ప్రతీ వాహనం తనిఖీ చేయాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై రెండు చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనం తనిఖీ చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. సోమవారం కుందూర్పల్లి, బాంబులగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి ఉన్నారు.
వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి..
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. ఎస్సై మైసయ్య, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ పాపయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య సోమవారం ఉద్యోగ విరమణ పొందగా జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఎస్పీ సత్కరించారు.


