాలు నిర్ణీత సమయంలో సమర్పించాలన్నారు. ప్రతి కేసులో ప్రస్తుత పరిస్థితిని వివరంగా తెలుసుకుని కోర్టులో శిక్షలు ఖరారయ్యే విధంగా చూడాలన్నారు. -
హైజెనస్ కంపెనీతో పీయూ ఎంఓయూ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హైజెనస్ బయోస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో పీయూ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ జీఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎంఓయూ ద్వారా రీసెర్చి, ప్రాక్టికల్స్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వీటి ద్వారా భవిష్యత్లో ఉద్యోగాలు సాధించే అవకావం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంపెనీ ప్రతినిధులు సూర్యవెంకటసుబ్బరాజు, లియో డానియల్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. డీపీఆర్ఓలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా పౌర సంబంధాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్ఓ), పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. మార్చి 31, 2026 వరకు పనిచేసేందుకు ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏపీఆర్ఓ (1), పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్–1) అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీఆర్ఓ పోస్టుకు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్లో అనుభవం ఉన్నవారికి, అలాగే పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్) వారికి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఫొటోగ్రఫీలో డిప్లొమా లేదా జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్లో గుర్తించిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూషన్ నుంచి డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీఆర్ఓ పోస్టుకు నెలకు రూ.36,750, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.27,130 గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు వచ్చే నెల 1లోగా కలెక్టరేట్లోని డీపీఆర్ఓ కార్యాలయం రూం నం.106లో దరఖాస్తు అందజేయాలన్నారు. నేడు బల్మూరుకుగవర్నర్ రాక అచ్చంపేట రూరల్: బల్మూర్ మండలంలోని చంద్రారెడ్డి గార్డెన్లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఆదివాసీ చెంచుల సామూహిక వివాహాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్నోట్ శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బయలుదేరి మధ్యాహ్నం సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి రాజ్భవన్కు బయలుదేరి వెళ్తారని ప్రకటనలో పేర్కొన్నారు. -
నేరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం ఉల్లి తక్కువగా రావడంతో వ్యాపారులు వేలం నిర్వహించకుండా నేరుగా కొనుగోలు చేశారు. 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.600 ధర పలికింది. మార్కెట్కు వచ్చిన విత్తనాల ఉల్లికి డిమాండ్ ఉండటంతో 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200 కు విక్రయించారు. వినియోగదారులు, చిరు వ్యాపారులే ఎక్కువగా ఉల్లి కొనుగోలు చేశారు. ఇద్దరికి జైలుశిక్ష కల్వకుర్తి టౌన్: రెండు వేర్వేరు కేసుల విచారణలో న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జైలుశిక్షతో పా టు అందులో ఒకరికి జరిమానా విధించినట్లు బుధ వారం ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి చెందిన వరికుప్పల వెంకటేశ్ 2021 లో ఓ మహిళకు కల్లు తాగించి ఆటోలో తీసుకెళ్లి బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని సీని యర్ సివిల్ కోర్టులో కేసును విచారించిన న్యాయమూర్తి కావ్య బుధవారం అతడికి ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ● 2018లో వంగూర్ మండలం జాజాలతండాకు చెందిన దాసును తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన జంగం రమేష్ బైక్తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు దాసు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కేసును విచారించిన సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కావ్య నిందితుడికి 41 రోజుల జైలుశిక్ష విధించారు. -
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం బీచుపల్లి పదో పటాలంలో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి కూడలిలోని పుర వీధుల గుండా పటాలం అధికారులు, సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్దతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ఎర్రవల్లి కూడలి నుంచి బైక్లతో ర్యాలీగా గద్వాల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. పదో పటాలం కమాండెంట్ జయరాజు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఈ నెల 19న రాత్రి 11 గంట ల సమయంలో ట్రె యిన్ నుంచి కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి గాయా లు కాగా, రైల్వే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వివరాలు ఇప్పటివరకు తెలియ లేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు కానిస్టేబుల్ మునిస్వామి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి కల్వకుర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీలోని సిలార్పల్లికి చెందిన స్వాతి (33), తన భర్త సైదులుతో కలిసి వెల్దండ నుంచి కల్వకుర్తి బైక్పై ఈ నెల 18న వెళ్తున్నారు. పట్టణ సమీపంలోకి రాగానే జింజర్ హోటల్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఘటనలో తీవ్రగాయాలైన స్వా తిని మెరుగైన చికిత్స కో సం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. ఘటనపై స్వా తి సోదరుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజల ఆరాధ్య ధైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఉదయం 8 గంటలకు అవాహిత దేవతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బేరిపూజ, 108 అష్టోత్తర కలశాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కురుమూర్తి స్వామి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతన పట్టు వస్త్రాలు, బంతి, మల్లెపూలతో పూజారులు అలంకరించారు. అక్కడి నుంచి కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల నడుమ కురుమూర్తి స్వా మి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కురుమూర్తిగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దంపతులు, ప్రధాన అర్చకులు వెంకటయ్య, నర్సింహులు, కమిటీ సభ్యులు భాస్కరచారి,బాదం వెంకటేశ్వర్లు, భారతి, కమలాకర్ శేఖర్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా స్వామివారి కల్యాణం -
