సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరో కేసు మూసివేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నర్ రింగ్రోడ్డు అక్రమాల కేసు మూసివేయాలని సీఐడీ పిటిషన్ చేశారు. ఈ కేసులో నిందితులుగా చంద్రబాబు,నారాయణ ఉన్నారు. అయితే,ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు ఫిర్యాదు దారుడైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొంది.


