రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం | Road Accident in Prakasam District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం

Apr 27 2026 5:12 AM | Updated on Apr 27 2026 5:12 AM

Road Accident in Prakasam District

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం పాలైన ఘట­న ప్రకాశం జిల్లా అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహ­దారిపై ఆదివారం జరిగింది. బల్లికురవ మండలం వైదన కొప్పరపాడుకి చెందిన దమ్ము చిన్న(35) ఏడేళ్లుగా తన భార్య మణిమ్మ స్వగ్రామమైన చక్రా­యపాలెం వచ్చి నివా­సం ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు.

ఆదివారం ఉదయం పెద్ద కుమారుడు సుశాంత్‌(12)ను శాంతి నగర్‌లోని బ్రహ్మంగారి ఆరాధనోత్సవం దగ్గర వదిలి రావడానికి మోటారు బైకుపై బయలు దేరాడు. ఈ క్రమంలో చక్రాయపాలెం–శాంతినగర్‌ గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement