వైభవంగా రథసప్తమి పూజలు
అభిషేకం చేస్తున్న అర్చకుడు ఫణీంద్రశర్మ
పూజలో పాల్గొన్న భక్తులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమిని పురస్కరించుకొని వైభవోపేతంగా పూజలు చేశారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకం, అరుణ పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేకంగా పూలతో అలంకరణలు చేశారు. అనంతరం, పూజలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, స్వా మి మహా ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో సూర్యనారాయణస్వామి
వైభవంగా రథసప్తమి పూజలు
వైభవంగా రథసప్తమి పూజలు


