విశాఖ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగుపడింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. కోల్ హ్యాండ్లింగ్ సహా ప్రైవేటుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్కు టెండర్లు ఆహ్వానించారు.
ఉక్కు ఉత్పత్తిలో థర్మల్ పవర్ ప్లాంట్ కీలక భూమిక పోషిస్తుంది. దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ఆహ్వానించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలక విభాగాలను ప్రైవేటీకరణతో కార్మికుల తొలగింపు కార్యక్రమం సైతం కొనసాగుతోంది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.


