రజకులపై దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

రజకులపై దాడి అమానుషం

Feb 23 2026 7:38 AM | Updated on Feb 23 2026 7:38 AM

రజకుల

రజకులపై దాడి అమానుషం

భూపాలపల్లి రూరల్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మండలంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై జరిగిన దాడి అమానుషమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణయ్‌ రాజ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కౌటం సురేందర్‌, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి పాల్గొన్నారు.

కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్‌ దేశస్తులు

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఆదివారం ఇంగ్లండ్‌ దేశానికి చెందిన సిమన్‌, వాలేరి సందర్శించారు. రామప్ప గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉందన్నారు. వారి కెమెరాలలో శిల్ప సంపదను బంధించుకున్నారు.

మెడల్స్‌ సాధించడంపై

హర్షం

మల్హర్‌(కాటారం): రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్‌ సాధించడం పట్ల జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జవహర్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో అండర్‌–16 షాట్‌ఫుట్‌లో జిల్లాకు చెందిన సమన్విత గోల్డ్‌ మెడల్‌, అన్విత 18 లాంగ్‌జంప్‌లో సిల్వర్‌ మెడల్‌, పలు విభాగాల్లో మెడల్స్‌ సాధించిన క్రీడాకారులకు వారు ఆదివారం మెమొంటోలు, సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. స్టేట్‌ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వెంకటేశ్వర్‌ రెడ్డి, డీవైఎస్‌ అశోక్‌, క్రీడాభిమానులు నవీన్‌రావు, రామ్‌నారాయణ, మధుకర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 4నుంచి 7వ తేదీ వరకు అర్రెం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర మాజీ చైర్మన్‌ అర్రెం లచ్చుపటేల్‌ కోరారు. మేడారం జాతర చైర్‌పర్సన్‌ ఇర్ప సుకన్య, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సర్పంచ్‌ కల్తి కృష్ణవేణి, అర్రెం వంశీయులతో కలిసి పగిడిద్దరాజు జాతర పోస్టర్‌ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కను, పలువురు ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.

రజకులపై దాడి అమానుషం
1
1/3

రజకులపై దాడి అమానుషం

రజకులపై దాడి అమానుషం
2
2/3

రజకులపై దాడి అమానుషం

రజకులపై దాడి అమానుషం
3
3/3

రజకులపై దాడి అమానుషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement