జేఈఈ మెయిన్స్లో ‘ప్రతిభ’ విద్యార్థుల సత్తా
పాలమూరు: జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్లో సత్తా చాటారు. ఈ మేరకు కళాశాలకు చెందిన విద్యార్థులు అద్వైత్రెడ్డి 99.32, శ్రీ నితిన్ 98.53, తనూజ 98.46, శ్రీహరి హరణ్ 98.15, భరత్కుమార్రెడ్డి 98.05, శ్రీధర్ 97.36, సాయికీర్తన్ 97.32, సాయిరూపక్గౌడ్ 96.78 పీయూష్గుప్తా 96.47, భానుప్రసాద్ 95.64, ప్రియాంక 95.58, విశాల్ 95.09, ఫహదుద్దీన్ 95.00 పర్సంటైల్ సాధించి జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చారు. వీరితోపాటు 90 పర్సంటైల్ 49, 80కి పైగా పర్సంటైల్ 56మంది సాధించారు. ఈ మేరకు మంచి పర్సంటైల్ సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, రఘువర్ధన్రెడ్డి, విష్ణవర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరామయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


