టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW
— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026


