చింపాంజి వేషంతో..
మల్హర్ మండలం కొయ్యూరులో ప్రజలు కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ కోతుల భయంతో వణికిపోతున్నారు. ఎలాగైనా కోతుల సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అనుకున్నాడు. ఆదివారం చింపాంజి వేశధారణలో గ్రామమంతా తిరిగాడు. భయంతో కోతులన్నీ పారిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అటవీశాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎడ్ల మధుసూదన్, లకావత్ లక్ష్మి తిరుపతి, రవళి శేషి వర్ధన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. – మల్హర్


