అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని..
● భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు.
● రెండేళ్ల క్రితం ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి.
● నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి.
● జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో ఐదో వార్డు, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు.
● తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి.


