రేషన్ కార్డు E-KYC.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం | Telangana Extends Ration Card E-KYC Deadline Till August 31 | Sakshi
Sakshi News home page

రేషన్ కార్డు E-KYC.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Jul 31 2026 8:44 AM | Updated on Jul 31 2026 8:56 AM

Telangana Extends Ration Card E-KYC Deadline Till August 31

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ (E-KYC)పై కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును పొడిగించింది. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు E-KYC పూర్తి చేయని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు సమీప రేషన్ దుకాణాలను సంప్రదించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

లబ్ధిదారులు గమనించాల్సినవి..

  • రేషన్ కార్డు, ఆధార్ వివరాలు వెంట ఉండాలి. 

  • కుటుంబ సభ్యులందరి ఈ-కేవైసీ పూర్తయిందో లేదో రేషన్ షాపులో తెలుసుకోవాలి.

  • బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే రేషన్ డీలర్ లేదా సంబంధిత పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement