అనంతపురం జిల్లా కూడేరు మండలం ఆరవకురు గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పల్సర్ బైక్ను బొలోరో వాహనం ఢీకొట్టింది. ఒక్కసారిగా పల్సర్ ట్యాంకరు పేలడంతో మోటర్ బైక్పై ఉన్న ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. వారిద్దరూ బైక్పై అనంతపురం వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


