సరస్వతిమాత విగ్రహానికి ముస్తాబు
కాళేశ్వరం: గతేడాది మేలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతి మాత విగ్రహానికి దేవస్థానం అర్చకులు ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వసంతపంచమి సందర్భంగా దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు వసంత పంచమి..
వసంత పంచమి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 10గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చిన్నారులకు అక్షర స్వీకారాలు చేస్తారు. భక్తులు పాల్గొనాలని దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


