అధికారులపై చర్య తీసుకోవాలి..
గణపురం మండలం ధర్మరావుపేట శివారు 318/118, 318/119 సర్వే నంబర్లలో మాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూమి ఓపెన్కాస్టు–3 ప్రాజెక్ట్ కోసం 2021 సర్వే చేసి తీసుకున్నారు. ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. అనేకమార్లు ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. గతేడాది ఏప్రిల్ 23న కూలీ పనికి వెళ్లిన నా భార్య వద్దకు గుర్తు తెలియని వ్యక్తి ఆర్డీఓ కార్యాలయం నుంచి వచ్చి, భూమి పరిహారం కోసం సంతకాలు కావాలని తెల్ల కాగితంపై తీసుకెళ్లారు. అనంతరం తన పేరుపైన 1.30గుంటల భూమి మాత్రమే ఉందంటున్నారు. మిగితా భూమి లేదంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– కట్కూరి రాంరెడ్డి,
రామగుండాలపల్లి, కొత్తపల్లిగోరి


