విధుల్లో చేరిన ల్యాబ్‌ టెక్నీషియన్లు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన ల్యాబ్‌ టెక్నీషియన్లు

Jan 21 2026 7:07 AM | Updated on Jan 21 2026 7:07 AM

విధుల్లో చేరిన ల్యాబ్‌ టెక్నీషియన్లు

విధుల్లో చేరిన ల్యాబ్‌ టెక్నీషియన్లు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో 24 మంది నూతన ల్యాబ్‌ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. కొత్తగా ల్యాబ్‌ టెక్నిషియన్‌ ఉద్యోగం సాధించిన వారు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు నియామక పత్రాలు అప్పగించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌కు పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. అనంతరం సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయని, సిబ్బంది కొరత తీరడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ వెంకటరత్నం, ఆర్‌ఎంఓలు, అదనపు డైరెక్టర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement