కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బైక్పై వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గణేకల్ గ్రామానికి చెందిన వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్లుగా గుర్తించారు.