విజయవాడ: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు బీసీలను వేధిస్తున్నారని, బీసీలను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు.
కాగా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.