భవనం పైనుంచి పడి వ్యకి మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డకాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలిలా.. జిల్లా కేంద్రానికి చెందిన పాలమూరు శ్రీనివాసులు (55) మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఎర్రగడ్డకాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీనివాసులు భవనంపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి కూలీలు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందడటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా.. సంఘటనకు సంబందించి మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి.. ఊట్కూరు: ఊట్కూరులో వాగులో ప్రమాదవశాత్తు ముకేష్జోహన్ కొటారె(30) పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన ముకేష్జోహన్ కొటారె ఊట్కూరు గ్రామ శివారులో కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చెరువు కిందగల వాగులోకి చేపలు పట్టేందుకు వెళ్లా డు. ఆయన తిరిగి రాకపోవడంతో చుట్టు పక్క ల ప్రాంతాలలో ఆయన ఆచూకీ కోసం వెతికా రు. బుధవారం ఉదయం వాగులోని నీటి గుంతలో మృతదేహం ఉండడంతో రైతులు గమ నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో కూలీలు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. అతని తాత ఖాళ్ళురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. విద్యుదాఘాతానికి యువకుడు బలి నవాబుపేట: కొబ్బరి చెట్లు తరలిస్తూ విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండంలోని దయాపంతులపల్లిలో చో టుచేసుకుంది. మండలంలోని యన్మన్గండ్లకు చెందిన యువకుడు జగదీశ్(30) తన బొలేరోలో కొబ్బరి చెట్లను తీసుకొచ్చి రైతుల పొలాల్లో దించుతుండగా..ప్రమాదవశాత్తు చెట్లకు విద్యు త్ వైర్లు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అక్కడే కింద ఉండి చెట్లు అందుకుంటున్న మరో ముగ్గురు రైతులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగదీశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి పాన్గల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట లక్ష్మ య్య(79) ఈనెల 17న గ్రామం నుంచి మండల కేంద్రం పాన్గల్కు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం ట్రాక్టర్పై వెళ్తుండగా, గోప్లాపూర్ గ్రామ శివారులోని డంపింగ్ యార్డు సమీపంలో మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్న గొల్లకుంట లక్ష్మయ్య కిందపడటంతో ట్రాక్టర్ ట్రాలీ టైర్ అతని మీదనుంచి వెళ్లింది. దీంతో కాళ్లకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ మెడిటెక్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ గొల్లకుంట రాములు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి లక్ష్మయ్య మృతి చెందాడని, డ్రైవర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల ని లక్ష్మయ్య కుమారుడు గోవర్ధన్ బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జగదీశ్(ఫైల్) -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతరు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేష్కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. ఈక్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుడు బుధవారం అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వేపుళ్లు, పచ్చళ్లు. చట్నీళ్లు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్, మటన్, చికెన్, బిర్యానీలను చూసి అల్లుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. – పాన్గల్ -
మార్మోగిన గోవింద నామస్మరణ
కనులపండువగా పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కేటీదొడ్డి: అశేషంగా తరలివచ్చిన భక్తజనం నడుమ పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. నడిగడ్డ భక్తుల కోరికలు తీర్చే వెంకన్నగా విరాజిల్లతున్న పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించగా.. కర్ణాటక, ఆంద్రపదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. ఆంజనేయస్వామి ఆలయం వరకు రథాన్ని లాగారు. ఇదిలాఉండగా, వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. జాతర సందర్భంగా తినుబండారాలు, ఆటబొమ్మల దుకాణాల్లో రద్దీ నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ నల్లా హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, శ్రీధర్గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ వైస్ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ సర్పంచు ఆంజనేయులు, గోపి, ఉరుకుందు, నవీన్, రాజేష్, శేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు వాసి సాహసయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం బోయపల్లి వార్డుకు చెందిన మునిమంద మల్లేశ్గౌడ్ అరుదైన ఘనతను సాధించాడు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహసయాత్ర చేయడానికి గతేడాది అక్టోబర్ 17వ తేదీన శ్రీకారం చుట్టాడు. బోయపల్లి మీదుగా సైకిల్యా త్ర చేపట్టి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్ చేరుకున్నా డు. అక్కడ 45రోజులపాటు సైకిల్పై తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్క్యాంప్కు చేరాడు. 12 జ్యోతిర్లింగాలు.. 18 వేల కిలోమీటర్లు 367రోజులు 14 రాష్ట్రాలు, నేపాల్లో మల్లేశ్గౌడ్ సైక్లింగ్ యాత్ర పూర్తిచేసుకొని స్వస్థలానికి చేరుకొన్న యువకుడు 367 రోజుల పాటు..మల్లేశ్గౌడ్ 367 రోజులపాటు సుదీర్ఘంగా సైకిల్యాత్ర చేపట్టారు. మొదటి నుంచి ఫిట్నెస్పై మంచి అవగాహన ఉన్న మల్లేశ్గౌడ్ ఈ యాత్రలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా 18వేల కిలమీటర్ల యాత్రను పూర్తిచేశాడు. ప్రతిరోజూ పక్కా ప్రణాళికతో యాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు యాత్ర చేపట్టారు. ప్రతిరోజూ దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. పాలమూరులో ఘనస్వాగతం 18వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని ఈనెల 19వ తేదీన పాలమూరు నగరానికి చేరుకున్న మల్లేశ్గౌడ్ను పలువురు ఘనంగా స్వాగతం పలి కారు. జిల్లా కేంద్రంతోపాటు బోయపల్లిలో పలువురు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. -
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతాన్ని పెంచి చెరుకు రైతులను ఫ్యాక్టరి యాజమాన్యం ఆదుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ సలహాదారుడు సీహెచ్ రాంచందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. కొత్తకోట మండలంలోని ఆమడబాకుల రైతువేదికలో బుధవారం ఏర్పాటు చేసిన చెరుకు రైతుల ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొని చెరుకు రైతుల సమస్యల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్లో ప్రకటించిన సబ్సిడీలను ఈ సీజన్లో సైతం అమలు చేస్తున్న యాజమాన్యం రికవరీ శాతాన్ని 11నుంచి 12శాతానికి పెంచాలన్నారు. సబ్సిడీలను 2026 నుంచి 2027వరకు కొనసాగించాలన్నారు. కోతలకు సరిపడా మిషన్లు ఏర్పాటు చేసి 40, 50 ఎకరాల రైతులను గ్రూపులుగా చేసి కోతలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కోతలు ముగిసే వరకు నిర్ణయించిన ధరలకే కోయించాలన్నారు. చెరుకు రైతులకు ప్రమాదాలు నష్టాలు జరిగినప్పుడు ట్రాన్స్పోర్టు భరించాలన్నారు. ఫ్యాక్టరీకి పంపిన 14రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయాలని యాజమాన్యానికి విన్నవించడం జరిగిందన్నారు. చెరుకు కోతల సమయాన్ని రైతులకు ముందస్తుగా ప్రకటించడమే కాకుండా వారి పంటలను ఎప్పుడు ఫ్యాక్టరీకి తరలిస్తారనే విషయాలను వివరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఫ్యాక్టరి ఈడీ రవికుమార్, వీపీ రామరాజు, కేన్ డీజీఎం నాగార్జునరావుకు అందించామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం ఉపాధ్యక్షుడు వాసారెడ్డి, ప్రధాన కార్యదర్శి జింక రవి, చంద్రసేనారెడ్డి, ఆయా జిల్లాల చెరుకు రైతులు పాల్గొన్నారు. -
