శ్రీశైలం: ఆదిదంపతుల రథోత్సవం వైభవంగా సాగింది. మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీభ్రమరాంబాదేవిని వివాహమాడిన మల్లికార్జునస్వామి సాయంత్రం క్షేత్ర వీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఓం నమఃశివాయ, శంభో శంకర అని భక్తులు నినదిస్తుండగా రథం ముందుకు సాగింది.
రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్లకు కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు.
ఓం నమఃశివాయ, శంభో శంకరా అంటూ భక్తులు పరమేశ్వరుడిని కీర్తించారు. రథోత్సవం ముందు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పువాయిద్యాలు, కళారూపాలు, గొరవయ్యలు, భాజాభజంత్రీలు, వివిధ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.


