‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ కొత్త సీన్స్‌.. వివాదం ఇంతటితో ఆగేనా! | Buchi Babu Says New Scenes Will Add In Peddi Movie | Sakshi
Sakshi News home page

‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ కొత్త సీన్స్‌.. వివాదం ఇంతటితో ఆగేనా!

Jun 14 2026 5:08 PM | Updated on Jun 14 2026 5:27 PM

Buchi Babu Says New Scenes Will Add In Peddi Movie

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 378 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచి జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో ఆమెను చూపించిన తీరు, డైలాగ్స్‌ పై సామాన్యులే కాదు సినీ తారలు కూడా అభ్యంతరం చెప్పారు.

 చివరకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించారు కూడా. అయినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్‌ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబే చెప్పారు.‘పెద్దిలో కొత్తగా మూడు సీన్లను యాడ్‌ చేయబోతున్నాం. అందులో జాన్వీ కపూర్‌కి సంబంధించి రెండు సీన్లు ఉన్నాయి. మరొకటి జగపతి బాబు సన్నివేశం. ఈ మూడు సీన్లను బుధవారం నుంచి యాడ్‌ చేయబోతున్నాం’ అని బుచ్చిబాబు చెప్పాడు.  మరి కొత్త సన్నివేశాలు యాడ్‌ చేసిన తర్వాత అయినా జాన్వీ కపూర్‌ పాత్రపై పాజిటివ్‌ టాక్‌ వస్తుందో లేదో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement