breaking news
Mahabubnagar District News
-
రైతులకు ఉచిత న్యాయ సాయం
దేవరకద్ర: రైతులు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, జిల్లా జడ్జి ఇందిర తెలిపారు. మంగళవారం దేవరకద్ర రైతువేదికలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రైతులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, రైతుల హక్కులు, సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న న్యాయసేవలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి సంబంధించిన వివాదాలు, ఇతర న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించాలని జడ్జి సూచించారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాజేందర్ అగర్వాల్, శివకుమార్, హరీష్, ప్రణిత రైతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి మల్దకల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప(50) మంగళవారం పత్తి పంటకు నీరు పె ట్టేందుకు బోరు మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో అప్పటికే తెగి పడిన విద్యుత్ వైరు తగిలి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంకరమ్మ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య గోపాల్పేట: భార్యతో గొ డవ పడి క్షణికావేశంలో భ ర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాల మేరకు.. గోపాలపేటలోని హనుమాండ్లగడ్డ కాలనీకి చెందిన కొంకలి సుక్కన్న, కర్రె శాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు శివుడు (33)కు భార్య యాదమ్మ తో 10 రోజుల క్రితం గొడవ జరగగా.. ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మాట్లాడి సోమ వారం గోపాల్పేటకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరగగా.. శివుడు ఉరేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి త లుపులు గొళ్లెం పెట్టుకున్నాడు. గతంలో బెది రించినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని అందరూ బయట కూర్చొని ఉన్నారు. చాలాసేపటి వరకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శివుడు ఉరేసుకుని కనిపించాడు. శివుడికి భార్యతో పాటు కుమార్తె ఉంది. శివుడు అన్న మల్లయ్య రెండేళ్ల క్రితం ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివాహిత బలవన్మరణం లింగాల: మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని పద్మ(38)ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు.. మతిస్థిమితం లేని ఆమె కుటుంబసభ్యులతో గొడవపడి క్షణికావేశానికి గురై గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుంది. మృతురాలు గతంలోనూ రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త సౌడమోని సురేష్, నలుగురు సంతానం ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. -
విధులకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
● బైక్, బస్సు ఢీ: యువకుడి దుర్మరణం ● వివాహమైన రెండు నెలలకే ఘటన ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రాజాపూర్(బాలానగర్): విధులకు ఆలస్యమైందనో.. సమయానికి విధులకు హాజరు కావాలనో.. అతివేగంగా బైక్పై వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు దుర్మరనం చెందాడు. వివాహమైన రెండునెలలకే అతని ఆయుష్సు మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అనంతవాయువులో కలిసిపోయింది. వివరాలిలా.. బాలానగర్ మండలం వీరన్నపల్లికి చెందిన అరవింద్(25) బాలానగర్ మండలంలో మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం వీరన్నపల్లి నుంచి 1:45నిమిషాలకు బయలుదేరి బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద మధ్యాహ్నం 2గంటలకు విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇంటినుంచి బైక్పై బయలుదేరిన 20నిమిషాల్లోనే ఉడిత్యాల శివారులో షాద్నగర్ నుంచి నవాపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి రెండునెలల క్రితం నవాపేట మండలం ధరిపల్లికి చెందిన యువతితో వివాహమైందని గ్రామస్తులు తెలిపారు. ప్రాణాలు కాపాడని హెల్మెట్ బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధనలున్నా.. విధులకు వెళ్తూ.. విధిగా తలకు హెల్మెట్ ధరించినా.. అరవింద్ ప్రాణాలను కాపాడ లేకపోయింది. తండ్రి లేకపోయినా ఉమ్మడి కుటుంబంగా అన్నదమ్ములు కలిసి మెలిసి ఉన్న కుటుంబంలో ఇలా తన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మృతిచెందాడన్న వార్త విన్న అన్న రాఘవేందర్, తల్లి, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలిసిన బాలానగర్ ఎస్ఐ నరేందర్రెడ్డి ప్రాథమిక విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వారసత్వ సంపద పరిరక్షణ మనందరి బాధ్యత
● బీఆర్ఆర్ కళాశాలతో వారసత్వ శాఖ ఎంఓయూ ● విద్యార్థులకు చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలపై అవగాహన జడ్చర్ల టౌన్: ప్రాచీన కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్య త అని ప్రభుత్వ వారసత్వ శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్రావు అన్నారు. మంగళవారం జడ్చర్లలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో వారసత్వ శాఖ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు వారసత్వ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంతోపాటు పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంఓయూ చేసుకున్నట్లు అర్జున్రావు తెలిపారు. ఇందులో భాగంగా వారసత్వ ప్రదేశాల సందర్శనలు, ఫీల్డ్ స్టడీస్, పరిశోధనలు, వర్క్షాప్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య, చరిత్ర శాఖ అధ్యాపకులు డా.రాఘవేందర్రెడ్డి మాట్లాడుతూ.. యువతలో వారసత్వ పరిరక్షణపై బాధ్యత పెంపొందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించేందుకు విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం వారసత్వ శాఖ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లునాయక్, ఓఎస్డీ రాజులు తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు.. ఆస్తి కోసం రెండు హత్యలు
● ఒకరిని వాహనంతో ఢీకొట్టి.. మరొకరిని కత్తితో గొంతుకోసి.. ● వేర్వేరు హత్య కేసులను ఛేదించిన నాగర్కర్నూల్ పోలీసులు కందనూలు: ఆస్తిపై ఆశ.. డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికాగా.. పోలీసులు రెండు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఒక ఘటనలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను బొలేరో వాహనంతో ఢీకొట్టి హత్య చేయగా.. మరో ఘటనలో తోడికోడలికి చెందిన భూమి, బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసిన మహిళ ప థకం ప్రకారం ఆమెను హత్య చేసింది. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను నాగర్కర్నూల్ డీఎస్పీ బర్రి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిందని.. తాడూరుకి చెందిన వెనుపోతుల భీమయ్య బొలేరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వివిధ పనుల కోసం కూలీలను వాహనంలో తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ(40) 15 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా 19ఏళ్ల కుమారుడితో కలిసి గ్రామంలోనే ఉంటుంది. సందర్భానుసారంగా వ్యవసాయ పనుల నిమిత్తం కూలీ పనికోసం భీమయ్య దగ్గరకు వస్తూ ఉండేది. ఆ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. బంగారమ్మ తన అవసరాల నిమిత్తం అర ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని భీమయ్యకు ఇచ్చింది. అంతేకాకుండా తన బంగారు ఆభరణాలను కుదవపెట్టి బ్యాంకులో తీసుకున్న డబ్బును కూడా అతడికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే భీమయ్య కొంతకాలంగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నెల 15న బంగారమ్మ ఫోన్ చేసి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా కోరింది. దీంతో ఆమెను తాడూరులోని వ్యవసాయ పొలం వద్దకు రావాలని భీమయ్య చెప్పాడు. అక్కడికి చేరుకున్న అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భీమయ్య బొలేరోతో బంగారమ్మను ఢీకొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బంగారమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు తాడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిని గుర్తించి భీమయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భూమి.. నగలపై కన్నేసి.. బిజినేపల్లి మండలం ఇప్పలతండా పంచాయతీలోని బొర్సుగడ్డతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె భర్త జంపాలియా మూడేళ్ల క్రితం మృతిచెందాడు. చిట్టెమ్మకు నలుగురు తోడికోడళ్లు ఉండగా.. తన పొలాన్ని వారికి కౌలుకిచ్చింది. వారిలో పెద్ద యారాలు కేతావత్ హీరమ్మకు చిట్టెమ్మ భూమి, బంగారు, వెండి ఆభరణాలపై ఆశ ఏర్పడింది. చిట్టెమ్మను హత్య చేసేందుకు ముందుగానే పథకం రచించింది. ఈ నెల 15న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి సారాను తీసుకుని అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి సారా తాగగా.. చిట్టెమ్మ మత్తులో పడిపోయింది. ఇదే అదనుగా భావించిన హీరమ్మ కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేసింది. అనంతరం చిట్టెమ్మ కాళ్లకున్న వెండి కడియాలు, ఇతర ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి అన్న కొడుకు ముడావత్ వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు హీరమ్మపై అనుమానం ఉందని వినోద్ పోలీసులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో హీరమ్మ తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి, తాడూరు ఎస్ఐ రాములు, బిజినేపల్లి ఎస్ఐ షంషోద్దీన్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. -
పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సెమిస్టర్–1, 2 పరీక్షలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా పీయూ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షకు మొత్తం 687 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 683 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అబ్జర్వర్ కుమారస్వామి, మొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని శ్రీసరస్వతీ శిశు మందిరంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖేల్కూద్ (క్రీడాపోటీలు) మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ క్రీడాపోటీల్లో ఆయా శిశుమందిరా ల నుంచి దాదాపు 1600కిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో పోటీలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, యోగాసన, వాలీబాల్, అథ్లెటిక్స్ అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ క్రీడాపోటీలకు హాజరుకావడం అభినందనీయమని అన్నారు. తన కుటుంబంలో కూడా అన్న సరస్వతి శిశుమందిరంలో చదువుకున్నారని, ఆ సంస్థలో నేర్పించే విలువలు, క్రమశిక్షణను తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సరస్వతి విద్యాపీఠంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరిమిత వేతనాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎంతో నిబద్దతతో పనిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మా ల మమత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దక్షిణమద్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరావు, దేవేంద్రరాజు, అశోక్రెడ్డి, యుగేంధర్రెడ్డి, రాంరెడ్డి, గంగాధర్ యాదవ్ పాల్గొన్నారు. -
జోగుళాంబదేవికి విశేష పూజలు
అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదో పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరిగి 40 రోజులు(మండలం) రోజులు అయిన నేపథ్యంలో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక హోమాలు చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. మండల పూజలు మూడు రోజులపాటు జరగనునున్నట్లు కార్యనిర్వాహణ అధికారి పేర్కొన్నారు. అలంపూర్ -
పాలిటెక్నిక్ల విలీనంపై నిరసన
● ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావద్దని ఏబీవీపీ ఆందోళన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దే ప్రత్యేక విద్యావ్యవస్థ అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నవీన్, మణిశంకర్, నరేష్, కార్తీక్, రఘు, చరణ్, భరత్, అనిల్ పాల్గొన్నారు. -
గాజులపేటలో కలెక్టర్ కొరడా!
మహబూబ్నగర్ రూరల్: గ్రామపంచాయతీ పాలనలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. మంగళవారం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. పంచాయతీ తీర్మానాలు లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీవిగా ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించిన కలెక్టర్.. కార్యదర్శి చంద్రశేఖర్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నకిలీ తీర్మానాలపై ఆగ్రహం పంచాయతీ రికార్డులు, నిధుల వినియోగానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం తీర్మానాలు లేకుండానే నిధులు ఖర్చు చేసినట్లు గుర్తించారు. కొన్ని తీర్మానాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై ఆరా తీశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. గ్రామంలో దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ మిషన్లపైనా వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని మిషన్లు ఉన్నాయి, వాటి నిర్వహణ రిజిస్టర్లు, వినియోగించిన వివరాలను పరిశీలించారు. పంచాయతీ ఆస్తులు, నిధులు, రికార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. విద్యార్థులతో ముఖాముఖి గాజులపేట జెడ్పీహెచ్ఎస్ను సందర్శించిన కలెక్టర్ అక్షయపాత్ర ద్వారా అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ పాఠం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా, ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తరగతి గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, లైట్ల సౌకర్యంపై ఆరా తీశారు. ప్రతి గదిలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నాణ్యమైన విద్య అందేలా చూడాలని సూచించారు. పంచాయతీ నిధుల వినియోగంలోఅక్రమాలు.. నకిలీ తీర్మానాలపై ఆగ్రహం కార్యదర్శి సస్పెన్షన్కు ఆదేశం.. రికార్డులపై లోతుగా ఆరా జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కొనసాగించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తెలంగాణచౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాలను అమలు చేయొద్దనే ఉద్దేశంతోనే కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహిళలకు పెంచిన పింఛన్, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్, దేవేందర్రెడ్డి, కరుణాకర్ గౌడ్, రెహమాన్, ఆంజనేయులు, నరేందర్, లక్ష్మయ్య, గణేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
● పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ● బాలానగర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ జానకి రాజాపూర్ బాలానగర్): శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ జానకి సూచించారు. మంగళవారం బాలానగర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఆమె.. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల స్వీకరణ, బీట్ వ్యవస్థ, రాత్రి గస్తీ తదితర అంశాలను పరిశీలించారు. ఎస్ఐ నరేందర్రెడ్డితో స్టేషన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించిన ఎస్పీ.. ప్రజల ఫిర్యాదులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు కోర్టు కేసుల్లో సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని సూచించారు. మండలకేంద్రంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అధిక వేగం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షర, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. మంగళవారం డీఈఓ విజయకుమారి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలతోపాటు కాంప్లెక్స్ పాఠశాలల్లోనూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: హన్మకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్జోన్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 20న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో ఎంపికలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రాలతో సి.శ్రీనివాస్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాలకు 9849706360, 9492177535 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ముఖ్యం మహబూబ్నగర్ రూరల్: మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సీడీపీఓలు, సూపర్వైజర్లతో వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, లబ్ధిదారుల హాజరు, జీరో బెనిఫిషియరీ కేంద్రాల వివరాలను పరిశీలించారు. కేంద్రాలకు ఏ, బీ, సీ గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. టీహెచ్ఆర్ పంపిణీ, ఎఫ్ఆర్ఎస్, సమ్మాన్ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వీబీజీ రామ్ కింద చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వసతులను గుర్తించి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ క్రిస్టియానా, డీడబ్ల్యూఓ జరీనాబేగం పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంపై జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఐక్యత, సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు.ఐక్యత, సమన్వయం, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నారాయణపేట జిల్లా ఇన్చార్జి శివారెడ్డి, మేయర్ గుమ్మాల మమత, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పసుల రాజు, జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ ఫయాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్ అహ్మద్, జిల్లా ఓబీసీ చైర్మన్ తిరుపతయ్య పాల్గొన్నారు. ● కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పీఏసీ సమావేశానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై ఏఐసీసీ కార్యదర్శి నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చ జరిగిందన్నారు. ప్రతినెల ఒక రోజు పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంతవరకు అమలయ్యాయి, వాటి ఫలితాలు ఏమిటి అనే అంశాలపై తదుపరి సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా పీఏసీ సమావేశంలో సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు -
సీటుంది.. వసతి లేదు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పోటీపడి సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేదన్న కారణంతో పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త హాస్టళ్లు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. లా, ఇంజినీరింగ్లో సీట్లు ఖాళీ లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు 140 సీట్లకు రెండు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా 97 మంది చేరారు. 43 మంది సీట్లను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది మాత్రమే చేరగా.. 53 మంది సీట్లు వదులుకున్నారు. ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్లో ఈ ఏడాది పలు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించినా 180 సీట్లకు 125 మంది మాత్రమే చేరారు. 55 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు ఉన్నాయి. వీటిలో హాస్టల్ వసతి లేని కారణంగా, ముఖ్యంగా బాలికలు సీట్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే స్పాట్ అడ్మిషన్లలో చేరే విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం ఉండదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఖర్చవుతోంది యూనివర్సిటీలో సీటు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్ లేకపోవడంతో బయట రూమ్ లేదా ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తోంది. దీనికి నెలనెలా చాలా ఖర్చవుతోంది. యూనివర్సిటీకి వచ్చి వెళ్లేందుకు కూడా అదనపు వ్యయం అవుతోంది. హాస్టల్ సదుపాయం కల్పించాలని గతంలో వీసీతోపాటు పలువురు అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదు. – రాజ్కుమార్, జగిత్యాల వసతి కల్పించాలి లా, ఇంజినీరింగ్ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలి. బయట రూమ్లో ఉంటే అద్దె, భోజనం, రాకపోకల ఖర్చులు కలిపి నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోంది. హాస్టల్ సదుపాయం ఉంటే ఈ భారం తగ్గుతుంది. ఈ ఏడాదైనా ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి. – చిరంజీవి, జగిత్యాల ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ప్రత్యామ్నాయం చూపరా? కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. గతంలో హాస్టల్ భవనం అందుబాటులో లేని సమయంలో అప్పటి వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ చొరవతో జిల్లా కలెక్టర్ అనుమతితో సమీపంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్గా వినియోగించిన విషయాన్ని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్తోపాటు పరిసరాల్లోని కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వాటిని ప్రత్యామ్నాయ వసతిగా వినియోగించే ప్రయత్నం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పీయూలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని లా కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ తరగతులకు హాజరు కావడం తప్పనిసరి అయినప్పుడు వసతి లేకుండా ఎలా చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్ లేదా రూములో ఉంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది పీయూలోని బాలికల హాస్టల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. 680 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. అంటే సామర్థ్యానికి మించి 190 మందికిపైగా అదనంగా ఉంటున్నారు. ఒక్కో గదిలో నలుగురు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఉన్న హాస్టళ్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల భారం బాలికల హాస్టల్లో సామర్థ్యానికి మించి 200 మందికిపైగా ప్రత్యామ్నాయాలపై అధికారుల చొరవ కరవు నిర్మాణంలో కొత్త హాస్టళ్లు.. అప్పటివరకు అవస్థలే! -
సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పరిశీలించిన ఎస్పీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రి యలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 21 మంది, నాగర్కర్నూల్ జిల్లా నుంచి 21 మంది, వనపర్తి జి ల్లా నుంచి 14 మంది, గద్వాల జిల్లా నుంచి 14 మంది, నారాయణపేట జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 84 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి.జానకి పరిశీలించారు. అభ్య ర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించి ఎలాంటి తప్పులు జరగకుండా సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓరుక్మిణీ భాయ్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
109.561 ఎంయూ విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లద్వారా 234 మెగావాట్లు, 62.279 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 47. 282 మిలియన్ యూనిట్ల విద్యుదు త్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 109.561 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 43 వేల క్యూసెక్కులను వినియోగించి దిగువ శ్రీశైలంకు వదులుతున్నామని తెలిపారు. -
ఏడుగురు దేవతలు
లంబడా తెగ గిరిజనులకు ఏడుగురు సీ్త్ర దేవతలు ఉన్నారు. మెరామ, హింగళ, తుల్జా, కేంకాళి, తీజ్, మత్రాళ్, సీత్త అనేవి దేవతల పేర్లు మీదుగా నిర్వహించే ప్రధాన పండుగలు. మెరామ దేవత తండాను రక్షిస్తే, తీజ్ దేవత పంటలను కాపాడుతుందని నమ్ముతారు. సీత్త దేవత పశు సంపదను వృద్ధి చేస్తుందని, మత్రాళ్ దేవత పిల్లలు అంటువ్యాధులబారిన పండకుండా రక్షిస్తుందని విశ్వసిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే బంధువులంతా పండుగల సందర్భంగా కలుసుకొని అత్మీయత, అనురాగాలను పంచుకుంటారు. యుక్త వయస్సున్న గిరిజన యువతులు విద్యా, ఉద్యోగ, సంసారిక జీవితంతోపాటు పుట్టినింటితోపాటు మొట్టినిల్లు కూడా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో తులతూగాలని ప్రతిఏటా మొలకల పండుగను నిర్వహిస్తారు. తరతరాల నుంచి గిరిజన తండాల్లో గిరిజనులు జరుపుకొనే పండుగలలో ఇది ముఖ్యమైంది. పుట్టిన ప్రతి గిరిజన యువతికి పెళ్లి జరిగే నాటికి తీజ్ను ఆ కుటుంబ సభ్యులు నిర్వహించడం ఆనవాయితీ. -
జడ్చర్లలో చైన్ స్నాచింగ్
● టీ తాగేందుకు వచ్చి పుస్తెల తాడు అపహరణ ● మోటార్ బైక్పై దొంగల పరారీ జడ్చర్ల: పట్టణంలో టీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉదయకళ టీకొట్టు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు యమహా ఆర్ 15 బైక్పై టీకొట్టు వద్దకు వచ్చారు. ఒక యువకుడు బైక్పైనే ఉండగా.. మరో యువకుడు టీ కొట్టు దగ్గరకు వెళ్లి సిగరెట్ తీసుకున్నాడు. టీ కావాలంటూ అడుగగా సదరు మహిళ టీ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీ ధర ఎంత అని అడిగాడు. టీ ధర రూ.10 అనగానే అమ్మో అంతనా అంటూ మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును తెంపుకొని బైక్పై కొత్త బస్టాండ్ వైపు పారిపోయారు. వెంటనే మహిళ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పుస్తెలతాడు 3 తులాలు ఉంటుందని బాధిత మహిళ వాపోయింది. విషయం తెలుకున్న ఎస్ఐ ఖాదర్ ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల్లో వారు పారిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. విచ్చలవిడిగా పోకిరీలు అయితే కొన్ని నెలలుగా జడ్చర్ల పట్టణంలో పోకిరీలు మోటార్ బైక్లపై స్టంట్లు చేస్తూ.. సైలెన్సర్ల మోత మోగిస్తున్నారు. బాంబులు పేలుతున్న శబ్దాలను చేస్తూ రోడ్లపై దూసుకుపోతున్నారు.గంజాయి, తదితర మద్యం మత్తులో పెట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా టీ కొట్లు వీరికి అడ్డాలుగా మారాయి.టీ షాప్ల్లో సిగరెట్ల చాటున గంజాయి తాగి రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ మచ్చుకై నా కానరావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. -
శ్రామిక్ పోస్టుల భర్తీలో అన్యాయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఏడాది క్రితం ఆర్టీసీ శ్రామిక్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ సోమవారం ఆర్ఎం కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అప్రెంటిస్ చేసిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రకటించిన నోటిఫికేషన్ మేరకు తాము దరఖాస్తు చేసుకున్నామన్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో తమకు వెయిటేజీ ఇవ్వకుండా ఆర్టీసీలో అప్రెంటిస్ చేయని వారితోపాటు ప్రైవేట్ సంస్థలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. తాము రెండేళ్ల పాటు సంస్థలో అప్రెంటిస్ చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్నారు. -
మహిళ దారుణహత్య
● ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఘాతుకం? ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చిరుత దాడిలో మేకలు మృతి గండేడ్: పట్టపగలు చిరుత మేకలపై దాడి చేయడంతో మూడు మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే గండేడ్ మండల పరిధిలోని కొండాపూర్కు చెందిన చెన్నారం పక్కీరప్ప పొలం దగ్గరే ఉంటూ మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారిలో భాగంగా సోమవారం మేకలను మేపడానికి వెళ్లాడు. రాయిని చెరువు సమీపంలోని బొందెగట్టులో మధ్యాహ్నం సమయంలో పక్కీరప్ప మేకలు మేస్తుండగా నీళ్లు తాగడానికి కిందికి వెళ్లాడు. ఈ క్రమంలో మేకలన్నీ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చాయి. దీంతో వెంటనే వెళ్లి చూడగా మూడు మేకలు చిరుతదాడిలో మృతి చెంది ఉన్నాయి. అందులో చనిపోయిన ఒకమేకను తన కళ్లుదుటే చిరుతపులి లాక్కెళ్లిందని పక్కీరప్ప తెలిపాడు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. మళ్లీ చిరుత కలకలం రేగడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళనకు గురువున్నారు. పాముకాటుతో చిన్నారి మృతి రాజోళి: పాముకాటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మండలంలోని పెద్దతాండ్ర పాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల కు మార్తె శ్రావ్య (8) కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పాము చిన్నారి వేలి కొరికింది. దీంతో చిన్నారి ఏడవడంతో మేల్కొన్న తండ్రి పామును గమనించి వేలు నుంచి దాన్ని విడదీసి, చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. పొలం వద్దకు వెళ్లిన రైతు.. రాజాపూర్: పొలం వద్దకు వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం ఉడిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి చంద్రమౌలి (59) పత్తి పంటను పరిశీలిస్తుండగా.. చేనులో ఉన్న నాగుపాము అతడి పాదంపై కాటువేసింది. గ్రామానికి చెందిన శివకుమార్ మోటర్సైకిల్పై చంద్రమౌలిని ఎక్కించుకొని బాలానగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి కుమారుడు ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపారు. కందనూలు: బిజినపల్లి మండలంలోని ఇప్పలతండాలో గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోరుసుగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ (50) శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కార్డు అందుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మరుసటి రోజు బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించారు. దుర్వాసన రావడంతో.. ఆదివారం సాయంత్రం చిట్టెమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు అనుమానించి తలుపులు తెరిచి చూశా రు. ఇంట్లో ఆమె మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బిజినపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్టెమ్మ కొంతకాలంగా లట్టుపల్లి గ్రామంలోని ఓ రైస్మిల్లులో కూలీగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి ఎవరు వచ్చారు? ఏదైనా వ్యక్తిగత వివాదం ఉందా? దొంగతనం కోణం ఏమైనా ఉందా? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి ఎస్ఐ షంశుద్దీన్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా హత్యకు అసలు కారణం, నిందితుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఇప్పలతండాలో విషాదం నెలకొంది. -
