Peddi: అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్‌ | Ram Charan Peddi: I will anything for my fans at Vijayawada | Sakshi
Sakshi News home page

Peddi: అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్‌

Jun 1 2026 11:06 PM | Updated on Jun 2 2026 12:10 AM

Ram Charan Peddi: I will anything for my fans at Vijayawada

స్టార్ హీరో రామ్‌చరణ్‌ తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులను ఉత్సాహపరిచారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా జూన్‌ 4న పాన్‌ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటించింది.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్‌ 150’ సెలబ్రేషన్స్‌ చేశాం. ఆర్టిస్ట్‌గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. 

 బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్‌లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్‌ డైరెక్టర్స్‌ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తా అంటూ చరణ్‌ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement