ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకతతో నిబంధనల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని (స్థానిక సంస్థలు) ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలకు సంబంధించిన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. మున్సిపల్ కమిషనర్ జోనా, మాస్టర్ ట్రెయినర్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.