కుక్కల స్వైరవిహారం.. 9 మందిపై దాడి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశా యి. బుధవారం దాదాపు 9 మందిని గా యపర్చడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దల పరిస్థితే ఇ లా ఉంటే.. చిన్నారులు, పిల్లల పరిస్థితి ఏంటి అని, ఇప్పటికై నా పంచాయతీ అధి కారులు స్పందించి తగు చర్యలు చేప ట్టాలని గ్రామస్తులు కోరారు. పూర్తి వివరాలిలా.. బుధవారం మధ్యాహ్నం ఓ వీ ధి కుక్కల గుంపు గ్రామంలో కనిపించిన వారందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈక్రమంలో పగడాల శ్రీను, కు మ్మరి లక్ష్మమ్మ, గ్యార లక్ష్మమ్మ, ఒట్టే లక్ష్మ మ్మ, మరో మహిళ, ముగ్గురు చిన్నారులు గాయపడగా.. వీరందరూ కల్వకుర్తి ప్ర భుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారికి అక్కడే వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా, సిర్సనగండ్లలో వీధికుక్క ల బెడద తీవ్రంగా ఉందని, చిన్నారులు, పిల్లలను బడికి పంపాలన్నా, వృద్ధులు ఆరుబయట కూర్చోవాలన్నా ఎక్కడి నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయోనని భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా పంచాయతీ శాఖ అధికారులు స్పందించి వీధికుక్కల బెడద తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
టెండర్లకు నేడే చివరి అవకాశం
● మద్యం దుకాణాలపై ఆసక్తి చూపనివ్యాపారులు ● చివరి రోజుపై ఆశలు పెట్టుకున్న ఎకై ్సజ్ అధికారులు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణకు కేవలం 24గంటల సమయం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించినా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 42 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈ సారి పెంచాలని ఎకై ్సజ్ అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ–4 దుకాణాలకు 5,230 దరఖాస్తులు వచ్చాయి. గురువారం చివరి రోజు కావడంతో మరో 500 నుంచి 1000 టెండర్లు దాఖలు కావొచ్చని ఎకై ్సజ్ అధికారులు ఆశిస్తున్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
డీపీఓగా నిఖిలశ్రీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా పంచాయతీ అధికారిగా నిఖిల శ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఈమె ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వహిస్తున్న పార్థసారధిని బదిలీ చేస్తూ సపోర్టింగ్ ఆర్డర్ రాలేదని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూసేకరణకు రైతులు సహకరించాలి అడ్డాకుల: మండలంలోని ముత్యాలంపల్లి శివారులో ఉన్న రైల్వే ట్రాక్ను బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ నవీన్ పరిశీలించారు. మహబూబ్నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబుల్ లైన్ పనుల నిమిత్తం చేయాల్సిన భూసేకరణపై ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన రైతులతో అధికారులు మాట్లాడారు. రైల్వే ట్రాక్ వద్ద భూసేకరణకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలపై అడిషనల్ కలెక్టర్ ఆరా తీశారు. ట్రాక్ సమీపంలో భూములు ఉన్న రైతులతో మాట్లాడి రైల్వే డబుల్ లైన్ పనుల కోసం భూసేకరణకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. దీనికి రైతులు కూడా సమ్మతించి మార్కెట్లో ఉన్న ధర చెల్లించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రైతులకు నష్టం జరగకుండా తగిన పరిహారం అందేలా చూస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ శేఖర్, గిర్దావర్ శశికిరణ్, సర్వేయర్ పార్వతమ్మ తదితరులు ఉన్నారు. మార్కెట్ కళకళ..ధాన్యం సీజన్ ప్రారంభం దేవరకద్ర/జడ్చర్ల: ధాన్యం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు కళకళలాడుతున్నాయి. వానాకాలం పంట కింద సాగు చేసిన వరి కోత దశకు రావడంతో చాలామంది రైతులు కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట రికార్డు స్థాయిలో సాగైంది. ఒక్క కోయిల్సాగర్ ఆయకట్టు కింద దాదాపు 40 వేల ఎకరాల వరి సాగుచేశారు. అలాగే చెరువులు, బావుల కింద అదనంగా వరి పంట వేశారు. దిగుబడులు కూడా బాగా వస్తుండడంతో మార్కెట్లో సీజన్ జోరుగా సాగే అవకాశం ఉంది. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,079గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,757గా ధరలు నమోదయ్యా యి. ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ. 5,804, కనిష్టంగా రూ.5,779గా ధరలు పలికాయి. మార్కెట్కు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,521 ధరలు లభించాయి. మొక్క జొన్న గరిష్టంగా రూ.2,041, కనిష్టంగా రూ.1,600, వేరుశనగ రూ.4,331 ధరలు పలికాయి. మద్దతు ధరలు లభించేలా చర్యలు జడ్చర్ల: రైతులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇక ప్రతి బుధ, శనివారాల్లో బాదేపల్లి మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. రైతులు నాణ్యమై పత్తిని తీసుకొచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రసాదరావు, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్గౌడ్, శివకుమార్, నిత్యానందం, వెంకటయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి బాధ్యత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్, బస్స్టాండ్, తదితర ప్రాంతాల్లో పీయూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా పరిసర ప్రాంతాల్లో చెత్తను ఏరివేసి, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ సమాజంలో స్వచ్ఛత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని, ఎక్కడబడితే అక్కడ అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకూడదన్నారు. ఇళ్ల వద్ద వెలువడిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా కవర్లలో కట్టి కట్టి డంపింగ్ యార్డుకు పంపించడం వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాటికల ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీయూ కోఆర్టినేటర్ ప్రవీణ, ప్రోగ్రాం అధికారులు అర్జున్కుమార్, గాలెన్న, రవికుమార్, ఈశ్వర్, రాఘవేందర్, శివకుమార్సింగ్, ఇమానియేల్ పాల్గొన్నారు. -
మయూర వాహనంపై కురుమూర్తిరాయుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామిని మయూర వాహనంపై కురుమూర్తి కొండల్లో ఊరేగించారు. పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవింద నామస్మరణల మధ్య ఉద్దాల మండలం వరకు తీసుకొచ్చి.. తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలకమండలి చైర్మన్ గోవర్ధన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట -
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
అమరవీరులను నిరంతరం స్మరించుకోవాలి
● డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ● పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా వేడుకలు ● జిల్లాకేంద్రంలో శాంతి ర్యాలీ మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు దేశానికి అందించిన అత్యున్నత సేవలకు చిహ్నం అవుతుందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మంగళవారం పరేడ్ మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. మొదట డీఐజీ చౌహాన్తో పాటు ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇద్దరు అమరవీరుల కుటుంబసభ్యులు సైతం కంటతడి మధ్య ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ డి.జానకి గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అమరుల త్యాగం వల్లే సమాజం శాంతియుతంగా సాగుతోందని, ప్రతి రోజు వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అమరుల సేవలను గుర్తు చేసుకొని మరింత నిబద్ధతో పని చేయాలన్నారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. అమరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోలేనిది అని వారి కుటుంబాలకు పోలీస్శాఖ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. ● జిల్లాకు చెందిన రెండు అమరవీరుల కుటుంబసభ్యులతో డీఐజీ చౌహాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా? పోలీస్శాఖ నుంచి రావాల్సిన సంక్షేమ ఫలాలపై ఆరా తీశారు. శాంతి ర్యాలీ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని డీఐజీ ప్రారంభించారు. అమరవీరుల కుటుంబసభ్యులతో పాటు డీఐజీ, ఎస్పీలు ర్యాలీలో పాల్గొన్నారు. పాత బస్టాండ్, క్లాక్టవర్, రాంమందిర్ చౌరస్తా, వన్టౌన్ కూడలి వరకు నిర్వహించారు. అనంతరం అక్కడ దివంగత ఎస్పీ పరదేశినాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని ట్రాన్స్కో ఎస్ఈ పీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హనుమాన్ పుర ప్రాంతంలో ఎస్ఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడానికే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో తలెత్తే విద్యుత్ సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పాత స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు, లో ఓల్టేజీ లాంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఈ లక్ష్మన్నాయక్, మహబూబ్నగర్ టౌన్ ఏడీ థావుర్యనాయక్, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలి
● నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ విజయేందిర బోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఎన్ని గ్రౌండింగ్ లెవెల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇల్లు మార్కింగ్ చేసుకోకుండా కట్టుకోవడానికి సిద్ధంగా లేకుంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని వారి దరఖాస్తును రద్దు చేసి, మరొకరికి మంజూరు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులపై వచ్చిన మార్గదర్శకాలు పాటించాలని, ఈ కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జలశక్తి–జలాభియాన్ డేటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. సోషల్ ఆడిట్కి సంబంధించి అన్ని రికవరీలు, జరిమానాలపై దృష్టిసారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు మంజూరు చేసిన వాటిని నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీలు, సీ్త్ర నిధి రుణాలు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీఓ నరసింహులు, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, డీపీఓ పార్థసారథి, మత్స్య శాఖ ఏడీ రాధా రోహిణి, ఏపీడీలు శారద, ముషాయిర, తదితరులు పాల్గొన్నారు. ‘సిటిజన్ సర్వే’లో అందరూ పాల్గొనాలి రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ విజయేందరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వ తేదీతో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in/tela nganarising అనే వెబ్సైట్ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు. నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు మహబూబ్నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కాకుండా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా పైపులైన్లు పగిలిన వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడంపై చర్చించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా ఎస్పీడీసీఎల్ఎస్ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ డీఈ, ఏఈలు ప్రతిరోజు నీటి సరఫరాపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, గ్రిడ్ ఈఈ శ్రీనివాస్, నగర పాలక కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ఈ రమేష్, మున్సిపల్ డీఈ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
కురుమూర్తికి తరలివచ్చిన భక్తులు
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి దర్శనానికి మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని భకు ్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగిస్తూ గోవింద నామస్మరణ చేశారు. మెట్టుమెట్టుకు కొబ్బరి కాయలు కొట్టి స్వామి చెంతకు చేరారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఇబ్బంది కలుగ కుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లులు, భారతమ్మ, నాగరాజు, భాస్కర చారి ఏర్పాట్లను పరిశీలించారు. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ జట్టు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పంజాబ్లోని గురుకాసి యూనివర్సిటీ ఈనెల 24న నిర్వహించే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టౌర్నీలో పాల్గొనేందుకు ఆర్చరీ పురుషుల జట్టు మంగళవారం ప్రయాణమైంది. ఈ మేరకు జట్టు సభ్యులను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందిచి, క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో తమ ప్రతిభను చూపి పీయూకు గోల్డ్మెడల్ సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, అధ్యాపకులు కిషోర్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బల్మూర్: మండలంలోని మహాదేవ్పూర్ శివారులో ని వ్యవసాయ పొలంలో అనుమా నాస్పద స్థితి లో ఓ యువకుడి మృతదే హం మంగళవారం గుర్తించినట్లు ఎస్ఐ రా జేందర్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని జిన్కుంటకు చెందిన మదన మోని సైదులు(25)కు అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన మంజులతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. సైదులు పల్కపల్లిలోని అత్తాగారింట్లో భార్యాపిల్లలతో కాపురం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న భార్యాభర్తల మధ్య బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సైదులు ఆరోజు ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండాపోయాడు. భార్య మంజుల అచ్చంపేట పోలీస్స్టేషల్లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యారు చేసింది. మహదే్పూర్ శివారులోని చెట్లపొదల్లో మంగళవారం పశువుల కాపరులు గుర్తించలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గమనించి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి పరిశీలించగా.. మృతదేహం వద్ద బైక్, ఫోన్తోపాటు పురుగుల మందు డబ్బ, చెట్లు షర్టు కట్టి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. కాని తమ కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
దక్షిణకాశీలో అమావాస్య పూజలు
● ‘జోగుళాంబ’ఆలయంలో చండీ హోమాలు ● స్వామివారికి అభిషేక పూజలు అలంపూర్: దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అలంపూర్ క్షేత్రంలో మంగళవారం అమావాస్య పూ జలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీజోగుళాంబ అమ్మ వారి ఆలయంలో చండీ హోమాలు ని ర్వహించారు. ప్రతి అమావాస్య, పౌర్ణమితో పాటు శుక్రవారం అమ్మవారి ఆలయంలో సాముహిక చండీ హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో భక్తులు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో సందడిగా మారాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులకు ప్రసాద్ స్కీం భవనంలోని నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించారు. -
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
● నేటినుంచి కురుమూర్తిస్వామి జాతర ప్రారంభం ● 26న అలంకారోత్సవం, 28న ఉద్దాల ఉత్సవం ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం చిన్నిచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమై న అమ్మపూరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22వ తేదీ నుంచి అంగరంగా వైభవంగా కొనసాగనున్నాయి. అమావాస్య పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతా యి. వీటితోపాటు జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రా ష్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దాదాపు పదిలక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో నెలరోజులపాటు కాంఛన గుహ గోవింద నామస్మరణలతో మారు మోగుతుంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాగణమంతా రంగులు అద్దారు. అర్చకులు స్వామివారు విహరించే వాహనసేవా కార్యక్రమాల వస్తువులను శుద్ధి చేసి సిద్ధం చేశారు. స్వామివారి ప్రధాన ఆలయం, అమ్మవారి ఆలయం, రాజగోపురం తదితర వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అక్కడక్కడా హైమాస్ట్ లైట్లతోపాటు వీధిదీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మైదానంలో ఉన్న తాగునీటి ట్యాంకులు శుభ్రపరిచారు. కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నారు. జాతర ప్రాగణంలో పారిశుద్ధ్యం లోపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా మరుగుదొడ్డు నిర్మించి అక్కడక్కడా తాత్కాలిక మూత్రశాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆలయ ముఖద్వారం నుంచి ఉద్దాల గుండువరకు భారీకేడ్లు ఏర్పాటు చేసి జాతర ప్రాగణంలో సీసీ కెమరాలు అమర్చనున్నారు. 26న అలంకారోత్సవం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన మైన ఘట్టం అలంకారోత్సవం. ముక్కెర వంశపురాజులు బహూకరించిన ఆభరణాలను నెలరోజులపాటు స్వామివారికి అలకంచడం ఈ ఉత్సవ ప్రత్యేకత వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీస్ బందోబస్తు మధ్య కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం సంస్థానదీసులు రాజశ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబోరు మధ్యన కాలినడకతో కురుమూర్తి గిరులకు తరలిస్తారు. కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 28న ఉద్దాల ఉత్సవం స్వామివారి ఉత్సవాల్లో ఉద్దాల ఉత్సవం ప్రత్యేక ఘట్టం. చిన్న వడ్డేమాన్లో దళితులు వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పంపల్లి, తిర్మలాపూర్ మీదుగా ఊరేగింపుగా కురుమూర్తి గిరులకు తరలిస్తారు. ఈ ఊరేగింపులో శివసత్తుల ఆటపాటలు, గోవింద నామస్మరణ మార్మోగుతాయి. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ● 22న బుధవారం ధ్వజారోహణం, దేవత ఆహ్వానం, భేరీపూజ, అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారి కల్యాణో త్సవం, మహానివేదన, మంగళ నిరాజనం సాయంత్రం 6:15గంటలకు భూసమేత స్వామివారి మయూర వాహనసేవ నిర్వహించనున్నారు. ● 23న గురువారం ఉదయం హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:20 గంటలకు హంసవాహన సేవ. ● 24న శుక్రవారం సాయంత్రం 6:25 గంటలకు శేషవాహన సేవ. ● 25న శనివారం సాయత్రం 6:30 గంటలకు గజ వాహన సేవ. ● 26 ఆదివారం మధ్యాహ్నం స్వర్ణాభరణా లతో ఊరేగింపు అలంకారోత్సవం, రాత్రి 9:45 గంటలకు అశ్వవాహన సేవ. ● 27న సోమవారం రాత్రి 10 గంటలకు హనుమద్వాహన సేవ. ● 28న మంగళవారం ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:15గంటలకు గరుడవాహన సేవ ● 29న బుధవారం పుష్పయాగం, ప్రత్యేక పూజలు. ● 30న గురువారం ప్రత్యేక పూజలు ● 7న శుక్రవారం ఉదయం 9:45గంటలకు అలంకరణ ఆభరణాలు తీస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. కోనేరువిద్యుద్దీపాలతో ప్రవేశ ద్వారంరోజువారీ కార్యక్రమాలు -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మానవపాడు: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మా నవపాడుకు చెందిన ఆంద్రిచెట్టు ఆనంద్ (26) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగించేవాడు. అయితే తరచూ మూర్చ వస్తుండడంతో మాన సికంగా బాధపడుతూ ఉండేవాడు. అనేక ఆస్ప త్రులలో చూపించినప్పటికీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి మానవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచరం రావడంతో రైల్వే పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అశోక్కు భార్య కౌసల్య, 2 నెలల బాబు ఉన్నాడు. వాహనం ఢీ.. వ్యక్తి మృతి అయిజ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘ టన మండలంలో సోమ వారం జరిగింది. అయిజ పట్టణానికి చెందిన మాల వీరేష్ (34) స్కూల్ బస్సు డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవాడు. సోమవారం రాత్రి పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై గద్వాల వెళ్తుండగా మండలంలోని బింగుదొడ్డి గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వీరేష్కు గాయాలు కాగా స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చని పోయాడు. వీరేష్కు భార్య, కూతురు ఉండగా తోటి స్కూల్ బస్సు డ్రైవర్లు తమ వంతుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు రైతు బలి రాజోళి: మండలంలోని ముండ్లదిన్నెలో మంగళవా రం పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన చో టుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుర్వ మద్దిలేటి(42) రోజువారీగా మంగళవారం కూడా తన పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో రైతు అక్కడిక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినప్పటికీ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణం బిజినేపల్లి: అంగోతు పరెంగ (80) అనే వృద్ధుడు సో మవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని కీమ్యాతాండ గ్రా మ పంచాయతీ కేతరబండ తండా పరిధిలో జరిగింది. అంగోతు పరెంగ భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. పరెంగకు ఎనిమిది మంది కుమారులు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో కొద్ది కాలంగా మనస్థాపానికి గురయ్యాడు. తండాలోని అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటుంటే తనను ఎవరు పట్టించుకోకపోవడంతో మనోవేదనకులోనై పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్లో ఆస్పత్రిగా తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఎర్రవల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి కథనం మేరకు.. మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసులు (55) వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్థాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుని కుమారుడు రాజగోపాల్గౌడ్ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ, టిప్పర్ ఢీ : డ్రైవర్ మృతి రాజాపూర్: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన గోవింద్ (43) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సోమవారం కేరళ నుంచి హైదరాబాద్కు లారీలో లోడ్తో వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గోవింద్ కుమారుడు కౌషిక్ ఫిర్యాదు మేరకు మంగళవారం టిప్పర్ డ్రైవర్ కావలి కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తిప్పేసిన ముఖితుద్దీన్
● నిజాం కళాశాలపై సంచలన బౌలింగ్ ● ఏడు పరుగులకే 8 వికెట్లు తీసిన స్పిన్నర్ ● మహబూబ్నగర్ ఘన విజయం మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ రెండు రోజుల లీగ్లో సంచలన బౌలింగ్తో సత్తా చాటాడు. నిజాం కళాశాల జట్టుతో జరిగిన మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎండీ ముఖితుద్దీన్ 9.5 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసి రెండు రోజుల లీగ్లో జిల్లా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించాడు. ఆరుగురు బ్యాట్స్మెన్ను డకౌట్గా ఔట్ చేశారు. హైదరాబాద్లోని గ్రీన్వ్యూ–3 మైదానంలో మంగళవారం నిజాం కళాశాల జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజాం కళాశాల జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖితుద్దీన స్పిన్ జోరుకు 31.5 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన జిల్లా జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అబ్దుల్ రాఫె 23 నాటౌట్, కొండ శ్రీకాంత్ 23 పరుగులు చేశారు. 8 వికెట్లు తీసిన ముఖితుద్దీన్తో పాటు జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
వెలుగుల దివ్వెలు..
శుభ, సంతోషాలకు సూచిక.. దీపావళి ● చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు ● ఇళ్లలో లక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు ● నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు చీకటి నుంచి వెలుగు వైపు పయనిద్దామని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానానికి ప్రతీక అయిన దీపాన్ని వెలిగించి.. మనలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని ధార్మికవేత్తలు ప్రజలను మేల్కొలుపుతారు. దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. ప్రాంత భేదాన్ని అనుసరించి దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. రాజస్తాన్ మార్వాడీలకు దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దాదాపు వందేళ్ల క్రితమే రాజస్తాన్కు చెందిన మార్వాడీల కుటుంబాలు పాలమూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం చాలా కుటుంబాలు హైదరాబాద్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 150కిపైగా రాజస్తాన్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడే ఉంటున్నప్పటికీ రాజస్తాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలు జరుపుకొంటారు. ముఖ్యంగా దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధన్తేరాస్ జరుపుతారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండోరోజు రూప్ చౌదాస్ వేడుకలు ఉంటాయి. కాగా.. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదోరోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు. వీరు గుంజ, బేసన్ చక్కి, పేటతోపాటు బెల్లంతో తయారుచేసిన తీపి వంటకాలు చేస్తారు. – స్టేషన్ మహబూబ్నగర్ హైందవ పర్వదినాల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించి ప్రత్యేకంగా లక్ష్మి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున లక్ష్మీపూజతో ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. – గొండ్యాల రాఘవేంద్రశర్మ, ప్రధాన అర్చకులు, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం -
ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. యోగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని కోరారు. ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్రాజు మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు, శరణ్య, మణికంఠ, పవన్కుమార్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. కిక్బాక్సింగ్ లీగ్లో ప్రతిభ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి వరకు జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ సిటీ లీగ్లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారిణులు 57 పతకాలు సాధించారు. ఇందులో 31 బంగారు పతకాలు, 15 రజతం, 11 కాంస్య పతకా లు సాధించి లీగ్లో అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు. క్రీడాకారిణులు ప్రతిభ చాటి పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్య క్షులు కె.రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్లు అభినందించారు. ప్రథ మ స్థానంలో నిలిచిన వారు త్వరలో జరిగే జోనల్ సెలక్షన్స్కు ఎంపికవుతారని తెలిపారు. జోనల్ సెలక్షన్స్లో పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. -
వందనం
వీరులారా.. ● ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్తూపం శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ●ఉమ్మడి పాలమూరులో మావోయిస్టుల తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 1990లో కోడేరు మండలం తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ బలయ్యాడు. 1991లో వంగూరు పోలీస్స్టేషన్పై దాడి చేయగా ఖాజాపాషా అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. అదే ఏడాది కొల్లాపూర్లోని ఓ హోటల్లో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. 1993లో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్నగర్ ఎస్పీ పరదేశినాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్ఐలు కిషోర్కుమార్, శివప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాణ్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. 1994లో తలకొండపల్లి పోలీస్స్టేషన్పై మావోయిస్టులు జరిపిన దాడులో ఫయోద్దీన్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. 1996లో కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీధర్రెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. 1997లో బల్మూర్లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ నక్సల్స్ తూటాలకు బలయ్యాడు. అదే ఏడాదిలో అమ్రాబాద్ పరిధి లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్లో వెళ్తున్న ఎస్ఐ మాల్సూర్, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్ అలీఖాన్ అనే కానిస్టేబుల్ మరణించాడు. 1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు. 2000 ఏడాదిలో కానిస్టేబుల్ హన్మనాయక్ను హతమార్చారు. 2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు. అదే ఏడాదిలో ఆమనగల్ సమీపంలోని కాటన్మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు. 2002లో మన్ననూర్ పండరీ అనే కానిస్టేబుల్ చంపేశారు. 2004లో కొల్లాపూర్ ఎమ్మెల్యే గన్మెన్గా ఉన్న హుమ్లానాయక్, వెంకట్రెడ్డిలను తుపాకీతో కాల్చిచంపారు. అదే ఏడాది అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్మేన్ సుగుణాకర్ను కాల్చిచంపారు. 2005లో బాలానగర్ ఎస్ఐని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరకు ప్రకాష్ అనే కానిస్టేబుల్ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్స్టేషన్ ఎదుట నిల్చొని ఉన్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖర్నాయక్లను మావోయిస్టులు కాల్చిచంపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్ఐ అహ్మద్ మోహియుద్దీన్ను పోలీస్స్టేషన్ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు. 2006లో కొండనాగులలో జహంగీర్ అనే హెడ్కానిస్టేబుల్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిస్తున్న జోష్బాబు అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమార్చారు. అదే ఏడాది కొల్లాపూర్ పరిధిలోని సింగోటం వద్ద రమేష్ అనే కానిస్టేబుల్ మావోల తూటాలకు బలయ్యాడు. -
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వాధీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వాధీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
ఆకట్టుకుంటున్న ‘ప్రమిదలు’
దీపావళి పండుగలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. గత మూడు రోజుల నుంచి దీపాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ డిజైన్లలో దీపావళి ప్రమిదలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలోని ఏనుగొండ, పద్మావతీకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి, జిల్లా పరిషత్ ఎదుట, మల్లికార్జున్ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, క్లాక్టవర్, బస్టాండ్, పాన్చౌరస్తాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. కొంతమంది స్టాళ్ల నిర్వాహకులు కొన్ని ప్రమిదలను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తున్నారు. వివిధ డిజైన్ల ఆకర్షణీయమైన మట్టి దీపాలను తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతుండగా అక్కడి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమిదల పరిణామం, డిజైన్ను బట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గాజుతో చేసిన దీపాలు, కందీల్ దీపాలు, ఐదు క్యాండిల్స్ దీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి దీపాలు డజన్ రూ.50 నుంచి అమ్ముతుండగా.. ఇతర దీపాలు రూ.1,600 వరకు కూడా లభిస్తున్నాయి. వాటర్ ఫ్లవర్ రూ.150 నుంచి రూ.200, ఎలక్ట్రిక్ ప్రమిద రూ.200 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. -
కురుమూర్తి దారులకు మోక్షం!
● రోడ్డుకిరువైపులా ముళ్లపొదల తొలగింపు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ త్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కురుమూర్తి రహదారులన్నింటికీ అధికారు లు మరమ్మతులు చేపట్టారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత తదితర పనులు చేపట్టారు. ఆదివారం అమ్మాపురం, దేవరకద్ర, అల్లీపురం, అడ్డాకుల మండలంలోని వర్నే ముత్యాలంపల్లి, రోడ్లకు జేసీపీలను పెట్టి ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు కురుమూర్తి స్వామి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఈ సంవత్సరం ముందస్తుగానే ఆలయ అధికారులు ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. అందుకు రెండుమూడురోజుల క్రితమే పంచాయతీరాజ్ నుంచి గ్రా మా ల్లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ నుంచి నిధులు మంజూరు కా కున్న బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశతో ప్రధాన రోడ్ల మరమ్మతులు చేపట్టారు. పీఆర్ నిధులు మంజూరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామా ల్లో స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు చేపడుతారు. అందుకు ఆయా గ్రామాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. అందుకు నిధులు కూడా మంజూరు చేశారు. చిన్నవడ్డేమాన్ నుంచి అప్పంపల్లి వరకు ఉద్దాల బాటకు రూ.40వేలు, అప్పంపల్లి నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, తిర్మలాపురం సమీపం నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, కురుమూర్తి గ్రామం నుంచి అమ్మాపురం వరకు దేవుని బాటకు రూ.1.20లక్షలు, అమ్మాపురం నుంచి గ్రామ వాగుకు, కురుమూర్తి గ్రామం వరకు రూ.75వేలు, ఉంధ్యాల నుంచి చిన్నచింతకుంట వరకు రూ.70వేలు, అమ్మాపురం నుంచి గూడూరు వరకు రూ.75వేలు, అప్పంపల్లి నుంచి అమ్మాపురం, రాజోళి బాటకు రూ.1.20లక్షలు, లాల్కోట నుంచి పల్లమరి వరకు రూ.60వేలు, మద్ధూర్ నుంచి గ్రామ వాగు వరకు రూ.30వేలు, కౌకుంట్ల నుంచి పొన్నకల్, రాచాల, ఇస్రంపల్లి వరకు రూ.2లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలు పెట్టిన పనులు కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు ఆలయ అధికారులు పదిరోజుల క్రితం ఆర్అండ్బీ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. మహబుబ్నగర్, వనపర్తి డివిజన్లకు సంబంధించి మహబుబ్నగర్ జిల్లాకు చెందిన దేవరకద్ర నుంచి అమ్మాపురం, ఆత్మకూర్ వరకు, అల్లిపురం నుంచి లాల్కోట క్రాస్ రోడ్డు వరకు, దేవరకద్ర నుంచి తిర్మలాపురం, అప్పంపల్లి వరకు, దేవరకద్ర నుంచి కౌకుంట్ల, వెంకంపల్లి, కురుమూర్తి దేవస్థానం వరకు, వనపర్తి డివిజన్ చెందిన లక్ష్మీపురం నుంచి కొత్తకోట వరకు, కొన్నూర్ నుంచి నెల్విడి వరకు, మదనాపురం నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహబుబ్నగర్ డివిజన్ అధికారులు మాత్రం ఆదివారం పనులు చేపట్టారు. వనపర్తి డివిజన్వారు ఇంకా పసనులు చేపట్టలేదు. -
కారు ఇంజిన్లో మంటలు
జడ్చర్ల: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే గమనించి కారును నిలిపి వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి జడ్చర్ల సిగ్నల్గడ్డ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజన్లో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును వెంటనే నిలిపి పరిశీలిస్తుండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు నీటిని చల్లి మంటలను ఆర్పారు. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పాముకాటుతో గొర్రెల కాపరి మృతి నవాబుపేట: మండలంలో ని కూచూర్లో గొర్రెల కా పరి పాము కాటుతో మృతి చెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈ ఘటన వివ రాలు ఇలా.. కూచూర్కు చెందిన చిన్న మల్లయ్య (55) శనివా రం గొర్రెలను ఎప్పటి మాదిరిగా మేతకు తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో పాము కాటువేయగా అంతగా పట్టించుకోలేదు.ఏదో పురుగు అని ధీమాగా ఉన్నాడు.తీరా ఇంటికి వచ్చే సరికి విషం ఎక్కడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంత రం బాధిత కుటుంబ సభ్యులు అస్పత్రికి తరలించే లోగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చోరీకి పాల్పడిన దొంగకు దేహశుద్ధి కొత్తపల్లి: తాగిన మైకంలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి గమనించిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మద్దూరు మండలంలోని పెద్దిరిపాడు తండాకు చెందిన రాజునాయక్ కొత్తపల్లిలోని ప్రధాన చౌరస్తా వద్ద శివాలయంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ.1,450 నగదు అపహరించడంతోపాటు ఆలయం ముందున్న బోరు మోటరు కేబుల్ వైరును కటింగ్బ్లేడ్తో కట్ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజునాయక్ తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో అప్పటినుంచి తాగడానికి డబ్బుల్లేక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ తాగునీటికి కటకట
జిల్లాకేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు పట్టుకుంటున్న ప్రజలు జడ్చర్ల పరిధిలోని నాగసాల వద్ద మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు మరమ్మతు చేస్తుండటంతో జిల్లాకేంద్రంలోని 35 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు రోజులుగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా మున్సిపల్ అధికారులు నిత్యం 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. ధర్మాపూర్ వద్ద మరోసారి మిషన్ భగీరథ పైపులైన్కు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని మరమ్మతు చేయడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. దీంతో నగరంలో మంగళవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. – మహబూబ్నగర్ మున్సిపాలిటీ -
జిల్లాకేంద్రంలో దీపావళి సందడి..
పాలమూరు పట్టణంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. షాపుల్లో కూడా దీపావళి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రత్యేకంగా పూల స్టాళ్లు వెలిశాయి. జడ్చర్ల టౌన్: దీపావళి సందర్భంగా గోగునార కట్టలతో చేసిన దుందువాతో దిష్టి తీస్తారు. జడ్చర్ల మండలంలోని చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. పొలాల్లో ఉన్న జీనుగ, పుంటికూర (గోగునార) కట్టెలు తీసుకువచ్చి వాటిని కట్టలా తయారు చేసి చిన్న చిన్న గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి దిష్టితీయడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని వాడుక భాషలో దుందువాగా వ్యవహరిస్తారు. దిష్టి తీశాక పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడం చేస్తారు. దీన్ని ఉల్కాదానంగా పిలుస్తారు. పితృదేవతలకు దక్షిణ దిక్కుగా దీపం వెలిగించడం వల్ల స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపినట్లవుతుందని భావిస్తారు. దీపం వెలిగించాక పిల్లలు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చి పూజాగృహంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కారం చేయాలి. సోమవారం సాధారణ నోములు, వ్రతాలు, లక్ష్మీపూజలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారు మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారమే చతుర్దశి కూడా ఉండడంతో ఉదయం భోగి మంగళహారతులు స్వీకరించి.. సాయంత్రం నోములు చేసుకోనున్నారు. ● లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువైన గంగాపురం గ్రామంలో పెద్ద దుందువాతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కార్తీక పాడ్యమి రోజున ఈ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది బుధవారం రోజున దుందువా వేడుకలను జరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు● ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు ● తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ● ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
● హానికర బాణాసంచాకు దూరంగా ఉండాలి ● చిన్నారులతో జాగ్రత్త ● పర్యావరణ హితమే మేలు మహబూబ్నగర్ క్రైం: వెలుగు పూలు పూయించే దీపాల పండగ దీపావళి కొందరికీ సంతోషాన్ని.. మరికొందరికి అనారోగ్యాన్ని మోసుకొస్తోంది. ఆనందం కోసం కాల్చే టపాసులు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ప్రాణికోటి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. ఇదే సమయంలో మోతల మాటున శబ్ద కాలుష్యం, వెలుగుల మాటున రసాయన కాలుష్యం వెదజల్లుతూ ప్రకృతికి హాని కల్గిస్తోందన్న వాదన ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణీత సమయం వరకు టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ శబ్దలు వింటే.. టపాసులు కాల్చే సమయంలో ఎంతో ఆనందిస్తాం. కానీ అవి విడుదల చేసే వాయువులు, దుమ్ము, శబ్దాలు ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. వాతావారణం పూర్తిగా నాశనం అవుతుంది. ఎక్కువ శబ్దం వచ్చే టపాసులు కాల్చడం వల్ల చెవులకు హని కలిగే ప్రమాదం ఉంది. మనిషి సాధారణంగా వినే శబ్దాల తీవ్రత 60 నుంచి 65 డెసిబుల్స్ మధ్య ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీవ్రత కల్గిన శబ్దాల వల్ల మనిషి వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిసస్తునన్నారు. గాలిలో కలుస్తున్న దుమ్ము కణాలు దీపావళి పండగ సందర్భంగా వారం రోజుల పాటు కాల్చే టపాసుల కారణంగా శబ్దాలే కాకుండా పొగ, దుమ్ము, దూళి గాలిలో పెద్ద మొత్తంలో కలుస్తాయి. నేల మీద టపాసులు పేలినప్పుడు ఆ శబ్దాల తీవ్రతకు దుమ్ము ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలిలోకి చేరుతుంది. మహబూబ్నగర్ పట్టణంలో సాధారణ రోజులల్లో రోడ్లపై దుమ్ము కణాలు 30 నుంచి 35 ఆర్ఎస్పీఎం (రెస్పిరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులేట్ మ్యాటర్) శాతంగా ఉంటాయి. అదే దీపావళి రోజు 52శాతం వరకు చేరుతున్నట్లు సమాచారం. గాలిలో 50 శాతం దుమ్ము కణాలు ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంతో జాగ్రత్త వినలేని శబ్దాలను అదే పనిగా వింటూ ఉండటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారి ఆరోగ్యానికి ఇలాంటి శబ్దాలు మరింత ప్రమాదకరం. ముఖ్యంగా పెద్ద శబ్దాలు వినడం వల్ల తలనొప్పి, రక్తపోటు, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మైగ్రేన్తో బాధపడేవారికి శబ్దాలు వింటే రెండు గంటల పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. శబ్ద ప్రభావం పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు టపాసులు కాల్చే సమయంలో వచ్చే పొగ ఎక్కువగా మనుషులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ముక్కు, నోటికి మాస్క్, చెవుల్లో దూది లాంటివి పెట్టుకోవడం మేలు. టపాసుల నుంచి వచ్చే కా లుష్యం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించాలి. దగ్గర ఉండి కాల్చకండి.. దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడానికి రూ.వేలు ఖర్చు చేసి అధిక స్థాయిలో టపాసులు కొనుగోలు చేస్తారు. వాటిని దగ్గర నుంచి కాల్చడం వల్ల 91 డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాలను స్పష్టంగా వినిపిస్తాయి. 100 డెసి బు ల్స్ తీవ్రత గల శబ్దాలను 15 నిమిషాల వరకు.. 112 డెసిబుల్స్ శబ్దాలను ఒక నిమిషం పాటు వినగలం. 140 డెసిబుల్స్ శబ్దం మనుషులు వింటే వినికిడి శక్తి కొంత మేరకు కోల్పోవడానికి అవకాశం ఉంది. తీవ్రమైన శబ్దం వచ్చే బాణాసంచా 140 నుంచి 150 డీబీ శబ్ద తీవ్రత విడుదల చేసే ప్రమాదం ఉంది. శబ్ధాలతో ప్రమాదం టపాసులు కాల్చుతున్న సమయంలో అతి ధ్వనులనిచ్చే వాటికి దూరంగా ఉండాలి. భారీ శబ్దాల కారణంగా కర్ణభేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోవాల్సి వస్తోంది. దీపావళి సమయంలో ఇలాంటి వారు చాలా మంది చికిత్స కోసం వస్తుంటారు. బాణాసంచా నుంచి వెలువడే హనికర రసాయనాల ద్వారా పొగతో ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ సందీప్కుమార్, పల్మానాలజిస్ట్ -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బల్మూర్: ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పంజుగుల మనోహర్(24) ఐదేళ్లుగా ఆటో నడుపుతై జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి ఇటీవల అనారోగ్యంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఐదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి బాత్రూంకు వెళ్లి ఎంతకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించిగా ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి సుల్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హన్వాడ: మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కమ్మరి వెంకటేష్ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అప్పులు కూడా పెరిగడంతో వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇటీవలే కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. శుక్రవారం తాను నిర్వహిస్తున్న కార్పెంటర్ షాపునకు వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఇంటికి రాకపోవడంతో భార్య సుకన్య షాపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో వెంకటేష్ విద్యుత్ వైర్లతో ఉరేసుకుని మృతి చెందడాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించింది. ఎస్ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య జడ్చర్ల: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శికార్గానిపల్లిలో చోటుచేసుకుందని సీఐ కమలాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శికార్గానిపల్లికి చెందిన మండ్ల శైలజ అలియాస్ గుడిసె లాస్య(27) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మూసాపేట మండలం జానంపేటకు చెందిన వెంకటేశ్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ముగ్గురు కుమారులు అనారోగ్యానికి గురైనా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వరుసగా మృతిచెందారు. దీంతో లాస్య శికార్గానిపల్లిలోని తల్లి మండ్ల జయమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. తనకు అదనంగా కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారకుడైన వెంకటేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాస్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తల్లిదండ్రులకు పాదపూజ
అడ్డాకుల: మండలంలోని కందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మా తృపూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడే తపణను ఆయన వివరించారు. హెచ్ఎం మురళీధర్, నిర్వాహకులు అని ల్ భగవత్, సంభూపాల్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్శర్మ, జనార్దన్రెడ్డి, చంద్రశేఖర్, విజయ్కుమా ర్, జయశ్రీ, శ్రీదేవి, గోపాల్, నాగమణి, అనిత పాల్గొన్నారు. -
ఉత్సాహంగా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంరటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్లో ఉమ్మడి జిల్లాతో వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది బాలికలు పాల్గొన్నారు. పోటీలను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రీడలను ప్రాక్టిస్ చేయాలని తద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. సెల్ఫోన్కు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు. మహబూబ్నగర్ క్రీడాపోటీల నిర్వహణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. డీవైఎస్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ సిటీ లీగ్ పెట్టడం జరిగిందన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్లు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిభచాటిన వారు త్వరలో జరిగే జోనల్ స్థాయి సెలక్షన్స్లో పాల్గొంటారని చెప్పారు. జోనల్ స్థాయిలో మెడల్స్ సాధించేవారు జాతీయస్థాయి పోటీలకు వెళ్తారని, నగదు పారితోషికాలు ఉంటాయన్నారు. నిరంతరం కిక్బాక్సింగ్ ప్రాక్టిస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్సోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, రవినాయక్, భరత్, కనకం యాదవ్, శేఖర్, నర్సింగ్రావు, తిరుపతి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలు.. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాలు, టీం వెపన్, టీం కతాస్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రియేటివిటీ ఫాంలో మహబూబ్నగర్ జట్టు భావన వర్షిణి, కె.క్రితిజ్ఞ, రిత్వికారెడ్డి ప్రథమ (మహబూబ్నగర్) ప్రథమ, శ్రీహిత, అవిశృతి– ద్వితీయ (మహబూబ్నగర్), హార్డ్ స్టైల్ ఫాంలో రితిక ప్రథమ, గోమతి (ద్వితీయ), ఆరోహి (తృతీయ), మ్యూజికల్ ఫాంలో హారికారెడ్డి ప్రథమ, వర్షిణి ద్వితీయ స్థానాల్లో నిలిచారు. -
వేలూరు రైల్వేస్టేషన్లో గట్టువాసులు
గట్టు: మండలానికి చెందిన మూగవారు తప్పిపోయి తమిళనాడులోని వేలూరు రైల్వేస్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు, మహిళ, ఇద్దరు పిల్లలను వేలూరులో రైల్వే పోలీసులు గుర్తించి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని.. ఏ ప్రాంతం వారని ఆరా తీసినట్లు సమాచారం. వారంతా మూగవారు కావడంతో అతికష్టం మీద వారి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే తమది జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ప్రాంతమని పేపర్పై రాసి ఇవ్వడంతో.. రైల్వే పోలీసులు శనివారం గద్వాల ఆర్డీఓకు సమాచారం అందించారు. ఈ మేరకు వేలూరు రైల్వే స్టేషన్లో కనిపించిన వారి ఫొటోలను గట్టు తహసీల్దార్ విజయ్కుమార్కు పంపించి.. గుర్తించాల్సిందిగా చెప్పారు. రెవెన్యూ అధికారులు సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులకు వీరి ఫొటోలను ఫార్వర్డ్ చేశారు. వారు ఎవరనే విషయాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు.


