breaking news
Peddi Movie
-
భారీ డిజిటల్ రైట్స్ తో రామ్ చరణ్ పెద్ది సినిమా సంచలనం
-
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
‘యాస’కు సై అంటున్న టాలీవుడ్ స్టార్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస మారుతోంది. గతంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా సాధారణ యాసలో డైలాగులు చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. చిత్రకథ ఏ ప్రాంతీయ నేపథ్యంలో సాగుతుందో అక్కడి యాసని పలికేందుకు నటీనటులు సై అంటున్నారు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ, ఆంధ్ర... ఇలా ప్రాంతం ఏదైనా అక్కడి నేటివిటీకి తగ్గట్టు యాస నేర్చుకుని, తమదైన శైలిలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో మేకర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మన హీరోలు పలుకుతున్న యాస విశేషాలేంటో చూద్దాం... రాయలసీమ నేపథ్యంలో... చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి శ్రీకారం చుట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేశారు మేకర్స్. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారనీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో రాయలసీమ బ్యాక్డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. సో... చిరంజీవి రాయలసీమ యాసలో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్ఫాదర్’ వంటి చిత్రాల తర్వాత చిరంజీవి– నయనతార కలిసి మూడవసారి నటిస్తున్న చిత్రం ‘మెగా 157’. 2026 సంక్రాంతి కానుకగా ‘మెగా 157’ విడుదల కానుంది. పుడతాం ఏటి మళ్లీ... రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్లో.. ‘ఓటే పని చేసే నాకి, ఒకేనాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ విలేజ్ సెట్లో రామ్చరణ్తో పాటు ఇతర తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్తో సుమారు 50 శాతం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ‘పెద్ది’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.బ్రిటీష్ పాలన నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాతో తొలిసారి రాయలసీమ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలంగాణకి చెందిన విజయ్ ‘వీడీ 14’లో తన పాత్ర కోసం మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఆ యాసని పర్ఫెక్ట్గా పలికేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించనున్నారట విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా కథ కూడా రాయలసీమ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.కదిరి నరసింహ సామి సాచ్చిగా... వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ ఇటీవల వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం స్పష్టమైంది. అందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్తో పాటు అక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే ఈ షెడ్యూల్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేసింది యూనిట్. మూడో షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు తనదైన పంచ్ హ్యూమర్తో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేర్లపాక గాంధీ. ‘వీటీ 15’ కోసం అనంతపురం యాసలో మాట్లాడనున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారట.ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో సాగనుంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అక్కినేని అఖిల్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఆయన మేకోవర్ అయ్యారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్ చిత్తూరు జిల్లాలో కొనసాగనున్నట్లు తెలిసింది.ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా...‘విరూపాక్ష, బ్రో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘హనుమాన్ ’ వంటి బ్లాక్బస్టర్ పాన్ ఇండియన్ మూవీ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా.. ఈ తూరి నరికినానంటే అరపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోనుంచొచ్చాది’ అంటూ రాయలసీమ యాసలో సాయి దుర్గాతేజ్ చెప్పిన డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. పైగా ఫస్ట్ లుక్స్, టీజర్ చూసిన వారికి తన కెరీర్లోనే పూర్తి స్థాయి మాస్ లుక్లో, బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలు స్తుంది. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ అయ్యారు తేజ్. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్తో కలుపుకుని 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మదనపల్లె యాసలో... ‘మేజర్, హిట్: ది సెకండ్ కేస్’ వంటి హిట్ సినిమాల తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. ఇంటన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్తో అద్భుతంగా అనిపించింది. ఈ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యాసలో అడివి శేష్ పలికిన డైలాగ్స్, ఆయన వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్కు కూడా అడివి శేష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. ‘డెకాయిట్’ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 25న విడుదల కానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
ఊహించని కాంబో.. ఆ దర్శకుడితో చరణ్?
'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిపోయిందనుకుంటే 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్కి పెద్ద దెబ్బ పడింది. దీంతో ఫ్యాన్స్ బాగా డీలాపడిపోయారు. అలాంటి టైంలో 'పెద్ది' గ్లింప్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్లోనే ఉంది.లెక్క ప్రకారం 'పెద్ది' తర్వాత.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వార్తల్లోకి వచ్చింది. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్తో భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. కానీ అట్లీ రావడంతో ఈ దర్శకుడి ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)ప్రస్తుతం ఖాళీ దొరకడంతో త్రివిక్రమ్.. వెంకటేశ్తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఒకవేళ ఇదే సెట్ అయితే వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత చరణ్తో త్రివిక్రమ్ ఉండొచ్చని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబో గురించి టాక్ నడిచింది గానీ తర్వాత తర్వాత సైడ్ అయిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ పేరు చరణ్ కోసం తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి స్టోరీతో వస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ తరహాలో ఉంటాయి. మరి ఎవరి దారిలోకి ఎవరు వెళ్తారు? వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!) -
విలేజ్లో పెద్ది యాక్షన్
విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్ది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘పెద్ది’. ఈ మల్టీస్పోర్ట్స్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రోడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో ఓ భారీ విలేజ్ సెట్ని ‘పెద్ది’ సినిమా కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సెట్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ను ‘ఇన్ స్టా’లో షేర్ చేశారు రామ్చరణ్. ‘‘ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ షెడ్యూల్తో కీలక దశకు చేరుకుంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది. -
'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025 -
'పెద్ది' షాట్ను రిక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
రామ్చరణ్ (Ram Charan) 'పెద్ది' సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం ఒక గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. క్రికెట్ బ్యాక్డ్రాప్లో తరెకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సిగ్నేచర్ షాట్ ఒకటి బాగా వైరల్ అయింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్తగా ఆలోచించింది. రామ్ చరణ్ పెద్ది షాట్ను రీక్రియేట్ చేసి ఒక వీడియోను సోషల్మీడియాలో అభిమానుల కోసం విడుదల చేసింది. అయితే, దానిని రామ్చరణ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై భారీగా ప్రశంసలు అందుతున్నాయి.నేడు హైదరాబాద్ వేదికగా (SRH vs DC) మ్యాచ్ జరగనుంది. 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. 10 మ్యాచ్ల్లో ఏడింట్లో ఓడిన సన్రైజర్స్ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న పోరు చాలా రసవత్తరంగా ఉండనుంది. ఇలాంటి సమయంలో తెలుగు వారిని మెప్పించేలా పెద్ది సినిమా సీన్ను రీక్రియేట్ చేస్తూ ఢిల్లీ ఒక వీడియోను విడుదల చేసింది. రామ్ చరణ్ స్టైల్లో క్రికెటర్ సమీర్ రజ్వీ సిక్సర్ కొట్టాడు. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఢిల్లీ జట్టును అభినందిస్తున్నారు. ఇలాంటి ప్లాన్ సన్రైజర్స్ ఎందుకు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు.బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). ఇందులో రామ్ చరణ్కు జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.Bas ek hi kaam hai - fight for Dilli 🔥👊 pic.twitter.com/KwwpumhE5y— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025 -
రామ్ చరణ్తో శ్రీలీల మాస్ స్టెప్పులు.. మరో ‘కిస్సిక్’ అవుతుందా?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు రామ్ చరణ్ నాన్స్టాప్గా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని టుస్సాడ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు. రామ్ చరణ్ రావడానికి కనీసం రెండు, మూడు వారాలైనా పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఈ పాటను కాజల్తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లు మాత్రమే. బుచ్చిబాబు ప్లాన్ వేరే ఉందంట. ఓ స్టార్ హీరోయిన్తో ఈ ఐటమ్ సాంగ్కి స్టెప్పులేయించబోతున్నాడట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మన ‘కిస్సిక్’ పాప శ్రీలీలనే.పుష్ప 2 చిత్రంలో శ్రీలీల చేసిన ఐటం సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్తో కలిసి చిందులేసేందుకు శ్రీలీల రెడీ అవుతోందని టాలీవుడ్లో వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్. రంగస్థలంలోని ‘జిగేల్ రాణి’ మాదిరి పెద్దిలో కూడా ఓ ఊరమాస్ సాంగ్ని ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ఈ పాటకు శ్రీలీల అయితేనే న్యాయం చేస్తుందని మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలకు చెప్పాడట. అయితే వాళ్లు ఇంకా శ్రీలీలను సంప్రదించలేదట. కానీ దాదాపు ఆమెతోనే ఆ పాట చేయించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పట్లో శ్రీలీల డేట్స్ దొరకడం చాలా కష్టం. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్, ప్రమోషన్స్కే ఎక్కువ డేట్స్ కేటాయించింది. ఆ సినిమా తర్వాత రవితేజ మాస్ జాతర షూటింగ్లో పాల్గొంటుంది.అలాగే శివకార్తికేయన్ ‘పరాశక్తి’, అఖిల్ ‘లెనిన్’ కూడా లైన్లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న శ్రీలీలకి ‘పెద్ది’ కోసం ఇప్పట్లో డేట్స్ కేటాయించే చాన్స్ అయితే లేదు. బుచ్చిబాబుకు కూడా ఇప్పుడే ఆ పాట కావాలన్న డిమాండేమి లేదు. సినిమా రిలీజ్కి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు శ్రీలీల మూడు నాలుగు రోజులు డేట్స్ కేటాయిస్తే చాలు.. పాట అయిపోతుంది. మరి శ్రీలీల చేసే ఈ రెండో ఐటమ్ సాంగ్ కూడా ‘కిస్సిక్’ మాదిరి సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ తో శ్రీలీల.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా
-
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ప్రస్తుతం రామ్ చరణ్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు పెద్ది అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్ గ్లింప్స్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా..ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న బుచ్చిబాబు ఓ ఫంక్షన్లో సందడి చేశారు. తన సొంతూరులోని ఓ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం అయినా కాకినాడ జిల్లా కొత్తపల్లిలో బుచ్చిబాబు ఓ వేడుకకు హాజరయ్యారు. డైరెక్టర్ రాకతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. పలువురు సన్నిహితులు బుచ్చిబాబుతో ఫోటోలు దిగారు. ఈ వేడుకలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పెద్దితో స్పెషల్ సాంగ్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్.. పక్కా లోకలే...’ అంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వేసిన డ్యాన్సుల్ని ప్రేక్షకులు అంత సులువుగా మరచి పోలేరు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’(2016) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో సందడి చేశారీ బ్యూటీ. ఎన్టీఆర్కి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టారామె. ఆ చిత్రం తర్వాత మరో ప్రత్యేక పాట చేయలేదు కాజల్. అయితే ఆమె తెలుగులో రెండోసారి స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాటకి కాజల్ని తీసుకోవాలన్నది బుచ్చిబాబు ఆలోచనట. సినిమాకి ఓ హైలెట్గా నిలవనున్న ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి ఆమె డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్చరణ్ –కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘మగధీర’ (2009) బ్లాక్బస్టర్గా నిలిచింది.ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ (2014) కూడా విజయం అందుకుంది. ఇప్పుడు ‘పెద్ది’లో కాజల్ ఐటమ్ సాంగ్ చేస్తే... దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. మరి.. ‘పెద్ది’లో ఐటమ్ సాంగ్ ఉందా? ఉంటే కాజల్ అగర్వాల్ నటిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాలంటే వేచి చూడాలి. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్గా చేస్తున్నారు. ఈ చిత్రం రామ్చరణ్ బర్త్ డేకి 2026 మార్చి 27న విడుదల కానుంది. -
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
కార్లలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు పెట్రోల్ వాహనాలు ఉపయోగిస్తున్నప్పటికీ.. చాలామంది ఎలక్ట్రిక్ మోడల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయాడు. ఖరీదైన ఓ కారుని ఇప్పుడు తన గ్యారేజీలోకి తీసుకొచ్చేశాడు. రెహమాన్.. తెలుగు, తమిళ, హిందీతో సహా పలు భాషల్లో గత కొన్ని దశాబ్దాలుగా పాటలు స్వరపరుస్తున్నారు. తెలుగులోనూ రామ్ చరణ్ 'పెద్ది' పనిచేస్తున్నారు. సరే ఈ సంగతులంతా పక్కనబెడితే తాజాగా మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడల్ తోపాటు బీఎస్6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. ఇప్పుడు తాను కొన్న కారులోనూ డాల్బీ ఆట్మస్ సౌండింగ్ ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఇతడే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.రెహమాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. దాదాపు 29 ఏళ్లపాటు కాపురం చేసిన తర్వాత భార్య సైరాభానుకి కొన్నాళ్ల క్రితం విడాకులు ఇచ్చేశారు. కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్) View this post on Instagram A post shared by ARR (@arrahman) -
'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది
'గేమ్ ఛేంజర్' దెబ్బకు మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు వాళ్లందరి కళ్లు 'పెద్ది'(Peddi Movie)పైనే ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్.. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా రిలీజైంది. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే చకచకా షూటింగ్ జరుగుతోంది. తాజాగా తను నటించిన '45' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. 'పెద్ది' షూటింగ్ సంగతులు కూడా చెప్పుకొచ్చాడు. షూటింగ్ మొదలవడానికి 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చానని, దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు నేర్చుకున్నానని అన్నాడు.(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) అలా తెలుగు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సెట్స్ లో అడుగుపెట్టానని చెప్పిన శివరాజ్ కుమార్.. తెలుగులోనే డైలాగ్స్ చెప్పానని, పెద్ది సినిమా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తోందని చెప్పాడు. 