మెనూ ప్రకారం భోజనం అందించాలి
పలిమెల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని పంకెనలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీలోని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్, పీహెచ్సీ బిల్డింగ్లను సందర్శించి పనుల పురోగతిని డీఈ సాయిలును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్, ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఆర్ఐ, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.


