రోడ్డుపైనే పార్కింగ్..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారంలో ఇసుక లారీలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం లారీలు ఇరువైపులా పార్కింగ్ చేసి ఉండడంతో దామెరకుంట వైపు, చెన్నూర్, కాళేశ్వరం మీదుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
టెంట్ సిటీ.. లగ్జరీ టెంట్లు
ఏటూరునాగారం: మహాజాతరకు వచ్చే భక్తులు బస చేసేందుకు మేడారం పోలీస్ క్వార్టర్స్ పక్కనే లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. దానికి టెంట్ సిటీగా నామకరణం చేశారు. ఈ నెల 18, 19వ తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన ఉండడంతో వాటిని మరింత అత్యాధునికంగా రూపొందించా రు. టెంట్లను ప్రభుత్వం రెండు రోజుల పాటు అ ద్దెకు తీసుకొని మేడారం వచ్చే మంత్రులకు ఇందులో సకల ఏర్పాట్లు చేయనుంది. మంత్రులు, వీవీఐ పీలు, ఇతర అధికారులు సైతం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడంతో పాటు పడుకునేందుకు సౌకర్యాలను కల్పించారు. సీఎం పర్యటన పూర్తయిన తర్వాత టెంట్లను అద్దెకు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
రోడ్డుపైనే పార్కింగ్..


