స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సాక్షి మహబూబ్నగర్ బ్రాంచ్ మేనేజర్ శ్యాంసుందర్ అన్నారు. శుక్రవారం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు పాఠశాలలో ఎస్సెస్సీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ముఖ్య అతిధిగా హాజరైన మేనేజర్ మాట్లాడుతూ.. సాక్షి మెటీరియలతో సులభంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పరీక్షల సమయంలో సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. పరీక్షలపై దృష్టి పెట్టి మంచి మార్కులు సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కులేషన్ ఇన్చార్జి రాజేందర్, తౌఫిక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సాక్షి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ


