25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..! | Ameerpet Woman Incident | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..!

Feb 22 2026 10:11 AM | Updated on Feb 22 2026 10:11 AM

Ameerpet Woman Incident

హైదరాబాద్: వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన యువతి(25) ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే క్రమంలో బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జున్‌రెడ్డి(50) పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2024లో ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. గతేడాది నుంచి మల్లికార్జున్‌రెడ్డి మళ్లీ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. 

ఇటీవల మధురానగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించుకోవాలని వేధించాడు. స్నేహితురాలి సాయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును మధురానగర్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement