శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను చూసి భక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. లింగాలగట్టులో ప్రణాళిక లేకుండా లో లెవల్, హై లెవల్ ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలను తూతూమంత్రంగా ఏర్పాట్లు చేయడంతో స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు కృష్ణా నది నీటిలో మునిగాయి. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు గత్యంతరం లేక చీరలను అడ్డుగా కట్టి దుస్తులు మార్చుకుంటున్నారు. అరకొరగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు కూడా నీటిలో మునిగిపోయాయి.ఈ పరిస్థితులను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిణి కె.లలితాబాయి దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు.