టీఎంయూ గెలుపుతోనే ఆర్టీసీకి మనుగడ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వచ్చే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ గెలుపుతోనే సంస్థ మనుగడ ఉంటుందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహబూబ్నగర్ రీజియన్లోని పది డిపోల గ్యారేజీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజీ కార్మికుల డిజిగ్నేషన్లను పెంచడానికి కృషి చేస్తామన్నారు. మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సమస్యల పరిష్కారంలో గణనీయమైన మార్పులు తెస్తామన్నారు. శ్రామిక్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని కేటగిరీల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, చట్టవిరుద్ధ డ్యూటీలపై, అనవసరంగా అధికారులు వేధింపులకు గురిచేసినా ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సంస్థకు సుమారు రూ.లక్ష కోట్ల విలువజేసే ఆస్తులున్నాయని, అన్యాక్రాంతమైనవి అమ్మి రూ.4 వేల కోట్ల అప్పులను తీర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, నాయ కులు నాగయ్య, వహీద్, రాజలింగం, అహ్మద్ఖాన్, నిరంజన్, రాజేందర్, గోవింద రావు, నారాయణ, చంద్రయ్య, మధుసూదన్, భానుప్రకాష్రెడ్డి, కె.రవీందర్రెడ్డి, బి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం, సలహాలు ఉచితంగా అందిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి డి.ఇందిరా తెలిపారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆమె.. జైలులోని పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, కేసుల వివరాలు, న్యాయపరమైన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన ఆమె.. న్యాయ సహాయం అవసరమైన అర్హులకు ఉచిత న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన న్యాయపరమైన సందేహాలు, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఖైదీలకు తెలిపారు. అవసరమైన వారికి న్యాయ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జైలు సందర్శనలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్లో సీటు రాలేదని విద్యార్థిని బలవన్మరణం లింగాల: నర్సింగ్ ప్రవేశ పరీక్షలో సీటు రాలేదని మ నస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిని ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాలు.. లింగాలకు చెందిన ఉప్పల శంకరయ్య రెండో కుమార్తె భువనేశ్వరి (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసినట్లు తెలిపారు. కానీ సీటు రాకపోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. మట్టికుప్పల్లో కూరుకుపోయి వలస కార్మికుడి మృతి హిందూపురం: మట్టికుప్పల్లో ఇరుక్కుపో యి వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని చెర్లోపల్లి వద్ద జరిగింది. వివరాలు.. చెర్లోపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్ద నూతన జాతీయ రహ దారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన అంజి (21) తన పెద్దమ్మ పెంటమ్మతో కలిసి ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చాడు. ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే సోమవారం రహ దారి పనుల నిమిత్తం కుప్ప చేసిన మట్టిని జేసీబీతో లెవెల్ చేస్తుండగా, అంజి మృతదేహం బయటపడింది. మట్టిని కుప్పులు పోస్తున్న సమయంలో అందులో ఇరుక్కుపోయి మృతి చెంది ఉంటాడని తోటి కూలీలు తెలిపారు. అంజి మృతదేహం అతని పెద్దమ్మ పెంటమ్మ, తోటి కార్మికులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడి దుర్మరణం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... బీరోలు గ్రామానికి చెందిన నర్సింహులు (38) సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సమ యంలో ముఖం కడుక్కునేందుకు అక్కడే ఉన్న కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోగా తల భాగం సిమెంట్ దిమ్మెకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య పావని ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణం తెలకపల్లి: మండలంలోని గట్టురావిపాకులకు చెందిన రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు.. గట్టురావిపాకుల గ్రామానికి చెందిన సుబ్బయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పు చేసి తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేదని కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సుబయ్య ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భార్య ఉత్తరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
● విద్యుత్ భవన్లో ఫూలే, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మఽహనీయులైన మహాత్మ జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విద్యుత్ భవన్న్లో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పూలే, అంబేడ్కర్ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎస్ఈ బీమా నాయక్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
తండాల్లో తీజ్ సంబురం
సంస్కృతి, సంప్రదాయబద్ధంగా జరుపుకొంటున్న గిరిజన యువతులు ● తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో గోధుమనారుకు పూజలు ● నియమ, నిష్టలు, ఆటాపాటలతో సందడి ● చివరిరోజు చెరువులు, కుంటల్లో నిమజ్జనంతీజ్ను గిరిజనులు తొమ్మిది రోజులపాటు ఆయా రోజుల్లో యువతులు రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. బుట్టలు ఎందరు ఉంచినా అందులో ఐదుగురు యువతులు మాత్రమే నిష్టతో పూజ చేస్తారు. చివరిరోజు యువతులు మొలకల బుట్టతను తలపై పెట్టుకొని చెరువు వద్దకు వెళ్తారు. అప్పటికే అక్కడ సంప్రదాయయపద్ధతిలో రూమాలాలు తలకు చుట్టుకొని పెద్దమనుషులు కూర్చుంటారు. యువతలు బుట్టల్లోని కొన్ని మొలకలను తలపాగాల్లో వేస్తారు. అనంతరం బుట్టలకు పూజలు చేసి చెరువులోకి వదులతారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమనుషుల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. యువతలను కూడా పీటలపై కూర్చొబెట్టి పెద్దమనుషులు వారి కాళ్లు కడిగి ఆశీర్వదిస్తారు. అచ్చంపేట: లంబాడ గిరిజనుల(బంజారాలు) సంప్రదాయ మొలుకల పండుగను నల్లమలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కఠోర నియమాలు, డప్పుల మోతలు.. తండావాసుల కేరింతలు.. పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు.. భక్తిభావం వీటి మేళవింపే తొమ్మిది రోజుల(నవ దాడేరి తీజ్) పండుగ. ఆషాఢం, శ్రావణమాసంలో బంజారాలు తీజ్ వేడుకలను తమ సంస్కృతిని ప్రతిభింబిచేలా జిల్లావ్యాప్తంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలు, తండాలు, పట్టణాల్లో తీజ్ సందడి నెలకొంది. శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మాహరాజ్ (సేవాభాయి) శ్రీశ్రీశ్రీ దండి మేరమ్మ(అమ్మవారు) తల్లికి పూజలు చేసే క్రమంలో ఈ తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. పెళ్లికాని యువతులు తమకు మంచి వరడు లభించాలని, తండావాసులు తమ పాడి పశువులు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని వేడు కుంటూ తొమ్మది రోజులపాటు తీజ్ను జరుపుకొంటారు. ఒకప్పుడు తండాల్లో జరిగే ఈ వేడుకలు ఇప్పుడు పట్టాలకు విస్తరించాయి. ఇప్పటికే అచ్చంపేట మండలం ఐనోలు, లింగాల, కల్వకుర్తి మండలాల్లో తీజ్ వేడుకలు కొనసాగుతుండగా.. కొన్ని తండాల్లో ముగిశాయి. పెళ్లికాని యువతుల చేత.. పెళ్లికాని యువతులు రేగిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి తీజ్ను ప్రారంభిస్తారు. అంతకుముందే తండాల్లోని పెద్దలు ప్రతిఇంటి నుంచి గోధుమలు సేకరించి రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లికాని యువతులు చిన్నచిన్న వెదురు బుట్టలో పుట్టమన్ను(మకొడధూడ్) గోవు పిడకల చూర్ణాన్ని కలిి ప నాయక్(పూజారి)ఇంటికి తీసుకురాగా నాయక్ భార్య ఆ బుట్టలో నానబెట్టిన గోధుమలు వేసి అలుకుతుంది. అనంతరం పూజలు చేసి బుట్టలను డాగ్డో(మంచె)పై ఉంచి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక జలాలు చల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తారు. పులియోగెనో.. తీజ్లో ముఖ్యమైనది పులియోగెనోది. దీనిని బంజార మహిళలు స్వయంగా తయారు చేస్తారు. అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేయడానికి తమ స్థోమతను బట్టి రూ.2వేల వరకు ఖర్చు చేస్తారు. గోధుమలు మొలకెత్తడానికి పవిత్ర జలాలు పోసే సమయంలో తీజ్ నిర్వహించేటప్పుడు దీనిని వినియోగిస్తారు. యువతలు కలశాలతో జలాలు తీసుకొచ్చేటప్పుడు తలపై పెట్టుకునే దానిని గెనో అని రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అన్ని వ్యవరిస్తారు. పెళ్లి సమయంలో దీనిని పెళ్లికూతురుకు తమ గుర్తుగా తల్లిదండ్రులు అందిస్తారు. గిరిజనుల సంప్రదాయం, సంస్కృతికి పులియోగెనో అతి ముఖ్యమైంది. పీడియా.. తీజ్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే పెళ్లికాని యువతులు వచ్చే ఏడాది తాము తీజ్ అడుతామో లేదోననే ఆందోళన కనిపిస్తోంది. అంతకుముందు గ్రామంలో పెళ్లికాని గిరిజన యువకులు చేతుల్లో పట్టుకునే పీడీయాను ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటిపేరు, విడిపించే యువతుల ఇంటిపేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. -
చిరుత కళేబరానికి పోస్టుమార్టం
మన్ననూర్:శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి 765లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులి కూనకు ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం శాసీ్త్రయ పద్ధతిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎఫ్ఓ రేవంత్చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ పశు వైద్యాఽ దికారి రాజు నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వ హించి ప్రమాదంలో తగిలిన గాయాలు, మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అవయవాలను పరీక్షించారు. చిరుత గోర్లు, చర్మం, దంతాలు తది తర విడి భాగాలు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు మృతదేహాన్ని దహనం చేశామని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులి మృతి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. రహదారిలో ప్రత్యేక నిఘా ఎన్టీసీఏ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఎన్హెచ్ 765పై వాహనాల రాకపోకలు పెరగడంతో మన్ననూర్ నుంచి బ్రహ్మగిరి పరిసర ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టి ఉంచుకొని వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు వన్యప్రాణుల రక్షణకు అవసరమైన ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామని డీఎఫ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ చంద్రప్రకాష్ సింగాల్, ఎఫ్ఆర్ఓలు సవిత, వీరేష్, ఎఫ్ఎస్ఓ సురేందర్, బీఎఫ్ఓ గోపాల్, ఎన్టీసీఏ ప్రతినిధి రవికాంత్, బాపిరెడ్డి, అఖిల్గౌడ్, రిస్క్యూ టీం, వాచర్లు పాల్గొన్నారు. -
వ్యసన ముక్త్ భారత్కు పాటుపడుదాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మద్యం, పొగాకు, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ వ్యసన ముక్త్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలనే లక్ష్యంతో ఆగస్టు 6 నుంచి 20 వరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారీల ప్రతినిధులు తెలిపారు. మద్యం, పొగాకుతో పాటు మొబైల్, స్క్రీన్ వినియోగం, ప్రతికూల ఆలోచనలు, పనులను వాయిదా వేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. సెన్సస్ వివరాలు 20లోగా అందించాలి సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టేజ్–1 విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. తదుపరి దశలో జిల్లా సెన్సస్ హ్యాండ్బుక్ కోసం 31 సంబంధిత శాఖలు తమ పరిధిలోని వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు అందించాలని ఆదేశించారు. సెన్సస్ రికార్డు లు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని, ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, ట్రెయినీ కలెక్టర్ శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇన్చార్జి అధికారి బి.నర్సింహులు పాల్గొన్నారు. -
బడుల్లో ఉదయాన్నే టిఫిన్!
● జిల్లాలో మహబూబ్నగర్ రూరల్లో తొలిసారిగా ప్రారంభం ● 49 బడుల్లో ఇడ్లీ, దోశ, పూరి వడ్డన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు ఉదయా న్నే అల్పాహారం అందించే ‘బడుల్లో టిఫిన్’ కార్యక్రమం జిల్లాలో తొలిసారిగా మహబూబ్నగర్ రూరల్ మండలంలో ప్రారంభమైంది. అక్షయపాత్ర ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ట్రయల్ కార్యక్రమంలో మండలంలోని 49 పాఠశాలల్లో విద్యార్థులకు ఇడ్లీ, దోశ, పూరి తదితర అల్పాహారాన్ని అందించారు. మొత్తం 1,650 మంది విద్యార్థులు టిఫిన్ తీసుకున్నారు. మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టిఫిన్ తయారీ, పాఠశాలలకు తరలింపు, విద్యార్థులకు పంపిణీ తదితర అంశాలను పరిశీలించేందుకు సోమవారం ట్రయల్స్ నిర్వహించారు. అల్పాహారం నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయపాత్ర ద్వారా జిల్లాలోని ఏడు మండలాల్లో మధ్యాహ్న భోజనం అందుతోంది. మిగిలిన మండలాల్లో వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం కొనసాగుతోంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ అందించే లక్ష్యంతో నాలుగు ప్రాంతాల్లో అక్షయపాత్ర కిచెన్ షెడ్ల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేసినట్లు సమాచారం. అవి అందుబాటులోకి వస్తే దశలవారీగా అన్ని మండలాల్లోనూ టిఫిన్ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉంది. -
26న మిలాద్ జులూస్ ర్యాలీ
స్టేషన్ మహబూబ్నగర్: మిలాదున్నబీ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26న జిల్లా కేంద్రంలో మిలాద్ జులూస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మజ్లిస్ అహ్లె సున్నత్వల్ జమాత్ మిలాద్ జులూస్ జల్సా కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం మక్కామసీద్ నుంచి జులూస్ ప్రారంభమై క్లాక్టవర్, మున్సిపల్ కార్యాలయం, అశోక్టాకీస్, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాసాబ్గుట్ట దర్గా ఆవరణకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం దర్గా ఆవరణలో ధార్మిక సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో కమిటీ చీఫ్ ప్యాట్రన్ సయ్యద్ అబ్దుల్ రజాక్షా ఖాద్రీ, అధ్యక్షుడు మజహర్ హుస్సేన్ షహీద్, కార్యదర్శి ఖాజ ఫయాజుద్దీన్ అన్వర్పాషా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
6,29,402 మంది ఓటర్లు
● సర్ ముసాయిదా జాబితా విడుదల ● జిల్లాలో 1,03,086 ఓట్లు తగ్గినట్లు వెల్లడి ● అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,13,275 మంది పురుషులు, 3,16,108 మంది మహిళలు, 19 మంది ఇతరులు కాగా.. 785 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గత జాబితాతో పోలిస్తే 1,03,086 ఓట్లు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు తదితరాలను తొలగించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి ఇంటింటి ఓటరు పరిశీలన చేపట్టారు. సోమవారం నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలను ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబరు 16 వరకు స్వీకరించి, సెప్టెంబరు 17 నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలను అక్టోబరు 10లోగా పరిష్కరించి, అక్టోబరు 19న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితా ఇలా.. నియోజకవర్గం పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు స్టేషన్లు మహబూబ్నగర్ 279 1,06,054 1,07,524 10 316 జడ్చర్ల 280 99,485 99,862 7 265 దేవరకద్ర 303 1,07,736 1,08,722 2 204 ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా స్వీకరిస్తాం. పరిశీలన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. ముసాయిదా ప్రకారం జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్ -
ఖాకీల్లో అవినీతి చిచ్చు
● రోజురోజుకు తెరపైకి వస్తున్న కొత్త అంశాలు ● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ ● వాస్తవాలు తేలాలంటే సమగ్ర విచారణే మార్గం సదరు ఉన్నతాధికారికి సంబంధించిన పలు వ్యవహారాలను ఆ ఎస్ఐ పర్యవేక్షించేవారని పోలీస్వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో గద్వాల–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరాలపై జరిగిన దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంలోనూ ఇద్దరి పాత్రపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అలాగే నెలవారీ వసూళ్ల వ్యవహారంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించేవారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఎస్ఐ గతంలో అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీకి పట్టుబడి.. అనంతరం కొంతకాలం వీఆర్లో ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే కీలక పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలున్నాయి. అనంతరం ఓ జిల్లాలో ఏడాది పాటు పనిచేసి, ఆరోపణల నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా అక్కడ రెండు నెలలు పూర్తికాకముందే మరోసారి వనపర్తి జిల్లాకు బదిలీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్నగర్ క్రైం/గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది. -
త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు: ఎస్పీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజలు అందించే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి రహిత జిల్లాగా పాలమూరు ● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్రెడ్డి కోరారు. మహబూబ్నగర్ ఎకై ్సజ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో నమోదైన 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 15 కిలోల ఎండు గంజాయి, 400 గ్రాముల అల్ఫ్రాజోలంను సోమవారం ధ్వంసం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎదులపల్లి గ్రామంలోని జీజే మల్టీ ఎన్క్లేవ్ ఇండస్ట్రీ ఇన్సినరేటర్లో వీటిని ధ్వంసం చేసినట్లు డీసీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లా, ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. రోస్టర్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని, టీజీఎప్సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఫీజులను ఎప్సెట్–2026 వెబ్సైట్లో ప్రకటించిన విధంగా చెల్లించాలని సూచించారు. -
రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం
● బీజేపీ పాలనలో కుల వివక్ష కొనసాగుతోంది ● నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. హల్ద్వాని ఘటనకు నిరసనగా సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పసులరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశాన్ని బీజేపీ మద్దతుదారులు వచ్చి పరిశుభ్రం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఖర్గే పట్ల జరిగిన వివక్షను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా దేశంలో ఇంకా కులవివక్ష కొనసాగుతుండటం బీజేపీ పాలనలో జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శమని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ హల్ద్వాని ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పసుల రాజు, పట్టణ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు వినయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సర్వేలతోనే సరి..!
అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. మారిన ప్రతిపాదనలతో.. మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి. భూత్పూర్– చించోలి రహదారితో.. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు -
ప్రతిపాదనలు పంపించాం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీ య రహదారుల ను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపాద నలు పరిగణలోకి తీసుకోవడం లే దు. కొత్త రోడ్ల మంజూరు కోరు తూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్తల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్నగర్ సానుకూల స్పందన.. ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు – మన్ననూర్– సిరిగిరిపాడు వర కు జాతీయ ర హ దారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాము ఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయ న సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ ర హదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
మతలబు ఏమిటో?!
జడ్చర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్కు సేకరించిన భూము లు, పరిహారం పంపిణీ తదితర వివరాల రికార్డులు మాయమయ్యాయి. భూ సేకరణ సమయంలో విధులు నిర్వర్తించిన అధికారులు బదిలీ అయినప్పుడు రికార్డులు అప్పగించకుండా తమ వెంటే తీసుకెళ్లారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భూ రికార్డులపై విచారించిన అధికారులు సైతం కార్యాలయంలో ఆయా రికార్డులు లేవని చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే రికార్డుల మాయం వెనక మర్మం ఏమిటి.. తమ అక్రమాలు బహిర్గతం కాకూడదనే ఉద్దేశమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 5.20 ఎకరాలు అదనంగా చూపి.. ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్, వల్లూరు గ్రామాలతోపాటు తుమ్మలకుంటతండా, రాగడిపట్టతండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసె తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కోసం పోలేపల్లి గ్రామ శివారులో 316 ఎకరాల భూమి కేటాయించారు. అయితే సర్వే నం.554లో 79.39 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి.. దీనిని పునరావాసానికి కేటాయించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ భూమిని అనుభవిస్తున్న రైతులకు ఎకరాకు రూ.12 లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే ఈ భూమిని సాగు చేసుకుంటున్న నిజమైన రైతులను గుర్తించి పరిహారం అందించే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మొత్తం 79.39 ఎకరాలలో అప్పటికే ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్కు 9.39 ఎకరాలు, రెసిడెన్సియల్ స్కూల్కు 2.20 ఎకరాలు, అష్టలక్ష్మి దేవాలయానికి 3 ఎకరాలు పోగా.. మిగిలిన 64.20 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ 64.20 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా 70 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే 5.20 ఎకరాలను అదనంగా పేర్కొని ఆ పరిహారాన్ని బినామీల పేరుతో రూ.66 లక్షలు స్వాహా చేశారు. అంతేగాక ధరణి రికార్డులలో ఉన్న పలువురు అర్హులైన రైతులను కాకుండా.. బినామీల పేర్లను నోటిఫికేషన్లో చేర్చడం గమనార్హం. కేటగిరి–1లో ఆర్ఓఆర్, గ్రామ రికార్డులు, ధరణిలో పేర్లు ఉన్న వారికి 23 ఎకరాలకు గాను రూ.276 లక్షలు పరిహారంగా చెల్లించారు. కేటగిరీ–2లో పూర్తి విచారణ లేకుండానే 11 ఎకరాలకు సంబంధించి రూ.132 లక్షలు చెల్లించారు. అలాగే కేటగిరీ–3లో మాజీ తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణల ఆధారంగా 31.28 ఎకరాలకు రూ.380.40 లక్షలు చెల్లించినా.. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఇతరత్రా వాటిని ధ్రువీకరించలేదు. యాప్తోనే ఎరువులు రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. –8లో uకలెక్టర్కు రైతుల ఫిర్యాదు పోలేపల్లి శివారులోని సర్వే నం.554లోని భూమిని గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న తమకు కాకుండా అనర్హులకు పరిహారం ఇచ్చారని అప్పట్లో కొందరు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై 2022లో విచారణ చేసిన ఆర్డీఓ తహసీల్దార్, గిర్దావర్లు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని, అలాగే సంబంధిత రికార్డులను స్వాధీనం చేయకపోవడాన్ని గుర్తించి నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో సంబంధిత తహసీల్దార్, గిర్దావర్లకు నాలుగు సార్లు మెమోలు జారీచేసినా స్పందించకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయేందిర క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఏకు సిఫార్సు చేశారు. అయితే సీసీఐ అధికారులు మాత్రం కేవలం ఇంక్రిమెంట్లను నిలిపివేసి చర్యలను మమ అనిపించినట్లు సమాచారం. -
ఉత్సాహంగా ఎంసీసీ ఫ్రీడమ్ రైడ్
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ సైక్లింగ్ క్లబ్ (ఎంసీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీడమ్ రైడ్ ఉత్సాహంగా జరిగింది. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని ముఖ్య అతిథిగా హాజరై సైక్లింగ్ రైడ్ను జెండా ఊపి ప్రారంభించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ఈ సైక్లింగ్ రైడ్ పద్మావతీకాలనీ మీదుగా పిస్తా హౌజ్ వరకు వెళ్లి.. తిరిగి అక్కడి నుంచి మెయిన్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రైడ్లో దాదాపు వందమందికిపైగా పాల్గొన్నారు. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించే దిశగా ఈ రైడ్ నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు. -
నేటినుంచి మండల స్థాయిలో ప్రజావాణి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నుంచి మండల మండల స్థాయి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ప్రజావాణిలో అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నందున తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లాకేంద్రానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోయిల్సాగర్లో 18 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 18 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి ఒక పంపు ద్వారా కోయిల్సాగర్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. మరో 8.8 అడుగుల నీరు చేరితే పాత అలుగు లెవల్ అవుతుంది. గేట్ల స్థాయి నీటిమట్టం 32.6 అడుగులుగా ఉంది. తీజ్ సంబరాలు ● ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యాలు ● మొలకల బుట్టలతో భారీ ఊరేగింపు ● గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు – వివరాలు 8లో.. -
యాప్లోనే ఎరువుల బుకింగ్
మహబూబ్నగర్ (వ్యవసాయం) /నవాబుపేట: ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం నూతన డిజిట ల్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రైతులకు పారదర్శకంగా,అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా సోమవారం (ఆగస్టు 17) నుంచి ఎరువుల విక్రయాలు చేపట్టనున్నారు. ఇక రైతులు ఎరువుల కోసం విక్రయ కేంద్రాల వద్ద క్యూలో నిలబడకుండా ముందుగానే యాప్లో నమోదు చేసుకుని అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్తో లాగిన్.. రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలి. ఫార్మర్ ఐడీ ఉన్నవారు దానితో లేదా ఆధార్ నంబర్తో లాగిన్ కావచ్చు. ఆధార్కు అనుసంధానమైన మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఫార్మర్ ఐడీ లేని రైతులు ఆధార్తో ఈ–కేవైసీ పూర్తి చేసి యాప్లో నమోదు చేసుకోవచ్చు. భూమి వివరాలు లేకుంటే.. ఫార్మర్ రిజిస్ట్రీలో భూమి వివరాలు కనిపించకపోతే యాప్లోని ‘సింక్ ల్యాండ్స్ విత్ ఫార్మర్ రిజిస్ట్రీ’ ద్వారా వాటిని సమకాలీకరించుకోవచ్చు. అయినప్పటికీ వివరాలు అందుబాటులోకి రాకపోతే ‘యాడ్/క్లెయిమ్ ల్యాండ్’ ద్వారా భూమి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. రైతులకు అవగాహన కల్పిస్తున్న అధి కారులు యాప్ వినియోగంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు అందుబాటులో ఉండనున్నారు. రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాల వద్ద యాప్ డౌన్లోడ్, నమోదు, వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. రైతులు ఫార్మర్ ఐడీ, ఆధార్, మొబైల్ నంబర్, భూమి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. యాప్లో రైతుల భూమి వివరాలు అందుబా టులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సీజన్లో సాగు చేస్తున్న పంటను నమోదు చేయాలి. భూమి విస్తీర్ణం, పంట ఆధారంగా అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసుకోవాలి. దీనికి అనుగుణంగా జనరల్ ఫర్టిలైజర్ రికమండేషన్ (జీఎఫ్ఆర్)ను యాప్ చూపిస్తుంది. రైతు సాగు చేస్తున్న పంట, భూమి విస్తీర్ణానికి అనుగుణంగా సూచించిన పరిమాణంలోనే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరానికి మించి ఎరువులను బుక్ చేసుకోవడం సాధ్యం కాదు. భూమి.. పంట వివరాలు తప్పనిసరి రైతు తనకు అనుకూలమైన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్ చేసిన తర్వాత యాప్లో క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ అవుతాయి. వాటిని చూపించి విక్రయ కేంద్రం నుంచి ఎరువులు పొందవచ్చు. రైతు తరపున అధీకృత వ్యక్తి కూడా ఎరువులు తీసుకునే అవకాశం కల్పించారు. నేటి నుంచి ఎఫ్ఎఫ్ఎస్ విధానం అమలు ముందస్తు నమోదు తప్పని సరి.. భూమి, పంట వివరాల ఆధారంగా కేటాయింపు క్యూఆర్ కోడ్తో ఎరువులు పొందే అవకాశం -
ముగిసిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
మహబూబ్నగర్ క్రీడలు: నగరంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఓపెన్ టూ ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఆదివారం ముగిసింది. డబుల్స్ విభాగంలో మ్యాచ్లు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భాను– జోయల్ 21– 18, 19– 21, 21– 14 తేడాతో సయ్యద్ ఎజాస్– జీషాన్పై గెలుపొంది విజేతగా నిలిచారు. అదేవిధంగా మూడోస్థానంలో అనిల్– శివ, నాలుగో స్థానంలో అబ్దుల్ రహెమాన్– వెంకటప్ప నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్యామూల్ ట్రోఫీలు అందజేశారు. అలాగే బ్యాడ్మింటన్ ఆడిన చిన్నారులు ఎల్.హాన్విక్, యశ్వంత్లకు ప్రోత్సాహకంగా మెడల్స్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్, ప్రవీణ్కుమార్, ఉదయ్రెడ్డి, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలు అందిపుచ్చుకోవాలి
మహబూబ్నగర్ క్రీడలు: కరాటేలో అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని ఏకేఎఫ్, డబ్ల్యూకేఎఫ్ రెఫరీ టి.కనకరాజు, ఏకేఎఫ్ రెఫరీ జె.ప్రవీణ్కుమార్, సీనియర్ మాస్టర్ విజయ్కుమార్ అన్నారు. జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్క్రాస్ భవన్లో కుమితే, రెఫరీపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమితే పోటీల నిర్వహణ, రెఫరీ నిర్ణయాల ప్రక్రియ, పోటీ సమయంలో పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే క్రీడలో కుమితే విభాగానికి సంబంధించిన నియమాలు, రెఫరీ విధులు, విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. కరాటే క్రీడను మరింత శాసీ్త్రయంగా, నైపుణ్యపరంగా అభివృద్ధి చేయడంతోపాటు రెఫరీలు, కోచ్లలో ఆధునిక పోటీ నియమాలపై అవగాహన కల్పించడమే సెమినార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కరాటేలో నైపుణ్యాల పెంపునకు ఇలాంటి శిక్షణలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ కృష్ణయ్య, చైర్మన్, ఎగ్జామినర్ రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్కుమార్, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. -
చదువుతోనే ఉత్తమ భవిష్యత్ సాధ్యం
కొల్లాపూర్ రూరల్: ప్రతి విద్యార్థి చదువుతో తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చనిత ప్రపంచ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ క మిషన్ మెంబర్ డాక్టర్ వాజీత్పాషా అన్నారు. ఆదివారం తన సొంత గ్రామమైన కొల్లాపూర్ మండలం సోమశిలలోని ప్రాథమిక పాఠశాలకు రూ.1.50 లక్షలు విలువైన ఏఐ ప్యానల్ బోర్డును వితరణ చేశారు. ఈ ప్యానల్ బోర్డును మండల విద్యాధికారి ఇమ్మానుయేలు, గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి పాఠశాలలో ఏఐ ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం తిరగవచ్చన్నారు. తాను సోమశిలలో చదువుకొని అమెరికాలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నానని తన లాగానే గ్రామీణ విద్యార్థులు ఎదగాలని సూచించారు. మండల విద్యాధికారి ఇమ్మానుయేలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను రోజు పాఠశాలకు పంపించి వారి భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్రెడ్డి, వెంకటస్వామి, తిరుపాలు, చిన్నకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన తీజ్ సంబరాలు
● ఆకట్టుకున్న యువతులసంప్రదాయ నృత్యాలు ● మొలకల బుట్టలతో భారీ ఊరేగింపు ● గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా వేడుకలు లింగాల: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తీజ్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో తీజ్ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాతీగా వస్తోంది. 9 రోజుల పాటు నిర్వహించిన తీజ్ సంబరాలను మొలకల పండుగతో ముగించారు. బంజారా వాడలోని మేరమ్మ భవాని ఆలయం ఆవరణలో గిరిజన యువతులు నిష్టతతో బుట్టల్లో మొలకలను పెంచారు. చివరి రోజు బంజారా వేషాధారణలతో యువతులు మొలకల బుట్టలను తలపై ఉంచుకొని నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా ఆనందాన్ని పంచుకున్నారు. కుంటలో నిమజ్జనం మేరమ్మ ఆలయం ఆవరణలో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన మొలకల బుట్టలను డీజే పాటలకు బంజారా నృత్యాలతో భారీ ఊరేగింపుగా వెళ్లిన బంజారాలు పట్టణ సమీపంలోని రామాలయం ఎ దుట ఉన్న పెద్దకర్ణం కుంటలో నిమజ్జనం చేశారు. -
ఉత్సాహంగా ఖేల్కూద్ పోటీలు
● 1,650 మందికిపైగా విద్యార్థుల హాజరు ● మూడు రోజులపాటు కొనసాగనున్న క్రీడలు మహబూబ్నగర్ క్రీడలు: నగరంలోని బండమీదిపల్లి శివారు శ్రీసరస్వతీ శిశుమందిరంలో మూడు రోజులపాటు శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖేల్కూద్ (క్రీడాపోటీలు) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, మేయర్ మమత, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, విద్యాపీఠం ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు విద్యార్థుల సమగ్ర వికాసంలో అత్యంత కీలకమైనవి అన్నారు. క్రీడలు శారీరక ధృడత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమష్టిభావన, నాయకత్వ లక్షణాలు పెంపొదిస్తాయన్నారు. గెలుపు ఒక్కటే క్రీడల లక్ష్యం కాదని, ఓటమిని స్వీకరించి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించే సంకల్పాన్ని క్రీడలు నేర్పుతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్సింగ్, ఓబుగారి శ్రీనివాసయ్య, ఎల్లప్ప, మద్ది అనంతరెడ్డి, పాలుట్ల యాదయ్యగుప్తా, గంగాధర్ పాల్గొన్నారు. పలు క్రీడాంశాల్లో పోటీలు తెలంగాణ ప్రాంత రాష్ట్రస్థాయి ఖేల్కూద్ క్రీడా పోటీల్లో ఆయా శిశు మందిరాల నుంచి దాదాపు 1650 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, చెస్, ఫుట్బాల్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలు మంగళవారం వరకు జరగనున్నాయి. -
పోటాపోటీగా జిల్లాస్థాయి చెస్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో ఆదివారం మహబూబ్నగర్ ఫస్ట్, జిల్లా సాంస్కృతిక సేన ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 250కిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–9, 12, 16, ఓపెన్ విభాగాల్లో చెస్ పోటీలు జరిగాయి. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ చెస్ పోటీలను పరిశీలించి మాట్లాడారు. యువ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు చెస్ పోటీలు దోహదపడుతాయన్నారు. చెస్ ఆడడం వల్ల మేధోశక్తి, ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయా విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు టోఫీతోపాటు నగదు ప్రోత్సాహకం అందజేశారు. కార్యక్రమంలో చెస్ కోచ్ ఆనంద్బాబు, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి నర్సింహులు, యాదగిరి, దాసు, శేఖర్, కేశవులు, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ యువకుడు మృతి
కేటీదొడ్డి: సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంటకు చెందిన హరిజన హనుమంతు (28) ఆదివారం సాయంత్రం ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. స్ధానికులు గమనించి గద్వాలలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య కవితతో పాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడు మృతి చెందడంతో భార్య చిన్నారుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులుని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. పాముకాటుకు గురైన బాలుడు అమరచింత: పట్టణంలోని రాజవళీ దర్గా పార్కులో ఆడుకుంటున్న బాలుడు పాల్గుణ ఆదివారం పాముకాటుకు గురయ్యాడు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన పాల్గుణ ప్రభుత్వ డీఎంఆర్ఎం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకుంటుండగా గడ్డి మొక్కల మధ్య ఉన్న పాము పాల్గుణ కాలుపై కాటువేసింది. గమనించిన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పాముకాటుకు విరుగుడుగా యాంటి వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు స్పందించి పార్కులో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి పాముల బెడద నుంచి కాపాడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. పోలేపల్లి సెజ్లో కార్మికుడి దుర్మరణం జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్లోని పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమలో ఆదివారం కార్మికుడు దుర్మరణం చెందాడు. సీఐ కథనం మేరకు.. సుప్రీం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ఆనంద్ సేనాపతి(35) పనులు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పరిశ్రమలో బరువులు ఎత్తే యంత్రం ఢీకొని మరో గూడ్స్ మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడు పశ్చిమబెంగాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ద్విచక్రవాహనాలు ఢీ.. యువకుడి మృతి మల్దకల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని పేదొడ్డిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాలిలా... పేదొడ్డి గ్రామానికి చెందిన బొప్పల స్వామి (28) మల్దకల్లో సెల్ఫోన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. రోజులాగే శనివారం రాత్రి దుకాణం మూసివేసి, ద్విచక్రవాహనంపై గ్రామానికి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న స్వామి ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్రగాయాలు కాగా గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూవృద్ధురాలి మృతి మక్తల్: చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని మాద్వార్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మ్యాకలి సత్యమ్మ (80) మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో ఈనెల 6న ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగడంతో కుటుంబసభ్యులు వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై మృతురాలి కోడలు మల్లమ్మ ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
కాలకృత్యాలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
● మహిళపై దూసుకెళ్లిన లారీ.. రెండుముక్కలైన శరీరం ● గడిమున్కన్పల్లిలో తెల్లవారుజామున ఘటన దామరగిద్ద: కాలకృత్యాల కోసం బహిర్భూమికి వెళ్లిన మహిళ లారీ రూపంలో వచ్చిన మృత్యువుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన శనివారం తెల్లవారుజామున మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలంలోని గడిమున్కన్పల్లికి చెందిన కుర్వ ఉషెంతమ్మ(55) రోజూలాగే కాలకృత్యాల కోసం గ్రామ చివరన రోడ్డు సమీపానికి వచ్చింది. అదే సమయంలో సేడెం నుంచి నారాయణపేట వైపు వస్తున్న సిమెంట్ లారీ రోడ్డు పక్కనే కూర్చున మహిళ పైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెంది. శరీరం రెండు ముక్కలైంది. లారీ డ్రైవర్ వాహనాన్ని ఎవరూ చూడలేదని నిలపకుండా నారాయణపేటలో సిమెంట్ అన్లోడింగ్కు తరలించారు. మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డుపై బైఠాయించి మహిళ మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించి డ్రైవర్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఐ నరేష్, తహసీల్దార్ తిరుపతయ్య ఘటనా స్థలానికి చేరుకొని భరోసా కల్పించారు. లారీని గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుంభం శివకుమార్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20వేలు, లారీ ఓనర్ రూ.25వేలు ఆర్థిక సాయం అందజేశారు. -
వాహనంతో ఢీకొట్టించిమహిళ హత్య
తాడూరు: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ(43) అదే మండలం వట్టిపల్లికి చెందిన భర్త కృష్ణయ్యను కొన్నాళ్ల కాపురం అనంతరం 15ఏళ్ల కిందట వదిలేసి సొంతూరులో నివాసముంటుంది. మండల కేంద్రానికి చెందిన భీమయ్యతో కొంతకాలంగా పరిచయమైంది. డబ్బుల విషయంలో బంగారమ్మ తాడూరుకు చేరుకుని తనకు ఇవ్వాల్సిన రూ.7వేలు ఇవ్వాలని భీమయ్యను తన పొలంలో నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో బొలేరోకు అడ్డు నిలువగా.. భీమయ్య కోపంతో బంగారమ్మను ఢీకొట్టగా.. కిందపడిపోయిన అక్కడిక్కడే మృతిచెందింది. ఘటన భీమయ్య పొలంలో జరగడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ రాములు పరిశీలించి మృతదేహాన్ని నాగర్కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సమీపంలోమృతదేహం లభ్యం జడ్చర్ల: పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(40) మృతిచెందాడు. బ్లూ జీన్స్ ప్యాంటు కాఫీకలర్ షర్ట్ చేతికి కడియం ధరించి ఉన్నాడు. ఆలయం సమీపంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రహరీ పక్కన మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మద్యానికి గుడ్బై
● స్వాతంత్య్ర దినోత్సవం వేళ గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం ● బెల్ట్ షాపుల మూసివేతకు శ్రీకారం.. ఊరంతా మద్దతు మహబూబ్నగర్ రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రామచంద్రాపూర్ గ్రామం మద్యపానానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేసి మద్యపానాన్ని నియంత్రించాలని సర్పంచ్ వై.నర్సిములు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకల్లో సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మద్యపాన నిషేధానికి గ్రామస్తులు మద్దుతు తెలిపారు. కాగా.. మద్యపానంతో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్న నేపథ్యంలో నిషేధానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. ఎకై ్సజ్ సహకారం అవసరం బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలంటే ఎకై ్సజ్ శాఖ సహకారం అవసరమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అధికారిక వైన్షాప్ నుంచే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటే గ్రామంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. సర్పంచ్, మహిళా సంఘాల నిర్ణయం అమలుకు అధికారులు సహకరించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవానంద్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
మక్తల్ చరిత్రను అభివృద్ధిలో తిరగరాస్తా
మక్తల్: నియోజకవర్గంలో అభివృద్ధికి తనవంతు కృషి చేసి తెలంగాణలో మక్తల్ చరిత్రను తిరగా రాస్తానని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్లో అగ్నిమాపక భవనం నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు చేసి పనులకు ప్రాంభించారు. అనంరతం మొక్కుల నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల భద్రతకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అగ్రిమాపక కేంద్రాలను బలోపేతం చేస్తున్నామన్నారు. గతంలో అగ్నిమాపక కేంద్రం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరునెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం వెనుకాడటంలేదని, అందరు సహకరిస్తే కృషిచేస్తానన్నారు. మక్తల్లో 220 విద్యుత్ కేవీ సబ్స్టేషన్ త్వరల్లో తీసుకోస్తామని వెల్లడించారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్కుమార్, స్పెషల్ అధికారి బాలజీ, ఏఈ మల్లికార్జున్, జీవీ ప్రసాద్, నరేస్గౌడ్, రహీంపటేల్, మహేశ్, శంషోద్దిన్, అమరేందర్రెడ్డి, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
సమష్టి కృషితో నాలుగో యూనిట్ పునరుద్ధరణ
మన్ననూరు: సమష్టి కృషితో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలోని నాలుగో యూనిట్ను పునరుద్ధరించగలిగామని కేంద్రం ఇన్చార్జి సీఈ ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈగలపెంటలోని కేంద్రం సీఈ పరిపాలన భవనం శ్రీశక్తి సదన్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగో యూనిట్ పునరుద్ధరించి గ్రిడ్కు అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరు యూనిట్లు విజయవంతంగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు, విధుల్లో ఉన్న ఇంజినీర్లు, అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మన ధ్యేయం కేంద్రంలో విద్యుదుత్పత్తి విజయవంతంగా చేస్తూ రాష్ట్ర గ్రిడ్కు అన్నివేళలా విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచుతూ కొరత లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం కేంద్రం రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆర్ఐబీ రవి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ పోలీసుల నుంచి వందనస్వీకారం చేశారు. ఎస్పీఎఫ్, ఎస్ఐలు అనూప్, శ్రావణ్ పాల్గొన్నారు. -
జాతీయ జెండాకు అవమానం
ఎర్రవల్లి: ఇటిక్యాల మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జాతీయ జెండాను అధికారులు తలకిందులుగా ఎగురవేశారు. దీంతో కాషాయం రంగు కింద, ఆకుపచ్చ రంగు పైకి ఉండటాన్ని గమనించిన పలువురు విస్మయం వ్యక్తం చేశారు. విషయం గుర్తించిన వెంటనే జెండాను దించి, సరైన క్రమంలో తిరిగి ఎగురవేశారు. జాతీయ పతాకం విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండగా నిర్లక్ష్యం ఎలా జరిగిందని స్థానికులు విమర్శించారు. దీనిపై ఏపీఎం పద్మ వివరణ ఇస్తూ.. జెండా ఆవిష్కరణ సమయంలో రెండు తాళ్లను ఒకేసారి లాగడంతో పొరపాటు జరిగిందని, వెంటనే గుర్తించి సరిచేసినట్లు తెలిపారు. -
10,216 మందికి ఇందిరమ్మ ఇళ్లు
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో రూ.511 కోట్ల అంచనా వ్యయంతో 10,216 ఇళ్లు మంజూరు కాగా, 8,955 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1,219 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో, 640 గోడల స్థాయిలో, 3,040 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి. మరో 2,937 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇళ్లకు సంబంధించి రూ.223.96 కోట్ల నిధులు విడుదల చేశాం. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు మంజూరు చేయడంతో పాటు మరో 500 ఇళ్లకు పైకప్పు మార్చుకునే అవకాశం కల్పించాం. మిడ్జిల్లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో 24 గ్రామ పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.12 కోట్లకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. -
ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. డబుల్స్ విభాగంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్ టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ టోర్నీలో క్రీడాకారులు ప్రతిభచాటా లని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్, సాదత్ఖాన్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదు ● ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హెచ్చరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ సమస్యలను క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది దృష్టికి తీసుకువస్తే ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మాచారం సమీపంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఏర్పాటు చేసిన కంచెను కొందరు ధ్వంసం చేశారని, తప్పుడు రికార్డులతో కోర్టులను ఆశ్రయించి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన 23 ఎకరాలను స్వాధీనం చేసుకుని అక్కడ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నా రు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని, పరిహారం రికవరీతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అవినీతిపై మాట్లాడితే తప్పేంటి? ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అవినీతిపై మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని అనిరుధ్రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. సమష్టి కృషితో నాలుగో యూనిట్ పునరుద్ధరణ మన్ననూరు: సమష్టి కృషితో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలోని నాలుగో యూనిట్ను పునరుద్ధరించగలిగామని కేంద్రం ఇన్చార్జి సీఈ ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈగలపెంటలోని కేంద్రం సీఈ పరిపాలన భవనం శ్రీశక్తి సదన్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగో యూనిట్ పునరుద్ధరించి గ్రిడ్కు అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరు యూనిట్లు విజయవంతంగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు, విధుల్లో ఉన్న ఇంజినీర్లు, అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మన ధ్యేయం కేంద్రంలో విద్యుదుత్పత్తి విజయవంతంగా చేస్తూ రాష్ట్ర గ్రిడ్కు అన్నివేళలా విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచుతూ కొరత లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం కేంద్రం రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆర్ఐబీ రవి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ పోలీసుల నుంచి వందనస్వీకారం చేశారు. ఎస్పీఎఫ్, ఎస్ఐలు అనూప్, శ్రావణ్ పాల్గొన్నారు. -
పాలమూరు భవిష్యత్ మారనుంది
పాలమూరు: సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు భవిష్యత్ను మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందని, ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు వందసార్లు ఆలోచించాలని సూచించారు. ఆడంబరాలకు వెళ్లి అప్పులు చేయడం కంటే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని మధ్య తరగతి కుటుంబాలకు సూచించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమాండర్ నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉమ్మడి పాలమూరు ప్రజలు ఆరోగ్యం కోసం ఏటా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం గంట సమయాన్ని వ్యక్తిగత ఆరోగ్యానికి కేటాయించాలి. అనారోగ్యాల బారిన పడిన తర్వాత చికిత్స కోసం ఖర్చు చేయడం కంటే ముందుగానే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మేలు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ఫోన్ ద్వారా అరచేతిలోనే విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చింది. దానిని అనవసరమైన రీల్స్, వినోదం కోసం కాకుండా చదువు, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు వారంలో కొంత సమయాన్ని విశ్రాంతి, వినోదానికి కేటాయిస్తున్నారని, తెలంగాణలోనూ నెలలో కనీసం రెండు, మూడు రోజులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు కేటాయించుకోవాలి. రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించడం ద్వారా స్థానిక పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. సంక్షేమానికి పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.65 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ప్రయోజనం కలిగింది. దీంతో రూ.176 కోట్ల మేర లబ్ధి చేకూరింది. 1,27,056 మంది అర్హులకు 4.13 లక్షల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయగా, ప్రభుత్వం రూ.11.03 కోట్ల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 1,36,738 కుటుంబాలకు ఇప్పటి వరకు జీరో బిల్లులు జారీ చేసింది. ● మిషన్ భగీరథ కింద రూ.284 కోట్లతో 775 ట్యాంకులు, 1,697 కిలోమీటర్ల పైప్లైన్ పనులు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్లో భూగర్భ డ్రెయినేజీ పథకానికి రూ.603 కోట్లు విడుదలయ్యాయి.టీయూఎఫ్ఐడీసీ పథకం కింద రూ.37.87 కోట్లతో ఎనిమిది రకాల ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. నీటి సరఫరా మెరుగుదలకు రూ.220.94 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు అవుతున్నా.. సమాజంలో సామాజిక రుగ్మతలు కొనసాగుతుండటం బాధాకరం. వాటిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ప్రభాత భేరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి. – జూపల్లి కృష్ణారావు, మంత్రి జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కలెక్టర్ ఖుష్బూగుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్నాయక్, ఎస్పీ జానకి, నగర మేయర్ మమత, అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియసంక్షేమం.. అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం.. ఆడంబరాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం, విద్య, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు -
గ్రామాలకు చేరువగా ప్రజావాణి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామీణ ప్రజలకు కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇకపై మండల స్థాయిలోనే ప్రజావాణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సోమవారం జిల్లాకేంద్రానికి వెళ్లి సమస్యలు చెప్పుకునే పరిస్థితికి ముగింపు పలికేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్ కార్యాలయాల్లోనే ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దూరభారం, ప్రయాణ ఖర్చులు, పనిదినం నష్టం వంటి ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 16 మండలాలు, 423 గ్రామాల ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ బోనాల పండుగ సెలవు కారణంగా 17వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. భూ వివాదాలు, ధరణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు వంటి సమస్యలపై ప్రజలు వినతులు ఇవ్వవచ్చు. ప్రజలకు తగ్గనున్న ప్రయాణ భారం జిల్లాలోని అనేక మండలాలు కలెక్టరేట్కు 50–60 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. దీంతో గ్రామీణులు రాకపోకలకు అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ఒక్క సమస్య కోసం పలుమార్లు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మండల కేంద్రాల్లోనే ప్రజావాణి నిర్వహణతో ఈ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. 23 శాఖల సమన్వయంతో పరిష్కార యంత్రాంగం మండల స్థాయి ప్రజావాణికి సుమారు 23 ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకానున్నారు. తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. సంబంధిత శాఖల సమక్షంలోనే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్పందనపై ఆసక్తి ఇటీవల రెవెన్యూ డివిజన్స్థాయిలోనూ ప్రజావాణి ప్రారంభించినప్పటికీ అక్కడ దరఖాస్తుల సంఖ్య పరిమితంగానే ఉంది. అయితే కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రజావాణికి ప్రతి సోమవారం 120 నుంచి 150 వరకు వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో ప్రారంభమయ్యే ప్రజావాణికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మండల పరిషత్లకు నిర్వహణ నిధుల కొరత ఉండటంతో అదనపు నిధుల అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మండలాల్లోనే సమస్యల పరిష్కారం! ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు రేపటినుంచి మండల స్థాయిలో ప్రారంభం -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● 9 శాఖల శకటాల ప్రదర్శన..ఉత్తమ స్టాల్స్కు నగదు బహుమతులు ● లబ్ధిదారులకు చెక్కులు.. ప్రతిభావంతులకు సన్మానాలు పాలమూరు: జిల్లా పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుకు పరేడ్ కమాండర్ కృష్ణయ్య గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మంత్రి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా 1,219 మహిళా సంఘాల సభ్యులకు రూ.143 కోట్ల రుణాల చెక్కులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 559 మందికి రూ.1.11 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 350 మందికి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలు, 25 మంది విద్యార్థులకు సైకిళ్లు, 14 మంది మహిళలకు స్కూటీలు పంపిణీ చేశారు. భారత్కు జూనియర్ హ్యాండ్బాల్లో ప్రాతినిధ్యం వహించిన పొల్కంపల్లి సాయి చరణ్రెడ్డిని సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొమ్మిది ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో వ్యవసాయ శాఖకు ప్రథమ, డీఆర్డీఏకు ద్వితీయ, గృహనిర్మాణ శాఖకు తృతీయ బహుమతులు లభించాయి. స్టాల్స్లో మెప్మాకు రూ.15 వేలు, పోలీస్ శాఖకు రూ.10 వేలు, మత్స్యశాఖకు రూ.8 వేల నగదు బహుమతులను మంత్రి అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, శిక్షణ కలెక్టర్ సాయి శివాని, మేయర్ మమత, ముడా చైర్మన్లక్ష్మణ్ యాదవ్, ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాతో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన -
బోనాలకు వెళ్లొస్తుండగా యువకుడి దుర్మరణం
