ప్రభుత్వం ఆదుకోవాలి..
భూత్పూర్ రిజర్వాయర్లో గ్రామస్తులు సర్వస్వం కోల్పోయా రు. వ్యవసాయ భూ ములకు మాత్రమే నా మమాత్రపు పరిహారం అందింది. పునరావాసం కల్పించడంలో జా ప్యం చేస్తున్నారు. రిజర్వాయర్లో నీటి నిల్వ తో గ్రామంలో ఊటనీరు వస్తోంది. ఇళ్లు దెబ్బ తింటున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలి యని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకోవాలి. – కుర్వ హన్మంతు,
మాజీ సర్పంచ్, భూత్పూర్
నష్టపరిహారం ఇవ్వాలి..
భూత్పూర్లో తేమశాతం అధికంగా ఉండటంతో ఇళ్లు పాడవుతున్నాయి. ఇళ్లల్లో నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైన గ్రామంలో అధికారులు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి.
– ఆనంద శేఖర్, భూత్పూర్
ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం..
సంగంబండ రిజర్వాయ ర్ కింద ముంపునకు గు రైన మా గ్రామ సమస్య ను ఏళ్ల తరబడి పరిష్కరించడం లేదు. ప్రజాప్రతినిధులు,అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
– ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ, నెరెడుగాం
●
ప్రభుత్వం ఆదుకోవాలి..
ప్రభుత్వం ఆదుకోవాలి..


