హుండీ ఆదాయం రూ.10.92లక్షలు
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత, సర్పంచ్్ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు.


