అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి | Truck rams multiple vehicles, 11 dead in UP's Mirzapur | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

Apr 23 2026 7:22 AM | Updated on Apr 23 2026 8:38 AM

Truck rams multiple vehicles, 11 dead in UP's Mirzapur

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం కారణంగా రెండు వాహనాల్లో 11 మంది ప్రాణాల కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. మీర్జాపూర్‌‌ జిల్లాలో ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి డ్రామాండ్‌గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న ట్రక్కుతో పాటు రెండు కార్లను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు ట్రక్కులకు మధ్యలో కార్లు చిక్కుకుని మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు.

ఇక, ఈ ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 11 మందిలో ఏడుగురు మీర్జాపుర్ వాసులు కాగా, ఒకరు సోన్‌భద్ర జిల్లాకు చెందిన వారున్నారు. ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు మీర్జాపూర్‌ పోలీసులు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement