సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఒక మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి గురించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.


