భద్రాద్రి కొత్తగూడెం: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఈ ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది.
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
నది పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరి వైపు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు.