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్ఘటన కడ్తాల్: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలోని ముచ్చర్లగేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బొట్టే శివయాదవ్(24) హైదరాబాద్లోని జియాగూడ మార్కెట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం వెల్దండ మండలం పెద్దాపూర్లోని బంధువుల ఇంట్లో జరిగిన బోనాల పండుగకు హాజరయ్యాడు. అదే రోజు రాత్రి తన ద్విచక్రవాహనంపై హైదరాబాద్ బయలుదేరగా.. మార్గమధ్యలో ముచ్చర్లగేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి బావ నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య మల్దకల్: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలోని బిజ్వారంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇ లా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్డె వెంకట న్న (58) పార్వతమ్మకు ఐదుగురు సంతానం. ఉన్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయంతో పా టు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవల వెంకటన్నకు కడుపునొప్పి రా గా బాధతో పాటు ఆర్థిక ఇబ్బందులు మొదల య్యాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురై గురువారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమి త్తం గద్వాల ఆస్పత్రికి అక్కడి నుంచి కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి పెంట్లవెల్లి: మండలంలోని మంచాలకట్టకు చెందిన యువ రైతు చిన్నంబావి మండలంలోని కొప్పునూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంచాలకట్టకు చెందిన సంఘమోని కృష్ణయ్య కుమారుడు సంఘమోని అశోక్ (24) చిన్నంబావి మండలంలోని కొప్పునూరులో 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాడు. మొక్కజొన్న పంట సాగు చేయగా.. పందుల బెడద ఎక్కువగా ఉండడంతో రోజువారి లాగే శుక్రవారం సాయంత్రం పొలం చుట్టు కరెంట్ షాక్ పెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అశోక్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూణ్ణాళ్ల ముచ్చటగానే ప్రేమ పెళ్లి అశోక్ మంచాలకట్ట గ్రామానికి చెందిన యువతిని రెండేళ్లుగా ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇంతలోనే అశోక్ మృతిచెందడంతో రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జూరాల కుడి కాల్వలో మహిళ శవం లభ్యం ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధా న కుడి కాల్వ పక్కన ఉన్న పొదలో గుర్తు తెలి యని మహిళ శవం లభ్యమైనట్లు రేవులపల్లి పోలీసులు తెలిపారు. వివరాలు.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రేవులపల్లికి చెందిన లాజర్ గ్రామ శివారులోని కుడి కాల్వ పక్కన ఉన్న పొదలో ఓ శవం ఉన్నట్లు గుర్తించి, విషయాన్ని జీపీఓ వెంకట్రాములుకు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి వెళ్లి కుళ్లిపోయిన శవాన్ని గుర్తించిన జీపీఓ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా.. 22 నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య గల గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ముఖం కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉందన్నారు. సమష్టి కృషితో సెమినార్ విజయవంతం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సిబ్బంది సమష్టి కృషితో పీయూలో నిర్వహించిన సెమినార్ విజయవంతమైందని వీసీ శ్రీనివాస్ అన్నారు. సెమినార్ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కమిటీ సభ్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్ వాసికి ఇండియన్ పోలీసు మెడల్
కొల్లాపూర్: విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు కొల్లాపూర్కు చెందిన సీఐ జగదీశ్వర్ ఇండియన్ పోలీసు మెడల్కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన పతకాలలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం సైబరాబాద్ కూకట్పల్లి క్రైమ్ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. జగదీశ్వర్ 1990లో ఏఆర్ కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరారు. 2002లో ఆర్ఎస్ఐగా, 2004లో ఎస్ఐగా, 2012లో సీఐ గా బాధ్యతలు చేపట్టారు. కుషాయిగూడ, వనస్థలిపురం, మాదాపూర్, రామచంద్రాపురం, మై లార్దేవర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. పలు కీ లక కేసుల దర్యాప్తు బృందాల్లో సభ్యుడిగా పని చేశారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మార్గదర్శనం చేశారు. ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు ప్రస్తుతం పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం శౌర్య పతకం, సేవా పతకంతో పాటు తెలంగాణ ప్రభుత్వ సర్వోన్నత అవార్డును అందుకున్నారు. జగదీశ్వర్కు జాతీయ స్థాయి పతకం లభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని జగదీశ్వర్ తెలిపారు. బీఈడీ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో ని బీఈడీ కళాశాలల్లో డిజర్టేషన్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఫేజ్–1లో 15 కళాశాలలకు ఈనెల 20న, ఫేజ్–2లో 14 కళాశాలలకు 22న పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత హార్డ్, సాఫ్ట్కాపీలను ఈనెల 17లోగా సమర్పించాలని సూచించారు. -
బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
వనపర్తి: జల్సాల కోసం చోరీ వృత్తిగా మార్చుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా బైకులు చోరీ చే స్తూ వాటిని రాష్ట్రం దాటించి విక్రయిస్తున్న అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారినుంచి చోరీకి సంబంధించిన రూ.12.50లక్షల విలువైన 15మోటర్ సైకిళ్లను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం పెబ్బేరు పీఎస్లో ఎస్పీ సునితారెడ్డి మీడియాకు వెల్లడించారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల ప్రాంతానికి చెందిన కుర్వ శ్రీరాములు తన బైక్ చోరీకి గురైనట్లు ఇటీవల పెబ్బేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ ఐ వెంకటేష్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రంగాపూర్ శివారులోని గుర్రంగడ్డ క్రాస్రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు అమీర్ హంజా పఠాన్ బైక్ను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లోతుగా విచారించారు. దీంతో తన సోదరుడు పఠాన్ నబీ ఖాతో కలిసి బైకులు చోరీ చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించాడు. నిందితులు ప్రధానంగా పాతబైకులు, తాళం సెట్లు పాడైపోయిన వాహనాలు, సైడ్ లాక్ వేయకుండా పార్కింగ్ చేసిన బైకులు, తాళాలు పెట్టి నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను టార్గెట్ చేసేవారు. రెండు నెలల్లో తెలంగాణలో 8, ఏపీలో 10, మొత్తం 18బైకులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన బైకులను నంద్యాల జిల్లా ఆత్మకూరుకు తరలించి విక్రయించేందుకు లింగాపురం గ్రామానికి చెందిన రమేష్, వెంకటరమణతో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. బైకులను తాము చోరీచేసి తీసుకొస్తామని, వాటిని విక్రయిస్తే ఒక్కో బైక్కు కమీషన్ ఇస్తామని నిందితులు వారితో డీల్ కుదుర్చుకున్నట్లు చోరీలకు పాల్పడుతున్నారని మా విచారణలో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. పెబ్బేరు, కొత్తకోట, గద్వాల, మానోపాడు, శాంతినగర్తోపా టు ఏపీలోని కర్నూల్, దోర్నాల, పాణ్యం, ఎరగ్రొండపాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బైకులను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన 18బైకుల మొత్తం విలువ సుమారు రూ. 12.50 లక్షలు ఉంటుందని, నిందితుల నేర చరిత్ర పై ఎస్పీ వెల్లడి ప్రధాన నిందితుడు అమీర్ హంజా పఠాన్పై గతంలో ఒక కేసు ఉండగా, అతని సోదరు డు పఠాన్ నబీఖానపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దొంగతనం, పీడీ యాక్ట్ తదితర తీవ్రమైనవి కలిపి 14 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. నబీఖాన్ ఇప్పటికే 13సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఏ1 అమీర్ అమ్జా పఠాన్ అలియాస్ అమీర్ ఖాన్, ఇందిరానగర్, ఆత్మకూరు పట్టణం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ2. పఠాన్ నబీ ఖాన్, గరీబ్నగర్, ఆత్మకూరు పట్టణం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ3. పాతకోట రమేష్, జి.లింగాపురం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ4.వల్లెపు వెంకటరమణ, లింగాపురం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, ఏపీగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన వనపర్తి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ రాంబాబు, పెబ్బేరు ఎస్ఐ వెంకటేష్గౌడ్ను అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రెడ్డి, కానిస్టేబుళ్లు నరసింహ, విజయ్, రైటర్ ఆంజనేయులును నగదు బహుమతితో అభినందించారు. 18 బైకుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు జల్సాల కోసం బైక్ చోరీలను వృత్తిగా మార్చుకున్న అన్నదమ్ములు పాత బైకులు, తాళాలు సరిగాలేని వాహనాలే టార్గెట్ ఏపీ, తెలంగాణలో చోరీలు హత్య, దొంగతనాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితుల నేర చరత్ర రూ.12.50 లక్షల విలువైన 18 బైకుల చోరీల్లో రికవరీ -
డివైడర్ను ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా
● 8 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు ● అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం ● ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి భూత్పూర్: డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా శ్రీకృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టి, బోల్తా పడింది. ఎస్ఐ నాగన్న, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకు 35 మంది ప్రయాణికులతో అరుణాచలం బయలుదేరిన బస్సు 11:30 గంటల ప్రాంతంలో భోజనం చేసేందుకు జడ్చర్ల సమీపంలోని ఓ దాబా వద్ద ఆగింది. అనంతరం ప్రయాణం ప్రారంభించిన బస్సు భూత్పూర్ వద్ద పెట్రోల్ బంక్ ఎదురుగా అతివేగంతో డివైడర్ను ఢీకొని బోల్తా పడి దాదాపు 15 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే ఇనుప లోడ్తో ఉన్న ట్రాలీని ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న రమాదేవి, లక్ష్మీదుర్గ, సత్యవతి, లావణ్య, సాయితేజ, మహేశ్వరి, శరణప్ప, సంతోషిణికి తీవ్ర గాయాలు కాగా.. 4 వేర్వేరు అంబులెన్స్లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అజాగ్రత్త, అతివేగంగా బస్సు నడుపుతూ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రామాంజనేయులుపై ప్రయాణికురాలు రమాదేవి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. ఘటన స్ధలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఘ టనాస్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణా లను సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్నను అడిగి తెలు సుకున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని, వారికి అవసరమైన సాయం అందించాలని ఎస్పీ సూచించారు. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ ముడావత్ బాలకోటి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లిక్కి న వీన్గౌడ్, సాయి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ట్రా ఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులకు సహకరించారు. 3 కిలోమీటర్ల మేర.. బస్సు రోడ్డుపై బోల్తాపడటంతో కర్నూల్ వైపు వెళ్లే వాహనాలు 3 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, జేసీబీ, క్రేన్ సహాయంతో ట్రావెల్ బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తరలించారు. దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్తో ప్రయాణికుల వాగ్వాదం జడ్చర్ల సమీపంలో దాబా వద్ద ఆగిన సమయంలో బస్సు వేగం తగ్గించి, జాగ్రత్తగా నడపాలని ప్రయాణికులు డ్రైవర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచా రం. ఓ ప్రయాణికుడు భోజనం చేస్తుండగా.. వేగంగా తినాలని, ఇలా అయితే గమ్యం ఎప్పుడు చేరుకుంటామని డ్రైవర్ చెప్పడంతో ప్రయాణికుడు భోజ నం మధ్యలో వదిలేసి బస్సు ఎక్కాడు. ప్రమాదంలో సదరు ప్రయాణికుడి బంధువులకు తీవ్ర గా యాలు కావడంతో డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
రానున్న ఎన్నికల్లో మోదీ పతనం ఖాయం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ చౌరస్తాలో సీపీఐ జన చైతన్య పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన మద్దతు, కార్మిక హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువల పునరుద్ధరణ కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీపీఐ ఆధ్వర్యంలో మహా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి బాలకిషన్, నాయకులు పరమేశ్ గౌడ్, సురేష్, రాము, కృష్ణ యాదవ్, గోవర్ధన్, అల్వాల్ రెడ్డి, శంకర్ నాయక్, భాష, మహేష్, సత్యనారాయణ రెడ్డి, భార్గవి, ఆంజనేయులు, ఇందిర, సువర్ణ, జంగయ్య, దేవానందు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, శ్రీను, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు -
ఒక్క ఘటన.. 11 కుటుంబాలు.. తీరని లోటు
నేతను కోల్పోయిన కుటుంబం.. తండ్రిని కోల్పోయిన పిల్లలు.. భర్తను కోల్పోయిన భార్య.. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన ఇళ్లు.. ఆ రోజు నారాయణపేటలో జరిగిన మారణకాండ వెనుక దాగి ఉన్న అసలు విషాదం ఇదే. మృతుల్లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి (77), ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి (45), అప్పటి మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్(45), గన్మెన్ రాజారెడ్డి (42), ఎమ్మెల్యే డ్రైవర్ శ్రీనివాసులు (35), ఆర్డీఓ కార్యాలయ అటెండర్ సాయిబన్న (48), మాగనూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు లోకేశ్వర్రెడ్డి (26), ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి కాంగ్రెస్ నాయకుడు మోనప్పగౌడ్ (31), రవీందర్గౌడ్ (38) ఉన్నారు. గాయపడిన నారాయణపేటకు చెందిన దూడం విజయ్కుమార్, చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి డ్రైవర్ అరీఫ్ అనంతరం చికిత్సపొందుతూ మృతి చెందారు. తండ్రి.. కొడుకు.. ప్రభుత్వ అధికారి.. సిబ్బంది.. పార్టీ నాయకులు..ఒకే ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో 11 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
ఎన్సీసీఏ లీగ్కు జిల్లా క్రికెటర్ అద్నానుద్దీన్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రానికి చెందిన క్రికెటర్ ఎండీ అద్నానుద్దీన్ క్రికెట్లో విశేషంగా ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి ఎండీ రియాజుద్దీన్ సీనియర్ క్రికెటర్ కావడంతో చిన్నప్పటి నుంచే అద్నానుద్దీన్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. అనతికాలంలోనే ఎడమ చేతి బ్యాట్స్మెన్గా కుడిచేత లెగ్ స్పిన్నర్గా రాణిస్తున్నాడు. కెన్యాలోని నైరోబి కంట్రీ క్రికెట్ అసోసియేషన్ (ఎన్సీసీఏ) లీగ్ డివిజన్ వన్ క్రికెట్ పోటీల్లో అద్నానుద్దీన్ పాల్గొంటున్నాడు. ఓబోయో క్రికెట్ అకాడమీ ఏ–టీమ్ జట్టు తరఫున అద్నానుద్దీన్ లీగ్ పోటీల్లో ఆడనున్నాడు. ఈనెల 17వ తేదీన అద్నానుద్దీన్ కెన్యాకు బయలుదేరనున్నాడు. లీగ్ పోటీలు ఏడాది నవంబర్ మొదటి వారం వరకు జరగనుంది. ఈ లీగ్లో పాల్గొనే 12 జట్లతో క్రికెట్ ఆడే అవకాశం అద్నానుద్దీన్కు దక్కింది. అద్నానుద్దీన్ జాతీయ, రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభచాటాడు. పలుసార్లు హెచ్సీఏ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. 2024లో నేపాల్లో జరిగిన ఖేలో భారత్ యూత్ గేమ్స్ ఇంటర్నేషనల్ సిరీస్లో పాల్గొన్నాడు. 2017–18లో మహారాష్ట్ర నాసిక్లో జరిగిన అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, 2019–20లో మహబూబ్నగర్లో జరిగిన అండర్–19 ఎస్జీఎఫ్ఐ క్రికెట్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో హైదరాబాద్లో జరిగిన లీగ్ మ్యాచుల్లో పాల్గొని ప్రతిభచాటాడు. హైదరాబాద్ వండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ జేఎస్ఎస్ సైన్స్, టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగిన సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో అద్నానుద్దీన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాగా.. ఎన్సీసీఏ లీగ్ పోటీలకు వెళుతున్న ఎండీ అద్నానుద్దీన్ను శుక్రవారం డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. -
మావోయిస్టుల మారణకాండకు 21ఏళ్లు!
‘నారాయణపేటలో పంద్రాగస్టు వేడుకల వేళ నెత్తుటి విషాదం ● మావోల తూటాలకు ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు 10మంది దుర్మరణం నారాయణపేట: పంద్రాగస్టు.. దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ.. నారాయణపేటలో మాత్రం తూటాల మోత మార్మోగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మావోయిస్టుల ఘాతుకానికి నేటితో 21ఏళ్లు. పంద్రాగస్టు వచ్చిందంటే చాలు.. 2005 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ రోజున నారాయణపేటలో చోటుచేసుకున్న ఆ రక్తపాత ఘటన జ్ఞాపకాలు స్థానికుల మదిలో మెదులుతాయి. ఈ ఘటనలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్రెడ్డితోపాటు మరో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒక్క ఘటన.. 11కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. టెంకాయ కొడుతుండగా.. తూటాల మోత 2005 ఆగస్టు 15న నారాయణపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో సీసీరోడ్డు పనులకు శ్రీకారం చుట్టేందుకు టెంకాయ కొడుతుండగా మాటువేసిన మావోయిస్టులు మధ్యాహ్నం 1:25 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు తూటాలకు బలయ్యారు. 21ఏళ్లయినా.. జ్ఞాపకం చెరగలేదు ఆ రోజు తూటాల మోత ఆగిపోయింది. ఘటనా స్థలం నిశ్శబ్దమైంది. కానీ మృతుల కుటుంబాల్లో మిగిలిన విషాదం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది.ప్రతి పంద్రాగస్టు వేడుకా.. ఆ కుటుంబాలకు ఆనందంతోపాటు నాటి విషాదాన్ని గుర్తుచేస్తోంది. తృటిలో ప్రాణాలు దక్కించుకున్నవారు ఈ ఘటనలో అప్పటి ఆర్డీఓ శివారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్రెడ్డి, ఘన్శ్యాందాస్ ధారక్, ఎమ్మెల్యే పీఏ భాస్కర్, అవుటి రాజశేఖర్, నాగేందర్, లోట్టి శ్రీనివాస్, సూరి తదితరులు గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. విషాదం తర్వాత.. కుటుంబాలకు అండగా బాధిత కుటుంబ సభ్యులకు వారి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి సతీమణి చిట్టెం లక్ష్మికి ఆర్డీఓగా అవకాశం లభించగా.. ఆమె అనంతరం ఐఏఎస్ హోదాకు ఎదిగారు. -
యువత చైతన్యంతో ముందుకు రావాలి
సమాజంలో అవినీతి పెరిగిపోవడం వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు పేదరికంలోనే ఉండిపోతున్నారు. అక్రమ మార్గాల్లో సంపాదించే వారు ధనవంతులవుతుంటే.. పేదలు మాత్రం వెనుకబడిపోతున్నారు. అవినీతిని అంతమొందించేందుకు యువత చైతన్యంతో ముందుకు రావాలి. బాధ్యతాయుతమైన యువతను తయారు చేసినప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. విద్య, ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. – కె.జగదీశ్వర్రెడ్డి, డిగ్రీ విద్యార్థి, ఎంవీఎస్ కళాశాల అవినీతిని అంతం చేస్తేనే.. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్లు అవుతోంది. దేశం మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా వెలుగొందుతోంది. ముఖ్యంగా దేశ జనాభాలో ఎక్కువశాతం ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థికస్వావలంబనకు అనేక పథకాలు రూపొందించాలి. అన్నింటా అవినీతి రాజ్యమేలుతోంది. దీన్ని అంతం చేస్తే దేశాభివృద్ధి సుసాధ్యమే. విద్యకు,. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి. – పి.రమేష్చందర్, రిటైర్డ్ డీడీ, వయోజన విద్య -
తూర్పు కమాన్ కట్టడాన్ని కాపాడుకుందాం
తూర్పు కమాన్ దేశభక్తికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా నిలిచిన ఈ కట్టడాన్ని కాపాడుకుందాం. రాబోయే తరాలకు అందించాలంటే దానిని పూర్తిస్థాయిలో పరిరక్షించాలి. తూర్పు కమాన్ సుందరీకరణ పనులు చేపట్టి పాలమూరుకు తలమానికంగా నిలబెట్టాలి. ఇప్పటికీ ఆ వీధి ప్రజలు, యువత గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవం రోజున తూర్పు కమాన్పై జెండాలు ఎగురవేస్తారు. – రాఘవేంద్రశర్మ, మహబూబ్నగర్ -
పేదింట.. మువ్వన్నెల రెపరెపలు
మక్తల్: మక్తల్ పట్టణంలోని వినాయకనగర్కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్య నర్సప్ప ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈయన 2000 సంవత్సరంలో మృతిచెందగా.. ఆయన వారసులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కడు పేదరికంలో ఉన్న ఈ కుటుంబం తమ పూరి గుడిసె ముందే జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సహాయం అందడం లేదని ఆర్య నర్సప్ప ముగ్గురు కుమారులు వాపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నారాయణ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పూరిగుడిసెలోనే కాలం వెళ్లదీస్తూ.. జెండా పండుగను జరుపుకొంటున్నారు. తాము బతికినంత కాలం ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని నారాయణ ‘సాక్షి’కి తెలిపారు. -
దేశం బాగుంటేనే ముందుకు..
దేశం అన్ని రంగాల్లో బలంగా ఉండాలి. ముఖ్యంగా రక్షణ రంగంలో పటిష్టంగా ఉంటేనే అంతర్జాతీయంగా దేశానికి ప్రత్యేక స్థానం లభిస్తుంది. ప్రస్తుతం మన సైన్యం మరింత శక్తిమంతంగా మారింది. భారత సైనికుడిని చూస్తేనే శత్రుదేశాలు ఆలోచించే స్థాయికి చేరుకున్నాం. గతంలో గన్ఫైర్కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే సైన్యంలో చేరడం కూడా అంత సులభం కాదు. శారీరక దృఢత్వంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ ఉండాలి. మా ఊరి నుంచి 82 మంది సైన్యంలో పనిచేయడం నాకు ఎంతో గర్వకారణం. – రవి, మాజీ ఆర్మీ జవాన్, కూచూర్ అందరికీ సమాన విద్య కల్పించాలి ప్రతి ఒక్కరికీ సమానంగా నాణ్యమైన విద్య అందాలి. ప్రభుత్వాలు విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యకు కనీసం 25 శాతం బడ్జెట్ కేటాయిస్తే కేజీ నుంచి పీజీ వరకు విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మారుతున్నాయి. దీంతో విద్యారంగం ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. – కిష్టయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అసమానతలు లేని సమాజం కావాలి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా సమాజంలో అసమానతలు పూర్తిగా తగ్గలేదు. కులం ఆధారంగా అవకాశాల్లో వివక్ష కొనసాగితే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుని అవినీతిని అంతమొందించేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా రాజకీయ అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. నాయకులకు 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ విధానం తీసుకొచ్చి.. యువత రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. – కార్తీక్, ఎంఎస్ఎఫ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
వేడుకలకు ముస్తాబు
పాలమూరు: జిల్లా పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించనున్న 80వ భారత స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెవెన్యూ, మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు మైదానాన్ని సిద్ధం చేశారు. ప్రధాన వేదికను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేడుకలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పరేడ్ కమాండర్గా ఆర్ఐ కృష్ణయ్య వ్యవహరించనున్నారు. వేడుకలకు వచ్చే ప్రజల కోసం తాగునీటి సదుపాయంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన, స్టాల్స్ను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం పరేడ్ మైదానంలో పోలీసులు కవాతు సాధన నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, క్లాక్టవర్, వన్టౌన్ చౌరస్తాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎస్పీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ భవనాలకు కూడా విద్యుత్ దీపాలంకరణ చేశారు. పరేడ్ మైదానాన్ని సిద్ధం చేసిన అధికారులు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో ప్రధాన కూడళ్లకు విద్యుత్ దీపాల అలంకరణ -
పీఎంశ్రీ నిధులను సక్రమంగా వినియోగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేంద్రం నుంచి అందిన నిధులను నిబంధనల ప్రకారం సక్రమంగా వినియోగించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పాఠశాల అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించి, వచ్చే వారంలోపు పనులను పూర్తిచేయాలని సూచించారు. డ్రెయినేజీ, గేట్లు, తలుపు లు, కిటికీలు, ఫ్యాన్లు, లైట్లు, ర్యాంపులు, బాలికల మరుగుదొడ్లలో అవసరమైన సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. దెబ్బతిన్న వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిధులు ఖర్చు చేసినట్లు చూపించడం కాకుండా వాటి వినియోగంతో పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ప్రతి పనికి సంబంధించిన ఖర్చుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు పనులకు ముందు, తర్వాత ఫొటోలు, తేదీ, జీపీఎస్ వివరాలను భద్రపరచాలని సూచించారు. -
పాలమూరు తూర్పు కమాన్
స్టేషన్ మహబూబ్నగర్: నగరానికి ముఖద్వారం తూర్పు కమాన్. అప్పటి లోకాయపల్లి సంస్థానాధీశులు నాలుగు కమాన్లు కట్టారు. దీంట్లో ఒకటి తూర్పు కమాన్.. ఇది అనేక ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనరాదని, పత్రికలు చదవడం, రేడియో వినడం చేయకూడదని అప్పట్లో నిజాం నవాబు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో 1947, ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం రాగా... ఆ మరుసటి రోజు అర్ధరాత్రి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం పక్కన గల తూర్పు కమాన్పై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర ఉద్యమకారులు విరివింటి లక్ష్మణమూర్తి, పద్మయ్య ఆనాటి నిజాం పాలకులకు సవాలు విసిరారు. 1927లో పాలమూరులో ‘శ్రీ సీతారామాంజనేయ బాల భక్త సమాజాన్ని’ నెలకొల్పడంతో జిల్లాలో గ్రంథాలయ ఉద్యమం ఊపందుకుంది. ఈ సంస్థ వందలాది మంది కార్యకర్తలను తయారు చేసింది. దేశభక్తికి స్ఫూర్తి.. దశాబ్దాల ఘన కీర్తి -
సర్వే సాగిందిలా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఒక్కో జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 250 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రతి జిల్లాలో 25 మంది పురుషులు, 25 మంది మహిళలను ఎంపిక చేసి మూడు ప్రశ్నలపై సమాధానాలు తీసుకున్నారు.79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ–సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా? -
అంతరాలే అసలు సమస్య
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు ● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు పల్లెలు మరింత అభివృద్ధి చెందాలి.. ఆగస్టు 15 వస్తే ఇప్పటికీ పండగ గుర్తుకొస్తుంది. దసరా, దీపావళి మాదిరిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకునేవాళ్లం. ఆ రోజు ఊరంతా ఒకచోట చేరి జాతీయ జెండా ఎగురవేసి, మిఠాయిలు పంచుకునేవాళ్లం. అనంతరం సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలపై చర్చించి, అవసరమైన తీర్మానాలు చేసుకునేవాళ్లం. ఇన్నేళ్ల స్వాతంత్య్రంలో గతంతో పోలిస్తే ప్రజల్లో స్వార్థం పెరిగింది. గతంలో ‘మన ఊరు.. మన ప్రాంతం’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘నాకేమిస్తారు?’ అనే ధోరణి కనిపించడం బాధ కలిగిస్తోంది. 25 ఏళ్లుగా దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా.. పల్లెలు ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. – రంగారావు, తెలంగాణ పోరాట యోధుడు, మాజీ జెడ్పీటీసీ -
మన్యంకొండకు ‘శ్రావణ శోభ’
● విశేషోత్సవాలు ప్రారంభం.. సెప్టెంబర్ 16 వరకు వేడుకలు ● ప్రతిరోజూ శాంతిహోమం, వేయి తులసి దళాలతో అర్చన మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస విశేషోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, శాంతిహోమం, వేయి తులసి దళాలతో అర్చన నిర్వహించనున్నారు. విశేషోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు.. ప్రతి శనివారం రాత్రి శేషవాహన సేవ నిర్వహించనున్నారు. -
జాతీయ జెండా ఎగురవేసేది వీరే..
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్కర్నూల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి పాలమూరు: కోయిలకొండ మండల పరిధిలో ఉన్న బూర్గుపల్లి, పారుపల్లి గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప కేంద్రాల పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గ్రామాల్లో ఇంటి పరిసరాలు, ఆవరణంలో కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం, దోమల వల్ల వచ్చే వ్యాధులను కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకర్, డాక్టర్ శివకాంత్, సుభాష్చంద్ర పాల్గొన్నారు. కేజీబీవీల్లో సివిల్ పనులు వేగవంతం చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని క స్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో చేప డుతున్న సివిల్ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. గురువారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సివిల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆ ఇద్దరి రూటే సపరేటు!
డిస్ట్రిక్ట్ క్లబ్లో దావత్లు? బదిలీ కోసం వచ్చే సిబ్బంది నుంచి డిస్ట్రిక్ట్ క్లబ్లో నాటుకోడి పులుసు, ఖరీదైన మద్యం బాటిళ్లతో దావత్ ఏర్పాటు చేయించుకునేవారని కొందరు ఆరోపిస్తున్నట్లు సమాచారం. తమకు తగిన ‘మర్యాద’ చేయని వారిపై ఉన్నతాధికారి వద్ద ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురిచేసేవారని సిబ్బంది వాపోతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ క్లబ్లో సదరు వ్యక్తి కోసం ప్రత్యేక గది కూడా ఉండేదన్న ప్రచారం పోలీస్శాఖలో ఉంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఉన్నతాధికారి పేరు చెప్పి కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మహబూబ్నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యవహారాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. డీఐజీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపైనా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి పేరు చెప్పుకుంటూ బదిలీలు, ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. తమ మాట వినని సిబ్బందిపై పెద్ద సార్కు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023లో ఐదు జిల్లాలను కలిపి జోగుళాంబ జోన్–7 ఏర్పాటు చేయడంతో దాని పర్యవేక్షణకు డీఐజీ స్థాయి అధికారిని నియమించారు. డీఐజీ కార్యాలయంలో విధుల కోసం వివిధ హోదాల్లో సిబ్బందిని అటాచ్ చేశారు. వీరిలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు గన్మెన్స్, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులున్నారు. వీరిలో ఇద్దరు సిబ్బంది డీఐజీకి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీఐజీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐల బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సదరు ఇద్దరు సిబ్బంది బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన ఓ సిబ్బంది బదిలీల వ్యవహారాన్ని చక్కబెట్టేవారని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమను సంప్రదించే సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని.. మాట వినని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయించేలా ఉన్నతాధికారులపై ప్రభావం చూపేవారని కొందరు ఆ రోపిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారు సర్దుబాటు చేసుకుంటే తిరిగి కోరుకున్న ప్రాంతాలకు మార్పులు జరిగేవన్న విమర్శలు ఉన్నాయి. డీఐజీ కార్యాలయంలో వారు చెప్పిందే వేదం బదిలీల్లో జోక్యం.. దావత్లు, డబ్బుల డిమాండ్పై ఆరోపణలు మాట వినని సిబ్బందిపై పెద్దసార్కు చాడీలు ఉన్నతాధికారి పేరు చెప్పి పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు.. ఎస్ఐల బదిలీలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండ్ చేసేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్కు అంగీకరించని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేవారని.. ఆ తర్వాత వారు సర్దుబాటు చేసుకుంటే కోరుకున్న స్థానాలకు మార్పులు జరిగేవన్న ఆరోపణలు ఉన్నాయి. గత మూడున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు కలిపి సుమారు 300 మందికి పైగా.. ఎస్ఐలు వంద మందికిపైగా బదిలీ అయినట్లు సమాచారం. ఈ బదిలీల్లో సదరు ఇద్దరి పాత్రపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు పోలీసు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహించలేక గతంలో పలువురు పోలీసు సిబ్బంది హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అక్కడ పనిచేయడం కంటే ఉద్యోగమే వదిలేస్తామని కొందరు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించిన ఘటనలు పలుమార్లు జరిగాయని తెలుస్తోంది. సర్దుబాటు చేసుకుంటే.. కోరుకున్న స్థానం ? విచారణకు డిమాండ్ డీఐజీ కార్యాలయంలో పనిచేసిన ఈ ఇద్దరు సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పోలీస్ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. బదిలీలు, దావత్లు, డబ్బుల డిమాండ్ వంటి ఆరోపణల్లో వాస్తవమెంత? ఉన్నతాధికారి పేరు చెప్పుకుని వారు వ్యవహరించారా? అనే అంశాలపై విచారణ జరిపితే స్పష్టత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు.. వారిని ఆ స్థానం నుంచి బదిలీ చేయాలని కోరుతున్నారు. -
సైబర్ ఉచ్చులో విద్యార్థులు చొక్కొద్దు
మహబూబ్నగర్ క్రైం: సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధంగా ఉపయోగపడుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. టూటౌన్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని స్వామి వివేకనందా డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ బ్యాకింగ్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇదే సమయంలో సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. కొత్త రకం పద్ధతులు ఎంపిక చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వీటి పట్ల పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పెట్టుబడి పథకాలను నమ్మి పెట్టుబడులు పెట్టరాదని, ఇలాంటి పద్ధతిలోనే అధికంగా నేరాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మి డబ్బులు ఇవ్వరాదన్నారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కి సమాచారం ఇవ్వడం, నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అనంతరం సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కోసం వీడియోలను ప్రదర్శించారు. అదేవిధంగా పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, సైబర్ క్రైం ఎస్ఐ శ్రావణ్కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నెలాఖరులోగా పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): యాసంగి 2024–25 సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న సీఎంఆర్ డెలివరీని ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పెండింగ్ సీఎంఆర్పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం సీఎంఆర్ డెలివరీ పూర్తికాగా.. మిగిలిన 5 శాతం తొమ్మిదిమంది బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు తమ సామర్థ్యానికి అనుగుణంగా రోజుకు రెండు షిఫ్టుల్లో మిల్లింగ్ నిర్వహించి.. పెండింగ్ సీఎంఆర్ను డెలివరీ చేయాలని సూచించారు. బాయిల్డ్ రైస్కు బదులుగా రా రైస్ టార్గెట్ కేటాయిస్తే గడువులోగా సీఎంఆర్ పూర్తి చేస్తామని కొందరు మిల్లర్లు సమావేశంలో కోరారు. అయితే జిల్లాకు ప్రస్తుతం రా రైస్ టార్గెట్ మాత్రమే కేటాయించారని.. బాయిల్డ్ రైస్ టార్గెట్ ఇచ్చే అవకాశం లేదని కమిషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్ సీఎంఆర్ డెలివరీలో ఎలాంటి జాప్యం చేయకుండా ఆగస్టు 31లోగా మొత్తం డెలివరీ పూర్తి చేసి డిఫాల్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీఎం రవినాయక్, డీటీలు, సంబంధిత రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలి
● సమాచారం అందిన వెంటనే తనిఖీలు చేపట్టాలి ● భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఇసుక అ క్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గురువారం తహసీల్దార్లతో నిర్వహించిన వెబెక్స్ సమీక్షలో ఇసుక అక్రమ తవ్వకాలు, భూభారతి, సదాబైనమా, మీసేవ, ప్రజాపాలన, కుటుంబ రిజిస్ట్రేషన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇసుకను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రికవరీ చేయాలన్నారు. మిడ్జిల్ మండలంలో సీజ్ చేసిన ఇసుకను వెంటనే వేలం వేయాలని మైనింగ్ అధికారులు, తహసీల్దార్ను ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మీడియాలో వార్తలు వచ్చినప్పుడు సంబంధిత తహసీల్దార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకున్న చర్యలను తెలియజే యాలని సూచించారు. అధికారులు బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టకుండా.. తమ పరిధిలోని అంశాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని స్పష్టం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నందున ప్రతి మండలం నుంచి 10 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను వెంటనే పంపాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న గృహాల ఎంపిక ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేసి అర్హుల జాబితాను హౌసింగ్ పీడీ కార్యాలయానికి పంపాలని సూచించారు. స్థానిక సమస్యలను ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పరిష్కరించి.. గృహాల కేటాయింపులో జా ప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం భూభారతి పోర్టల్లో 60 రోజులకుపైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేయర్ల కొరత, కోర్టు కేసు లు, సాంకేతిక కారణాలతో నిలిచిన దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి సాధ్యమైన వాటిని పూర్తి చేయాలన్నారు. సాదాబైనమా, రీసర్వే, నక్షా సర్వే, మీసేవ, కుటుంబ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను కూడా సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల జారీ సమయంలో మరణించిన వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. -
నిరీక్షణకు మోక్షం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అర్హులైన నిరుపేదలకు చేయూత అందించే పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పింఛన్ల ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ లాగిన్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 15లోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి.. సెప్టెంబర్ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. పాత దరఖాస్తులు పక్కనపెట్టి.. గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాలు, తెల్లకాగితాలపై పింఛన్ల కోసం దరఖాస్తు చేసినవారు కూడా తాజా ఫార్మాట్లో మరోసారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సమర్పించిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలను కొత్త దరఖాస్తుకు జత చేయాలి. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్తో పాటు వ్యక్తిగత వివరాలను ఫారంలో పొందుపరిచారు. ఇవి ఆన్లైన్ నమోదుకు వినియోగించనున్నారు. దరఖాస్తులు ఎక్కడంటే.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో.. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. అనంతరం డీఆర్డీఓ ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి.. తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు. వృద్ధాప్య పింఛన్లపై సందిగ్ధత కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ చేసినా.. వృద్ధాప్య పింఛన్ల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. కొత్తగా అర్హత పొందే వృద్ధులకు వర్తించే వయో పరిమితిపై మార్గదర్శకాల్లో స్పష్టమైన వివరాలు లేకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 96,283 మంది లబ్ధిదారులు జిల్లాలో ప్రస్తుతం 96,283 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.23.92 కోట్లకుపైగా చెల్లిస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 33,251, వితంతువులు 40,829, దివ్యాంగులు 12,565, గీత కార్మికులు 595, చేనేత కార్మికులు 427, బీడీ కార్మికులు 1,690, ఒంటరి మహిళలు 4,161 మంది ఉన్నారు. కొత్త దరఖాస్తుల స్వీకరణతో అర్హత కలిగిన మరింత మంది పింఛన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. పింఛన్ల మంజూరుకు మార్గదర్శకాలు జారీ అర్హతలు.. అనర్హతలపై స్పష్టత రేపు కొత్త లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల నుంచి పంపిణీ -
పనులపై నిరంతర పర్యవేక్షణ
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశానిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూనిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట అక్టోబర్ 2 లక్ష్యంగా వేగవంతం.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ఆయా మండలాల్లో కేటాయించిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడుగుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలం ఆమ్లీకుంటలలో కేంద్రబృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అక్టోబర్ 2 డెడ్లైన్తో పనులు పూర్తి చేసేలా పనుల వేగవంతం చేస్తున్నాం. పైలెట్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నాను. మరో కొన్నిరోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. – మాలిక్, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ● -
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ప్రతి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదట పెండింగ్లో ఉన్న దొంగతనం కేసులు, ఎన్బీడబ్ల్యూ, సైబర్ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, సీసీటీఎన్ఎస్ కేసులపై సమగ్రంగా సమీక్షించారు. నిందితుల అరెస్టులు, కోర్టు కేసుల పరిష్కారంపై స్టేషన్ వారీగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి, నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ కేసులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరికుమార్, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, రామకృష్ణ, నాగార్జునగౌడ్, రవిబాబు, ఎస్ఐలు రాఘవేందర్, రవి పాల్గొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అధికారులు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ క్రాంతికిరణ్, సభ్యులు గోవర్ధన్రెడ్డి, నిరంజన్గౌడ్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. ● పీయూ బాలుర హాస్టల్ను రిజిస్ట్రార్ రమేష్బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. వార్డెన్లు కృష్ణయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి వాలీబాల్ అకాడమీ పునఃప్రారంభం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా వాలీబాల్ అకాడమీని ఈనెల 13 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ యథావిధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కోచ్లు, వార్డెన్తో పాటు సిబ్బంది అందరూ విధుల్లో చేరాలని సూచించారు. -
ఆస్పత్రుల్లో భద్రత గాలికి!
పాలమూరు: ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లోనే భద్రతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్న పరిస్థితి వెలుగుచూసింది. నగరంలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా పలు లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఏ ఒక్క ఆస్పత్రికీ ఫైర్ సేఫ్టీ అనుమతి (ఎన్ఓసీ) లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, నర్సింగ్, టెక్నికల్ సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు, ల్యాబ్ అనుమతులు, ధరల పట్టికలు, పొల్యూషన్, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణకు సంబంధించిన పత్రాలు సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సాన్వి సూపర్ స్పెషాలిటీ, అభయప్రద, మారుతీ సూపర్ స్పెషాలిటీ, వెన్నెల, ఆరోగ్య ఆస్పత్రులతో పాటు పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. ఆయా ఆస్పత్రుల్లో రికార్డులు, అనుమతులు, సిబ్బంది అర్హతలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ● సాన్వి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకపోవడంతో పాటు టెక్నికల్, నర్సింగ్ సిబ్బంది ధ్రువపత్రాలు అందుబాటులో లేవని గుర్తించారు. రోగులకు కనిపించే విధంగా ధరల పట్టికను ఏర్పాటు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ● మారుతీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రసవాలు, రోజువారీ ఓపీతో పాటు వైద్యులు, సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అక్కడ కూడా సిబ్బంది అర్హతకు సంబంధించిన సరైన పత్రాలు లేవని గుర్తించారు. ● వెన్నెల ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీతో పాటు ఫైర్ ఆడిట్ కూడా లేదని గుర్తించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వినియోగించే అగ్నిమాపక యంత్రాల్లో కొన్ని కాలం చెల్లినవిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రితో పాటు అదే భవంనలో ఉన్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ను పరిశీలించారు. క్యాన్సర్ ఆస్పత్రిలో ధరల పట్టిక వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లడ్బ్యాంక్ నిర్వహణ ఎలాంటి లోపాలు లేకుండా సరిగా చేపట్టాలని సూచించారు. నిబంధనలు పాటించాల్సిందే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొదటి విడతగా ఆరు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టామని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్, టెక్నికల్, ఇతర సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు, సేవల ధరల పట్టిక, ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ, పొల్యూషన్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆస్పత్రులు పారదర్శకంగా వ్యవహరిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రుల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ఆరు ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ బృందం తనిఖీలు ఫైర్ సేఫ్టీతో పాటు వైద్య, టెక్నికల్, నర్సింగ్ సిబ్బంది ధ్రువపత్రాలు నిల్ ధరల పట్టికలు లేకుండానే వైద్యసేవలు.. రోగులకు సమాచారం కరువు 15 రోజుల్లో అనుమతులు పొందాలి: డీఎంహెచ్ఓ -
స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల
నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు. గతంలో జాప్యం.. ఇప్పుడు వేగం గతంలో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, పంచాయతీశాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు.స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్లు మంజూరు మహిళా సంఘాల భవనాలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం -
సీతాఫల్ టెండర్లతో రూ.27.46లక్షల ఆదాయం
మహబూబ్ననగర్ న్యూటౌన్: జిల్లాలో అటవీశాఖ పరిధిలోని మూడు యూనిట్లకు నిర్వహించిన సీతాఫల్ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం వచ్చింది. డీఎఫ్ఓ రేవంత్చంద్ర ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం ప్రాంగణంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించారు. మహబూబ్నగర్, నవాబ్పేట, మహమ్మదాబాద్ యూనిట్లకు అటవీ ప్రాంతంలో సీతాఫలాల సేకరణ హక్కులు కల్పించేందుకు టెండర్లు నిర్వహించారు.మహబూబ్నగర్ యూనిట్కు నిర్వహించిన వేలం పాటలో పది మంది పాల్గొనగా.. తాటి శ్రీనివాసులు రూ.14 లక్షలకు దక్కించుకున్నారు. నవాబుపేట యూనిట్ను మక్సూద్ అలీ రూ.5.41 లక్షలకు, మహమ్మదాబాద్ యూనిట్ను జి.కేశవులు రూ.8.05 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ అటవీ రేంజ్ అధికారి రాజేందర్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హాయ్, పరిపాలనాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
నిపుణుల సూచనమేరకు సాగు చేయండి..
అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలన్నారు. రూ.వేల పెట్టుబడితో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.. కేఎల్ఐ ప్రాజెక్టు తో నియోజకవర్గ పరిధిలోని రైతుల కు సాగునీరు ఇ వ్వడానికి గల సాఽ ద్యాసాధ్యాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించాలి.నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నీటితో నింపే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులు కొంత సహకరించి నీటిని విడుదల చేస్తే ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. – తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే -
వరి ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక
● రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలం సీజన్ 2026–27లో వరి ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత మూడు సీజన్లలో కొనుగోలు లక్ష్యాలు, పురోగతితో పాటు ప్రస్తుత పంట సాగు, క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా ఈ సీజన్లో ఆశించిన దిగుబడిని అంచనా వేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే పరికరాలు, టార్పాలిన్లు, ధాన్యం శుభ్రపరిచే పరికరాలు తదితర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వారీగా ధాన్యం కేటాయింపు, మిల్లింగ్ ప్రక్రియను సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి అవసరమైన బియ్యం సరఫరా చేయాలని సూచించారు. అనంతరం పీడీఎస్ ద్వారా మూడు నెలలకు అవసరమైన బియ్యం సరఫరా, పంపిణీపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన బియ్యం నిల్వలను త్వరగా చౌకధర దుకాణాలకు తరలించి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి కృష్ణ, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ రవినాయక్, డీఆర్డీఏ ఏపీడీ రేణుక, డీటీ రాజీవ్రెడ్డి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
డీఐజీ చౌహాన్పై బదిలీ వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ● ఇన్చార్జి డీఐజీగా షాన్వాజ్ ఖాసీం మహబూబ్నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి. -
ఆరుతడి పంటలే సాగు చేయాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయశాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్నినో కారణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్నినో ప్రభావంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపారు. రూ.వేల పెట్టుబడితో వరి సాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాలకు ఎంత నీరు వస్తోంది.. ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, విజయుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్బాషా, హేమంత కేశవ్ పాటిల్, వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఐఏబీ సమావేశంలోమంత్రులు జూపల్లి, వాకిటి నీటి విడుదల, పంటల సాగుపైసుదీర్ఘంగా చర్చ పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు -
వారానికి మూడు రోజులివ్వాలి..
జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి రైతులకు వారానికి మూడురోజులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి. వానాకాలం పంటల సాగుకు రాబోయే కొద్దిరోజుల పాటు జూరాల ప్రధాన కుడి కాల్వ నుంచి నీరు వదలాలి. ఎగువ నుంచి వరద ఆశించిన మేర వస్తే.. నిరంతరం సరఫరాకు అధికారులు ప్రయత్నించాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే వారాబందీ విధానంలో నీటి విడుదల చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేయాలి. ఎల్నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. – మధుసూదన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరిసాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. – వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే -
సీనియర్ పీడీలకు పదోన్నతులు ఇవ్వాలి
ఉమ్మడి జిల్లాలో ని ప్రభుత్వ జూ నియర్ కళాశాలల్లో పీడీలు లే కపోవడం వల్ల అండర్–19 ఎస్జీఎఫ్ క్రీడ ల నిర్వహ ణతో పాటు విద్యార్థుల శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభు త్వం జూనియర్ కళాశాలల్లో పీడీల నియామకంపై దృష్టి సారించాలి. హైస్కూళ్లలో పనిచేస్తున్న సీనియర్ పీడీలకు పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలల్లో ని యమిస్తే క్రీడలకు మరింత ప్రోత్సాహం ల భిస్తుంది. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. – దూమర్ల నిరంజన్, తెలంగాణ రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు ● -
ఎస్సీ గురుకులంలో విద్యార్థికి పాముకాటు
● మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశం దేవరకద్ర/పాలమూరు: దేవరకద్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల (టీహెచ్ఎస్డబ్ల్యూ ఆర్ఎస్/జేసీ)లో సోమవారం రాత్రి ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యం విద్యార్థిని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను సమీక్షించారు. విద్యార్థి చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గురుకుల నిర్వహణపై జోనల్ అధికారి ఆగ్రహం కాగా.. చౌదర్పల్లి గ్రామ సమీపంలో స్విట్స్ కళాశాల భవనంలో ఉన్న గురుకులం నిర్వహణ తీరుపై జోనల్ అధికారి వి ద్యాలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవరణ అంతా పిచ్చి మొక్కలు పెరగడం, పరిసరాలలో అపరిశుభ్రత, బాత్రూంలకు డోర్లు లేకపోవడంపై ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
వనపర్తి రూరల్: ఆర్థిక స మస్యల నేపథ్యంలో మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన అనకొండ అబ్దుల్లా (45) వ్యవసాయం చేసేవాడు. ఆర్థిక సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడుతూ మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హిమబిందు తెలిపారు. పొట్టకూటి కోసం పని.. వేరొకరి అజాగ్రత్తకు బలి ● కారు ఢీకొని యువకూలీ మృతి కొత్తకోట రూరల్: కూలి పనుల కోసం రాష్ట్రాలు దాటి వచ్చాడు.. పొట్ట కూటి కోసం మండుటెండలో పనులు చేస్తుండగా.. అతివేగం, అజాగ్రత్త తో వచ్చిన కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలం మోజర్ల స్టేజి సమీపంలోని మంగళవారం చోటు చేసుకుంది. పెద్దమందడి ఎస్ఐ జలేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు కూలీలు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలి పనులకు వచ్చారు. పనిలో భాగంగా ఉదయం జాతీయ రహదారి– 44పై మరమ్మతు పనులు చేస్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు అతివేగంగా పనులు చేస్తున్న రాజేశ్ (20)ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ బ్రిడ్జిపై నుంచి కింద పడింది. కారు డ్రైవర్ ఉపేందర్నాయుడుతో పాటు రమేశ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల సమా చారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి, మృతదేహాన్ని వనపర్తి మార్చూరికి తరలించారు. మృతుడి కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దొంగతనం ఆరోపణలతో యువకుడు ఆత్మహత్య లింగాల: మండలంలోని దారారం గ్రామానికి చెందిన రాత్లావత్ ఉదయ్కిరణ్ (27) ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు లు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అంబట్పల్లిలో మద్యం షా పులో ఉదయ్కిరణ్ సేల్స్మెన్గా పనిచేస్తు న్నాడు. ఈ క్రమంలో షాపుకు సంబంధించి రూ.16 లక్షలు స్వాహా చేశాడని షాపు యజ మాని అతడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఉదయ్ రూ. 4లక్షలు చెల్లించినట్లు తెలిసింది. మిగతా రూ.12 లక్షలు చెల్లించాలని యజ మాని ఒత్తిడి తీసుకు రావడంతో పాటు సో మవారం మృతుడి తల్లి శాంతిని షాపు వద్ద కూర్చోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్కిరణ్ భయాందోళనలకు గురై తల్లి, భార్య కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంటిలోనే ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఘటనపై మృతుడి భార్య రాత్లావత్ తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో డ్రైవర్ @ హిందీ పండిట్
పాలమూరు: ఆటో డ్రైవర్గా కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి హిందీ పండిట్ గానూ బాధ్యతలు నిర్వరి స్తూ విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. నగరంలో ని బండమీదిపల్లికి చెందిన గాలెన్న వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. చదువుపై ఆసక్తితో ఆటో నడుపుకుంటూ నే హిందీ పండిట్ పూర్తి చేశారు. మొదట్లో ఆరు నెలల పాటు గాంధీ రోడ్ స్కూల్ లో విధులు నిర్వర్తించగా.. రెండేళ్ల నుంచి పాత డీఎంహెచ్ఓ కార్యాలయంలో కొనసాగుతున్న మార్కెట్ రోడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హిందీ తరగతులు బోధిస్తున్నాడు. ఉద యం 7 గంటల నుంచి 9గంటల వరకు ఆటో నడుపుతూ.. 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాస్ లు చెబుతున్నాడు. అనంతరం మళ్లీ రాత్రి వరకు ఆటో నడుపుతూ జీవ నం సాగిస్తున్నానని గాలె న్న చెబుతున్నారు. ప్రతి రోజు ఆటో నడపడం ద్వారా రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తానని, భార్య, ముగ్గురు పిల్లలు సంతోషంగా జీవిస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలో తరగుతులు బోధిస్తున్నందుకు ప్రధాన ఉపాధ్యాయురాలు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు గౌరవ వేతనం అందిస్తున్నారని పేర్కొ న్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆసక్తితో ఇక్కడ పని చేస్తున్నానని, నెలకు రూ.15వేల వరకు జీతం వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చొరవ చూపాలి కోరారు. గాలెన్న -
సమాఖ్య భవనాలను వెంటనే పూర్తి చేయాలి
దామరగిద్ద: కొత్తగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాలను 20రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీఎచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ భవనం సమీపంలో కొనసాగుతున్న సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్ సదుపాయాలపై ఆరా తీశారు. 2019 నుంచి మండలంలో సీతాఫల్ ప్రాసెసింగ్ను కొసాగిస్తున్నట్లు డీపీఎం జయన్న కలెక్టర్కు వివరించారు. యూనిట్ ద్వారా వచ్చిన లాభాలను మహిళలకు కల్పించిన ఉపాధి అవకాశాన్ని తెలియజేశారు. ఈ ఏడాది ప్రాసెసింగ్ను కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ప్రాసెసింగ్ చేసేందుకు స్థలం సరిపోవడంతో లేదని, సీతాఫల్, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్కు ప్రత్యేక స్థలం కేటాయించాలని సమాఖ్య సభ్యులు కలెక్టర్ దృష్టితి తీసుకురాగా, గోడౌన్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు. కంసాన్పల్లిలోని ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు తహసీల్దార్ కలెక్టర్కు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలు, ఎన్పీఏ, కిశోర బాలికల సంఘాల ఏర్పాటుపై ఆరా తీశారు. అనంతరం అయ్యవారిపల్లిలో నిర్మిస్తున్న వీఓ భవనాన్ని పరిశీలించారు. మండలంలో కొత్తగా నిర్మిస్తున్న వీఓ భవనాలను మై వన్ సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, ఎంపీడీఓ సాయిలక్ష్మి తహసీల్దార్ తిరుపతయ్య, సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, ఏపీఎం ఆంజనేయులు ఉన్నారు. -
పీడీలు లేరు.. క్రీడలెలా?
ఉమ్మడి జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లు కరువు ● 40 వేల మందికిపైగా విద్యార్థులు.. అండర్–19 ఎస్జీఎఫ్పై సందిగ్ధం ● పాఠశాలల్లో త్వరలో ఎస్జీఎఫ్ పోటీలు.. కళాశాలల్లో మాత్రం అయోమయం ● పీడీల నియామకంతోనే క్రీడలకు ఊతమంటున్న క్రీడావర్గాలు మహబూబ్నగర్ క్రీడలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 63 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా కళాశాలల్లో 40 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నా.. క్రీడలకు మార్గనిర్దేశం చేసే సిబ్బంది లేకపోవడంతో క్రీడా ప్రతిభకు అవకాశం దక్కడం లేదు. ముఖ్యంగా ప్రతి ఏటా నిర్వహించే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీల నిర్వహణపైనా దీని ప్రభావం పడుతోంది. అండర్–19 క్రీడలపై సందిగ్ధం పాఠశాల స్థాయిలో అండర్–14, అండర్–17 ఎస్జీఎఫ్ పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే జూనియర్ కళాశాల విద్యార్థులకు సంబంధించిన అండర్–19 ఎస్జీఎఫ్ పోటీలపై ఈ ఏడాది ఇప్పటివరకు స్పష్టత లేదు. గత విద్యాసంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా పాఠశాల ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్–19 ఎంపికలు నిర్వహించారు. కళాశాలల్లో పీడీలు లేకపోవడంతో ఈ బాధ్యతను పాఠశాల స్థాయి సిబ్బందే నిర్వహించాల్సి వచ్చింది. అండర్–19లో జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని.. ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే కళాశాలల్లో క్రీడా శిక్షణ, సాధనకు పీడీలు లేకపోవడంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. పీడీలు ఉంటేనే ప్రోత్సాహం పాఠశాల స్థాయిలో ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపుతున్నా.. ఇంటర్ స్థాయికి వచ్చేసరికి అండర్–19 విభాగంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదని క్రీడా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. క్రీడాకారులను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, పోటీలకు సిద్ధం చేయడం వంటి అంశాలకు పీడీల పాత్ర కీలకమని పేర్కొంటున్నారు. జూనియర్ కళాశాలల్లో పీడీలను నియమిస్తే క్రీడలకు ఊతం లభించడంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించే అవకాశం ఉంటుందంటున్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం పీడీలు లేరు. అండర్–19 ఎస్జీఎఫ్ క్రీడలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సూచనలు రాలేదు. గతంలో మాదిరిగానే పాఠశాల ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్–19 ఎంపికలు నిర్వహించే అవకాశం ఉంది. – సి.రమణి, డీఐఈఓ, మహబూబ్నగర్ -
దుక్కిలోనే అడుగు మందులు
అలంపూర్: దుక్కిలోనే అడుగు మందులు(ఎరువులు) వేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి నాగార్జున్రెడ్డి, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేల భూసారాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీ, కాంప్లెక్స్, సింగల్ సూపర్ ఫాస్పట్ వంటి మందులు దుక్కిలో వేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ మందులు పైపాటుగా వేస్తే ప్రయోజనం పొందకపోగా పెట్టుబడి వ్యయం పెరుగుతందని పేర్కొన్నారు. అందుకే ఎరువుల సమతుల్యత పాటిస్తూ దుక్కిలో వేయాలని, యూరియా, పొటాష్ వంటి మందులు పైరు అవసరం మేరకు పైపాటుగా వేసుకోవాలని వివరించారు. వానకాలం పంట సాగు సీజన్లో రైతులు వాడాల్సిన ఆయా రకాల ఎరువులు, వాడాల్సిన మోతాదుపై సూచనలు, సలహాలు అందించారు. మోతాదుకు మించి డీఏపీ: ఈ ప్రాంత నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటా షియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నేల స్వభావాన్ని బట్టి పంట కాలంలో ఎకరానికి 50 కేజీల డీఏపీ వాడాలి. కానీ రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు వేస్తున్నారు. పైరుకు వేయాల్సిన దాని కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు ఈ మందును పైపాటుగా వేస్తునందున ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని పేర్కొన్నారు. వాడే మోతాదు : భూమి సారాన్ని బట్టి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు సూచిస్తున్నారు.. డీఏపీ ఎరువును ప్రతి ఎకరాకు 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పనిసరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందున ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగకరంగా ఉండదు. పత్తి పంటకు విత్తు కంటే మూడు నుంచి నాలుగు అంగుళాల లోతులో వేయాలి. మిగిలిన అన్ని వానాకాలం పంటలకు ఎకరాకు 50 కేజీలు వాడాలి. యూరియా ప్రతి ఎకరాకు వంద కిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందున యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియాను పాటు ఎరువుగా వాడవచ్చు. పత్తి విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతిసారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపు తీసే సమయం తర్వాత 20, 30, 50 రోజులకు యూరియాను వరిపైరుకు వేయాల్సి ఉంటుంది. పాడి–పంట -
మృతులు.. వలసలు.. డబుల్ ఓట్లు
జిల్లాలో 17,348 మంది మృతి చెందినట్లు బీఎల్ఓల పరిశీలనలో తేలింది. 55,086 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 14,372 మంది ఇప్పటికే మరోచోట ఎన్రోల్ అయినట్లు గుర్తించారు. మరో 15,396 మంది అబ్సెంట్గా ఉండగా.. 884 మంది ఎన్యూమరేషన్కు నిరాకరించినట్లు అధికారులు గుర్తించారు. కొందరికి స్వగ్రామంలో ఓటు ఉండగా.. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లోనూ ఓటు నమోదైంది. మరికొందరి ఓట్లు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది. ఇలాంటి ఓట్లను పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. -
తెలంగాణ పబ్లిక్ స్కూల్కు వేగంగా అడుగులు
● క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ ● హన్వాడలో భూమి విస్తీర్ణం, సరిహద్దులపై అధికారులకు దిశానిర్దేశం హన్వాడ: మండలకేంద్రంలో అధునాతన వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటాయించిన స్థలంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహశీల్దార్, సర్వేయర్తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి భూమి విస్తీర్ణం, సరిహద్దులు, విద్యార్థుల రాకపోకలకు రవాణా సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల భవన నిర్మాణానికి స్థలాన్ని అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన రెవెన్యూ, సాంకేతిక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి భూమి నివేదిక సిద్ధం చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని తహశీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీఓ యశోదతో పాటు అధికారులకు సూచించారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ కళాశాలలకు నోటుపుస్తకాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా నోటుపుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నోటుపుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు నోటుపుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన నోటుపుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 నోటుపుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు. యూనిఫాంలు కూడా.. నోటుపుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన నోటుపుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూడా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలిసారి నోటుబుక్కులతో పాటు, యూనిఫాం పంపిణీ ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు.. 40,382 మంది విద్యార్థులకు లబ్ధి -
కార్పొరేట్ల లబ్ధి కోసమే పాలన: సీపీఐ
హన్వాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ విమర్శించారు. ‘బద్లావ్ జరూరి హై–మార్పు కావాలి’ నినాదంతో సీపీఐ చేపట్టిన జన చైతన్య యాత్ర మంగళవారం హన్వాడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం, కార్మిక హక్కులను హరించేలా లేబర్ కోడ్లను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శంకర్నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, చాంద్పాష, పద్మ, ఇందిరా, మహేష్బాబు, సత్యనారాయణరెడ్డి, శంకర్నాయక్, భీమయ్య, రెహమాన్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాలలో సౌకర్యాలపై ఆరా
మహమ్మదాబాద్: మండల కేంద్రంలోని సీపీఎస్ నంబర్–2 పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, భోజన సౌకర్యాలు, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. దివ్యాంగుల కోసం నిర్మిస్తున్న భవనం అసంపూర్తిగా ఉండటంపై కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిల్లులు రాక నిర్మాణం నిలిచిపోయిందని కాంట్రాక్టర్ తెలపగా, రికార్డులు పరిశీలించి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వర్షం కురిసినప్పుడు పాఠశాల ఆవరణలో నీరు నిలుస్తోందని సిబ్బంది తెలపగా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ నరేందర్రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 85.590 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగువ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ విద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 40,537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులను ఆదుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ షేక్ ఫారుక్ హుస్సేన్ కోరారు. మంగళవారం హైదరాబాద్లో ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షలు, కుటుంబాలకు పెన్షన్, అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఉద్యమకారులు, వారి కుటుంబాలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను అధికారికంగా సత్కరించాలని కోరారు. -
ఆయకట్టు.. ఆందోళన
గద్వాల/వనపర్తి: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద వస్తోందని సంబురపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. అయితే వీరి ఆనందం తాత్కాలికమేనని జూరాలకు తగ్గిన వరదతో స్పష్టమైంది. ప్రియదర్శిని జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 15 రోజులకు పైగా భారీగా వరద వచ్చి చేరగా.. ఆదివారం నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు జూరాల క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేశారు. పదేళ్ల కాలంలో వానాకాలం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం తిరిగి ఎనిమిది గేట్లు తెరిచారు. దీనితో పాటు విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలకు నీటి విడుదలను తగ్గించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిపంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేస్తామంటున్న అధికారుల ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వనపర్తిలో జరిగే ఇరిగేషన్ బోర్డు సమావేశంలో పంటలకు సాగునీటి లెక్కలు తేలనున్నాయి. గడ్డు కాలమే.. వానాకాలంలో నెలన్నర రోజులపాటు జూరాల జలాశయం నీరులేక వెలవెలబోయింది. వానాకాలంలో జలాశయం అడుగంటిన పరిస్థితి దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. దీంతో అధికారులు జలాశయంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాజెక్టు ఆయకట్టులో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కృష్ణాబేసిన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఊరట పొందిన అన్నదాతలు.. వానదేవుడిపై భారం వేసి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. నెట్టెంపాడు కింద 1.20లక్షలు, జూరాల కుడి కాల్వ పరిఽధిలో 20వేలు, భీమా లిఫ్ట్–2 కింద 92వేలు, జూరాల ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో 73,639, ఎంజీకేఎల్ఐ కింద 1,18,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా వరిసాగైంది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.567 టీఎంసీలు) కాగా.. ప్రసుతం 317 మీటర్ల మేర (8.81 టీఎంసీలు) నిల్వ చేస్తున్నారు. జలాశయంలో ఉన్న నీటిని గరిష్టంగా 5.6 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. జలాశయంలో ఉన్న నీటిని విడుదల చేస్తే నెలరోజుల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో జూరాల కింద సాగుచేసిన లక్ష ఎకరాల వరిపంటతో పాటు మిగిలిన ప్రాజెక్టుల కింద సాగు చేసిన 3 లక్షల వరిపంటకు సాగునీటిని ఏ విధంగా విడుదల చేస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. మూడున్నరేళ్ల తర్వాత ఐఏబీ సమావేశం.. సాగునీటి లభ్యత, పంటల ప్రణాళిక, ఆయకట్టు ప్రాంతాలకు నీటి కేటాయింపులు, వినియోగంపై మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పాలకులు మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తలేదు. ఎల్నినో ప్రభావంతో సమస్య తీవ్రతరమైన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఐఏబీ సమావేశాలను పునరుద్ధరించి.. ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు, ఇప్పటివరకు సాగుచేసిన పంటల వివరాలు, పంటకాలం ముగిసే వరకు సరిపడా నాటి నిల్వలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకు వనపర్తి కలెక్టరేట్ వేదిక కానుంది. జూరాల నీటితో పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించటంపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4లక్షల ఎకరాలకు పైగా వరిసాగు ఆరుతడి పంటలకే సాగునీరు సరఫరా అంటున్న అధికారులు ఇప్పటికే జూరాలకు తగ్గిన వరద.. క్రస్ట్గేట్లు మూసివేత నేడు వనపర్తి కలెక్టరేట్లో ఐఏబీ సమావేశం -
జూరాలకు తగ్గిన వరద
● 30వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● క్రస్ట్ గేట్లు పూర్తిగా మూసివేత ● ప్రస్తుతం నీటిమట్టం 318.10మీటర్లు ● హైడల్ ప్రాజెక్టుకు 8వేల క్యూసెక్కులు గద్వాల/ఆత్మకూరు/అచ్చంపేట: కర్నాటక ప్రాంతంలో కృష్ణాబేసిన్లో భారీ వర్షాలు కురస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు స్థిరంగా వరద వచ్చిచేరుతుంది. సోమవారం జూ రాలకు ఇన్ఫ్లో రూపంలో క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేశారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.10మీటర్లుగా ఉంది. అదేవిధంగా 9.567టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.810 టీఎంసీలు ఉంది. అదేవిధంగా హైడల్ విద్యుత్తు కేంద్రానికి 8336క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు–750క్యూసెక్కులు, భీమా–1–1300, భీమా–2–నిల్, కోయిల్సాగర్కు 630క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధా న ఎడమ కాల్వకు 274క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 625క్యూసెక్కులు, సమాంతర కాల్వకు–నిల్, మొత్తంగా ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో రూపం 13,480 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తగ్గిన విద్యుదుత్పత్తి వరద తగ్గడంతో సోమవారం కేవలం 4 యూనిట్లద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 2 యూనిట్ల ద్వారా 78 మెగావాట్లు, 46.242 ఎంయూ, దిగువలో 2 యూనిట్ల ద్వారా 80 మెగావాట్లు, 33.561 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 79.803 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. 182.6050 టీఎంసీల నీటినిల్వ శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా తగ్గముఖం పట్టింది. నారాయణపూర్, ఆల్మట్టి ప్రా జెక్టుల నుంచి వరద దగ్గడంతో జూరాల గేట్ల ద్వారా నీటివిడుదల నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 6గంటల వరకు జలాశయంలో 182.6050 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 23,455 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు (269.750 మీటర్లు) కాగా, ప్రస్తుతం 878.60 అడుగులు (267.900 మీటర్లు) నమోదైంది. జలాశయంలో 182.60500 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ను ట్రయల్ రన్ను సోమవారం ప్రారంభించారు. 5యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని దిగువ నాగర్జనసాగర్కు వదలుతున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 0.212 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, కుడిగట్టు విద్యుత్ కేంద్ర ద్వారా 7.56 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి 2,322 క్యూలసెక్యులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్యులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8వేల క్యూసెక్యుల చొప్పున మొత్తం 26,471 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
ముదురు నారు.. ఈ జాగ్రత్తలతో అధిక దిగుబడి
అలంపూర్ : వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది చాలా మంది రైతులు సమయానికి వరి నాట్లు వేయలేకపోయారు. దీంతో ముందుగా వేసుకున్న నారుమళ్లలో వరి నార ముదిరే అవకాశం ఉంటుంది. అయితే ముదిరిన నారు వేసుకునే యాజమాన్య పద్ధతుల్లో కేవలం సన్నరం వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తోందని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్ రెడ్డి రైతులకు సూచించారు. సాధారణ నారు : సాధారణంగా 30 రోజుల నారును నాటు వేస్తారు. సాలుకు మధ్య 20 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటు వేసుకోవాలి. ముదిరిన నారు : నారు వేసి 30 రోజులు దాటిందంటే దానిని ముదిరిన నారుగా పరిగణించాలి. 30 నుంచి 40 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్క కు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటాలి. ● 40 నుంచి 50 రోజుల నారును నాటేటప్పుడు సా లుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటిమీటర్లు స్థలాన్ని వదలాలి. ● ముదిరిన నారు నాటేటప్పుడు నారు పిలకలు ఎక్కువగా నాటాలి. ఎందుకంటే నాటు వేయడం ఆలస్యమైంది కాబట్టి గంట తక్కువగా పోస్తుంది. అందువల్ల నారు మొక్కలు ఎక్కువగా నాటాలి. అలాగే కుదురుకు 4 లేదా 5 మొక్కల చొప్పున నాటు వేసుకోవాలి. ముదురు నారుకు..ముదురు నారు పొలానికి రెండు దఫాలుగా మాత్రమే ఎరువులు వేయాలి.అది కూ డా రెట్టింపుతో వాడాలి. ముదురునారు నాటినప్పు డు నత్రజని ఎరువు అధికంగా వాడాలని, 70 శా తం దమ్ము దశలో 30 శాతం అంకుర దశలో వాడాలి. ● భాస్వరం ఎరువు 50 శాతం పోటాష్ ఎరువుతో కలిపి మొదటి సారి దమ్ములో వేయాలి. ఇలా చేయడం వలన పిలకలు తొందరగా వేసి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ● మొదటి దఫా (నాటు వేసే సమయంలో) 50 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 15 కిలోల పోటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే దిగుబడి తగ్గకుండా ఉంటుంది. కాలి బాటలు తప్పనిసరి.. వరి నాటు వేసే సమయంలో 2 మీటర్ల తర్వాత 20 సెంటిమీటర్ల చొప్పున తూర్పు, పడమరలుగా కాలిబాటలు వదలడం చాలా మంచిది. దీంతో పంటకు గాలి బాగా తగులుతుంది. పైగా తెగుళ్లు సోకకుండా ఉంటుంది. ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు వేయడానికి ఉపయోగపడతాయి. వరి నారుమడి పొలంలో కాలిబాట పద్ధతి పాడి–పంట -
గుడిలో ఉరివేసుకుని.. పూజారి ఆత్మహత్య
మక్తల్: నిత్యం పూజలు చేసే గుడిలోనే ఓ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..ఉత్తరప్రదేశ్లోని వారణాసి (కాశి)కి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సౌరబ్మిశ్రా(23) ను ఆయన మిత్రుడు, వల్లభాపూర్ దత్తాత్రేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఉపేందర్ కొన్ని రోజుల క్రితం మక్తల్లోని శిరిడీ సాయిబాబ ఆలయంలో పూజారిగా పని చేసేందుకు రావాలని పిలిపించారు. మొదట వల్లభాపూర్లోని దత్తాత్రేయస్వామి ఆలయంలో స్నేహితుడితో కలిసి ఉన్న సౌరబ్మిశ్రా ఆ తర్వాత మక్తల్ శిరిడీ సాయిబాబ ఆలయంలో పూజలు నిర్వర్తిస్తూ.. ఆలయం పక్కనే ఉన్న ఓ గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సౌరబ్మిశ్రా సో మవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోన్లో మాట్లాడి.. ఆ తర్వాత గుడిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని మిత్రుడు ఉపేందర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయనకు వివాహం కాలేదు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మక్తల్ ఎస్ఐ రాజు తెలిపారు. అయితే సౌరబ్మిశ్రా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆస్పత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు.. దేవరకద్ర రూరల్: కడుపునొప్పి చికిత్స కోసం స్నేహితుడితో కలిసి బైక్పై బయలుదేరి, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి యువకుడు మృతిచెందిన ఘటన సో మవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని గోప్లాపూర్కు చెందిన సాయిరాం (28)కు శనివారం కడుపులో నొప్పి రావడంతో చికిత్స కోసం దేవరకద్రలోని ఆస్పత్రికి వెళ్తుండగా.. మార్గమాధ్యంలో ప్రమాదవశత్తూ బైక్పై నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పురుగు మందుతాగి భర్త మృతి మక్తల్: పురుగుల మందు తాగి భర్త మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలోని కాట్రేవ్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ నర్సింహ భార్యాభర్తల మధ్య గొ డవతో మాటకుమాట పెరిగింది. భ్యార్యను భ యపెట్టిద్దామని నర్సింహ గతనెల 21న ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగడంతో వెంటనే కటుంబ సభ్యులు చికిత్సకోసం తరలించారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. మృతుడు తండ్రి కుర్వ మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. తాళం వేసిన ఇంటికి కన్నం నవాబుపేట: ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇంటిని చోరీ చేసి బంగారు, నగదు తదితర వస్తువులు చోరీచేసినట్లు బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని చిన్నమేగ్యతండాకు చెందిన సంతోష్నాయక్ వృత్తిరీత్యి ఆటోడ్రైవర్. ఆయన తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి గతనెల 27న హైదరాబాద్కు వెళ్లాడు. ఈనెల 8వ తేదీన ఇంటికి వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. దీంతో గ్రామస్తులతో కలిసి ఇంట్లో వెతికితే బీరువా తాళం పగుల గొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న దాదాపు తులం బంగారం, 40 తులాల వెండి, నగదుతోపాటు టీవీ, గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన బిల్యానాయక్, ముడావత్ శ్రీనునాయక్పై అనుమానం ఉందని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపాడు. -
నిలిచిపోయిన కార్గో సేవలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక కొత్త బస్టాండులో ఈనెల 1 నుంచి కార్గో సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో సరుకుల రవాణాను కొత్త ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఎనిమిది రోజులైనా మహబూబ్నగర్లో ఈ ఏజెన్సీ ఇంకా నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో నిత్యం కొత్త బస్టాండుకు వ్యాపారులు, ప్రజలు వచ్చి సరుకుల బుకింగ్ లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభం.. మహబూబ్నగర్ కొత్త బస్టాండులో 2020 జూన్ 19న కార్గో సేవలను ఆర్టీసీ సంస్థ ప్రారంభించింది. సుమారు ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు అధికారులే చేపట్టారు. కరోనా అనంతరం టెండర్ విధానం అమలులోకి రాగా మూడేళ్లు ఒకరికి, రెండేళ్లు మరో ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. ప్రతిసారి నిబంధనలు మారుతున్నాయని సదరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితమే కాంట్రాక్టు పొందిన వ్యక్తి చివరకు ఈనెల 1 నుంచి తప్పుకొన్నారు. ప్రతినెలా రూ.1.35 లక్షల అద్దె ఆర్టీసీకి చెల్లించడం ఎంతో భారంగా మారిందని పేర్కొన్నారు. కాగా, నిత్యం రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు సరుకుల రవాణా ద్వారా లావాదేవీలు జరిగేవి. వాస్తవానికి ఆరేళ్ల క్రితమే ఇక్కడ ఆరంభమైన కార్గో సేవలు ఇప్పుడు కొత్త ఏజెన్సీకి మారడంతో మొదటిసారి నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజలు, వ్యాపారులు తమ సరుకులను ఆర్టీసీ బస్సుల ద్వారా పంపించే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కార్గో సేవలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక కొత్త బస్టాండులో ఈనెల 1 నుంచి కార్గో సే వలు నిలిచి పోయింది వా స్తవమే.ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి టెండ రు దక్కింది. సదరు నిర్వాహకులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఇక్కడ కార్గో సేవలు పునఃప్రారంభమయ్యేలా చూస్తాం. – కె.అశోక్కుమార్, డిపో మేనేజర్, మహబూబ్నగర్ ఆగస్టు 1 నుంచి కొత్త ఏజెన్సీకి అప్పగింత ఏడాదికే తప్పుకొన్న పాత కాంట్రాక్టర్ ఆర్టీసీకి నెలకు షాపు అద్దె రూ.1.35 లక్షలు సరుకుల బుకింగ్ లేక తిరిగి వెళ్తున్న వ్యాపారులు పాలమూరు కొత్త బస్టాండ్లో ఇదీ పరిస్థితి -
‘పాలమూరు’ డీపీఆర్ను వెనక్కి పంపడం తగదు
జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమ వారం ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు పాలమూరు జిల్లాకు అన్యాయం చేయడమే పనిగా పెట్టుకున్నాయని, తెలంగాణాకు అన్యా యం జరుగుతుంటే ఎంపీలు ఒక్క మాట మాట్లాడడం లేదని, తెలంగాణ నీటిహక్కులను సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి కాలరాస్తున్నారన్నారు. కేంద్రం వెంటనే స్పందించి డీపీఆర్ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. -
రూ.లక్షలు వెచ్చించిన బోట్లు.. చెట్లపాలు
సకల హంగులతో ట్యాంక్బండ్ను నిర్మించ తలపెట్టిన ట్యాంక్బండ్ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేని పరిస్థితి. అయితే గతంలో ట్యాంక్బండ్ ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం నీటిలో బోటింగ్ చేసేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి బోట్లను కొనుగోలు చేశారు. ఇందు ఒక పెద్ద బోటు, చిన్నబోట్లు ఉన్నాయి. ట్యాంక్బండ్ పనులు మరోసారి ప్రారంభమైన సందర్భంగా బోట్లను కట్టకింద భాగంలో వేశారు. ఇప్పటికీ రెండేళ్లు గడిచిపోయాయి. దీంతో బోట్లు విరిగిపోవడం, చెట్లు మొలవడం వంటివి జరిగాయి. ప్రస్తుతం భారీగా చెట్లు మెలిచి బోట్లు పాడైపోయాయి. ఈ క్రమంలో అధికారుల తీరుపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన బోట్లను చెట్లపాలు చేశారని వాటిని పాడవకుండా సురక్షిత ప్రదేశానికి తరలించాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
ముగిసిన రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సు సోమవారం ఘనంగా ముగిసింది. మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, ప్రధాన కార్యదర్శి జి.శాంతారెడ్డి, భారతి, చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రద ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు రోజుల సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, అచార్యుల, పరిశోధకులు పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం జరిగిన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ డీన్ పులికొండ సుబ్బాచారి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, డాక్టర్ మన్నమోని కృష్ణయ్య తదితర సాహితీవేత్తలు పాల్గొని యశోదారెడ్డి సాహిత్య సేవలను స్మరించుకున్నారు. యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలిక భాషా ప్రయోగాలను నింఘటువుగా తీసుకురావాలని కోరారు. పాలమూరు విశ్వవిద్యాలయం యశోదారెడ్డి సాహిత్యాన్ని గురించి ఽఅధ్యయనం చేసేందుకు మరింత కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని, ఆ యూనివర్సిటీ తెలుగు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదిరిగి మహిళలు ఏ విధంగా ఉన్నత శిఖరాలకు చేర వచ్చో యశోదారెడ్డి జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే తెలుస్తుందన్నారు. యశోదారెడ్డి రచించిన ‘కథా చరిత్ర’ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పునఃముద్రించగా సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మిరెడ్డి, మనుమరాలు చైత్రారెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ‘ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం–2026’ను నవల రచయిత పోల్కంపల్లి శాంతాదేవికి ప్రకటించగా ‘ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం–2026’ను డాక్టర్ కొండపల్లి నిహారిణికి అందజేశారు. అదే విధంగా సాహితీరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలకు పురస్కారాలతో సత్కరించారు. -
గుట్టుగా గుప్తనిధుల వ్యవహారం
● ముందుకు సాగని దర్యాప్తు ● 52 నాణేలు, రెండు ముక్కల బంగారం మాత్రమే రికవరీ ● కేసు నుంచి విముక్తికి డబ్బుల వసూలు గట్టు: గట్టులో లభించిన గుప్తనిధుల గుట్టు ఇప్పటికీ గుట్టుగానే మిగిలిపోయింది. గట్టులోని నేతాజీ సర్కిల్ సమీపంలో ఓ పాత ఇంటి గోడను కూల్చే క్రమంలో కూలీలకు గుప్త నిధులు లభించాయి. వీటిని పంచుకునే క్రమంలో తేడాలు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గుప్త నిధులు లభించిన కూలీల నుంచి ఇద్దరు నాయకులు కొన్ని నాణేలు, కొంత డబ్బును తీసుకున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. గుప్తనిధుల వ్యవహారం పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అధికారులు నిధానంగా తేరుకున్నారు. గట్టు గుప్తనిధుల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, లభించిన గుప్తనిధులను రికవరీ చేయాలని సర్పంచు నాగరాజు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుప్త నిధులను దక్కించుకున్న కూలీలు 33 వెండి నాణేలతోపాటు 9.5 గ్రాముల బంగారం ముక్క, బంగారం అమ్ముకోగా వచ్చిన డబ్ముల్లో మిగిలిన రూ.లక్షను ఇంటి యజమానికి అప్పగించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సదరు ఇంటి యజమాని నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం అనుమానితులను గద్వాల సీఐ శ్రీను గట్టు పోలీస్స్టేషన్కు పిలిచి విచారించగా మరో 21వెండి నాణేలు, బంగారం ముక్కను రికవరీ చేశారు. ఇలా మొత్తం 72 నాణేల్లో 54 నాణేలు, రెండు బంగారం ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని కూలీలు దర్జాగా అమ్ముకుని వచ్చిన డబ్బును ఖర్చు చేసుకున్నారు. కొందరూ కూలీలు బంగారాన్ని గట్టులోనే విక్రయించగా, మరికొందరు బంగారాన్ని గద్వాల, పెబ్బేరు ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిసింది. గద్వాల సీఐ విచారణ అనంతరం కొంత డబ్బును కూలీలు తీసుకొచ్చి ఓ నాయకుడికి అప్పగించినట్లు తెలిసింది. కేసు నుంచి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూలీలు కోరినట్లు సమాచారం. గుప్తనిధుల కేసుకు సంబంధించి ఇప్పటిదాకా మిగిలిన నాణేలు, బంగారం అమ్ముకోగా వచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియడంలేదు. మొత్తం మీద గట్టులో లభించిన గుప్తనిధుల కేసు కొందరికి మాత్రం కాసులను కురిపించిందని గట్టులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిచ్చాలపేటలో.. గట్టులోని బిచ్చాల పేటలో పెద్ద ఎత్తున గుప్తనిధులు లభించినట్లు స్థానికులు చెబుతున్నారు. గుప్తనిధులను వెలికి తీయడానికి కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి, బిచ్చాల పేట మసీదు పక్కనే పాడుబడిన ఇంటిలో పూజలు నిర్వహించి, పెద్ద గొయ్యి తవ్వి అందులోంచి పెద్ద ఎత్తున గుప్త నిధులను బయటకు తీసినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం విస్వసించడం లేదు. ఇదంతా ఉట్టిదేనని కొట్టిపారేస్తున్నారు. -
లోన్ పేరుతో నమ్మించి.. నగదు నొక్కేశారు
దేవరకద్ర రూరల్: రూ.5లక్షల వరకు లోన్ మంజూరు చేస్తామంటూ ఓ యువకుడిని నమ్మించిన సైబర్ మోసగాళ్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నాలుగు విడుతల్లో రూ.62వేలు బదిలీ చేయించుకున్నారు. చివరకు బాధితుడు అనుమానంతో నిలదీయడంతో ఫోన్ కట్ చేసి, స్విచ్చాఫ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని గద్దెగూడెంకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఆన్లైన్లో తన స్నేహితుడికి రూ.2లక్షల వరకు లోన్ ఇప్పించాడు. దీంతో తానుకూడా లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని నెంబర్ నుంచి అతడికి ఫోన్ వచ్చింది. రూ.5లక్షల లోన్ మంజూరవుతుందని, అందుకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.వారి మాటలు నమ్మిన బాధితుడు నాలు గు విడుతల్లో మొత్తం రూ.62వేలను బదిలీ చేశాడు. అనంతరం లోన్ మంజూరు కాకపోవడంతో ఇలాంటి ప్రక్రియ ఏదీ లేదని ప్రశ్నిస్తూ.. నిలదీయగా అవతలి వ్యక్తులు ఫోన్ కట్ చేశా రు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు ఇసుక టిప్పర్లు పట్టివేత మక్తల్: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో మక్తల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. టీజీ38టీ–1719, టీఎస్12టీ–3441, టీఎస్08 యుఎప్2734, టీఎస్38 టీ 2007 భారత్ బెంజ్ల నుంచి సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఇసుకను నారాయణపేట జిల్లాకేంద్రానికి అక్రమంగా తరలిస్తుండగా.. మక్తల్ శివారులోని కాటన్మిల్ సమీపంలో టాస్క్ఫోర్సు బృందం నాలుగు ఇసుక టిప్పర్లను పట్టుకొని పోలీసుల కు అప్పగించారు. పోలీసులు ఇదేనెలలో వారంరోజుల్లో 9ఇసుక టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇసుకను అనుమతి లేకుండా మాగనూర్ వాగునుంచి తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడాలి
పాలమూరు: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంపై ఎంపీ డీకే అరుణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శత శాతంతో మంచి ఫలితాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ‘శతశాతం’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్డి హాస్టల్లో విద్యావలంటీర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు పలువురు ముందుకొచ్చి సహకరిస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన వలంటీర్లు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తూ వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, వలంటీర్లు సమన్వయంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి, గుండా మనోహర్, మదన్మోహన్, బుచ్చారెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. 16 అడుగులకు చేరిన నీటి మట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు చేరుకుంది. జూరాల వద్ద ఉన్న ఉంద్యాల పంప్హౌస్ ఫేజ్–1 నుంచి రెండు పంపులను నడుపుతూ నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తీలేర్ పంప్హౌస్ ఫేజ్–2 నుంచి రెండు పంపులను రన్ చేసి కోయిల్సాగర్కు 630 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో ప్రాజెక్టు నీటిమట్టం కేవలం 9 అడుగులు ఉండగా.. ప్రస్తుతం మరో 7 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 16.6 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. నీటి ప్రవాహం కొనసాగితే త్వరలో కోయిల్సాగర్ నుంచి ఆయకట్టు కింద పంటలకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. -
ఆందోళనలు చేస్తాం..
జిల్లాలో చాలామంది అధికారులు బినామీ పేర్లతో ఉన్న ఓన్ ప్లేట్ కార్లను వాడుకుంటున్నారు. సొంత వాహనాలకు ప్రభుత్వం నుంచి అక్రమంగా బిల్లులు తీసుకుంటూ.. నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. సొంత వాహనాలను అధికారులు తీసి వేసి ట్యాక్సీ వాహనాలను పెట్టుకుంటే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అధికారులు ఓన్ ప్లేట్ వాహనాలను తొలగించకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనలు చేపడుతాం. – అబ్దుల్ ఖాదర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్స్ హేర్ వెహికిల్ అసోసియేషన్ -
ముగిసిన ‘సర్’.. భారీగా ఓట్ల కోత!
● జిల్లాలో లక్షకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ● డబుల్ ఓటర్లలో స్వస్థలాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎట్టకేలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 45 రోజులుగా ఉత్కంఠ రేపిన ఓటర్ల జాబితా సవరణకు తెరపడింది. ‘ఒక్కరికి.. ఒక్క ఓటు’ లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియలో మృతులు, డబుల్ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడంతో జిల్లాలో లక్షకు పైగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో ఎంతమేర ఓట్లు తగ్గాయి? ఎవరెవరి పేర్లు తొలగిపోయాయి? అర్హులైన ఓటర్లలో ఎంతమంది పేర్లు గల్లంతయ్యాయి? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ● జూన్ 25న బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి ఓటరుకు రెండు ప్రతులుగా ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, వాటిని ఎలా నింపాలో వివరించారు. పూర్తి చేసిన అనంతరం ఒక ప్రతిని బీఎల్ఓలు తీసుకుని.. మరో ప్రతిని ఓటరుకు రశీదుగా అందించారు. ప్రారంభంలో ఫారాల నింపడంపై ఓటర్లలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది. ఫారాలు అందించేందుకు బీఎల్ఓలు అవసరమైన చోట గరిష్టంగా మూడుసార్లు ఇళ్లను సందర్శించారు. జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సరిపోదని.. ప్రతి ఓటరుకు మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దీంతో చివరి రోజు వరకు బీఎల్ఓలు, ఇతర సిబ్బంది ఓటర్ల వివరాల నమోదు, పరిశీలన, మ్యాపింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ● మహబూబ్నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 50,445 ఓట్లు తగ్గినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడంతో అచ్చంపేట నుంచి అలంపూర్ వరకు, నారాయణపేట నుంచి షాద్నగర్ వరకు వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ఓటర్లు మహబూబ్నగర్లోనూ, తమ స్వస్థలాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. చాలామంది తమ స్వస్థలంలోని ఓటును కొనసాగించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. దీంతో మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలో 26,803, దేవరకద్రలో 25,886 ఓట్లు తగ్గినున్నట్లు సమాచారం. ● కాగా..సర్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ముసాయిదా ఓటరు జాబితాపైనే ఉంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు మిగిలారు? ఎంతమంది పేర్లు తొలగిపోయాయి? డబుల్ ఓట్ల పేరుతో ఎన్ని ఓట్లు కోతకు గురయ్యాయి? అర్హులైన ఓటర్ల పేర్లు ఏమైనా గల్లంతయ్యాయా? అన్నదానిపై స్పష్టత రానుంది. ఈ నెల 17న ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత రాజకీయ పార్టీ లు, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలతో ఓటర్ల జాబితా మరింత ఆసక్తికరంగా మారనుంది. పార్టీలకు ప్రతిష్టాత్మకం సర్ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించాయి. జిల్లాలోని 846 పోలింగ్ స్టేషన్లలో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు ప్రక్రియను పరిశీలించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 274 మంది, బీజేపీ 272 మంది, కాంగ్రెస్ 274 మంది బీఎల్ఏలను నియమించుకున్నాయి. జడ్చర్లలో బీజేపీ 151, కాంగ్రెస్ 278, బీఆర్ఎస్ 294 మంది, దేవరకద్రలో బీజేపీ 131, కాంగ్రెస్ 278, బీఆర్ఎస్ 294 మంది బీఎల్ఏలను నియమించుకున్నాయి. బీఎల్ఏలు తమ పరిధిలో పర్యటిస్తూ ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఫారాల భర్తీలో ఓటర్లకు సహకరించడంతో పాటు డబుల్ ఓట్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్ల వివరాలపై దృష్టి సారించారు. -
ఎక్లాస్పూర్ కన్నీటిసంద్రం
కన్నవారి కలలు.. కల్లలు ఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై తమ ముందు నిలుస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. చెదిరిన.. చదువుల తల్లి ఆశలు బాగా చదువుకోవాలి.. డాక్టర్ కావాలి.. నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి. ఎక్లాస్పూర్.. కన్నీరుమున్నీరు మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్పురం.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగాతిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. అయిజ: గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్కి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజ మహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. సోమ వారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. అయిజలో అంతిమ యాత్ర.. ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. బోరుమన్న ఎక్లాస్పూర్.. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్పూర్కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రి వెంకటేష్కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంత్యక్రియలకు తరలివచ్చిన జనం (ఇన్సెట్లో) మృతదేహం వద్ద రోదిస్తున్న ప్రియాంక తల్లిదండ్రులు అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు పాడె మోసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ తరలివచ్చిన బంధుగణం.. పార్టీలు, సంఘాల నాయకులు -
అధికార్ల దందా
–8లో uజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవ ప్రదమైన హోదా.. రూ. వేలు, లక్షల్లో జీతాలు.. అయినప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతో అద్దె కార్లు నడుపుతూ బిల్లులు కాజేస్తున్నారు. ఫలితంగా కిరాయి కార్లు నడుపుతూ జీవనం సాగించే నిరుద్యో గుల కడుపు కొడుతున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ సొంత కార్లను వాడుతున్న అధికారులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పర్యటించేందు కు గాను ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఒక్కో వాహనానికి ప్రతినెలా రూ.33 వేల అద్దె చెల్లిస్తారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా.. ట్యాక్సీ ప్లేట్ వాహనం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బినామీ పేర్లతో సొంత కార్లు, ఓన్ పేట్లు (వైట్ నంబర్) వాహనాలను వాడుతూ అక్రమంగా బిల్లులు దండుకుంటున్నారు. ప్రైవేట్ వాహనదారులకు కొర్రీలు.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో ఏకంగా మహిళా ఉద్యోగి అయితే తమ భర్త పేరుపై వాహనం పెట్టుకోవడం, బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తూ బిల్లులు తీసుకుంటున్నారు. ఇదే అధికారులు మాత్రం నిరుద్యోగుల తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతూ వేధించడమే కాకుండా బిల్లుల చెల్లింపులోనూ ఆలస్యం చేస్తున్నారు. వాహనం అద్దె, పెట్రోల్ లేదా డీజిల్, డ్రైవర్ జీతం మొత్తం కలిపి నెలకు రూ.24 వేలు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.33 వేలకు పెంచారు. ఇదే అవకాశంగా భావించిన ఆయా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వాహనాలను నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డ్రైవర్ కం ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా డ్రైవర్లు ఓనర్లుగా మారి ఉపాధి పొందేందుకు వీలుగా సబ్సిడీపై కార్లు అందిస్తుంది. కానీ, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రాన్స్ఫోర్ట్ వాహనాలకు బదులుగా అధికారులు సొంత వాహనాలు వాడుతుండటంతో ఎంతోమంది డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా.. ఆందోళనలు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని అద్దె వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయే శాఖల్లో అంటే.. జిల్లాలో చాలామంది అధికారులు సొంత వాహనాలను వాడుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్, సివిల్ సప్లయ్, ఎంపీడీలు, డీఆర్డీఓ, మిషన్ భగీరథ, సీడీపీఓలు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సొంత వాహనాలు వాడుతున్న వారిలో అధికంగా ఉంటున్నారు. బినామీ పేర్లతో ఓన్ప్లేట్ వాహనాలు వినియోగం నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారుల తీరు అద్దె పేరిట రూ.వేలల్లో ఖజానాకు గండి ఉపాధి కోల్పోతున్న అద్దె కార్ల యజమానులు వినతిపత్రాలు ఇచ్చినా.. ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం -
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలి
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని సీఐటీయూ, టీయూసీఐ నాయకులు హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలో మున్సిపల్టౌన్ హాల్ సభ నిర్వహించుకొని ర్యాలీగా గడియారం చౌరస్తా, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా చేరుకొని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, టీయూసీఐరాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ, మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోపోతే దేశంలో మరో క్విట్ ఇండియా ఉద్యమము చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం లక్షలాది మందితో పెద్ద ఎత్తున జరిగిందని, మోదీ ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోకుంటే కార్మికులు, కర్షకులు వ్యవసాయ కూలీలు, ప్రజలు ప్రజాతంత్ర వాదులతో బీజేపీ ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సన్నతమవుతున్నామని వారు హెచ్చరించారు. అనంతరం పలువురు జిల్లా నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మునిసిపల్ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, వీవోఏల మధ్యాహ్నం భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఎత్తివేయాలని ఆలోచనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వెనక్కి తీసుకొని ప్రజా ఉపయోగపనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా ప్రజాసంఘాల నాయకులు రాములు, సీహెచ్ రామ్రామచంద్రర్, కిల్లే గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, వెంకటేష్, సాంబశివుడు, పి.సురేష్, ఎం.రామ్మోహన్, కడియాల మోహన్, దీప్లానాయక్, రాజ్కుమార్, చంద్రకాంత్, విజయ్బాబు, బుచ్చన్న, బాలు, చెన్నయ్య, ప్రశాంత్, నందు, హనుమంతు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత అరెస్టు
ఎర్రవల్లి: అలంపూర్ మండలంలోని సుల్తానాపురంలో తనిఖీల్లో పోలీసులు 1.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గరు నిందితులు పరారీలో ఉన్నట్లు అలంపూర్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. ఆదివారం కోదండాపురంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన చంద్రకాంత్గౌడ్ను అరెస్టు చేసి గంజాయితో పాటు డిజిటల్ వేయింగ్ మిషన్, ప్లాస్టిక్ బాటిల్, స్ట్రా, ప్యాకింగ్కు వినియోగించిన బ్రౌన్కలర్ ప్లాస్టర్, లావా కీపాడ్ మొబైల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అలంపూర్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
బోటింగ్ సేవలు పునఃప్రారంభం
కొల్లాపూర్ రూరల్: మండలం సోమశిలలోని కృష్ణానది బ్యాక్ వాటర్లో పర్యాటకులకు బోటింగ్ సేవలు పునః ప్రారంభించినట్లు పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ తెలిపారు. ఆదివారం కృష్ణానది బ్యాక్ వాటర్లో పర్యాటక బోట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల గేట్లు మూసివేయడంతో నదిలో పర్యాటకులకు బోటింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వేసవిలో నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల బోటింగ్ సేవలు నిలిపివేశామని, నదికి పెద్దఎత్తున వరద రావడంతో తిరిగి ప్రారంభించామన్నారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించి ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో టూరిస్టు పోలీస్ శివ, బోటింగ్ యూనిట్ ఇన్చార్జి ప్రేమ్కుమార్, సింపుల్ వాటర్ స్సోర్ట్స్ యూనిట్ ఇన్చార్జి రాము తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆషాఢమాసం చివరి దశకు చేరడం, వరుస సెలువులు రావడంతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులు అమ్మవారి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆలయంలో అర్చనలు, అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, అర్చన పూజలు నిర్వహించారు. భక్తులు ఆర్టీసీ బస్సులు సరిగ్గా లేకపోవడంతో ప్రైవేటు వాహనాల ద్వారా క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులు సమయానికి లేకపోవడంతో భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. క్షేత్రంలోని ప్రధాన రోడ్డుపై వాహనాలు అధికంగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. -
చికిత్స పొందుతూ బాలింత, శిశువు మృతి
● 4 రోజుల క్రితం గర్భిణి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూనే మగ శిశువుకు జననం ఊట్కూర్: కుటుంబ సభ్యుల వేధింపులతో మనస్థాపానికి గురై నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత లావణ్య (23) మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని పెద్దజట్రం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నా రాయణపేట మండలంలోని బొమ్మన్పాడుకు చెందిన లావణ్యకు పెద్దజట్రం గ్రామానికి చెందిన తా యప్ప కుమారుడు బాలకృష్ణతో నాలుగేళ్ల క్రితం వి వాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉండ గా.. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఈ క్రమంలో 15 రోజు ల క్రితం భర్త బాలకృష్ణ, కుటుంబ సభ్యులు ఆమెకు తెలియకుండా ఇతరులకు భూమి అమ్మారు. ఈ విషయమై కుటుంబంలో గొడ వలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన లావణ్య ఈ నెల 4, మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంచుకుంది. మంట వేడికి బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి మంటలు ఆర్పి చికిత్స కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఇరువురు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తహసీల్దార్ అశోక్కుమార్ పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మిడ్జిల్: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న యు వకుడు మార్గ మధ్యలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికు లు, గ్రామస్తుల కథనం మే రకు.. మండల పరిధిలోని బోయిన్పల్లికి చెందిన గుడిగాన్పల్లి బన్ని (22) శనివారం రా త్రి జడ్చర్ల సమీపంలోని హెటిరో కంపెనీలో నైట్ డ్యూటీ ముగించుకొని ఆదివారం ఉద యం ఇంటికి బైక్పై వస్తుండగా మార్గ మధ్య లో 167 జాతీయ రహదారిపై మున్ననూర్ సమీపంలో బైక్ ముందు వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టడంతో బన్ని అక్కడికక్క డే మృతి చెందాడు. యాదమ్మ, బంగారమ్మకు ముగ్గు రు పిల్లలు ఉండగా రెండో సంతానం బన్ని. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించిన్నట్లు ఎస్ఐ శ్రీనువాసులు తెలిపారు. వాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి భూత్పూర్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా.. పట్టణానికి చెందిన గొల్ల పెద్ద బుచ్చన్న (65) మృతి చెందిన ఘట న చోటు చేసుకుంది. ఎస్ఐ నాగన్న తెలిపిన సమాచారం మేరకు గొల్ల పెద్ద బుచ్చన్న పట్టణ శివారులో ఓ వ్యవసాయ పొలంలో గొర్రెల మంద నిలిపారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి నడుచుకుంటూ వస్తుండగా టాటా మోటార్స్ షోరోం ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణానికి బజారు ఆంజనేయులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా గొల్ల పెద్ద బుచ్చన్న మృతదేహాం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు గోపన్పల్లి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. ఎక్లాస్పూర్లో విషాదం అయిజ: మండలంలోని ఎక్లాస్పూర్కి చెందిన వైద్య విద్యార్థిని కనికె ప్రియాంక(28) ఆదివారం మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వెంకటేష్, చంద్రకళ దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా.. ప్రియాంక మెదటి సంతానం. వీరు గత నాలుగేళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. చురుకై న విద్యార్థి మృతితో బంధువులు బోరున విలపించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం ప్రియాంక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి ఇక్కడే అంత్యక్రియలు జరిపిస్తారని బంధువులు తెలిపారు. కృష్ణానదిలో మృతదేహం లభ్యం ధరూరు: మండలంలోని గార్లపాడు సమీప కృష్ణానదిలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం(35–45ఏళ్లు) గమనించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నందీకర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సుమారు వారం రోజుల క్రితం నీటిలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు, ఆచూకీ తెలిసినవారు ధరూర్ పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. బీచుపల్లి పుష్కర్ఘాట్లో మొసలికి పూజలు ఎర్రవల్లి: మొసలికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన సంఘటన బీచుపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం మొసలి పిల్ల బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద వరద నుంచి బయటికి వచ్చి అపరకర్మల భవనం సమీపానికి చేరుకుంది. ఈ క్రమంలో బీచుపల్లి పుష్కరఘాట్ క్షేత్ర పురోహితుడు అనిల్శర్మ అరగంట పాటు మొసలికి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఉద్దేశంతో పూజలు చేసినట్లు పురోహితులు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఫారెస్ట్ అధికారులతో కలిసి మొసలిని కృష్ణానదిలో వదిలారు. -
చావు అంచుల నుంచి..
మదనాపురం: చేపల వేటే ఆ యువకుడి జీవనాధారం. రోజులాగే నది ఒడ్డున వల విసురుతుండగా.. ఊహించని విధంగా మృత్యువు మొసలి రూపంలో దాడి చేసింది. క్షణాల వ్యవధిలో మొసలి దవడల నుంచి చాకచక్యంగా, అదృష్టవశాత్తు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ భయాందోళనకర ఘటన మదనాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. గోపన్పేటకు చెందిన మత్స్యకారుడు మహేష్ చేపల వేట కోసం సమీపంలో ఉన్న రామన్పాడు జలాశయం వెనక జలాలు కొత్తపల్లి వంతెన పైభాగంలో థర్మకోల్ తెప్పపై ఉండి చేపలు వేట చేస్తున్నాడు. ఈ క్రమంలో నీటి లోపల ఉన్న ఒక పెద్ద మొసలి ఒక్కసారిగా బయటకు వచ్చి అతడిపై దాడి చేసింది. నోట్లో కరుచుకొని నీటిలోకి లాగేందుకు యత్నించింది. దీంతో దాని నుంచి రక్షించాలని యువకుడు పక్కనున్న తోటి మత్స్యకారులను పిలిచాడు. వారు సకాలంలో స్పందించి మొసలి నోటి నుంచి రక్షించారు. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రామన్పాడు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ● మొసలి నోటికి చిక్కి త్రుటిలో తప్పించుకున్న మత్స్యకారుడు ● రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లగా ఘటన -
గంజాయి మత్తులో యువత
● ఇప్పటికే ప్రధాన సూత్రదారి అరెస్టు ● తెలుగు రాష్ట్రాల్లో కూపీలాగుతున్న పోలీసులు ● తాజాగా 1.30 కిలోల గంజాయి సీజ్ గద్వాల క్రైం: నడిగడ్డలో యువత మత్తుకు బానిసవుతున్నారు. కూలీలు, విద్యార్థులు, వ్యాయామశాలలో కసరత్తు చేస్తున్న వారు నిషేధిత మత్తు పదార్థాల కోసం పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇద్దరు సొంత అన్నదమ్ములే గుట్టుగా గంజాయి దందాను కొన్ని నెలలుగా సాగిస్తున్న వ్యవహారం గుట్టురట్టయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. గుట్టుచప్పుడుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సుల్తానాపురంలో.. అలంపూర్ నియోజకవర్గంలోని సుల్తానాపురం గ్రా మానికి చెందిన అన్నదమ్ములు గంజాయి విక్రయాలు చేస్తున్నారని నిర్ధారించారు. ఈ నెల 8న వా రి వద్ద 1.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ప్రధాన సూత్రదారిని అరెస్టు చేయడం జోగుళాంబ గద్వాల జిల్లాలో హాట్టాపిక్గా మారింది. సుల్తా నాపురం గ్రామానికి చెందిన చంద్రకాంత్గౌడ్, రవిచందర్గౌడ్ కొన్ని నెలలుగా గంజాయి (మత్తు పదార్థాని)కి అలవాటు పడ్డారు. అయితే తెలిసిన స్నేహితులకు సైతం గంజాయిని అలవాటు చేశా రు. మూడు నెలలుగా సాగుతున్న మత్తు దందాను అలంపూర్ పోలీసులు ఎట్టకేలకు గుర్తించి గుట్టురట్టు చేశారు. గంజాయి కిలో రూ.30 వేల నుంచి రూ.40 వేలకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నందికొట్కూర్లో జిల్లా పోలీసులు పలు అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు సైతం నిర్వహించారు. మూడు నెలలుగా.... సుల్తానాపురానికి చెందిన ఇద్దరు సోదరుల్లో ఒకరు కొన్ని ఏళ్ల క్రితమే గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ప్రధాన సూత్రదారి(సోదరుడు) కర్నూలు జిల్లాలోని ఫిజియోథెరపీ చదువు పూర్తిచేసి శిక్షణ కోసం హైదరాబాద్లోని ఓ క్లినిక్లో ఆరు నెలలు శిక్షణ పొందాడు. ఈ క్రమంలో ప్రతిరోజు దగ్గర్లోని వ్యాయామశాలకు వెళ్తున్న క్రమంలో గంజాయి తీసుకునే వ్యక్తులు పరిచయంతో తన సోదరుడితో మంతనాలు చేసి గంజాయి విక్రయాలు చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని గ్రహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నగరాల నుంచి గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యుల నుంచి కొనుగోలు చేయడం, ఆ గంజాయిను చిన్నచిన్న పాకెట్లలో అమర్చి అమ్మకాలు చేపట్టారు. పక్కా సమాచారంతో జిల్లా పోలీసులు దాడి చేసి గంజాయి ఆకులు, పూలు, రెమ్మలు, గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. కూిపీలాగుతున్న పోలీసులు... గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడిన నిందితుడి సమాచారం మేరకు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నందికొట్కూర్, కర్నూలు, నంద్యాల, ఆత్మకూర్, ఆదోని, ఎమ్మిగనూర్, డోన్, కోడుమూరు తదితర ప్రాంతాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన వారి సంఖ్య 200లకు పైగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సుల్తానాపురం సోదరులే గంజాయి విక్రేతలు 1.8.2026న గద్వాల పట్టణంలో కొందరు యువత నిషేధిత మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకొని రక్త పరీక్షలు నిర్వహించారు. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. 28.7.2026న గద్వాలకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడే రెండు రోజలు ఉండి గద్వాలకు వచ్చాడు. సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో అదుపులోకి తీసుకొని పరీక్షలు చేయించారు. గంజాయి తీసుకున్నట్లు తేలింది. గతేడాదిలో నాలుగు ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. 5.33 కేజీల గంజాయితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
అంతఃకరణశుద్ధితోనే సనాతన ధర్మరక్షణ
జడ్చర్ల టౌన్: అంతఃకరణశుద్ధితోనే సనాతన ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు పిలుపునిచ్చారు. సనాతన ధర్మపరిరక్షణ అలియన్స్ కమిటీ నిర్వాహకులు చంద్రారెడ్డి, శ్రీగిరిక్షేత్రం పీఠాధిపతి కృష్ణాస్వామి నేతృత్వంలో ఆదివారం శ్రీగిరిక్షేత్రంపై నిర్వహించిన సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్టేబుల్ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, వక్తలు హాజరై ప్రసంగించారు. సనాతన బోర్డు రావాలని వక్తలు ముక్తకంఠంతో తీర్మానించారు. ధర్మ పరిరక్షణ అనేది మాటల్లో కాకుండా ప్రతి ఒక్కరి దినచర్యలోనే మార్పురావాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో ప్రతి అమ్మాయిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అంతర్యుద్ధం మొదలైందని, హిందువులు మేలుకోవాలన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించటం అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మానవ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి చిన్నతనం నుంచే నేర్పించాలని అప్పుడే కొంతైనా మార్పు సాధ్యమన్నారు. ధర్మం వైపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులుంటేనే పిల్లలు మారుతారని గుర్తుంచుకోవాలన్నారు. ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, ధర్మపరిరక్షణకు నడుంబిగించిన వారే పాలకవర్గంలో చైర్మన్గా, సభ్యులుగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉందని, అందుకు హిందువులంతా ఏకమైతే సాధ్యమవుతుందన్నారు. ఆలయాల్లో వారానికి ఒక్కసారైనా అందరు కలసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించాలన్నారు. జ్ఞానం ఉన్నవారే ఎక్కువగా మోసాలకు పాల్పడుతుండటం విచారణకరమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సాధు సంతులు శివరుద్రస్వామి (జగద్గిరిగుట్ట కేదార్నాథ్ క్షేత్రం పీఠాధిపతి), సోమేశ్వరస్వామి (నాగోల్), రుద్రశివానంద మౌన సరస్వతి స్వామి (శ్రీశైలం), యోగేష్ ప్రభు, రఘుప్రోలు జనార్దన స్వామి (సాతాపూర్), జగద్గురు భగవత్ మహారాజ్స్వామి (జంబుద్వీపం రిషికేష్), దీక్షిత్ సుబ్రహ్మణ్యం (ఫిమేల్సింగర్), పరమానంద (గంగాపురం), జయరాం, రాఘవేంద్రస్వామి, రజనిరమ, మదన్గుప్త, నేరెళ్ల మాల్యాద్రి, పద్మాకర్ ఆచార్యులు, యమునపాటక్, కృష్ణానందస్వామి, నాయకులు, విష్ణుసహస్రనామ పారాయణ బృందం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ అక్రమంగా వినియోగిస్తే చర్యలు
● సీసీబీ నిర్మాణానికి వినియోగిస్తున్న కరెంట్ కనెక్షన్ కట్ జడ్చర్ల టౌన్: ‘అడ్డంగా వాడేయి అడిగేదెవరు’ అన్న శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఆదివా రం సెలవు రోజు అయినప్పటికీ హైదరాబాద్ డీపీ ఈ హెచ్టీ (అధిక ఓల్టేజ్ విద్యుత్ కనెక్షన్లలో జరిగే విద్యుత్ దొంగతనాలు, మీటర్ల ట్యాంపరింగ్ను తనిఖీ చేసి పట్టుకునే ప్రత్యేక విభాగం) అధికారులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆ శాఖకు చెందిన ఏడీ జావెద్ అహ్మద్, ఏఈ జంగయ్య ఆస్పత్రికి చేరుకుని మీటరు నుంచి సీసీబీ నిర్మాణం, బోరుమోటారుతో పాటు కార్మికులు ఉండే గదులకు, ఇతరత్రా విద్యుత్ వినియోగం కోసం వేచిన వైర్లను పరిశీలించారు. ముందుగా మీటరు నుంచి ఆ అక్ర మ కనెక్షన్లు పూర్తిగా తొలిగించారు. సీసీబీ నిర్మాణం కోసం ఇకపై ఏరియా ఆస్పత్రి కరెంట్ వినియోగించరాదని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ ఆగస్టీన్రెడ్డి ఉన్నారు. డీపీఈ హెచ్టీ అధికారులు ఆస్పత్రిలో తనిఖీ చేసినట్లు స్థానిక డీఈ చంద్రమౌళి సాక్షికి తెలియజేశారు. ఆస్పత్రి మీటరు నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే శాఖపరమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తాము ఆస్పత్రి బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ కనెక్షన్ తొలగించటం లేదని స్పష్టం చేశారు. అయితే 18 నెలలుగా వినియోగిస్తున్న విద్యుత్ విషయంలో తప్పనిసరిగా బిల్లు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. -
కురుమూర్తిరాయ నుంచి నీటి విడుదల
మదనాపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం మో టార్లను ఆన్ చేసి కాల్వలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద నీటి లభ్యతను బట్టి ఇప్పటికే కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఫేజ్–1, 2 ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. సాంకేతిక అధికారుల సూచనలు, రైతుల అవసరాల ఆధారంగా నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లిఫ్టు చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, సర్పంచు రాజేష్యాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. 72.013 మి.యూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు కలిపి 72.013 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని త్వరలోనే సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడుతామని వెల్లడించారు. ............. 09కేకేటీ101 -
పరిశుభ్రత పాటించాలి..
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా చిన్నారుల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు పెరిగాయి. ఈ కాలంలో డిఫ్తీరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. జ్వరం, జలుబు వస్తే పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు. వైద్యుల సూచన మేరకే మందులు వేసుకోవాలి. – రాఘవేందర్, చిన్నపిల్లల వైద్యుడు జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రతి శుక్రవారం ఫ్రై డే– డ్రై డే నిర్వహిస్తున్నాం. కేసులు నమోదవుతున్న గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అంగన్వాడీలు, ఆశలు, ఏఎన్ఎంల ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఉండే పరిసరాలు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. జ్వరం, దగ్గు, జలు బు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు ప్రైవేట్కు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలి. – శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ ● -
సాహిత్యంలో యశోదారెడ్డి తనదైన ముద్ర
స్టేషన్ మహబూబ్నగర్: సాహితీ రంగంలో తెలంగాణ సాహితీ దిగ్గజం పాకాల యశోదారెడ్డి తనదైన ముద్రవేశారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు సంచాలకులుగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, సహ సంచాలకులుగా ప్రధాన కార్యదర్శి శాంతారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ పాకాల యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలికమంతా తెలంగాణ, బిజినేపల్లి ప్రాంతానికి చెందినదే అన్నారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సేవలను కొనియాడారు. ఆచార్య చందోజీరావు మాట్లాడుతూ యశోదారెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు వర్తమాన పరిశోధకులుగా, కథా రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభ సదస్సుకు రావూరి వనజ సభాధ్యక్షత వహించగా.. సదస్సులో పలువురు పరిశోధకులు పత్రసమర్పణ చేశారు. సమావేశంలోలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, జి.శాంతారెడ్డి, డాక్టర్ భారతి, ప్రముఖ అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, జయలక్ష్మమ్మ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, గన్నోజు శ్రీనివాసాచారి, కె.వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ..
మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడలను ఈ సారి తెలంగాణలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక క్రీడాపాలసీ రూపొందించింది. గత ఏడాది సీఎం కప్ క్రీడలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏదైనా ఒక క్రీడను మహబూబ్నగర్లో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్లో ఖేలో ఇండియా యూత్ కబడ్డీ చాంపియన్షిప్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహబూబ్నగర్ నగరంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలురు ఎనిమిది, బాలికలు ఎనిమిది జట్లతో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు నవంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవంతంగా నిర్వహిస్తాం మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి కృషితో మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు జిల్లా క్రీడారంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్ని క్రీడాసంఘాలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. – జె.రాజశేఖర్రెడ్డి, డీవైఎస్ఓ పాలమూరులో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు రెండు, మూడు రోజుల్లో రానున్న అధికారిక ప్రకటన ఎనిమిది రాష్ట్రాల బాల, బాలికల జట్లతో చాంపియన్షిప్ నవంబర్లో నిర్వహించే అవకాశం -
పుష్కలంగా తాగునీరు
మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ● ఇకపై కేఎల్ఐతోపాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ● ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ ● శాశ్వతంగా తీరనున్న తిప్పలు గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
మెయిన్ స్టేడియాన్ని పరిశీలించిన ఖేలో ఇండియా బృందం
ఇటీవల ఖేలో ఇండియా కేంద్రం, రాష్ట్ర బృందా లు మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంతో పాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమర్జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్ట ర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానా లు, జిల్లాకేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షి యల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. -
ఆది నుంచి అంతంతే...
ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు నిరాశపరుస్తున్నాయి. జూన్లో సాధారణ వర్షపాతం నమోదైనా విస్తృతంగా ఉపయోగపడే భారీ వర్షాలు లేవు. జూలైలోనూ చిరుజల్లులు, మోస్తరు వానలకే పరిమితమైంది. భూమి పూర్తిగా తడిసేలా, చెరువులు నిండేలా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు సాగుతున్నప్పటికీ భూగర్భ జలాల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై 31 నాటికి బాలానగర్, మహమ్మదాబాద్ మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. గండేడ్, దేవరకద్ర, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే చిన్నచింతకుంట, కోయిలకొండ, హన్వాడ, మహబూబ్నగర్ రూరల్, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, మహబూబ్నగర్ అర్బన్, కౌకుంట్ల మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. -
నవాబుపేటలో డ్రగ్స్ కలకలం
నవాబుపేట: తమ పిల్లలు రాత్రిళ్లు అదోలా ఉంటున్నారు.. మద్యం తాగోస్తున్నారనుకున్నాం... కానీ తాజాగా పోలీసులు జాగిలాలతో డ్రగ్స్ కోసం సోదాలు చేస్తుంటే మండలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం జరుగుతుందెమోనని యువత తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో తాజాగా పోలీసులు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో సోదాలు సైతం ప్రత్యేకంగా అనుమానాలకు తావిస్తున్నాయి. ఆదివారం సంతే టార్గెటా.. ఆదివారం మండల కేంద్రంలో జరిగే సంతకు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. దీంతో సంతను టార్గెట్ చేసుకుని సందట్లో సడేమియా అన్నట్లు గంజాయి విక్రయాలు చేస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మత్తు పదార్థాల అన్వేషణలో భాగంగా డాగ్స్కాడ్ ప్రత్యేక తనిఖీలు చేసింది. నిఘా విభాగం సమాచారం మేరకు తనిఖీలు జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల సోదాలతో మరింత ఆందోళన డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. డ్రగ్సను పట్టణాల నుంచి పల్లెలకు పాకకుండా వాటిని కట్టడి చేయాలన్నా ఉద్దేశంతో ప్రత్యేక డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టాం. ఎస్పీ ఆదేశాలతో డ్రగ్స్ను పసిగట్టే రుద్రా అనే స్నిపర్ డాగ్ను రంగంలోకి దించామని ఇక సోదాలు నిరంతరం కొనసాగిస్తునే ఉంటాం. – నరేందర్, ఎస్ఐ, నవాబుపేట -
మహిళలకు నిరంతర ఉపాధి
చిరుధాన్యాల రొట్టెల తయారీ ద్వారా నాతోపాటు మరో ఆరుగురు మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున కూలి చెల్లిస్తున్నాం. సాధారణంగా మహిళలకు నిరంతర ఉపాధి లభించడం కష్టంగా ఉంటుంది. ఈ రొట్టెల యూనిట్ మాత్రం మాకు క్రమం తప్పకుండా పని, ఆదాయాన్ని అందిస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ యూనిట్ ఎంతో దోహదపడుతోంది. రొట్టెలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉత్పత్తిని మరింత పెంచగలిగితే భవిష్యత్లో ఇంకొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అధికారుల సహకారంతో ప్రస్తుతం యూనిట్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. – వన్పలి రాఘవేంద్రమ్మ, మిల్లెట్ యూనిట్ నిర్వాహకురాలు ● -
శాంతినగర్లో పీడీఎస్ బియ్యం పట్టివేత
రాజోళి: శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పట్టణంలోని బృందావన కాలనీలో గల గోగినేని సత్యనారాయణ ఇంటి ఎదుట గల రేకుల షెడ్లో బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం అందడంతో దాడి చేసి, ఎలాంటి అనుమతులు లేని 14 క్వింటాళ్ల బియ్యం గుర్తించామన్నారు. విచారణ చేయగా.. తెలుగు భాస్కర్, వడ్డె గోపిచంద్ వడ్డేపల్లి, చుట్టు పక్కల గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి, వాటిని కర్ణాటకలోని రాయిచూర్, ఇతర పట్టణాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత అచ్చంపేట రూరల్: మండలంలోని పలకపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అచ్చంపేట పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పల్కపల్లి నుంచి అచ్చంపేట ప్రధాన రహదారిలో కాపు కాచారు. ఓ బొలెరో వాహనం అనుమానస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 32 ప్లాస్టిక్ బ్యాగుల్లో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ వాహన డ్రైవర్, ఓనర్ తిక్కల శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ నరేష్ తెలిపారు. -
భారీగా నీటిమట్టం పడిపోయిన మండలాల్లో ఇలా (నీటిమట్టం మీటర్లలో)
జూలై 31 నాటికి జిల్లా సాధారణ వర్షపాతం (మిల్లీమీటర్లు) 231.2 నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లు) 191.8● గతేడాది జూలై ● ఈ ఏడాది జూలైమహబూబ్నగర్ రూరల్ 7.75 9.85మహమ్మదాబాద్ 4.49 6.41 -
అడవి మనుషులం సార్.. ఆదుకోండి!
జాతీయ సెమినార్ ముగింపులో పాలమూరు యూనివర్సిటీ సిబ్బంది అచ్చంపేట: చుట్టూ దట్టమైన అడవులు.. రాళ్లు, రప్పలతో నిండిన దారులు.. కారు చీకట్లో నెగడి కట్టెల మంటలే దీపపుకాంతులు.. బొడ్డుగుడిసెల్లో జీవనం.. పండ్లు, దుంపలే ఆహారం.. వాగుల నీరే శుద్ధజలం.. ఇదీ నల్లమలలో జీవిస్తున్న చెంచుల పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 80 ఏళ్లు గడుస్తున్నా.. కూడు, గూడు, విద్య, వైద్యానికి నోచుకోక.. క్రూరమృగాలు, విషపు పురుగుల మధ్య సహవాసం చేస్తూ.. దయనీయ స్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎంత మంది ప్రజాప్రతినిధులు హామీలిచ్చినా.. నేటికీ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేకపోతోంది. పడిపోతున్న జీవన ప్రమాణాలు చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నా యి. సింహభాగం చెంచులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండి అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. రక్తహీనత, టీబీ, మలేరియా, విషజ్వరాలు, క్యాన్సర్, కడుపులో బల్ల (గడ్డ) వ్యాధులు లేని కుటుంబం అంటూ లేదు. పోషకాహారం లోపంతో మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతున్నా రు. వీరి సగటు జీవితకాలం 40 ఏళ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. పెంటల్లో 14 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తుండగా.. 30 ఏళ్లు వచ్చే సరికి ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తున్నారు. మహిళలు అనారోగ్యం పాలవడానికి ఇదే ప్రధాన కారణం. చెంచుల్లో ఎక్కువ మంది ఆహారం తీసుకో కుండా అడవుల్లో దొరికే పండ్లు తింటారు. మరికొందరు ఆహారం లేకుండా మద్యం తాగి.. అనారోగ్యాలను బారినపడుతున్నారు. తిండిలేకపోయినా రో జుల తరబడి ఉంటారు తప్ప సారా లేనిది ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెంచుల మనుగడ ప్రశ్నార్థకంగా మార నుంది. జీవనశైలిపై అవగాహన కల్పించే వారు లేక పోవడం, పౌష్టికాహార లోపం, రకరకాల వ్యాధు లు, బాల్యవివాహాలు తదితర కారణాలతో అడవి బిడ్డల రోదన.. అరణ్యవేదనగా మిగిలిపోతోంది. అభివృద్ధికి దూరంగా.. అటవీ ఉత్పత్తుల సేకరణే వీరి ప్రధాన జీవనాధారం. వీటి ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మినహాయిస్తే.. చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు లేవు. తెలంగాణ వచ్చాక కూడా ఐటీడీఏ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చెంచుల సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతం ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు, కండ్లకుంట, గీచుగండి, ఆగర్లపెంట, పందిబొర్రె పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. భౌరాపూర్లో చెంచుల బొడ్డు గుడిసెలు.. రాంపూర్ చెంచుపెంటలో చెంచుల పిల్లలు ఇలా..అందని వైద్యం.. చీకట్లో జీవనం అభయారణ్యంలోని చెంచుపెంటల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకుతున్నారు. కి.మీ.,ల దూరంలో ఉన్న బావులు, కుంటలు, బోర్లు, కాల్వల వద్దకు నడిచివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నల్లమల పెంటల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. పలుచోట్ల సోలార్ వ్యవస్థతో విద్యుత్ దీపాలు అమర్చినా సగానికి పైగా పనిచేయడం లేదు. అయితే ఈ చెంచు పెంటలన్నీ (అప్పాపూర్) ఒకే దగ్గరికి చేర్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారుతోంది. రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మంటలు పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. చెంచులకు వైద్య సేవలు అందడం లేదు. మన్ననూర్ కేంద్రంగా పనిచేసిన సంచార వైద్యశాల మూలకుబడింది. అప్పాపూర్లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా తెరుచుకోవడం. ఫలితంగా చెంచులు అనారోగ్యం పాలైతే వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దయనీయంగా నల్లమలచెంచుల జీవన విధానం బొడ్డుగుడిసెల్లో సహవాసం.. పండ్లు, దుంపలే ఆహారం కనీస వసతులకు నోచుకోని పెంటలు నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం -
10 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్/గద్వాల: జూరాల ఎగువ, దిగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టారు. శనివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 38.507 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 29.236 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 67.743 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. మరోవైపు జూరాలకు 1.73 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 21 గేట్లు ఎత్తి దిగువనకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడుకు 547 క్యూసెక్కులు, భీమా–1కు 1,300, భీమా–2కు 872 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 630 క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 600, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 15 అడుగులకు చేరిన కేఎస్పీ నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శనివారం 15 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ఉంద్యాల–1 పంపుహౌస్ నుంచి రెండు పంపులను రన్ చేసి తీలేర్–2 పంపుహౌస్కు, అక్కడి నుంచి ప్రాజెక్టు 630క్యూసెక్కుల నీటిని చేరవేస్తున్నా రు. రెండు వారాల క్రితం ప్రాజెక్టులో కేవలం 9 అడుగులకు నీటి మట్టం ఉండగా ఎత్తిపోతల నీటితో 6 అడుగుల మేర పెరిగింది. -
రోజుకు 1,000 నుంచి 1,500 రొట్టెలు
గండేడ్లోని సమాఖ్య భవనంలో కొనసాగుతున్న రొట్టెల తయారీ యూనిట్లో ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. తొలినాళ్లలో రోజుకు 100 నుంచి 500 రొట్టెల వరకు మా త్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం వీటికి ఆదరణ పెరగడంతో రోజుకు 1,000 నుంచి 1,500 రొట్టెల వరకు తయారు చేస్తున్నారు. ఒక్కో రొట్టెను రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. సల్కర్పేట్, వెన్నాచేడ్, అంచన్పల్లి, గండేడ్ తదితర గ్రామాల్లోని హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా మహమ్మదాబాద్, కోస్గి, హన్వాడ మండలాలకు కూడా ఇక్కడి నుంచే రొట్టెలను పంపిస్తున్నారు. ఆరబెట్టిన రొట్టెలు -
అన్నింటినీ అందుబాటులోకి తెచ్చేలా చూస్తాం
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ యూనిట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగతా ఎనిమిది రకాల యంత్రాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతాం. రొట్టెల తయారీతో పాటు బిస్కెట్లు, ఆరికలు, ఊదలు, కొర్రలు తదితర చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు పనిచేసేలా చూస్తాం. మిల్లెట్ యూనిట్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు నెరవేరేలా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తాం. గండేడ్ మిల్లెట్ యూనిట్ను మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. – రజిత, ఏపీఎం, గండేడ్ -
పోలీస్ మానసికంగా బలంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రజల భద్రత కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవస రం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక సామర్థ్యాలను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన 45 రోజుల కరాటే శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో స్వీయ రక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమన్నారు. కరాటే శిక్షణ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం కాదని, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ఉండే ఒత్తిళ్లను అధిగమించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు. శారీరక దారుఢ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రజల భద్రత కోసం పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, వన్టౌన్ ఎస్ఐ వసంత పాల్గొన్నారు. ఉదండాపూర్కు పర్యాటక శోభ జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మార్చి 26న అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కోరారు. తాజాగా స్పందించిన ప్రభుత్వం సోమశిల–అలంపూర్ ప్రత్యేక పర్యాటక ప్రాంతం(ఎస్టీఏ)లో భాగంగా ఉదండాపూర్ను చేరుస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి సమగ్ర మాస్టర్ప్లాన్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే శనివారం ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ బియ్యం మింగేశాడు!
● శ్రీరామ రైస్మిల్లులో అధికారులు, పోలీసుల తనిఖీలు ● 2,880 టన్నుల ధాన్యం మాయం.. రూ.10.75 కోట్ల బకాయిలు ● యజమానిపై కేసు.. గతంలోనే మిల్లును సీజ్ చేసిన అధికారులు మహమ్మదాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా భారీగా బకాయిపడిన మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాధిర్యాల్ గేటు సమీపంలోని శ్రీరామ రైస్మిల్లులో శనివారం అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు ఏమీ లేకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. రూ.10.75 కోట్ల బకాయిలు శ్రీరామ రైస్మిల్లుకు ప్రభుత్వం నుంచి సుమారు 2,880 టన్నుల వరిధాన్యం అందినట్లు అధికారులు గుర్తించారు. ఆ ధాన్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీని విలువ సుమారు రూ.10.75 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి బియ్యం అందించకుండా ఇంత భారీ మొత్తంలో బకాయిపడినట్లు గుర్తించడంతో మిల్లర్పై చర్యలకు ఉపక్రమించారు. మిల్లులో ఖాళీ బస్తాలు.. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆదిత్యగౌడ్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి, ఇతర సిబ్బంది మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఒక్క బస్తా బియ్యం గానీ, ధాన్యం గానీ కనిపించకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యం, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం, ఇప్పటికే చెల్లించిన వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. గతంలోనే సీజ్.. అయినా.. శ్రీరామ రైస్మిల్లుపై అధికారులు గతంలోనే తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో మిల్లును సీజ్ చేసి, ఉన్నతాధికారులైన డీఎస్ఓ, డీఎంలకు సమాచారం అందించడంతో పాటు నివేదికలు కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం భారీగా బకాయి ఉన్నట్లు నిర్ధారించారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందేలా చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
ఇసుక మాఫియా బరితెగింపు
●వరిమడిని నాశనం చేశారు ఆరుగాలం కష్టించే రైతులు సాగుచేసుకున్న వరిసాగును సైతం ఇసుకాసురులు పాడుచేస్తున్నారు. వాగులోకి టిప్పర్లు మా పొలం పక్క నుంచే వెళ్తుంటాయి. మా పొలాన్ని పాడు చేయడంతో పాటు నిన్న రాత్రి ఓ టిప్పర్ కూరుకుపోవడంతో జేసీబీని తెచ్చి బయటకు లాగారు. దీంతో ఇటీవల వేసిన వరినాటు దెబ్బతింది. ఇసుక వ్యాపారులను నుంచి తమ పొలాలను కాపాడి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాం. సమీప పొలంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకాసు రులపై చర్యలు తీసుకోవాలి. – దాచని విజయభాస్కర్రెడ్డి, మల్లేపల్లి ఫిర్యాదు చేస్తున్నా.. దుందుభీ వాగులో ఇసుక అసలే లేదు. ఉన్న మట్టిని తవ్వి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేసి, తర్వాత ఇసుకాసురులను వదిలేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారులు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ఇలా కొనసాగితే సాగు సంగతి దేవుడెరుగు తాగడానికి కూడా నీళ్లు కూడ దొరకవు. – రామకృష్ణ, సర్పంచ్, రాజాపూర్ రాజాపూర్: అసలే ఇసుక అక్రమ దందా.. అడ్డొస్తే అంతు చూస్తామని బెదిరింపులు.. చివరికి రైతులు వేసుకున్న పంటలను సైతం ధ్వంసం చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు అన్న చందంగా మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దుందుభీ వాగు ప్రాంతాలైన రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, రాజాపూర్, చెన్నవెల్లి, మల్లేపల్లి, ఈద్గాన్పల్లి, నందిగామ, తిర్మలాపూర్ తదితర గ్రామాల శివారులో ఇసుకాసురులు పగలు, రాత్రి తేడాలేకుండా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీనికి తోడు వాగు సమీపాల్లో ఉన్న పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా సరే ఇటాచీలు, జేసీబీతో వాటిలోని మట్టిని తోడి కృత్రిమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ.. జడ్చర్ల, షాద్నగర్ తదితర పట్టణాలకు తరలిస్తూ తమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. గ్రామాల్లో సైతం పాడవుతోన్న రోడ్లు... వాగు పరిసరాల్లో సామర్థ్యాన్ని మించి అధిక లోడ్తో ఇసుక నింపుకొని ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్తుండడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. గ్రామాలకు ఉన్న బీటీ రోడ్లు సైతం గుంతలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో యువత ఏ పనులు చేసుకోకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లనే లక్ష్యంగా చేసుకొని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా.. ఇసుక అక్రమ వ్యాపారానికి అలవాటు పడిన వారు అధికారులు వేసిన జరిమానాలు చెల్లిస్తూ మరుసటి రోజే తమ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. వరి నాట్లను సైతం ధ్వంసం చేసి ఇసుక అక్రమ తరలింపు దుందుభీ వాగు పొడవునాఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు అడపాదడప కేసులు నమోదవుతున్నా పట్టింపులేదుదాడులు చేస్తున్నాం.. ఇసుక అక్రమగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందంటే దాడులు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో రైతులు, ప్రజలు చైతన్యం కావాలి. గ్రామాల పరిధిలో ఎక్కడైనా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తుంటే సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – రాజశేఖర్, ఎస్ఐ, రాజాపూర్ -
వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
జిల్లాలో ఈ ఏడాది వర్షపా తం సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. ఎ క్కువ రోజులు తేలికపాటి వర్షాలే కురవడంతో భూమిలోకి నీరు ఇంకే అవకాశం తగ్గింది. అందుకే భూగర్భ జలమట్టంలో ఆశించిన పెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం చెరువులు, వాగులు నిండకపోవడంతో సహజ రీచార్జ్ కూడా జరగడం లేదు. ఆగస్టులో భారీ వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. రైతులు బోర్ల నీటిని అవసరమైన మేరకే వినియోగిస్తూ, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే రీచార్జ్ పిట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పాటు లభిస్తుంది. – కె.శ్రీనివాసరావు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ఉషా నిధులతో పీయూ అభివృది పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచేవిద్యా ప్రమాణాల పెంపు పోటీ ప్రపంచంలో రాణించాలంటేనాణ్యమైన విద్య తప్పనిసరి పీయూ నేషనల్ సెమినార్ ముగింపుకార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు -
చిరుధాన్యాల రొట్టెలు.. ఆరోగ్యానికి బాటలు!
● మహిళా సంఘాల తయారీ ● మార్కెట్లో పెరిగిన డిమాండ్ ● ఉపాధితో పాటు ఆదాయం.. ● ఆదర్శంగా గండేడ్ మిల్లెట్ యూనిట్ యూనిట్లో తయారు చేస్తున్న రొట్టెలు చిరుధాన్యాలతో రూపొందుతున్నాయి. జొన్నలతో పాటు ఊదలు, కొర్రలు, అరకలు తదితర చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇంట్లో సాధారణంగా తయారు చేసుకునే రొట్టెలతో పోలిస్తే వీటికి ప్రత్యేకమైన రుచి ఉండటంతో వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇటీవల పెద్ద పెనం, పొయ్యిని కూడా కొనుగోలు చేశారు. గతంలో ఒకేసారి నాలుగు రొట్టెలు తయారు చేయగా.. ప్రస్తుతం ఎనిమిది రొట్టెలను ఒకేసారి తయారు చేస్తున్నారు. పిండిని మిషన్లో వేసి రొట్టెలను కట్ చేసి, అనంతరం పెనంపై కాల్చి ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అనంతరం హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గండేడ్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనకు పదును పెట్టిన మహిళలు.. చిరుధాన్యాలకు పెరుగుతున్న ఆదరణను తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను ఆసరాగా చేసుకుని చిరుధాన్యాలతో రొట్టెలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు గండేడ్ మండలకేంద్రంలోని చిరుధాన్యాల రొట్టెల తయారీ యూనిట్ నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు తయారు చేస్తున్న రొట్టెలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తిని కూడా క్రమంగా పెంచుతున్నారు. రూర్బన్ పథకం కింద నాలుగేళ్ల క్రితం గండేడ్ మండల కేంద్రంలో రూ.24.5 లక్షల వ్యయంతో మిల్లెట్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది రకాల యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఈ యూనిట్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల మహిళలతో మహిళా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని 403 సంఘాల నుంచి ఒక్కో సంఘం రూ.500 చొప్పున మూలధనాన్ని సమీకరించి కేంద్ర ప్రభుత్వ వాటా కోసం వినియోగించారు. సమీకరించిన మూలధనానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.3.5 లక్షలు మంజూరయ్యాయి. మహిళా సమాఖ్య నుంచి కూడా కొంత మొత్తాన్ని సమకూర్చుకుని యూనిట్ నిర్వహణకు వినియోగించారు. -
ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
గతంలో వేసవిలో బోర్లలో నీరు అడుగంటినా, వర్షాకాలం ప్రారంభమైన తర్వాత భూగర్భజలాలు క్రమంగా పైకి వచ్చేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వర్షాకాలం కొనసాగుతున్నా నీటి మట్టం పెరగలేదు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో పూర్తిస్థాయిలో సాగు చేయలేకపోతున్నాం. నీరు మధ్యలో అయిపోతుందేమోననే భయంతో సగం భూమిలోనే పంటలు వేశాం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పంటలతో పాటు రైతుల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. – పాండునాయక్, రైతు, అజిలాపూర్ గ్రామం, నవాబుపేట మండలం కొంత భూమిలోనే సాగు.. వర్షాకాలం వచ్చిందంటే రైతులకు ధైర్యం వచ్చేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాలు పడుతున్నా బోర్లలో నీటి మట్టం పెరగడం లేదు. ఒకవైపు విద్యుత్ ఖర్చులు, మరోవైపు నీరు లేక పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళన వెంటాడుతోంది. అందుకే పూర్తిస్థాయిలో సాగు చేయకుండా కొంత భూమినే సాగులోకి తెచ్చాం. భూగర్భజలాలు ఇలాగే తగ్గిపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం మరింత కష్టమవుతుంది. చెరువులు నింపడం, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలను ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలి. – రాములు, రైతు గుడిమల్కాపూర్ గ్రామం, హన్వాడ మండలం