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నని.. వర్షం కురిసి ప్రకృతి తనకు స్వాగతం పలికిందని చెప్పుకొచ్చాడు. పెద్ది గ్లింప్స్ అయితే తనకు చాలా నచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పెద్ది'లో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో జరిగింది. ఈ షెడ్యూల్లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత షూటింగ్కు హాజరయ్యారు.అయితే తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారాయన. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటిస్తోన్న 45 మూవీలో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సమావేశంలో ఉపేంద్రతో పాటు శివరాజ్కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.(ఇది చదవండి: 'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి')శివరాజ్కుమార్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం 2 రోజులు షూట్ చేశా. ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది. నాకు కీమో థెరపీ కంప్లీట్ చేసిన 4 రోజులకే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను.. టీమ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోనే షూట్ చేయగలిగాను' అని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ సాలా కప్ నమ్దే అని శివరాజ్ కుమార్ తన మద్దతు ప్రకటించారు. ఆర్సీబీకి కూడా ఒక్కసారి కప్ కొట్టే ఛాన్స్ ఇవ్వండని కోరారు. -
పెద్ది ఫైట్
పెద్ది (రామ్చరణ్ పాత్ర పేరు)క్రికెట్ గ్రౌండ్లో బ్యాటింగ్కు దిగితే ఎలా ఉంటుందో ఇటీవల ‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్లో యూనిట్ చూపించింది. అదే పెద్ది ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతోంది. ఈ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమాలో రామ్చరణ్ క్రికెటర్గా కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లోని శివార్లల్లో ప్రారంభమైందని తెలిసింది. రామ్చరణ్ పాల్గొంటుండగా ఓ ఫైట్ చిత్రీకరిస్తున్నారట. రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కీలకంగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. ఈ మధ్య శ్రీరామనవమి సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాట్ తో ఉన్న చివరి షాట్.. అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా పెద్ది(Peddi Movie) డైలాగ్ చెబుతున్న చరణ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎవరో చెప్పేంతవరకు అది ఏఐ వీడియో అని కనిపెట్టలేం. అంత ఫెర్ఫెక్ట్ గా ఉంది మరి. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)బ్లాక్ డ్రస్సులో ఉన్న చరణ్.. 'ఒక పని సెసేనాకి.. ఒకే నాక బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడ సేసెయ్యాల.. పుడతామా యేటి మళ్లీ' అని డైలాగ్ చెబుతున్నాడు. చూస్తుంటే ఒరిజినల్ వీడియోలా ఉన్న ఈ ఏఐ వీడియోని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న పీరియాడికల్ డ్రామా పెద్ది. వచ్చే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)AI Mass 🔥🔥#PEDDI pic.twitter.com/KOK3QOzAUW— Mr© 🔥 (@CharanTheLEO) April 8, 2025 -
పెద్ది ఫస్ట్ షాట్ కే దేవర రికార్డు అవుట్
-
'పెద్ది' సిక్సర్తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్కు షోషల్మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్తోనే సినీ అభిమానులను రామ్చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు) -
PEDDI Movie: రామ్ చరణ్ రప్ప రప్ప
-
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరే అసలు సమస్య వచ్చినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఎందుకంటే వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి 27న థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్నిరోజుల క్రితం నాని 'ద ప్యారడైజ్' (The Paradise Movie) చిత్రాన్ని వచ్చే మార్చి 26న విడుదల చేస్తామని పేర్కొన్నాడు. అంటే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కన్ఫర్మ్ అయింది.ఇక్కడ చరణ్, నాని మధ్య పోటీ కాదు. మరో ఇద్దరి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. చరణ్ (Ram Charan) ఇదివరకే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించారు. నాని కూడా త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి పెద్ది మూవీతో పోటీ పడతాడా అంటే సందేహమే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)ప్యారడైజ్ తీస్తుంది శ్రీకాంత్ ఓదెల కాగా.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు. వీళ్లిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ పోటీ కచ్చితం అయితే మాత్రం సుక్క శిష్యుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. మరోవైపు ప్యారడైజ్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీనే అనుకోవచ్చు. ఇలా ఒక్కరు కాదు ఈ రెండు చిత్రాల వల్ల ఏకంగా తలో ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చేమో. మరి ఈ రెండింటిలో ఏది చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారనేది కూడా చూడాలి.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్) -
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ షాట్ (ఫొటోలు)
-
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన రామ్చరణ్ ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది. ఫస్ట్ బాల్కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్లో తెలిపారు.జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే.