గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి

Jan 27 2026 8:33 AM | Updated on Jan 27 2026 8:33 AM

గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి

గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి

మక్తల్‌: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను ఎగురవేస్తుండగా కట్టె విరిగిపడింది. వివరాలిలా.. మండల తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేస్తుండగా అకస్మాత్తుగా జెండా ఏర్పాటు చేసిన కట్టె అకస్మాత్తుగా విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో నాగేందర్‌ అనే వ్యక్తి కాలిపై కట్టె పడటంతో రక్త గాయం కాగా.. పక్కనే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో కట్టెకు జెండా ఏర్పాటు చేసి తహసీల్దార్‌ ఎగురవేశారు. జెండా కట్టె పాతది కావడంతో విరిగిపోయిందని సిబ్బంది తెలిపారు.

జెండావిష్కరణలో విరిగిన కట్టె

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement